Europe countries
-
దీనావస్థలో యూరప్ దేశాలు
కళ్లముందు ప్రమాదకర సంకేతాలు కనబడుతున్నా అమెరికాను గుడ్డిగా అనుసరిస్తూ పోవటం అలవాటు చేసుకున్న యూరప్కి డోనాల్డ్ ట్రంప్ ఏలుబడి మొదలయ్యాక వరస షాక్లు తప్పడం లేదు. గతవారం జర్మనీలో జరిగిన మ్యూనిక్ భద్రతా సదస్సుకొచ్చిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ‘వాక్ స్వాతంత్య్రానికీ, ప్రజాస్వామ్యానికీ మీవల్లే ముప్పు ముంచుకొస్తున్నద’ని యూరప్ దేశాలపై విరుచుకుపడ్డారు. దాన్నుంచి తేరుకోకముందే ఆ దేశాల ప్రమేయం లేకుండా ఉక్రెయిన్ యుద్ధం నిలుపుదలపై రష్యాతో సౌదీ అరేబియాలోని రియాద్లో అమెరికా భేటీ అయింది. యూరప్ వరకూ ఎందుకు... రష్యాతో రెండేళ్లుగా సాగుతున్న యుద్ధంలో శిథిలావస్థకు చేరిన ఉక్రె యిన్నే ఆ చర్చలకు ఆహ్వానించలేదు. యుద్ధం ఆపడానికి అవకాశాలున్నాయా, ఆ విషయంలో తొలి అడుగువేయటం అసలు సాధ్యమేనా అనే అంశాలను నిర్ధారించుకోవటానికే రియాద్ సమా వేశం జరిగిందని అమెరికా విదేశాంగశాఖ సంజాయిషీ ఇస్తున్నా దాని వ్యవహారశైలి యూరప్ దేశా లకు మింగుడు పడటం లేదు. ఆ విషయంలో నిజంగా చిత్తశుద్ధి వుంటే రష్యా అధ్యక్షుడు పుతిన్తో మాట్లాడటానికి ముందు ట్రంప్ యూరప్ దేశాల అధినేతలను సంప్రదించేవారు. దాదాపు ఎనభైయ్యేళ్లుగా యూరప్ దేశాలన్నీ అమెరికా అడుగుజాడల్లో నడిచాయి. రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లర్ సైన్యాన్ని మట్టికరిపించిన సోవియెట్ సేనలు తూర్పు యూరప్ దేశాల తర్వాత తమవైపే చొచ్చుకొస్తాయని, తాము బలికావటం ఖాయమని పశ్చిమ యూరప్ దేశాలు వణికిపోయాయి. నాటి అమెరికా అధ్యక్షుడు ట్రూమన్ దీన్ని చక్కగా వినియోగించుకుని ఉత్తర అమెరికా ఖండంలో తన పొరుగు దేశమైన కెనడాను కలుపుకొని పశ్చిమ యూరప్ దేశాలతో జత కట్టి పటిష్ఠమైన సైనిక కూటమి నాటోకు అంకురార్పణ చేశారు. అమెరికా–సోవియెట్ల మధ్య సాగే పోటీలో యూరప్ దేశాలు అవసరం లేకున్నా తలదూర్చాయి. ఆర్థికవ్యవస్థలు అనుమతించక పోయినా తమ తమ జీడీపీల్లో రెండు శాతం నాటో కోసం వ్యయం చేశాయి. యూరప్ భూభాగంలో అణ్వాయుధాల మోహరింపు, యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు, మారణాయుధాలు జోరందుకున్నాయి. యూరప్ దేశాలకు ఆనాటి సోవియెట్ నుంచి లేదా ప్రస్తుత రష్యా నుంచి ఎన్నడూ ముప్పు కలగలేదుగానీ... నాటోవల్ల లిబియా, సిరియా, అఫ్గానిస్తాన్, సూడాన్, సోమాలియా తది తర దేశాలు అస్థిరత్వంలోకి జారుకుని ఉగ్రవాదం వేళ్లూనుకుంది. సిరియావంటి దేశాల్లో ప్రభుత్వా లను కూలదోసేందుకు విచ్చలవిడిగా ఆయుధాలందించటంవల్ల ఐసిస్ అనే భయంకర ఉగ్రవాద సంస్థ ఆవిర్భవించింది. ఉక్రెయిన్ దురాక్రమణకు రష్యాను రెచ్చగొట్టింది కూడా యూరప్ దేశాలే. 2013లో అమెరికా ప్రోద్బలంతో ఉక్రెయిన్తో ఆర్థిక ఒప్పందం కుదుర్చుకోవటంతోపాటు ఐఎంఎఫ్ రుణం పొందేందుకు సహకరించింది ఈయూ దేశాల కూటమే. అయితే ఐఎంఎఫ్ కఠిన షరతులను తిరస్కరించి రష్యా ఇచ్చే 1,500 కోట్ల డాలర్ల రుణం తీసుకోవటానికి అప్పటి ఉక్రెయిన్ అధ్యక్షుడు విక్టర్ యనుకోవిచ్ నిర్ణయించటంతో దేశంలో ప్రజా ఉద్యమం పేరిట తిరుగుబాటుకు అంకు రార్పణచేసి అస్థిరపరచటంలో అమెరికా, ఈయూల పాత్ర వుంది. ఈ పరిణామాలే పుతిన్ను క్రిమియా ఆక్రమణకు పురిగొల్పాయి. ఎన్నికల్లో చట్టబద్ధంగా గెలిచిన యనుకోవిచ్ను ఈ వంక చూపి 2019లో కూలదోసి, సినీ నటుడు జెలెన్స్కీని అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టడం, పర్యవసానంగా మూడేళ్లక్రితం పుతిన్ ఉక్రెయిన్పై దండెత్తటం వర్తమాన చరిత్ర.యుద్ధంపై తమ ప్రమేయం లేని చర్చల్ని గుర్తించబోనని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు. యూరప్ దేశాలకు కనీసం ఆ మాత్రం ధైర్యం కూడా లేదు. తాజా పరిణామాల నేప థ్యంలో ఏం చేయాలో చర్చించటానికి ఫ్రాన్స్ చొరవతో సోమవారం పారిస్లో జరిగిన అత్యవసర భేటీకి అరడజను దేశాలు హాజరయ్యాయి. అవి కూడా కింకర్తవ్య విచికిత్సలో పడ్డాయి. ఉక్రెయిన్కు శాంతి సేనలను పంపటానికి తాను సిద్ధమని ప్రకటించిన బ్రిటన్... ఆ వెంటనే ‘అమెరికా అందుకు అనుమతిస్తేనే’ అని ముక్తాయించింది. ఈలోగా జర్మనీ, పోలాండ్, స్పెయిన్లు దాన్ని అసందర్భ ప్రతిపాదనగా కొట్టిపారేశాయి. అమెరికా తాజా వైఖరితో యూరప్ స్వీయరక్షణ కోసం సొంతంగా సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవాలన్న ప్రతిపాదనపై సైతం అనుకూల స్వరాలు వినబడటంలేదు.ట్రంప్ ఆగమనం తర్వాత అమెరికాతో యూరప్ దేశాల సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయన్న అభిప్రాయం అందరిలో ఏర్పడింది. దీనికితోడు ట్రంప్ అనుచరగణం యూరప్లో తీవ్ర మితవాద పక్షాలను పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారన్న అభిప్రాయం వివిధ దేశాధినేతలకు ఉంది. ట్రంప్ వైఖరి ఎలా వుంటుందన్న అంశంలో ఆయన తొలి ఏలుబడిలో యూరప్ దేశాలకు తగి నంత అవగాహన వచ్చింది. కానీ దశాబ్దాల తరబడి అమెరికా అనుసరిస్తున్న విధానాలను రెండో దఫాలో మెరుపువేగంతో ఆయన తిరగరాస్తారని ఆ దేశాలు ఊహించలేదు. ఈసారి ట్రంప్ వెనకున్న ఎలాన్ మస్క్, స్టీవ్ బానన్, మార్కో రుబియో తదితరులతోపాటు సమర్థుడైన దూతగా పేరున్న విట్కాఫ్లే అందుకు కారణం కావొచ్చు. పర్యవసానంగా ట్రంప్ రంగప్రవేశం చేసి నెల తిరగకుండానే యూరప్ దేశాలకు ప్రపంచం తలకిందులైన భావన కలిగింది. స్వతంత్రంగా ఎదగటానికి ప్రయత్నించక కీలుబొమ్మల్లా వ్యవహరించిన ఆ దేశాలు ఇప్పటికైనా వివేకం తెచ్చుకోవాలి. సొంత ఆలోచనతో, స్వీయప్రయోజనాల కోసం పనిచేయటం నేర్చుకోవాలి. రోజులు ఎప్పుడూ ఒకేలా వుండవని గ్రహించాలి. -
నేడు యూరప్ అధినేతల అత్యవసర భేటీ!
వాషింగ్టన్: ఉక్రెయిన్–రష్యా యుద్ధాన్ని సాధ్యమైనంత త్వరగా ముగించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదలతో ఉన్నారు. ఈ మేరకు ఇప్పటికే సంకేతాలిచ్చారు. చెప్పిన మాట వినకపోతే ఉక్రెయిన్కు ఆయుధ, ఆర్థిక సాయం నిలిపివేస్తామని హెచ్చరించారు. గతవారం రష్యా అధినేత పుతిన్తో ఫోన్లో మాట్లాడారు. గంటకుపైగా సుదీర్ఘంగా చర్చించారు. ఉక్రెయిన్–రష్యా మధ్య శాంతిని నెలకొనాలని ఆకాంక్షిస్తున్నట్లు ట్రంప్ స్పష్టంచేశారు. ట్రంప్ పోద్బలంతో ఉక్రెయిన్–రష్యా మధ్య జరిగే శాంతి చర్చల్లో యూరప్ భాగస్వామ్యం ఉండబోదని అమెరికా ప్రతినిధి కీథ్ కెల్లాగ్ తేలి్చచెప్పారు. ఈ పరిణామాలన్నీ యూరప్ దేశాలకు మింగుడుపడడం లేదు. విజేత ఎవరో తేలకుండానే యుద్ధం ముగించాలన్న ప్రతిపాదనను కొన్ని ఐరోపా దేశాలు పరోక్షంగా వ్యతిరేకిస్తున్నాయి. ట్రంప్ తమను లెక్కచేయకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అంశంలో చేపట్టాల్సిన తదుపరి కార్యాచరణపై చర్చించడానికి అత్యవసరంగా భేటీ కావాలని నిర్ణయించుకున్నాయి. ఫ్రాన్స్ రాజధాని పారిస్లో సోమవారం ఈ సమావేశం జరగబోతున్నట్లు తెలుస్తోంది. యూరప్ జాతీయ భద్రతకు ఈ భేటీ చాలా ముఖ్యమని యునైటెడ్ కింగ్డమ్(యూకే) ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ చెప్పారు. అమెరికా, యూరప్ మధ్య సంబంధాలు ఎప్పటిలాగే బలంగా ఉండాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు. ఆ దిశగా తమవంతు కృషి చేస్తున్నామని వెల్లడించారు. తమ కూటమిలో విభజనలను అంగీకరించబోమని పేర్కొన్నారు. ఉక్రెయిన్–రష్యా వ్యవహారంలో ఐరోపా దేశాలు ఒంటరవుతున్నాయని, అమెరికాకు దూరంగా జరుగుతున్నాయన్న వాదనను ఆయన ఖండించారు. మరోవైపు ఉక్రెయిన్కు మద్దతుగా నూతన చర్యలతో ముందుకు రాబోతున్నట్లు యూరోపియన్ యూనియన్(ఈయూ) ఫారిన్ పాలసీ చీఫ్ కాజా కెల్లాస్ ఆదివారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. యూరప్ భద్రతకు తాము అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని వివరించారు. అయితే, యూరప్ ఆదేశాల అధినేతల అత్యవసర భేటీని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్ ఇంకా ధ్రువీకరించారు. ఆయన ప్రతినిధుల సైతం దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ, భేటీ కచ్చితంగా జరుగుతుందని యూరోపియన్ అధికారులు అంటున్నారు. -
రష్యా పైకి ‘ఆర్మీ ఆఫ్ యూరప్’
మ్యూనిక్: యూరప్ ఖండానికి అవసరమైన సాయం అందించేందుకు అమెరికా సిద్ధంగా లేదని అర్థమవుతోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో యూరప్ దేశాలు రష్యా దురాక్రమణ నుంచి తమను తాము రక్షించుకునేందుకు ‘ఆర్మీ ఆఫ్ యూరప్’ను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు. జర్మనీలోని మ్యూనిక్లో జరుగుతున్న సెక్యూరిటీ కాన్ఫరెన్స్లో జెలెన్స్కీ మాట్లాడారు. తమ ప్రమేయం లేకుండా, తమకు తెలియకుండా చేసుకునే ఒప్పందాలను ఉక్రెయిన్ అంగీకరించబోదని ఆయన తేల్చి చెప్పారు. అదేవిధంగా, యూరప్కు సంబంధించిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు యూరప్ దేశాలకు కూడా ఆ చర్చల్లో స్థానం కల్పించాలన్నారు. శాంతి చర్చలు ప్రారంభించేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ సిద్ధమయ్యారంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనపై ఆయనీ విధంగా వ్యాఖ్యానించారు. యూరప్, అమెరికాల మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న బంధం ఇక ముగిసినట్లేనంటూ అమెరికా ఉపాధ్యక్షుడు శుక్రవారం సదస్సులో పేర్కొన్న విషయాన్ని జెలెన్స్కీ గుర్తు చేస్తూ..‘ఇప్పటి నుంచి కొత్త పరిణామాలు సంభవించనున్నాయి. వీటికి యూరప్ సమాయత్తం కావాల్సి ఉంది’అని అన్నారు. ‘ఇతర దేశాల నుంచి మనకు బెదిరింపులు ఎదురైతే తమకు సంబంధం లేదని అమెరికా తెగేసి చెప్పేందుకు అవకాశముందనే విషయం ఇప్పుడు మనం తెలుసుకోవాలి. అమెరికాపై ఆధారపడకుండా యూరప్ సొంత సైన్యాన్ని సిద్ధం చేసుకోవాలంటూ గతంలో ఎందరో నేతలు చెప్పారు. అవును, మనకిప్పుడు సైన్యం కావాలి. అదే ఆర్మీ ఆఫ్ యూరప్’అని ఆయన స్పష్టం చేశారు.ముఖాముఖి చర్చలకు అంగీకరించడం ద్వారా పుతిన్ అమెరికాను ఏకాకిగా మార్చారన్నారు. -
ముంచుకొస్తున్న మూడో ప్రపంచ యుద్ధం?
రష్యాపై యూఎస్ తయారీ దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణులతో ఉక్రెయిన్ దాడులు. తీవ్రస్థాయిలో మండిపడుతున్న రష్యా. దీన్ని అమెరికాతో కలిసి చేసిన సంయుక్త దాడిగానే పరిగణిస్తామని ప్రకటన. అణు దాడితో దీటుగా బదులిచ్చేందుకు వీలుగా రష్యా అణు విధానాన్ని సవరిస్తూ అధ్యక్షుడు పుతిన్ నిర్ణయం. ‘ఏ క్షణాన్నయినా అణు యుద్ధం ముంచుకు రావచ్చు, జాగ్రత్తగా ఉండండి’ అంటూ ప్రజలకు యూరప్ దేశాల ‘వార్ గైడ్లైన్స్’. సోమవారం ఒక్క రోజే శరవేగంగా జరిగిన తీవ్ర ఆందోళనకర పరిణామాలివి! ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి తెర తీసి సరిగ్గా 1,000 రోజులు పూర్తయిన నాడే చోటుచేసుకున్న ఈ తీవ్ర పరిణామాలు గుబులు రేపుతున్నాయి. ఇప్పటికే నాల్కలు చాస్తున్న యుద్ధ జ్వాలలు మరింతగా విస్తరించి మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తాయా అన్న ఆందోళనలు సర్వత్రా తలెత్తుతున్నాయి.అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ విజయంతో ఉక్రెయిన్ యుద్ధానికి తెర పడుతుందని, పశ్చిమాసియా కల్లోలమూ కాస్త అదుపులోకి వస్తుందని భావిస్తున్న తరుణంలో అంతర్జాతీయంగా అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పదవి నుంచి దిగిపోయే ముందు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీసుకున్న తాజా నిర్ణయంతో ఇందుకు బీజం పడింది. అమెరికా అందజేసిన దీర్ఘశ్రేణి క్షిపణులను రష్యాలో సుదూర లక్ష్యాలపై దాడుల నిమిత్తం వాడేందుకు ఉక్రెయిన్కు ఆయన అనుమతివ్వడం ఒక్కసారిగా ఉద్రిక్తతలను రాజేసింది. దీన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్న ఉక్రెయిన్ మంగళవారమే రష్యాపై యూఎస్ దీర్ఘశ్రేణి ఆర్మీ టాక్టికల్ మిసైల్ సిస్టం (ఏటీఏసీఎంస్) బాలిస్టిక్ క్షిపణులను ఎడాపెడా ప్రయోగించింది. రష్యాలోని బ్రయాన్స్క్ ప్రాంతమే లక్ష్యంగా దాడులకు దిగింది. ఈ క్షిపణులను ఉక్రెయిన్ యుద్ధంలో వాడటం ఇదే తొలిసారి. అలాంటి చర్యలకు దిగితే తీవ్రస్థాయి ప్రతిస్పందన తప్పదని ఇప్పటికే హెచ్చరించిన రష్యా ఈ పరిణామంపై భగ్గుమంది. తమ భూభాగాలపైకి కనీసం ఆరు అమెరికా తయారీ ఏటీఏసీఎంఎస్ క్షిపణులు వచ్చి పడ్డాయని ధ్రువీకరించింది. వాటిలో ఐదింటిని కూల్చేయడంతో పాటు ఆరో దాన్నీ ధ్వంసం చేసినట్టు ప్రకటించింది. ఉక్రెయిన్పై రష్యా అణు దాడులు! తాజా పరిణామాలపై రష్యా అధ్యక్షుడు పుతిన్ మండిపడుతున్నారు. మంగళవారం ఆయన రక్షణ తదితర శాఖల అత్యున్నత స్థాయి అధికారులతో భేటీ అయ్యారు. ఉక్రెయిన్ క్షిపణి దాడులను అమెరికాతో కలిసి చేసిన సంయుక్త దాడిగానే పరిగణించాలని నిర్ణయించారు. అందుకు వీలు కలి్పంచేలా దేశ అణు విధానానికి సవరణ కూడా చేశారు! దాని ప్రకారం సంప్రదాయ ఆయుధాలతో రష్యాపై జరిగే దాడికి ఏ అణ్వాయుధ దేశమైనా మద్దతిస్తే దాన్ని ఆ రెండు దేశాల సంయుక్త దాడిగానే పరిగణిస్తారు. సదరు దేశాలపై అణు దాడులకు దిగుతారా అన్నదానిపై సవరణలో స్పష్టత ఇవ్వలేదు. కాకపోతే రష్యాపై భారీ స్థాయి వైమానిక, బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణి దాడులు జరిగితే అణ్వాయుధాలతో బదులిచ్చేందుకు అది వీలు కలి్పస్తుండటం విశేషం! అంతేగాక మిత్ర దేశమైన బెలారస్పై దుందుడుకు చర్యలకు దిగినా అణ్వాయుధాలతో బదులు చెప్పేందుకు తాజా సవరణ అనుమతించనుంది! ఉక్రెయిన్కు మరింత సాయం చేయకుండా యూరప్ దేశాలను నియంత్రించడంతో పాటు అవసరమైతే దానిపై అణ్వాయుధ ప్రయోగానికి, అమెరికాపై సైనిక చర్యకు కూడా దిగడం పుతిన్ తాజా నిర్ణయాల ఉద్దేశమని భావిస్తున్నారు. అమెరికా దీర్ఘశ్రేణి క్షిపణులతో ఉక్రెయిన్ చేసిన తాజా దాడులకు బదులుగానే అణు విధాన సవరణ జరిగిందా అన్న ప్రశ్నకు క్రెమ్లిన్ అధికార ప్రతినిధి ద్మిత్రీ పెస్కోవ్ నేరుగా బదులివ్వలేదు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఉండేలా అణు విధానాన్ని అప్డేట్ చేయాల్సిందిగా పుతిన్ ఆదేశించారంటూ నర్మగర్భంగా స్పందించారు. ఇటీవలి కాలంలో రష్యా అణు విధానానికి పుతిన్ సవరణ చేయడం ఇది రెండోసారి. రష్యాకు దన్నుగా ఉత్తర కొరియా సైన్యం కూడా ఉక్రెయిన్పై యుద్ధంలో పాల్గొంటుండటం తెలిసిందే. దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్టు అమెరికా ఇప్పటికే ప్రకటించింది. దీర్ఘశ్రేణి క్షిపణుల వాడకానికి అనుమతి దాని పర్యవసానమేనంటున్నారు. ఈ నేపథ్యంలో యుద్ధ జ్వాలలు త్వరలో కొరియా ద్వీపకల్పం దాకా విస్తరించినా ఆశ్చర్యం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బైడెన్ మతిలేని విధానాలతో ట్రంప్ పగ్గాలు చేపట్టే నాటికే ప్రపంచాన్ని పెనుయుద్ధం ముంగిట నిలిపేలా ఉన్నారని ఆయన కుమారుడు జూనియర్ ట్రంప్ మండిపడటం తెలిసిందే.నిత్యావసరాలు నిల్వ చేసుకోండితాజా పరిణామాలు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసేలా కన్పిస్తుండటంతో యూరప్ దేశాలు భీతిల్లుతున్నాయి. అలాంటి పరిస్థితే తలెత్తితే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలంటూ స్వీడన్, ఫిన్లండ్, నార్వే, డెన్మార్క్ తదితర నాటో సభ్య దేశాలు తమ పౌరులను హెచ్చరించడం విశేషం. ‘‘ఏ క్షణంలోనైనా అణు యుద్ధం ముంచుకు రావచ్చు. సిద్ధంగా ఉండండి’’ అంటూ స్వీడన్ ఏకంగా ఇంటింటికీ కరపత్రాలే పంచుతోంది. ‘సంక్షోభమో, యుద్ధమో వస్తే...’ అనే శీర్షికతో కూడిన 52 లక్షల కరపత్రాలను సోమవారం నుంచి వారం పాటు పంచనుంది! అది నిజానికి 32 పేజీలతో కూడిన డాక్యుమెంట్. ‘‘మనపై ఎవరైనా దాడికి తెగబడితే దేశ స్వాతంత్య్ర పరిరక్షణకు అందరమూ ఒక్కటవుదాం’’ అని అందులో పౌరులకు స్వీడన్ ప్రభుత్వం పిలుపునిచ్చింది. దాంతోపాటు, ‘‘పిల్లల డైపర్లు, బేబీ ఫుడ్, దీర్ఘకాలం నిల్వ ఉండే ఆహార పదార్థాలు, మంచినీరు తదితరాలన్నింటినీ వీలైనంతగా సేకరించి పెట్టుకోండి’’ అని సూచించింది. అంతేగాక బాంబు దాడులు జరిగితే వాటిబారి నుంచి ఎలా తప్పించుకోవాలి, గాయపడితే రక్తస్రావాన్ని నిరోధించేందుకు, ప్రాణ నష్టాన్ని తగ్గించేందుకు ఏం చేయాలి, యుద్ధ బీభత్సం చూసి భీతిల్లే చిన్నారులను ఎలా సముదాయించాలి వంటి వివరాలెన్నో పొందుపరిచింది.‘‘పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత స్వీడన్ ఇలాంటి చర్యకు దిగడం ఇది ఐదోసారి. నార్వే కూడా ఇలాంటి ‘యుద్ధ’ జాగ్రత్తలతో ప్రజలకు ఎమర్జెన్సీ పాంప్లెంట్లు పంచుతోంది. ‘పూర్తిస్థాయి యుద్ధంతో పాటు ఏవైనా అనుకోని పరిస్థితులు ఎదురైతే వారం దాకా ఇల్లు కదలకుండా గడిపేందుకు సిద్ధపడండి’ అంటూ అప్రమత్తం చేస్తోంది. డెన్మార్క్ కూడా కనీసం మూడు రోజులకు పైగా సరిపడా సరుకులు, మంచినీరు, ఔషధాలు తదితరాలు నిల్వ ఉంచుకోవాలంటూ తన పౌరులందరికీ ఇప్పటికే ఈ–మెయిళ్లు పంపింది! ఫిన్లండ్ కూడా అదే బాట పట్టింది. ‘రష్యా–ఉక్రెయిన్ యుద్ధం తీవ్రతరమవుతున్న నేపథ్యంలో ఎలాంటి పరిస్థితికైనా సిద్ధంగా ఉండండి. నిత్యావసరాలను వీలైనంతగా సేకరించి పెట్టుకోండి’ అంటూ తన పౌరులకు ఆన్లైన్ బ్రోషర్లు పంపింది.అపారంగా అణ్వాయుధాలు రష్యా వద్ద వేలాదిగా అణ్వాయుధాలు పోగు పడి ఉన్నాయి. ప్రపంచంలోకెల్లా అత్యధిక సంఖ్యలో అణు వార్హెడ్లున్న దేశం రష్యానే. 1994లో సోవియట్ నుంచి విడిపోయేనాటికి ఉక్రెయిన్ వద్ద కూడా భారీగానే అణ్వాయుధాలుండేవి. ఆ జాబితాలో ప్రపంచంలో మూడో అతి పెద్ద దేశంగా ఉక్రెయిన్ ఉండేది. కానీ రష్యాతో ఒప్పందంలో భాగంగా తన అణ్వాయుధాలన్నింటినీ నాశనం చేసింది. కాకపోతే అమెరికాతో పాటు అణు సంపత్తి ఉన్న పలు దేశాలు ఉక్రెయిన్కు దన్నుగా ఉన్నాయి.క్షిపణులే మాట్లాడతాయి భారీ క్షిపణి దాడులకు మాకు అనుమతి లభించిందంటూ మీడియా ఏదేదో చెబుతోంది. కానీ దాడులు జరిగేది మాటలతో కాదు. వాటిని ముందుగా చెప్పి చేయరు. ఇక మా తరఫున క్షిపణులే మాట్లాడతాయి. – ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ – సాక్షి, నేషనల్ డెస్క్ -
మైక్రోసాఫ్ట్పై గూగుల్ ‘షాడో క్యాంపెయిన్’!
ప్రపంచంలోనే టాప్ టెక్ దిగ్గజ కంపెనీలుగా పేరున్న మైక్రోసాఫ్ట్, గూగుల్ మధ్య ఆరోపణల పర్వం కొనసాగుతోంది. యూరప్లో క్లౌడ్ సర్వీసులకు సంబంధించి మైక్రోసాఫ్ట్ అనుసరిస్తున్న విధానాలను తప్పుపడుతూ గూగుల్ తీవ్ర స్థాయిలో ఆరోపించింది. దీనికి బదులుగా మైక్రోసాఫ్ట్ అదే రీతిలో స్పందించింది. గూగుల్ తమ సంస్థపై ‘షాడో క్యాంపెయిన్’ నడుపుతోందని మైక్రోసాఫ్ట్ ఘాటుగా రిప్లై ఇచ్చింది.యూరప్లో మైక్రోసాఫ్ట్ తన క్లౌడ్ సేవలను విస్తరించాలని భావిస్తోంది. సంస్థ సరైన రీతిలో నిబంధనలు అనుసరించడం లేదంటూ ఇటీవల యూరోపియన్ యూనియన్ రిగ్యులేటర్లకు గూగుల్ యాంటీ ట్రస్ట్ ఫిర్యాదు అందించింది. మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సర్వీసు అజూర్ లైసెన్స్కు సంబంధించి నిబంధనలు అమలు చేయడం లేదని పేర్కొంది. ఇదిలాఉండగా, యూరప్లో యూరోపియన్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్ల గ్రూప్(సీఐఎస్పీఈ)తో కలిసి గూగుల్ తమ కంపెనీపై ఆరోపణలు చేయిస్తోందని మైక్రోసాఫ్ట్ తెలిపింది. ఈ వ్యవహారంపై సీఐఎస్పీఈతో జులైలోనే చర్చలు జరిపామని చెప్పింది. దీన్నిసైతం అడ్డుకునేందుకు గూగుల్ ప్రయత్నించిందని మైక్రోసాఫ్ట్ పేర్కొంది.ఇదీ చదవండి: బంగారం కొనేవారికి బెస్ట్ ఆఫర్ఈ సందర్భంగా మైక్రోసాఫ్ట్ డిప్యూటీ జనరల్ కౌన్సెల్ రిమా అలైలీ తన బ్లాగ్లో కొన్ని విషయాలు పంచుకున్నారు. ‘మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సర్వీసు అజూర్ను అణగదొక్కేందుకు గూగుల్ ‘షాడో క్యాంపెయిన్’ను అమలు చేస్తుంది. అజూర్ను సర్వీసులను కించపరిచేలా కొత్త లాబీయింగ్ గ్రూప్ను ప్రారంభించేందుకు గూగుల్ సిద్ధమైంది. ఈ గ్రూప్ వచ్చే వారంలో ఏర్పాటు కాబోతుంది’ అని అన్నారు. -
Russia-Ukraine war: లండన్, పారిస్, రోమ్, బెర్లిన్..!
లండన్: ఒక వైపు రష్యా సేనల ఆక్రమణ పర్వం కొనసాగుతుండటం, మరో వైపు వచ్చే నెలలో అమెరికాలో జరిగే ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైతే మద్దతు దూర మవుతుందనే భయాల నడుమ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ యూరప్ దేశాల్లో సుడి గాలి పర్యటన చేపట్టారు. 48 గంటల వ్యవధి లోనే లండన్, పారిస్, రోమ్, బెర్లిన్లను చు ట్టేశారు. తన వద్ద ఉన్న ‘విక్టరీ ప్లాన్’పై బ్రిట న్ ప్రధాని స్టార్మర్ సహా ఆయా దేశాధినే తలకు వివరించారు. మిత్ర దేశాల నుంచి అందే దీర్ఘ శ్రేణి క్షిపణులతో రష్యాలోని సు దూరంలో ఉండే మిలటరీ లక్ష్యాలకు నష్టం కలిగించడం.. తద్వారా యుద్ధానికి ముగింపు పలికేలా రష్యాను ఇరుకునపెట్టడం జెలెన్స్కీ ‘విక్టరీ ప్లాన్’లక్ష్యం. అయితే, బ్రిటన్ మాత్రమే తన వద్ద ఉన్న స్టార్మ్ షాడో దీర్ఘ శ్రేణి క్షిపణులను అందజేయడానికి సంసిద్ధత తెలిపింది. అమెరికా, జర్మనీ సహా ఇతర మి త్ర దేశాలు మాత్రం లాంగ్ రేంజ్ మిస్సైళ్లను ఉక్రెయిన్కు ఇవ్వడమంటే రష్యాతో ముఖా ముఖి యుద్ధానికి దిగడమనే అభిప్రాయంతో వెనుకంజ వేస్తున్నాయి. కేవలం ఒకే ఒక్క ఆయుధంతో యుద్ధంలో గెలుపును సొంతం చేసుకోవడం ఇప్పటివరకు జరగలేదని కూడా బ్రిటన్ అధికారులు అంటున్నారు. దీర్ఘ శ్రేణి క్షిపణులను ఉక్రెయిన్కు సమకూర్చడంపై చర్చించామని నాటో చీఫ్ మార్క్ రుట్ వెల్లడించారు. అయితే, అంతిమ నిర్ణయాన్ని ఆయా సభ్యదేశాలకే వదిలివేశామన్నారు. దీంతోపాటు, శనివారం బెర్లిన్లో జరగాల్సిన ఉక్రెయిన్ మిత్రదేశాల సమావేశం వాయిదా పడింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్వదేశంలో మిల్టన్ తుపాను ప్రభావం తీవ్రంగా ఉండటంతో ఈ సమావేశాన్ని రద్దు చేసుకున్నారు. -
రెండు సార్లు ప్రపంచకప్ గెలిచినా, ఇంగ్లండ్కు ఆ కల తీరడం లేదు..!
టీ20 వరల్డ్కప్ల్లో తమ ఖండానికి (యూరప్) చెందిన జట్లపై విజయం సాధించడం ఢిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్కు తీరని కలగా మిగిలిపోయింది. ఇంగ్లండ్ ఇప్పటివరకు జరిగిన ప్రపంచకప్ పోటీల్లో సొంత ఖండానికి చెందిన జట్లపై ఇప్పటివరకు ఒక్క మ్యాచ్లో కూడా విజయం సాధించలేకపోయింది. పొట్టి ప్రపంచకప్లో రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన ఇంగ్లండ్.. సొంత ఖండానికి చెందిన జట్లైన నెదర్లాండ్స్, ఐర్లాండ్, స్కాట్లాండ్ జట్లను ఇప్పటివరకు నాలుగు సందర్భాల్లో ఎదుర్కొంది.ఇందులో మూడింట ఊహించని పరాజయాలు ఎదుర్కోగా.. ఓ మ్యాచ్ ఫలితం తేలకుండా ముగిసింది. 2009, 2014 ఎడిషన్లలో నెదర్లాండ్స్ చేతిలో పరాభావాలు ఎదుర్కొన్న ఇంగ్లండ్.. 2022 ఎడిషన్లో ఐర్లాండ్ చేతిలో చావుదెబ్బ తింది. తాజాగా జరుగుతున్న ప్రపంచకప్లో ఇంగ్లండ్ నిన్న సహచర యూరప్ జట్టైన స్కాట్లాండ్తో తలపడింది.ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో ప్రపంచకప్లో సొంత ఖండానికి చెందిన జట్టుపై గెలవాలన్న ఇంగ్లండ్ కల కలగానే మిగిలిపోయింది. యూరోపియన్ దేశాల్లో టెస్ట్ హోదా కలిగిన ఎకైక దేశమైన ఇంగ్లండ్ సొంత ఖండ జట్లు, క్రికెట్ పసికూనలపై ఇప్పటివరకు ఒక్క విజయం సాధించలేకపోవడం క్రికెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తుంది.కాగా, టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా బార్బడోస్ వేదికగా ఇంగ్లండ్- స్కాట్లాండ్ మధ్య నిన్న జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. మ్యాచ్కు ముందే వర్షం ప్రారంభం కావడంతో టాస్ ఆలస్యంగా పడింది. టాస్ గెలిచిన స్కాట్లాండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుని 10 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 90 పరుగులు చేసింది. ఈ సమయంలో మొదలైన వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. మ్యాచ్ రద్దయ్యే సమయానికి జార్జ్ మున్సే (41), మైఖేల్ జోన్స్ (45) క్రీజ్లో ఉన్నారు. -
Farmers movement: యూరప్లోనూ రోడ్డెక్కిన రైతు
సాగు గిట్టుబాటు కావడం లేదంటూ రైతులు పెద్ద ఎత్తున ఆందోళన బాట పట్టారు. భారత్లో కాదు, యూరప్లో! అవును. రైతుల నిరసనలు, ఆందోళనలతో కొద్ది వారాలుగా యూరప్ దేశాలన్నీ ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. రెండేళ్లుగా సాగుతున్న ఉక్రెయిన్ యుద్ధంతో యూరప్ దేశాల్లో అసలే జీవనవ్యయం ఊహించనంతగా పెరిగిపోయింది. దీనికి తోడు గాజాపై ఇజ్రాయెల్ యుద్ధంతో కొద్ది నెలలుగా పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఇవి చాలవన్నట్టు సాగు వ్యయం విపరీతంగా పెరిగిపోయింది. పన్నుల భారం మోయలేనంతగా మారింది. ఇలాంటి అనేకానేక సమస్యలు యూరప్ వ్యాప్తంగా రైతులను కుంగదీస్తున్నాయి. ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలే సమస్యకు ప్రధాన కారణమంటూ వారు గగ్గోలు పెడుతున్నారు. ఉక్రెయిన్ను కాపాడే ప్రయత్నంలో తమ ఉసురు తీస్తున్నారంటూ మండిపడుతున్నారు. పరిష్కారం కోసం ప్రాధేయపడ్డా ఫలితం లేకపోవడంతో పలు దేశాల్లో రైతులు వేలాదిగా ఆందోళన బాట పట్టారు. ఏకంగా వేల కొద్దీ ట్రక్కులు, ట్రాక్టర్లతో రోడ్లెక్కుతున్నారు. పట్టణాలు, రాజధానులను దిగ్బంధిస్తున్నారు. నడిరోడ్లపై టైర్లను, గడ్డిమోపులను కాలబెడుతున్నారు. ప్రభుత్వాల తీరు తమ పొట్ట కొడుతోందంటూ నిరసనలు, నినాదాలతో హోరెత్తిస్తున్నారు. కొద్ది వారాలుగా పారిస్, బెర్లిన్ మొదలుకుని ఏ నగరంలో చూసినా, ఏ ఐరోపా దేశంలో చూసినా ఇవే దృశ్యాలు!! ఫిబ్రవరి 1న రైతులు ఏకంగా యూరోపియన్ పార్లమెంటు భవనంపైకి గుడ్లు విసరడం, రాళ్లు రువ్వారు! పలు దేశాల్లో పరిస్థితులు రైతుల అరెస్టుల దాకా వెళ్తున్నాయి... రైతుల సమస్యలు ఇవీ... ► యూరప్ దేశాలన్నింట్లోనూ రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్లో ప్రధానమైనది గిట్టుబాటు ధర లేమి. ► దీనికి తోడు ఏడాదిగా వారిపై పన్నుల భారం బాగా పెరిగిపోయింది. ఆకాశాన్నంటుతున్న పంట బీమా ప్రీమియాలు దీనికి తోడయ్యాయి. ► విదేశాల నుంచి, ముఖ్యంగా ఉక్రెయిన్ నుంచి చౌకగా దిగుమతవుతున్న ఆహారోత్పత్తులతో వారి ఉత్పత్తులకు గిరాకీ పడిపోతోంది. ► దక్షిణ అమెరికా దేశాల నుంచి చక్కెర, ఆహార ధాన్యాలతో పాటు మాంసం తదితరాల దిగుమతిని మరింతగా పెంచుకునేందుకు ఈయూ తాజాగా ఒప్పందం కుదుర్చుకుంది. ► అధికారుల అవినీతి, సకాలంలో సాయం చేయడంలో అలసత్వం మరింత సమస్యగా మారుతోంది. ► ఈయూ విధిస్తున్న పర్యావరణ నిబంధనలు మరీ శ్రుతి మించుతున్నాయన్న భావన అన్ని దేశాల రైతుల్లోనూ నెలకొంది. ► పర్యావరణ పరిరక్షణకు ప్రతి రైతూ 4 శాతం సాగు భూమిని నిరీ్ణత కాలం ఖాళీగా వదిలేయాలన్న నిబంధనను యూరప్ దేశాలన్నీ అమలు చేస్తున్నాయి. ► పైగా పలు దేశాలు ఏటా పంట మారి్పడినీ తప్పనిసరి చేశాయి. రసాయన ఎరువుల వాడకాన్ని 20 శాతం తగ్గించాలంటూ రైతులపై ఒత్తిడి తీవ్రతరమవుతోంది. ► సాగు అవసరాలకు వినియోగిస్తున్న పెట్రోల్, డీజిల్పై సబ్సిడీ ఎత్తేయాలన్న నిర్ణయం. దీంతో సాగు వ్యయం విపరీతంగా పెరుగుతోందంటూ చాలా యూరప్ దేశాల్లో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ముఖ్యంగా యూరప్లో అతి పెద్ద వ్యవసాయ ఉత్పత్తిదారులైన జర్మనీ, ఫ్రాన్స్ రైతులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ► పోర్చుగల్ నుంచి చౌకగా వచ్చి పడుతున్న వ్యవసాయోత్పత్తులు తమ పుట్టి ముంచుతున్నాయంటూ స్పెయిన్ రైతులు వాపోతున్నారు. ► నిధుల లేమి కారణంగా ఈయూ సబ్సిడీలు సకాలంలో అందకపోవడం రైతులకు మరింత సమస్యగా మారింది. ఇవీ డిమాండ్లు... ► ఆహారోత్పత్తుల దిగుమతులకు ఈయూ అడ్డుకట్ట వేయాలి. ► ఉక్రెయిన్ ఆహారోత్పత్తులను ప్రధానంగా ఆసియా దేశాలకు మళ్లించేలా చూడాలి. ► ముఖ్యంగా ఉక్రెయిన్ నుంచి పౌల్ట్రీ, గుడ్లు, చక్కెర దిగుమతులను నిలిపేయాలి. ► సాగుపై ప్రభుత్వపరంగా పన్నుల భారాన్ని తగ్గించాలి. ► 4% భూమిని ఖాళీగా వదలాలన్న నిబంధనను ఎత్తేయాలి. ► పలు పర్యావరణ నిబంధనలను వీలైనంతగా సడలించాలి. ► పెట్రోల్, డీజిల్పై సాగు సబ్సిడీలను కొనసాగించాలి. ఆందోళనలు ఏయే దేశాల్లో... జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, బెల్జియం, పోలండ్, స్పెయిన్, రొమేనియా, గ్రీస్, పోర్చుగల్, హంగరీ, స్లొవేకియా, లిథువేనియా, బల్గేరియా – సాక్షి, నేషనల్ డెస్క్ -
Global Warming: భూమిని వేడెక్కిస్తున్న పాపం... పెద్ద దేశాలదే!
గ్లోబల్ వార్మింగ్. కొన్ని దశాబ్దాలుగా ప్రపంచాన్ని వణికిస్తున్న సమస్య. దీని దెబ్బకు భూగోళపు సగటు ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరిగిపోతున్నాయి. అవి ఇంకో అర డిగ్రీ మేరకు పెరిగినా సర్వ వినాశనం జరిగే పరిస్థితి! ప్రాణికోటి మనుగడకే పెను ముప్పు! ఈ ప్రమాదం ఎంతో దూరం కూడా లేదని ఐక్యరాజ్యసమితి ఇప్పటికే ఎన్నోసార్లు హెచ్చరించింది. అయినా పరిస్థితిలో పెద్దగా మెరుగుదల లేదు. ముఖ్యంగా గ్లోబల్ వార్మంగ్కు ప్రధాన కారణమైన గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలు ఏటికేడు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. అంతర్జాతీయ పర్యావరణ సదస్సుల్లో దీనిపై ఎంతగా ఆందోళన వ్యక్తమవుతున్నా అది మాటలకే పరిమితమవుతోంది. ఉద్గారాలకు ముకుతాడు వేస్తామన్న సంపన్న దేశాల వాగ్దానాలు నీటిమూటలే అవుతున్నాయి. తరచి చూస్తే, గ్రీన్హౌస్వాయు ఉద్గారాల్లో సింహ భాగం పెద్ద దేశాలదే. మాటలే తప్ప చేతల్లేవు 2022లో ప్రపంచ దేశాలన్నీ కలిపి విడుదల చేసిన గ్రీన్హౌస్ వాయువుల పరిమాణమెంతో తెలుసా? ఏకంగా 5,000 కోట్ల మెట్రిక్ టన్నులు! పర్యావరణ కాలుష్య కారకాల్లో అతి ముఖ్యమైనవి గ్రీన్హౌస్ ఉద్గారాలే. భూగోళాన్ని వేడెక్కించడంలో కూడా వీటిదే ప్రధాన పాత్ర. ఇంతటి ప్రమాదకరమైన సమస్య విషయంలో మన నిర్లిప్త వైఖరికి ఏత ఏడాది గ్రీన్హౌజ్ వాయు ఉద్గారాల పరిమాణం మరో తాజా ఉదాహరణ మాత్రమే. ఈ పాపంలో సంపన్న దేశాల పాత్రే ఎక్కువ. చైనా విషయమే తీసుకుంటే, గతేడాది ప్రపంచ గ్రీన్హౌస్ ఉద్గారాల్లో ఆ ఒక్క దేశం వాటాయే ఏకంగా 30 శాతం! 2022లో అది 1,440 కోట్ల టన్నుల మేరకు కార్బన్ డయాక్సైడ్ (సీఓటూ) ఉద్గారాలను వాతావరణంలోకి విడుదల చేసిన చెత్త రికార్డును మూటగట్టుకుంది. కొన్ని దశాబ్దాలుగా చైనా పారిశ్రామిక వ్యవస్థ ప్రధానంగా బొగ్గుపై ఆధారపడటమే ఇందుకు ప్రధాన కారణం. ఇక 639 కోట్ల టన్నులతో అమెరికా రెండో స్థానంలో ఉంది. 343 కోట్ల టన్నులతో యూరోపియన్ యూనియన్(ఈయూ) నాలుగో స్థానంలో ఉంది. గణాంకాలపరంగా 352 కోట్ల టన్నులతో ఈ జాబితాలో భారత్ మూడో స్థానంలో ఉన్నట్టు కనిపించినా జనాభాను బట్టి చూస్తే కర్బన ఉద్గారాల పాపంలో మన వాటా నిజానికి చాలా తక్కువ. మన తలసరి వార్షిక కర్బన ఉద్గారాలు కేవలం 2.5 టన్నులు! ప్రపంచ వేదికలపై పెద్ద మాటలు చెప్పే అమెరికాదే ఈ పాపంలో అగ్ర స్థానం! ఒక్కో అమెరికన్ ఏటా సగటున 19 టన్నుల సీఓటూ ఉద్గారాలకు కారకుడవుతున్నాడు. కేవలం 2.5 కోట్ల జనాభా ఉన్న ఆ్రస్టేలియాలో తలసరి కర్బన ఉద్గారాలు 20 టన్నులు, 3.8 కోట్ల జనాభా ఉన్న కెనడాలో 18 టన్నులు, 14 కోట్ల జనాభా ఉన్న రష్యాలో 14 టన్నులు! 20.7 టన్నుల తలసరి ఉద్గారాలతో సౌదీ అరేబియా ఈ జాబితాలో అగ్ర స్థానంలో ఉండటం విశేషం. మొత్తమ్మీద ప్రపంచ కర్బన ఉద్గారాల్లో చైనా, అమెరికా, ఈయూ వాటాయే దాదాపు సగం! వీటిలోనూ చారిత్రకంగా చూసుకుంటే అమెరికా, ఈయూ రెండే ప్రపంచ కాలుష్యానికి ప్రధాన కారకులుగా ఉంటూ వస్తున్నాయి. వేడెక్కుతున్న భూమి భూగోళపు ఉష్ణోగ్రత పారిశ్రామికీకరణకు ముందు నాటితో గత 150 ఏళ్లలో 1.5 డిగ్రీలకు మించి పెరిగిపోయింది! ఇటీవల ఒకానొక దశలో అది 2 డిగ్రీలకు మించి కలవరపరిచింది కూడా. దాన్ని 1.5 డిగ్రీలకు మించకుండా కట్టడి చేయాలన్న పారిస్ ఒప్పందానికి ప్రపంచ దేశాలన్నీ పేరుకు అంగీకరించాయే తప్ప ఆచరణలో చేస్తున్నది పెద్దగా కన్పించడం లేదు. ఈ నేపథ్యంలో ప్రపంచం ఇప్పుడు ఏ క్షణమైనా పేలనున్న మందుపాతర మీద ఉందని ఐక్యరాజ్యసమితి తాజాగా ఆందోళన వెలిబుచి్చంది. కర్బన ఉద్గారాల ప్రవాహం ఇలాగే కొనసాగి గ్లోబల్ వార్మింగ్ పెరుగుతూ పోతే ప్రపంచ దేశాలన్నీ ఎలాగోలా ప్రస్తుత పర్యావరణ లక్ష్యాలను చేరుకున్నా భూమి 2 డిగ్రీలను మించి వేడెక్కడం ఖాయమని హెచ్చరించింది. అప్పుడు కనీవినీ ఎరగని ఉత్పాతాలను, ఘోరాలను నిత్యం కళ్లజూడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. ఇంతటి విపత్కర పరిస్థితుల నేపథ్యంలో దుబాయ్లో అంతర్జాతీయ పర్యావరణ సదస్సు కాప్–28 జరుగుతోంది. అందులోనైనా కర్బన ఉద్గారాలకు కళ్లెం వేసి భూగోళాన్ని కాపాడుకునే దిశగా ఏమైనా నిర్ణయాత్మకమైన అడుగులు పడతాయేమో చూడాలి. ఏమిటీ కర్బన ఉద్గారాలు? బొగ్గు, చమురు, గ్యాస్ను మండించినప్పుడు అవి వాతావరణంలోకి భారీ పరిమాణంలో కార్బన్ డయాక్సైడ్ను విడుదల చేస్తాయి. అది కొన్ని వందల ఏళ్లపాటు వాతావరణంలోనే ఉండిపోయి భూమిని వేడెక్కిస్తూ ఉంటుంది. ‘‘ఆ లెక్కన భూమికి ముప్పు కేవలం 2022 తాలూకు కర్బన ఉద్గారాలు మాత్రమే కాదు. పారిశ్రామికీకరణ ఊపందుకున్నాక గత 150 ఏళ్లలో విడుదలైన కర్బన ఉద్గారాలన్నీ ఇప్పటికీ భూమిని వేడెక్కిస్తూనే ఉన్నాయి. ఆ లెక్కన ఈ 150 ఏళ్లలో అత్యధిక కర్బన ఉద్గారాలకు కారణమైన అమెరికాదే గ్లోబల్ వార్మింగ్లో ప్రధాన పాత్ర అని చెప్పాల్సి ఉంటుంది’’ అని బ్రిటన్లోని ఎక్స్టర్ యూనివర్సిటీ పర్యావరణ శాస్త్రవేత్త పియరీ ఫ్రెడ్లింగ్స్టెయిన్ కుండబద్దలు కొట్టారు! – సాక్షి, నేషనల్ డెస్క్ -
Europe : వలసల వలలో యూరప్
యూరప్ ను వలసలు చుట్టుముట్టేస్తున్నాయి. ఈ ఖండంలోని చాలా దేశాలు విలవిలలాడిపోతున్నాయి. ప్రభుత్వాలు కూలిపోతున్నాయి. అల్లర్లు,నేరాలు,ఘోరాలు,అశాంతి ఆ దేశాలను అల్లకల్లోలం చేస్తున్నాయి.వీటికి పరిష్కారం లభించకపోగా,మరింత రగిలే ప్రమాదఘంటికలే వినిపిస్తున్నాయి. వలసలు ఏ ఖండానికి,ఏ దేశానికి కొత్తకాదు.ఇతర దేశాల నుంచి అక్రమంగా వలస వచ్చినవారితోనూ, సక్రమంగా వలస వచ్చినవారితోనూ సమస్యలు పెరుగుతూనే వున్నాయి.భారతదేశం కూడా అందుకు మినహాయింపు కాదు. వలసలతో అశాంతి ప్రస్తుత అంశం యూరప్ విషయానికి వస్తే, వలసలు ప్రబలి,రోజుకొకరకమైన దుర్వార్త అక్కడి నుంచి వినాల్సివస్తోంది.ఇప్పటికే ఫ్రాన్స్ లో అల్లర్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. నెదర్లాండ్ లో ప్రభుత్వమే కూలిపోయింది.స్వీడన్ లో ఘర్షణలు లేని రోజంటూ లేదు. స్విట్జర్లాండ్ లో అశాంతి రాజ్యమేలుతోంది. బెల్జియం,జర్ననీలో అల్లర్లు,నేరాలుఘోరాలకు అదుపే లేదు.మానవతా దృక్పధంతో శరణు ఇచ్చినందుకు యూరప్ మొత్తం మూల్యం చెల్లించాల్సి వస్తోంది.శరణుకోరి ఆయా దేశాలలో ప్రవేశించినవారి సంఖ్య కోట్లకు చేరుకుంది.వీరంతా మిగిలిన సామాజిక సమస్యలను సృష్టించడమే గాక,రాజకీయాలను ప్రభావితం చేస్తున్నారు.ప్రభుత్వాల మనుగడే ప్రశ్నార్ధకమవుతోంది. శరణార్థుల దారి యూరపే.! యుద్ధాలు, అంతర్యుద్ధాల కారణంతో యుగొస్లావియా, ఉక్రెయిన్,సిరియా,ఆఫ్ఘనిస్థాన్ మొదలైన దేశాలలో బాధపడేవారు యూరప్ దేశాల వైపు వస్తున్నారు. అతి ప్రమాదకరమైన విధానాల్లో సముద్ర ప్రయాణాలు చేస్తూ, కొందరు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు.ముఖ్యంగా 2015లో వలసలు పెద్దఎత్తున పోటెత్తాయి.ఆ సంవత్సరాన్ని 'వలసల సంవత్సరం'గా అభివర్ణించారు.2007-2011మధ్య కూడా వలసలు పెద్ద సంఖ్యలోనే జరిగాయి.ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదం పెరగడం కూడా వలసలపైన కీలక ప్రభావం చూపించింది, ఇంకా చూపిస్తూనే వుంది. లక్షల మంది వలస 2022నాటికి వలస వచ్చిన జనాభా చూస్తే, జర్మనీలో 10.9మిలియన్లు, స్పెయిన్ లో 5.4మిలియన్లు, ఫ్రాన్స్ లో 5.3మిలియన్లు,ఇటలీలో 5మిలియన్లు ఉన్నట్లు సమాచారం. ఒక్క 2022లోనే యూరోపియన్ యూనియన్ లో ఆశ్రమం కోరిన వారి సంఖ్య 6,32,430.అందులో ఆమోదం పొందిన వారి సంఖ్య 3.10 లక్షలు.ఇన్నేళ్ల పాటు వచ్చినవారు,వస్తున్నవారిలో అధికారికంగా కంటే అనధికారికంగా వచ్చిన వారి సంఖ్య అంచనాలకు మించి వుంటుంది. లక్షల్లో వలసవస్తున్న వీరిని కొన్ని దేశాలు అడ్డుకుంటున్నాయి. జర్మనీ వంటికొన్ని దేశాలు మాత్రం ఆదుకుంటున్నాయి. నాటి పాపం నేడు అనుభవిస్తున్నారు పశ్చిమాసియా, దక్షిణాసియా, ఆఫ్రికా నుంచి పెద్దసంఖ్యలో వలసలు జరిగాయి. అరబ్ విప్లవం తర్వాత టునీసియా, లిబియా,ఈజిప్ట్,యెమెన్, అల్జీరియా వంటి దేశాల నుంచి వలసలు వెల్లువెత్తాయి. చట్టవిరుద్ధంగా ప్రవేశించినవారిలో ఎక్కువమంది గ్రీస్ ద్వారా వెళ్లినట్లు తెలుస్తోంది.వలసల ప్రభావం ఆర్ధిక, సామాజిక,రాజకీయ వ్యవస్థలపై పడుతోంది.నివాసం,ఉపాధి కల్పించడం ప్రభుత్వాలకు పెనుసమస్యగా మారింది. వివిధ సమాజాల మధ్య సాంస్కృతిక ప్రయాణం పెద్దసవాల్ విసురుతోంది. ప్రస్తుతం యూరప్ లో ప్రముఖంగా కనిపిస్తున్న ఈ జాఢ్యం మిగిలిన ఖండాలలోనూ రేపోమాపో శృతిమించకపోదు. సున్నితం.. కీలకం భిన్న సంస్కృతులకు, మతాలకు నిలయమై,అనేక దాడులకు ఆలవాలమై,ప్రపంచంలోనే అతిపెద్ద దేశంగా అవతరిస్తున్న భారతదేశం వలసల విషయంలో,ముఖ్యంగా మిగిలిన దేశాల నుంచి అక్రమంగా చొరబడిన వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. యూరప్ వలసల అంశంపై ప్రపంచ దేశాధినేతలు దృష్టి పెట్టాలి. ఆయా దేశాల అంతర్గత సమస్యలను అరికట్టడంలోనూ, మతోన్మాద ఉగ్రవాదం ప్రబలకుండా చూడడంలోనూ అందరూ కలిసి సాగాలి.యూరప్ అనుభవాలు మిగిలిన ఖండాలకు పెద్దగుణపాఠం కావాలి. - మాశర్మ, సీనియర్ జర్నలిస్టు -
G20 Summit: ఢిల్లీలో మూడ్రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు
న్యూఢిల్లీ: ఈ ఏడాది భారత్ ఆధ్యక్షతన సెప్టెంబర్ 8-10 వరకు జరగనున్న జీ20 శిఖరాగ్ర సమావేశానికి ఢిల్లీ ఆతిధ్యమివ్వనున్న నేపథ్యంలో మూడు రోజుల పాటు పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్లు తెలిపారు ఢిల్లీ ట్రాఫిక్ విభాగం కమీషనర్ ఎస్ఎస్ యాదవ్. ఐరోపా దేశాల తోపాటు 19 ఇతర దేశాలు పాల్గొనే ఈ సదస్సుకు ఈసారి భారతదేశం ఆతిధ్యమివ్వనుంది. ఢిల్లీ వేదికగా భారత్ మండపం కన్వెన్షన్ సెంటర్లో సెప్టెంబర్ 8-10 వరకు జరిగే ఈ సమావేశాలకు ఆయా దేశాల ప్రతినిధులు హాజరుకానున్న నేపధ్యంలో ఆ పరిసర ప్రాంతాల్లో పలుచోట్ల ట్రాఫిక్ మళ్లింపుల తోపాటు కొన్ని టాఫిక్ ఆంక్షలు కూడా విధించనున్నట్లు తెలిపారు ఢిల్లీ ట్రాఫిక్ కమీషనర్ ఎస్ఎస్ యాదవ్. दिल्ली में लागू होंगे कई नियम G-20 समिट को लेकर ट्रैफिक पुलिस ने बनाया वर्चुअल हेल्पडेस्क मेट्रो में कोई बदलाव या रोक-टोक नहीं होगी 7 सितंबर की रात से कमर्शियल व्हीकल की एंट्री बंद एयरपोर्ट जाने के लिए करें मेट्रो का इस्तेमाल #G20Summit #G20India2023 #DelhiNews pic.twitter.com/oNqgtClm2v — NiwanTimes (@NiwanTimesInd) August 25, 2023 యాదవ్ మాట్లాడుతూ ఈ ఆంక్షలు సెప్టెంబర్ 7 సాయంత్రం మొదలై సెప్టెంబర్ 10 వరకు కొనసాగుతాయని ఢిల్లీ వాస్తవ్యులైతే పర్వాలేదు కానీ ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారైతే తప్పక తమ హోటల్ బుకింగ్ సమాచారాన్ని చూపించాల్సి ఉంటుందని అన్నారు. రవాణాకు సంబంధించి అంబులెన్స్ లాంటి అత్యవసర వాహనాలపై ఎలాంటి ఆంక్షలు లేవు కానీ కార్గో ట్రక్కులను, నగరం బయటే నిలిపివేస్తామని, డీటీసీ సేవలు కూడా అందుబాటులో ఉండవని.. మెట్రో సేవలు మాత్రమే అందుబాటులోనే ఉంటాయని ప్రయాణికులు మెట్రో ద్వారా ప్రయాణించాలని కోరారు. ఈ మూడు రోజులు ప్రజలు రద్దీగా ఉండే మార్కెట్లకు వెళ్లవద్దనీ ఏమి కావాలన్నా ముందే తెచ్చి పెట్టుకోవాలని అన్నారు. STORY | Road travel to IGI Airport will be affected on Sept 8-10 due to G20 summit: Delhi Police READ: https://t.co/rWelcfSqhq (PTI File Photo) #G20Summit #G20India2023 pic.twitter.com/0YuvRjG7pr — Press Trust of India (@PTI_News) August 25, 2023 మథుర రోడ్, బైరాన్ మార్గ్, పురానా ఖిలా రోడ్లలో పూర్తిగా ట్రాఫిక్ నిలిపివేస్తున్నట్లు తెలుపుతూ ఎయిర్పోర్టుకు రైల్వే స్టేషన్లకు వెళ్లాల్సిన వారు ముందుగానే వెళ్లాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో వర్చువల్ హెల్ప్ డెస్క్ సేవలు కూడా వినియోగించుకోవాలని తెలిపారు. #WATCH | On traffic arrangements in Delhi during G20 summit, Special CP Traffic, SS Yadav says, "...New Delhi Police district has been declared as the controlled zone...Railway services and metro services will be working smoothly. Metro services will be functional throughout… pic.twitter.com/kRrqYUv3wH — ANI (@ANI) August 25, 2023 ఇది కూడా చదవండి: అడ్డుకోవాలని చూశారు.. అయినా పూర్తి చేశాం: నితీష్ కుమార్ -
ప్రభుత్వాన్నే ముంచేసిన.. వలసల వరద..
నెదర్లాండ్స్లో నాలుగు పార్టీల సంకీర్ణ ప్రభుత్వం ఎన్నికైన ఏడాదిన్నరకే పేకమేడలా కుప్పకూలింది. యూరప్లో చాలా దేశాలు ఎదుర్కొంటున్న వలసల ఉధృతే ఇందుకు ప్రధాన కారణం కావడం అక్కడ సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది.. నెదర్లాండ్స్లోకి వలసలను కట్టడి చేసేందుకు ప్రధాని మార్క్ రుట్టె ప్రతిపాదించిన కఠినతరమైన వలసల విధానం చివరికి ఆయన ప్రభుత్వానికే ఎసరు తెచి్చంది. పాలక సంకీర్ణంలోని మిగతా మూడు భాగస్వామ్య పార్టీలూ ఈ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించడంతో రుట్టె రాజీనామా చేశారు. అయితే, భాగస్వాముల మాటకు తలొగ్గి రాజీ పడేకంటే దీర్ఘకాలిక స్వీయ రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమన్న దూరదృష్టి ఆయన నిర్ణయంలో ప్రతిఫలించిందని పరిశీలకులు భావిస్తున్నారు. అంతేగాక యూరప్లో వలసల సమస్య నానాటికీ ఎంత తీవ్రతరంగా మారుతోందో, అక్కడి రాజకీయాలను ఎంతగా ప్రభావితం చేస్తోందో, దీన్ని రైట్ వింగ్ పార్టీలు సొమ్ము చేసుకోకుండా ఆపడం ప్రధాన పార్టీలకు ఎంత కష్టతరంగా పరిణమిస్తోందో ఈ ఉదంతం మరోసారి తేటతెల్లం చేసిందని చెబుతున్నారు. ► యూరప్లోని అత్యంత ధనిక దేశాల్లో నెదర్లాండ్స్ది నాలుగో స్థానం ► నెదర్లాండ్స్లోకి వలసల సంఖ్య గతేడాది ఏకంగా మూడో వంతు పెరిగి 47 వేలు దాటేసింది! దాంతో ప్రధాని రుట్టె కట్టడి చర్యలను ప్రతిపాదించాల్సి వచి్చంది. ► ఈసారి దేశంలోకి శరణార్థుల సంఖ్య ఏకంగా 70 వేలు దాటొచ్చని అంచనా. ► వలసదారుల దెబ్బకు చాలా యూరప్ దేశాల్లో మాదిరిగానే నెదర్లాండ్స్లో కూడా ఇళ్ల ధరలు, అద్దెలు అందుబాటులో లేకుండా పోతున్నాయి. ► ఇదేగాక పెరుగుతున్న వలసల వల్ల అనేకానేక సమస్యలతో నెదర్లాండ్స్ సతమతమవుతోంది. ► నవంబర్లో జరుగుతాయని భావిస్తున్న ఎన్నికల్లో అన్ని పార్టీలకూ ఇది అది పెద్ద ప్రచారాంశంగా మారినా ఆశ్చర్యం లేదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ► ఇప్పుడిక నెదర్లాండ్స్ రాజకీయంగా ఎలాంటి మలుపులు తిరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఏమిటీ ప్రతిపాదిత విధానం... ప్రధానంగా, నెదర్లాండ్స్లో నివసిస్తున్న వలసదారుల పిల్లలకు వలసదారులుగా గుర్తింపు ఇచ్చేందుకు కనీసం రెండేళ్ల వెయిటింగ్ పీరియడ్ ఉండాలని ప్రధాని రుట్టె ప్రతిపాదించారు. దీన్ని సంకీర్ణ భాగస్వాములు తీవ్రంగా వ్యతిరేకించారు. యూరప్కు పెనుభారంగా వలసలు... ► ఉక్రెయిన్పై రష్యా యుద్ధం తదితర కారణాలతో యూరప్ దేశాలకు కొన్నేళ్లుగా వలసలు భారీగా పెరుగుతున్నాయి. ► 2015లో సిరియా నుంచి శరణార్థులు వెల్లువెత్తిన నాటి నుంచీ ఈ ధోరణి నానాటికీ పెరుగుతూనే ఉంది. ► కానీ ద్రవ్యోల్బణం తదితరాలతో అసలే ధరాభారం, జీవన వ్యయం నానాటికీ పెరిగిపోతున్న సమయంలో ఈ వలసలు క్రమంగా యూరప్ దేశాలకు తలకు మించిన భారంగా మారుతున్నాయి. ► దీన్ని అవకాశంగా మలచుకుంటూ పలు యూరప్ దేశాల్లో రైట్ వింగ్ పార్టీలు శరణార్థుల పక్షం వహిస్తుండటంతో యూరప్ రాజకీయాలే కీలకమైన, అనూహ్యమైన మలుపు తిరుగుతున్నాయి. చాలా దేశాల్లో ఇప్పటికే రాజకీయాలను నిర్దేశించే స్థాయికి చేరుకున్నాయి కూడా. ► ఏళ్లుగా పాతుకుపోయిన సంప్రదాయ పార్టీలకు ఈ రైట్ వింగ్ పార్టీల ఎదుగుదల పెను సవాలుగా మారుతోంది. ► జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, హంగరీ మొదలుకుని చిన్నా పెద్దా యూరప్ దేశాలన్నింట్లోనూ ఇదే పరిస్థితి! ► దాంతో రైట్ వింగ్ పార్టీలకు ముకుతాడు వేసేందుకు సంప్రదాయ పార్టీలన్నీ చేతులు కలుపుతున్న కొత్త ధోరణి కూడా కొన్ని దేశాల్లో ఇప్పటికే మొదలైంది. రుట్టె కేంద్రంగా... ► నెదర్లాండ్స్లో వలసలపై నెలకొన్న తాజా సంక్షోభం ప్రధాని రు ట్టె సంప్రదాయ వైఖరి కారణంగానే ముదురు పాకాన పడింది. ► 13 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న రుట్టె, దీన్ని కూడా అందివచి్చన అవకాశంగానే మలచుకుని వెంటనే రాజీనామా చేశారు. ► ఇటీవల బలం పుంజుకుంటున్న రైట్వింగ్ పార్టీల దూకుడుకు అడ్డుకట్ట వేయడంతో పాటు దేశ ప్రయోజనాలు కాపాడేందుకు అధికారాన్ని కూడా తృణప్రాయంగా వదులుకున్నారన్న ఇమేజీ సాధించి ఒక్క దెబ్బకు రెండు పిట్టలు కొట్టే లక్ష్యంతోనే ఆయన రాజీనామా చేసినట్టు కనిపిస్తోంది. ► రైట్ వింగ్ పార్టీలతో ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రశ్నే లేదని కుండబద్దలు కొట్టడం ద్వారా రుట్టె తన ఉద్దేశాన్ని చెప్పకనే చెప్పారు. ► అంతేగాక రాజీనామా ద్వారా యూరప్ యవనికపై వలసల కట్ట డి కోసం గళమెత్తుతున్న బలమైన నేతగా రుట్టె ఆవిర్భవించారు. ► యూరప్లోకి వలసల కట్టడికి సంయుక్త ఈయూ బోర్డర్ ఏజెన్సీ వంటివాటి ఏర్పాటును కూడా కొంతకాలంగా ఆయన ప్రతిపాదిస్తున్నారు. అయితే రాజీనామా ద్వారా దేశ ప్రయోజనాల కంటే స్వీయ రాజకీయ ప్రయోజనాలకే ఆయన పెద్దపీట వేసుకున్నారన్న విమర్శలూ వినిపిస్తున్నాయి! ‘కేవలం ప్రతిపాదిత వలస విధానంపై విభేదాల వల్ల ఏకంగా పాలక సంకీర్ణమే కుప్పకూలడం నమ్మశక్యం కాని నిజం! ఏదేమైనా రాజీనామా నిర్ణయం ప్రధాని రుట్టె రాజకీయ చతురతకు అద్దం పట్టింది’ – మార్సెల్ హనెగ్రాఫ్, అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్, యూనివర్సిటీ ఆఫ్ ఆమ్స్టర్డామ్ –సాక్షి, నేషనల్ డెస్క్ -
ఫ్యామిలీతో హాలీడే ట్రిప్ ప్లాన్ చేసిన సూపర్స్టార్!
ఇటీవల ఫ్యామిలీతో కలిసి ప్యారిస్, జర్మనీకి హాలిడే ట్రిప్కు వెళ్లొచ్చారు మహేశ్బాబు. తాజాగా మరో హాలిడే ట్రిప్ను ప్లాన్ చేసుకున్నట్లున్నారు. భార్య నమ్రత, కుమారుడు గౌతమ్, సితారలతో కలిసి మహేశ్బాబు శుక్రవారం విదేశాలకు పయనమయ్యారు. హ్యాపీగా.. జాలీగా యూరప్ వెళ్లారని తెలిసింది. కాగా ‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాల తర్వాత దర్శకుడు త్రివిక్రమ్తో కలిసి మహేశ్బాబు మూడోసారి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తాజా షెడ్యూల్ చిత్రీకరణను ఈ నెలాఖర్లో ప్లాన్ చేశారట. కానీ కొన్ని కారణాల వల్ల షూటింగ్ షెడ్యూల్ వాయిదా పడటంతో మహేశ్ హాలిడే ట్రిప్ ప్లాన్ చేసుకున్నారని సమాచారం. పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 13న విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది. -
ఈ యుద్ధం ఇంకెన్నాళ్లు?
పొరుగునున్న బలహీన దేశం ఉక్రెయిన్ను లొంగదీసుకునేందుకు రష్యా మొదలెట్టిన దురాక్రమణ యుద్ధం ఏడాదయ్యేసరికి మరింత జటిలంగా మారింది. నిరుడు ఫిబ్రవరి 24న రెండు లక్షలమంది సైన్యాన్ని ఉక్రెయిన్ వైపు నడిపించిన రష్యా ఇప్పుడు ఆ సంఖ్యను అయిదు లక్షలకు పెంచింది. ఏడాదైన సందర్భంగా ఉక్రెయిన్ నైతిక స్థైర్యాన్ని పెంచడానికంటూ ఆ గడ్డపై అడుగుపెట్టిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేసిన ప్రసంగం, ఆ తర్వాత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాట్లాడిన తీరు చూస్తే ఈ యుద్ధం దీర్ఘకాలం కొనసాగుతుందన్న అభిప్రాయం ఏర్పడుతోంది. నిజానికి ఇప్పటికే వైరి వర్గాల మోహరింపు మొదలైంది. ఏడాది క్రితం యుద్ధంలో ప్రధాన పాత్రధారులు రష్యా– ఉక్రెయిన్లే. ప్రస్తుతం అమెరికా మద్దతుతో యూరోప్ దేశాలు అందులో పీకల్లోతు కూరుకుపోయాయి. రష్యాకు మారణాయుధాలిస్తే ఖబడ్దార్ అంటూ అమెరికా చేసిన హెచ్చరికకు జవాబన్నట్టు చైనా కమ్యూనిస్టు పార్టీ విదేశాంగ విధాన నిపుణుడు వాంగ్ యీ బుధవారం మాస్కో సందర్శించి రష్యాతో తమ బంధం మరింత దృఢమవుతుందని ప్రకటించారు. పేరుకు చిన్న దేశమే అయినా అమెరికా పుణ్యమా అని ప్రస్తుతం ఉక్రెయిన్ దగ్గర మారణాయుధాలు, యుద్ధ ట్యాంకులు, గురిచూసి లక్ష్యాన్ని ఛేదించే బాంబులు, అత్యాధునిక యుద్ధ సామగ్రి, కోట్లాది డాలర్ల నిధులు పుష్కలంగా ఉన్నాయి. దేశం మరుభూమిగా మారినా రష్యాను చావుదెబ్బ తీయటంలో అవన్నీ ఉక్రెయిన్కు తోడ్పడుతున్నాయి. నిజానికి అమెరికా మొదట్లో చాలానే ఆశించింది. రష్యాపై ప్రపంచవ్యాప్తంగా ఏహ్యభావం వస్తుందని, అది ఏకాకవుతుందని భావించింది. కానీ అలాంటి ఛాయలు కనబడటం లేదు. తమ దేశంపై 2001లో వేలాదిమంది మరణానికి కారణమైన సెప్టెంబర్ 11 ఉగ్రదాడి అనంతరం ‘వాళ్లెందుకు మమ్మల్ని ద్వేషిస్తున్నార’ంటూ అల్ఖైదా ఉగ్రవాదుల గురించి ప్రశ్నించిన అమెరికా ఇప్పుడు ఆ ప్రశ్నను కాస్త తిరగేసి అడుగుతోంది. ‘వాళ్లనెందుకు ద్వేషించటం లేద’న్నది ఆ ప్రశ్న సారాంశం. ఇక్కడ ‘వాళ్లు’ అంటే రష్యన్లు. నిజమే, అమెరికా ఒత్తిడికి తలొగ్గి అయిష్టంగానైనా ఉక్రెయిన్కు మారణాయుధాలు అందజేస్తున్న యూరోప్ దేశాలు రష్యా నుంచి దిగుమతులు మాత్రం ఆపలేదు. తనకు సాగిలపడలేదన్న కక్షతో ఇరాన్పై గతంలో తీవ్ర ఆంక్షలు విధించి ఆ దేశాన్ని ఆర్థిక దిగ్బంధం చేసిన అమెరికా ఇప్పుడు రష్యాపై ఆ స్థాయిలో విరుచుకుపడటం లేదు. రష్యా చమురు, సహజ వాయువుల ఎగుమతిలో ప్రపంచంలోనే నాలుగో స్థానంలో ఉండటం మాత్రమే కాదు... నికెల్, అల్యూమినియం, టైటానియం వంటి లోహాలూ, రసాయన వాయువులూ, సెమీ కండక్టర్లూ, గోధు మలూ, ఎరువుల ఎగుమతుల్లో అగ్రస్థానంలో ఉంది. కఠిన ఆంక్షలతో ఇవన్నీ ఆగిపోతాయన్న భయాందోళనలు అమెరికా, యూరోప్ దేశాల్లో ఉన్నాయి. ఇక ముడి చమురును రష్యా చాలా చవగ్గా మనకూ, చైనాకూ విక్రయిస్తోంది. మన దేశం అక్కడినుంచి రోజూ 12 లక్షల బ్యారెళ్ల ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది. ఏడాదిక్రితంతో పోలిస్తే ఇది 33 రెట్లు ఎక్కువ. ఇలా అనేకానేక కారణాలవల్ల రష్యాపై ప్రపంచ దేశాల్లో ఏహ్యభావం లేదు. పైపెచ్చు ఉక్రెయిన్కు అత్యుత్సాహంతో అమెరికా, యూరోప్ దేశాలు మారణాయుధాలు అందిస్తున్న తీరువెనక వారికి వేరే ప్రయోజనాలున్నాయని ప్రపంచం విశ్వసిస్తోంది. అది పాశ్చాత్య దేశాల చేతిలో కీలుబొమ్మ అని రష్యా చేస్తున్న ప్రచారం నిజం కావొచ్చన్న అభిప్రాయం కలుగుతోంది. ఒక సర్వే ప్రకారం భారత్, చైనా, తుర్కియే దేశాల్లో అత్యధికులు రష్యాకు అనుకూలంగానే ఉన్నారని వెల్లడైంది. సోవియెట్ యూనియన్ ఉనికిలో ఉన్నప్పుడు దాన్ని అగ్రరాజ్యంగా, ప్రమాదకరమైన శక్తిగా భావించేవారు. ఇప్పుడు రష్యాపై ఆ ముద్ర లేదు. ప్రచ్ఛన్న యుద్ధ దశ ముగిశాక అమెరికా, రష్యాల మధ్య సుదీర్ఘ చర్చలు జరిగిన పర్యవసానంగా 2010లో అణ్వాయుధాల నియంత్రణ ఒప్పందం(స్టార్ట్) కుదిరింది. దాని కాలపరిమితి 2026 ఫిబ్రవరిలో ముగియబోతోంది. కొత్త ఒప్పందంపై మొదలైన చర్చలను నిలిపేస్తున్నట్టు ప్రకటించి పుతిన్ అందరినీ ఆందోళనలో పడేశారు. ఏ పక్షమూ మొదటగా అణ్వాయుధాలు ఉపయోగించకుండా నియంత్రించే ఆ ఒప్పందం ఒక్కటే రెండు దేశాల మధ్యా మిగిలింది. దాన్ని కాస్తా పున రుద్ధరించటానికి చర్యలు తీసుకోకపోతే ప్రపంచ మనుగడ ప్రమాదంలో పడుతుంది. ఇక రెండు దేశాలూ తమ అణ్వాయుధాల సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునే వ్యవస్థేమీ మిగలదు. పుతిన్ మరో మాట కూడా అన్నారు. అమెరికా గనుక అణు పరీక్షలు మొదలుపెడితే తాము కూడా సర్వసన్నద్ధంగా ఉన్నామని ప్రకటించారు. యుద్ధం ఆగనంతకాలమూ ఇలా సవాళ్లు, ప్రతి సవాళ్లతో పరిస్థితి నానాటికీ దిగజారుతుంది. యూరోప్ భద్రత ప్రమాదంలో పడుతుంది. యుద్ధాన్ని విరమించి శాంతియుతంగా సమస్యలు పరిష్కరించుకోమని మన దేశం ఇరుపక్షాలకూ చెబుతోంది. కానీ మున్ముందు ఇలా మధ్యవర్తిత్వం వహించే అవకాశాలు కూడా ఉండవు. ఇప్పటికే 80 లక్షలమంది ఉక్రెయిన్ పౌరులు కొంపా గోడూ వదిలి వలసపోయారు. వేలాదిమంది మరణించారు. అనేకులు వికలాంగులయ్యారు. అటు రష్యా సైతం భారీగా నష్టపోయింది. బలహీన ఆర్థిక వ్యవస్థలున్న దేశాలు ఈ యుద్ధంతో సంక్షోభంలో పడ్డాయి. అందుకే మతిమాలిన ఈ యుద్ధాన్ని విరమించేలా రష్యాపై ప్రపంచం ఒత్తిడి తేవాలి. ఉక్రెయిన్కు సాయం పేరిట పరిస్థితి మరింత విషమించే చర్యలకు స్వస్తి పలకాలని అమెరికాను కోరాలి. యుద్ధంతో అంతిమంగా మిగిలేది విషాదమేనని గుర్తించాలి. -
చైనాలో కోవిడ్ కేసుల విజృంభణ.. జనవరి 21 తర్వాత పరిస్థితేంటో!
చైనాలో పెరుగుతున్న కోవిడ్ కేసుల ప్రభావం ఇతర దేశాలపై ఏ మేరకు ఉంటుంది? ప్రతి దేశాన్ని కలవరపరుస్తున్న సమస్య. ఏ దేశానికి ఆ దేశం దీనిపై చర్చించుకుంటోంది. తగినన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రభుత్వం, ఆరోగ్యరంగ నిపుణులు దీనిపై అధ్యయనాలు సాగిస్తున్నారు. చైనాలో పరిస్థితి ఏమిటి? ‘జీరో కోవిడ్ పాలసీ’ పేరుతో, గత మూడేళ్లుగా చైనా ప్రభుత్వం కఠిన నిబంధనలను అమలు చేస్తోంది. లాక్ డౌన్, కేంద్రీకృత క్వారంటైన్ విధానం అమలు చేస్తోంది. పెద్ద ఎత్తున టెస్టింగ్, కాంట్రాక్టు ట్రేసింగు విధానాలను చేపట్టింది. దీంతో రోజువారీ కార్యకలాపాల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. వ్యాపార వాణిజ్య వ్యవహారాలు స్తంభించిపోయాయి. దీనిపైన ప్రజల నుంచి ఆందోళన వ్యక్తం కావటంతో, డిసెంబరు మొదటి వారం నుంచి నిబంధనలను సడలించింది. వ్యాక్సినేషన్ ను వేగవంతం చేయటం, ఆసుపత్రుల్లో ఐసీయూ సేవలను మెరుగుపరచటం, యాంటీవైరల్ మందులను పెద్ద ఎత్తున నిల్వ చేయటం వంటి ముందస్తు ఏర్పాట్లు చేసుకోకుండా, నిబంధనలన్నింటిని సడలించటంతో పరిస్థితి అదుపుతప్పింది. ఒక్కసారిగా కోవిడ్ కేసులు పెరిగిపోయాయి. ఆస్పత్రులపైన ఒత్తిడిపెరిగిపోయింది. వైద్యసేవలు అందుబాటులో లేకుండా పోయాయి. ఫార్మశీలు, ఆన్ లైన్ షాపింగ్ ప్లాట్ ఫారాలల్లో మందుల కొరతను ఏర్పడింది. ఫీవర్ హాస్పిటళ్లలో రద్దీ.. యాంటీవైరల్ డ్రగ్ అందుబాటులో లేకుండా పోయింది. స్మశానాలు మృతులతో కిక్కిరిసిపోయాయి. అయినా కేసుల విషయంలోగానీ, మరణాల విషయంలోగానీ, వాస్తవసమాచారాన్ని చైనా బాహ్య ప్రపంచానికి తెలియనివ్వలేదు. కోవిడ్-19కి సంబంధించిన రియల్ టైం సమాచారాన్ని అందించాలని ప్రపంచ ఆరోగ్యసంస్థ అనేక మార్లు విజ్గప్తి చేసింది. ప్రపంచదేశాలు దీనిపై గగ్గోలు చేశాయి. చైనాలో దాదాపు 90 శాతం మంది కోవిడ్ బారిన పడ్డారని అంచనా. అన్ని దేశాల్లో భయాలు చైనాలో జనవరి 21న వచ్చే ‘లూనార్ న్యూఇయర్ హాలిడే’కు ప్రత్యేకత ఉంది. వృత్తి వ్యాపార ఉద్యోగాల రీత్యా వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారంతా స్వగ్రామాలకు వచ్చి కుటుంబాలను కలుసుకోవటం ఆనవాయితీ. ‘లార్జెస్ట్ యాన్యువల్ మైగ్రేషన్’ గా దీనిని చెబుతారు. బస్సులు, రైళ్లు, విమానాలు ప్రయాణికులతో కిటకిటలాడతాయి. కుటుంబాలతో గడిపిన వీళ్లంతా ఆయా ప్రాంతాలకు తిరిగివచ్చేటప్పుడు వైరస్ ను వెంటతెస్తారన్న ఆందోళన సర్వత్రా వ్యక్త మవుతోంది. అదే జరిగితే చాలా దేశాలు ప్రభావితమయయ్యే అవకాశాలున్నాయి. చైనాకు వచ్చేవారు క్వారంటన్లో ఉండవలసిన పనిలేదని కూడా చైనా చెప్పడం ఈ భయాలకు మరో కారణం. ముందు జాగ్రత్త చర్యలు చైనా నుంచి వచ్చే యాత్రికుల విషయంలో అనేక దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. భారత్ పాటు, అమెరికా, ఆస్ట్రేలియా, కెనాడా, జపాన్, దక్షిణ కొరియా, యూకె, అనేక యూరోపియన్ దేశాలు ఇందులో ఉన్నాయి. బ్రిటన్, ఫ్రాన్స్ కొత్తగా జత కలిశాయి. కోవిడ్ నెగెటివ్ నివేదిక ఉంటేనే ప్రయాణానికి అనుమతిస్తామని చెబుతున్నాయి. మరి యూరప్ మాటేమిటి? పెరుగుతున్న కోవిడ్ కేసుల ప్రభావం యూరోపియన్ రీజయన్ పైన అంతగా ఉండకపోవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. యూరోపియన్ రీజియన్ అంటే.. 53 దేశాలు. రష్యాతో పాటు మధ్య ఆసియాలోని దేశాలు అన్నీ ఇందులోకి వస్తాయి. ప్రస్తుత పరిస్థితిపై డబ్ల్యు హెచ్ ఓ యూరోపియన్ డైరక్టర్ హాన్స్ క్లంగ్ మాట్లాడుతూ, ‘‘ ప్రస్తుతానికి యూరోపియన్ దేశాలు ఆందోళన చెందవలసిన పనిలేదు. అలాగని అలసత్వంతో ఉండటానికి వీల్లేదు’’ అని పేర్కొన్నారు. ప్రపంచంలో దాదాపు డజను వరకూ దేశాలు చైనా నుంచి వచ్చే ప్రయాణికులపైన ఆంక్షలు విధించటంలో తప్పు లేదని, అది వివక్ష కిందకు రాదని సమర్థించారు. ఆయా దేశాలు నిఘా ప్రయత్నాలను ముమ్మరం చేయాలని, ఆయా వేరియంట్ల సీక్వెన్సింగ్ ను కొనసాగించాలని చెప్పారు. -
వణుకుతున్న ఉద్యోగులు.. ఏడాది చివరికల్లా మాంద్యంలోకి ఆ దేశాలు!
ఊహించిన దానికన్నా ఎక్కువ కాలం అధిక ద్రవ్యోల్బణం కొనసాగే పరిస్థితులు కనిపిస్తుండటంతో ఈ ఏడాది డిసెంబర్ త్రైమాసికంలో యూరోపియన్ యూనియన్లోని (ఈయూ) చాలా మటుకు దేశాలు మాంద్యంలోకి జారుకోవచ్చని యూరోపియన్ కమిషన్ వెల్లడించింది. ద్రవ్యోల్బణంతో పాటు అధిక వడ్డీ రేట్లు, నెమ్మదిస్తున్న అంతర్జాతీయ వాణిజ్యం తదితర అంశాలు కూడా ఇందుకు కారణం కాగలవని పేర్కొంది. అయితే మాంద్యం ప్రభావం ఎక్కువగా ఉద్యోగులపై ఉండవచ్చని ఇదివరకే నిరూపితం కాగా ప్రస్తుతం పలు ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. దీంతో ఆ దేశాల్లో ఉద్యోగులు భయాందోళనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది (2023) వృద్ధి అంచనాలను 0.3 శాతానికి తగ్గించింది. వాస్తవానికి ఇది 1.4 శాతంగా ఉండవచ్చని జూలైలో అంచనా వేశారు. ఈ ఏడాది ప్రథమార్ధంలో వృద్ధి ఆశ్చర్యకరంగా పటిష్టంగానే ఉన్నప్పటికీ, మూడో త్రైమాసికంలో ఈయూ ఎకానమీ వేగం తగ్గిందని యూరోపియన్ కమిషన్ తెలిపింది. దీంతో వచ్చే ఏడాదికి అంచనాలు గణనీయంగా బలహీనపడ్డాయని తెలిపింది. యూరప్లో అతి పెద్ద ఎకానమీ అయిన జర్మనీ పనితీరు 2023లో అత్యంత దుర్భరంగా ఉండవచ్చని పేర్కొంది. చదవండి: ఏంటి బ్రో, చేరిన 2 రోజులకే నా ఉద్యోగం ఊడింది.. ఓ ఐఐటియన్ బాధ ఇది! -
Russia-Ukraine War: పుతిన్ ‘తప్పు’టడుగులు
ఉక్రెయిన్పై దండయాత్ర రష్యా అధ్యక్షుడు పుతిన్ చారిత్రక తప్పిదమా ? ముందు వెనుక ఆలోచించకుండా యుద్ధానికి దిగి భారీ మూల్యం చెల్లించుకుంటున్నారా? రష్యా సైన్యానికి వరస ఎదురు దెబ్బలు దేనికి సంకేతం ? 200 రోజులు దాటినా ఉక్రెయిన్పై పట్టు కోసం ఇంకా ఆపసోపాలు పడటానికి కారణాలేంటి ? ఉక్రెయిన్పై రష్యా యుద్ధం మొదలు పెట్టి ఏడు నెలలు కావస్తోంది. రోజులు గడుస్తున్న కొద్దీ ఉక్రెయిన్ తమ దేశాన్ని కాపాడుకోవడం కోసం మరింత పట్టుదలగా ముందుకు సాగుతూ ఉంటే, అపారమైన నష్టాన్ని చవి చూసిన రష్యా ఒకరకమైన గందరగోళంలో ఉంది. ఇటీవల ఖర్కీవ్లో ఉక్రెయిన్ సేన చేతిలో రష్యా ఓటమి ఆ దేశానికి గట్టి ఎదురు దెబ్బగా మారింది. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా, ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తున్నా రష్యా ఇప్పట్లో యుద్ధానికి ముగింపు పలుకుందని భావించలేం. ఉక్రెయిన్లో మిలటరీ ఆపరేషన్ కొనసాగుతుందని పుతిన్ ప్రెస్ సెక్రటరీ దిమిత్రి పెస్కోవ్ ఇటీవలే స్పష్టం చేశారు. తూర్పు డోన్బాస్ స్వాధీనమే తమ ముందున్న లక్ష్యమని, దాని సాధనకు తొందరేమీ లేదని తాజాగా షాంఘై సహకార సదస్సు సందర్భంగా పుతిన్ కూడా అన్నారు. యుద్ధం మరిన్ని రోజులు కొనసాగుతుందన్న సంకేతాలు ఇచ్చారు. కానీ యుద్ధంలో రష్యా ఆత్మరక్షణలో పడిపోవడానికి కారణాలపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఉక్రెయిన్కు పశ్చిమదేశాల అండ అమెరికా సహా నాటో దేశాలన్నీ కలసికట్టుగా ఉక్రెయిన్కు ఇంతగా అండగా ఉంటాయని పుతిన్ ఊహించలేకపోయారు. యుద్ధం ఎన్నాళ్లు సాగినా సాయం కొనసాగించేందుకు అవి సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం ఉక్రెయిన్ అత్యాధునిక ఆయుధాలను ఉపయోగిస్తోంది. హిమార్స్ రాకెట్ వ్యవస్థతోనే ఉక్రెయిన్ సేనలు వందలాది రష్యన్ స్థావరాలను ధ్వంసం చేశారు. హౌటైజర్స్, స్విచ్బ్లేడ్ డ్రోన్లు, రాకెట్ లాంచర్లు, యాంటీ ఎయిర్క్రాఫ్ట్, యాంటీ ఆర్మర్ సిస్టమ్స్ ఉక్రెయిన్ దగ్గర ఉన్నాయి. అమెరికా తాజాగా 1500 కోట్ల డాలర్ల విలువైన సైనిక సాయం చేస్తానని హామీ ఇచ్చింది. దీంతో రష్యా పరోక్షంగా పశ్చిమ దేశాలతోనే యుద్ధం చేయాల్సి వస్తోంది. ఆంక్షలతో ఉక్కిరిబిక్కిరి ఉక్రెయిన్పై దాడులకి దిగితే అమెరికా, యూరప్ దేశాలు ఆంక్షలు విధించినా చమురు, గ్యాస్ కోసం తమపై ఆధారపడతాయని త్వరలోనే ఆంక్షలకి ముగింపు పలుకుతాయని పుతిన్ తప్పుగా అంచనా వేశారు. ఫిబ్రవరి నుంచి రష్యాపై 9,200కిపైగా ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. వెయ్యికి పైగా మల్టీ నేషనల్ కంపెనీలు రష్యాను వీడాయి. ఆయుధాల ఉత్పత్తీ మందగించింది. దాంతో ఉత్తర కొరియా నుంచి కూడా ఆయుధాలు కొనుగోలుకు సిద్ధపడాల్సి వచ్చింది! రష్యాను ఆర్థికంగా చమురు, గ్యాస్ ఎగుమతులు మాత్రమే ఆదుకుంటున్నాయి. పుతిన్ మితిమీరిన ఆత్మవిశ్వాసం యుద్ధం చిటికెలో ముగుస్తుందనే భావనతో రంగంలోకి దిగిన పుతిన్కు ప్రస్తుతం ఏం చేయాలో పాలుపోవడం లేదు. యుద్ధాన్ని ముగిస్తే మంచిదన్న భావన రష్యాలో వివిధ వర్గాల్లో పెరుగుతోంది. ఆత్మవిశ్వాసం, అసహనం ఒకే నాణేనికి చెరోవైపు ఉంటాయన్న వాస్తవాన్ని పుతిన్ గ్రహించుకోలేకపోయారని బ్లూమ్బర్గ్ కాలమిస్ట్ లియోనిడ్ బెర్షిడ్స్కీ అన్నారు. కదనరంగంలో కిరాయి సైనికులు ఉక్రెయిన్లో కిరాయి సైనికుల్ని దింపడం పుతిన్ చేసిన మరో పెద్ద తప్పిదమంటున్నారు. వాగ్నర్ సంస్థతో పాటు పశ్చిమాసియా దేశాలకు చెందిన వారిని కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్పై నియమించుకున్నారు. రష్యా ఇలాంటివారిపై ఆధారపడగా, ఉక్రెయిన్ సైనికులు మాత్రం తమ దేశాన్ని కాపాడుకోవాలన్న తపనతో స్వచ్ఛందంగా యుద్ధరంగంలోకి దిగారు. కాంట్రాక్ట్ సైనికులకి తక్కువ జీతాలు ఇస్తూ ఉండడంతో వారు పూర్తి స్థాయిలో పోరాటపటిమను ప్రదర్శించడం లేదు. తమకు పరిచయం లేని భూభాగంలోకి వచ్చి పోరాడుతున్న రష్యా సైనికులు త్వరగా నిస్సత్తువకి లోనవుతూ ఉంటే, సొంతగడ్డపై స్థానికబలంతో పోరాడే ఉక్రెయిన్ సేనలు నిత్యం ఉత్సాహంగా ఉంటున్నాయి. దీంతో రష్యా స్వాధీనం చేసుకున్న ప్రాంతంలో ఇప్పటివరకు ఉక్రెయిన్ 2,000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని తిరిగి వెనక్కి తీసుకుంది. వ్యూహాత్మక తప్పిదాలు యుద్ధంలో రష్యా పలు వ్యూహాత్మక తప్పిదాలు కూడా చేసింది. ఏప్రిల్లో కీవ్, ఉత్తర ప్రాంతంలో ఉక్రెయిన్ ప్రతిఘటన ధాటికి రష్యా సేనలు వెనుదిరిగాయి. ఆ సమయంలో బలగాలను డోన్బాస్పైకి పంపడం వ్యూహాత్మక తప్పిదమనే అభిప్రాయం వినబడుతోంది. ఇలా చేయడం వల్ల చిత్తశుద్ధితో రష్యా తరఫున పోరాడే సైనికుల్ని త్వరితగతిన దేశం కోల్పోయింది. ప్రస్తుతం కదనరంగంలో ఉన్న రష్యా సైనికుల్లో అంకితభావం కనిపించడం లేదు. ఎంత త్వరగా వెనక్కి వెళ్లి కుటుంబాలతో కలిసి గడుపుతామని వారు ఎదురు చూస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
జనాభా తగ్గినా డేంజరే..
(ఎం. విశ్వనాథరెడ్డి, సాక్షి ప్రతినిధి): జనాభా పెరగడమే అన్ని సమస్యలకు మూలమని ఇప్పటివరకు అందరిదీ అదే భావన. ఇప్పుడు ప్రపంచానికి సవాళ్లు విసురుతున్న అంశాల్లో జనాభా తగ్గుదల కూడా చేరింది. ఈ సమస్య అభివృద్ధి చెందిన దేశాల్లోనే ముందుగా వచ్చింది. ఆర్థికంగా, సాంకేతికంగా బలమైన వ్యవస్థలున్న జపాన్లాంటి దేశమే ఇప్పుడీ సమస్య ఎదుర్కొంటోంది. ఆసియా ఖండంలో ప్రస్తుతం జపాన్ ఒక్కటే ఈ సమస్యను ఎదుర్కొంటుండగా.. ఐరోపా ఖండంలో చాలా దేశాలను పీడిస్తోంది. జనాభా తగ్గుదల నమోదు కావడమంటే.. దేశ జనాభా సరాసరి వయసు పెరగడం. తద్వారా పనిచేసేవాళ్ల సంఖ్య తగ్గిపోతోంది. ఫలితంగా ఆర్థికాభివృద్ధి కుంటుపడటం, ప్రజారోగ్యం మీద ఖర్చు పెరగడంతో పన్నుల భారం పెరుగుతుండటం ఆయా సమాజాల్లో ఇప్పుడు కనిపిస్తోంది. అదే మన దేశంలో ప్రస్తుత సరాసరి వయసు 28.4ఏళ్లు. ఇది ఇప్పుడు మనకు కలిసొచ్చే అంశం. పుడుతున్న ప్రతి వెయ్యి మందిలో మనోళ్లు 171 మంది ప్రపంచంలో ప్రతి నాలుగు నిమిషాలకు దాదాపు వెయ్యి మంది పుడుతున్నారు. వీరిలో అత్యధికంగా 171 మంది మన దేశంలోనే ఊపిరిపోసుకుంటున్నారు. ఆ తర్వాత 102 మందితో చైనా రెండో స్థానంలో.. 56 మందితో మూడో స్థానంలో నైజీరియా ఉన్నాయి. అలాగే, పాకిస్తాన్ 47 మందితో నాల్గో స్థానంలో.. 31 మందితో కాంగో ఐదో స్థానంలో నిలిచింది. ఇలా టాప్–5లో ఆసియా, ఆఫ్రికా దేశాలే ఉన్నాయి. ► ఇక 140 కోట్ల జనాభా ఉన్న భారత్ ఈ జాబితాలో తొలిస్థానంలో ఉండటం పెద్ద ఆశ్చర్యం కాదు. ఎందుకంటే.. ప్రపంచ సరాసరి బర్త్రేట్ కంటే కొద్దిగానే ఎక్కువ. మన దేశంలో బర్త్రేట్ 17.7 ఉంటే, ప్రపంచ బర్త్రేట్ 16.8 ఉంది. ► అదే చైనా ప్రపంచ జనాభాలో నంబర్వన్. కానీ, జననాల సంఖ్య మన కంటే తక్కువగా ఉంది. అక్కడ ఇప్పటికే జనాభా పెరుగుదల మందగించింది. ఇదే తీరు కొనసాగితే.. జనాభా పెరుగుదల ఆగిపోవడం ఎంతోదూరంలో లేదని నిపుణుల అంచనా. ► ఇక నైజీరియా కథ వేరు. ఇక్కడ బర్త్రేట్ (34.2) ప్రపంచ బర్త్రేట్కు రెట్టింపుగా ఉంది. పేదరికం ఎక్కువగా ఉండటం, మహిళలు విద్యకు దూరంగా ఉండటమే ఇందుకు కారణం. సంపద పెరిగితే జనాభా పెరుగుదల డౌన్ సంపద పెరిగిన దేశాల్లో బర్త్రేట్ తగ్గుతోందని గణాంకాలు చెబుతున్నాయి. ప్రపంచ జనాభా పెరుగుదల వేగం మందగించడం 1960లో మొదలైంది. ఇదే తీరు కొనసాగితే.. 2100 సంవత్సరానికి జనాభా పెరుగుదల ఆగిపోతుందని, ఆ తర్వాత ప్రపంచ జనాభా తగ్గుదల ప్రారంభమవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. జనాభా తగ్గుదల మొదలైతే ప్రపంచ జనాభా సరాసరి వయసు పెరగడం మొదలవుతుంది. ఇది జరిగితే సమాజానికి వృద్ధఛాయలు వస్తాయి. చాలా దేశాలు ఇప్పుడీ సమస్యను ఎదుర్కొంటున్నాయి. 2050 నాటికి ప్రపంచంలో 20 దేశాల జనాభా ప్రమాదకరస్థాయిలో తగ్గుతుందని ఐక్యరాజ్యసమితి అంచనా. కానీ, జనాభా తగ్గుదల అంశం మన దేశంలో కనుచూపుమేరలో లేదు. ► యూరోపియన్ యూనియన్ సభ్యదేశాలతో పోలిస్తే పేద దేశంగా పరిగణించే బల్గేరియాలో జనాభా తగ్గుదల ప్రమాదకర స్థాయిలో ఉంది. ఇక్కడ గత మూడు దశాబ్దాల్లో జనాభా 20 శాతం తగ్గిపోయింది. మరో 30 ఏళ్లలో 22.5 శాతం తగ్గుతుందని ఐరాస అంచనా. ► ఇక ఉక్రెయిన్లోనూ బర్త్రేట్ బాగా తగ్గుతోంది. దేశం నుంచి వలసలూ పెరుగుతున్నాయి. ఫలితంగా వచ్చే 30 ఏళ్లలో దాదాపు 20 శాతం జనాభా తగ్గొచ్చు. రష్యా–ఉక్రెయిన్ మధ్య యుద్ధ ప్రభావాన్ని కలిపితే జనాభా మరింత వేగంగా తగ్గొచ్చు. మరోవైపు.. జనాభా తగ్గుతున్న దేశాలన్నీ ఐరోపా ఖండంలో ఉన్నవే. ఆసియాలో ఈ సమస్యలేదు. కానీ, జపాన్ కథ భిన్నంగా ఉంది. 2008లో 12.68 కోట్లు ఉన్న జనాభా ప్రస్తుతం 12 కోట్లకు తగ్గిపోయింది. 2050 నాటికి 10.58 కోట్లకు తగ్గుతుందని అంచనా. జనాభా తగ్గుదల అంటే.. దేశంలో చనిపోతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండటమే. పుట్టుకలు తగ్గుతున్నకొద్దీ.. జనాభా సరాసరి వయసు పెరుగుతుంది. అంటే పనిచేయగలిగే వయస్సున్న జనాభా తగ్గుతారు. 1950లో జపాన్ జనాభా సరాసరి వయసు 22ఏళ్లు. అదే 2020లో 48కు, ఇప్పుడు 49 ఏళ్లకు పెరిగింది. ఈ విషయంలో జపాన్ది తొలిస్థానం. ఫెర్టిలిటీ రేట్ (ఒక మహిళ జన్మనిస్తున్న పిల్లల సంఖ్య) ప్రస్తుతం 1.4 ఉంది. ఇది ప్రపంచ సరాసరిలో సగానికంటే తక్కువ. మన దేశానికి ప్రయోజనాలెన్నో.. మన దేశం విషయానికొస్తే.. ఇక్కడ జనాభా పెరుగుతోంది. 140.2 కోట్ల మందితో రెండో స్థానంలో ఉంది. ప్రపంచ జనాభాలో భారత్ వాటా 17.7 శాతం. దేశంలో ఏటా ఒక శాతం చొప్పున పెరుగుతోంది. త్వరలోనే చైనాను అధిగమిస్తామని నిపుణుల అంచనా. జనాభా పెరుగుదలతో పాటే మన జనాభా సరాసరి వయసూ పెరుగుతోంది. అధికారిక గణాంకాల ప్రకారం.. ► 1970లో దేశ జనాభా సరాసరి వయసు 19.3 ఏళ్లుగా నమోదైంది. ► 2015లో 26.8 ఏళ్లకు.. 2022లో 28.4, 2025లో 30 ఏళ్లు, 2030లో 31.7, 2050లో 38.1 ఏళ్లకు పెరుగుతుందని నిపుణుల అంచనా. ► గట్టిగా పనిచేయగలిగే వయస్సున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండటంవల్ల ఆర్థికాభివృద్ధి వేగంగా పెరుగుతోంది. ► వీరికి పని కల్పించడం ప్రభుత్వాల ముందున్న పెద్ద సవాలు. ► ఈ నేపథ్యంలో.. జనాభా తగ్గుదల సమస్య మనకు ఇప్పట్లో లేకపోయినా, శతాబ్దం తర్వాత మనదీ ఐరోపా దేశాల పరిస్థితే అని అంచనా. -
షాకింగ్ రిపోర్ట్..5జీతో క్యాన్సర్ సోకుతుందా?
మనదేశంలో ప్రస్తుతం వినియోగిస్తున్న 4జీ కంటే పదిరెట్ల వేగంతో 5జీ నెట్వర్క్ అందుబాటులోకి రానుంది.ఈ నెట్ వర్క్ వినియోగంతో ఎన్ని లాభాలు ఉన్నాయో..మానవాళికి ముప్పుకూడా అదే స్థాయిలో ఉన్నట్లు తెలుస్తోంది. గ్రూప్ స్పెషల్ మొబైల్ అసోసియేషన్(జీఎస్ఎంఏ) నివేదిక ప్రకారం.. 50 యూరప్ దేశాల్లో 34 దేశాల్లో ఈ 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ మొత్తంలో సగానికి పైగా ఉన్న 173 ప్రాంతాల్లోని (రీజియన్) 92 ప్రాంతాల్లో టెలికం కంపెనీలు 5జీ నెట్ వర్క్లను లాంఛ్ చేశారు. ఈ నేపథ్యంలో యూరప్లో 5జీ కనెక్టివిటీ కారణంగా క్యాన్సర్ సోకే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతుంది. అయితే 5జీ నెట్ వర్క్ వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయనే అంశంపై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(డబ్ల్యూహెచ్ఓ) పరిశోధనల్ని కొనసాగిస్తుంది. ఆ పరిశోధనల ఫలితాల్ని ఈ ఏడాది చివరి నాటికి విడుదల చేయనుంది. అదే సమయంలో భారత్లో సైతం 5జీ నెట్ వర్క్ వినియోగంలోకి రానుంది. అప్పుడే మనదేశంలో సైతం 5జీతో ఆరోగ్యంపై ప్రమాద అంచనాలకు సంబంధించిన రిపోర్ట్ వెలువరించే అవకాశం ఉండనుంది. 2020 నుంచే డబ్ల్యూహెచ్ఓ 2020నుంచి డబ్ల్యూహెచ్ఓ 5జీ రేడియో ఫ్రీక్వెన్సీ పరిధిని కవర్ చేస్తూ..ఆ ఫ్రీక్వెన్సీల వల్ల తలెత్తే ప్రమాదాల్ని అంచనా వేయడం ప్రారంభించింది. కొత్త సాంకేతికత ప్రపంచవ్యాప్తంగా విస్తరించినందున, 5జీ ఎక్స్పోజర్ వల్ల కలిగే ఆరోగ్య ప్రమాదాలకు సంబంధించిన శాస్త్రీయ ఆధారాలను సమీక్షిస్తోంది. క్యాన్సర్, సంతానోత్పత్తి ప్రమాదాలు? 5జీ టెక్నాలజీతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మానవాళి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందనే అందోళనలున్నాయి. 2021లో,5జీ వల్ల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనని యూరోపియన్ పార్లమెంటరీ రీసెర్చ్ సర్వీస్ యొక్క ఫ్యూచర్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్యానెల్ అధ్యయనం చేసింది. ఈ అధ్యయనంలో 450 నుండి 6000 ఎంహెచ్జెడ్ ఎలక్ట్రో మోటీవ్ ఫోర్స్తో గ్లియోమాస్, ఎకౌస్టిక్ న్యూరోమాలకు సంబంధించి మానవుల్లో క్యాన్సర్ కారకమని నిర్ధారించింది. వీటివల్ల పురుషుల సంతానోత్పత్తి, స్త్రీ సంతానోత్పత్తిపై ప్రభావం చూపనుంది. గర్భం, నవజాత శిశువుల అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉండవచ్చు అని" ప్యానెల్ తెలిపింది. అప్పటి వరకు 5జీని నిలిపివేయాలి సాంకేతికత అనేక ప్రయోజనాలను అందిస్తున్నప్పటికీ, ప్రజారోగ్య నిపుణులు, పర్యావరణవేత్తలు 5జీ ప్రమాదాల గురించి ఆయా దేశాల ప్రభుత్వాల్ని హెచ్చరిస్తూ వస్తున్నారు. "యూరోపియన్ ఏజెన్సీల ద్వారా 5జీ ఎఫెక్ట్పై అధ్యయనాలు జరుగుతున్నప్పటికీ, 5జీతో వందశాతం సురక్షితం అని తేలే వరకు ఆ నెట్ వర్క్లపై ప్రయగాలు, ప్రచారాల్ని నిలిపివేయాలని అని పర్యావరణ న్యాయవాది ఆకాష్ వశిష్ఠ చెప్పారు. చదవండి👉 5జీ పరుగులు ఒకవైపు.. ‘పాత తరం ఫోన్’ అడుగులు మరొకవైపు: ఏమిటో వింత పరిణామం! -
ఆహార, ఇంధన సంక్షోభం పశ్చిమ దేశాల పుణ్యమే: పుతిన్
మాస్కో: ప్రపంచవ్యాప్తంగా నానాటికీ పెరుగుతున్న ఆహార, ఇంధన సంక్షోభానికి పశ్చమ దేశాలే కారణమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోపించారు. తప్పులన్నీ అవి చేసి, ఇప్పుడు నెపాన్ని రష్యాపై మోపుతున్నాయంటూ మండిపడ్డారు. రష్యాపై అవి విధించిన ఆంక్షలు ప్రపంచ మార్కెట్లను మరింతగా కుంగదీయడం ఖాయంమని జోస్యం చెప్పారు. యూరప్ దేశాల మతిలేని విధానాల వల్లే రెండేళ్లుగా ద్రవ్యోల్బణం పెరిగిపోతోందన్నారు. ఉక్రెయిన్ నుంచి ఆహార ధాన్యాల ఎగుమతులను రష్యా అడ్డుకోవడం లేదని స్పష్టం చేశారు. ‘‘ఇదంతా పశ్చిమ దేశాల తప్పుడు ప్రచారమే. ఉక్రెయిన్ తన రేవు పట్టణాల్లోని తీర జలాల నుంచి మందుపాతరలను తొలగించే పక్షంలో అక్కడి నుంచి ఆహార ధాన్యాల రవాణాకు భరోసా కల్పిస్తాం’’ అని పునరుద్ఘాటించారు. -
Russia Ukraine war: ఉక్రెయిన్ శిథిలాల్లో ఆయుధ కంపెనీల... కాసుల పంట
ఉక్రెయిన్లో జరుగుతున్న యుద్ధంలో విజేతలెవరు? రష్యా వంటి అత్యంత శక్తివంతమైన దేశం మూడు నెలలుగా యుద్ధం చేస్తున్నా ఉక్రెయిన్ వంటి చిన్న దేశంపై పట్టు చిక్కలేదు. పైగా సైనికంగా, సాయుధ సంపత్తి పరంగా అపార నష్టం చవిచూస్తోంది. అంతర్జాతీయంగా, దౌత్యపరంగా తీవ్ర వ్యతిరేకతనూ మూటగట్టుకుంది. అంతర్జాతీయ సాయంతో రష్యాను ఉక్రెయిన్ ఢీకొడుతున్నా, ఆ దేశం నిండా శిథిల నగరాలే దర్శనమిస్తున్నాయి. మరి ఇంతకూ ఈ యుద్ధంలో గెలుస్తున్నదెవరు? రష్యానా, ఉక్రెయినా? రెండూ కాదు. అమెరికా, పాశ్చాత్య దేశాల ఆయుధ కంపెనీలదే అసలు విజయంగా కన్పిస్తోంది... ఉక్రెయిన్లో రష్యా యుద్ధం వల్ల ఆయుధ కంపెనీల పంట పండుతోంది. అమెరికాతో సహా అనేక దేశాలు ఉక్రెయిన్కు సరఫరా చేస్తున్న ఆయుధాలు ఈ కంపెనీల్లో తయారవుతున్నవే. ప్రపంచంలోని అతి పెద్ద ఆయుధ తయారీ సంస్థ లాక్హీడ్ మార్టిన్తో పాటు టాప్ సెవెన్ కంపెనీలు అమెరికావే. అమెరికా, యూరప్ల్లోని ఆయుధ కంపెనీలు చాలావరకు ప్రైవేట్ సంస్థలే. ఐదేళ్లుగా పెద్దగా వ్యాపారం సాగక సతమతమవుతున్న ఈ సంస్థలు ఉక్రెయిన్ యుద్ధం పుణ్యామా అని లాభాల బాట పట్టాయి. అమెరికాతో సహా నాటో దేశాలు ఉక్రెయిన్కు అందిస్తున్న సాయంలో చాలావరకు ఆయుధాల రూపంలోనే అందుతోంది. విమాన విధ్వంసక స్ట్రింగర్, ట్యాంకు విధ్వంసక జావలిన్ ఆయుధ వ్యవస్థలను తయారు చేస్తున్నది అమెరికాకు చెందిన లాక్హీడ్ మార్టిన్, రేథియాన్లే. యుద్ధం మొదలవగానే మార్చిలో లాక్హీడ్ సంస్థ షేరు విలువ ఒక్కసారిగా 16 శాతం పెరిగింది. రేథియాన్ సంస్థ షేరు విలువ 8 శాతం, యూరప్లో అతిపెద్ద ఆయుధ కంపెనీ బీఏఈ షేరు విలువ ఏకంగా 26 శాతం పెరిగాయి. అమెరికాకు చెందిన జనరల్ డైనమిక్స్ షేరు 12 శాతం, నార్త్రోప్ గ్రూమన్ షేరు 22 శాతం పెరిగాయి. కాంగ్రెస్ సభ్యులకు కాసుల పంట అమెరికా కాంగ్రెస్ సభ్యుల్లో చాలామందికి ఆయుధ కంపెనీల్లో షేర్లున్నాయి. ఉక్రెయిన్–రష్యా యుద్ధం వారికి లాభదాయకంగా మారిందన్నది బిజినెస్ ఇన్సైడర్ పత్రిక కథనం. కనీసం 20 మంది కాంగ్రెస్ సభ్యులకు, లేదా జీవిత భాగస్వాములకు లాక్హీడ్ మార్టిన్, రేథియాన్ సంస్థల్లో నేరుగా షేర్లున్నాయి. మరెందరో వాటిలో చాలాకాలంగా పెట్టుబడులు పెట్టారు. యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ కొత్తగా షేర్లు కొన్నవారికీ కొదవ లేదు. రిపబ్లికన్ పార్టీ సభ్యుడు మార్జోరీ టైలర్ గ్రాన్ ఉక్రెయిన్ యుద్ధం మొదలవడానికి రెండు రోజుల ముందు అంటే ఫిబ్రవరి 22న లాక్హీడ్ మార్టిన్ సంస్థలో పెట్టుబడులు పెట్టారు. పైగా, ‘యుద్ధం రాజకీయ నాయకులకు మంచి వ్యాపారం’ అంటూ ట్వీట్ కూడా చేశారు! టెనెసీకి చెందిన మరో రిపబ్లికన్ సభ్యురాలు డయానా హార్స్బర్జర్ తన భర్తతో కలిసి రేథియాన్ షేర్లు కొన్నారు. ఉక్రెయిన్కు ఆయుధ సాయం కోసం అధ్యక్షుడు జో బైడెన్ కాంగ్రెస్లో ముందు పెట్టిన ప్రతిపాదనలు చకచకా ఆమోదం పొందుతున్నాయి. పైగా అడిగినంత కంటే ఎక్కువ నిధులు కేటాయిస్తున్నారు. బిలియన్లు గుమ్మరిస్తున్న యూఎస్ ఉక్రెయిన్కు బైడెన్ ప్రభుత్వం ఇప్పటి వరకు 4,000 కోట్ల డాలర్లకు పైగా నిధులిచ్చేందుకు సిద్ధమైంది. దాంతో ఉక్రెయిన్ యుద్ధం కోసం గత రెండు నెలల్లోనే అమెరికా మంజూరు చేసిన సాయం ఏకంగా 5,300 కోట్ల డాలర్లను దాటింది. ఇందులో చాలావరకు ఆయుధ రూపంలో అందేదే. గత రెండు దశాబ్దాల్లో అమెరికా ఇచ్చిన అతిపెద్ద విదేశీ సాయం ఇదే! యుద్ధం సాగే కొద్దీ ఉక్రెయిన్కు సాయాన్ని ఇంకా పెంచుతానంటూ హామీకూడా ఇచ్చింది. ‘‘ఉక్రెయిన్ యుద్ధంలో అమెరికా ఆయుధ కంపెనీలు కాసుల పంట పండించుకుంటున్నాయి. రెండో ప్రపంచ యుద్ధ కాలంలోనూ ఇదే విధంగా జరిగింది’’ అని రిటైర్డ్ మేజర్ జనరల్ జి.డి.భక్తి గత చరిత్రను గుర్తు చేశారు. యూరప్ దేశాలూ... ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాతో సరిహద్దు పంచుకుంటున్న పలు యూరప్ దేశాలు తమ రక్షణ కేటాయింపులను భారీగా పెంచుకుంటున్నాయి. జర్మనీ రక్షణ కేటాయింపులు జీడీపీలో 1.5 శాతం నుంచి 2 శాతానికి పెరగనున్నాయి. జపాన్ 60 ఏళ్ల తర్వాత తమ జీడీపీలో ఒక శాతానికిపైగా నిధులను రక్షణ అవసరాలకు కేటాయించబోతోంది. అమెరికా రక్షణ నిధులు కూడా వచ్చే ఏడాది ఎన్నడూ లేనంతగా జీడీపీలో 3.5 శాతం నుంచి 5 శాతానికి చేరొచ్చన్నది బ్యాంక్ ఆఫ్ అమెరికా నిపుణుల అంచనా. – సాక్షి, నేషనల్ డెస్క్ -
2 నుంచి ప్రధాని మోదీ విదేశీ పర్యటన
న్యూఢిల్లీ: ఈ ఏడాది ప్రధాని మోదీ మొట్టమొదటి విదేశీ పర్యటన ఖరారైంది. ఈనెల 2 నుంచి 4వ తేదీ వరకు ప్రధాని జర్మనీ, ఫ్రాన్సు, డెన్మార్క్లను సందర్శించనున్నారని శనివారం ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఉక్రెయిన్ సంక్షోభం విషయంలో యూరప్ దేశాలు రష్యాకు వ్యతిరేకంగా ఏకమైన నేపథ్యంలో జరుగుతున్న ప్రధాని పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఏడు దేశాలకు చెందిన 8 మంది నేతలతో ద్వైపాక్షిక, బహుళపాక్షిక చర్చలు జరుపుతారు. మొదటగా జర్మనీకి, తర్వాత డెన్మార్క్కు వెళ్లనున్న ప్రధాని తిరుగు ప్రయాణంలో పారిస్లో కొద్దిసేపు ఆగి, అధ్యక్షుడు మాక్రాన్తో భేటీ అవుతారు. -
Russia-Ukraine war: యూరప్ ఆర్థికం.. అస్తవ్యస్తం
బ్రసెల్స్: ఉక్రెయిన్–రష్యాల మధ్య ఉద్రిక్తతలతో యూరప్ దేశాలు నానా తంటాలు పడుతున్నాయి. యుద్ధ ప్రభావాలతో ఇంధనాల రేట్లు ఎగిసిన నేపథ్యంలో.. ఉమ్మడి కరెన్సీగా యూరోను ఉపయోగించే 19 దేశాల్లో ధరల పెరుగుదల ఏప్రిల్లో మరో రికార్డు స్థాయికి చేరింది. మార్చిలో ద్రవ్యోల్బణం 7.4 శాతంగా ఉండగా.. తాజాగా ఏప్రిల్లో ఇది 7.5 శాతానికి చేరింది. దీంతో యూరోజోన్లో వరుసగా ఆరో నెలా కొత్త రికార్డు స్థాయి నమోదైనట్లయింది. ఫలితంగా కరోనావైరస్ మహమ్మారి నుంచి బైటపడే అవకాశాలపై తీవ్ర ప్రభావాలు పడతాయన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. యూరోజోన్ దేశాల్లో 34.3 కోట్ల మంది పైగా ప్రజలు ఉన్నారు. అమెరికాలో ద్రవ్యోల్బణాన్ని రికార్డు స్థాయికి ఎగదోసిన అంశాలే ప్రస్తుతం యూరోజోన్లో ధరల పెరుగుదలకు కారణమని పరిశీలకులు తెలిపారు. ఇంధన ధరలు 38 శాతం అప్.. ఉక్రెయిన్పై రష్యా దాడులతో ఇంధన ధరలు 38 శాతం పెరిగాయని యూరోస్టాట్ వెల్లడించింది. యుద్ధ ప్రభావంతో ప్రపంచంలోనే అతి పెద్ద చమురు ఎగుమతి దేశాల్లో ఒకటైన రష్యా నుంచి చమురు, గ్యాస్ సరఫరాల్లో ఆటంకాలు ఏర్పడతాయన్న ఆందోళనల కారణంగా ఈ రెండు ఉత్పత్తుల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. చమురు ఎగుమతి దేశాలు, రష్యా సహా వాటి అనుబంధ దేశాలు.. ఉత్పత్తిని పెంచే విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తుండటంతో సమస్య మరింత జటిలం అవుతోంది. ఇక ముడి సరుకులు, విడిభాగాల సరఫరాలో అవరోధాలు దీన్ని ఇంకా తీవ్రం చేస్తున్నాయి. ప్రజలు, ప్రభుత్వాలకు ద్రవ్యోల్బణం సెగ గట్టిగానే తగులుతోంది. భవిష్యత్తుపై దీనిపై తీవ్ర ఆందోళన నెలకొంది. ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. ఇంధన అవసరాల కోసం రష్యా మీద ఆధారపడిన యూరప్ దేశాల పరిస్థితి ప్రస్తుతం ముందు నుయ్యి వెనుక గొయ్యి లాగా తయారైంది. ఉక్రెయిన్ మీద దాడికి దిగిన రష్యా మీద రాజకీయ అవసరాల రీత్యా పోటాపోటీగా ఆంక్షలు ప్రకటించక తప్పడం లేదు. కానీ వాటిని పాటించే పరిస్థి తి లేదు. తమ తమ దేశాల్లో హీటింగ్, విద్యు త్, ఇంధన అవసరాల రీత్యా రష్యా నుంచి ఇంధన దిగుమతులను రద్దు చేసుకునే పరిస్థితుల్లో అవి లేవు. ఇలా రష్యా–ఉక్రెయిన్ యుద్ధం మొత్తం మీద యూరోజోన్ ఆర్థిక రికవరీకి తీవ్ర విఘాతం కలిగించేదిగా మారిందని ఫిచ్ రేటింగ్స్ ఎకనమిక్స్ టీమ్ డైరెక్టర్ తేజ్ పారిఖ్ అభిప్రాయపడ్డారు. అటు పెరిగిపోతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు వడ్డీ రేట్లను పెంచాలని యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్పై ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. కానీ ధరలను అదుపు చేసేందుకు రేట్లు పెంచితే .. కోవిడ్, ఇంధన కొరత, యుద్ధం వంటి దెబ్బల నుంచి ఎకానమీలు కోలుకోవడానికి విఘాతం కలుగుతుందనే అభిప్రాయాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఒమిక్రాన్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు విధించిన ఆంక్షలతో 2021 తొలి త్రైమాసికంలో ఆర్థిక వృద్ధి 0.3% నుంచి 0.2%కి మందగించడం వీటికి మరింత ఊతమిస్తున్నాయి. తొలి త్రైమాసికం మధ్యలో మొదలైన యుద్ధ (ఫిబ్రవరి 24) ప్రభావాలు రానున్న నెలల్లో కూడా కనిపిస్తాయని విశ్లేషకులు తెలిపారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఉక్రెయిన్ యుద్ధ ఫలితాలతో రెండో త్రైమాసికంలో యూరోజోన్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) మంద గించే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. ఏప్రిల్లో ద్రవ్యోల్బణం ఎగియడాన్ని చూస్తే జూలైలో ఈసీబీ వడ్డీ రేట్లు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయని వివరించారు. -
యూరప్ దేశాలు ఇకనైనా మేలుకోవాలి: జైశంకర్
న్యూఢిల్లీ: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో తటస్థ వైఖరిని అవలంబిస్తున్నందుకు భారత్ను విమర్శిస్తున్న వారిపై విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఎదురు దాడికి దిగారు. ఆసియాకు ఎదురవుతున్న సవాళ్లను పశ్చిమ దేశాలు ఇప్పటిదాకా పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. ‘అఫ్గానిస్తాన్తోపాటు పలు ఆసియా దేశాల్లో పరిణామాలు ప్రపంచానికే ప్రమాదకరంగా పరిణమించినా యూరప్ దేశాలు పట్టించుకోలేదు. పైపెచ్చు మరింత వాణిజ్యం చేయాలంటూ మాకు సలహాఇచ్చాయి’ అని మంగళవారం ‘రైజినా డైలాగ్’ కార్యక్రమంలో ఆయన విమర్శించారు. నార్వే, లక్జెమ్బర్గ్ విదేశాంగ మంత్రులు, స్వీడన్ మాజీ ప్రధాని ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఉక్రెయిన్ సంక్షోభం యూరప్ దేశాలకు మేలుకొలుపన్నారు. పదేళ్లుగా ఆసియాలో సవ్యమైన పరిస్థితులు లేవన్నారు. ఆసియాలో ప్రతీ దేశ ప్రాదేశిక సార్వభౌమత్వం ప్రమాదంలో పడినప్పటికీ పశ్చిమ దేశాలకు పట్టలేదని, ఇప్పుడు ఉక్రెయిన్ సంక్షోభంతోనైనా వాళ్లు ఈ ఖండంలో సమస్యలపై దృష్టి సారించాలన్నారు. అఫ్గానిస్తాన్ పరిణామాలు, కోవిడ్ మహమ్మారి, అగ్రరాజ్యాల వైరం ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రభావం చూపాయన్నారు. ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా ఆసియా, ఆఫ్రికా దేశాల్లో ఇంధన ధరల్లో పెరుగుదల, ఆహార కొరత ఏర్పడటంతో పాటు అంతర్జాతీయ సిద్ధాంతాలు, విలువలకు విఘాతం కలిగిందన్నారు. ఇది చదవండి: తంజావూరు రథయాత్రలో అపశ్రుతి.. -
చమురు ఉత్పత్తి పెంచి... యూరప్ను ఆదుకోండి
దోహా/ఇస్తాంబుల్: ‘‘చమురు ఉత్పత్తిని మరింతగా పెంచండి. ఇంధనం కోసం రష్యాపై ఆధారపడకుండా యూరప్ దేశాలను ఆదుకోండి. వాటి భవితవ్యం మీ చేతుల్లోనే ఉంది’’ అని ఒపెక్ దేశాలకు, ముఖ్యంగా ఖతర్కు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ విజ్ఞప్తి చేశారు. ఖతర్లో జరుగుతున్న దోహా ఫోరాన్ని ఉద్దేశించి శనివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. తమ దేశాన్ని రష్యా సర్వనాశనం చేస్తోందని ఆవేదన వెలిబుచ్చారు. ‘‘మా రేవు పట్టణాలను నేలమట్టం చేసింది. దీంతో ఉక్రెయిన్ ఎగుమతులన్నీ నిలిచిపోయాయి. ఇది ప్రపంచమంతటికీ పెద్ద దెబ్బే. మమ్మల్ని లొంగదీయలేక రష్యా అణు బెదిరింపులకు దిగుతోంది. అదే జరిగితే ప్రపంచమంతటికీ పెనుముప్పే’’ అని హెచ్చరించారు. రష్యా–ఉక్రెయిన్ సంక్షోభానికి చర్చలే పరిష్కారమని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ అన్నారు. జెలెన్స్కీతో ఆయన ఫోన్లో మాట్లాడారు. -
జర్మనీతో జట్టు కట్టేలా..!
సాక్షి, అమరావతి: సాంకేతిక విద్యారంగంలో యూరప్ దేశాల్లో.. మరీముఖ్యంగా జర్మనీలోని అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఉన్నత విద్యామండలి ద్వారా ఏర్పాట్లు చేయిస్తోంది. ఇప్పటికే జర్మన్ యూనివర్సిటీతో ఉన్నత విద్యామండలి రెండు విడతల రౌండ్టేబుల్ సమావేశాలను పూర్తి చేయించింది. ‘ఇండో–యూరో సింక్రనైజేషన్’లో భాగంగా జర్మన్ వర్సిటీ ఫర్ అడ్వాన్స్డ్ స్టడీస్, ఏపీ ఉన్నత విద్యామండలి సంయుక్త ఆధ్వర్యంలో ‘జర్మన్–ఏపీ ఫోరమ్ ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్’ పేరుతో వర్చువల్గా సమావేశాలు నిర్వహించిన ఉన్నత విద్యామండలి అధికారులు జర్మనీ ప్రతినిధులతో వివిధ అంశాలపై వివిధ వర్సిటీల ఉప కులపతులు, నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఏపీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అకాడమీ అధికారులు చర్చలు జరిపించింది. తద్వారా జర్మనీలో విద్య, ఉద్యోగ అవకాశాలను మన రాష్ట్ర విద్యార్థులు దక్కించుకునేలా కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. ఉద్యోగాలు దక్కించుకునేలా.. ‘ప్రీ–మాస్టర్ ఇండియా’ పేరుతో మన దేశంలో జర్మనీ ప్రారంభించనున్న కార్యక్రమం ద్వారా రాష్ట్రానికి చెందిన విద్యార్థులు ఆ దేశంలోని అవకాశాలను దక్కించుకోవడానికి వీలుపడుతుంది. ఇక్కడి విద్యార్థులు బీటెక్ ప్రోగ్రామ్లను పూర్తిచేశాక జర్మనీలో మాస్టర్ డిగ్రీని అభ్యసించడంతోపాటు నేరుగా అక్కడి కంపెనీల్లో పని చేసేందుకు వీలు కల్పిస్తారు. దీనిని ఆరు దశల్లో నిర్వహిస్తారు. జర్మనీ కంపెనీల్లో ఉద్యోగావకాశాలు దక్కించుకోవాలంటే మన విద్యార్థులకు మంచి నైపుణ్యాలు, జర్మన్ సంస్కృతి, భాషపై కూడా అవగాహన అవసరం. ఆసక్తి గల విద్యార్థులకు ఆరు దశల కార్యక్రమంలో వీటిని నేర్పిస్తారు. ఇటువంటి అంతర్జాతీయ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల కోసం డ్యూయెల్ డిగ్రీ కార్యక్రమాలు నిర్వహించనుంది. కాగా, ఉన్నత విద్యామండలి అనుమతితో క్రెడిట్ ఆధారిత కోర్సుల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అకాడమీ (ఏపీఐటీఏ) చర్యలు తీసుకుంటుంది. అదేవిధంగా విద్యార్థులకు మల్టీ స్కిల్లింగ్ మెథడాలజీలో వివిధ నైపుణ్యాలను అలవర్చనున్నారు. కోర్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్ ద్వారా విద్యార్థులు అంతర్జాతీయ అవకాశాలను అందిపుచ్చుకొనేలా తీర్చిదిద్దనున్నారు. ఇందుకోసం రాష్ట్రంలోని వివిధ వర్సిటీల్లో ఆన్లైన్ కోర్సులను జర్మనీ వర్సిటీ అమలు చేయనుంది. అంతర్జాతీయంగా ఉద్యోగాల వెల్లువ ఆధునిక సాంకేతిక అంశాల్లో రానున్న కాలంలో 1.1 బిలియన్ ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చే అవకాశమున్నట్లు పలు నివేదికలు పేర్కొంటున్న నేపథ్యంలో ఆయా అంశాల్లో విద్యార్థులను తీర్చిదిద్దేలా ప్రణాళికలను అమలు చేయనున్నారు. కాలేజీల్లో పాఠ్యాంశాల్లోని నైపుణ్యాలను క్షేత్రస్థాయిలో వాస్తవికంగా విద్యార్థులు అలవర్చుకునేలా ప్రభుత్వం జిల్లాల వారీగా 47 వేలకు పైగా సూక్ష్మ, మధ్య, భారీ పరిశ్రమలు, వాణిజ్య సంస్థలతో కాలేజీలను అనుసంధానించే కార్యక్రమం చేపట్టింది. ఆయా సంస్థల్లో ఇంటర్న్షిప్ అమలు చేయిస్తోంది. ఉపాధి ఆధారిత శిక్షణ కార్యక్రమాలు చేపట్టింది. బ్లెండెడ్ స్కిల్లింగ్ కోర్సులకు శ్రీకారం చుట్టింది. 55వేల మందికి శిక్షణ మరోవైపు ఆధునిక సాంకేతిక అంశాల్లో విద్యార్థులకు క్షేత్రస్థాయి పారిశ్రామిక అనుసంధానం ద్వారా నైపుణ్య శిక్షణ ఇప్పించడానికి ఏపీఐటీఏ ఇప్పటికే చర్యలు చేపట్టింది. ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజీలకు చెందిన దాదాపు 55 వేల మంది విద్యార్థులు ఏపీఐటీఏలో తమ పేర్లను నమోదు చేసుకున్నారు. వీరికి వివిధ పారిశ్రామిక, ఐటీ సంస్థల ద్వారా నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను అమలు చేయనున్నారు. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా పాఠ్యాంశాలు జర్మనీ ప్రతినిధుల రౌండ్టేబుల్ సమావేశాల్లో చర్చకు వచ్చిన ముఖ్యమైన అంశాల్లో అంతర్జాతీయంగా నాలుగో పారిశ్రామిక విప్లవాన్ని దృష్టిలో ఉంచుకుని పాఠ్యాంశాల్లో చేపట్టాల్సిన మార్పులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచనలతో రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఇప్పటికే పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా పాఠ్యాంశాలు, ప్రణాళికలు ఉండేలా చర్యలు తీసుకుంది. అంతేకాకుండా సంక్లిష్ట సమస్యల పరిష్కారంలో విద్యార్థులకు వాస్తవిక ప్రయోగాలకు అనువుగా పరిశ్రమ ఆధారిత ప్రాజెక్టులకు రూపకల్పన చేయించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, బ్లాక్ చైన్, రోబోటిక్స్, ఆటోమేషన్ తదితర ఆధునిక సాంకేతిక అంశాల్లో విద్యార్థుల నైపుణ్యాలను మెరుగుపర్చేందుకు ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీ ఎస్డీసీ) ద్వారా పెద్దఎత్తున శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేయించింది. ఇవి నిరంతరం కొనసాగేలా ప్రతి డివిజన్లో స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలతోపాటు ప్రత్యేకంగా స్కిల్ యూనివర్సిటీని నెలకొల్పుతోంది. 2,400 మందికి స్కిల్ డెవలప్మెంటు కార్పొరేషన్ ఇప్పటికే శిక్షణ కార్యక్రమాలను పూర్తి చేయించింది. విద్యార్థులకు ఫలితాల ఆధారిత అభ్యాసం (అవుట్కమ్ బేస్డ్ లెర్నింగ్) ద్వారా బీటెక్ రెండో ఏడాది నుంచే ప్రభుత్వం క్రెడిట్లతో కూడిన నైపుణ్య కోర్సులను కూడా ఏర్పాటు చేయించింది. ఇందులో భాగంగా ఇంజనీరింగ్తో పాటు ఇతర కోర్సుల్లోనూ ప్రభుత్వం ఇంటర్న్షిప్ను తప్పనిసరి చేయించింది. -
యుద్ధం, కోవిడ్–19పై మార్కెట్ దృష్టి
న్యూఢిల్లీ: ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లు అంతర్జాతీయ అంశాలపై అధికంగా ఆధారపడనున్నట్లు నిపుణులు తెలియజేశారు. ఇందుకు అనుగుణంగా మరోసారి ఆటుపోట్లను చవిచూడవచ్చని అభిప్రాయపడ్డారు. అయితే అధిక శాతం సానుకూలంగా ట్రేడయ్యే అవకాశమున్నట్లు అత్యధికులు అంచనా వేశారు. దేశీయంగా చెప్పుకోదగ్గ అంశాలు లేకపోవడం దీనికి కారణంకాగా.. రష్యా– ఉక్రెయిన్ మధ్య కొద్ది రోజులుగా నడుస్తున్న యుద్ధం సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. మరోపక్క ఇటీవల చైనాలో తలెత్తిన కోవిడ్–19 కొత్త వేరియంట్ కొన్ని యూరోపియన్ దేశాలకూ విస్తరించనున్న అంచనాలు ఇన్వెస్టర్లను ఆందోళనకు లోనుచేయవచ్చని తెలియజేశారు. ఈ నెల 14న ప్రారంభమైన బడ్డెట్ రెండో దశ చర్చలకూ ప్రాధన్యమున్నట్లు తెలియజేశారు. ఎఫ్పీఐల ఎఫెక్ట్ గత కొద్ది రోజులుగా అమ్మకాలకే ప్రాధాన్యమిస్తున్న విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) తిరిగి ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపనున్నట్లు మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. దీంతో ఈ వారం మార్కెట్లు ర్యాలీ బాటలో సాగవచ్చని చెబుతున్నారు. దేశీయంగా ప్రధాన అంశాలు కొరవడిన నేపథ్యంలో ప్రపంచ సంకేతాలే మార్కెట్లను నడిపించవచ్చని రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ వైస్ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా పేర్కొన్నారు. రష్యా– ఉక్రెయిన్ యుద్ధం, చైనాలో కరోనా పరిస్థితులు, చమురు ధరల కదలికలు వంటివి కీలకమని వ్యాఖ్యానించారు. యుద్ధ పరిస్థితులు ముదరడం, కోవిడ్–19 సవాళ్లు పెరగడం వంటి అంశాలు సెంటిమెంటును దెబ్బతీయవచ్చని తెలియజేశారు. చమురు కీలకం రష్యా– ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో కొద్ది రోజులుగా ముడిచమురు ధరలు మండుతున్నాయి. బ్రెంట్, నైమెక్స్ చమురు ధరలు 110 డాలర్ల స్థాయికి చేరాయి. ఈ నెల మొదటి వారంలో 130 డాలర్లను అధిగమించి 2008 తదుపరి గరిష్టాలను తాకిన సంగతి తెలిసిందే. దీనికితోడు డాలరుతో మారకంలో రూపాయి బలహీనపడుతోంది. 75.5–76 స్థాయిలో కదులుతోంది. గ్లోబల్ ఈక్విటీ మార్కెట్లను దేశీ ఇండెక్సులు అనుసరించవచ్చని శామ్కో సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ యెషా షా పేర్కొన్నారు. దేశీ ఆర్థిక పరిస్థితులను చమురు ధరలు ప్రభావితం చేయగలవని, దీంతో వీటి కదలికలను ఇన్వెస్టర్లు సునిశితంగా పరిశీలించే వీలున్నదని వివరించారు. భారత్ భేష్ వర్థమాన మార్కెట్లతో పోలిస్తే దేశీ మార్కెట్లు ఆకర్షణీయంగా ఉన్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్మార్ట్ లిమిటెడ్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా పేర్కొన్నారు. ఇప్పటికే కనిష్ట స్థాయిల నుంచి పటిష్ట ర్యాలీ చేశాయని, దీంతో ఎఫ్పీఐలు తిరిగి కొనుగోళ్లవైపు దృష్టిపెట్టే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. ఇది మార్కెట్లు మరింత పురోగమించేందుకు దారిచూపవచ్చని విశ్లేషించారు. అంతేకాకుండా మార్కెట్లు ఇప్పటికే యుద్ధ భయాలను డిస్కౌంట్ చేశాయన్నారు.. కాగా.. సమీపకాలంలో దేశీ మార్కెట్లు కన్సాలిడేషన్ బాటలో సాగవచ్చన్నది కొటక్ మహీంద్రా లైఫ్ ఇన్సూరెన్స్ ఈక్విటీ హెడ్ హేమంత్ అంచనా. గత వారం స్పీడ్ గత శుకవ్రారం(18న) హోలీ సందర్భంగా సెలవుకావడంతో 17తో ముగిసిన వారంలో దేశీ స్టాక్ మార్కెట్లు 4 శాతం జంప్చేశాయి. సెన్సెక్స్ 2,314 పాయింట్లు దూసుకెళ్లి 57,864 వద్ద ముగిసింది. నిఫ్టీ 657 పాయింట్లు జంప్చేసి 17,287 వద్ద స్థిరపడింది. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్స్ సైతం 2 శాతంపైగా ఎగశాయి. -
జాగ్రత్త.. కరోనా మళ్లీ విజృంభిస్తోంది!
ఒమిక్రాన్ వేరియెంట్ ఉధృతి తర్వాత Covid-19 కేసులు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. ఈ తరుణంలో మరో వేవ్ ఉండబోదంటూ వైద్య నిపుణులు సైతం ఉపశమనం ఇచ్చే వార్త చెప్పారు. మరి వేరియెంట్.. అదీ ప్రమాదకరమైంది పుట్టుకొస్తే తప్పా భయాందోళనలు అక్కర్లేదంటూ ప్రకటనలు చేశారు. ఈ తరుణంలో అటు అమెరికాలో, ఇటు చైనాలో, ఇంకోపక్క యూరప్ దేశాల్లోనూ కరోనా కేసులు పెరిగిపోతున్న ట్రెండ్ కనిపిస్తోంది. కొవిడ్-19 ట్రెండ్స్ను మానిటర్ చేస్తున్న వేస్ట్వాటర్ నెట్వర్క్ నివేదికల ప్రకారం.. అమెరికాలో కరోనా కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. మార్చి 1వ తేదీ నుంచి మార్చి 10వ తేదీ మధ్య కరోనా కేసుల ఈ పెరుగుదల స్పష్టంగా కనిపించింది. కిందటి నెల ఇదే టైంలో ఈ కేసుల సంఖ్య తక్కువగా నమోదు అయ్యాయి. కారణాలు.. స్కూల్స్ రీ ఓపెనింగ్, ఆఫీసులకు తిరిగి వెళ్తుండడం, మాస్క్ నిబంధనల సడలింపు కారణాల అయి ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. దీనికి తోడు వేడిమి పరిస్థితులతో జనాలు బయటే ఎక్కువగా తిరుగుతున్నారు. ఈ తరుణంలో.. వైరస్ విజృంభిస్తోందని అంచనా వేస్తున్నారు. బ్లూమరాంగ్ డేటా రివ్యూ ప్రకారం.. 530 మురుగు నీటి పర్యవేక్షణ ప్రాంతాల నుంచి శాంపిల్స్ సేకరణ ద్వారా ఒక నిర్ధారణకు వచ్చారు. ఇందులో మార్చి 1-10వ తేదీల మధ్య 59శాతం కేసులు తగ్గుముఖం పట్టగా, 5 శాతం కేసులు స్థిరంగా ఉన్నాయి. అయితే 36 శాతం కేసులు పెరిగినట్లు చూపించాయి. ఈ సర్వేలో ఎంత మేర కేసులు పెరుగుతున్నాయనేది చెప్పకపోయినా.. మురుగు నీటి sewer water లో వైరస్ జాడ గుర్తించినట్లు తెలిపారు. న్యూయార్క్తో సహా పలు ప్రాంతాల్లో కేసులు విపరీతంగా పెరిగినట్లు నివేదికలు చెప్తున్నాయి. ‘‘ఈ ప్రస్తుత ట్రెండ్ మునుముందు కూడా కొనసాగుతుందా? పెరుగుదల ఇలాగే ఉంటుందా? అనే దానిపై నిర్ధారణకు రావడం తొందరపాటు చర్యే అవుతుందని, స్థానిక ఆరోగ్య ప్రతినిధులను పర్యవేక్షణకు ఆదేశించినట్లు.. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సీడీసీ ప్రతినిధి కిర్బీ వెల్లడించారు. ఇదిలా ఉంటే.. యూరోపియన్ దేశాల్లోనూ ఇలాంటి పెరుగుదలే కనిపిస్తోంది. జర్మనీ, స్విట్జర్లాండ్, ఆస్ట్రియా.. ఇతర ఐరోపా దేశాల్లో కేసులు పెరిగిపోతున్నాయి. గత రెండు వారాల్లో కేసులు పెరిగిపోతున్నట్లు ఆయా దేశాల కరోనా గణాంకాలు చెప్తున్నాయి. అక్కడా యూఎస్ తరహా వాతావరణం, ఉక్రెయిన్ యుద్ధ హడావుడి నేపథ్యంలో వలసల కారణాలతో కేసులు పెరిగిపోతుండొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక కరోనా పుట్టినిల్లుగా భావిస్తున్న చైనాలో కేసుల సంఖ్య పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ పరిణామంతో ప్రపంచం ఉలిక్కి పడింది. కరోనా మొదలైనప్పటికీ ఆ దేశంలో హయ్యెస్ట్ కేసులు సోమవారం నమోదు కావడం విశేషం. ఏకంగా 5,280 కేసులు నమోదు అయ్యాయి అక్కడ. ఈ నేపథ్యంలో టెస్టుల సంఖ్య పెంచిన డ్రాగన్ సర్కార్.. కఠిన లాక్డౌన్తో కట్టడికి ప్రత్నిస్తోంది. హాంకాంగ్లోనూ కేసులు గణనీయంగా పెరిగిపోతున్నాయి. భారత్లో మాత్రం ఇందుకు విరుద్ధమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. రోజు రోజుకు కరోనా కేసులు తగ్గుతున్నాయి. వరుసగా రెండోరోజు 3 వేలకు దిగువకు కేసులు నమోదైయ్యాయి. కానీ, మరణాల సంఖ్య మాత్రం వందకు చేరువైంది. కేంద్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ బులిటెన్ మంగళవారం రిలీజ్ చేసిన బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 7 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..2 వేల 568 మందికి వైరస్ ఉందని తేలింది. మొత్తం కేసుల సంఖ్య 4.29 కోట్లకు చేరింది. తాజాగా కరోనా మహమ్మారి కారణంగా 97 మంది మృతి చెందారు. ఇందులో ఒక్క కేరళ నుంచే 78 మరణాలు నమోదయ్యాయి. గత కొంతకాలంగా కరోనా కేసులు తగ్గుతున్నా.. మరణాల సంఖ్యలో మాత్రం తేడా కనిపిస్తోంది. -
జెలెన్స్కీ ఎక్కడ? ఆయన పై మూడు సార్లు హత్యాయత్నం
కీవ్: ఉక్రెయిన్ లొంగిపోతుందని ఎవరైనా భావిస్తే అది పొరపాటే అవుతుందని దేశాధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు. అలాంటివారికి ఉక్రెయిన్ గురించి ఏమీ తెలియదని అన్నారు. జెలెన్స్కీ మాట్లాడిన వీడియో ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆయన ఉక్రెయిన్ విడిచి పొరుగుదేశం పోలండ్కు వెళ్లిపోయినట్లు రష్యా అధికారులతోపాటు మీడియా వెల్లడించింది. పోలండ్లో తలదాచుకుంటున్నట్లు తెలిపింది. అయితే, ఈ ప్రచారాన్ని ఉక్రెయిన్ పార్లమెంట్ తిప్పికొట్టింది. జెలెన్స్కీ పోలండ్కు వెళ్లలేదని, ప్రస్తుతం తమ రాజధాని కీవ్లోనే ఉన్నారని స్పష్టం చేసింది. ఉక్రెయిన్పై రష్యా దాడి మొదలయ్యాక జెలెన్స్కీ భద్రతపై యూరప్ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఆయన ప్రాణాలకు ముప్పు వాటిల్లవచ్చని హెచ్చరించాయి. ఉక్రెయిన్పై గతవారం రష్యా దాడులు ప్రారంభమయ్యాక అధ్యక్షుడు జెలెన్స్కీపై మూడుసార్లు హత్యాయత్నం జరిగినట్లు ‘ద టైమ్స్’ పత్రిక వెల్లడించింది. హత్యాయత్నాల గురించి ఉక్రెయిన్ అధికారులకు సకాలంలో ఉప్పందడంతో జెలెన్స్కీ ప్రాణాలతో బయటపడ్డారని తెలియజేసింది. జెలెన్స్కీని భౌతికంగా అంతం చేయడానికి వాగ్నర్ గ్రూప్, చెచెన్ తిరుగుబాటుదారులతో కూడిన రెండు ముఠాలను ప్రత్యర్థులు రంగంలోకి దించారు. ఈ ముఠాలు ఉక్రెయిన్కు చేరుకున్నాయి. ఉక్రెయిన్పై యుద్ధాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్(ఎఫ్ఎస్బీ)లోని కొందరు సిబ్బంది ఈ హంతక ముఠాల సంగతిని ఉక్రెయిన్కు చేరవేశారు. అప్రమత్తమైన ఉక్రెయిన్ అధికారులు ఆ రెండు ముఠాలను మట్టుబెట్టారు. -
War Updates: ఉక్రెయిన్ సంక్షోభం.. ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమావేశం
Russia-Ukraine War Day 10 LIVE Updates: ఉక్రెయిన్లో రష్యా దాడులు పదో రోజుకు చేరుకున్నాయి. రాజధాని కీవ్, ఖర్కీవ్ నగరాలు రష్యా దాడులతో అట్టుడుకుతున్నాయి. కీవ్లో అయితే కనీసం ప్రతి 10 నిమిషాలకు ఒక పేలుడు జరిగిందని సమాచారం. క్షిపణి దాడులు, యుద్ధ ట్యాంకుల బీభత్సం తీవ్రంగా ఉందని ఉక్రెయిన్ చెబుతోంది. ►ఉక్రెయిన్ సంక్షోభంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉన్నతస్థాయి సమావేశమయ్యారు.. ఉక్రెయిన్లో ప్రస్తుత పరిస్థితులు, భారతీయుల తరలింపు వంటి తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. ఖార్కివ్, సుమీ ప్రాంతాల మినహా ఉక్రెయిన్ నుంచి 10,000 మంది కి పైగా భారతీయులను తరలించినట్లు ఉక్రెయిన్లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. ఖర్కివ్ సుమీలో భీకర యుద్ధం కొనసాతున్నప్పటికీ.. అక్కడి నుంచి కూడా భారతీయులను సురక్షితంగా తరలిస్తామని పేర్కొంది. #WATCH | PM Modi chairs a high-level meeting on the #Ukraine issue. pic.twitter.com/siykicaYfe — The Times Of India (@timesofindia) March 5, 2022 ►ఉక్రెయిన్లో రష్యాకు చెందిన మరో విమానాన్ని ఆ దేశ ఆర్మీ అధికారులు కూల్చివేశారు. చెర్నివ్ సరిహద్దులో రష్యా విమానాన్ని ఉక్రెయిన్ కూల్చేసింది. అయిత పారాచూట్ సాయంతో పైలేట్లు ప్రాణాల రక్షించుకున్నారు. Captured pilots of the #Russian army #Ukraine #Russia pic.twitter.com/Kss0wT3KAG — Pierre Davide Borrelli (@PierreDBorrelli) March 5, 2022 రష్యాపై ఆంక్షలు విధించడం యుద్ధంతో సమానం ►రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యాపై ఆంక్షలు విధించడం యుద్ధంతో సమానమని పేర్కొన్నారు. ఇందుకు నాటో దేశాలు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఆ మేరకు శనివారం మహిళా పైలట్లతో పుతిన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఊహించనిదాకంటే ఉక్రెయిన్పై భీకరంగా యుద్ధం సాగిస్తామని తెలిపారు. ► గత 24 గంటల్లో దాదాపు 2,900 మందితో 15 విమానాలు భారత్కు చేరుకున్నాయని కేంద్ర విదేశాంగశాఖ వెల్లడించింది. ఇప్పటివరకు సుమారు 13,300 మంది భారతదేశానికి తీసుకొచ్చినట్లు తెలిపింది. మరో 24 గంటలలో 13 విమానాలు రానున్నట్లు పేర్కొంది. ఉక్రెయిన్ ప్రజల తిరుగుబాటు రష్యా బలగాలకు వ్యతిరేకంగా ఉక్రెయిన్ ప్రజలు తిరగబడుతున్నారు. యుద్ధాన్ని ఆపాలంటూ రోడ్డెక్కిన ప్రజలు తమ దేశానికి వెళ్లిపోవాలంటూ నినాదాలు చేస్తున్నారు. రష్యా స్వాధీనం చేసుకున్న ఖేర్సన్ నగరంలో వందలాది మంది ఉక్రెయిన్లు రడ్లపైకి వచ్చారు. యుద్ధ ట్యాంకర్లకు కూడా వెరవకుండా రష్యా బలగాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు. కాగా మార్చి 3న ఖేర్సన్ నగరాన్ని రష్యా స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. In this today's video emboldened residents of #Kherson city on the south recently captured by the #Russian Army went to the streets in protest. If this city won't be liberated soon, the Russians may start terrorising them all. pic.twitter.com/KO8dLQSpDm #Ukraine — Olexander Sherba (@SherbaOlexander) March 5, 2022 ఢిల్లీ చేరుకున్న 145 మంది తెలుగు విద్యార్థులు ఉక్రెయిన్ నుంచి శనివారం ఒక్కరోజే 145 మంది తెలుగు విద్యార్థులు ఢిల్లీ చేరుకున్నారు. నాలుగు విమానాల్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన 83 మంది, తెలంగాణకు చెందిన 62 మంది విద్యార్థులు తరలి వచ్చారు. వీరిని సాయత్రం స్వస్థలాలకు పంపనున్నారు. ఉక్రెయిన్కు తిరిగి వచ్చేయండని చెప్పాలని ఉంది ఉక్రెయిన్కు తిరిగి వచ్చేయండి అని తమ పౌరులకు త్వరలోనే పిలుపునివ్వగలమని ఆశిస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. ఇక్కడ ఎలాంటి ముప్పు లేనందున పోలాండ్, రొమేనియా, స్లోవేకియా తదితర దేశాలకు తరలి వెళ్లిన వారు ఉక్రెయిన్కు తిరిగి రావొచ్చు. అని చెప్పే రోజులు దగ్గర్లోనేఉన్నాnయనని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈమేరకు ఫేస్బుక్లో ఓ వీడియో పోస్టు చేశారు. వారం రోజుల్లో 6222 మంది భారతీయులను తరలించాం గతం వారం రోజుల్లో రొమేనియా,మోల్డోవాల నుంచి 6,222 మంది భారతీయులను తరలించినట్లు కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్యా సింధియా తెలిపారు. విద్యార్థులను ఉక్రెయిన్ సరిహద్దు నుంచి 500 కి.మీ దూరంలో ఉన్న బుకారెస్ట్కు తరలించడానికి బదులుగా ఉక్రెయిన్ సరిహద్దుకు 50 కి.మీ దూరంలో ఉన్న సుసేవా ఎయిర్పోర్టు నుంచి విమాన సేవలు అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. మరో 2 రోజుల్లో 1050 మంది విద్యార్థులు భారత్కు చేరుకోనున్నట్లు తెలిపారు. Update on #OperationGanga in Romania & Moldova: - Evacuated 6222 Indians in the last 7 days - Got a new airport to operate flights in Suceava (50 km from border) instead of transporting students to Bucharest (500 km from border) - 1050 students to be sent home in the next 2 days — Jyotiraditya M. Scindia (@JM_Scindia) March 5, 2022 10 వేల మంది రష్యా సైనికులు మృతి: ఉక్రెయిన్ రష్యా సైనిక బలగాల్లో ఇప్పటివరకు 10 వేల మంది రష్యన్ సైనికులు మరణించినట్లు ఉక్రెయిన్ పేర్కొంది. అలాగే పెద్ద సంఖ్యలో ఆయుధాలను ధ్వంసం చేసినట్లు వెల్లడించింది. రష్యాకు చెందిన 269 ట్యాంకులు, 945 సాయుధ పోరాట వాహనాలు, 105 ఆర్టిలరీ వ్యవస్థలు, 50, మల్టీపుల్ లాంచ్ రాకెట్ సిస్టమ్లు, 39 యుద్ధ విమానాలు, 40 హెలికాప్టర్లు ధ్వంసం చేసినట్లు పేర్కొంది. ఉక్రెయిన్లో రష్యా దాడులు గతంతో పోలిస్తే తగ్గుముఖం ఉక్రెయిన్లో రష్యా దాడులు గతంతో పోలిస్తే తగ్గాయని బ్రిటన్ పేర్కొంది. గత 24 గంటల్లో ఉక్రెయిన్లో రష్యా వైమానిక, ఫిరంగి దాడుల రేటు మునుపటి రోజుల కంటే తక్కువగా ఉందని వెల్లడించింది. అయితే రష్యా దళాలు ఉక్రెయిన్ దక్షిణాన పురోగమిస్తున్నాయని పేర్కొంది. ఉక్రెయిన్ కీలక నగరాలైన ఖార్కివ్, చెర్నిహివ్, మారియుపోల్లను తన ఆధీనంలో ఉంచుకునేందుకు పోరాడుతోందని బ్రిటిష్ రక్షణ మంత్రిత్వ శాఖ శనివారం ఉదయం ట్విట్టర్లో పేర్కొంది. అయితే ఈ నాలుగు నగరాలను రష్యా బలగాలు చుట్టుముట్టే అవకాశం ఉందని తెలిపింది. పారిపోలేదు..ఇక్కడే ఉన్నా: ఉక్రెయిన్ అధ్యక్షుడు యుద్ధంలో ఓటమి భయం, ప్రాణ భయంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ.. పోల్యాండ్కు పారిపోయాడంటూ కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో జెలెన్స్కీ ఇన్స్టాగ్రామ్ ద్వారా స్పందించాడు. యుద్ధంలో ఓటమి భయం, ప్రాణ భయంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ.. పోల్యాండ్కు పారిపోయాడంటూ కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో జెలెన్స్కీ ఇన్స్టాగ్రామ్ ద్వారా స్పందించాడు. ఉక్రెయిన్- రష్యా చర్యలకు టర్కీ ఆతిథ్యం ► ఉక్రెయిన్లో యుద్ధంపై చర్చించడానికి టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్ ఆదివారం రష్యాకు చెందిన వ్లాదిమిర్ పుతిన్తో మాట్లాడతారని ఆ దేశ ప్రతినిధి ఇబ్రహీం కలిన్ శనివారం తెలిపారు. ఉక్రెయిన్-రష్యా సంక్షోభాన్ని పరిష్కరించడానికి టర్కీ సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు.. ఈ మేరకు ఇస్తాంబుల్లో మాట్లాడుతూ, ఉక్రెయిన్-రష్యా మధ్య చర్చలకు ఆతిథ్యం ఇవ్వడానికి టర్కీ సిద్ధంగా ఉందని తెలిపారు. అలాగే తక్షణమే పోరాటాన్ని నిలిపివేయాలని పిలుపునిచ్చారు. అయితే టర్కీ ఇటు మాస్కో అటు కైవ్తో గానీ సంబంధాలను వదులుకోలేదని స్పష్టం చేశారు. సుమీలోని భారతీయ విద్యార్థుల పట్ల తీవ్ర ఆందోళన ► ఉక్రెయిన్లోని సుమీలో ఉన్న భారతీయ విద్యార్థుల పట్ల తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ తెలిపారు. భారతీయ విద్యార్థుల తరలింపు కోసం సురక్షితమైన కారిడార్ను రూపొందించడానికి తక్షణ కాల్పుల విరమణ చేయాలని అనేక మార్గాల ద్వారా రష్యన్, ఉక్రేనియన్ ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే విద్యార్థులంతా భద్రతా జాగ్రత్తలు తీసుకోవాలని, షెల్టర్లలోనే ఉండాలని సూచించారు We are deeply concerned about Indian students in Sumy, Ukraine. Have strongly pressed Russian and Ukrainian governments through multiple channels for an immediate ceasefire to create a safe corridor for our students. — Arindam Bagchi (@MEAIndia) March 5, 2022 విదేశీ విద్యార్థులను తరలించేందుకు కృషి చేస్తున్నాం ► సుమీ నగరంలో చిక్కుకుపోయిన వందలాది మంది విదేశీ విద్యార్థులను సురక్షితంగా తరలించేందుకు చేయగలిగినదంతా చేస్తున్నామని ఉక్రెయిన్ విదేశాంగశాఖ పేర్కొంది. రష్యా భయంకర దాడులతో సుమీ నగరం ప్రస్తుతం మానవతా విపత్తు అంచున ఉందని, ఈ నేపథ్యంలో ప్రజలను రక్షించేందుకు తమ శక్తిమేర కృషి చేస్తున్నట్లు ట్వీట్ ద్వారా వెల్లడించింది. 🇺🇦We are doing everything we can to evacuate hundreds of foreign students from the Sumy city. #Sumy is now on the verge of a humanitarian catastrophe due to indiscriminate Russian shelling. Ukraine is doing its best to save and secure people.#StopRussianAggression — MFA of Ukraine 🇺🇦 (@MFA_Ukraine) March 5, 2022 భారతీయుల తరలింపుకు ప్రత్యేక బస్సులు ► ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయుల తరలింపుకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు ఉక్రెయిన్లో ఉన్న ఇండియన్ ఎంబసీ అధికారులు తెలిపారు. పీసోచిన్లో ఉన్న 298 మంది భారతీయులను తరలించేందుకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. Reaching out to our 298 students in Pisochyn. Buses are enroute and expected to arrive soon. Please follow all safety instructions and precautions. Be Safe Be Strong. @opganga @MEAIndia — India in Ukraine (@IndiainUkraine) March 5, 2022 ► ఉక్రెయిన్ పోరాటంలో చేరిన 66 వేల మంది ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో తమ దేశం తరుపున పోరాడేందుకు వివిధ దేశాల్లో ఉన్న 66, 220 మంది ఉక్రెయిన్లు దేశానికి తిరిగి వచ్చారు. ఈ విషయాన్ని ఉక్రెయిన్ దేశ రక్షణశాఖ మంత్రి ఒలెక్సీ రెజినికోవ్ తెలిపారు. ► రష్యాకు షాకిచ్చిన శాంసంగ్ కంపెనీ ఉక్రెయిన్-రష్యాల మధ్య ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ఉక్రెయిన్కు పలు దేశాలు మద్దతు ప్రకటిస్తుంటే.. మరోవైపు పలు కంపెనీలు రష్యాకు షాకిస్తున్నాయి. తాజాగా దక్షిణ కోరియా దిగ్గజం శాంసంగ్ కీలక నిర్ణయం తీసుకుంది. రష్యాకు తమ ఉత్పత్తులు, ఎగుమతులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించి శాంసంగ్ ప్రకటన విడుదల చేసింది. ► ఉక్రెయిన్ యుద్దానికి బ్రేక్! ఉక్రెయిన్ యుద్ధానికి రష్యా బ్రేక్ వేసింది. ఐదున్నర గంటలపాటు విదేశీయుల తరలింపు కోసం ఈ నిర్ణయం తీసుకుంది. ఉదయం 11.30ని. నుంచి ఈ వార్ బ్రేక్ అమలులోకి రానుంది. ఈలోపు విదేశీయులను తరలించే యోచనలో ఉక్రెయిన్ ఉంది.. ► భారత్ చేరుకున్న మరో 629 మంది విద్యార్థులు ఉక్రెయిన్ నుంచి భారత విద్యార్థులు స్వదేశానికి చేరుకుంటున్నారు. శనివారం ప్రత్యేక విమానంలో మరో 629 మంది విద్యార్థులు భారత్కు చేరుకున్నారు. ఆపరేషన్ గంగా పేరిట భారత వాయుసేన విమానాలు రొమేనియా, స్లోకొవియా, పోలండ్ మీదుగా విద్యార్థులను స్వదేశానికి చేర్చుతున్నాయి. ► అణు విద్యుత్ ప్లాంట్ను తిరిగి స్వాధీనం చేసుకున్న ఉక్రెయిన్ శుక్రవారం జరిపిన దాడుల్లో రష్యా బలగాలు జపోరిజ్జియా అణు విద్యుత్ ప్లాంటును స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా, శనివారం ప్రతి దాడుల్లో మళ్లీ జపోరిజ్జియా ప్లాంటును తాము చేజిక్కించుకున్నట్టు ఉక్రెయిన్ పేర్కొంది. ► కీవ్లో వైమానిక దాడి హెచ్చరిక.. ఉక్రెయిన్ రాజధాని కీవ్లో రష్యా బలగాలు వైమానిక దాడులు జరుపుతున్నాయి. ఈ నేపథ్యంలో కీవ్ అధికారులు అక్కడి ప్రజలను హెచ్చరించారు. దాడుల నేపథ్యంలో భద్రత ఉన్న ప్రాంతాలకు వారు వెళ్లిపోవాలని సూచించారు. Air raid alert in Kyiv. Residents should go to the nearest shelter: Ukraine's The Kyiv Independent#RussianUkrainianCrisis — ANI (@ANI) March 5, 2022 ► ఉక్రెయిన్ విజ్ఞప్తిపై నాటో దేశాలు మరోసారి జెలెన్ స్కీకి షాకిచ్చాయి. ‘నో-ఫ్లై జోన్’ విజ్ఞప్తిని నాటో దేశాలు తిరస్కరించాయి. శుక్రవారం రాత్రి బస్సెల్స్లో నాటో విదేశాంగ మంత్రులతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు నాటో జనరల్ సెక్రటరీ స్టోలెన్ బర్గ్ వెల్లడించారు. ► రష్యాలో గూగుల్, యూట్యూబ్ బ్యాన్ ఉక్రెయిన్పై యుద్దం వేళ కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటు ట్విట్టర్, ఫేస్బుక్, బీబీసీ, యాప్ స్టోర్ సేవలను రష్యా నిలిపి వేసింది. మరోవైపు రష్యా స్టేట్ మీడియాపై మెటా, గూగుల్, యూట్యూబ్ నిషేధం విధించాయి. ► ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు కమలా హారిస్ ఉక్రెయిన్ సరిహద్దు దేశాలైన పోలండ్, రొమేనియా దేశాల్లో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కీలక పర్యటన చేపట్టనున్నారు. మార్చి 9-11 మధ్య పోలండ్లో రాజధాని వార్సా, రొమేనియాలోని బుకారెస్ట్లో పర్యటించనున్నట్టు కమలా హారిస్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ సబ్రినా సింగ్ తెలిపారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్, రష్యా సంక్షోభంపై చర్చించనున్నట్టు చెప్పారు. అలాగే ఉక్రెయిన్కు భద్రత, ఆర్థిక, మానవతా సాయం వంటి కీలక అంశాలపైనా కూడా చర్చ జరుగనున్నట్టు తెలుస్తోంది. ► నేడు భారత్కు 15 విమానాలు.. న్యూఢిల్లీ: ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి 11 పౌర విమానాలు, 4 భారత వైమానిక దళం(ఐఏఎఫ్) విమానాలను పంపించినట్లు పౌర విమానయాన శాఖ శుక్రవారం ప్రకటించింది. ఇవి ఉక్రెయిన్ పొరుగు దేశాల నుంచి శనివారం భారత్కు చేరుకుంటున్నాయని తెలిపింది. పౌర విమానాల్లో 2,200 మందికిపైగా భారతీయులు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. వీటిలో 10 విమానాలు ఢిల్లీలో, ఒకటి ముంబైలో ల్యాండవుతాయని వెల్లడించింది. 4 ఐఏఎఫ్ విమానాల్లో ఎంతమంది వస్తారన్న విషయాన్ని స్పష్టం చేయలేదు. ఉక్రెయిన్లో ఉన్న భారతీయులను తొలుత రొమేనియా, హంగేరి, స్లొవేకియా, పోలాండ్ దేశాలకు.. అక్కడి నుంచి ప్రత్యేక విమానాల్లో భారత్కు తరలిస్తున్న సంగతి తెలిసిందే. శుక్రవారం 11 పౌర విమానాలు, 3 ఐఏఎఫ్ విమానాలు 3,772 మందితో భారత్కు చేరుకున్నట్లు పౌర విమానయాన శాఖ వెల్లడించింది. ► రష్యాకు షాక్.. ఉక్రెయిన్కు అండగా నిలిచిన సామ్సంగ్ ఉక్రెయిన్పై యుద్దంతో రష్యాపై ఆంక్షలు పర్వం కొనసాగుతోంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రష్యాకు ఫోన్లు, ఎలక్ట్రానిక్స్ చిప్స్ సరఫరాను నిలిపివేస్తున్నట్టు సామ్సంగ్ ప్రకటించింది. తమ సంస్థ ఉద్యోగుల స్వచ్చంద విరాళాలతో ఉక్రెయిన్కు 6 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని అందిస్తున్నట్టు సామ్సంగ్ పేర్కొంది. సంస్థ సైతం ఒక మిలియన్ డాలర్ల సాయం అందిస్తున్నట్టు సామ్సంగ్ వెల్లడించింది. Samsung Electronics says shipments to Russia have been suspended "due to current geopolitical developments." Samsung is also donating $6 million, including $1 million in consumer electronics, to actively support humanitarian efforts “around the region": The Kyiv Independent — ANI (@ANI) March 5, 2022 ► కీవ్: ఉక్రెయిన్లో రష్యా అణు చెలగాటమాడుతోంది. వారం కింద చెర్నోబిల్ అణు విద్యుత్కేంద్రాన్ని స్వాధీనం చేసుకున్న వైనాన్ని మర్చిపోకముందే మరో అణు ప్లాంట్పై దాడికి తెగబడింది. ఆగ్నేయ ప్రాంతంలో ఎనర్హోడర్ నగరంపై గురువారం అర్ధరాత్రి దాటాక రష్యా దళాలు యుద్ధ ట్యాంకులతో భారీ దాడులకు దిగాయి. దాన్ని ఆక్రమించే ప్రయత్నంలో యూరప్లోనే అతి పెద్దదైన జపోరిజియా అణు విద్యుత్కేంద్రం వద్దా బాంబుల వర్షం కురిపించింది. దీంతో భారీ స్థాయిలో మంటలు చెలరేగాయి. భద్రతా, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన రంగంలోకి దిగి వాటిని ఆర్పేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ దాడుల్లో ప్లాంటులోని శిక్షణ కేంద్రం దెబ్బ తిన్నది తప్పిస్తే అందులోని ఆరు రియాక్టర్లకు ఎలాంటి నష్టమూ వాటిల్లలేదని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) చీఫ్ రాఫెల్ గ్రోసీ అన్నారు. రష్యా దుశ్చర్య యూరప్ వెన్నులో చలి పుట్టించింది. ప్రపంచ దేశాలన్నింటినీ షాక్కు గురిచేసింది. చెర్నోబిల్ అణు విద్యుత్కేంద్రం పేలుడు తాలూకు ఉత్పాతాన్ని తలచుకుని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. రష్యాది మతిమాలిన చర్య అంటూ యూరప్ దేశాలన్నీ దుమ్మెత్తిపోశాయి. -
గ్యాసో లక్ష్మణా!.. యుద్ధంతో యూరప్ ఉక్కిరిబిక్కిరి
నేషనల్ డెస్క్, సాక్షి: ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు, ఉక్రెయిన్పై రష్యా దాడి యూరప్ దేశాలకు ప్రాణ సంకటంగా మారింది. యూరప్ సహజ వాయువు (గ్యాస్) అవసరాల్లో ఏకంగా 40 శాతం దాకా రష్యానే తీరుస్తోంది. జర్మనీకైతే 65 శాతం గ్యాస్ రష్యా నుంచే వస్తోంది. చెక్ రిపబ్లిక్ వంటి చిన్న దేశాలైతే పూర్తిగా రష్యా గ్యాస్ మీదే ఆధారపడ్డాయి. ఈ నేపథ్యంలో యుద్ధం కారణంగా రష్యా నుంచి సరఫరా ఆగిపోయి యూరప్ దేశాలు ఉక్కిరిబిక్కిరయ్యే పరిస్థితి నెలకొంది. పైగా ఉక్రెయిన్పై రష్యా దాడి నేపథ్యంలో నార్డ్ స్ట్రీమ్ 2 పైప్లైన్ భవితవ్యం కూడా అనిశ్చితిలో పడింది. 1,100 కోట్ల డాలర్లతో తలపెట్టిన ఈ 1,222 కిలోమీటర్ల లైన్ రష్యా నుంచి బాల్టిక్ సముద్రం గుండా ఫిన్లాండ్, స్వీడన్, పోలాండ్ మీదుగా జర్మనీ వెళ్తుంది. ఉక్రెయిన్కు మద్దతిస్తున్నందుకు 2021లో యూరప్ దేశాలకు అదనపు గ్యాస్ సరఫరాలను రష్యా ఆపేసినందుకే విలవిల్లాడాయి. గ్యాస్ ధరలు ఏకంగా ఎనిమిది రెట్లు పెరిగి ఆర్థికంగా కూడా దెబ్బ తిన్నాయి. ఈ భయంతోనే ఉక్రెయిన్తో యుద్ధానికి దిగకుండా రష్యాను ఏదోలా అనునయించేందుకు యూరప్ దేశాలు, ముఖ్యంగా జర్మనీ, ఫ్రాన్స్ చివరిదాకా శతవిధాలా ప్రయత్నించాయి. చదవండి: (Vladimir Putin: రష్యాకి ఎక్కడిదీ బరి తెగింపు!.. వాటిని చూసుకొనేనా..?) ముఖ్యంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కాలికి బలపం కట్టుకుని మరీ అమెరికా, రష్యా మధ్య తిరిగారు. తాజాగా కూడా బైడెన్, పుతిన్ చర్చలకు ఆయన రంగం సిద్ధం చేశారు. యుద్ధ నేపథ్యంలో అమెరికా నుంచి గ్యాస్ దిగుమతి చేసుకోవాలనుకున్నా అది ఆర్థికంగా పెను భారమే అవుతుంది. ఏడాదిన్నర క్రితంతో పోలిస్తే యూరప్ దేశాలు ఇప్పటికే గ్యాస్ కొనుగోళ్లపై ఎనిమిది రెట్లకు పైగా వెచ్చిస్తున్నాయి. యూఎస్పై ఆధారపడాల్సి వస్తే ఇది ఏకంగా మరో రెండింతలు కావచ్చని అంచనా. అంతంత మొత్తాలు వెచ్చించేందుకు ఒకవేళ సిద్ధపడ్డా లాభం లేదని విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుతం దేశీయ అవసరాలను తీర్చడానికే అమెరికా ఆపసోపాలు పడుతోంది. ఈ నేపథ్యంలో కనీసం మరికొద్ది నెలల పాటు యూరప్కు గ్యాస్ సరఫరా చేసే పరిస్థితి లేనే లేదని చెబుతున్నారు. చదవండి: (30 ఏళ్ల వివాదం: ఉప్పునిప్పుగా ఉక్రెయిన్–రష్యా బంధం) -
రూపాయికి క్రూడ్ కష్టాలు
ముంబై: రూపాయి అయిదు రోజుల వరుస లాభాలకు మంగళవారం బ్రేక్ పడింది. డాలర్ మారకంలో 29 పైసలు క్షీణించి 74.84 వద్ద స్థిరపడింది. తూర్పు ఐరోపా దేశాల్లో నెలకొన్న భౌగోళిక, రాజకీయ సంక్షోభంతో సరఫరా సమస్యలు తలెత్తవచ్చనే భయాలతో అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు నాలుగు శాతం ఎగిశాయి. బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ ధర 98.79 డాలర్లకు చేరింది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితులు నెలకొనడంతో ఈక్విటీ మార్కెట్లు భారీ పతనాన్ని చవిచూస్తున్నాయి. దేశీయ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడుల ఉపసంహరణ అగడం లేదు. ఈ అంశాలు రూపాయి పతనానికి కారణమైనట్లు ట్రేడర్లు తెలిపారు. ఇంట్రాడేలో రూపాయి 31 పైసలు క్షీణించి 74.86 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. ‘‘అంతర్జాతీయ అనిశి్చతులతో ఫారెక్స్ ట్రేడర్లు రిస్క్ ఆఫ్ వైఖరి ప్రదర్శించారు. ఫెడ్ సమావేశ నిర్ణయాలు వెలువడేంత వరకు రూపాయి పరిమిత శ్రేణిలో ట్రేడ్ అవుతోంది’’ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ దిలీప్ పర్మార్ తెలిపారు. -
రష్యా సహజవాయువు సరఫరా ఆపేస్తే?
ఉరిమి ఉరిమి ఎక్కడో పడిందని.. రష్యా, అమెరికా పంతాలకు పోవడం తమకు చేటు తెస్తుందని సన్నకారు యూరప్ దేశాలు భయపడుతున్నాయి. ఉక్రెయిన్ వంకతో అమెరికా ఆంక్షలు పెంచితే ప్రతిగా రష్యా సహజవాయువు సరఫరా నిలిపివేయవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆంక్షలకు నిరసనగా యూరప్కు రష్యా మొత్తం గ్యాస్ సరఫరా నిలిపివేస్తుందా? అలాంటప్పుడు యూరప్లో ఇంధన సంక్షోభం తప్పదా? చూద్దాం.. ఉక్రెయిన్ను రష్యా ఆక్రమిస్తే తమకు ఇంధన సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని యూరప్ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఉక్రెయిన్ను ఆక్రమిస్తే రష్యాపై యూఎస్ ఆంక్షలు తీవ్రతరం చేస్తుందని, ఇందుకు ప్రతిగా యూరప్కు సరఫరా అయ్యే సహజవాయువును రష్యా నిలిపివేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. యూరప్ దేశాలు సహజవాయువు కోసం రష్యాపై ఆధారపడుతున్నాయి, యూరప్ సహజవాయు అవసరాల్లో మూడింట ఒక వంతు రష్యా సరఫరా తీరుస్తోంది. పైగా ప్రస్తుతం యూరప్ వద్ద సహజవాయు నిల్వలు చాలా తక్కువగా ఉన్నాయి. రష్యా గ్యాస్ సరఫరా నిలిపివేస్తే తాము ఎగుమతి చేస్తామని అమెరికా యూరప్కు హామీ ఇస్తోంది. అయితే రష్యా నుంచి సరఫరా అయినంత సులభంగా అమెరికా నుంచి గ్యాస్ దిగుమతి చేసుకోవడం కుదరదు. ఈ నేపథ్యంలో యూరప్లో ఇంధన సంక్షోభ భయాలు పెరుగుతున్నాయి. గతేడాది శీతాకాలం తీవ్రత అధికంగా ఉండడంతో యూరప్లోని సహజవాయు నిల్వలు చాలావరకు ఖర్చయ్యాయి. పలు దేశాల్లో పునర్వినియోగ ఇంధన ఉత్పత్తి తక్కువగా ఉంది. మరోపక్క అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు దూసుకుపోతున్నాయి. ఇవన్నీ కలిసి తమను అంధకారంలోకి నెట్టవచ్చని పలు చిన్నాచితకా యూరప్ దేశాలు భయపడుతున్నాయి. పూర్తి నిలుపుదల సాధ్యం కాదా? ఆంక్షలను వ్యతిరేకిస్తూ రష్యా సహజవాయు సరఫరా నిలిపివేయాలనుకున్నా, పూర్తి ఎగుమతులను నిలిపివేయడం సాధ్యం కాదని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటివరకు రష్యా అధికారులు గ్యాస్ సరఫరా నిలిపివేయడంపై ఎలాంటి ప్రకటనలు చేయలేదు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న రష్యాకు గ్యాస్ ఎగుమతుల వల్ల చాలా ఆదాయం వస్తోంది. ఇటీవలే ఆ దేశం చైనాతో కూడా ఒప్పందం కుదుర్చుకుంది. అయినా యూరప్ నుంచే రష్యాకు అధికాదాయం లభిస్తోంది. అలాంటప్పుడు పూర్తిగా యూరప్కు ఎగుమతి ఆపితే అది తిరిగి రష్యా ఆర్థిక వ్యవస్థనే దెబ్బతీసే ప్రమాదం ఉందన్నది నిపుణుల మాట. గతేడాది యూరప్కు రష్యా 1.75 లక్షల కోట్ల క్యూబిక్ మీటర్ల గ్యాస్ను సరఫరా చేసింది. ఇందులో పావుభాగాన్ని పైప్లైన్స్ ద్వారా పంపింది. ఆంక్షలు ముమ్మరమైతే ఉక్రెయిన్ నుంచి వెళ్లే పైప్లైన్ సరఫరాను మాత్రం రష్యా నిలిపివేయవచ్చని యూఎస్ మాజీ దౌత్యాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. ఇది నేరుగా జర్మనీపై ప్రభావం చూపుతుంది. అప్పుడు జర్మనీకి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు రష్యా నార్డ్ స్ట్రీమ్ పైప్లైన్ గుండా గ్యాస్ను సరఫరా చేసేందుకు ముందుకువస్తుందని, ఇది యూఎస్కు మరింత కోపాన్ని తెప్పించవచ్చని నిపుణులు భావిస్తున్నారు. యూఎస్ సాయం ప్రపంచంలో అత్యధిక సహజవాయువు ఉత్పత్తిదారుల్లో ఒకటైన అమెరికా, గ్యాస్ ఎగుమతుల్లో కూడా ముందంజలో ఉంది. కానీ యూరప్కు అమెరికా సాయం పరిమితంగానే ఉండవచ్చని నిపుణుల అంచనా. రష్యా సరఫరాలను మించి యూరప్కు అమెరికా గ్యాస్ను పంపాలన్నా భౌగోళిక ఇబ్బందులున్నాయి. అందువల్ల ప్రస్తుతం కన్నా కొంతమేర ఎగుమతులను పెంచడం మాత్రమే యూఎస్ చేయగలదు. అందుకే ఉత్తర ఆఫ్రికా, మధ్యాసియా, ఆసియాల్లోని తన మిత్రపక్షాల నుంచి యూరప్కు సరఫరా పెంచేందుకు చర్యలు తీసుకోవాలని బైడెన్ ప్రభుత్వం భావిస్తోంది. అలాగే పేద దేశాలకు ఎగుమతి చేసే నిల్వలను అధిక ధరల ఆశ చూపి యూరప్కు మరలిస్తోంది. ఉక్రెయిన్ పైప్లైన్ సరఫరాను రష్యా నిలిపివేస్తే యూరప్ దేశాలకు రోజుకు 1.27 షిప్పుల గ్యాస్ను యూఎస్ అదనంగా అందించాల్సిఉంటుంది. యూరప్కు సరఫరా పెంచితే స్వదేశంలో కొరత ఏర్పడవచ్చని కొందరు అమెరికా సెనేటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రష్యా ఇప్పటికే పరోక్షంగా గ్యాస్ సరఫరాను నియంత్రిస్తోందని, అందుకే మార్కెట్లో సహజవాయువు ధర పెరుగుతోందని ఇంధన రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అందుకే చాలారోజులుగా యూరప్ దేశాల్లో ఇంధన బిల్లులు పెరిగిపోతున్నాయని చెప్పారు. ఈ సమస్యను ప్రజలపై పడకుండా చూసేందుకు పలు దేశాలు సబ్సిడీలను అందిస్తున్నాయి. పరిస్థితులను చక్కదిద్దేందుకు గ్యాస్ ఉత్పత్తి మరింత పెంచాలని అమెరికా యత్నిస్తోంది. అమెరికా ప్రయత్నాలు ఫలిస్తాయా? రష్యా నిజంగానే గ్యాస్ సరఫరా నిలిపివేస్తుందా? తేలాలంటే ఉక్రెయిన్ పీటముడి వీడాల్సిఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పరిస్థితి చేయి దాటుతోందా? ఒక్క రోజులోనే లక్ష కోవిడ్ పాజిటివ్ కేసులు..
ఫ్రాన్స్: ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ, యూరప్ దేశాల్లో రోజురోజుకు పరిస్థితి చేజారేలా కనిపిస్తోందని డబ్యూహెచ్ఓ ఆందోళన వ్యక్తం చేసింది. నవంబర్ 24 న ఒమిక్రాన్ దక్షిణాఫ్రికాలో వెలుగుచూసినప్పటినుంచి, ఇప్పటి వరకు 108 దేశాల్లో పంజా విసిరింది. ముఖ్యంగా ఐరోపాలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఫ్రాన్స్ దేశంలో ఒక్కరోజులోనే తొలిసారిగా లక్ష కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మహమ్మారి వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి ఆ దేశంలో అధిక సంఖ్యలో ఒక్కసారిగా కేసులు పెరిగాయి. ఆసుపత్రుల్లో చేరికలు కూడా రెట్టింపయ్యాయి. గడచిన వారంలో ప్రతి వంద మందిలో ఒకరికి కోవిడ్ పాజిటివ్ బయటపడుతోంది. అంతేకాకుండా కొత్తగా నమోదవుతున్న కేసుల్లో అధిక ఇన్ఫెక్షలు ఒమిక్రాన్తో సంబంధం కలిగి ఉంటున్నాయి. రానున్న రోజుల్లో ఒమిక్రాన్ మరింత డామినెట్ చేసే అవకాశం ఉన్నట్లు ఫ్రాన్స్ ప్రభుత్వ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ కోవిడ్ 19 ఉధృతిపై సోమవారం అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. చదవండి: వ్యాక్సిన్ వేయించుకున్నప్పటికీ ఒమిక్రాన్ కాటుకు బలి! మొదటిసారిగా.. -
షాకింగ్!.. ఖరీదైన గిఫ్ట్ల స్థానంలో కుక్క బిస్కెట్లు, షేవింగ్ క్రీమ్లు..
Woman shocked after holiday gifts in her luggage: ఎప్పుడైన మన వస్తువులు పొరపాటున లేక మరేదైన కారణాల వల్లో ఒక్కొసారి మన వస్తువులు వేరేవారికి వారి వస్తువులు మనకి తారుమారు అవుతుండడం సహజం. వీలైతే సాధ్యమైనంత వరకు మార్చుకోగలుగుతాం. అదే ఒక్కొసారి వాళ్ల ఎవరో తెలియకపోడమో లేక ఎప్పుడూ వస్తువులు మారిపోయాయో గుర్తించనట్లయితే కచ్చితంగా మన వస్తువు తెచ్చుకోవడం కాస్త కష్టమే. అచ్చం అలాంటి సంఘటన యూఎస్కి చెందిన ఒక మహిళకు జరిగింది. (చదవండి: 10 వేల సంవత్సరాల వరకు దేశం విడిచిపెట్టి వెళ్లకూడదట!) అసలు విషయంలోకెళ్లితే...యూఎస్కి చెందిన మహిళ యూరప్ విహార యాత్రకు వెళ్లింది. ఆ విహారయాత్రలో తన కోసం స్నేహితులు, బంధువుల కోసం దాదాపు రూ 2 లక్షలు ఖరీదు చేసే బహుమతులను కొనుగోలు చేసింది. అయితే ఆమె ఇటలీలో సుమారు 11 రోజుటు గడిపింది. కొన్ని రోజులు వ్యాపారం నిమిత్తం ప్యారిస్లో ఉంది. అయితే ఆమె విహారయాత్రకు వెళ్లి ఆనందంగా ఇంటికి తిరిగి వచ్చాక తన సూట్కేసుని ఎంతో సంతోషంగా తెరిచి చూస్తుంది. అంతే ఆమె ఒక్కసారిగా షాక్ అవుతుంది. అయితే అందులో ఆమె కొన్న గిఫ్ట్లు బదులు డాగ్ ఫుడ్, పాత టీ-షర్టు, షేవింగ్ క్రీమ్ బాటిల్ ఉన్నాయి. ఆ తర్వాత ఆమె కాసేపటికి తన లగేజ్ ఎయిర్పోర్టులో మారిపోయి ఉంటుందని గుర్తించింది. ఈ మేరకు ఆమె సదరు ఎయిర్లైన్స్కి జరిగిన విషయాన్ని తెలియజేసింది. అయితే సదరు ఎయిర్లెన్స్ కూడా ఆ మహిళకు ఎదురైన అనుభవానికి క్షమపణలు చెప్పడమే కాక సాధ్యమైనంత త్వరలో దీన్ని పరిష్కరిస్తానని హామీ ఇచ్చింది. (చదవండి: ఖాతాదారుడు తాకట్టు పెట్టిన ఆభరణాలను కొట్టేసిన బ్యాంక్ క్యాషియర్!) -
Corona Crisis: ఎంట్రన్స్ టెస్ట్ లేకుండా యూరప్లో చదివే ఛాన్స్ !
వెబ్డెస్క్ : కరోనా ఇంకా కంట్రోల్లోకి రాకపోవడంతో ఎంతో మంది తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూలుకు పంపే విషయంలో సందిగ్ధంలో ఉన్నారు. వ్యాక్సినేషన్లో ముందున్న యూఎస్, యూరప్ దేశాలకు తమ పిల్లల్ని పంపే ప్రణాళికలో సంపన్న వర్గాల ప్రజలు ఉన్నారు. ఇలాంటి వారి కోసం పొర్చుగల్ దేశానికి చెందిన అరేతా పోర్చుగల్ విజన్ ఫండ్ సరికొత్త ప్లాన్తో ముందుకు వచ్చింది. అక్కడే స్థిర నివాసం యూరప్లో రియల్ రంగంలో వ్యాపారం చేస్తోన్న అరేతా పోర్చుగల్ విజన్ ఫండ్ సంస్థ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ సంస్థలో పెట్టుబడులు పెడితే పోర్చుగల్లో పర్మినెంట్గా నివసించే అవకాశం కల్పిస్తామంటూ తెలిపింది. అ అవకాశం పొందాలంటే ఈ సంస్థలో 3,50,000 యూరోలు అంటే మన కరెన్సీలో రూ. 3.09 కోట్లు పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. 2021 జులై 1 నుంచి ఈ స్కీం ప్రారంభించనున్నట్టు ఆరేతా సంస్థ సీఈవో ఆశీష్ సరాఫ్ ప్రకటించారు. చదువు ఒకే పర్మినెంట్ నివాసానికి సంబంధించిన గోల్డెన్ వీసా ఉంటే అనేక ప్రయోజనాలు వర్తిస్తాయి. పోర్చుగల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవచ్చు. ఎన్నాళ్లైన అక్కడే నివసించవచ్చు. దీంతో పాటు యూరోపియన్ యూనియన్ (ఈయూ)లో సభ్య దేశాల్లోకి రాకపోకలు సుళవు అవుతుంది. ఎంట్రన్స్లు, టెస్టులు తదితర వ్యవహరాలు లేకుండా ఈయూ దేశాల్లో చదువుకొవచ్చు. అయితే ప్రభుత్వ ఉద్యోగాలు, ఓటు హక్కు వంటి ప్రయోజనాలు అందవు. యూరప్ క్రేజ్ ఎంత స్వదేశీ అభిమానం మనలో ఉన్నా .... యూరోపియన్ లైఫ్ స్టైల్ అన్నా అక్కడి వాతవరణ పరిస్థితులు అన్నా ఇష్టపడే వారి సంఖ్య ఎక్కువ. ముఖ్యంగా సంపన్న వర్గాల వారికి యూరప్ అంటే వల్లమానిన అభిమానం. అందువల్లే కరోనా సంక్షోభ సమయంలో చాలా మంది సంపన్న వర్గాల వారు విదేశాలకు వెళ్లిపోయారు. వీరిలో చాలా మంది యూరప్కే వెళ్లారు. గోల్డెన్ వీసా 2012లో పోర్చుగీసు ప్రభుత్వతం గోల్డెన్ వీసా పథకం ప్రారంభించింది. ఈ పథకం ప్రకారం రూ. 3.09 కోట్లు పెట్టుబడులు పెట్టిన వారికి సులువుగా పోర్చుగల్లో నివసించే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఈ గోల్డెన్ వీసా గడువు 2021 డిసెంబరుతో ముగియనుంది. కొత్త నిబంధనలతో తిరిగి 2022 జనవరి నుంచి ప్రారంభం కానుంది. అయితే పెట్టుబడి మొత్తం దాదాపు రెట్టింపు కానుంది. దీంతో జులై నుంచి డిసెంబరు వరకు పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు స్థిర నివాసం అవకాశం అరేతా సంస్థ కల్పిస్తోంది . చదవండి : క్రిప్టోకరెన్సీ పై భారీగా ఇన్వెస్ట్ చేస్తోన్న భారతీయులు..! -
మరోసారి అమెరికా ట్రావెల్ ఆంక్షలు ?
వాషింగ్టన్: కోవిడ్ కట్టడి చేసే విషయమై బైడెన్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే నేపథ్యంలో బ్రెజిల్, ఐర్లాండ్, యూకేలతో సహా 26 ఇతర యూరోపియన్ దేశల నుంచి వచ్చే అమెరికా యేతర పౌరుల ప్రయాణాలపై మరోసారి ఆంక్షలు విధించేందుకు సిద్ధమౌతున్నట్టు అమెరికా వైట్ హౌస్ అధికారులు వెల్లడించారు. దక్షిణాఫ్రికా నుంచి వ్యాపించిన కరోనా వైరస్పై ఆందోళనలు నెలకొనడంతో ఆంక్షల జాబితాలో దక్షిణాఫ్రికాని కూడా చర్చనున్నట్టు తెలుస్తోంది. అధ్యక్ష స్థానాన్ని వీడే చివరి రోజుల్లో మంగళవారం నుంచి ట్రావెల్ ఆంక్షలను సడలిస్తున్నట్టు ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలను తిప్పికొట్టిన అమెరికా నూతన అ«ధ్యక్షుడు బైడెన్, తిరిగి ప్రయాణ ఆంక్షలను విధించేందుకు సిద్ధమౌతున్నారు. -
కొత్తరకం కరోనా వైరస్: మహారాష్ట్రలో కర్ఫ్యూ!
ముంబై : యూకేలో బయటపడ్డ కొత్తరకం కరోనా వైరస్తో మహారాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ముంబైతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాల్లో నైట్ కర్ఫ్యూ విధించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుందని ప్రకటించింది. రేపటి(ఈనెల 22) నుంచి జనవరి 5వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని వెల్లడించింది. అదేవిధంగా యూరప్, మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే ప్రయాణికులు 14రోజుల పాటు క్వారంటైన్లో ఉండాలని స్పష్టం చేసింది. వారికి ఐదు లేదా ఏడవరోజు కరోనా పరీక్షలు నిర్వహించి, నెగిటివ్ అని తేలితేనే రాష్ట్రంలోకి అనుమతించనుంది. కరోనా ప్రభావంతో ముందు జాగ్రత్త చర్యగా మహారాష్ట్ర ప్రభుత్వం ఇతర రాష్టాల కంటే ముందుగానే ఆంక్షలు విధించింది. కోవిడ్ వ్యాప్తి నివారణకు సిఎం ఉద్ధవ్ ఠాక్రే అధ్యక్షతన సమావేశమైన కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. (కొత్త కరోనా వైరస్.. బ్రిటన్ నుంచి విమానాలు రద్దు..) కరోనా ముప్పు ఇంకా తొలిగిపోలేదని, ప్రజలందరూ కోవిడ నిబంధనలు తప్పకుండా అనుసరించాలని సీఎం ఉద్ధవ్ కోరారు. మాస్కులు ధరించడం, భౌతికదూరాన్ని పాటించడం వంటి జాగ్రత్తలను పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. యూకేలో బయటపడ్డ కొత్తరకం వైరస్తో ప్రపంచ దేశాలు అప్రమత్తమవుతున్నాయి. ముందు జాగ్రత్త చర్యగా యూకే నుంచి వచ్చే విమానాలపై తాత్కాలిక నిషేధాన్ని విధిస్తున్నాయి. ఇప్పటికే ఫ్రాన్స్, జర్మనీ, కెనడా, ఇటలీ, ఆస్ట్రియా, హాంకాంగ్, సౌదీ అరేబియాలు యూకేకు విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. మనదేశంలోనూ రేపు అర్థరాత్రి నుంచి డిసెంబర్ 31 వరకు యూకేకు నడిచే విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. (కరోనా నిబంధనలు బ్రేక్..నెటిజన్ల ట్రోల్స్ ) -
కొత్త కరోనా వైరస్.. బ్రిటన్ నుంచి విమానాలు రద్దు!
న్యూఢిల్లీ : కరోనా వైరస్ తిప్పలు ప్రజలకు ఇంకా తప్పడం లేదు. ఇప్పటివరకూ ఉన్న కరోనా వైరస్ వల్ల సంవత్సర కాలంలో 7 కోట్ల మందికి పైగా వ్యాధి బారిన పడ్డారు. ఏడాదిగా పీడిస్తున్న ఈ మహమ్మారి తలలు వంచేందుకు ఇప్పటికీ సరైన వ్యాక్సిన్ జనజీవనంలోకి అడుగుపెట్టలేదు. ఇప్పడిప్పుడే కోవిడ్ తీవ్రత నుంచి ఊపిరి పీల్చుకుంటున్న జనాలను బ్రిటన్లో వెలుగు చూసిన ఓ కొత్త రకం కరోనా వైరస్ మళ్లీ వణుకు పుట్టిస్తోంది. ఈ కొత్త వైరస్ కరోనా వైరస్ కంటే వేగంగా వ్యాపిస్తోంది. దీనివల్ల బ్రిటన్లో పరిస్థితి చేయి దాటి పోవడంతో లండన్తోపాటు ఆగ్నేయ ఇంగ్లండ్లో ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. కరోనా వ్యాక్సిన్ దేశమంతా సప్లై అయ్యే వరకూ కొన్ని నెలలపాటూ నిబంధనలు కొనసాగుతాయని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆదేశించారు . క్రిస్మస్ సంబరాలను సైతం రద్దు చేస్తూ ఇంట్లోనే ఉండాలని సూచించారు. చదవండి: యూరప్ను వణికిస్తున్న కరోనా కొత్త రూపం అదే విధంగా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు యూకే నుంచి విమానాల రాకపోకలను నిషేధించాయి. బ్రిటన్ నుంచే వచ్చే విమానాలపై నిషేధం విధించాలని ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కేంద్రాన్ని కోరారు. బ్రిటన్లో వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్ కొత్త మ్యుటేషన్ సూపర్ స్ప్రెడర్లా ఉందని సోమవారం (డిసెంబర్ 21) ఆయన ట్వీట్ చేశారు. తక్షణమే ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాలని కేజ్రీవాల్ కోరారు. కాగా ఇప్పటి వరకు ప్రయాణ నిషేధాన్ని ప్రకటించిన జాబితాలో ఉన్న దేశాలు. 1. ఫ్రాన్స్ : రోడ్డు, వాయు, సముద్రం, రైలు ద్వారా వస్తువుల రవాణాకు సంబంధించిన ప్రయాణాలతో సహా ఆదివారం అర్ధరాత్రి నుంచి 48 గంటల వరకు బ్రిటన్ నుంచి వచ్చే అన్ని ప్రయాణాలను నిలిపివేస్తామని ఫ్రాన్స్ ఆదివారం తెలిపింది. 2. జర్మనీ: ఆదివారం నుంచి బ్రిటన్ నుంచి అన్ని సంబంధాలను ఆపేస్తున్నట్లు పేర్కొంది. ఇది ప్రస్తుతానికి డిసెంబర్ 31 వరకు కొనసాగుతందని పేర్కొంది. కార్గో విమానాలకు మినహాయింపు ఉంటుందని తెలిపింది. 3. ఇటలీ: ఇటీవలే బ్రిటన్ నుంచి తిరిగి వచ్చిన ఇటలీలో ఒక వ్యక్తిలో కొత్త వైరస్ కనుగొన్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 4. ఐర్లాండ్: ఆదివారం అర్ధరాత్రి నుంచి బ్రిటన్ నుంచి వచ్చే అన్ని విమానాలను కనీసం 48 గంటలు నిషేధించనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. 5. కెనడా: కొత్త కరోనా వైరస్ వల్ల యూకే నుంచి అన్ని విమానాలను 72 గంటలు నిషేధిస్తున్నామని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చెప్పారు. 6. నెదర్లాండ్ : బ్రిటన్ నుంచి నెదర్లాండ్స్కు వెళ్లే అన్ని ప్రయాణీకుల విమానాలను జనవరి 1 వరకు నిషేధించినట్లు డచ్ ప్రభుత్వం తెలిపింది. 7. బెల్జియం: యూకే నుంచి బెల్జియంకు వెళ్లే అన్ని విమాన, రైలు ప్రయాణాలను ఆదివారం అర్ధరాత్రి నుంచి కనీసం 24 గంటలు నిలిపివేస్తామని ప్రధాని అలెగ్జాండర్ చెప్పారు. 8. ఆస్ట్రియా : బ్రిటన్ నుంచి ప్రయాణ నిషేధానికి వియన్నా వివరాలు రూపొందిస్తున్నట్లు ఆస్ట్రియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం ప్రెస్ ఏజెన్సీ ఏపీఏకు తెలిపింది. 9. స్వీడన్: బ్రిటన్ నుంచి ప్రజలు ప్రవేశించడాన్నినిషేధించడానికి దేశం సిద్ధమవుతోందని సోమవారం అధికారికంగా పేర్కొంది.. 10. ఫిన్లాండ్: సోమవారం మధ్యాహ్నం నుంచి రెండు వారాల పాటు యూకే నుంచి ప్రయాణీకుల విమానాలను ఫిన్లాండ్లో ల్యాండ్ చేయడానికి అనుమతించరని రవాణా లైసెన్సింగ్ ఏజెన్సీ ట్రాఫికామ్ ఆదివారం ఆలస్యంగా ప్రకటించింది. 11. స్విట్జర్లాండ్: బ్రిటన్, దక్షిణాఫ్రికా నుంచి విమానాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు స్విట్జర్లాండ్ ఆదివారం తెలిపింది 12. బాల్టిక్స్ 13. బల్గేరియా 14. టర్కీ 15. ఇరాన్, 16. రొమేనియా 17. ఇజ్రాయిల్, 18. సౌదీఅరేబియా 19. క్రొయేషియా ఉన్నాయి. భారత్-బ్రిటన్ల మధ్య విమాన సర్వీసులు రద్దు బ్రిటన్లో కరోనా వైరస్ స్ట్రెయిన్ ప్రభావంతో భారత్-బ్రిటన్ల మధ్య విమాన సర్వీసులను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విమానాల రద్దును రేపు అర్ధరాత్రి నుంచి అమలు చేయనుంది. డిసెంబర్ 31 వరకు ఈ నిషేధం కొనసాగనుంది. బ్రిటన్ నుంచి భారత్ వచ్చిన వారికి వారం రోజులు క్వారంటైన్ విధించనుంది. -
యూరప్ను వణికిస్తున్న కరోనా కొత్త రూపం
లండన్/హేగ్/బెర్లిన్: యూరప్ దేశాలను అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ మహమ్మారి ఇప్పుడు మరో రూపం సంతరించుకుని మరింత తీవ్రంగా విజృంభిస్తోంది. ఈ వైరస్ కొత్త రూపం 70 శాతం వేగంగా వ్యాప్తి చెందుతోందంటూ బ్రిటన్ ప్రభుత్వం ఆదివారం నుంచి కఠిన ఆంక్షలు అమల్లోకి తెచ్చింది. ఈ వైరస్ వ్యాప్తి అదుపులోకి వచ్చే వరకు, కొన్ని నెలలపాటు ఆంక్షలు అమల్లో ఉంటాయని ఆ దేశ ఆరోగ్య మంత్రి ప్రకటించారు. అయితే, వైరస్ తమ సరిహద్దులు దాటి లోపలికి ప్రవేశించకుండా పొరుగున ఉన్న పలు యూరోపియన్ యూనియన్ (ఈయూ) దేశాలు పలు ముందు జాగ్రత్తలు ప్రకటించాయి. వైరస్ వ్యాప్తి అదుపు తప్పింది బ్రిటన్లో తాజాగా అమల్లోకి వచ్చిన ఆంక్షలు కొన్ని నెలలపాటు కొనసాగే అవకాశాలున్నాయని ఆరోగ్య మంత్రి మాట్ హాంకాక్ తెలిపారు. ప్రజలంతా ఎంతో ఉత్సాహంగా జరుపుకునే క్రిస్మస్ వేడుకలను రద్దు చేయాలని తాము కోరుకోవడం లేదని ఆయన అన్నారు. అయితే, కొత్త రకం కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు స్పష్టమైన ఆధారాలున్నందున, దానిని అడ్డుకోవ డమే ప్రభుత్వ అభిమతమన్నారు. కొత్త రకం వైరస్ వ్యాప్తి అదుపు తప్పిందని వ్యాఖ్యానిస్తూ ఆయన.. ప్రతి ఒక్కరూ తమకు వైరస్ సోకిందని భావించి అప్రమత్తతతో ఉండాలని కోరారు. కొత్తగా బయటపడిన కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రత 70 శాతం ఎక్కువగా ఉందని హాంకాక్ అన్నారు. ఈ వైరస్తో మరణాలు పెరిగాయా అన్న విషయం నిర్థారణ కాలేదన్నారు. క్రిస్మస్ రోజు కూడా వ్యాక్సినేషన్ వారాంతంలోగా 5 లక్షల మందికి కోవిడ్ టీకా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా శని వారం వరకు 3.50 లక్షల మందికి వ్యాక్సి నేషన్ పూర్తయిందని ఆరోగ్య మంత్రి హాంకాక్ వివరించారు. క్రిస్మస్ రోజున కూడా వ్యాక్సినేషన్ కొనసాగనుంది. కరోనా కొత్త రూపం వ్యాప్తితో దేశంలో తలెత్తిన పరిస్థితులపై చర్చించేందుకు యూకే ఆరోగ్య శాఖ సోమవారం అత్యవసరంగా భేటీ కానుంది. అప్రమత్తమైన ఈయూ దేశాలు బ్రిటన్లో కొత్తరకం కరోనా వైరస్ వ్యాప్తి పై ఈయూ దేశాలు అప్రమత్తమ య్యా యి. ఆదివారం నుంచి జనవరి ఒకటో తేదీ వరకు బ్రిటన్ నుంచి వచ్చే విమానా లపై నెదర్లాండ్స్ నిషేధం విధించింది. యూకే నుంచి అన్ని రకాల ప్రయాణా లను నిషేధిస్తున్నట్లు ఇటలీ తెలిపింది. 24 గంటలపాటు యూకే నుంచి వచ్చే విమా నాలను రద్దు చేస్తున్నట్లు బెల్జియం తెలి పింది. రైలు సర్వీసులను నిలుపుదల చేస్తున్నట్లు వెల్లడించింది. జర్మనీ ప్రభుత్వం కూడా బ్రిటన్ నుంచి వచ్చే విమానాలపై నిషేధించేందుకు యోచిస్తున్నట్లు సమాచారం. యూకే నుంచి వచ్చే వారికి క్వారంటైన్ నిబంధనలను కఠిన తరం చేస్తున్నట్లు చెక్ రిపబ్లిక్ తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏమంటోంది? కరోనా వైరస్ కొత్త రూపం వ్యాప్తిపై యూకే ప్రభుత్వంతో కలిసి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. కొత్త వైరస్ జాడలు సెప్టెంబర్లోనే కనిపించాయని వెల్లడించింది. ఇది వైరస్ కొత్త రూపమా? కాదా? ఎంత వేగంగా వ్యాప్తి చెందుతోంది? అనే విషయాలపై లోతుగా అధ్యయనం జరుపుతున్నట్లు డబ్ల్యూహెచ్వో అధికారి మరియా వాన్ కెర్ఖోవ్ తెలిపారు. ఇలాంటి వైరస్ను ఇప్పటికే డెన్మార్క్, నెదర్లాండ్స్, ఆస్ట్రేలియాలో గుర్తించామన్నారు. ఒక్కో కేసు చొప్పున బయటపడిందనీ, వ్యాప్తి అంతటితో ఆగిపోయిందని వివరించారు. -
రోజుకు 6 లక్షలు
వాషింగ్టన్, లండన్: ప్రపంచ దేశాలను కరోనా సెకండ్ వేవ్ వెన్నులో వణుకు పుట్టిస్తోంది. గత వారం పది రోజులుగా సగటున రోజుకి 5 లక్షల 80 వేల కేసులు నమోదవుతున్నాయి. కేవలం 17 రోజుల్లోనే కరోనా కేసులు 5 కోట్ల నుంచి ఆరు కోట్లకి చేరుకున్నాయి. అంతకు ముందు 4 కోట్ల నుంచి 5 కోట్లకి చేరుకోవడానికి 21 రోజులు పడితే ఈ సారి రికార్డు స్థాయిలో రెండు వారాల్లోనే మరో కోటి కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. థాంక్స్ గివింగ్ ఆందోళన అగ్రరాజ్యం అమెరికా కరోనా మహమ్మారితో చిగురుటాకులా వణికిపోతోంది. గత వారంలోనే అమెరికాలో ఏకంగా 10లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. అమెరికాలో థాంక్స్ గివింగ్ వారం కావడంతో అందరికీ సెలవులు ప్రకటించారు. దీంతో ప్రజలెవరూ అత్యవసరమైతే తప్ప బయటకి రావద్దంటూ ప్రభుత్వం సూచించింది. థాంక్స్ గివింగ్ వారంలో ప్రజలు పెద్ద ఎత్తున కొనుగోళ్లు చేస్తారు. మార్కెట్లు కిటకిటలాడిపోతాయి. దీంతో కేసులు పెరిగిపోతాయన్న ఆందోళన నెలకొంది. ఇప్పటివరకు అమెరికాలో కోటి 30 లక్షల వరకు కేసులు నమోదైతే 2 లక్షల 60 వేల మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. వణుకుతున్న యూరప్ యూరప్లో కేవలం అయిదు రోజుల్లో 10 లక్షల కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య కోటి 60 లక్షలు దాటేసింది. 3 లక్షల 65 వేల మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. అన్ని దేశాలు కఠినమైన ఆంక్షలు విధించినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా నమోదైన కొత్త కేసుల్లో యూరప్ నుంచి 44%, కొత్తగా సంభవించిన మరణాల్లో 49% యూరప్ నుంచి వస్తున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఇక ప్రపంచంలోనే లాటిన్ అమెరికాలో అత్యధికంగా మరణాలు నమోదవుతున్నాయి. ప్రపంచ మరణాల్లో 31శాతం అక్కడే సంభవిస్తున్నాయి. పాక్లో కిటకిటలాడుతున్న ఆస్పత్రులు పాకిస్తాన్నూ సెకండ్ వేవ్ వణికిస్తోంది. కోవిడ్ రోగులతో ఆస్పత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. అక్టోబర్ చివరి వారం నుంచి కరోనా కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. గత వారం రోజులుగా 3 వేల కేసుల వరకు నమోదవుతున్నాయి. వైద్య సదుపాయాలు సరిగ్గా లేకపోవడంతో రోగులకు చికిత్స నందించడం పాక్ ప్రభుత్వానికి భారంగా పరిణమిస్తోంది. భారత్లో 93 లక్షలకి చేరువలో మన దేశంలో కరోనా కేసుల సంఖ్య 92.66 లక్షలకి చేరుకుంది.. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 86.79 లక్షలకి చేరుకున్నట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కొత్తగా మరో 44,489 కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 92,66,705కి చేరుకోగా, 24 గంటల్లో 524 మంది మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 1,35, 223కి చేరుకుంది. అయితే యాక్టివ్ కేసుల సంఖ్య వరసగా పదహారో రోజు 5 లక్షల లోపు ఉండడం అత్యంత ఊరటనిచ్చే అంశం. క్రిస్మస్ వేడుకలకి సన్నాహాలు వచ్చే నెలలో క్రిస్మస్ వేడుకలకి ప్రపంచ దేశాలు సిద్ధమవుతూ ఉండడంతో కేసుల సంఖ్య మరింత తీవ్ర రూపం దాల్చవచ్చునన్న ఆందోళనలు నెలకొన్నాయి. సెలవు దినాల్లో ప్రజలెవరూ బయటకి రాకుండా జర్మనీ, స్పెయిన్, ఇటలీలో కఠినమైన ఆంక్షలు విధిస్తున్నాయి. క్రిస్మస్ వేడుకలు మూడేసి ఇళ్లవారు కలిసి చేసుకోవచ్చునని యూకే ప్రభుత్వం సూచించింది. డిసెంబర్ 23 నుంచి 28 వరకు ప్రయాణాలపై ఆంక్షలు ఉండవంది. -
యూరప్లో థర్డ్ వేవ్!
కరోనా మహమ్మారి యూరప్ దేశాలను వణికిస్తోంది. తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోంది. ప్రతిరోజూ లక్షల సంఖ్యలో కొత్త పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. వేలాది మంది మృత్యువాత పడుతున్నారు. ఫ్రాన్స్, జర్మనీ తదితర దేశాలు బెంబేలెత్తిపోతున్నాయి. లండన్: కరోనా వైరస్ను ఎదుర్కొనే సన్నద్ధతను యూరప్ దేశాలు అసంపూర్తిగా వదిలేశాయని, అందుకే ఈ దుస్థితి దాపురించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రతినిధి డేవిడ్ నబార్రో చెప్పారు. ఆయన తాజాగా స్విట్జర్లాండ్లో మీడియాతో మాట్లాడారు. యూరప్లో వచ్చే ఏడాది ప్రారంభంలోనే కరోనా థర్డ్ వేవ్ మొదలయ్యే ప్రమాదముందని డేవిడ్ అన్నారు. ఈసారి పరిస్థితి ఊహించలేనంత దారుణంగా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికైనా మేల్కొంటే మేలు యూరప్ దేశాలు కరోనా ఫస్ట్ వేవ్ను త్వరగానే అధిగమించగలిగాయి. వైరస్ వ్యాప్తిని సమర్థంగా అదుపు చేశాయి. ఆ తర్వాత కరోనా నివారణకు వేసవి రూపంలో మంచి అవకాశం వచ్చినా యూరప్ దేశాలు ఉపయోగించుకోలేకపోయాయని డేవిడ్ నబార్రో తెలిపారు. కరోనాను ఎదుర్కొనేందుకు వేసవి అనుకూల సమయమని తెలిపారు. ఆయితే, సన్నద్ధతను యూరప్ ప్రభుత్వాలు మధ్యలోనే ఆపేశాయని ఆక్షేపించారు. మౌలిక సదుపాయాలను కూడా విస్మరించాయని అన్నారు. ప్రస్తుతం సెకండ్ వేవ్లోనూ మేల్కోకపోతే థర్డ్ వేవ్ మరింత భీకరంగా ఉంటుందన్నారు. ఇప్పటికైనా వైద్య సదుపాయాలను మెరుగుపర్చాలని, మౌలిక వసతులు ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వాలకు సూచించారు. ఆసియా దేశాలు భేష్ దక్షిణ కొరియా లాంటి ఆసియా దేశాలు కరోనా వ్యాప్తి నియంత్రించడంలో విజయం సాధించాయని డేవిడ్ ప్రశంసించారు. అక్కడ అత్యంత తక్కువ స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయని గుర్తుచేశారు. కరోనాపై యుద్ధంలో ప్రజల భాగస్వామ్యం, సహకారంతోనే ఇది సాధ్యమైందని చెప్పారు. పలు ఆసియా దేశాలు లాక్డౌన్ ఆంక్షలను అర్ధాంతరంగా నిలిపి వేయకుండా కరోనా అదుపులోకి వచ్చేదాకా కొనసాగించాయని, ఇది మంచి పరిణామమని అన్నారు. యూరప్లో అలాంటి సన్నద్ధత కనిపించలేదని డేవిడ్ నబార్రో తెలిపారు. ఎక్కడ.. ఎలా..? ► జర్మనీ, ఫ్రాన్స్లో శనివారం ఒక్కరోజే 33 వేల కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ► స్విట్జర్లాండ్, ఆస్ట్రియాలో నిత్యం వేలాదిగా కొత్తగా కేసులు బయటపడుతున్నాయి. ► టర్కీలో తాజాగా 5,532 కొత్త కేసులు బహిర్గతమయ్యాయి. ► బ్రిటన్ ప్రభుత్వం విధించిన లాక్డౌన్ డిసెంబర్ 2వ తేదీన ముగియనుంది. దేశంలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతుండడంతో లాక్డౌన్ను కొనసాగించే అవకాశం లేదని తెలుస్తోంది. సాధారణ ఆంక్షలే విధించనున్నట్లు సమాచారం. ► బ్రిటన్లో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వచ్చే నెలలో ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. -
యూరప్ నుంచి భారతీయులు వెనక్కి
సాక్షి, హైదరాబాద్ : కరోనా సెకండ్ వేవ్తో గడగడలాడుతున్న యూరప్, అమెరికా తదితర దేశాలు అక్కడున్న విదేశీయులను వెనక్కు పంపించేస్తున్నాయి. ఉద్యోగులు, కూలీలు, ఇతరత్రా వ్యాపార, వాణిజ్య కార్యకలాపాల కోసం ఆ దేశాలకు వెళ్లిన ఇక్కడి వారు తిరిగొస్తున్నారు. అక్కడ నేరాలకు పాల్పడి జైళ్లలో ఉన్న మనవారిని కూడా పంపించేస్తున్నారంటే కరోనా సెకండ్ వేవ్తో ఆ దేశాలు ఎలా వణికిపోతున్నాయో అర్థం చేసుకోవచ్చు.. ప్రస్తుతం హైదరాబాద్కు ప్రతిరోజూ విదేశాల నుంచి 11 అంతర్జాతీయ విమానాలు వస్తున్నాయి. అందులో నిత్యం దాదాపు 2 వేల మంది ప్రయాణికులు వస్తున్నారు. వారిలో ఎక్కువ మంది ఆయా దేశాల్లో కరోనా నెగెటివ్ టెస్టు రిపోర్టులు పట్టుకొని వస్తుండగా, కొందరైతే హైదరాబాద్ విమానాశ్రయంలో దిగాక పరీక్షలు చేయించుకుంటున్నారు. అందుకోసం విమానాశ్రయంలో ప్రత్యేకంగా ఆర్టీపీసీఆర్ పరీక్ష చేసే లేబొరేటరీని ఏర్పాటు చేశారు. కరోనా సెకండ్ వేవ్తో పాశ్చాత్య దేశాలు వణికిపోతున్నాయి. రోజుకు లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలు నమోదవుతున్నాయి. దీంతో కరోనా వైద్యం అందరికీ అందించడం ఆయా దేశాలకు సవాల్గా మారింది. అందువల్ల అవకాశమున్నంత మేరకు విదేశీయులను వారి దేశాలకు పంపించేస్తున్నాయి. హైదరాబాద్కు విమానాల ద్వారా బ్రిటన్, అమెరికా దేశాల నుంచి ఎక్కువ మంది వస్తున్నారని అధికారులు చెబుతున్నారు. ఇటు సింగపూర్, దుబాయ్ల నుంచి కూడా కొందరు వస్తున్నారు. యూరప్లోని వివిధ దేశాలకు చెందిన వారు లండన్కు వచ్చి అక్కడి నుంచి ఇక్కడకు చేరుకుంటున్నారు. వీరేగాక ఆయా దేశాల్లో విమానాలు ఎక్కిన వారు ఢిల్లీ, చెన్నై, బెంగళూరులలో దిగి దేశంలో స్థానిక విమానాల ద్వారా హైదరాబాద్కు చేరుకుంటున్నారు. ఇటు ఆయా దేశాల నుంచి వచ్చే ఖైదీల్లో కొందరు హైదరాబాద్లో దిగాక కనీసం హోటల్ క్వారంటైన్లో కూడా ఉండలేని దుస్థితి నెలకొంది. డబ్బులు లేవని, తమను విడుదల చేసి పైసా చేతిలో పెట్టకుండా పంపించేశారని వారంటున్నారు. మరో 10 విమానాలకు అనుమతి.. విదేశాల నుంచి వచ్చే వారి సంఖ్య పెరగటంతో మరిన్ని విమానాలు నడిపేందుకు కొన్ని విమానయాన సంస్థలు ఏర్పాట్లు చేసుకున్నాయి. వచ్చిన వారిని క్వారంటైన్కు తరలించేలా, అందుకు అవసరమైన సహకారం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశాయి. మరో పది విమానాలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చిందని అధికారులు తెలిపారు. దీంతో విదేశాల నుంచి వచ్చే వారి సంఖ్య రోజుకు మరో 4 వేల మంది వరకు పెరగొచ్చని భావిస్తున్నారు. కరోనా కారణంగానే తాము ఇక్కడకు వస్తున్నట్లు, ఆయా దేశాల ప్రభుత్వాలు పంపించి వేస్తున్నట్లు ప్రయాణికులు చెబుతున్నారు. యూరప్ వంటి దేశాల్లో కరోనా టెస్టులు చేయించుకోవడం కూడా కష్టంగా మారిందని.. ఇక్కడ కరోనా పరీక్షలు విమానాశ్రయంలోనే చేస్తుండటంతో కొంతమేరకు ఊరటగా ఉందని అంటున్నారు. విదేశాల నుంచి వేలాది మంది వస్తుండటంతో కరోనా నెగెటివ్ రిపోర్టులు చూడడం, రిపోర్టులు లేని వారికి పరీక్షలు చేస్తుండటంతో విమానాశ్రయ సిబ్బందిపై ఒత్తిడి పెరిగింది. జైలు నుంచి పంపించేశారు.. ఒక నేరం విషయంలో ఇటలీలో నాకు జైలు శిక్ష విధించారు. దాదాపు రెండేళ్లుగా జైలులోనే ఉన్నాను. మొదటి విడత కరోనా వచ్చిన సమయంలో ఇటలీ వణికిపోయింది. నేనున్న జైలులో అనేకమంది కరోనా బారిన పడ్డారు. కొందరు చనిపోయారు. ఇప్పుడు అక్కడ సెకండ్ వేవ్ మొదలు కావడంతో పరిస్థితి ఘోరంగా మారింది. జైళ్లను ఖాళీ చేస్తున్నారు. నేరస్తుల కంటే కరోనా ప్రమాదంగా మారడంతో వదిలేస్తున్నారు. ముఖ్యంగా విదేశీ ఖైదీలను వారి దేశాలకు పంపించేస్తున్నారు.. – ఇటలీ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు లండన్లో దారుణంగా పరిస్థితి.. నేను లండన్లో ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. మొదటి విడత కరోనా కారణంగా ఉద్యోగానికి గ్యారెంటీ లేకుండా పోయింది. సెకండ్ వేవ్ మొదలు కావడంతో పరిస్థితి దారుణంగా మారింది. ప్రస్తుతం నేను పనిచేసే కంపెనీ మూతపడింది. ఏ దిక్కులేక మన రాష్ట్రానికి తిరిగి వచ్చాను.. – బ్రిటన్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు -
కరోనాపై యుద్ధంలో సమిధలు
వాషింగ్టన్: కరోనా మహమ్మారిపై పోరాటంలో వైద్యులు, నర్సులు, ఆరోగ్య కార్యకర్తలు కీలకంగా పనిచేస్తున్నారు. వారంతా తమ ప్రాణాలను పణంగా పెడుతూ కరోనా బాధితులకు వైద్య సేవలందిస్తున్నారు. విధి నిర్వహణలో ఉండగా కరోనా వైరస్ సోకి అర్ధాంతరంగా మరణిస్తున్నారు. ప్రపంచంలో ఇప్పటిదాకా 1,500 మంది నర్సులు కరోనా బారినపడి ప్రాణాలు వదిలారని ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ నర్సెస్(ఐసీఎన్) తాజాగా వెల్లడించింది. ఇవి కేవలం 44 దేశాలకు సంబంధించిన గణాంకాలే. 1914 నుంచి 1918 దాకా నాలుగేళ్లపాటు జరిగిన మొదటి ప్రపంచ యుద్ధంలోనూ దాదాపు 1,500 మంది నర్సులు మరణించారని అంచనా. మొత్తం ప్రపంచవ్యాప్తంగా చూస్తే కరోనా కాటుకు ప్రాణాలు కోల్పోయిన నర్సుల సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని సీఏసీఎన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ హోవార్డ్ కాటన్ చెప్పారు. అన్ని దేశాల్లో నర్సుల మరణాలను పూర్తి స్థాయిలో నమోదు చేయకపోవడం బాధాకరమని అన్నారు. మొదటి ప్రపంచ యుద్ధం కంటే ఇప్పుడు కరోనా రక్కసి ఎక్కువ మంది నర్సుల ప్రాణాలను బలిగొన్నట్లు స్పష్టమవుతోంది. చాలా దేశాల్లో కరోనా సెకండ్ వేవ్ మొదలైనట్లు వార్తలొస్తున్నాయి. నర్సుల మరణాలు ఎన్నో రెట్లు పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 2020 సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ద నర్సు అండ్ మిడ్వైఫ్గా జరుపుకుంటున్నారు. అలాగే ఆధునిక నర్సింగ్ వ్యవస్థకు ఆద్యురాలైన ఫ్లోరెన్స్ నైటింగేల్ 200వ జయంతి కూడా ఈ సంవత్సరమే. ఒకవేళ ఫ్లోరెన్స్ నైటింగేల్ ఇప్పుడు జీవించి ఉంటే.. కరోనాపై పోరాటంలో ప్రాణాలు కోల్పోతున్న నర్సుల పరిస్థితి చూసి తీవ్రంగా చలించిపోయేవారని హోవార్డ్ కాటన్ వ్యాఖ్యానించారు. బ్రిటన్లో లాక్డౌన్ లండన్: కరోనా వైరస్ పంజా విసురుతుండడంతో బ్రిటన్ వణికిపోతోంది. దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10 లక్షల మార్కును దాటేసింది. వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి మరోసారి పూర్తిస్థాయి లాక్డౌన్ విధించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. గురువారం నుంచి జనమంతా ఇళ్లకే పరిమితం కావాలని, అనవసరంగా బయటకు రావొద్దని యూకే ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ పిలుపునిచ్చారు. ఈ మేరకు స్టే ఎట్ హోం(లాక్డౌన్) నిబంధనలు జారీ చేశారు. డిసెంబర్ 2వ తేదీ వరకు ఇవి అమల్లో ఉంటాయి. అంటే దాదాపు నెల రోజులపాటు లాక్డౌన్ అమలు చేయనున్నారు. ఏప్రిల్లో బయటపడిన కరోనా కేసుల కంటే ఇప్పుడు మరిన్ని కేసులు నమోదవుతున్నాయని బోరిస్ జాన్సన్ చెప్పారు. మరణాల సంఖ్య సైతం అదేస్థాయిలో పెరుగుతోందని అన్నారు. మహమ్మారి వ్యాప్తిని అరికట్టాలంటే ప్రస్తుతం మన ముందున్న ఏకైక మార్గం సంపూర్ణ లాక్డౌన్ మాత్రమే అని స్పష్టం చేశారు. ప్రజలంతా సహకరించాలని కోరారు. -
పారిస్లో 700 కి.మీ. ట్రాఫిక్ జామ్
పారిస్: గత కొంతకాలంగా యూరప్లో కోవిడ్ విజృంభిస్తుండడంతో ఫ్రాన్స్లో రెండోసారి లాక్డౌన్ ప్రకటించారు. శుక్రవారం నుంచి దేశవ్యాప్తంగా లాక్డౌన్ ఆంక్షలు అమలులోకి వచ్చిన నేపథ్యంలో ఫ్రాన్స్ రాజధాని పారిస్లో గురువారం నుంచే లక్షలాది మంది జనం సొంతూళ్ళకు పయనమయ్యారు. దీంతో గురువారం రాత్రి నుంచి పారిస్ చుట్టూ 700 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు మక్రాన్ ఏడు నెలల కాలంలో రెండోసారి లాక్డౌన్కి డిక్రీ జారీచేయగా దీన్ని పార్లమెంటు ఆమోదించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రతిరోజూ తాజాగా 50,000 కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటి వరకు ఫ్రాన్స్లో 13,31,884 కేసులు నమోదు కాగా, 36,565 మంది మరణించినట్లు జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ వెల్లడించింది. కోవిడ్ ఆంక్షలు డిసెంబర్ 1 వరకు అమలులో ఉంటాయని ఫ్రాన్స్ అధ్యక్షుడు ప్రకటించారు. రాత్రి 9 గంటల నుంచి, ఉదయం ఆరు గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది. అత్యవసరమైతే తప్ప ప్రజలెవ్వరూ ఇళ్ళలో నుంచి బయటకు రావద్దని ప్రభుత్వం కోరింది. ఫ్రాన్స్కి చెందిన 6.7 కోట్ల మంది ప్రజలు పూర్తిగా ఇళ్ళకే పరిమితం కావాలనీ, ఒకరిళ్ళకు ఒకరు వెళ్ళకూడదని, అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది. నిత్యావసర సరుకుల కోసం, మందుల కోసం, వ్యాయామం కోసం ఒక గంట మాత్రమే బయటకు అనుమతిస్తామని ప్రభుత్వం తెలిపింది. దీంతో ఆహారం ఇతర సరుకుల కోసం జనమంతా సూపర్మార్కెట్లకు ఎగబడ్డారు. లక్షలాది మంది సొంతూళ్ళకు పయనమయ్యారు. జనమంతా ఒకేసారి రోడ్లపైకి రావడంతో రోడ్లన్నీ ట్రాఫిక్తో కిక్కిరిసిపోయాయి. -
లాక్డౌన్.. 700 కి.మీ. మేర ట్రాఫిక్జామ్
పారిస్: యూరప్ దేశం ఫ్రాన్స్పై కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటికే అక్కడ సెకండ్ వేవ్ మొదలైపోయింది. వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరిగిపోవడంతో సగానికి పైగా ఐసీయూ బెడ్స్ కోవిడ్ రోగులతో నిండిపోయాయి. ఈ నేపథ్యంలో డిసెంబరు 1 వరకు లాక్డౌన్ విధిస్తూ ఫ్రెంచి ప్రభుత్వం బుధవారం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా గురువారం నుంచే ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని ప్రకటించింది. ముఖ్యంగా పారిస్ సహా ప్రధాన పట్టణాల్లో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉందని, అందరూ అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. అత్యావసరాల కోసం మినహా పౌరులు బయటకు రావొద్దని స్పష్టం చేసింది. దీంతో హాలీడే ట్రిప్పుల కోసం గ్రామీణ ప్రాంతాలకు వెళ్లాలనుకునేవారు, నిబంధనల నేపథ్యంలో ఇళ్లకు చేరుకునే వారి వాహనాలతో రాజధాని నగరంలో భారీగా ట్రాఫిక్జామ్ ఏర్పడింది. సుమారు 435 మైళ్లు(700 కిలోమీటర్ల) మేర రోడ్ల మీద వాహనాలు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. (చదవండి: నా పిల్లలకు ఈ మాట చెప్పండి..) ఇకపై అవన్నీ కుదరవు ‘‘కారణం లేకుండా స్నేహితుల ఇళ్లకు వెళ్లడం, వాళ్లను ఆహ్వానించడం, అంతా కలిసి బయటకు వెళ్లడం వంటివి ఇకపై కుదరకపోవచ్చు. ప్రతిఒక్కరు లాక్డౌన్ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది’’అని ప్రధాని జీన్ కాస్టెక్స్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇక లాక్డౌన్ నేపథ్యంలో మార్నింగ్వాక్, ఎక్సర్సైజ్ కోసం బయటకు వెళ్లే ప్రజలు.. అందుకోసం ఇంటి నుంచి కిలోమీటరు పరిధిలో ఉండే ప్రాంతాలు ఎంచుకోవాలని, వైద్య అవసరాలు, నిత్యావసరాల కోసం మినహా బయటకు రావొద్దని అధికారులు స్పష్టం చేశారు. రెస్టారెంట్లు, కేఫ్లు మూసివేయాలని పేర్కొన్నారు. కాగా ఇప్పటికే నెలలపాటు ఇంట్లోనే మగ్గిపోయిన తమకు ఈ లాక్డౌన్ వల్ల మరోసారి నాలుగు గోడలకే పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: సెకండ్ వేవ్ మొదలైంది.. మళ్లీ లాక్డౌన్) యూరప్ దేశాల్లో రోజుకు సగటున 1370 మరణాలు ఇక ఫ్రాన్స్లో చిక్కుకుపోయిన విదేశీ విద్యార్థులు, తమ వాళ్లకు ఇంకెన్నాళ్లు దూరంగా ఉండాల్సి వస్తుందోనని, ఇక్కడి నుంచి క్షేమంగా బయటపడితే చాలు అంటూ ఆవేదన చెందుతున్నారు. కాగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రతిరోజూ సగటున యూరప్ దేశాల్లో 1,370 మంది చనిపోతున్నారు. యూరోపియన్ సెంటర్ ఫర్ డిసీజ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ సిఫారసుల ప్రకారం కరోనా చేసిన పరీక్షల్లో 3శాతం కంటే తక్కువ మందికే పాజిటివ్ రావాలి. కానీ స్పెయిన్లో 11%, ఫ్రాన్స్లో 18%, నెదర్లాండ్స్, చెక్ రిపబ్లిక్లలో 26% వరకు పాజిటివిటీ రేటు ఉంది. కోవిడ్–19 వ్యాపించిన తొలినాళ్లలో ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, బ్రిటన్ వంటి యూరప్ దేశాల్లో కరోనా తీవ్ర ప్రభావం చూపిన విషయం తెలిసిందే. ఒకానొక సమయంలో ఖననం చేసే చోటుచేలేక కోవిడ్ మృతదేహాలు కుప్పలుతెప్పలుగా పడిఉన్న దృశ్యాలు వైరస్ తీవ్రతను కళ్లకుగట్టాయి. అయినప్పటికీ తొలి దశ విజృంభణ ముగిసిపోయిన ఈ యూరప్ దేశాలు దేశాలు నిబంధనలు సడలించి, రిలాక్స్ అవడం, కోవిడ్ రోగుల ట్రాకింగ్, ట్రేసింగ్, టెస్టింగ్ వంటి కార్యక్రమాలను పక్కాగా అమలు చేయకపోవడం వల్లే సెకండ్ వేవ్ మొదలైందని విశ్లేషకులు అంటున్నారు. -
యూరప్, అమెరికాకు కోవిడ్ దడ
వాషింగ్టన్/లండన్: కరోనా మహమ్మారి యూరప్, అమెరికా దేశాల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. మొదటి సారి కంటే సెకండ్ వేవ్లో అత్యంత భయంకరంగా వైరస్ విజృంభిస్తోంది. అమెరికాలో రికార్డు స్థాయిలో గురువారం ఒకే రోజు 90 వేల కేసులు నమోదు కాగా యూరప్ దేశాలైన ఫ్రాన్స్, బెల్జియం, ఇటలీలలో కరోనా రోగులతో ఆస్పత్రులన్నీ కిటకిటలాడిపోతున్నాయి. ఫ్రాన్స్లో నెలరోజుల పాటు దేశవ్యాప్త లాక్డౌన్ అమలు చేస్తే, జర్మనీలో పాక్షికంగా లాక్డౌన్ ప్రకటించారు. పోర్చుగల్, చెక్ రిపబ్లిక్ వంటి దేశాల్లో కర్ఫ్యూని అమలు చేశారు. ఐర్లాండ్ వారం రోజుల క్రితమే అత్యవసరాలు మినహా మార్కెట్లని మూసేసింది. దీంతో బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్పై కూడా దేశంలో లాక్డౌన్ విధించాలంటూ ఒత్తిడి పెరిగిపోతోంది. మరోవైపు వివిధ దేశాల్లో లాక్డౌన్ పట్ల వ్యాపారస్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. ఇలా మార్కెట్లను మూసేస్తుంటే తాము ఎలా జీవించాలంటూ స్పెయిన్ నుంచి ఇటలీ వరకు ప్రజలు రోడ్లెక్కి లాక్డౌన్కి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. మరో 5 నెలలు ఇంతే..! యూరప్ దేశాల్లో కరోనా వైరస్ సెకండ్ వేవ్ వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్ వరకు కొనసాగే అవకాశాలున్నాయని యూకే సైంటిఫిక్ అడ్వైజరీ గ్రూప్ ఆఫ్ ఎమర్జెన్సీస్ (ఎస్ఏజీఈ) అంచనా వేసింది. అత్యంత కఠినంగా లాక్డౌన్ని అమలు పరచకపోతే పరిస్థితి మరింత దిగజారుతుందని బ్రిటన్ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. కరోనా అంశంలో ఎస్ఏజీఈ వేసిన అంచనాలకు సంబంధించిన ఒక పత్రం లీకైంది. దాని ప్రకారం యూకేలోనే 85 వేల మంది వరకు మరణించే అవకాశాలున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో కరోనా మరింత ఉధృత స్థాయికి చేరుకొని రోజుకి 800 మంది వరకు మరణిస్తారు. 25 వేల మంది వరకు ఆస్పత్రి పాలవుతారని ఆ సంస్థ పేర్కొంది. వారిలో 5 వేల మంది వరకు ఐసీయూలో ఉంటారు. ఇక బ్రిటన్లో ప్రతి రోజూ లక్ష మంది కరోనా బారిన పడతారని న్యూ ఇంపీరియల్ కాలేజీ స్టడీ వెల్లడించింది. ఒకే ఒక్క రోజు పది లక్షల మందికి కరోనా సోకిందన్న వార్త వినడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది. ► ప్రతిరోజూ సగటున యూరప్ దేశాల్లో 1,370 మంది చనిపోతుండగా, అమెరికాలో 808 మంది చొప్పున మరణిస్తున్నారు. ► గత వారంలో యూరోపియన్ యూనియన్, యూకేలో సగటున రోజుకి లక్షా 76 వేల మంది కరోనా బారిన పడగా, అమెరికాలో రోజుకి సగటున 72 వేల కేసులు నమోదవుతున్నాయి. ► ఫ్రాన్స్లో సగానికి పైగా ఐసీయూ బెడ్స్ కరోనా రోగులతో నిండిపోయాయి. ► ఇటలీలోని మిలాన్ నగరంలో వాణిజ్య ప్రదర్శనకు వినియోగించే కేంద్రాలను తాత్కాలిక కోవిడ్ ఆస్పత్రులుగా మార్చారు. ► బెల్జియంలోని 10% ఆస్పత్రుల్లో నర్సులకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో లక్షణాలు లేకుండా కరోనా ఉన్నవారందరూ విధులకు హాజరు కావాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ► యూరోపియన్ సెంటర్ ఫర్ డిసీజ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ సిఫారసుల ప్రకారం కరోనా చేసిన పరీక్షల్లో 3శాతం కంటే తక్కువ మందికే పాజిటివ్ రావాలి. కానీ స్పెయిన్లో 11%, ఫ్రాన్స్లో 18%, నెదర్లాండ్స్, చెక్ రిపబ్లిక్లలో 26% వరకు పాజిటివిటీ రేటు ఉంది. ► కోవిడ్ అమెరికా, యూరప్లపై తీవ్ర ఆర్థిక ప్రభావాన్ని చూపించింది. యూరోజోన్ ఎకానమీ 2020లో 8.3% తగ్గిపోతే, అమెరికా ఎకానమీలో 4.3% తగ్గుదల కనిపించింది. ఎందుకీ విజృంభణ? యూరప్ దేశాల్లో కోవిడ్–19 తొలి దశ విజృంభణ ముగిసిపోయాక ఆ దేశాలన్నీ బాగా రిలాక్స్ అయిపోయాయి. మొదటి సారి లాక్డౌన్ సమయంలో మళ్లీ మహమ్మారి విజృంభిస్తే ఎదుర్కోవడానికి అవసరమైన ప్రణాళికలను ప్రభుత్వాలు పక్కాగా రచించలేదు. కరోనా రోగుల ట్రాకింగ్, ట్రేసింగ్, టెస్టింగ్ కార్యక్రమం మిగిలిన దేశాలతో పోల్చి చూస్తే యూరప్లో పకడ్బందీగా అమలు కాలేదు. అంతేకాదు గత వేసవిలో ప్రజలు కూడా యథేచ్ఛగా తిరిగారు. విపరీతంగా ప్రయాణాలు చేయడం, నైట్ లైఫ్ ఎంజాయ్ చేయడం, క్లబ్బులు పబ్బులు, బీచ్ల వెంట తిరగడం చేశారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి చర్యలన్నీ గాలికి వదిలేశారు. దీంతో అక్టోబర్లో మళ్లీ కరోనా బాంబు పేలింది. -
ఫ్రాన్స్లో లాక్డౌన్
పారిస్/లండన్/బెర్లిన్: కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ యూరప్ దేశాల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఆస్పత్రులన్నీ కరోనా రోగులతో కిటకిటలాడిపోతున్నాయి. కరోనా కట్టడికి పలు దేశాలు పూర్తి స్థాయి లాక్డౌన్ దిశగా అడుగులు వేస్తుంటే, మరికొన్ని దేశాలు పరిమితమైన ఆంక్షల్ని విధిస్తున్నాయి. ఫ్రాన్స్ నెల రోజుల పాటు దేశవ్యాప్త లాక్డౌన్ ప్రకటించింది. ఆ దేశ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్ దేశంలో కరోనా కేసులు తీవ్రతరమవుతున్నాయని, దానికి తగ్గ స్థాయిలో ఆస్పత్రి సదుపాయాలు లేవని అన్నారు. అందుకే లాక్డౌన్ మినహా తమ ముందు మరో మార్గం లేదన్నారు. తొలి దశలో వణికించిన కరోనా కంటే రెండోసారి మరింత ప్రమాదకరంగా కరోనా విజృంభిస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో గురువారం నుంచి మొదలైన లాక్డౌన్ డిసెంబర్ 1 వరకు కొనసాగుతుంది. అయితే లాక్డౌన్ నిర్ణయంపై దేశంలోని వ్యాపారస్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇక జర్మనీలో బార్లు, రెస్టారెంట్లు, జిమ్ములు, సినిమా థియేటర్లు మూసివేశారు. క్రీడల్ని ప్రేక్షకులు లేకుండానే నిర్వహించనున్నారు. బహిరంగ ప్రదేశాల్లో కూడా ఎక్కువ మంది గుమికూడకుండా ఆంక్షలు విధిస్తున్నట్టు జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కల్ ప్రకటించారు. గత పది రోజుల్లోనే జర్మనీలో ఆస్పత్రుల రోగుల సంఖ్య రెట్టింపైందని దేశంలో ఆరోగ్య సంక్షోభం రాకుండా ఉండాలంటే ఈ ఆంక్షలన్నీ తప్పనిసరని మెర్కల్ తెలిపారు. మిగిలిన దేశాల్లో నిబంధనలు ఇలా.. యూరప్లో మిగిలిన దేశాలు కూడా పలు ఆంక్షల్ని విధిస్తున్నాయి. పోర్చుగల్ ప్రభుత్వం దేశ ప్రజలందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని స్పష్టం చేసింది. వారం రోజుల పాటు ప్రయాణాలపై ఆంక్ష లు విధించింది. బెల్జియంలో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం కరోనా కేసులు అత్యధిక స్థాయిలో పెరిగిపోతున్న దేశాల్లో బెల్జియం ముందుంది. చెక్ రిపబ్లిక్లో కర్ఫ్యూ విధించారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్కుని తప్పనిసరి చేశారు. ఇక బ్రిటన్లో కూడా దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించాలని ఆరోగ్య నిపుణులు ప్రధాని బోరిస్ జాన్సన్కి సూచిస్తున్నారు. ప్రభుత్వ సలహా సంస్థ సేజ్ సెకండ్ వేవ్ యూరప్ని ఘోరంగా దెబ్బతీస్తుందని హెచ్చరించింది. యూరోపియన్ యూనియన్ కరోనా పరీక్షలు మరింత విస్తృతంగా చేపట్టాలని నిర్ణయించింది. -
అప్రమత్తతే మందు
యూరప్ దేశాలన్నీ కరోనా వైరస్ రెండో దశ విజృంభణతో కుదేలవుతున్న వేళ మన దేశంలో తొలిసారి ఆ మహమ్మారి క్రమేపీ ఉపశమిస్తున్న జాడలు కనిపిస్తున్నాయి. కరోనాపై మనం పోరు ప్రారంభించి దాదాపు ఏడు నెలలు కావస్తుండగా జూలై నుంచి అది ఎడాపెడా విస్తరిస్తూ పోయింది. ఈ మూడు నెలల కాలంలో తొలిసారి సోమవారం దేశవ్యాప్తంగా 47,000 కేసులు నమోదయ్యాయి. ఆమర్నాడు స్వల్పంగా పెరిగి 50,000కు చేరాయి. సాధారణంగా సోమవారం వెలువడే కరోనా ఫలితాలను ఎవరూ పట్టించుకోవడం లేదు. ఎందుకంటే మిగిలిన రోజులతో పోలిస్తే ప్రతి ఆదివారమూ కరోనా పరీక్షల సంఖ్య తక్కువగా వుంటుంది. సాధారణ రోజుల్లో దాదాపు 11 లక్షల పరీక్షలు జరుగుతుండగా... ఆదివారాల్లో అవి 8–9 లక్షల మధ్య వుంటాయి. అయినా రోజూ దాదాపు 60,000 కేసులు బయటపడటం రివాజైంది. కానీ ఈ ఆదివారం 8.59 లక్షల పరీక్షలు జరిపినా తక్కువ కేసులే వెల్లడయ్యాయంటే అది సంతోషించదగ్గ విషయం. ముఖ్యంగా రోజూ అధిక సంఖ్యలో కేసులు బయటపడుతున్న మహారాష్ట్రలో కూడా 6,000 కన్నా తక్కువ కేసులు నమోదుకావడం కూడా జూలై 8 తర్వాత ఇదే తొలిసారి. ఈమధ్య కరోనా తీవ్రత ఎక్కువగా వున్నట్టు కనబడుతున్న కర్ణాటక, కేరళల్లో కూడా కొత్త కేసులు తగ్గాయి. కానీ ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం జాతినుద్దేశించి ప్రసంగించిన సందర్భంగా చెప్పినట్టు కరోనా తగ్గుముఖం పట్టినట్టు కనబడుతున్నా అప్రమత్తత ఏమాత్రం సడలనీయకూడదు. మాస్క్ ధరించడంతో మొదలుపెట్టి ముందు జాగ్రత్తల్లో దేన్నీ నిర్లక్ష్యం చేయకూడదు. కరోనా తీవ్రత తగ్గినట్టు కనిపించడంతో చాలామందిలో ఒకరకమైన నిర్లక్ష్య ధోరణి బయల్దేరింది. కొందరు శాస్త్రవేత్తలు భారత్లో ఇప్పటికే కరోనా వైరస్ ఉచ్చస్థితికి వెళ్లి, అక్కడినుంచి వెనక్కి రావడం మొదలైందంటున్నారు. మనకిక రెండో దశ బెడద ఉండకపోవచ్చునని చెబుతున్నారు. ఇదే తీరు కొనసాగితే వచ్చే ఫిబ్రవరినాటికల్లా ఈ మహమ్మారి విరగడకావొచ్చునని అంచనాలు వేస్తున్నారు. కానీ ముందుజాగ్రత్త చర్యల్ని విస్మరించేవారు గుర్తుపెట్టుకోవాల్సిందేమంటే ఆ తగ్గే సంఖ్యలో అలాంటివారుండే అవకాశం లేకపోలేదు. అందువల్లే వ్యాక్సిన్ వచ్చేవరకూ ఇప్పుడమలవుతున్న జాగ్రత్తలన్నీ పాటించకతప్పదు. నియంత్రణ విధానాలను విస్మరిస్తే ఏమవుతుందో ప్రస్తుతం యూరప్ దేశాలనూ, అమెరి కానూ చూస్తే అర్థమవుతుంది. ముఖ్యంగా యూరప్ దేశాలన్నీ ఇంచుమించుగా కరోనా బారినుంచి బయటపడి ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభించడం మొదలుపెట్టాయి. పరిమితంగా అయినా పరిశ్రమలు తెరుచుకోవడం, రవాణా సదుపాయాలు సాధారణ స్థితికి చేరడం, మళ్లీ జనం రోడ్లపై సందడి చేయడం కనబడింది. ఈ దేశాల్లో ఇటీవల ఒకరకమైన అసహనం మొదలైంది. కరోనా తగ్గాక కూడా ఇంకా ఆంక్షలుండటం ఏమిటన్నది దాని సారాంశం. కానీ తాజాగా బయటపడు తున్న కేసులతో ఆంక్షల్ని మళ్లీ పెంచడం మొదలుపెట్టారు. వృధా ప్రయాణాలు మానుకోవాలని, సాధ్యమైనంతవరకూ ఇళ్లకే పరిమితం కావాలని జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కల్ దేశ పౌరులను కోరారు. అందరం కలిసికట్టుగా నిబంధనలు పాటించడం వల్లే వైరస్ తొలి దశ దాడినుంచి కనిష్ట నష్టాలతో బయటపడగలిగామని, ఇప్పుడు సైతం దాన్ని మరిచిపోవద్దని విజ్ఞప్తిచేశారు. యూరప్ దేశాల పరిస్థితి ప్రస్తుతం అయోమయంగా వుంది. కరోనా తొలి దశ విజృంభణ నుంచి బయట పడ్డాక నెమ్మదిగా యధాపూర్వ స్థితికి వస్తున్న తరుణంలో రెండో దశ విజృంభణ పుట్టుకొచ్చి అంతంతమాత్రంగా కోలుకుంటున్న ఆర్థిక వ్యవస్థల్ని చిక్కుల్లో పడేసింది. జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్, స్పెయిన్, నెదర్లాండ్స్లు గతవారం మళ్లీ కఠినమైన ఆంక్షల్ని అమలు చేయడం మొదలుపెట్టాయి. ఇవి ఇంకా పెరుగుతాయని రెండు మూడు రోజులుగా నాయకులు చెబుతున్నారు. త్వరలో విడు దల కాబోయే మూడో త్రైమాసికం ఆర్థిక ఫలితాలు బాగుంటాయని అందరూ ఆశగా ఎదురు చూస్తున్నవేళ నాలుగో త్రైమాసికం పూర్తిగా నెగెటివ్లోకి జారుకునే సూచన కనబడుతోంది. మాంద్యం రెండంకెలకు చేరుకోవచ్చునని ఇప్పుడు అంచనా వేస్తున్నారు. వాస్తవానికి యూరప్ యూనియన్(ఈయూ) తన సభ్యదేశాలకు రికవరీ ఫండ్ కింద ఇవ్వదల్చుకున్న 75,000 కోట్ల యూరోల నిధుల పంపిణీని ప్రస్తుతానికి నిలిపేయాలని ఆలోచిస్తున్నట్టు చెబుతున్నారు. వచ్చే ఏడాది వరకూ దాని జోలికి వెళ్లకపోవచ్చునని అంటున్నారు. ఇప్పుడు యూరప్ పరిణామాలు మనకు గుణపాఠం కావాలి. కరోనా బయటపడిన తొలి నాళ్లలో కేరళ దాన్ని సమర్థవంతంగానే ఎదుర్కొంది. వరసబెట్టి తీసుకున్న చర్యల కారణంగా అక్కడ కేసుల సంఖ్య రోజుకు కేవలం రెండు, మూడు మాత్రమే వెల్లడైన సందర్భాలున్నాయి. కానీ ఈమధ్య అవి మళ్లీ పెరుగుతున్నాయి. ఈ నెల 11న ఒకేరోజు 11,755 కేసులు బయటపడినప్పుడు అందరూ నిర్ఘాంతపోయారు. కర్ణాటకలో సైతం ఇంతే. అక్కడ కూడా ఇటీవలకాలంలో కేసులు పెర గడం మొదలైంది. దీని వెనకున్న కారణాలేమిటో నిపుణులు నిర్దిష్టంగా చెప్పలేకపోతున్నారు. కానీ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గడం మొదలయ్యాక జనాన్ని హెచ్చరించడంలో ప్రభుత్వాలు విఫలం కావడం వల్ల వరసగా వచ్చిన పండగల్లో జాగ్రత్తలు తీసుకోవడం తగ్గిందని వారు చెబు తున్న మాట. అలాగే కరోనా జన్యువుల్లో వచ్చిన ఉత్పరివర్తన కూడా ఇందుకు దోహదపడి వుండొ చ్చని అంచనా వేస్తున్నారు. కనుక ఏమాత్రం అజాగ్రత్తగా వున్నా ఇదే ధోరణి దేశమంతా కనబడే ప్రమాదం వుంది. విద్యాసంస్థలను యధావిధిగా నడుపుకోవడానికి ప్రయత్నిస్తూనే, రవాణా సదు పాయాలను కొనసాగిస్తూనే, ఇతరత్రా కార్యకలాపాలకు చోటిస్తూనే నిరంతరం అందరూ అప్రమ త్తంగా వుండకతప్పదు. ఎక్కడ లోపం జరిగినా పరిస్థితి మొదటికొచ్చే ప్రమాదం వుంటుంది. -
మళ్లీ లాక్డౌన్ దిశగా యూరప్ దేశాలు
వాషింగ్టన్/న్యూఢిల్లీ: కరోనా విజృంభణ కొనసాగుతోంది. కంటికి కనిపించని ఆ వైరస్ సోకిన వారి సంఖ్య ఆదివారం నాలుగు కోట్లకు చేరింది. ఇప్పటిదాకా దీని బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 3 కోట్లు మించిపోగా, మృతి చెందిన వారి సంఖ్య 11 లక్షలు దాటింది. పది నెలల కాలంలోనే ఒక వైరస్ 200 పైగా దేశాల్లో నాలుగు కోట్ల మందికి సోకడం చరిత్రలో ఇదే తొలిసారి. అగ్రరాజ్యం అమెరికా అత్యధిక కేసులతో ముందుంటే ఆ తర్వాత స్థానం భారత్దే. బ్రెజిల్, రష్యా, స్పెయిన్ దేశాలు ఆ తర్వాత స్థానాల్లో కొనసాగుతున్నాయి. గత ఏడాది చైనాలోని వూహాన్లో బట్టబయలైన కరోనా వైరస్ జన్యుపరంగా అధికంగా మార్పులు చెందుతూ వస్తోంది. దీంతో ఈ వైరస్కి వ్యాక్సిన్ అభివృద్ధి చేయడంలో ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయి. అయితే కరోనా జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన కల్పించడంలో చాలా దేశాలు విజయవంతమయ్యాయి. అయినప్పటికీ ఆర్థిక రంగం, ఆరోగ్య రంగం మధ్య సమతుల్యత పాటించడంలోనూ, కలసికట్టుగా వైరస్పై పోరాడడంలోనూ ప్రపంచదేశాలు విఫలం అవుతున్నాయని ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియా గుటెరస్ ఆందోళన వ్యక్తం చేశారు. కోట్లాది మంది దారిద్య్రరేఖ దిగువకి వెళ్లిపోయారని ప్రభుత్వాలు వెంటనే స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. కేసుల్లోనే కాక మరణాల్లో కూడా అగ్రరాజ్యం అమెరికా పట్టికలో అగ్రభాగాన ఉంది. ఆ దేశంలో వైరస్ సోకిన ప్రతీ అయిదుగురిలో ఒకరు మరణించడం అత్యంత ఆందోళన కలిగించే అంశం. యూరప్లో సెకండ్ వేవ్ కరోనా వైరస్ తగ్గుముఖం పట్టినట్టే పట్టి యూరప్ దేశాల్లో మళ్లీ ప్రమాదఘంటికలు మోగిస్తోంది. చలికాలంలో ఆ ప్రాంతంలో వైరస్ రెట్టింపు వేగంతో విజృంభిస్తోంది. యూకే, రష్యా, నెదర్లాండ్స్, స్పెయిన్, జర్మనీ, ఇటలీ, పోర్చుగల్, ఫ్రాన్స్, బెల్జియం, తదితర దేశాల్లో కొత్తగా భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. యూకేలో ఏకంగా 40శాతం కేసులు పెరిగిపోయాయి. ఈ శీతాకాలంలో లక్షా 20 వేల మంది ప్రాణాలు పోగొట్టుకుంటారని ఒక అంచనా. యూరప్ వ్యాప్తంగా సగటున రోజుకి లక్షా 50 వేల కేసులు నమోదవుతుంటే, ఒక్కో దేశంలో రోజుకి సగటున 7 వేల నుంచి 15 వేల వరకు కేసులు నమోదు కావడం మరింత ఆందోళన రేకెత్తిస్తోంది. దీంతో చాలా దేశాలు మళ్లీ లాక్డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయి. లండన్, పారిస్ మహా నగరాల్లో కోవిడ్ ఆంక్షలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా ఒకే రోజు 4 లక్షల కేసులు నమోదు కావడంతో పాత రికార్డులన్నీ చెరిగిపోయాయి. చెక్ రిపబ్లిక్ కరోనాని జయించామన్న ఉత్సాహంతో పెద్ద ఎత్తున సంబరాలు చేసింది. దీంతో అక్కడ కరోనా మళ్లీ విజృంభించి ప్రతీ లక్ష మందిలోనూ 400 మందికి వైరస్ సోకుతోంది. కరోనా ప్రభావం ఇలా.. ► కరోనా వైరస్ తగ్గిపోయాక కూడా శరీరంలోని వివిధ అవయవాలపై తీవ్రమైన ప్రభావం చూపిస్తోంది. రెస్పిరేటర్ మెడ్ఆర్విక్స్ జర్నల్లో ప్రచురించిన అధ్యయనంలో వైరస్ తగ్గిన నాలుగు నెలల తర్వాత కొత్త సమస్యల్ని తెచ్చిపెడుతోంది. ► నిస్సత్తువ, కండరాల నొప్పులు, తలనొప్పి, శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి శీతలీకరణ పదార్థాల ప్యాకేజీతోనూ కరోనా.. శీతలీకరించిన ఆహార పదార్థాలతోనూ కరోనా వ్యాపిస్తుందని చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) వెల్లడించింది. ఇలా ఆహార పదార్థాల ప్యాకేజీతో కరోనా సోకుతుందని తేలడం ఇదే తొలిసారి. శీతలీకరించిన ఆహార పదార్థాలు వైరస్తో కలుషితమైతే వాటి ద్వారా కరోనా సోకుతుందని ప్రకటించిన చైనా 19 దేశాలకు చెందిన 56 కంపెనీల ఫ్రోజెన్ ఫుడ్ దిగుమతులపై నిషేధం విధించింది. గత వారం చైనా పోర్ట్ సిటీ కింగ్డావోలో కరోనా కేసులు వెలుగులోకి రావడానికి నౌకల్లో ఉన్న వారికి ఫుడ్ ప్యాకెట్ల ద్వారా వైరస్ సోకడమే కారణమని చైనా వివరించింది. అయితే మంచుతో గడ్డకట్టే ఆహార పదార్థాల్లో నిర్జీవంగా మారిపోయే వైరస్ నుంచి సోకే అవకాశం లేదన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. -
‘క్వారంటైన్’లోకి ఇటలీ, స్వీడన్, జర్మనీ
సాక్షి, న్యూఢిల్లీ : యూరప్లో ప్రాణాంతక కరోనా వైరస్ కేసులు తగ్గకపోగా మరింతగా పెరుగుతుండడంతో బ్రిటిష్ ప్రభుత్వం ఇటలీ, స్వీడన్, జర్మనీ దేశాలను ‘క్వారంటైన్’ జాబితాలో చేర్చింది. అదే సమయంలో 14 రోజుల క్వారెంటైన్ పీరియడ్ను 8 రోజులకు తగ్గించే విషయాన్ని పరిశీలిస్తోంది. ఇటలీ, స్వీడన్, జర్మనీ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు 8 రోజులపాటు కచ్చితంగా స్వీయ నిర్బంధంలో ఉండాల్సి ఉంటుంది. ఎనిమిదవ రోజున కరోనా పరీక్షలు నిర్వహించి నెగటివ్ వస్తే స్వీయ నిర్బంధం ముగిసినట్లే. కరోనా పరీక్షలో పాజిటివ్ అని వస్తే మరో వారం రోజుల పాటు స్వీయ నిర్బంధాన్ని పొడిగిస్తారు. బ్రిటన్లో కరోనా కేసులను కట్టడి చేయడంలో భాగంగా రాత్రి పది గంటలకే అన్ని బార్లు, పబ్బులు, క్లబ్బులను మూసివేయాలంటూ తాజా ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఐర్లాండ్ దేశంలోనయితే మరోసారి 15 రోజుల లాక్డౌన్ను అమలు చేయాలంటూ అక్కడి వైద్య నిపుణుల బృందం సిఫార్సు చేసింది. ఇక 5,15,571 పాజిటివ్ కేసులతో యునైటెడ్ కింగ్డమ్ 12 స్థానంలో కొనసాగుతోంది. తొలి మూడు స్థానాల్లో అమెరికా, భారత్, బ్రెజిల్ దేశాలున్నాయి. యూకే కరోనా బారినపడి ఇప్పటివరకు 42,369 మంది మరణించారు. (చదవండి: ట్రంప్పై నెటిజన్లు ఫైర్, బాధ్యతలేకుండా...) -
మరణాలు @ 33 వేలు
వాషింగ్టన్/లండన్: అగ్రరాజ్యం అమెరికాలో కోవిడ్–19 మరణాలు 33 వేల మార్కును దాటేసింది. ఇప్పటి వరకు ఈ మహమ్మారితో 33,490 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికార యంత్రాంగం వెల్లడించింది. ఇందులో బుధవారం ఒక్క రోజే 6,185 మంది చనిపోగా, గురువారం మరో 2,763 మంది మృతి చెందారు. ఒక్క న్యూయార్క్లోనే ఇప్పటి వరకు 16,251 మంది చనిపోయినట్లు అధికారులు పేర్కొన్నారు. దేశం మొత్తమ్మీద కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య గురువారానికి 6,54,343కు చేరుకుంది. అయితే, కోవిడ్ తీవ్రత తగ్గుముఖం పట్టిందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. కొత్త కేసుల సంఖ్య భారీగా తగ్గినందున అమెరికన్లంతా తిరిగి పనుల్లోకి రావడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కొన్ని రాష్ట్రాల్లో ఈ నెలలోనే తిరిగి మార్కెట్లను ప్రారంభిస్తామని వెల్లడించారు. వివిధ రాష్ట్రాల గవర్నర్లతో మాట్లాడిన అనంతరం కొత్త మార్గదర్శకాలు విడుదల చేస్తామని స్పష్టం చేశారు. ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ఎప్పుడు ప్రారంభించాలో అధ్యక్షుడే నిర్ణయిస్తాడంటూ రాష్ట్రాల గవర్నర్లతో విభేదించిన ట్రంప్ ఇప్పుడు వెనక్కి తగ్గారు. ఈ విషయంలో అధ్యక్షుడి కంటే గవర్నర్లకే అధికారాలు ఎక్కువగా ఉన్నాయని అంగీకరించారు. మే 1వ తేదీ నుంచి అమెరికాలో మార్కెట్లు తిరిగి తెరవాలని తొలుత భావించారు. కానీ, కొన్ని రాష్ట్రాల్లో కేసులు, మృతుల సంఖ్య భారీగా తగ్గడం వల్ల, అంతకంటే ముందే ఆయా రాష్ట్రాలు పనులు ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనాపై పోరా టాన్ని కొనసాగిస్తామని చెబుతున్న ట్రంప్ కొన్ని రాష్ట్రాల్లో వాణిజ్య కార్యకలాపాలు మొదలైతే అమెరికా ఆర్థిక రంగా న్ని నిలబెట్టవచ్చునని ధీమా వ్యక్తం చేశారు. కోవిడ్ మరణాల సంఖ్యను కొన్ని దేశాలు దాచి పెట్టడం వల్లే అమెరికా జాబితాలో ముందుందని వ్యాఖ్యానించారు. యూరప్లో కరోనా ఉగ్రరూపం యూరప్లో కరోనా కేసులు 10 లక్షల 50 వేలు దాటిపోయాయి. మృతుల సంఖ్య 90 వేలు దాటేసింది. ప్రపంచవ్యాప్తంగా నమోదైన మరణాల్లో 65 శాతానికి పైగా యూరప్లో సంభవించాయి. ఈ పరిణామంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇన్నాళ్లూ వైరస్ వణికించిన ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్ వంటి దేశాల్లో కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతూ ఉంటే మరికొన్ని కొత్త దేశాలకు వైరస్ పాకిందని డబ్ల్యూహెచ్వో యూరప్ రీజనల్ డైరెక్టర్ హన్స్ క్లుగె అన్నారు. బ్రిటన్, టర్కీ, ఉక్రెయిన్, బెలారస్, రష్యాలలో వైరస్ తీవ్రరూపం దాలుస్తోందన్నారు. యూరప్కి ముప్పు ఇంకా తొలగిపోలేదని అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. తోట చుట్టూ వంద సార్లు రెండో ప్రపంచ యుద్ధంలో భారత్ తరఫున పోరాడిన సైనిక వీరుడు కెప్టెన్ టామ్ మూరె ఇప్పుడు 99 ఏళ్ల వయసులో కరోనాని ఎదుర్కోవడానికి తన పోరాటపటిమను ప్రదర్శించారు. తన ఇంట్లో గార్డెన్ చుట్టూ వందసార్లు తిరిగారు. దీంతో 1.2 కోట్ల పౌండ్లు యూకే హెల్త్కేర్ చారిటీకి సంపాదించారు. వాకర్ సాయంతో ఆయన తనకు ఇచ్చిన టాస్క్ని పూర్తి చేశారు. మిలటరీ దుస్తుల్లో తనకు వచ్చిన మెడల్స్ అన్నీ డ్రెస్కి తగిలించుకొని ఆయన తోట చుట్టూ తిరగడం ప్రజలందరి దృష్టిని ఆకర్షించింది. విరాళాలు వెల్లువెత్తాయి. మహీంద్రా పీపీఈల తయారీ భారత ఆటోమొబైల్స్ పారిశ్రామిక దిగ్గజం మహీంద్రా అమెరికాలోని డెట్రాయిట్ యూనిట్లో వ్యక్తిగత రక్షణ పరికరాలు (పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్–పీపీఈ) తయారీకి సన్నాహాలు చేస్తోంది. అమెరికాలో ఆరోగ్య సిబ్బందికి అవసరమైన సర్జికల్ మాస్కులు, గౌన్లతో పాటుగా వెంటిలేటర్లను కూడా భారీ సంఖ్యలో తయారు చేయనుంది. ‘ప్రస్తుతం కోవిడ్పై పోరాటానికి అవసరమైనవి తయారు చేయడమే అందరి లక్ష్యం కావాలి. మా దగ్గర నిరంతరం పని చేసే సిబ్బంది ఉన్నారు’అని ఆ సంస్థ ఉత్తర అమెరికా సీఈవో ఒక ప్రకటనలో తెలిపారు. టీకాతోనే సాధారణ పరిస్థితులు కోవిడ్ నివారణకు టీకా అభివృద్ధి చేస్తేనే ప్రపంచంలో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు అవకాశముందని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి గుటెరెస్ స్పష్టం చేశారు. ‘టీకా ఒక్కటే ప్రపంచంలో సాధారణ పరిస్థితులున్న భావనను తీసుకురాగలదు. దీంతో కోటానుకోట్ల డాలర్ల మొత్తం ఆదా అవడమే కాకుండా విలువైన ప్రాణాలు మిగుల్చుకోవచ్చు’’అని ఆయన ఆఫ్రికాదేశాలతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో పేర్కొన్నారు.కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు రెండు లక్షల కోట్ల డాలర్ల విరాళాలు సేకరించాలని తాను మార్చి 25న పిలుపునివ్వగా ఇప్పటివరకూ ఇందులో 20 శాతం మొత్తం అందిందని తెలిపారు. కరోనా మహమ్మారి కారణంగా ఉత్పన్నమైన పరిస్థితులను తట్టుకునేందుకు ఆఫ్రికన్ దేశాలు, ప్రభుత్వాలు చేస్తున్న కృషిని కొనియాడారు. -
కరోనా : ఆంక్షలు సడలించాల్సిన సమయం కాదు
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి గడగడలాడిస్తోన్న సంగతి తెలిసిందే. చైనాలోని వుహాన్ నుంచి పుట్టిన వైరస్ క్రమంగా యూరోప్ దేశాలకు విస్తరించి పెద్ద విలయాన్ని సృష్టించింది. ఇప్పటివరకు కరోనా బారీన పడి 14లక్షల కేసులు నమోదవ్వగా, 83వేలకు పైగా మృతి చెందారు. ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్ దేశాల్లో వేలాది సంఖ్యలో కరోనా మహమ్మారికి బలయ్యారు. ఇప్పటికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఇంకా తగ్గడం లేదు. తాజాగా అమెరికాలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఈ నేపథ్యంలో యూరోప్ దేశాలలో కేసులు తగ్గుముఖం పట్టడంతో ఆంక్షలు సడలించాలని ఆయా దేశాలు అనుకుంటున్నాయి. (కరోనా అతన్ని బిలియనీర్ చేసింది) దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ యూరోప్ రీజనల్ డైరెక్టర్ హాన్స్ కుల్జీ స్పందిస్తూ.. 'ఇది ఆంక్షలు సడలించాల్సిన సమయం కాదు. ఒకవేళ అదే జరిగితే ఇప్పుడిప్పుడే యూరోప్ దేశాల్లో కరోనా కేసులు తగ్గుతున్న వేళ మొదటికే ప్రమాదమొస్తుంది. కరోనా మహమ్మారి అణిచివేతకు సమాజంలోని ప్రతీ ఒక్కరూ మాతో కలిసి మూడు రెట్లు శక్తివంతగా పనిచేయాల్సిన సమయం ఇదంటూ' పేర్కొన్నారు. అంతేగాక కరోనా బారిన పడిన దేశాలన్ని కరోనాను తరిమికొట్టేందుకు మూడు విస్తృత మార్గాలు ఏంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అందులో మొదటిది.. కరోనాపై పోరాటం చేస్తున్న వైద్య రంగానికి మరింత ఆధునాతన పరికరాలను అందించేందుకు ప్రతీ ఒక్కరు ముందుకు రావాల్సి ఉంటుంది. ఇక రెండోది ఏంటంటే.. కరోనా లక్షణాలు, అనుమానితుల కేసుల నుంచి ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులను దూరంగా ఉంచాలన్నారు. దీనివల్ల కొత్త కేసులు నమోదయ్యే అవకాశాలు తక్కువైతాయన్నారు. ఇక మూడవది ఆయా దేశాల్లో ప్రభుత్వం, అధికారులు నిరంతర కమ్యూనికేషన్ సంబంధాలను ఏర్పరచుకోవాలన్నారు. కాగా దేశంలో లాక్డౌన్ను ఎత్తివేసే ఆలోచన తమకు లేదని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన రోజునే ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్ని దేశాలను కరోనాపై మరింత అప్రమత్తం కావాలని హెచ్చరించింది. అయితే కరోనా కేసులు తక్కువగా ఉన్న కొన్ని దేశాల్లో ఆంక్షలను సడలించుకునేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ మద్దతునిచ్చింది. అందులో ఆస్ట్రియా, డెన్మార్క్, నార్వే దేశాలు ఉన్నాయి. కాగా ఇండియాలో లాక్డౌన్ మార్చి 25నుంచి నిరంతరాయంగా కొనసాగుతుంది. భారత్లో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో లాక్డౌన్ మరింత పెరిగే అవకాశాలున్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 5వేలకు పైగా కేసులు నమోదు కాగా, మృతుల సంఖ్య 150కి చేరుకుంది. -
2.5 కోట్ల ఉద్యోగాలకు కోత
జెనీవా: కరోనా వైరస్ను తక్షణమే నియంత్రించలేకపోతే ప్రపంచవ్యాప్తంగా 2.5 కోట్ల ఉద్యోగాలు ఊడిపోతాయని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఒ) హెచ్చరించింది. 1930 నాటి ఆర్థిక మాంద్యం పరిస్థితులు మరోసారి తలెత్తే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని ఐఎల్ఒ ఆందోళన వ్యక్తం చేసింది. దీని ప్రభావంతో ప్రభుత్వాలు, బ్యాంకులు సంస్కరణలు చేపట్టడానికి తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటాయని ఆ సంస్థ ఒక నివేదికలో వెల్లడించింది. ప్రపంచ దేశాలను హడలెత్తిస్తున్న కరోనా వైరస్ విస్తరించకుండా వివిధ దేశాలు లాక్డౌన్ పాటిస్తున్నాయి. సగం మందికి పైగా ఇల్లు కదిలి బయటకు రావడం లేదు. దీంతో ఉత్పాదకత పడిపోయింది. ఈ పరిణామంతో వివిధ దేశాలు సంస్థలను నడపలేక ఉద్యోగుల్ని తీసేస్తున్నాయి. అమెరికా, యూరప్లలో నిరుద్యోగం రేటు రెండు అంకెలు దాటేసిందంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. అంతర్జాతీయ కార్మిక సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం ► అమెరికా గత దశాబ్దకాలంలో కనీవినీ ఎరుగని నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటోంది. కరోనా విజృంభణ తర్వాత 7 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఆర్థిక నిపుణులు అంచనా వేసిన దాని కంటే ఇది ఏడు రెట్లు ఎక్కువ. ► యూరప్లో గత రెండు వారాల్లోనే 10 లక్షల మంది తమకు బతుకు గడవడమే కష్టంగా ఉందని, తమ సంక్షేమం కూడా చూడాలంటూ బ్రిటన్ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. బ్రిటన్లో ఉన్న పెద్ద, చిన్న కంపెనీలన్నీ గత వారం రోజుల్లోనే 27% సిబ్బందిని తగ్గించారు. ► స్పెయిన్లో ఉద్యోగాలు కోల్పోయిన వారి సంఖ్య రికార్డు స్థాయిలో ఉంది. ప్రపంచంలో అత్యధికంగా 14% నిరుద్యోగ రేటు నమోదైంది. ► రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఆస్ట్రియాలో తొలిసారిగా నిరుద్యోగం 12 శాతానికి ఎగబాకింది. ► జర్మనీలో గంట పనికి వేతనం ఇచ్చే విధానం అమల్లో ఉంది. దీంతో కంపెనీలు ఉద్యోగుల పని గంటల్ని రికార్డు స్థాయిలో తగ్గించాయి. దేశంలో ఇంచుమించుగా 4,70,000 కంపెనీలు జర్మనీ ప్రభుత్వానికి వేతన మద్దతు కోరుతూ దరఖాస్తు చేసుకున్నాయి. ► ఫ్రాన్స్లో కూడా వివిధ వ్యాపార కంపెనీలు జీతం చెల్లించలేక ప్రభుత్వ సాయాన్ని కోరుతున్నాయి. ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న కార్మికుల్లో 20% మందికి జీతాలు చెల్లించే పరిస్థితి లేదని ప్రభుత్వమే సాయపడాలని కోరాయి ► థాయ్లాండ్లో 2.3 కోట్ల మంది (దాదాపుగా మూడో వంతు జనాభా) ప్రభుత్వం ఇచ్చే నగదు సాయానికి దరఖాస్తులు చేసుకున్నారు. ► చైనాలో ఇప్పుడిప్పుడే పరిస్థితులు కుదుటపడుతున్నప్పటికీ రెండు నెలలు కరోనా సృష్టించిన కల్లోలంతో దాదాపుగా 80 లక్షల మంది ఉపాధి కోల్పోయారని అంచనా. -
యూరప్ అతలాకుతలం
లండన్/వాషింగ్టన్ : చైనాలో పుట్టిన కరోనా వైరస్ ఐరోపా దేశాలకు విస్తరించి అతలాకుతలం చేస్తోంది. ఇన్నాళ్లూ ఇటలీలో విజృంభించిన ఈ మహమ్మారి, ఇప్పుడు స్పెయిన్లో రాత్రికి రాత్రి ఉధృతమైపోయింది. ఒకే రోజు ఏకంగా 2,000 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసులు 8 వేలకి చేరువలో ఉంటే 288 మంది ప్రాణాలు కోల్పోవడంతో ఆరోగ్య అత్యవసర పరిస్థితి విధించారు. నిత్యావసర దుకాణాలు, ఫార్మసీలు మినహాయించి అన్నింటినీ మూసివేస్తున్నట్టు స్పెయిన్ ప్రభుత్వం ప్రకటించింది. రెండు వారాల పాటు ఈ నిషేధం కొనసాగుతుంది. ఐరోపా దేశాల్లో 1,907 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 1.59 లక్షలకుపైగా నమోదుకాగా, మృతుల సంఖ్య ఆరువేలు దాటింది. స్పెయిన్ ప్రధాని భార్యకి కరోనా సామాన్యుల దగ్గర్నుంచి దేశా ధినేతల కుటుంబాల వరకు కరోనా ఎవరినీ విడిచిపెట్టడం లేదు. తాజాగా స్పెయిన్ ప్రధానమంత్రి పెడ్రో సాంచెజ్ భార్య బెగోనా గోమెజ్కు కరో నా సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో ఆమె తన గదికే పరిమితమయ్యారు. ఇప్పటికే పెడ్రో కేబినెట్లో ఇద్దరు మంత్రులకు కరోనా సోకింది. బ్రిటన్లో మరణాలు రెట్టింపు కేవలం 24 గంటల్లోనే బ్రిటన్లో కరోనా మహమ్మారి 10 మంది ప్రాణాలు తీసుకుంది. ఆ దేశంలో మృతుల సంఖ్య 11 నుంచి 21కి చేరుకుంది.కేసులు 1200వరకు పెరిగాయి. ఫ్రాన్స్లో కూడా కరోనా బెంబేలెత్తిస్తోంది. నైట్ లైఫ్కి పెట్టింది పేరైన ఫ్రాన్స్ అన్ని నైట్ క్లబ్బులు రెస్టారెంట్లు, బార్లు, థియేటర్లు మూసేసింది. అయితే ఆదివారం స్థానిక ఎన్నికల్ని మాత్రం య«థావిధిగా నిర్వహించింది. జాగ్రత్తలు ఎన్ని తీసుకున్నా ఇటలీలో కరోనా అదుపులోకి రావడం లేదు. ఒకే రోజు 368 మంది మృతి చెందగా 20% కేసులు పెరిగి 21 వేలు దాటేశాయి. చైనాలో ఆదివారం మరో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ దేశంలో మృతుల సంఖ్య 3,199కి చేరుకుంది. ఇరాన్లో మరో 113 మంది ప్రాణాలు కోల్పోతే, కేసులు 724 పెరిగాయి. బకింగ్హామ్ ప్యాలెస్ నుంచి ఎలిజబెత్ రాణి తరలింపునకు సన్నాహాలు కరోనా భయాందోళనలు నెలకొన్న నేపథ్యంలో బ్రిటన్ రాణి ఎలిజబెత్ (93), ఆమె భర్త ప్రిన్స్ ఫిలిప్ (98) దంపతులను లండన్లోని బకింగ్çహామ్ ప్యాలెస్ నుంచి నార్ఫోల్క్లోని రాయల్ శాడ్రింగమ్ ఎస్టేట్కు తరలించనున్నారు. లండన్ నడిబొడ్డున బకింగ్హామ్ ప్యాలెస్ ఉండడంతో వచ్చిపోయే అతిథులు, సిబ్బంది ఎక్కువగా ఉంటారు. తొంభై ఏళ్ల వయసు దాటిన రాణిని అంతమంది మధ్యలో ఉంచడం ఇష్టం లేక 70 మంది సిబ్బందితో ఆమెను తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు: 1,59,844 మృతుల సంఖ్య: 6,036 కోలుకున్నవారు: 74,000కు పైగా -
మరణాలు 5 వేలు.. కేసులు 1.34 లక్షలు
టెహ్రాన్/ఒట్టావా/పారిస్/వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా కరోనా కరాళనృత్యం కొనసాగుతూనే ఉంది. ఈ కోవిడ్–19 వల్ల ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 5 వేలు దాటింది. కేసుల సంఖ్య 1.34 లక్షలకు చేరింది. మృతుల సంఖ్య చైనాలోనే అత్యధికం. అక్కడ 3,176 మంది చనిపోయారు. ఇరాన్ లాక్డౌన్ కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. రానున్న 24 గంటల్లో సైనిక దళాలు ఇరాన్ వీధులన్నింటినీ స్వాధీనం చేసుకుంటాయని, ఆ తరువాత ప్రతీ పౌరుడికి కరోనా నిర్ధారణ పరీక్షలు జరుపుతామని శుక్రవారం ప్రకటించింది. కరోనాపై యుద్ధంలో సైనిక దళాలు ప్రధాన పాత్ర పోషించాలని సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ ఆదేశించారు. ఇప్పటికే శుక్రవారం సామూహిక ప్రార్థనలను ఇరాన్ రద్దు చేసింది. పాఠశాలలను మూసివేసింది. ఈ వైరస్ కారణంగా ఇరాన్లో గురువారం ఒక్కరోజే 85 మంది మృత్యువాత పడ్డారు. 1,289 మందికి కొత్తగా ఈ వైరస్ సోకింది. మొత్తంగా ఆ దేశంలో కోవిడ్–19 వల్ల మృతి చెందిన వారి సంఖ్య 514కి, మొత్తం కేసుల సంఖ్య 11,364కి చేరింది. కరోనా సోకినట్లుగా నిర్ధారణ అయినవారిలో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతొల్లా ఖమేనీ విదేశీ వ్యవహారాల సలహాదారు అలీ అక్బర్ వెలాయతి కూడా ఉన్నారు. దేశ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, రెవల్యూషనరీ గార్డ్స్ సభ్యులు, ఆరోగ్య శాఖలోని పలువురు అధికారులు కూడా ఈ వైరస్ బారిన పడినట్లు అధికార టీవీ ప్రకటించింది. అమెరికా విధించిన ఆంక్షల కారణంగా.. ఈ వైరస్ కట్టడికి అవసరమైన ఔషధాలు, ఇతర వైద్య పరికరాల దిగుమతిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, అందువల్ల తమపై విధించిన ఆర్థిక ఆంక్షలను ఎత్తేయాలని ఇరాన్ యూఎస్ను కోరింది. మరోవైపు, ఇటలీలో చిక్కుకుపోయిన భారతీయులను భారత్కు తీసుకువచ్చేందుకు వీలుగా.. వారికి కరోనా నిర్ధారణ పరీక్షలు జరిపేందుకు భారత వైద్యుల బృందం శుక్రవారం ఇటలీ చేరుకుంది. ఇప్పుడు కరోనా కేంద్రం.. యూరోప్ కరోనా వైరస్ కేంద్ర స్థానం ఇప్పుడు యూరోప్కి మారిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ శుక్రవారం ప్రకటించింది. ప్రస్తుతం యూరోప్లోనే అత్యధిక కేసులు నమోదవుతున్నాయని, అత్యధిక మరణాలు సంభవిస్తున్నాయని వెల్లడించింది. ఈ విశ్వవ్యాప్త మహమ్మారి ఎప్పుడు అంతమవుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొన్నదని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ పేర్కొన్నారు. ఇటలీలో మృతుల సంఖ్య 1000 దాటింది. మొత్తం 15 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇటలీలోని లాంబర్డీ ప్రాంతంలో ఈ వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంది. ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీల్లో కేసుల సంఖ్య 2 వేల చొప్పున నమోదయ్యాయి. ఫ్రాన్స్, ఐర్లాండ్, డెన్మార్క్, నార్వే, లిథువేనియా, అల్జీరియా, స్లొవేకియాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. వైరస్ భయానికి ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు విదేశాల నుంచి రాకపోకలపై నియంత్రణలను విధించాయి. కళాశాలలు, పాఠశాలలకు సెలవులు ప్రకటించాయి. సంస్థలు తమ ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేసుకునే సౌకర్యం కల్పించాయి. అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ప్రచార ర్యాలీలు కూడా నిలిచిపోయాయి. విమానాశ్రయాలు, రహదారులు నిర్మానుష్యమయ్యాయి. ప్రజలు విందు, వినోదాల కు దూరంగా, ఇంట్లోనే ఉంటున్నారు. బృంద కార్య క్రమాలపై అప్రకటిత నిషేధం అమలవుతోంది. అమెరికాలో కేసుల సంఖ్య 16 వందలకు చేరింది. మరోవైపు, నేపాల్ ఎవరెస్ట్ సహా అన్ని పర్వతారోహణ కార్యక్రమాలపై నిషేధం విధించింది. అమెరికా నుంచే ఆ వైరస్? అమెరికా నుంచి వచ్చిన యూఎస్ సైన్యం ద్వారానే కరోనా వైరస్ చైనాకు చేరిందని చైనా అధికారి ఒకరు చేసిన ఒక ట్వీట్ అమెరికా, చైనాల మధ్య వివాదానికి దారితీసింది. కెనడా ప్రధాని భార్యకు కోవిడ్–19 కెనడా ప్రధానమంత్రి జస్టిస్ ట్రూడో భార్య సోఫీ గ్రెగరీ ట్రూడోకు కరోనా వైరస్ సోకినట్లు తాజాగా నిర్ధారణ అయింది. దాంతో, భార్యతో పాటు జస్టిన్ ట్రూడో స్వీయ గృహ నిర్బంధంలో ఉన్నారు. ఆస్ట్రేలియా సీనియర్ మంత్రి పీటర్ డటన్కు కూడా కరోనా కన్ఫర్మ్ అయింది. -
షెంగన్ వీసా రుసుం పెంచిన ఈయూ
న్యూఢిల్లీ: యూరప్లోని 26 దేశాల్లో పర్యటించడానికి అవసరమయ్యే షెంగన్ వీసా ఫీజును యూరోపియన్ యూనియన్ (ఈయూ) పెంచింది. ఇన్నాళ్లూ 60 యూరోలుగా (సుమారు రూ.4,750) ఉన్న ఫీజును 80 యూరోలకు (రూ.6,350) పెంచినట్టు ఈయూ ఒక ప్రకటనలో తెలిపింది. ఆదివారం నుంచి ఈ కొత్త ఫీజులు అమల్లోకి వచ్చాయి. ఆస్ట్రియా, డెన్మార్క్, ఫ్రాన్స్, జర్మనీ, గ్రీస్, స్విట్జర్లాండ్, స్పెయిన్ వంటి దేశాల పర్యటనకు షెంగన్ వీసా అవసరం. ఆర్థిక మాంద్యం కారణంగానే వీసా ఫీజుల్ని పెంచాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. వీసా ఫీజు పెంపుతో ఆయా దేశాలు వీసా ప్రక్రియను మరింత వేగవంతంగా, సులభంగా జారీ చేయడానికి అవసరమయ్యే సదుపాయాలు కల్పిస్తాయని వెల్లడించారు. యూరప్ పర్యాటకులు ఇప్పుడు ఆరు నెలల ముందుగా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 2018లో షెంగన్ వీసా కోసం అత్యధిక దరఖాస్తులు వచ్చిన దేశాల్లో భారత్ మూడో స్థానంలో నిలింది. -
ఆమె ఓ సేల్స్గర్ల్; క్షమించండి!
హెల్సెంకి: ఫిన్లాండ్ ప్రధాని సనా మారినాపై ఇస్టోనియా దేశపు మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గానూ.. ఆ దేశ అధ్యక్షురాలు కెర్ట్సీ కాల్జులాద్ క్షమాపణలు చెప్పారు. ఇస్టోనియా హోంమంత్రి మార్ట్ హెల్మె తరఫున మారినా, ఆమె ప్రభుత్వాన్ని క్షమాపణ కోరుతున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఫిన్లాండ్ కేబినెట్కు తెలియజేయాలని ఫిన్లాండ్ అధ్యక్షుడు సౌలీ నినిస్టోకు ఆమె విఙ్ఞప్తి చేశారు. ప్రపంచ దేశాల్లో అత్యంత పిన్న వయస్కురాలైన ప్రధాన మంత్రిగా ఫిన్లాండ్ ప్రధాని సనా మారిన్ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. అంతేకాదు తన కేబినెట్లోనూ అత్యధికంగా 12 మంది మహిళలకు స్థానం కల్పించారు. ఈ మంత్రుల్లో ఒక్కరు మినహా మిగిలిన వారంతా 30-35 ఏళ్ల మధ్య వయసున్న గలవారే కావడం విశేషం. ఈ నేపథ్యంలో ఫిన్లాండ్ కొత్త ప్రధాని, ఆమె ప్రభుత్వం గురించి ఇస్టోనియా హోం మంత్రి మార్ట్ హెల్మె మాట్లాడుతూ.. ‘సేల్స్ గర్ల్ సనా మారిన్కు నార్డిక్ దేశాన్ని పాలించే సామర్థ్యం ఉందా’ అని అహంకారపూరిత వ్యాఖ్యలు చేశారు. ‘ఇప్పుడు ఓ సేల్స్ గర్ల్ ప్రధాని అయ్యింది. గల్లీల్లో తిరిగే కార్యకర్తలు, చదువు లేని వాళ్లు ఆమె కేబినెట్లో మంత్రులుగా చోటు దక్కించుకున్నారు’ అని తమ పార్టీ రేడియో టాక్షోలో వ్యాఖ్యానించారు. దీంతో మార్ట్ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగింది. మహిళలపై, ఏకంగా దేశ అత్యున్నత పదవిలో ఉన్న ప్రధానిని కించపరిచిన మార్ట్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలంటూ ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. ఈ నేపథ్యంలో ఫిన్లాండ్ అధ్యక్షుడితో మాట్లాడిన ఇస్టోనియా అధ్యక్షురాలు.. తమ దేశం తరఫున సనా మారిన్, ఫిన్లాండ్ ప్రభుత్వాన్ని క్షమాపణ కోరారు.(‘వాటి గురించి అసలు ఆలోచించలేదు’) కాగా ఆర్థికంగా వెనకబడిన కుటుంబం నుంచి వచ్చిన సనా మారిన్... విద్యాభ్యాసం చేస్తున్న సమయంలో ఓ సంస్థలో క్యాషియర్గా పనిచేశారు. సామాజిక కార్యకర్తగా ఎదిగి సోషల్ డెమొక్రాట్ పార్టీ తరఫున ప్రధానిగా ఎన్నికయ్యారు. ఈ విషయం గురించి మారిన్ ట్విటర్లో ప్రస్తావిస్తూ.. ‘ ఫిన్లాండ్ పట్ల నేను చాలా గర్వపడుతున్నాను. ఇక్కడ ఉన్న పేద పిల్లలందరినీ విద్యావంతులను చేసి... వారి జీవితంలో విజయవంతం అయ్యేలా చేస్తాం. ఇక్కడ ఓ క్యాషియర్ కూడా ప్రధాని అవ్వగలరు’ అని పేర్కొన్నారు. -
‘కాలం చెల్లిన చట్టాలను ఇకనైనా సవరించండి’
లండన్ : కాలం చెల్లిన చట్టాలను సవరించి ఇకనైనా లింగ వివక్షకు చరమగీతం పాడాలని మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ యూరోపియన్ దేశాలకు విఙ్ఞప్తి చేసింది. మహిళల సమ్మతి లేకుండా వారి భర్తలు శృంగారం జరిపే క్రమంలో భౌతిక దాడులు, బెదిరింపులు ఉన్నపుడు మాత్రమే అత్యాచారంగా పరిగణిస్తే సరిపోదని అభిప్రాయపడింది. మహిళల అంగీకారం లేకుండా వారి శరీరంపై జరిగే ప్రతీ చర్యను అత్యాచారంగానే పరిగణించాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొంది. ఐర్లాండ్, యూకే, బెల్జియం, సైప్రస్, జర్మనీ, ఐస్లాండ్, లక్సెంబర్గ్, స్వీడన్ మొదలగు ఎనిమిది దేశాలు మాత్రమే సమ్మతిలేని శృంగారాన్ని అత్యాచారంగా పరిగణిస్తున్నాయని తెలిపింది. మరో 31 యూరోపియన్ దేశాలు మాత్రం ఈ విధానాల్ని పాటించడం లేదని వెల్లడించింది. అత్యాచారం అనే పదానికి నిర్వచనం మార్చినపుడు మాత్రమే బాధితులకు న్యాయం జరుగుతుందని అభిప్రాయపడింది. కాగా ‘ఎలిమినేషన్ ఆఫ్ వయొలెన్స్ అగెనెస్ట్ వుమన్’ దినోత్సవం సమీపిస్తున్న నేపథ్యంలో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ యూరోపియన్ దేశాలకు ఈ విఙ్ఞప్తి చేసింది మీటూ లాంటి ఉద్యమాలు వచ్చిప్పటికీ... ‘మీటూ లాంటి ఉద్యమాల వల్ల చాలా మంది బాధితులు తాము ఎదుర్కొన్న వేధింపుల గురించి బయటపెడుతున్నారు. అయితే ఆ సమయంలో వారు అనుభవించిన బాధ కంటే కూడా... అప్పుడు ఏం జరిగిందో ఎలా జరిగిందో చెప్పు.. అసలు ఇదంతా నిజమేనా... ఒకవేళ నిజమే అయితే సాక్ష్యాలు చూపించు అనే ఈ మాటల వల్లే ఎక్కువ బాధను అనుభవిస్తున్నారు. ఇక్కడ విచారించదగ్గ మరో విషయం ఏంటంటే చాలా మంది యూరోప్ మహిళలు తమపై జరిగిన అత్యాచారాల గురించి నోరు మెదిపే ధైర్యం చేయలేకపోవడం’ అని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, యూరోప్ మహిళా హక్కుల నేత అన్నా బ్లస్ ఆవేదన వ్యక్తం చేశారు. -
పాశ్చాత్య దేశాల్లో కొత్త ధోరణి..
స్పెయిన్లో అంతర్భాగమైన కేటలోనియా ప్రాంతం అక్టోబర్ ఒకటి రిఫరెండం తర్వాత స్వాతంత్ర్యం ప్రకటించుకుని సంచలనం సృష్టించింది. పొరుగు ఐరోపా దేశాలైన ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ మాదిరిగా స్పెయిన్లోని నాలుగు కోట్ల డెబ్బయి లక్షల ప్రజలంతా ఒకే భాష మాట్లాడరని, కాటలోనియా ప్రాంతంలోని 76 లక్షల మంది భాష కేటలాన్ అనే విషయం ఈ సంక్షోభం తర్వాత ప్రపంచ ప్రజలకు తెలిసింది. స్పెయిన్ సైనిక నియంత జనరల్ ఫ్రాంకో పాలనలో కేటలాన్ భాష వినియోగంపై నిషేధం విధించారు. తర్వాత కూడా స్పానిష్ భాషను కేటలాన్లపై రుద్దారు. ప్రత్యేక భాష, సంస్కృతుల కారణంగా 20వ శతాబ్దంలో వేర్వేరు సందర్భాల్లో కేటలోనియాకు స్వయంప్రతిపత్తి లభించింది. ప్రస్తుతం కేటలాన్ భాష అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు ఖర్చు చేస్తున్నారు. అయినా, స్వతంత్రదేశంగా అవతరించాలని కేటలాన్లు కోరుకుంటున్నారు. సాధారణంగా వెనుకబడిన ప్రాంతాలు, దోపిడీకి గురి అయ్యే ప్రాంతాల జనమే తాము విడిపోతామంటూ ఉద్యమిస్తారు. ఇందుకు భిన్నంగా బాగా అభివృద్ధిచెందిన, సంపన్న ప్రాంతాల ప్రజలే ‘వేర్పాటు’ కోరుకుంటన్నారనడానికి ఉదాహరణ కేటలోనియా. స్పెయిన్లో ఈశాన్య మూల ఇటలీకి ఆనుకుని, మధ్యధరాసముద్రతీరంలో ఉన్న కేటలోనియా విస్తీర్ణం 32 వేల చదరపు కిలోమీటర్లు. వైశాల్యం, సొంత భాష, చెప్పుకోదగ్గ జనాభా, - ఈ అంశాలే స్వతంత్రదేశంగా అవరించాలన్న కేటలాన్ల ప్రజాస్వామిక ఆకాంక్షకు కారణాలు కాదు. అంతర్భాగంగా ఉండి నష్టపోతున్నామనేదే వారి బాధ. 16 శాతం జనాభాతో ఐదో వంతు సంపద సృష్టిస్తున్న కేటలోనియా! కేటలోనియాను స్పెయిన్ దోపిడీ చేస్తోంది- అనేది స్వాతంత్ర్య పోరాటం చేస్తున్న ప్రజల నినాదాల్లో ఒకటి. ఆర్థికంగా, పారిశ్రామికంగా ఎనలేని అభివృద్ది సాధించిన కేటలోనియా నుంచి పన్నుల రూపంలో భారీగా సొమ్ము సేకరిస్తున్న స్పెయిన్ సర్కారు అందులో స్వల్ప మొత్తాన్ని మాత్రమే తిరిగి ఈ అటానమస్ ప్రాంతంపై ఖర్చుచేస్తోంది. స్పెయిన్లో అంతర్భాగంగా ఉండి ఇలా నష్టపోయేకంటే వేరుపడడమే మేలని కేటలాన్లు బలంగా నమ్ముతున్నారు. అదీగాక, అమెరికా, ఐరోపా నగరాలకు దీటైన బార్సిలోనా ఉన్న కేటలోనియా ప్రజలను స్పెయిన్ రాజ్యాంగం ప్రత్యేక జాతిగా గుర్తించింది. లక్ష కోట్ల 20 వేల డాలర్ల(1.2 ట్రిలియన్ డాలర్లు)స్పెయిన్ ఆర్థిక వ్యవస్థలో ఐదో వంతు వాటా కేటలోనియా వల్లే వస్తోంది. దేశంలోని పారిశ్రామిక ఉత్పత్తులు, ఎగుమతుల్లో కేటలోనియా వాటా 25 శాతం. మాడ్రిడ్లోని కేంద్ర సర్కారుకు తనకు ఇచ్చే అభివృద్ధి నిధుల కన్నా 1200 కోట్ల డాలర్లు ఎక్కువ పన్నులు, సుంకాల రూపంలో చెల్లిస్తోంది కేటలోనియా. కేటలోనియా ఒక్కటే కాదు, కొన్ని ఐరోపా దేశాల సంపన్న ప్రాంతాలదీ ఇదే డిమాండ్! మిగతా ప్రాంతాలతో పోల్చితే అభివృద్ధి, సంపదలో చాలా ముందున్నాగాని కేటలోనియా మాదిరిగానే స్వాతంత్ర్యం కావాలంటున్న అనేక ప్రాంతాలు పలు ధనిక, పారిశ్రామిక ఐరోపా దేశాల్లో ఉన్నాయి. యూరోపియన్ యూనియన్(ఈయూ) ప్రధాన కార్యాలయం(బ్రసెల్స్) ఉన్న బెల్జియంలోని ఫ్లాండర్స్ ప్రాంతం కూడా కేటలోనియా మాదిరిగానే బాగా ముందుకెళ్లింది. ఆధునిక వాణిజ్యానికి జన్మస్థలాల్లో ఒకటైన ఫ్లాండర్స్ ప్రజల తలసరి స్థూలదేశీయోత్పత్తి (జీడీపీ) ఈయూ దేశాల పౌరుల సగటు కన్నా 120 శాతం ఎక్కువ. అందుకే ప్రపంచ ఆర్థిక మాంద్యం వచ్చాక జరిగిన ఎన్నికల్లో ఫ్లాండర్స్కు స్వాతంత్ర్యం సాధిస్తామని హామీ ఇచ్చిన వేర్పాటువాద పార్టీకి చెప్పుకోదగ్గ ఓట్లొచ్చాయి. పొరుగున ఉన్న జర్మనీలో అన్ని రంగాల్లో ముందున్న బవేరియా రాష్ట్రం స్వతంత్ర దేశంగా మారితే పది అగ్రగామి ఈయూ దేశాలను అధిగమిస్తుందని అక్కడి(బవేరియా) ప్రభుత్వమే చెబుతోంది. బవేరియా పార్టీ నాయకత్వాన స్వాతంత్ర్యం కోసం డిమాండ్ తరచు వినిపిస్తోంది. ఇటలీలో మహానగరాలు మిలన్, వెనిస్లు ఉన్న లొంబార్డీ, వెనెటో ప్రాంతాలు కూడా స్వాతంత్ర్యం కోసం జనాభిప్రాయసేకరణ జరపాలని తీర్మానించాయి. అమెరికాలో పెద్ద, సంపన్న రాష్ట్రాలైన కేలిఫోర్నియా, టెక్సస్లో కూడా వేర్పాటు డిమాండ్లు అప్పుడప్పుడూ ముందుకొస్తున్నాయి. కమ్యూనిస్టుల పాలనలో చెకొస్లేవియాగా అనేక దశాబ్దాలు కొనసాగిన దేశంలోని సంపన్న ప్రాంతం చెక్ వేరుపడతానని ప్రకటించగానే స్లొవేకియా ప్రాంత ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. రెండుగా చీలిపోయాక స్లొవేకియా కూడా కొంత అభివృద్ధి సాధించింది. బాగా వెనుకబడిన అల్పసంఖ్యాకవర్గాలు జాతి వివక్షను కారణంగా చూపి ‘వేర్పాటు’ డిమాండ్లు చేస్తాయనేది సాధారణ నమ్మకం. ప్రపంచీకరణ ఇలాంటి సూత్రీకరణలను తప్పని నిరూపిస్తోంది. అందుకే ‘కలిగిన’ ప్రాంతాల నుంచి వేర్పాటు డిమాండ్లు ఎదుర్కొంటున్న అనేక పాశ్చాత్య దేశాలు కేటలోనియాలో చివరికి ఏం జరుగుతుందా అని ఉత్కంఠతో చూస్తున్నాయి. -
ఏది స్వర్గం? ఏది నరకం?
వేల ఏళ్లుగా తరతరాలుగా నివసిస్తున్న నేలను వదిలేసి.. పరాయి పంచన శరణం కోరుతూ పారిపోతున్న దుస్థితి. పిల్లాపాపలను వెంటబెట్టుకుని కట్టుబట్టలతో తరలిపోతున్న దయనీయం. ఈ నరకం నుంచి బయటపడితే చాలు.. ప్రాణాలు దక్కితే చాలు.. కాస్త భద్రమైన ప్రాంతంలో తలదాచుకుని బతకవచ్చన్న ఆశ. ఇంకాస్త మెరుగైన జీవితం కోసం.. మరింత భద్రమైన బతుకుపై కోరిక. ఈ క్రమంలో అత్యంత ప్రమాదకరమైన ప్రయాణం చేస్తున్న సాహసం. ఆ దుస్సాహసంలో అసువులుబాస్తున్న అంతులేని మానవ విషాదం. ఒక్కరు కాదు.. వేలు కాదు.. లక్షల మంది తరలిపోతున్నారు. మధ్యప్రాచ్యంలో గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న మహా మానవ సంక్షోభమిది. అంతర్యుద్ధంతో అగ్నిగుండంగా మారిన సిరియా ప్రజల దైన్యమిది. పొరుగు దేశానికి పారిపోయి అక్కడ ఆశ్రయమిస్తే శిబిరాల్లో దీనంగా బతుకీడుస్తున్నారు. ఆశ్రయమివ్వకపోయినా ‘అక్రమంగా’ ఆయా దేశాలకు చేరుకుంటున్నారు. ఇంకాస్త మెరుగైన బతుకు కోసం యూరప్ దేశాలకు అత్యంత ప్రమాదకర రీతిలో పయనమవుతున్నారు. ఆ క్రమంలో వేలాది మంది మధ్యలోనే అసువులు బాస్తున్నారు. ట్రక్కుల్లో శవాలుగా కుళ్లిపోతున్నారు. నడిసముద్రంలో జలసమాధి అవుతున్నారు. గత ఐదేళ్లుగా ఈ పరిస్థితి రోజు రోజుకూ తీవ్రమవుతూ ఉంది. మధ్యధరా సముద్రంలో ఒక్కోసారి ఐదారు వందల మంది గల్లంతైన సందర్భాలూ ఇటీవలే చోటుచేసుకున్నాయి. కానీ.. నాలుగు రోజుల కిందట వెలుగు చూసిన ఒక చిన్నారి ఫొటోతో ప్రపంచం మొత్తం చలించిపోయింది. ఈనేపథ్యంలో సిరియాలో అంతర్యుద్ధం.. శరణార్థుల ప్రయాణంపై ‘సాక్షి’ ఫోకస్... - సెంట్రల్ డెస్క్ సిరియా శరణార్థుల దైన్యం * అంతర్యుద్ధంతో అగ్నిగుండంగా సిరియా * ప్రాణాల కోసం పారిపోతున్న దేశ ప్రజలు * ఇప్పటికే సగం జనాభా దేశం విడిచిన వైనం * పొరుగు దేశాల్లోని శిబిరాల్లో కోటి మంది జనం * యూరప్ దేశాలకు వెళ్లేందుకు దుస్సాహసం * మధ్యదరా సాగరంలో మహా మానవ విషాదం సిరియా.. ఒక చిన్న దేశం. మొత్తం విస్తీర్ణం 1.85 లక్షల చదరపు కిలోమీటర్లు. అంతర్యుద్ధానికి ముందు జనాభా 2.25 కోట్ల మంది. ఇప్పుడు ఆ సంఖ్య సగానికి పడిపోయింది. ఎడారులూ సారవంతమైన భూములూ గల ఈ దేశానికి ఐదు వేల ఏళ్లకు పైగా సుసంపన్నమైన సుదీర్ఘ చరిత్ర ఉన్నా.. గత ఐదేళ్లుగా ప్రత్యక్ష నరకంగా మారిపోయింది. ఈ నరకం నుంచి బయటపడిన కోటి మందికి పైగా ప్రజలు.. పొరుగు దేశాలతో పాటు, యూరప్ దేశాలకూ శరణార్థులుగా చేరుతున్నారు. ఆందోళనలు మొదలు... ట్యునీసియా, ఈజిప్ట్, లిబియాల్లో వెల్లువలా వచ్చిన ‘అరబ్ వసంతం’ ప్రభావం సిరియాలో అంతర్యుద్ధానికి బీజం వేసింది. 1971 నుంచి అధికారంలో ఉన్న అసద్ కుటుంబ పాలనలో ప్రభుత్వం ఆర్థిక, రాజకీయ సంస్కరణలు అమలు చేయటంలో విఫలమవటంతో 2011లో ప్రజలు శాంతియుత నిరసన ప్రదర్శనలు ప్రారంభించారు. 2011 మార్చిలో పాఠశాల గోడలపై విప్లవ నినాదాలు రాసిన పలువురు టీనేజీ విద్యార్థులను అరెస్ట్ చేసి హింసించటంతో సిరియా సంక్షోభానికి బీజం పడింది. ఆందోళనకారులపై ఏప్రిల్ నెలలో సైన్యం విరుచుకుపడటం.. పలువురు నిరసనకారులు మరణించటంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు రాజుకున్నాయి. ఈ ఆందోళన పెరుగుతూపోయి దేశాధ్యక్షుడు బషార్ అల్-అసాద్ రాజీనామా డిమాండ్ కోరేస్థాయికి చేరింది. అంతర్యుద్ధం షురూ... 2011 జూలై నాటికి ఈ ఆందోళన అంతర్యుద్ధం రూపం తీసుకుంది. స్వతంత్ర సిరియా సైన్యం (ఫ్రీ సిరియన్ ఆర్మీ) పేరుతో ఆందోళనకారులు సాయుధ సంస్థను ఏర్పాటు చేశారు. ప్రభుత్వాన్ని కూలదోసేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో స్థానికంగా సాయుధ బృందాలు ఏర్పడ్డాయి. అయితే.. వీటి మధ్య సమన్వయం లేకపోవటంతో పాటు.. కేంద్రీకృత నియంత్రణ లోపించటం వల్ల ముక్కలు ముక్కలుగానే సైన్యంతో తలపడటం మొదలుపెట్టింది. స్థానికంగా ఉండే గిరిజన బృందాలతో పాటు.. సైన్యం నుంచి వచ్చేసిన మాజీ సైనికులు, ప్రభుత్వ వ్యతిరేకత కలిగివున్న స్థానికులు వీటిలో భాగస్వాములయ్యారు. ఇక సిరియా నుంచి, పొరుగు దేశాల నుంచి జిహాదీలు కూడా వచ్చి ఈ సైన్యంలో చేరారు. ఈ క్రమంలోనే ఇస్లామిక్ స్టేట్ ఇన్ సిరియా, ఇరాక్ - ఐఎస్ఐఎస్ కూడా తెరపైకి వచ్చింది. సిరియా ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో అత్యధిక భూభాగాలతో పాటు.. పొరుగున ఉన్న ఇరాక్లోని పలు ప్రాంతాలను కూడా ఐఎస్ఐఎస్ తన ఆధీనంలోకి తీసుకుంది. ఐఎస్ఐఎస్ను ధ్వంసం చేసే లక్ష్యంతో అమెరికా సారథ్యంలోని సంకీర్ణ దేశాల బలగాలు 2014 సెప్టెంబర్లో సిరియాలో వైమానిక దాడులు మొదలు పెట్టాయి. అమాయకుల ఊచకోత... అనతికాలంలోనే.. ఒకవైపు ప్రభుత్వ సైన్యం, మరోవైపు తిరుగుబాటు దళాలు, ఐఎస్ఐఎస్ దుష్టశక్తులు సాధారణ ప్రజలను హతమార్చటం మొదలైంది. అసద్ తెగకు చెందిన అలావైట్లను ఊళ్లకు ఊళ్లు ఊచకోత కోయటం నిత్యకృత్యంగా మారింది. ప్రభుత్వ లక్ష్యాలపై దాడి పేరుతో అమాయకులపై కారు బాంబుల దాడులు సాధారణంగా మారింది. జిహాదీ తిరుగుబాటుదారులు సిరియాలోని కుర్దు ప్రాంతాల్లో వ్యవసాయాన్ని ధ్వంసం చేయటం, విద్యుత్, నీటి సరఫరాలను కత్తిరించటం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ సైన్యం సైతం.. తిరుగుబాటు దళాలకు సాయం చేస్తున్నారని, తమ ఉత్తర్వులు పాటించలేదన్న మిషతో సాధారణ ప్రజలను చంపటం షరామామూలుగా మారింది. బాంబుల దాడితో ఊళ్లకు ఊళ్లు ధ్వంసమయిపోతున్నాయి. మానవ హక్కుల ఉల్లంఘనలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. ఈ యుద్ధంలో ఇప్పటివరకూ 2.20 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. నిరాశ్రయులు.. శరణార్థులు... అంతర్యుద్ధం ఫలితంగా దేశంలో కనీస అవసరాలైన ఆహారం, ఆరోగ్య సేవలు కుంటుపడ్డాయి. సిరియా విద్య, ఆరోగ్య, సామాజిక సంక్షేమ వ్యవస్థలు కుప్పకూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఐక్యరాజ్యసమితి గత మార్చిలో విడుదల చేసిన నివేదిక ప్రకారం.. సిరియాలోని ప్రతి ఐదుగురిలో నలుగురు ఇప్పుడు పేదరికంలో ఉన్నారు. వారిలో 30 శాతం మంది కటిక దారిద్య్రంలో బతుకుతున్నారు. దేశంలో దాదాపు 76 లక్షల మంది ప్రజలు అంతర్గతంగా నిర్వాసితులయ్యారని ఐరాస నివేదిక చెప్తోంది. తమ ఇళ్లను వదిలిపెట్టి వెళ్లిపోయిన వారి సంఖ్య 1.10 కోట్లు దాటిపోయింది. అంటే.. సంక్షోభానికి ముందున్న దేశ జనాభాలో సగం మంది నిరాశ్రయులయ్యారు. ఐరాస నివేదిక ప్రకారమే.. సిరియాలో ఉన్న 1.22 కోట్ల మంది ప్రజల్లో 56 లక్షల మంది చిన్నారులు ఉన్నారు. వారికి మానవతా సాయం అందించాల్సిన అవసరముంది. కాగా, స్వదేశాల్లో నెలకొన్న అంతర్యుద్ధం కారణంగా యూరప్ దేశాలకు తరలివస్తున్న శరణార్ధుల్లో తాజాగా 6,500 మంది శనివారం ఆస్ట్రియాకు చేరుకున్నారు. జర్మనీలోని మ్యూనిచ్కు 600 మంది చేరుకున్నారు. ఈయూలో శరణార్థి హోదా ఎలా లభిస్తుంది? యూరప్కు శరణార్థులుగా వస్తున్న వారు.. తమ దేశంలో విద్వేషాన్ని, హింసను ఎదుర్కొంటూ దానినుంచి పారిపోయి వస్తున్నామని.. త మను తమ సొంత దేశానికి తిప్పిపంపించినట్లయితే తమకు హాని జరుగుతుందని, చనిపోయే పరిస్థితీ ఉందని ఆయా దేశాల అధికారులను ఒప్పించాల్సి ఉంటుంది. ఈయూ నిబంధనల ప్రకారం.. శరణార్థికి ఆహారం, ప్రథమ చికిత్స, ఆశ్రయం హక్కులు ఉం టాయి. శరణార్థులు వచ్చిన తర్వాత 9నెలల లోగా పని హక్కు కూడా లభిస్తుంది. 2013లో 4.35 వేల మంది ఈయూ దేశాల్లో శరణార్థుల హోదా కోసం దరఖాస్తు చేసుకుంటే.. 2015లో ఆ సంఖ్య 6.26 లక్షల మందికి పెరిగింది. గత ఏడాది ఈయూలో లక్ష మందికి పైగా ప్రజలకు అధికారికంగా శరణార్థి హోదా లభించింది. మధ్యదరా మార్గంలో... సిరియా నుంచి వచ్చిన శరణార్థులతో పాటు.. మధ్య ఆసియా, దక్షిణాసియా, ఆఫ్రికా, బాల్కన్ దేశాల నుంచి కూడా మెరుగైన జీవితాల కోసం యూరప్ దేశాలకు పయనమవుతున్నారు. ఆసియా ఖండం నుంచి యూరప్ ఖండానికి చేరుకోవటానికి భూమార్గం చాలా సుదీర్ఘమైనదే కాకుండా.. చాలా కష్టాలతో కూడుకున్నది కూడా. అయినా భూ మార్గంతో పాటు మధ్యధరాసముద్రంలో ప్రయాణిస్తూ కూడా చేరుకుంటారు. సముద్రం మీదుగా టర్కీ నుంచి గ్రీస్కు చేరుకోవటం అతి దగ్గరి దారి. దూరం 13 మైళ్లు మాత్రమే. మర పడవలో ప్రయాణిస్తే అరగంటలో వెళ్లిపోవచ్చు. లిబియా నుంచి ఇటలీకి ఒక రోజు కంటే తక్కువ సమయంలో చేరుకోవచ్చు. ఈ నేపథ్యంలో సిరియా నుంచి వివిధ దేశాలకు చేరుకున్న శరణార్థులు.. యూరప్లోకి ప్రవేశించేందుకు సముద్రమార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఇటువంటి శరణార్థులతో కూడిన కొన్ని బోట్లు సముద్రంలో మునిగిపోయి వందలాది మంది చనిపోతుండటంతో కొన్ని యూరప్ దేశాలు తలా కొంచెం భారం పంచుకునేందుకు సిద్ధమై.. కొందరిని శరణార్థులుగా తీసుకున్నాయి. అయినా.. సిరియా ఇతర పశ్చిమాసియా దేశాల నుంచి వలసల వెల్లువ ఆగటం లేదు. ఒకవైపు.. సౌదీ అరేబియా, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, ఒమన్ వంటి గల్ఫ్ దేశాలు.. తమ పొరుగు దేశం ప్రజలను శరణార్థులుగా అంగీకరించేందుకు సిద్ధంగా లేకపోవటం.. ఇరాక్, లెబనాన్, టర్కీ వంటి దేశాల్లో శరణార్థి శిబిరాల్లో అయినా, వెలుపల అయినా జీవితం దుర్భరంగా ఉండటం.. యూరప్లో మెరుగైన జీవితానికి అవకాశం ఉండటం వంటి కారణాలతో శరణార్థులు ప్రాణాలకు తెగించి మరీ ఆ దేశాలకు పయనమవుతున్నారు. ఇప్పటికే గ్రీస్కు 2.30 లక్షల మంది, ఇటలీకి 1.15 లక్షల మంది, స్పెయిన్ కు 21 వేల మంది శరణార్థులు చేరుకున్నారు. మరో 3.50 లక్షల మంది యూరప్ ముంగిట్లో వేచివున్నారు. వలస వస్తున్న వారిలో అత్యధికులు జర్మనీకి వెళ్లాలని కోరుకుంటున్నారు. ఈ ఒక్క ఏడాదే ఆ దేశానికి 8 లక్షల మంది శరణార్థులు వస్తారని అంచనా. ఏ దేశానికి ఎందరు..? ఐరాస అంచనా ప్రకారం ఇప్పటివరకూ 1.5 కోట్ల మంది సిరియా వదిలి శరణార్థులుగా వెళ్లిపోయారు. వారిలో అత్యధికులు పొరుగున ఉన్న జోర్డాన్, లెబనాన్లలో తలదాచుకున్నారు. 2012 నుంచి వారి అవసరాలను మెర్సీ కార్ప్స్ అనే సంస్థ చూస్తోంది. కేవలం 43 లక్షల మంది జనాభా ఉన్న లెబనాన్.. ఇటు సిరియా, అటు పాలస్తీనా నుంచి వచ్చి చేరిన 20 లక్షల మంది శరణార్థులతో నిండిపోయింది. ఇరాక్: 1,97,000 గత ఆగస్టు నెలలో దాదాపు 40 వేల మంది తూర్పు సిరియా నుంచి కొండ ప్రాంతాల గుండా ప్రయాణించి సరిహద్దులో ఉన్న ఇరాకీ కుర్దిస్తాన్ పట్టణం పెష్కాబర్కు చేరుకున్నారు. మరోవైపు ఇరాక్లో సైతం అంతర్గత కల్లోలం కారణంగా పది లక్షల మంది ఇరాకీలే నిరాశ్రయులై ఉన్నారు. వీరితో పాటు సిరియా నుంచి వచ్చిన శరణార్థులకు సదుపాయాలు కల్పించటానికి ఇరాక్కు తలకుమించిన భారంగా మారింది. లెబనాన్: 7,90,000 శరణార్థులు వెల్లువెత్తుతుండటంతో లెబనాన్ జనాభా ఏడాది కాలంలోనే 20 శాతం పెరిగిపోయింది. అధికారికంగా శరణార్థి శిబిరాలను ఏర్పాటు చేయరాదని ప్రభుత్వం నిర్ణయించటంతో శరణార్థులు తమకు ఎక్కడ ఆశ్రయం దొరికితే అక్కడ జీవిస్తున్నారు. టర్కీ: 5,04,000 టర్కీ సర్కారు సిరియా శరణార్థుల కోసం టెంట్లతో శిబిరాలను ఏర్పాటు చేసి దాదాపు రెండు లక్షల మందికి ఆశ్రయం కల్పిస్తోంది. మరో మూడు లక్షల మంది దేశంలోని వివిధ ప్రాంతాల్లో తలదాచుకుంటున్నట్లు అంచనా. జోర్డాన్: 5,43,000 లెబనాన్ తర్వాత అత్యధికంగా జోర్డాన్లో సిరియా శరణార్థులు తలదాచుకుంటున్నారు. శరణార్థులతో నిండిన జాటారి శిబిరం దేశంలో అతిపెద్ద నగరాల్లో ఒకటిగా మారిపోయింది. ఈ దేశాలతో పాటు.. ఈజిప్టులో 2.50 లక్షలు, జర్మనీలో లక్ష, గ్రీస్లో 88 వేలు, అల్జీరియాలో 35 వేలు, స్వీడన్లో 40 వేలు, ఆస్ట్రియాలో 20 వేల మంది సిరియా శరణార్థులు ఉన్నారు. ఇక బ్రిటన్లో ఐదు వేల మంది, అర్మీనియా, బహ్రెయిన్, లిబియా, బల్గేరియా, ఇటలీ, కెనడా, రష్యా, బ్రెజిల్, ఫ్రాన్స్ తదితర దేశాలతో పాటు అమెరికాకు కూడా సిరియా ప్రజలు శరణార్థులుగా వలస వెళ్లారు. సాగరంలో స్మగ్లర్ల దందా శరణార్థులను సముద్రం గుండా యూరప్ దేశాలకు చేరవేయటానికి స్మగ్లర్ల ముఠాలు పనిచేస్తుంటాయి. యూరప్ దేశాలకు వెళ్లాలని నిర్ణయించుకున్న శరణార్థులు.. తమకు తెలిసిన వారి ద్వారా బ్రోకర్లను కలుస్తారు. ఈ బ్రోకర్లు అధికంగా సిరియన్లే ఉంటారు. స్మగ్లర్లతో ఫోన్లో ఒప్పందం కుదుర్చుకుంటారు. ఒక్కో వ్యక్తికి.. అతడి జాతీయత, అధికారిక హోదా ప్రకారం 2000 డాలర్ల నుంచి 5,000 డాలర్ల వరకూ స్మగ్లర్లు వసూలు చేస్తారు. అయితే.. ఈ స్మగ్లింగ్లో కూడా పోటీ ఉంటుంది. ఆఫర్లూ ఉంటాయి. పది మంది శరణార్థులను ప్రయాణం కోసం తీసుకువస్తే.. ఒకరిని ఉచితంగా పంపిస్తారు. అలాగే కుటుంబం మొత్తం ప్రయాణిస్తే.. పిల్లలను ఉచితంగా పంపిస్తారు. ఒప్పుకున్న మొత్తం సొమ్మును చెల్లించాక.. స్మగ్లర్లు ఫోన్ చేసి ప్రయాణించే వ్యక్తి ఎక్కిడికి రావాలో చెప్తారు. సముద్రంలో ప్రయాణానికి లైఫ్ జాకెట్, తాగేనీళ్లు, చాక్లెట్లు, ఖర్జూర పళ్లు వంటివి మాత్రమే ఒక బ్యాగులో వీపుకు తగిలించుకుని బయల్దేరుతారు. అయితే.. ఈ ప్రయాణం పలుమార్లు వాయిదా పడుతుంది. స్మగ్లర్లలో అంతర్గత కలహాలు లేదా సముద్రంలో పోలీసుల గస్తీ వంటి కారణాలు ఉంటాయి. చేపలు పట్టటానికి ఉపయోగించే చిన్న పడవలు, నాటు పడవలు, గాలినింపిన ప్లాస్టిక్ డింగీలు వంటి వాటిలో సైతం శరణార్థులను సముద్రంలోకి పంపిస్తుంటారు. ఒక దేశం నుంచి మరొక దేశానికి చేరటానికి.. అక్కడి నుంచి సముద్ర మార్గంలో యూరప్ చేరటానికి మధ్య ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి. దారిలో దోపిడీ చేసే ముఠాలు.. మనుషుల్ని ఎత్తుకెళ్లిపోయే కిడ్నాపర్లు.. దేశం దాటిస్తామని మాట ఇచ్చి మోసం చేసే నకిలీ స్మగ్లర్లు.. మధ్య దారిలో వదిలేసి పారిపోయే బ్రోకర్లు.. తిండీనీళ్లు లేక అలమటించిపోయే దుస్థితి.. జబ్ముచేసి చనిపోయే పరిస్థితి.. సముద్రంలో మునిగిపోయే ప్రమాదం.. అత్యాచారాలు, హత్యలు.. ఎన్నో ప్రమాదాలు ఉంటాయి. ఇప్పటివరకూ ఇలా శరణార్థులతో బయల్దేరిన పడవలు మునిగిపోయి మధ్యధరాసముద్రంలో 2,600 మంది చనిపోయారని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. వీటిగురించి పూర్తిగా తెలిసినా.. శరణార్థులు ఈ ప్రమాదకర ప్రయాణం సాగిస్తూనే ఉన్నారు.. మూడేళ్ల సిరియా చిన్నారి అయలాన్ మృతదేహం టర్కీ తీరానికి కొట్టుకొచ్చిన ఫొటోను చూసి... ప్రపంచం నిర్ఘాంతపోయింది. ప్రాంతీయ, మతబేధాల్లేకుండా అశ్రుతర్పణాలర్పించింది. మానవత్వం జాడను వెతకాల్సి వచ్చింది. ఈ ఒక్క ఫొటో దేశదేశాలను ఎంతగా కదిలించిందంటే... ఇన్నేళ్లు శరణార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన యూరోప్ దేశాలు ఉలిక్కిపడ్డాయి. తీవ్ర ఒత్తిడిలో ఐరోపా దేశాధినేతలంతా స్పందించారు. పొట్టచేతపట్టుకొని... సురక్షితమైన గూడును వెతుక్కుంటున్న వారిని ఆదరిస్తామని మాటిచ్చారు. శరణార్థులకు ఆశ్రయం కల్పించే విధానాన్ని సమీక్షించుకుంటామన్నారు. వీరి సహాయం కోసం విరాళాలు కూడా వెల్లువెత్తాయి. లక్షలమంది సిరియన్లు పడుతున్న అవస్థ ప్రపంచానికి తెలిసింది... గుండెలు పిండేసే ఒక్క ఫొటో ద్వారానే. -
నాగసాకిపై అణుబాంబు వేసిన దేశం?
‘మనమంతా ఒక్కటే’ అనే భావన జాతీయవాదానికి ఊపిరినిస్తుంది. ‘అందరి కంటే మనమే గొప్ప’ అనే ఆలోచన దురాక్రమణ పూర్వక జాతీయవాదాన్ని బలపరుస్తుంది. ఈ రెండు భావనల నుంచి పుట్టినవే సామ్యవాదం, సామ్రాజ్యవాదం. క్రీ.శ. 19వ శతాబ్దంలో యూరప్ దేశాల్లో జాతీయవాదం కారణంగా సామ్యవాదం చెలరేగి, రాజరికాన్ని ప్రశ్నించింది. దురాక్రమణ పూర్వక జాతీయవాదానికి పారిశ్రామిక విప్లవం తోడై సామ్రాజ్యవాదం కోరలు చాచింది. సామ్రాజ్యవాద దేశాలు వలసవాదంతో బలహీన దేశాలను కాటువేశాయి. ఈ పరిణామాలు వికటించి వాటిలో అవే విషం చిమ్ముకున్నాయి. ప్రపంచ దేశాలను సమిధలుగా చేసిన వీరి విభేదాలు రెండు ప్రపంచ యుద్ధాలకు కారణమయ్యాయి. ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం రెండు ప్రపంచ యుద్ధాలకు కారణాలు - పరిణామాలు, ఫలితాలు; ప్రపంచ శాంతి పరిరక్షణకు ఐక్యరాజ్య సమితి ఏవిధంగా తోడ్పడుతుంది? తదితర విషయాల గురించి ‘ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం (1900-1950)’ పాఠ్యాంశంలో తెలుసుకుంటాం. ప్రముఖ చరిత్రకారుడైన ‘ఎరిక్ హబ్స్బామ్’ 20వ శతాబ్దాన్ని ‘తీవ్ర సంచలనాల యుగం’గా అభివర్ణించాడు. పారిశ్రామిక విప్లవం వల్ల ఈ శతాబ్దంలో నూతన ఆవిష్కరణలు చేశారు. దీంతో శాస్త్ర సాంకేతిక అభివృద్ధి జరిగింది. ఈ పరిణామం యూరప్ దేశాల్లో ఉత్తేజాన్ని నింపింది. ప్రజలకు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వ సిద్ధాంతాలపై నమ్మకం పెరిగింది. తరాలుగా వలసవాద దోపిడీలో మగ్గిన ఆఫ్రికా, ఆసియా దేశాలు స్వాతంత్య్రాన్ని సాధించుకున్నాయి. రాజకీయ స్వేచ్ఛ పెరిగి, ఉదారవాద ప్రజాస్వామ్య వ్యవస్థల ఏర్పాటుకు దారులు తెరుచుకున్నాయి. పెట్టుబడిదారీ ఆర్థిక విధానానికి పునాదులు పడ్డాయి. క్రీ.శ. 1929లో ప్రపంచమంతా తీవ్ర ఆర్థిక మాంద్యం ఏర్పడింది. మొదటి ప్రపంచ యుద్ధం (1914-1918), రెండో ప్రపంచ యుద్ధం (1939-1945) ప్రజ్వరిల్లాయి. ఫాసిజం (ఇటలీ), నాజీజం (జర్మనీ) జనించాయి. 1945లో ఏర్పడిన ఐక్య రాజ్య సమితి (యునెటైడ్ నేషన్స ఆర్గనైజేషన్) మరో ప్రపంచ యుద్ధం జరగకుండా శాంతి దీపాన్ని వెలిగించింది. మొదటి ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణం: 1914 జూన్ 28న ఆస్ట్రియా యువరాజు ఫ్రాంజ్ ఫెర్డినాండ్ను సెర్బియాకు చెందిన ఉన్మాది హత్య చేశాడు. దీంతో ఆగ్రహించిన ఆస్ట్రియా సెర్బియాపై దాడిచేసింది. ఈ రెండింటికీ మద్దతుగా కొన్ని దేశాలు కూడా యుద్ధరంగంలోకి దిగాయి. ఈ విధంగా 1914 జూలై 28న మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. ఇది 1918 నవంబర్ వరకు కొనసాగి, పారిస్ శాంతి సదస్సు (1919)తో ముగిసింది. ఆ సదస్సులోనే వర్సెయిల్స్ సంధి షరతులు రూపుదిద్దుకున్నాయి. ఈ యుద్ధంలో మిత్ర రాజ్యాలు గెలిచాయి. మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న దేశాలు: మిత్ర రాజ్యాలు: సెర్బియా, రష్యా, ఇంగ్లండ్, {ఫాన్స, జపాన్, అమెరికా.కేంద్ర రాజ్యాలు: ఆస్ట్రియా, జర్మనీ,ఇటలీ, టర్కీ. రెండో ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణం: పోలాండ్ తనకు చెందిన డాంజింగ్ ఓడరేవును జర్మనీకి ఇవ్వడానికి నిరాకరించింది. దీనికి ఆగ్రహించిన హిట్లర్ (జర్మనీ) పోలీష్ కారిడార్పై దాడి చేశాడు. 1939 సెప్టెంబర్ 1న ప్రారంభమైన ఈ దాడి.. రెండింటికీ మద్దతిచ్చే దేశాలు కూడా ప్రవేశించడంతో ప్రపంచ యుద్ధంగా మారింది. ఈ యుద్ధం 1945 ఆగస్ట్లో ముగిసింది. మిత్రరాజ్యాలు మళ్లీ గెలుపొందాయి. రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న దేశాలు: మిత్ర రాజ్యాలు: పోలాండ్, బ్రిటన్, ఫ్రాన్స, రష్యా, అమెరికా, చైనా. కేంద్ర రాజ్యాలు: జర్మనీ, ఇటలీ, జపాన్. మొదటి ప్రపంచ యుద్ధానికి దీర్ఘకాలిక కారణాలు: దురహంకారపూరిత జాతీయవాదం, సామ్రాజ్యవాదం, రహస్య ఒప్పందాలు, సైనిక (మిలటరీ) వాదం. రెండో ప్రపంచ యుద్ధానికి దీర్ఘకాలిక కారణాలు: వర్సెయిల్స్ సంధి షరతులను అవమానకరంగా భావించడం, మిత్ర రాజ్యాలపై పెత్తందారీతనం, నానాజాతి సమితి వైఫల్యం, రష్యా సామ్యవాదం పట్ల పెట్టుబడిదారీ దేశాల భయం. కీలక పదాలు - నిర్వచనాలు పారిశ్రామిక పెట్టుబడిదారీ విధానం: యంత్ర సామగ్రి వినియోగాన్ని విస్తృతం చేసి వస్తువుల ఉత్పత్తి ప్రక్రియలో ఆర్థిక సమతౌల్యం సాధించడం. మైత్రి ఒప్పందాలు: రెండు లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యలోని సంస్థలు లేదా దేశాల మధ్య పరస్పర సహకారం చేసుకోవడానికి కుదిరే అంగీకార ఒప్పందాలు. వీటి లక్ష్యాలు ఒకే రకంగా ఉంటాయి. దేశాల మధ్య ఒప్పందాలు రాజకీయ పరమైనవిగా ఉంటాయి. దురహంకార పూరిత జాతీయవాదం: తీవ్రమైన జాతీయభావనకు గురైన ప్రజలు వారి జాతే గొప్పదని భావిస్తూ, దాని వ్యాప్తి కోసం కృషి చేస్తూ, ఇతర జాతులు, ప్రజల పట్ల ద్వేషభావాన్ని కలిగి ఉండటాన్ని ‘దురహంకార పూరిత జాతీయవాదం’గా పేర్కొంటారు. ఇది ఒక దేశం ఇతర ప్రాంతాలను ఆక్రమించడాన్ని సమర్థిస్తుంది. సైనిక వాదం: దేశ భద్రతకు దృఢమైన సైనిక శక్తి అత్యవసరమని, సమస్యల పరిష్కారానికి యుద్ధమే సరైన విధానమని ప్రజలు లేదా ప్రభుత్వం విశ్వసించడాన్ని ‘సైనిక వాదం’ అంటారు. ఫాసిజం: బెనిటో ముస్సోలినీ ఇటలీలో ఫాసిస్ట్ పార్టీని స్థాపించాడు. ఈ పార్టీ భావజాలన్ని ‘ఫాసిజం’ అంటారు. ఇది ‘ఫాసియో’ అనే రోమన్ పదం నుంచి ఆవిర్భవించింది. దీనికి ‘కడ్డీల కట్ట’ అని అర్థం. ఈ భావజాలాన్ని నమ్మేవారు ప్రజాస్వామ్యం, సామ్యవాదం, ఉదారవాదం, కమ్యూనిజాలను వ్యతిరేకిస్తారు. ప్రపంచంలో వారి జాతే గొప్పదని విశ్వసిస్తారు. నాజీజం: జర్మనీలో హిట్లర్ ‘నేషనల్ సోషలిస్ట్ పార్టీ’ స్థాపించాడు. దీన్ని ‘నాజీ పార్టీ’గా పేర్కొంటారు. దీని సిద్ధాంతాలు, భావాలు ‘నాజీయిజం’గా ప్రసిద్ధి చెందాయి. హిట్లర్ రాసిన ‘మెయిన్ కాంఫ్’ గ్రంథాన్ని ‘నాజీ వేదం’గా భావించారు. నాజీయిజం నోర్డిక్ జాతి గొప్పదనాన్ని కీర్తిస్తూ, యూదు జాతీయులను వ్యతిరేకిస్తుంది. సామ్రాజ్యవాదం: రాజకీయ, ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికీ కొన్ని బలమైన దేశాలకు వలస రాజ్యస్థాపన అవసరమైంది. వలస రాజ్యాలను విస్తరించుకోవడానికి ఈ బలమైన రాజ్యాల మధ్య ఏర్పడిన శత్రుత్వాన్ని ‘సామ్రాజ్యవాదం’గా పేర్కొంటారు. రహస్య ఒప్పందాలు: ఫ్రాంకో - ప్రష్యన్ (1870) యుద్ధం తర్వాత యూరప్కు చెందిన అనేక దేశాలు వాటి స్వాతంత్య్రంతో పాటు ఆర్థిక, వాణిజ్యపరమైన ప్రయోజనాలను కాపాడుకోవడానికి రహస్య ఒప్పందాలు చేసుకున్నాయి. వీటినే రహస్య కూటములు అని అంటారు. ఆ తర్వాత ఇవి సైనిక కూటములుగా అవతరించి మొదటి ప్రపంచ యుద్ధానికి కారణమయ్యాయి. 4 మార్కుల ప్రశ్న 1. 20వ శతాబ్దం ప్రథమార్ధంలో యుద్ధాల వివిధ ప్రభావాలు ఏమిటి? (విషయావగాహన) జ. 20వ శతాబ్దం ప్రథమ అర్ధ భాగంలో జరిగిన రెండు ప్రపంచ యుద్ధాలు (1914-18, 1939 -45) ప్రపంచ రూపురేఖలను మార్చాయి. ఈ యుద్ధాలు ప్రపంచ రాజకీయాలను, సమాజాన్ని, ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేశాయి. అసంఖ్యాక ప్రాణనష్టం: రెండు ప్రపంచ యుద్ధాల కారణంగా అనేక మంది మరణించారు. చాలామంది గాయపడి అవిటివారయ్యారు. మరణించినవారిలో అధిక శాతం యువకులే ఉన్నారు. ఈ రెండు యుద్ధాల వల్ల అణుబాంబులు, రసాయనిక మారణాయుధాల పోటీ పెరిగింది. ప్రపంచ మనుగడకు ఇవి ముప్పుగా పరిణమించాయి. ప్రజాస్వామ్య సూత్రాల పునరుద్ఘాటన: ప్రపంచ దేశాలు ప్రజాస్వామ్య వ్యవస్థ ఆవశ్యకతను గుర్తించాయి. అప్రజాస్వామిక వ్యవస్థ వల్ల ఎలాంటి ప్రమాదాలు ఉంటాయో రెండు ప్రపంచ యుద్ధాలు గుణపాఠాలను నేర్పాయి. వలస పాలన నుంచి విముక్తి పొందిన దేశాలు ప్రజాస్వామ్య ప్రభుత్వ వ్యవస్థవైపే మొగ్గు చూపాయి. నూతన అధికార సమతౌల్యం: రెండు ప్రపంచ యుద్ధాల అనంతరం అప్పటికే సామ్రాజ్యాలను స్థాపించి అధికారయుతంగా ప్రవర్తించిన దేశాలు, కూటములు చాలావరకు అంతమయ్యాయి. జాతీయత, ఆర్థిక మనుగడ, సైనిక భద్రతల ఆధారంగా మధ్య, తూర్పు, యూరప్ ప్రాంతాలుగా విడిపోయాయి. సామ్రాజ్యవాద దేశాలు వలసవాద తత్వాన్ని వీడి, ఆయా ప్రాంతాలకు స్వాతంత్య్రం ఇవ్వడం వల్ల ప్రపంచ పటంలో మార్పులు చోటుచేసుకున్నాయి. కొత్త అంతర్జాతీయ సంస్థలు: ప్రపంచ శాంతిని పరిరక్షించడానికి మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత నానా జాతి సమితి (1919), రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐక్య రాజ్య సమితి (1945) ఏర్పడ్డాయి. మహిళలకు ఓటు హక్కు: సుదీర్ఘ పోరాటం తర్వాత 1918లో బ్రిటన్లో మహిళలకు ఓటు హక్కు లభించింది. ఈ రాజకీయ హక్కుతో స్త్రీల సాధికారత పెరిగి లింగ వివక్ష తగ్గుముఖం పట్టింది. చాలాదేశాల్లోనూ మహిళా స్వేచ్ఛను గౌరవించడం ప్రారంభమైంది. 2 మార్కుల ప్రశ్న 1. భారతదేశం - పాకిస్తాన్ మధ్య 1971లో యుద్ధం ఎంతకాలం కొనసాగింది? ఆ యుద్ధంలో ఎంతమంది చనిపోయారు? (సమాచార సేకరణ నైపుణ్యం) జ. బంగ్లాదేశ్ స్వాతంత్య్ర పోరాటంలో జోక్యం చేసుకోవడం వల్ల భారత్ - పాకిస్తాన్ మధ్య 1971లో యుద్ధం జరిగింది. ఇది 1971 డిసెంబర్ 3న ప్రారంభమై, డిసెంబర్ 16న ముగిసింది. 13 రోజులపాటు కొనసాగింది. దీంట్లో సుమారు 4000 మంది భారత సైనికులు, 9 వేల మంది పాకిస్తాన్ సైనికులు మరణించారు. 1 మార్కు ప్రశ్న 1. ఐక్య రాజ్య సమితిపై మీ అభిప్రాయం ఏమిటి? (ప్రశంస/ అభినందన - సున్నితత్వం) జ. ఐక్య రాజ్య సమితి (యూఎన్వో) అనేది ప్రపంచ శాంతిని పరిరక్షించడానికి ఏర్పడిన అంతర్జాతీయ అత్యున్నత సంస్థ. దీంట్లో ప్రస్తుతం 193 సభ్యదేశాలున్నాయి. ఇవి యూఎన్వో ఆశయాలను సాకారం చేయడానికి కృషి చేస్తున్నాయి. లక్ష్యాత్మక ప్రశ్నలు (అర మార్కు) 1. ఐక్య రాజ్య సమితి దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? 1) అక్టోబర్ 24 2) నవంబర్ 25 3) సెప్టెంబర్ 26 4) డిసెంబర్ 22 2. నాగసాకి, హిరోషిమాపై అణుబాంబులు వేసిన దేశం? 1) జపాన్ 2) ఇంగ్లండ్ 3) జర్మనీ 4) అమెరికా సమాధానాలు: 1) 1 2) 4 -
పీహెచ్డీ...పది ఫెలోషిప్స్!
ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే.. శాస్త్ర, సాంకేతిక పరిశోధనల్లో అత్యుత్తమ ఆవిష్కరణలు జరగాలి. పరిశోధనల ఫలాలను అందిపుచ్చుకున్న ఉత్తర అమెరికా, యూరోప్ దేశాలు ప్రపంచంలోనే అగ్ర పథాన ఉన్నాయి. మన దేశం కూడా ఆయా రంగాల్లో ఇప్పుడిప్పుడే ముందంజ వేస్తోంది. ఇంతటి కీలకమైన శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పరిశోధనల ప్రాధాన్యతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం.. సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్డీ కోర్సులు చేయాలనుకునే యువతకు భారీగా స్కాలర్షిప్స్/ ఫెలోషిప్స్ అందిస్తోంది. శాస్త్రవేత్తలుగా రాణించాలనుకునే యువత వీటిని అందిపుచ్చుకుని అత్యుత్తమ కెరీర్కు బాటలు వేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో వివిధ సంస్థలు అందిస్తున్న స్కాలర్షిప్స్పై ప్రత్యేక కథనం... 1- జాయింట్ సీఎస్ఐఆర్ - యూజీసీ నెట్-జేఆర్ఎఫ్ దేశంలోనే ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో పరిశోధనలు చేయాలనుకునేవారి కోసం నిర్వహించే పరీక్ష జాయింట్ సీఎస్ఐఆర్-యూజీసీ నెట్. దీన్ని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్(సీఎస్ఐఆర్) ప్రతిఏటా రెండుసార్లు నిర్వహిస్తోంది. జూన్, డిసెంబర్లలో పరీక్ష ఉంటుంది. ఈ పరీక్ష ద్వారా ఏకకాలంలో రెండు ప్రయోజనాలను పొందొచ్చు. అవి.. జేఆర్ఎఫ్కు ఎంపికవడం ద్వారా పీహెచ్డీ చేస్తూ ఐదేళ్లపాటు ప్రతినెలా ఫెలోషిప్ అందుకోవచ్చు. అదేవిధంగా నెట్ ఉత్తీర్ణత సాధించడం ద్వారా.. దేశవ్యాప్తంగా వివిధ కళాశాలల్లో లెక్చరర్గా అడుగుపెట్టడానికి బాటలు వేసుకోవచ్చు. పరీక్ష నిర్వహించే సబ్జెక్టులు: కెమికల్ సెన్సైస్, ఎర్త్, అట్మాస్ఫియరిక్ సెన్సైస్, ఓషన్ అండ్ ప్లానెటరీ సెన్సైస్, లైఫ్ సెన్సైస్, మ్యాథమెటికల్ సెన్సైస్, ఫిజికల్ సెన్సైస్, ఇంజనీరింగ్ సెన్సైస్. అర్హత: 55 శాతం(ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం) మార్కులతో నాలుగేళ్ల బీఎస్/బీఈ/బీటెక్/బీఫార్మ్/ఎంబీబీఎస్/ఇంటిగ్రేటెడ్ బీఎస్-ఎంఎస్/ఎంఎస్సీ ఉత్తీర్ణత. వయోపరిమితి: జనవరి 1, 2014 నాటికి 28 ఏళ్లు మించరాదు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, శారీరక వికలాంగులకు ఐదేళ్లు సడలింపు ఉంటుంది. లెక్చరర్షిప్నకు గరిష్ట వయోపరిమితి లేదు. ఏ వయసువారైనా పరీక్ష రాసుకోవచ్చు. పరీక్ష విధానం: మూడు గంటల వ్యవధిలో నిర్వహించే పరీక్షలో ఒకే పేపర్ ఉంటుంది. మొత్తం మార్కులు 200. ప్రశ్నలన్నీ మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటాయి. ప్రశ్నపత్రం పార్ట్-ఎ, పార్ట్-బి, పార్ట్-సి అనే మూడు భాగాలుగా ఉంటుంది. పార్ట్-ఎ అందరికీ ఒకేలా ఉంటుంది. ఇందులో లాజికల్ రీజనింగ్, గ్రాఫికల్ ఎనాలిసిస్, ఎనలిటికల్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ కంపారిజన్, సిరీస్ ఫార్మేషన్, పజిల్స్పై ప్రశ్నలు ఉంటాయి. పార్ట్-బిలో ఎంచుకున్న సబ్జెక్టుపై కన్వెన్షనల్ మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. ఇంజనీరింగ్ సెన్సైస్ విభాగం వారికి మ్యాథమెటిక్స్, ఇంజనీరింగ్ ఆప్టిట్యూడ్పై ప్రశ్నలు అడుగుతారు. పార్ట్-సిలో సంబంధిత సబ్జెక్టుపై సాంకేతిక భావనలు, సాంకేతిక విజ్ఞానం తెలుసుకునేలా విశ్లేషణాత్మక ప్రశ్నలు వస్తాయి. ఇంజనీరింగ్ సెన్సైస్వారికి సంబంధిత సబ్జెక్టులపై సాధారణ ప్రశ్నలు అడుగుతారు. తప్పుగా గుర్తించిన ప్రశ్నలకు నెగెటివ్ మార్కులు ఉంటాయి. పీహెచ్డీ: జేఆర్ఎఫ్కు ఎంపికైనవారు దేశవ్యాప్తంగా ఉన్న సీఎస్ఐఆర్ పరిశోధన సంస్థలు, యూనివర్సిటీల్లో పీహెచ్డీకి అర్హులు. ఫెలోషిప్: ఆయా సబ్జెక్టుల్లో అందుబాటులో ఉన్న జేఆర్ఎఫ్లు, అభ్యర్థుల వయోపరిమితి, నెట్లో అత్యధిక మార్కులు, రిజర్వేషన్స్ మొదలైనవాటిని దృష్టిలో ఉంచుకుని జేఆర్ఎఫ్కు ఎంపిక చేస్తారు. మొత్తం ఐదేళ్లపాటు ఫెలోషిప్ అందిస్తారు. మొదటి రెండేళ్లు నెలకు రూ.16,000తోపాటు కాంటిన్జెన్సీ గ్రాంట్ కింద ఏడాదికి రూ.20,000 చెల్లిస్తారు. ఈ రెండేళ్లలోపు పీహెచ్డీకి దరఖాస్తు చేసుకోవాలి. లేకుంటే ఫెలోషిప్ తొలగిస్తారు. మూడో ఏడాది నుంచి పీహెచ్డీకి నమోదు చేసుకున్నవారికి సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్(ఎస్ఆర్ఎఫ్) కింద నెలకు రూ.18,000 అందిస్తారు. వీరికి కూడా ఏడాదికి రూ.20,000 కాంటిన్జెన్సీ గ్రాంట్ చెల్లిస్తారు. మన రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, గుంటూరు. వెబ్సైట్: www.csirhrdg.res.in/ 2- ఐసీఎంఆర్ - జేఆర్ఎఫ్ లైఫ్ సెన్సైస్, సోషల్ సెన్సైస్ల్లో జేఆర్ఎఫ్ పొందాలనుకునేవారి కోసం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్).. జాతీయస్థాయిలో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తోంది. మొత్తం జేఆర్ఎఫ్లు: 150. బయోమెడికల్ సెన్సైస్(మైక్రోబయాలజీ, ఫిజియాలజీ, మాలిక్యులర్ బయాలజీ, జెనెటిక్స్, హ్యూమన్ బయాలజీ, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, బయోఇన్ఫర్మేటిక్స్, బయోఫిజిక్స్, ఇమ్యునాలజీ, ఫార్మకాలజీ, జువాలజీ, బోటనీ, ఎన్విరాన్మెంటల్ సెన్సైస్, వెటర్నరీ సెన్సైస్)కు 120. సోషల్ సెన్సైస్(సైకాలజీ, సోషియాలజీ, హోమ్సైన్స్, స్టాటిస్టిక్స్ ఆంత్రోపాలజీ, సోషల్వర్క్, హెల్త్ ఎకనామిక్స్)కు 30 జేఆర్ఎఫ్లు. అర్హత: 55 శాతం (ఎస్సీ/ఎస్టీలకు 50 శాతం) మార్కులతో సంబంధిత సబ్జెక్టులతో ఎంఎస్సీ, ఎంఏ ఉత్తీర్ణత. వయోపరిమితి: సెప్టెంబర్ 30, 2014 నాటికి 28 ఏళ్లు మించరాదు. ఎంపిక: ప్రవేశపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది. ఎంపికైనవారు యూజీసీ, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని సంస్థల్లో పీహెచ్డీ కోర్సుల్లో చేరొచ్చు. పరీక్ష విధానం: రెండు గంటల వ్యవధిలో నిర్వహించే పరీక్షలో రెండు భాగాలు ఉంటాయి. సెక్షన్-ఎలో సెన్సైస్లో జనరల్ నాలెడ్జ్, కామన్ స్టాటిస్టిక్స్, నిత్యజీవితంలో సైన్స్ ప్రభావాలపై 50 ప్రశ్నలు ఉంటాయి. సెక్షన్-బిలో ఎంచుకున్న విభాగం(లైఫ్ సెన్సైస్/సోషల్ సెన్సైస్)పై ప్రశ్నలుంటాయి. మొత్తం 100 ప్రశ్నలుంటాయి. 75 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. సరైన సమాధానానికి ఒక మార్కు. ఫెలోషిప్: ఎంపికైనవారికి మొదటి రెండేళ్లు జేఆర్ఎఫ్ ఇస్తారు. ప్రతినెలా రూ.16,000 అందిస్తారు. ప్రతిభను బట్టి మూడో ఏడాది నుంచి ఐదో ఏడాది వరకు ఎస్ఆర్ఎఫ్ ఇస్తారు. ఈ సమయంలో ప్రతి నెలా రూ.18,000, కాంటిన్జెన్సీ గ్రాంట్ కింద ఐదేళ్లలో ప్రతి ఏడాదికి 20,000 చెల్లిస్తారు. మొత్తం మీద జేఆర్ఎఫ్, ఎస్ఆర్ఎఫ్ కలిపి ఐదేళ్లపాటు ఫెలోషిప్ అందిస్తారు. పరీక్ష తేదీ: జూలై 13, 2014 వెబ్సైట్: http://icmr.nic.in/jrf.htm 3- డీబీటీ - జేఆర్ఎఫ్ బయోటెక్నాలజీ, అప్లైడ్ బయాలజీల్లో పరిశోధనలు చేస్తూ.. ప్రతినెలా జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ పొందాలనుకునేవారి కోసం కేంద్ర ప్రభుత్వంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ(డీబీటీ) ప్రతి ఏటా బయోటెక్నాలజీ ఎలిజిబిలిటీ టెస్ట్ (బీఈటీ)ను నిర్వహిస్తోంది. అర్హత: బయోటెక్నాలజీ(యానిమల్/వెటర్నరీ/అగ్రికల్చర్/మెడికల్/మెరైన్ /ఇండస్ట్రియల్/ ఎన్విరాన్మెంటల్ /ఫార్మాస్యూటికల్ /ఫుడ్/బయోరిసోర్సెస్ /బయోకెమికల్ ఇంజనీరింగ్/బయోసెన్సైస్/బయోఇన్ఫర్మేటిక్స్)స్పెషలైజేషన్గా 60శాతం (ఎస్సీ/ఎస్టీలకు 55 శాతం) మార్కులతో ఎంఎస్సీ / ఎంవీఎస్సీ /ఎంటెక్/బీటెక్/బీఈ ఉత్తీర్ణత. ఎంఎస్సీ మాలిక్యులర్ అండ్ హ్యూమన్ జెనెటిక్స్, న్యూరో సెన్సైస్ విద్యార్థులూ అర్హులే. వయోపరిమితి: నిర్దేశిత తేదీనాటికి 28ఏళ్లు మించరాదు. ఎస్సీ, ఎస్టీ, శారీరక వికలాంగులు, మహిళలకు వయోపరిమితిలో ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు సడలింపు ఉంటుంది. వయోపరిమితికి లోబడి మూడుసార్లకు మించి పరీక్ష రాయడానికి అవకాశం లేదు. పరీక్ష విధానం: ఆన్లైన్లో బయోటెక్నాలజీ ఎలిజిబిలిటీ టెస్ట్ (బీఈటీ) నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం పార్ట్-ఎ, పార్ట్-బి అనే రెండు భాగాలుగా ఉంటుంది. పార్ట్-ఎలో ఆప్టిట్యూడ్, జనరల్ బయోటెక్నాలజీపై 50 ప్రశ్నలు ఉంటాయి. అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. పార్ట్-బిలో 200లో ప్రశ్నలు అడుగుతారు. వీటిలో ఏవైనా 50 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ప్రశ్నలన్నీ మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటాయి. సరైన సమాధానానికి మూడు మార్కులు. తప్పు సమాధానాలకు 1 మార్కు తగ్గిస్తారు. పరీక్ష వ్యవధి మూడు గంటలు. ఎంపిక రెండు కేటగిరీల్లో ఉంటుంది. కేటగిరీ-1: మొదటి కేటగిరీలో టాప్ 275 మందిని ఎంపిక చేస్తారు. వీరు దేశంలోని ఏ యూనివర్సిటీ/సంస్థలోనైనా పీహెచ్డీలో చేరొచ్చు. వీరికి డీబీటీ ఫెలోషిప్ అందిస్తారు. కేటగిరీ-2: దీని కింద 100 మందిని ఎంపిక చేస్తారు. వీరు డీబీటీ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రాజెక్టుల్లో పాల్గొనవచ్చు. వీరు నెట్/గేట్ ఉత్తీర్ణుల మాదిరిగానే ఫెలోషిప్నకు అర్హులు. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (డీఎస్టీ) నిబంధనలు, ప్రాజెక్టు వ్యవధి, సంబంధిత సంస్థల ప్రమాణాల మేరకు ఫెలోషిప్ లభిస్తుంది. వీరికి డీబీటీ ఎలాంటి ఫెలోషిప్ అందించదు. ఫెలోషిప్: వ్యవధి ఐదేళ్లు. జేఆర్ఎఫ్ కింద మొదటి మూడేళ్లు నెలకు రూ.16,000+హెచ్ఆర్ఏ ఇస్తారు. ఆ తర్వాత ప్రతిభను బట్టి మరో రెండే ళ్లు పొడిగిస్తారు. ఈ క్రమంలో సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (ఎస్ఆర్ఎఫ్) కింద రెండేళ్లపాటు నెలకు రూ.18,000+హెచ్ఆర్ఏ అందిస్తారు. ఐదేళ్లపాటు ఏడాదికి రూ.30,000కాంటిన్జెన్సీ గ్రాంట్ కూడా చెల్లిస్తారు. వెబ్సైట్: http://nccs.sifyitest.com/BET2014/ 4- ఏఐసీఈ -ఎస్ఆర్ఎఫ్ (పీజీఎస్) అగ్రికల్చర్, వెటర్నరీ సెన్సైస్, ఫిషరీ సెన్సైస్, డెయిరీ సైన్స్ అండ్ టెక్నాలజీ.. సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్డీ, సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ పొందాలనుకునేవారి కోసం ఐసీఏఆర్ ప్రతిఏటా జాతీయ స్థాయిలో ఆలిండియా కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ (ఏఐసీఈ) నిర్వహిస్తోంది. మొత్తం ఎస్ఆర్ఎఫ్ల సంఖ్య: 202 అర్హత: 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టులతో మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణత. వయోపరిమితి: నిర్దేశిత తేదీనాటికి 21 నుంచి 30 ఏళ్లు. పరీక్ష విధానం: రాత పరీక్షలో మొత్తం రెండు సెక్షన్లు ఉంటాయి. మూడు గంటల వ్యవధిలో నిర్వహించే పరీక్షలో సెక్షన్-ఏ అందరికీ కామన్గా ఉంటుంది. ఇందులో జనరల్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీలపై 20 ప్రశ్నలు అడుగుతారు. సెక్షన్-బిలో భాగంగా అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్టుపై 180 ప్రశ్నలు ఉంటాయి. 200 ప్రశ్నలకు కలిపి మొత్తం మార్కులు 200. ఎస్ఆర్ఎఫ్: మూడేళ్లపాటు ఎస్ఆర్ఎఫ్ ఇస్తారు. వెటర్నరీ సైన్స్లో ప్రవేశం పొందినవారికి మొదటి రెండేళ్లు నెలకు రూ.14,000, మూడో ఏడాది నుంచి నెలకు రూ.15,000 చెల్లిస్తారు. అగ్రికల్చర్, లైఫ్సెన్సైస్ కోర్సుల్లో ప్రవేశం పొందినవారికి మొదటి రెండేళ్లు నెలకు రూ.12,000, మూడో ఏడాది నుంచి నెలకు రూ.14,000 అందిస్తారు. వీటితోపాటు అన్ని కోర్సుల్లో ప్రవేశం లభించినవారికి ఏడాదికి రూ.10,000 చొప్పున కాంటిన్జెన్సీ గ్రాంట్ కూడా లభిస్తుంది. రాష్ట్రస్థాయి వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఐఏఆర్ఐ), ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఐవీఆర్ఐ), నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్డీఆర్ఐ), సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీ ఎడ్యుకేషన్ (సీఐఎఫ్ఈ), మణిపూర్ కేంద్రీయ వ్యవసాయ విశ్వవిద్యాలయం, బెనారస్ హిందూ యూనివర్సిటీ, ఆలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ, విశ్వభారతి యూనివర్సిటీ-శాంతినికేతన్, నాగాలాండ్ యూనివర్సిటీల్లో ప్రవేశం పొందినవారికి మాత్రమే ఎస్ఆర్ఎఫ్ (పీజీఎస్) ను అందిస్తారు. వెబ్సైట్: www.icar.org.in 5- ఇన్స్పైర్ ఫెలోషిప్స్ మన దేశంలో శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పరిశోధనలు, అభివృద్ధి కోసం ఏర్పాటైన విభాగం.. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (డీఎస్టీ). కేంద్ర ప్రభుత్వంలోని శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఈ విభాగం ఆర్ అండ్ డీ విభాగాల్లో అడుగుపెట్టాలనుకునే యువతకు ఇన్నోవేషన్ ఇన్ సైన్స్ పర్స్యూట్ ఫర్ ఇన్స్పైర్డ్ రీసెర్చ్ (ఇన్స్పైర్) పేరుతో ఫెలోషిప్స్ అందిస్తోంది. ఫెలోషిప్స్: ప్రతి ఏటా 1000. అర్హత: బేసిక్, అప్లైడ్ సెన్సైస్లో పీజీ/ప్రొఫెషనల్ కోర్సెస్(ఇంజనీరింగ్ సెన్సైస్ /మెడికల్ సెన్సైస్/ఫార్మాస్యూటికల్ సెన్సైస్/అగ్రికల్చర్ సెన్సైస్/వెటర్నరీ సెన్సైస్)లో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. దీంతోపాటు యూనివర్సిటీ ప్రథమ ర్యాంకు సాధించి ఉండాలి. లేదా ఇన్స్పైర్ స్కాలర్షిప్ పొంది ఉండి, రెండేళ్ల ఎంఎస్సీ లేదా ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ/ఎంఎస్లో 65 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ఏదైనా యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్లో పీహెచ్డీలో చేరి ఉండాలి. వ్యవధి: ఐదేళ్లు ఎంపిక: రెండు విధాలుగా ఉంటుంది. ముందుగా వచ్చిన దరఖాస్తుల నుంచి అభ్యర్థులను షార్ట్లిస్ట్ చేస్తారు. తర్వాత నిపుణులతో కూడిన కమిటీ వివిధ అంశాల ఆధారంగా ఫెలోషిప్కు ఎంపిక చేస్తుంది. ఫెలోషిప్: ముందు రెండేళ్ల కాలపరిమితికి జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కింద ప్రతి నెలా రూ.16,000 ఇస్తారు. ఆ తర్వాత ప్రతిభను బట్టి జేఆర్ఎఫ్ను పొడిగిస్తారు. మూడో ఏడాది నుంచి సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (ఎస్ఆర్ఎఫ్) పేరుతో ప్రతి నెలా రూ.18,000 అందిస్తారు. వీటితోపాటు జేఆర్ఎఫ్, ఎస్ఆర్ఎఫ్ పొందినవారికి హెచ్ఆర్ఏ, ఇతర ఖర్చుల కోసం కాంటిన్జెన్సీ గ్రాంట్ కూడా ఇస్తారు. వెబ్సైట్: www.inspire-dst.gov.in/ 6- రాజీవ్గాంధీ నేషనల్ ఫెలోషిప్ మన దేశ యూనివర్సిటీలు/ఇన్స్టిట్యూషన్స్లో సెన్సైస్/ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ/హ్యూమానిటీస్/సోషల్ సెన్సైస్లలో ఫుల్ టైం ఎంఫిల్, పీహెచ్డీ చదువుతున్న ఎస్టీ, ఎస్సీ అభ్యర్థులకు ఈ ఫెలోషిప్ ప్రదానం చేస్తారు. వీటిని కేంద్ర ప్రభుత్వంలోని సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ; గిరిజన సంక్షేమ మంత్రిత్వ శాఖలు అందిస్తున్నాయి. ఫెలోషిప్ల సంఖ్య: ఎస్సీ అభ్యర్థులకు: 2000, ఎస్టీ అభ్యర్థులకు: 667. అర్హత: సంబంధిత సబ్జెక్టులతో పీజీ ఉత్తీర్ణులై ఉండి యూజీసీ- నెట్, యూజీసీ-సీఎస్ఐఆర్ నెట్ జేఆర్ఎఫ్లకు అర్హత సాధించని అభ్యర్థులు మాత్రమే దరఖాస్తుకు అర్హులు. ఫెలోషిప్ మొత్తం: మొదటి రెండేళ్లు నెలకు రూ.16,000. తర్వాత మూడేళ్లు ప్రతి నెలా రూ.18,000 ఇస్తారు. దీనికి అదనంగా కంటిన్జెన్సీ ఫండ్, ఎస్కార్ట్స్, రీడర్ అసిస్టెంటెన్స్(వికలాంగ అభ్యర్థులకు), హెచ్ఆర్ఏ చె ల్లిస్తారు. ఫెలోషిప్ వ్యవధి: ఐదేళ్లు. ఎంపిక: మెరిట్ ఆధారంగా. వెబ్సైట్: www.ugc.ac.in/rgnf 7- మౌలానా ఆజాద్ నేషనల్ ఫెలోషిప్ భారతీయ యూనివర్సిటీలు/ఇన్స్టిట్యూషన్స్లో సెన్సైస్/ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ/హ్యూమానిటీస్/సోషల్ సెన్సైస్లలో ఫుల్ టైం ఎంఫిల్, పీహెచ్డీ చదువుతున్న ముస్లిమ్, క్రిస్టియన్, సిక్కు, బుద్ధిస్ట్, పార్శీ అభ్యర్థులకు మౌలానా ఆజాద్ నేషనల్ ఫెలోషిప్ ప్రదానం చేస్తారు. అర్హత: 50 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. దీంతోపాటు యూజీసీ-నెట్/యూజీసీ-సీఎస్ఐఆర్ నెట్ జేఆర్ఎఫ్ పొంది ఉండకూడదు. తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.4.5ల క్షలకు మించి ఉండకూడదు. ఫెలోషిప్ మొత్తం: ఎంఫిల్ అభ్యర్థులకు రెండేళ్ల పాటు ఫెలోషిప్ అందజేస్తారు. ఎంఫిల్ చేస్తున్న సమయంలోనే పీహెచ్డీకి ఎంపికైతే తర్వాతి మూడేళ్లు కూడా ఫెలోషిప్ను కొనసాగిస్తారు. ఎంఫిల్లో నెలకు * 16,000. పీహెచ్డీలో నెలకు * 18,000. దీనికి అదనంగా కంటిన్జెన్సీ ఫండ్, ఎస్కార్ట్స్, రీడర్ అసిస్టెంటెన్స్ (వికలాంగ అభ్యర్థులకు) ఫండ్ కోర్సు ఆధారంగా చె ల్లిస్తారు. ఎంపిక: మెరిట్ ఆధారంగా. వెబ్సైట్: www.ugc.ac.in/manf 8- జవహర్లాల్ నెహ్రూ స్కాలర్షిప్స్ ఫర్ డాక్టోరల్ స్టడీస్ ఫిజికల్ సెన్సైస్, కెమికల్ సెన్సైస్, మ్యాథమెటికల్ సెన్సైస్, బయోలాజికల్ సెన్సైస్, కంప్యూటర్ సెన్సైస్, ఇంజనీరింగ్ సెన్సైస్, ఎన్విరాన్మెంటల్ సెన్సైస్, కంపారిటివ్ స్టడీస్ ఇన్ రిలిజియన్ అండ్ కల్చర్, ఇండియన్ హిస్టరీ అండ్ సివిలైజేషన్, సోషియాలజీ, ఎకనామిక్స్ వంటి సబ్జెక్టుల్లో పీహెచ్డీ చేయాలనుకునే అభ్యర్థులకు జవహర్లాల్ నెహ్రూ స్కాలర్షిప్స్ అందిస్తారు. అర్హత: 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ప్రథమ శ్రేణిలో ఎంఏ/ఎంఎస్సీ ఉత్తీర్ణత. మనదేశ యూనివర్సిటీ/సంస్థల్లో పీహెచ్డీ చదువుతూ ఉండాలి. సీఎస్ఐఆర్-నెట్/గేట్ స్కోర్ తప్పనిసరి. స్కాలర్షిప్ వ్యవధి: రెండేళ్లు వయోపరిమితి: నిర్దేశిత తేదీనాటికి 35 ఏళ్లు మించరాదు. స్కాలర్షిప్ మొత్తం: నెలకు రూ.12,000తోపాటు కాంటిన్జెన్సీ గ్రాంట్ క్రింద ఏడాదికి రూ.15,000 చెల్లిస్తారు. ఎంపిక: వచ్చిన దరఖాస్తుల ఆధారంగా అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. వెబ్సైట్: http://www.jnmf.in/ 10 - సీఎస్ఐఆర్-జేఆర్ఎఫ్-గేట్ స్కీమ్ గేట్ ఉత్తీర్ణత సాధించిన ఇంజనీరింగ్, ఫార్మాస్యూటికల్ సెన్సైస్ అభ్యర్థులకు సీఎస్ఐఆర్-గేట్ జేఆర్ఎఫ్ అందిస్తారు. అర్హత: బీఈ/బీటెక్లో ఉత్తీర్ణతతోపాటు గేట్ స్కోర్/బీఫార్మ్లో ఉత్తీర్ణతతోపాటు జీప్యాట్ స్కోర్ ఉండాలి. లేదా బీటెక్ (బయోటెక్నాలజీ)లో ఉత్తీర్ణతతోపాటు గేట్లో 85.00 పర్సంటైల్ సాధించి ఉండాలి. పీహెచ్డీ లేదా ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ ప్రోగ్రామ్లో చేరి ఉండాలి. ఎంఈ/ఎంటెక్ విద్యార్థులు అర్హులు కాదు. వయోపరిమితి: నిర్దేశిత తేదీనాటికి 28 ఏళ్లు మించరాదు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, శారీరక వికలాంగులు, మహిళలకు ఐదేళ్లు సడలింపు ఉంటుంది. ఫెలోషిప్: మొదటి రెండేళ్లు నెలకు రూ.16,000, ఆ తర్వాత మూడేళ్లు నెలకు రూ.18,000 చెల్లిస్తారు. వీటితోపాటు ప్రతి ఏటా రూ. 20000 కాంటిన్జెన్సీ గ్రాంట్ అందిస్తారు. ఎంపిక: సీఎస్ఐఆర్ పరిధిలోని సంస్థలు నిర్వహించే ఇంటర్వ్యూ ద్వారా. వెబ్సైట్: www.csirhrdg.res.in/jrfgate.pdf 10- యూజీసీ-నెట్ సోషల్ సెన్సైస్, హ్యుమానిటీస్ (లాంగ్వేజెస్), కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్, ఎలక్ట్రానిక్ సైన్స్ సబ్జెక్టుల్లో టీచింగ్ను కెరీర్గా ఎంచుకోవాలనుకున్నా, పరిశోధనలు చేస్తూ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ పొందాలనుకున్నా రాయాల్సిన పరీక్ష యూజీసీ-నెట్. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తేనే లెక్చరర్షిప్కు, జేఆర్ఎఫ్కు అర్హత సాధిస్తారు. అర్హత: జనరల్ అభ్యర్థులు సంబంధిత సబ్జెక్ట్లో 55 శాతం, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వారికి 50 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమానం. మాస్టర్స్ డిగ్రీ చివరి సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు: జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్నకు జూన్ 1, 2014 నాటికి 28 ఏళ్లు మించరాదు. రిజర్వ్డ్ అభ్యర్థులకు యూజీసీ నిబంధనల మేరకు సడలింపు ఉంటుంది. లెక్చరర్షిప్నకు మాత్రం ఎలాంటి వయోపరిమితి లేదు. 95 సబ్జెక్టులకు నెట్: పొలిటికల్ సైన్స, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పాపులేషన్ స్టడీస్, జాగ్రఫీ, కంప్యూటర్ సైన్స అండ్ అప్లికేషన్, ఎలక్ట్రానిక్ సెన్సైస్ వంటి 95 సబ్జెక్టులలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నెట్ను నిర్వహిస్తుంది. ఇందులో అర్హత సాధించి అగ్రస్థానంలో నిలిచిన వారికి పరిశోధన దిశగా ప్రోత్సహించేందుకు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్(జేఆర్ఎఫ్)ను ప్రదానం చేస్తారు. జేఆర్ఎఫ్ కటాఫ్కు దిగువన ఉన్నవారు యూజీసీ నిబంధన ప్రకారం లెక్చరర్షిప్నకు అర్హులవుతారు. మన రాష్ట్రం విషయానికి వస్తే... ఎక్కువ మంది విద్యార్థులు తెలుగుతోపాటు చరిత్ర, అర్థశాస్త్రం, తత్వశాస్త్రం, సోషియాలజీ, ఇంగ్లిష్ సబ్జెక్టులలో నెట్కు హాజరవుతున్నారు. నెట్లో ఎంపికైతే: నెట్లో ఉత్తీర్ణత సాధించడం ద్వారా దేశంలోని అన్ని డిగ్రీ కళాశాలలు, యూనివర్సిటీలలో తత్సమాన ఇన్స్టిట్యూట్లలో లెక్చరర్, అసిస్టెంట్ ప్రొఫెసర్గా కెరీర్ ప్రారంభించవచ్చు. డిగ్రీ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే నెట్ క్వాలిఫై అయి ఉండాలి. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్నకు ఎంపికైన అభ్యర్థులకు ఐదేళ్ల పాటు ఫెలోషిప్ లభిస్తుంది. ఐఐటీ, ఐఐఎస్సీ వంటి ఇన్స్టిట్యూట్లలో పరిశోధన కోర్సుల్లో చేరడానికి నెట్ జేఆర్ఎఫ్గల వారికి మొదటి ప్రాధాన్యత ఉంటుంది. డిస్క్రిప్టివ్ నుంచి ఆబ్జెక్టివ్కు: నెట్లోమూడు పేపర్లు ఉంటాయి. రాత పరీక్ష పూర్తి గా ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటుంది. అంతకుముందు డిస్క్రిప్టివ్ రూపంలో ఉన్న పేపర్-2, 3లను 2012 జూన్ నుంచి ఆబ్జెక్టివ్ పద్ధతిలోకి మార్చారు. మూడు పేపర్లకు ఒకే రోజు పరీక్ష నిర్వహిస్తారు. ఉదయం పేపర్-1, 2లు, మధ్యాహ్నం పేపర్-3 ఉంటుంది. దరఖాస్తు విధానం: www.ugcnetonline.in లేదా www.ugc.ac.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. తర్వాత అప్లికేషన్ హార్డ్ కాపీని ప్రింట్అవుట్ తీసుకోవాలి. దీంతోపాటు బ్యాంక్ చలాన్, సంబంధిత సర్టిఫికెట్లను జతచేస్తూ నిర్దేశించిన చిరునామాకు పంపాలి. ముఖ్యతేదీలు: ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేదీ: మే 05, 2014. పరీక్ష తేదీ: జూన్ 29 2014 వెబ్సైట్: www.ugc.ac.in ఇవేకాకుండా మరెన్నో కేంద్ర ప్రభుత్వ సంస్థలు, విభాగాలు, ప్రైవేటు సంస్థలు పరిశోధనలు చేయాలనుకునే యువతకు స్కాలర్షిప్స్, ఫెలోషిప్స్ అందిస్తున్నాయి. వీటికి సంబంధించిన ప్రకటనలు జాతీయ పత్రికల్లో వెలువడుతుంటాయి. మరిన్ని వివరాలకు... www.ugc.ac.in, www.csirhrdg.res.in, http://dbtindia.nic.in, http://dst.gov.in/, www.sakshieducation.com చూడొచ్చు. ఇన్పుట్స్: కె. అరవింద్ కుమార్ పీహెచ్డీ స్కాలర్ (ప్లాంట్ సెన్సైస్) డెరైక్టరేట్ ఆఫ్ ఆయిల్ సీడ్స రీసెర్చ.