Financial system
-
పీనోట్ పెట్టుబడులు హైజంప్
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ నిలకడను ప్రతిబింబిస్తూ క్యాపిటల్ మార్కెట్లలో పారి్టసిపేటరీ నోట్ల(పీనోట్స్) ద్వారా పెట్టుబడులు జోరు చూపుతున్నాయి. 2023 మే చివరికల్లా రూ. 1.04 లక్షల కోట్లకు చేరాయి. ఇవి గత ఐదేళ్లలోనే అత్యధికంకాగా.. ఈక్విటీ, డెట్, హైబ్రిడ్ సెక్యూరిటీలలో పెట్టుబడులు విస్తరించాయి. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గణాంకాల ప్రకారం వరుసగా మూడో నెలలోనూ పీనోట్ పెట్టుబడులు పుంజుకున్నాయి. వీటిని దేశీయంగా రిజిస్టరైన విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) ప్రత్యక్షంగా రిజిస్టర్కాకుండానే పెట్టుబడులు పెట్టేందుకు వీలుగా విదేశీ ఇన్వెస్టర్లకు జారీ చేస్తుంటారు. అయితే ఇందుకు తగిన అంశాలను పరిశీలించాక మాత్రమే పీనోట్లను జారీ చేస్తారు. సెబీ వివరాల ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ చివరికల్లా పీనోట్ పెట్టుబడుల విలువ రూ. 95,911 కోట్లుగా నమోదుకాగా.. మే నెలకల్లా రూ. 1,04,585 కోట్లను తాకాయి. అంతక్రితం మార్చికల్లా ఇవి రూ. 88,600 కోట్లుకాగా.. ఫిబ్రవరిలో రూ. 88,398 కోట్లు, జనవరి చివరికల్లా రూ. 91,469 కోట్లుగా నమోదయ్యాయి. 2018 మార్చి తదుపరి ఈ మే నెలలో పీనోట్ పెట్టుబడులు భారీగా లభించాయి. దేశ ఆర్థిక పటిష్టతకుతోడు.. చైనా ఆర్థిక వ్యవస్థ మందగించడం ఎఫ్పీఐ పెట్టుబడులను ఆకట్టుకుంటున్నట్లు విశ్లేషకులు విశ్లేషకులు తెలియజేశారు. -
రిలయన్స్ నుంచి.. ప్రత్యేక కంపెనీగా జియో ఫైనాన్షియల్
న్యూఢిల్లీ: ఫైనాన్షియల్ సర్వీసులను ప్రత్యేక కంపెనీగా విడదీయనున్నట్లు జులై–సెప్టెంబర్(క్యూ2) ఫలితాల విడుదల సందర్భంగా డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ వెల్లడించింది. ఇందుకు తాజాగా బోర్డు గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు తెలియజేసింది. వెరసి సొంత అనుబంధ సంస్థ రిలయన్స్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్(ఆర్ఎస్ఐఎల్)ను జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్(జేఎఫ్ఎస్ఎల్) పేరుతో ప్రత్యేక కంపెనీగా ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. దీనిలో భాగంగా ఆర్ఐఎల్ వాటాదారులకు తమ వద్ద గల ప్రతీ షేరుకీ ఒక జేఎఫ్ఎస్ఎల్ షేరుని జారీ చేయనుంది. కంపెనీ షేర్లను బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్టింగ్ చేయనుంది. జేఎఫ్ఎస్ఎల్.. కన్జూమర్, మర్చంట్ రుణాల బిజినెస్తోపాటు.. బీమా, ఆస్తుల నిర్వహణ, డిజిటల్ బ్రోకింగ్ తదితర విభాగాలలోకి ప్రవేశించనున్నట్లు ఆర్ఐఎల్ వెల్లడించింది. ఇందుకు అనుగుణంగా విస్తరణ, భాగస్వామ్య సంస్థల ఏర్పాటు, ఇతర కంపెనీల కొనుగోళ్లు తదితరాలను చేపట్టనున్నట్లు తెలియజేసింది. డిపాజిట్లు స్వీకరించని ఎన్బీఎఫ్సీగా ఆర్బీఐ అనుమతిగల జేఎఫ్ఎస్ఎల్కు రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్స్(ఆర్ఐఐహెచ్ఎల్)లో పెట్టుబడులను సైతం బదిలీ చేయనున్నట్లు వివరించింది. చదవండి: ఆర్ధిక మాంద్యంపై ఎలాన్ మస్క్ రియాక్షన్ ఇదే -
ఆర్థిక మోసాలు.. నయా రూటు!
గతంలో మాదిరి కాకుండా, నేడు దాదాపు అన్ని రకాల ఆర్థిక సేవలను డిజిటల్ రూపంలో ఉన్న చోట నుంచే కదలకుండా పొందే సౌలభ్యం ఉంది. చెల్లింపులను డిజిటల్గా చేస్తున్నాం. మొబైల్ నుంచే షాపింగ్ చేస్తున్నాం. కొన్ని క్లిక్లతో ఇన్స్టంట్గా రుణాలు తీసుకుంటున్నాం. యాప్ నుంచి అవతలి వ్యక్తికి క్షణాల్లో నగదు బదిలీ చేస్తున్నాం. దీంతో ఈ డిజిటల్ వేదికల్లోని కీలక సమాచారం నేరస్థులకు ఆదాయ వనరుగా మారిపోయింది. మోసాలకు వారు ఎప్పటికప్పుడు కొత్త మార్గాలను వెతుక్కుంటున్నారు. అందుకే ’నాకు తెలుసులే‘ అని అనుకోవద్దు. ఎంత తెలివితనం ఉన్నా సైబర్ నేరగాళ్లు ఏదో ఒక కొత్త మార్గంలో వచ్చి నిండా ముంచేస్తున్నారు. మోసాలకు నమ్మకమే మూలం. మోసపోయిన తర్వాత కానీ, అర్థం కాదు అందులోని లాజిక్. తాము అవతలి వ్యక్తిని ఏ విధంగా నమ్మి మోసపోయామో? బాధితులను అడిగితే చెబుతారు. అవగాహనే మోసాల బారిన చిక్కుకోకుండా కాపాడుతుంది. ఈ తరహా పలు కొత్త మోసాలపై అవగాహన కల్పించే కథనమే ఇది. ఫోన్ కాల్ వెరిఫికేషన్ టీకాల రూపంలోనూ మోసం చేస్తారని ఊహించగలమా? స్థానిక హెల్త్ సెంటర్ నుంచి కాల్ చేస్తున్నామని, ఇంటికే వచ్చి టీకాలు ఇస్తున్నట్టు మీకు కాల్ వస్తే తప్పకుండా సందేహించాల్సిందే. ఇంటికే వచ్చి కరోనా టీకాను ఇస్తామని.. ఇందుకు ఎటువంటి చార్జీ ఉండదని చెబుతారు. ఇందుకోసం చిరునామా, మొబైల్ నంబర్, పాన్, ఆధార్తో ధ్రువీకరిస్తే చాలని చెబుతారు. ఈ వివరాలన్నీ తీసుకున్న తర్వాత రిజిస్టర్ మొబైల్ నంబర్కు వచ్చే ఓటీపీ చెబితే ధ్రువీకరణ పూర్తవుతుందని నమ్మిస్తారు. ఇదే ఓటీపీని ఇంటికి వచ్చి టీకా ఇచ్చే వైద్య సిబ్బందికి కూడా చెప్పాల్సి ఉంటుందని సూచిస్తారు. మొబైల్ నంబర్కు వచ్చే ఓటీపీని మీరు చెప్పిన తర్వాత ఆ కాల్ను డిస్కనెక్ట్ చేస్తారు. ఆ తర్వాత మీ మొబైల్ నంబర్కు.. బ్యాంకు లేదా ఎన్బీఎఫ్సీ నుంచి రుణ దరఖాస్తును ఆమోదించామంటూ ఎస్ఎంఎస్ రావచ్చు. అంతేకాదు కొన్ని సందర్భాల్లో రుణం మొత్తాన్ని ఆయా బ్యాంకు లేదా ఎన్బీఎఫ్సీ సంస్థ మంజూరు చేయడం కూడా పూర్తి కావచ్చు. ఈ మొత్తాన్ని మీకు కాల్ చేసిన వాళ్లు అప్పటికే తీసేసుకోవడం కూడా పూర్తయి ఉంటుంది. ఫోన్ కాల్ చేసి, ఆధార్, పాన్, చిరునామా వివరాలు తీసుకుంటున్నారంటే అది మోసపూరిత కార్యక్రమమే అని గుర్తించాలి. అధికారికంగా ఎవ్వరూ ఆ వివరాలు అడగరు. ఏంటి మార్గం..? ఆధార్, పాన్ ఈ తరహా వ్యక్తిగత, కీలకమైన వివరాలను ఎవరితోనూ పంచుకోకూడదు. వీటి సాయంతో ఓటీపీ రూపంలో రుణాలను తీసుకునే మోసాలు పెరిగిపోయాయి. ఓటీపీ పేరుతో మొబైల్కు వచ్చే ఎస్ఎంఎస్ను పూర్తిగా చదవాలి. ఆ ఓటీపీ దేనికోసం అన్నది అందులో క్లుప్తంగా ఉంటుంది. అందులో లోన్అప్లికేషన్ అని ఏమైనా ఉంటే, వెంటనే సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయాలి. సదరు బ్యాంకు లేదా ఎన్బీఎఫ్సీ సంస్థకు కాల్ చేసి సమాచారం ఇవ్వాలి. క్రెడిట్ కార్డు ఫీజు ఎత్తివేత 2021 చివరికి 6.9 కోట్ల క్రెడిట్ కార్డులు వినియోగంలో ఉన్నాయి. పట్టణాల్లోని చాలా కుటుంబాలకు కనీసం ఒక క్రెడిట్ కార్డు అయినా ఉంది. క్రెడిట్ కార్డులు వార్షిక నిర్వహణ పేరుతో ఫీజు వసూలు చేస్తుంటాయి. అయినా, వార్షిక ఫీజుల్లేవంటూ క్రెడిట్ కార్డులను ఆయా సంస్థలు మార్కెటింగ్ చేసుకుంటాయి. అది మొదటి ఏడాది వరకేనన్న సూక్ష్మాన్ని ఆయా సంస్థలు చెప్పవు. రెండో ఏడాది నుంచి వార్షిక ఫీజు బాదుడు మొదలవుతుంది. దీన్ని కూడా సైబర్ నేరస్థులు దోపిడీకి మార్గంగా ఎంపిక చేసుకున్నారు. జీవితకాలం పాటు ఎటువంటి వార్షిక ఫీజులేని ఉచిత క్రెడిట్ కార్డు ఇస్తున్నామంటూ సంప్రదిస్తారు. తాము ఫలానా బ్యాంకు నుంచి కాల్ చేస్తున్నామని నమ్మిస్తారు. అప్పటికే వార్షిక ఫీజు చెల్లిస్తున్న వారిని దాన్ని ఎత్తివేస్తామంటూ బురిడీ కొట్టిస్తారు. వారి మాటలకు మనం స్పందించే విధానం ఆధారంగా మొత్తం అంచనా వేస్తారు. తర్వాత తాము సూచించినట్టు చేయాలంటూ తమ పని మొదలు పెడతారు. ముందు క్రెడిట్ కార్డు నంబర్, దానిపై ఉన్న పేరు చెబుతారు. దాంతో నమ్మకం ఏర్పడేలా చేస్తారు. బ్యాంకు నుంచి కాల్ చేస్తున్నారు కనుకనే తమ కార్డు వివరాలు తెలుసని భావిస్తాం. కానీ, ఆ వివరాలను వారు అక్రమ మార్గాల్లో సంపాదించారన్నది మనకు తెలియదు. ఇవన్నీ అయిన తర్వాత వారికి అసలైన ఓటీపీ అవసరంపడుతుంది. జీవిత కాలం పాటు క్రెడిట్ కార్డు ఫీజును ఎత్తివేయాలనుకుంటే అందుకు మొబైల్కు వచ్చే ఓటీపీ ద్వారా ధ్రువీకరించాలని చెబుతారు. మొబైల్ నంబర్కు ఓటీపీ పంపిస్తారు. మొబైల్కు వచ్చిన ఓటీపీ వివరాలు చెప్పిన వెంటనే.. క్రెడిట్ కార్డు ఫీజు రద్దయినట్టు చెప్పి కాల్ కట్ చేసేస్తారు. ఇక ఆ తర్వాత మొబైల్కు వరుసగా వచ్చే డెబిట్ లావాదేవీల ఎస్ఎంఎస్లు చూసిన తర్వాత కానీ, మోసం జరిగినట్టు అర్థం కాదు. స్పందించేలోపే ఉన్న మొత్తాన్ని వారు ఊడ్చేస్తారు. ఏంటి మార్గం..? తెలియని వ్యక్తులు కాల్ చేసి, ఆర్థిక లావాదేవీలు, బ్యాంకు ఖాతాలు గురించి మాట్లాడుతుంటే వెంటనే డిస్ కనెక్ట్ చేసేయాలి. వారితో చర్చించాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. బ్యాంకు ఉద్యోగులు ఖాతాదారులకు కాల్ చేస్తే, విషయం చెప్పి పెట్టేస్తారే కానీ, సున్నితమైన సమాచారం, వివరాలను చెప్పాలని కోరరు. పైగా బ్యాంకు ఉద్యోగి కార్డు వివరాలను చెప్పే ప్రయత్నం అసలు చేయరు. ఒకవేళ ఎవరైనా కాల్ చేసి, మీ క్రెడిట్ కార్డు వివరాలు చెబుతుంటే వెంటనే ఆ కాల్ను కట్ చేయాలి. బ్యాంకు యాప్లోకి వెళ్లి కార్డు ఆన్లైన్ లావాదేవీల యాక్సెస్ను, అంతర్జాతీయ యాక్సెస్ ను తాత్కాలికంగా నిలిపివేయాలి. మీకు తెలియకుండా క్రెడిట్ కార్డు వివరాలు సంపాదించినప్పటికీ.. మొబైల్ నంబర్కు వచ్చే ఓటీపీ లేకుండా అందులోని బ్యాలన్స్ను వారు ఖాళీ చేయడం అసాధ్యం. అందుకుని ఓటీపీని ఎట్టి పరిస్థితుల్లోనూ షేర్ చేయవద్దు. కుక్క పిల్లనీ వదలరు.. హైదరాబాద్ వాసి శాంతి (33)కి పెట్స్ అంటే పంచ ప్రాణాలు. పెళ్లయి ఏడేళ్లు అయినా ఇంత వరకు కుక్క పిల్లను పెంచుకోవాలన్న కోరిక నెరవేరలేదు. ఎనిమిదో వివాహ వార్షికోత్సవం సందర్భంగా అయినా తనకు కుక్కపిల్ల తెచ్చి ఇవ్వాలని భర్తను కోరింది. ఆమె భర్తకు ఫేస్బుక్లో ‘ఇంటి వద్దకే పెట్స్ డెలివరీ’ పేరుతో పోస్ట్ కనపడింది. ఆ వివరాలు తీసుకొచ్చి పెళ్లానికి ఇచ్చాడు. ఆమె ఎంతో సంతోషంతో ఆ నంబర్ కు కాల్ చేసి మాట్లాడింది. అవతలి వ్యక్తి హిందీలో మాట్లాడాడు. రాజస్తాన్లో ఆర్మీ కంటోన్మెంట్ ఏరియాలో తన సెంటర్ ఉందని.. కరోనా కారణంగా తన వద్ద భారీ సంఖ్యలో కుక్కలు ఉండిపోయినట్టు ఒక ఆసక్తికరమైన స్టోరీ చెప్పాడు. వాట్సాప్కు వీడియోలు పంపిస్తాను చూడండి అని కోరాడు. కొద్ది సేపటి తర్వాత వాట్సాప్ లో వచ్చిన వీడియోలు చూసిన తర్వాత శాంతికి ఆరాటం ఆగలేదు. వెంటనే కుక్కపిల్లకు ఆర్డర్ చేసేయాలన్నంత ఉత్సాహం వచ్చింది. ఎందుకంటే వీడియోల్లోని కుక్క పిల్లలు అంత క్యూట్గా ఉన్నాయి. మార్కెట్ ధర అయితే ఒక్కో పెట్కు రూ.45,000–50,000 ఉంటుందని, ఎక్కువ సంఖ్యలో కుక్క పిల్లలు ఉండిపోయినందున ఒకటి రూ.5,000కు ఇస్తానని రాజస్తాన్ కేటుగాడు ఆఫర్ ఇచ్చాడు. అడ్వాన్స్కింద ముందు రూ.2,000 పంపించాలని కోరాడు. రసీదు కూడా ఇస్తానన్నాడు. డెలివరీ సమయంలో మొత్తం చెల్లిస్తానని ఆమె చెప్పడంతో నో అన్నాడు. దాంతో రూ.500 పంపించింది శాంతి. ఆమె పేరుతో రసీదు ప్రింట్ చేసి వాట్సాప్ చేశాడు. వారం రోజుల్లో పెట్ను మీ ఇంటి వద్దకు తీసుకొచ్చి డెలివరీ చేస్తారని.. ఆర్మీ వ్యాన్లో రవాణా చేస్తున్నామంటూ ఒక నకిలీ వీడియో పంపించాడు. కొన్ని రోజులు గడిచాయి. డెలివరీ తేదీ వచ్చినా అవతలి వ్యక్తి నుంచి ఫోన్ కాల్ రాలేదు. దాంతో ఉండబట్టలేక శాంతి కాల్ చేసింది. ఈ రోజు పెట్ వస్తుందని, గంటలో డెలివరీ వాళ్లు కాల్ చేస్తారని చెప్పాడు. అన్నట్టు గంటలోపే ఒక కొత్త నంబర్ నుంచి ఆమెకు కాల్ వచ్చింది. మీరు డీల్ చేసిన వ్యక్తి మోసగాడని, మిమ్మల్ని మోసం చేశాడంటూ అవతలి వ్యక్తి చెప్పాడు. దీనిపై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించాడు. వాట్సాప్ లో తాము కోరిన వివరాలన్నీ ఇస్తే ఫిర్యాదు దాఖలు చేస్తామని స్టోరీ వినిపించాడు. ఇదే విషయం ఆమె తన భర్తతో చెప్పింది. అవేమీ చేయకు.. ఇక వదిలేసెయ్ అని అతడు చెప్పాడు. ఇంతకీ వాట్సాప్ లో ఫిర్యాదు కోసం కోరిన వివరాలు ఏవి అనుకున్నారు..? బాధితుని పేరు, ఫోన్ నంబర్, చిరునామా, నష్టపోయిన మొత్తం, అకౌంట్ నంబర్/ వ్యాలెట్ నంబర్/ యూపీఐ నంబర్, బ్యాంకు ఖాతా లేదా గూగుల్ పే అయితే ఆ వివరాలు, బ్యాంకు ఖాతా నంబర్, డెబిట్/ క్రెడిట్ కార్డు నంబర్.. ఈ వివరాలన్నీ పంపాలని కోరాడు. అవి కనుక ఇచ్చి ఉంటే.. ఆ ఖాతా లేదా కార్డులోని బ్యాలన్స్ అంతటినీ.. ఓటీపీ కనుక్కుని మరీ మోసగాళ్లు ఊడ్చేసేవాళ్లు. శాంతి భర్తకు చెప్పడం.. అతను ఊరుకోమని చెప్పడంతో మోసం రూ.500కే పరిమితం అయింది. ఆన్లైన్లో తెలియని వారితో వ్యక్తిగత వివరాలు పంచుకోకపోవడం, తెలియని వారికి డబ్బులు పంపించకుండా ఉండడం ఒక్కటే పరిష్కారం. అసలు వారితో ఆయా అంశాలు చర్చించవద్దు. నకిలీ రూపాలు.. రోడ్డు పక్కన అంబరెల్లా టెంట్ వేసుకుని మార్కెటింగ్ చేసే వ్యక్తుల పట్ల కాస్తంత అప్రమత్తంగా వ్యవహరించాలి. లైఫ్ ఇన్సూరెన్స్ మార్కెటింగ్, బ్యాంకింగ్, డిజిటల్ వ్యాలెట్ కంపెనీల ఉద్యోగులుగా మోసగాళ్లు రూపాలు మారుస్తున్నారు. టెంట్ వేసుక్కూర్చుని తమ వద్దకు విచారణకు వచ్చిన వారిని నిండా ముంచుతున్నారు. వారి వద్దకు వెళ్లి మీరే స్వయంగా విచారించినా.. లేక పక్క నుంచి వెళుతున్నా ఆకర్షణీయ కరపత్రంతో వారు పలకరిస్తారు. తాను ఫలానా బ్యాంకు లేదా బీమా కంపెనీ ఉద్యోగినని.. జీరో బ్యాలన్స్ ఖాతా లేదా.. కొత్త బీమా ప్లాన్ను ఆవిష్కరిస్తున్నామని చెబుతారు. ఈ రోజే ప్లాన్ కొనుగోలు చేస్తే ప్రీమియంలో భారీ రాయితీ ఇస్తామని ఆశ చూపుతారు. కుటుంబం మొత్తానికి రూ.15 లక్షల కవరేజీ కోసం ఏటా రూ.5,000 కడితే చాలని చెబుతారు. ఆలోచించుకోవడానికి కొంచెం వ్యవధి కావాలని అడిగితే.. మరో రూ.1,000 డిస్కౌంట్ ఇస్తామని, ఆ తర్వాత మళ్లీ ఇలాంటి ఆఫర్ ఉండదంటూ ఆలోచనలో పడేస్తారు. ఏదో విధంగా ఒప్పించి ప్రీమియం కట్టించుకోవడం కోసమే వారు అక్కడ కూర్చున్నారని మనకు అర్థం కాదు. ఒరిజినల్ పాలసీ డాక్యుమెంట్ రెండు వారాల్లో ఇంటికి వస్తుందని.. నచ్చకపోతే అప్పుడు రద్దు చేసుకుంటే పూర్తి మొత్తం వెనక్కి వస్తుందని పాలసీ తీసుకునేలా చేస్తారు. చెల్లించిన ప్రీమియానికి రసీదును కూడా ఇస్తారు. కానీ, అదంతా మోసమన్నది నష్టపోయిన తర్వాత కానీ అర్థం కాదు. ఏంటి మార్గం..? రోడ్డు పక్కన టెంట్లు వేసుకుని, స్టాల్స్ పెట్టుకుని ఆర్థిక ఉత్పత్తులు విక్రయించే వారిని నమ్మొద్దు. ఒకవేళ మీకు మంచి ఆఫర్ అనిపిస్తే ఆ ఉద్యోగి పేరు, ఉద్యోగి గుర్తింపు ఐడీ వివరాలు తీసుకుని బీమా కంపెనీకి కాల్ చేసి నిర్ధారించుకోవాలి. బీమా పాలసీలు అయినా, క్రెడిట్ కార్డు అయినా, బ్యాంకు ఖాతా అయినా.. మరొకటి అయినా నేరుగా ఆయా బ్యాంకు, బీమా సంస్థల శాఖల నుంచి లేదంటే ఆన్లైన్ పోర్టల్కు వెళ్లి తీసుకోవడమే సురక్షితం. బయట ఇలా మార్కెటింగ్ వ్యక్తుల రూపంలో మంచి ఆఫర్ కనిపిస్తే దాన్ని బ్రాంచ్కు వెళ్లి నిర్ధారించుకుని తీసుకోవాలి. ఇలాంటి కొనుగోళ్ల విషయంలో ఏ వ్యక్తికి కూడా వ్యక్తిగత ఖాతా లేదా నంబర్కు నగదు బదిలీ చేయవద్దు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్న తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుంది. డబ్బులు కొట్టేశారా..! ఆన్లైన్ లేదా టెలిఫోన్ కాల్ రూపంలో ఓటీపీ తీసుకుని మీ కార్డు/వ్యాలెట్లోని డబ్బు లు కొట్టేసినట్టు గుర్తించారా? ఆలస్యం చేయ కండి. వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేసి జరిగిన ఘటన వివరాలపై ఫిర్యాదు చేయండి. అలాగే. https://cybercrime.gov.in లాగిన్ అయ్యి మోసానికి సంబంధించి వివరాలు నమోదు చేయాలి. బ్యాంకు లావాదేవీల స్టేట్మెంట్ను అప్లోడ్ చేయాలి. అనంతరం కేంద్ర హోంశాఖ పరిధిలో పనిచేస్తున్న ఈ పోర్టల్ నుంచి ఆయా రాష్ట్రాల పోలీసులకు, బ్యాంకులకు సమాచారం వెళుతుంది. దాంతో సైబర్ నేరస్థుల ఖాతాల్లో జమ అయిన మొత్తాన్ని తిరిగి రికవరీ చేసి బాధితుల ఖాతాలకు జమ చేస్తారు. అయితే, ఎంత వేగంగా ఫిర్యాదు చేశారన్న దాని ఆధారంగానే రికవరీ ఆధారపడి ఉంటుంది. సైబర్ నేరగాళ్లు బదిలీ చేసుకున్న మొత్తాన్ని వెంటనే డ్రా చేసుకుంటే రికవరీ కష్టమవుతుంది. -
మరో సంక్షోభం దిశగా అఫ్గన్! ఐరాస హెచ్చరిక
తాలిబన్ల ఆక్రమణ, అల్లకల్లోల పరిస్థితులు, బయటి దేశాలతో వర్తక వాణిజ్యాలు నిలిచిపోవడం.. తదితర కారణాలతో అఫ్గనిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కుదేలుకు లోనైంది. ఈ తరుణంలో అఫ్గనిస్తాన్ పై మరో పిడుగు పడనుంది. ఊహించని స్థాయిలో ఆర్థిక సంక్షోభం అఫ్గన్ను ముంచెత్తే అవకాశాలున్నాయంటూ హెచ్చరించింది ఐక్యరాజ్య సమితి. యూఎన్ డెవలప్మెంట్ ప్రొగ్రాం(UNDP) సోమవారం మూడు పేజీలతో కూడిన ఒక నివేదికను రిలీజ్ చేసింది. బ్యాంకింగ్ వ్యవస్థ కుప్పకూలే పరిస్థితులు నెలకొన్నాయని, తద్వారా ఆర్థిక తలెత్తే అవకాశం ఉందని, ఆ ప్రతికూల ప్రభావం సొసైటీపై ఊహించని స్థాయిలో చూపించ్చొచ్చని అభిప్రాయపడింది ఐరాస. కిందటి ఏడాది 7 బిలియన్ డాలర్ల విలువైన గూడ్స్, ఉత్పత్తులను, సేవలను అందించింది అఫ్గనిస్తాన్. ఎలాంటి అవాంతరాలు లేకుండా లావాదేవీలు జరగడానికి కారణం.. అక్కడి బ్యాంకింగ్ వ్యవస్థే. అయితే చాలామంది లోన్లు తిరిగి చెల్లించకపోవడం, తాలిబన్ల ఆక్రమణ తర్వాత నగదు విత్డ్రా, అదే సమయంలో డిపాజిట్లు తక్కువగా వస్తుండడం, అవసరాలకు సరిపడా కరెన్సీ నిల్వలు లేకపోవడంతో.. కొద్దినెలల్లోపే ఈ సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని ఐరాస యూఎన్డీపీ నివేదికలో పేర్కొంది. ఇప్పటికైనా తేరుకుని బ్యాంకింగ్ వ్యవస్థను బలపర్చాలని తాలిబన్ ప్రభుత్వానికి సూచించింది ఐక్యరాజ్య సమితి. ఇందుకోసం అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలు సైతం సహకరించాలని యూఎన్డీపీ అభిప్రాయపడింది. మరోవైపు కఠిన ఆంక్షల విధింపు, విదేశీ నిధులు నిలిచిపోవడం, తాలిబన్ల ఆక్రమణ టైంలో వర్తకవాణిజ్యాలు ఆగిపోవడంతో పాటు అఫ్గన్కు రావాల్సిన బకాయిలు నిలిచిపోవడంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ చాలావరకు దెబ్బతింది. ఈ తరుణంలో బ్యాంకింగ్, డిపాజిట్ ఇన్సూరెన్స్ స్కీమ్ వ్యవస్థలు సైతం దెబ్బతింటే గనుక.. ఆదుకోవడానికి ప్రపంచ దేశాలు ముందుకొచ్చినా ఆ సంక్షోభం నుంచి కోలుకోవడానికి దశాబ్దాల సమయం పట్టే అవకాశం ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. -
ప్రజల్లో ఆర్థిక విజ్ఞానం పెంచాలి
ముంబై: ప్రజలను ఆర్థికంగా చైతన్యవంతులను చేసేందుకు.. ఆర్థిక విద్యను ప్రోత్సహించేందుకు ఐదు ప్రధాన అంశాలతో కూడిన కార్యాచరణ ప్రణాళికతో ఆర్బీఐ ముందుకు వచ్చింది. ‘నేషనల్ స్ట్రాటజీ ఫర్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ 2020– 2025’ (ఎన్ఎస్ఎఫ్ఈ) పేరుతో ఆర్బీఐ గురువారం డాక్యుమెంట్ను విడుదల చేసింది. దేశ ప్రజ ల్లో ఆర్థిక అవగాహన కల్పించేందుకు, సాధికార భారత్ కోసం ప్రభుత్వరంగ సంస్థలు, ఇతర సంస్థలు వేటికవే విడిగా కాకుండా, కలసికట్టుగా (బహుళ భాగస్వాములతో) పనిచేసే విధానం అవసరమని సూచించింది. తన కార్యాచరణ ప్రణాళికలో పేర్కొన్న ఐదు ప్రధాన అంశాలు.. కంటెంట్ (విషయాలు), కెపాసిటీ (సామర్థ్యం), కమ్యూనిటీ (సంఘం), కమ్యూనికేషన్ (సమాచారం), కొలాబరేషన్ (సహకారం)ను ప్రధానంగా ఆర్బీఐ ప్రస్తావించింది. దేశంలో అందరికీ ఆర్థిక సేవలను చేరువ చేయడం అన్నది కేంద్ర ప్రభుత్వంతోపాటు, ఆర్థిక నియంత్రణ సంస్థలు ఆర్బీఐ, సెబీ, ఐఆర్డీఏఐ, పీఎఫ్ఆర్డీఏ ప్రధాన ఎజెండాగా ఉన్న విషయం గమనార్హం. ‘‘ఆర్థిక అక్షర జ్ఞానం ఆర్థిక సేవల విస్తృతికి తోడ్పడుతుంది. అదే విధంగా కస్టమర్లు అవగాహనతో కూడిన నిర్ణయం తీసుకునేందుకు వీలు కల్పిస్తుంది. ఆర్థిక శ్రేయస్సుకు తోడ్పడుతుంది’’ అంటూ ఆర్బీఐ ఎన్ఎస్ఎఫ్ఈ నివేదిక వివరించింది. ఎన్ఎస్ఎఫ్ఈలో పేర్కొన్న అంశాలు ► వివిధ వర్గాల ప్రజల్లో (విద్యార్థులు, టీచర్లు, యువత, మహిళలు, ఉద్యోగాల్లో కొత్తగా చేరే వారు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, వృద్ధు లు, వికలాంగులు తదితర) ఆర్థిక అంశాల పట్ల అవగాహనకు ప్రత్యేకంగా పాఠాలు బోధించాలి. ► ఆర్థిక లక్ష్యాలకు వనరులను సమకూర్చుకునేందుకు వీలుగా ఫైనాన్షియల్ మార్కెట్లలో పాల్గొనేలా చేయాలి. పొదుపును ప్రోత్సహించాలి. ► రుణాలకు సంబంధించి క్రమశిక్షణను అభివృద్ధి చేయాలి. నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు ఉన్న సంస్థల ద్వారానే రుణాలు తీసుకునేలా ప్రోత్సహించాలి. ► డిజిటల్ ఆర్థిక సేవలను మరింత భద్రమైన, సురక్షితంగా వాడుకునేలా మెరుగుపరచాలి. ► జీవితంలోని వివిధ దశల్లో వచ్చే సమస్యలను ఎదుర్కొనేందుకు వీలుగా (రిస్క్ మేనేజ్మెంట్) తగినంత బీమా కవరేజీ, వృద్ధాప్య జీవనం కోసం అనుకూలమైన పెన్షన్ ఉత్తులను తీసుకునే ప్రణాళిక అవసరాన్ని తెలియజేయాలి. ► స్కూల్ పాఠ్యాంశాల్లో ఆర్థిక విద్యను భాగం చేయాలి. ఇందుకు సంబంధించి 9, 10వ తరగతుల్లో కంటెంట్ను మెరుగుపరచాలి. బీఈడీ, ఎంఈడీ కోర్సుల్లో సమగ్ర ఆర్థిక విద్యను భాగం చేయాల్సిన అవసరం ఉంది. టీచర్లకు సైతం ఆర్థిక విషయాలపై శిక్షణ ఇవ్వాలి. ► ఆర్బీఐకి చెందిన నేషనల్ సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ (ఎన్సీఎఫ్ఈ) సంస్థ ఎన్ఎస్ఎఫ్ఈ 2020–25ని రూపొందించింది. ► ప్రభుత్వ లక్ష్యాలకు మద్దతు..: ‘‘ఎన్ఎస్ఎఫ్ఈ డాక్యుమెంట్ ఉద్దేశం.. భారత ప్రభుత్వం, నియంత్రణ సంస్థల లక్ష్యానికి మద్దతునివ్వడమే. వివిధ వర్గాల్లోని ప్రజల్లో తగినంత విజ్ఞానాన్ని, నైపుణ్యాలను అభివృద్ధి చేయడంతోపాటు వారిలో ప్రవర్తనపరమైన మార్పులు తీసుకురావడం వల్ల.. తమ ద్రవ్యపరమైన అంశాలను మరింత మెరుగ్గా నిర్వహించుకోవడంతోపాటు, భవిష్యత్తుకు ప్రణాళిక రూపొందించుకోగలరు’’అని ఆర్బీఐ పేర్కొంది. -
భారత్కు తగ్గనున్న చెల్లింపుల ఖాతా భారం
న్యూఢిల్లీ: చెల్లింపుల సమతౌల్యత (బీఓపీ) ఈ ఏడాది భారత్కు అనుకూలంగా పటిష్టంగా ఉండే అవకాశం ఉందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ సోమవారం తెలిపారు. ఒక నిర్దిష్ట కాల వ్యవధిలో వాణిజ్య లావాదేవీలకు ఒక దేశం... ఇతర దేశాలకు చెల్లించాల్సి వచ్చే మొత్తం వ్యవహారాలకు ఉద్దేశించిన అంశాన్నే చెల్లింపుల సమతౌల్యతగా పేర్కొంటారు. ఒకవైపు ఎగుమతులు మెరుగుపడుతుండడం, మరోవైపు తగ్గుతున్న దిగుమతులు భారత్కు చెల్లింపుల సమతౌల్యత సానుకూల పరిస్థితిని సృష్టిస్తున్నాయని అన్నారు. ఫిక్కీ వెబ్నార్ను ఉద్దేశించి ఆయన చేసిన ప్రసంగంలో ముఖ్యాంశాలు చూస్తే... ► ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎగుమతుల విషయానికి వస్తే, చక్కటి రికవరీ జాడలు ఉన్నాయి. ► ఎగుమతులు క్షీణతలోనే ఉన్నా... ఆ క్షీణ రేటు తగ్గుతూ వస్తుండడం కొంత ఆశాజనకమైన అంశం. ఏప్రిల్లో ఎగుమతులు భారీగా మైనస్ 60.28 శాతం క్షీణిస్తే, మేలో ఈ రేటు మైనస్ 36.47 శాతానికి తగ్గింది. తాజా సమీక్షా నెల జూన్లో ఈ క్షీణ రేటు మరింతగా మైనస్ 12.41 శాతానికి తగ్గడం గమనార్హం. ► 2019 ఎగుమతుల గణాంకాల పరిమాణంలో 91 శాతానికి 2020 జూలై ఎగుమతుల గణాంకాలు చేరాయి. దిగుమతుల విషయంలో ఈ మొత్తం దాదాపు 70 నుంచి 71 శాతంగా ఉంది. వెరసి ఈ ఏడాది భారత్ చెల్లింపుల సమతౌల్యం భారత్కు అనుకూలంగా ఉండనుంది. ► భారత్ పారిశ్రామిక రంగానికి చక్కటి వృద్ధి అవకాశాలు అందుబాటులోకి రానున్నాయని భావిస్తున్నా. దేశీయ తయారీ, పారిశ్రామిక రంగానికి మద్దతు నివ్వడానికి ప్రభుత్వం తగిన అన్ని చర్యలూ తీసుకుంటోంది. -
వందేళ్లలో ఘోర సంక్షోభమిది
ముంబై: ఆర్థికంగా, ఆరోగ్య పరంగా గడిచిన వందేళ్లలో ప్రపంచం ఎన్నడూ ఇంతటి సంక్షోభాన్ని ఎదుర్కోలేదని భారత రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. కోవిడ్తో ఉద్యోగాలు, ఉత్పత్తి, సంక్షేమం వంటి అంశాల్లో ప్రపంచవ్యాప్తంగా ఊహించని ప్రతికూల పరిణామాలు ఎదురవుతున్నాయని వ్యాఖ్యానించారు. ‘ఎన్నెన్నో సంక్షోభాలను తట్టుకుని నిలిచిన భారత ఆర్థి క, ద్రవ్య వ్యవస్థలకు ఇది అత్యంత విషమ పరీక్ష’ అన్నారాయన. శనివారమిక్కడ ఎస్బీఐ బ్యాంకింగ్ అండ్ ఎకనమిక్ కాన్క్లేవ్లో దాస్ మాట్లాడారు. దేశ ద్రవ్య వ్యవస్థను చక్కదిద్దడానికి ఆర్బీఐ ఇప్పటికే పలు చర్యలు తీసుకుందని, ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన చర్యలు ఫలితాలనిస్తున్నాయన్నారు. లాక్డౌన్లోను, తదనంతరం కూడా ఆర్థిక వృద్ధి క్షీణించిందని, ఫలితంగా బ్యాంకుల నిరర్ధక ఆస్తులు (ఎన్పీఏలు) పెరిగాయని దాస్ చెప్పారు. బ్యాంకుల మూలధనం క్షీణించిందని, ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులకు రీ క్యాపిటలైజేషన్ పథకం అమలు చేయాల్సి ఉందన్నారు. అన్లాక్ ప్రక్రియతో ఆర్థిక వ్యవస్థ తిరిగి సాధారణ స్థితికి చేరుతున్న సూచనలు కనిపిస్తున్నాయని శక్తికాంతదాస్ పేర్కొన్నారు. పరిశ్రమ మెరుగ్గా స్పందించింది ‘ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవడం, విశ్వాసాన్ని పెంపొందించడం, వృద్ధిని పునరుద్ధరించడం ఆర్బీఐ తక్షణ కర్తవ్యాలు. నిజానికి సంక్షోభ సమయంలో భారతీయ పారిశ్రామిక రంగం, సంస్థలు మెరుగైన రీతిలో స్పందించాయి. చెల్లింపు వ్యవస్థలు, ఆర్థిక మార్కెట్లు ఎలాంటి ఆటుపోట్లకు గురికాకుండా నిలిచాయి’ అని దాస్ వ్యాఖ్యానించారు. సప్లయ్ చెయిన్ పునరుద్ధరణ ఎప్పుడు జరుగుతుంది? డిమాండ్ పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకునేదెప్పుడు? ఆర్థికాభివృద్ధిపై కరోనా ప్రభావం ఎలా ఉండనుంది వంటి అంశాలపై ఇంకా స్పష్టత లేదన్నారు. ఆర్థిక స్థిరత్వాన్ని పరిరక్షిస్తూ.. బ్యాంకింగ్ వ్యవస్థ ఎలాంటి ఒడిదుడుకులకూ లోను కాకుండా చూస్తూ.. ఆర్థిక కార్యకలాపాలు కొనసాగేందుకు ఆర్బీఐ కృషి చేస్తోందన్నారు. ఫైనాన్షియల్ రంగం మాత్రం ఆంక్షల సడలింపుల కోసం ఎదురు చూడకుండానే తిరిగి మామూలు స్థితికి రావాల్సిన అవసరముందని చెప్పారు. రిజల్యూషన్ కార్పొరేషన్.. ఇబ్బందుల్లో ఉన్న ఆర్థిక సంస్థలతో వ్యవహరించడానికి చట్టబద్ధత కలిగిన ’రిజల్యూషన్ కార్పొరేషన్’ అవసరమని శక్తికాంత దాస్ చెప్పారు. ఈ కార్పొరేషన్ ఏర్పాటుతో ఆయా సంస్థలను ముందుగానే గుర్తించి హెచ్చరిండానికి, వీలైతే పునరుద్ధరించడానికి వీలుంటుందన్నారు. ‘దీని ఏర్పాటుతో పాటు ఇతర నిబంధనలతో కూడిన ఫైనాన్షియల్ రిజొల్యూషన్ అండ్ డిపాజిట్ ఇన్సూరెన్స్(ఎఫ్ఆర్డీఐ) బిల్లును ప్రభుత్వం 2017లో పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. అయితే, డిపాజిటర్ల డబ్బు కు రక్షణ ఉండదంటూ వ్యతిరేకత వ్యక్తం కావడంతో దాన్ని వెనక్కి తీసుకుంది’ అని వివరించారు. కానీ రిజల్యూషన్ కార్పొరేషన్ అవసరం చాలా ఉందన్నారు. -
ఎకానమీ కోసం మరో ప్యాకేజ్!
న్యూఢిల్లీ: కరోనా వైరస్ కారణంగా భారీగా దెబ్బతింటున్న ఆర్థిక రంగాన్ని పునరుత్తేజపరిచేందుకు మరో ప్యాకేజ్ను ప్రకటించే విషయంపై కేంద్రం సమాలోచనలు చేస్తోంది. లాక్డౌన్ తరువాత ఆర్థిక రంగంలో నెలకొననున్న వివిధ పరిస్థితులను బేరీజు వేస్తోంది. అయితే, మరో ప్యాకేజ్ను ప్రకటించే విషయమై ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సంబంధిత అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం లాక్డౌన్ అనంతర పరిస్థితులను అంచనా వేసే పనిలో ఉన్నామన్నారు. అలాగే, కొన్ని సంక్షేమ, ఇతర ప్రభుత్వ పథకాలను లాక్డౌన్ అనంతర పరిస్థితులకు అనుగుణంగా మార్చే అవకాశాలపై కూడా కేంద్రం ఆలోచిస్తోందని తెలిపారు. కరోనా వల్ల ఆర్థిక రంగంపై పడే ప్రతికూల ప్రభావాన్ని తగ్గించే దిశగా ఏదైనా నిర్ణయం ప్రకటిస్తే.. అది కేంద్రం తీసుకున్న మూడో నిర్ణయమవుతుంది. ప్రధాని మోదీ మార్చి 24న లాక్డౌన్ను ప్రకటించడానికి కొద్ది గంటల ముందు.. ఆర్థికమంత్రి పన్ను చెల్లింపుదారులు, పారిశ్రామిక వేత్తలకు కొన్ని ఉపశమన చర్యలను ప్రకటించారు. రెండు రోజుల తరువాత మార్చి 26న కరోనా ప్రభావిత రంగాలను ఆదుకోవడం కోసం రూ. 1.7 లక్షల కోట్ల రిలీఫ్ ప్యాకేజ్ను కూడా ప్రకటించారు. కోవిడ్ 19పై పోరు కోసం ఉన్నతాధికారులతో ప్రధాని మోదీ ఏర్పాటు చేసిన 10 సాధికార బృందాల్లో ఒకటి ఆర్థిక రంగ పునరుత్తేజంపై పని చేస్తోంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ నేతృత్వంలోని మంత్రుల బృందం కూడా లాక్డౌన్ అనంతర పరిస్థితులను సమీక్షిస్తోంది. -
ఇన్వెస్ట్ చేయాలా..? విక్రయించాలా..?
కరోనా వైరస్ ప్రపంచాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసింది. దేశాలన్నీ ఇప్పుడు ఈ వైరస్ నియంత్రణ కోసమే తమ శక్తియుక్తులన్నింటినీ వెచ్చిస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థలకు ‘లాక్’ వేసి పోరాటం సాగిస్తున్నాయి!. మన దేశంలో ఏప్రిల్ 14 వరకు లౌక్డౌన్ను అమలు చేస్తున్నారు. నిత్యావసర వస్తువులు, సేవలు మినహా మిగిలిన పరిశ్రమలు, వ్యాపారాలన్నీ మూతబడ్డాయి. దీంతో ఎంతోమంది జీవనోపాధి అనిశ్చితిలో పడింది. ఈ పరిణామాల ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్లలో చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే ప్రధాన సూచీలు వాటి గరిష్టాల నుంచి 35 శాతం పడిపోయాయి. విడిగా స్టాక్స్ను పరిశీలిస్తే 60 శాతానికి పైగా క్షీణించినవీ ఉన్నాయి. ఈ పరిస్థితులు ఇన్వెస్టర్లను ఆత్మరక్షణలోకి నెట్టేవే. అదనంగా ఇన్వెస్ట్ చేయాలా..? లేక ఉన్న పెట్టుబడులను వెనక్కి తీసేసుకోవాలా..? ఇలా ఎన్నో ప్రశ్నలు రావచ్చు. వాటికి నిపుణులు ఏమంటున్నారో చూద్దాం.. భయపడక్కర్లేదు... తమ పెట్టుబడులను సమీక్షించుకునేందుకు ఇది మంచి సమయమని నిపుణులు సూచిస్తున్నారు. నిఫ్టీ 50 సూచీ గరిష్టం నుంచి 40 శాతం వరకు పడిపోయి గత వారం కొంత రికవరీ చూపించింది. నిజానికి ఈ తరహా భారీ కరెక్షన్ను 2008లోనూ చూశాం. అయినా ఇన్వెస్టర్లలో చాలా మంది ఈ తరహా సంక్షోభాలకు సన్నద్ధంగా లేరు. ఈ నేపథ్యంలో మార్కెట్ల పతనం చూసి భయపడిపోయి ఉన్న ఈక్విటీ పెట్టుబడులను అమ్మేసుకుని వెళ్లిపోవడం ఈ తరుణంలో చేయాల్సిన పని కాదంటున్నారు విశ్లేషకులు. ‘‘నగదుకు అత్యవసరం లేకపోతే ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్స్లో తమ సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్)ను, సిస్టమ్యాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ (ఎస్టీపీ) కొనసాగించుకోవాలి’’ అని సృజన్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ వ్యవస్థాపకురాలు దీపాలిసేన్ పేర్కొన్నారు. ఈ రెండూ కొనుగోలు ఖర్చును సగటుగా మారుస్తాయని, మార్కెట్ కరెక్షన్లో మరిన్ని యూనిట్లను సమకూర్చుకోవచ్చని ఆమె సూచించారు. ఒకవేళ ఉద్యోగం కోల్పోవడం వంటి అత్యవసర పరిస్థితులు ఎదురైతే అప్పడు ఈక్విటీ ఫండ్స్లో పెట్టుబడులను వెనక్కి తీసుకోవడాన్ని పరిశీలించొచ్చన్నారు. అది కూడా బ్యాంకు సేవింగ్స్ ఖాతా మొత్తం ఖాళీ అయ్యి, డెట్ ఫండ్స్, ఇతర నిల్వలన్నీ అడుగంటిన తర్వాతే ఈక్విటీ పెట్టుబడుల ఉపసంహరణను పరిశీలించాలని సూచించారు. మ్యూచువల్ ఫండ్స్లో ఏక మొత్తంలో పెట్టుబడులను కూడా ఈ తరుణంలో చేసుకోవచ్చని, కాకపోతే ఒకే విడత కాకుండా పలు విడతలుగా చేసుకోవాలని ప్లాన్రూపీ ఇన్వెస్ట్మెంట్ సర్వీసెస్ వ్యవస్థాపకుడు అమోల్జోషి సూచించారు. అత్యవసరాలు చూసుకోవాలి... ఈ సమయంలో జీవన అవసరాల కోసం నిధులు కావాల్సిన వారు ఈక్విటీ పెట్టుబడులను వెనక్కి తీసుకోవడానికి బదులు ఈపీఎఫ్ బ్యాలన్స్ను కొంత వెనక్కి తీసుకోవడాన్ని తాను సూచిస్తానని మ్యాక్స్ సెక్యూర్ ఫైనాన్షియల్ ప్లానర్స్ వ్యవస్థాపకుడు ప్రకాశ్ ప్రహరాజ్ తెలిపారు. ఈపీఎఫ్ సభ్యులు తమ భవిష్య నిధి నుంచి 75 శాతాన్ని లేదా మూడు నెలల బేసిక్ వేతనం, డీఏ ఈ రెండింటిలో ఏది తక్కువ మొత్తం అయితే ఆ మేరకు ఉపసంహరించుకోవడానికి ప్రభుత్వం అనుమతించిన విషయం తెలిసిందే. కరోనా వైరస్, లౌక్డౌన్ సమీప కాలంలో వృద్ధి అవకాశాలను దెబ్బతీయగా.. దీర్ఘకాలంలో మాత్రం ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపనలు, వైరస్ నివారణ చర్యలతో పరిస్థితులు తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటాయని ఎక్కువ మంది అంచనా వేస్తున్నారు. ఆర్థిక వృద్ధి పట్ల ఉన్న భయాలు ఈక్విటీ మార్కెట్లను ప్రస్తుతం చౌకగా మార్చేశాయని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ పేర్కొంది. పీఈ, పీబీవీ, జీడీపీలో మార్కెట్ క్యాప్ కొలమానాల ఆధారంగా ఈ సంస్థ రూపొందించిన వ్యాల్యూషన్ ట్రాకర్ మార్చి 23న 72.6 స్థాయికి చేరింది. అంటే దూకుడుగా పెట్టుబడులు పెట్టుకోవచ్చన్నది దీని సంకేతం. చివరిగా ఈ స్థాయిలో వ్యాల్యూషన్ ట్రాకర్ కనిపించింది 2008–09లోనే కావడం గమనార్హం. మిగులు నిధులు కలిగిన వారు, రోజువారీ ఖర్చులకు సరిపడా పక్కన పెట్టేసి, అలాగే అత్యవసర పరిస్థితులకు కొంత కేటాయించుకున్న తర్వాత.. మిగిలిన మొత్తాన్ని ఈక్విటీల కోసం కేటాయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే, తమ ఆర్థిక లక్ష్యాలను చేరుకునేందుకు పెట్టుబడుల కేటాయింపు దోహదపడుతుందా? లేదా అని ఓ సారి సమీక్షించుకుని, అవసరమైతే మార్పులు కూడా చేసుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్ మార్గం.. మార్కెట్ నిపుణులు, విశ్లేషకులను ప్రశ్నిస్తే ఎక్కువ మంది నుంచి వచ్చే స్పందన ఈక్విటీల్లో పెట్టుబడులకు ఇది మంచి అనుకూల సమయమనే. ఆకర్షణీయమైన పెట్టుబడుల అవకాశాల కోసం వేచి చూసేవారు, దీర్ఘకాలం కోసం పెట్టుబడులు పెట్టాలనుకునే వారు సిప్ మార్గాన్ని ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. స్టాక్స్ ధరల్లో దిద్దుబాటుతో అవి చాలా ఆకర్షణీయంగా మారాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. హెల్త్కేర్, టెలికం రంగాలు ప్రస్తుత పరిస్థితుల్లో రాణించగలవన్న అంచనాతో ఉన్నారు. ఇన్వెస్టర్లు ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవాలని, వీటిల్లో లిక్విడిటీ మెరుగ్గా ఉంటుందని నిప్పన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ ఈడీ, సీఈవో సందీప్సిక్కా తెలిపారు. మొదటి సారి ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్న వారికి, సీజన్ వారీగా ఇన్వెస్ట్ చేసే వారికి ఇండెక్స్ ఫండ్స్ అనుకూలమైనవిగా సిక్కా పేర్కొన్నారు. యాక్టివ్గా నిర్వహణతో కూడిన ఫండ్స్తోపాటు, ఈటీఎఫ్, ఇండెక్స్ ఫండ్స్ను వ్యూహాత్మకంగా ఎంచుకోవాలన్నారు. ‘‘మార్కెట్లు రికవరీ అయినప్పుడు ముందుగా సూచీల్లోనే అది ప్రతిఫలిస్తుంది. ప్రతీ పతనం తర్వాత బలమైన రికవరీ ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈటీఎఫ్లు చక్కని ఆప్షన్’’ అని సిక్కా వివరించారు. ఈక్విటీల్లో పెట్టుబడులు.. ప్రస్తుత తరుణంలో ఇన్వెస్టర్లు ఈక్విటీల్లో పెట్టుబడులు కొనసాగించుకోవాలని, మిగులు నిధులు ఉంటే దీర్ఘకాలం కోసం క్రమంగా ఇన్వెస్ట్ చేసుకోవాలని యస్ అస్సెట్ మేనేజ్మెంట్ సీఈవో కన్వర్ వివేక్ సూచించారు. ‘‘స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసేందుకు బేర్ మార్కెట్లు ఎంతో అనుకూలమైనవి. మార్కెట్ల పనితీరు దారుణంగా ఉందంటే మధ్య కాలం నుంచి దీర్ఘకాలానికి మంచి రాబడులకు అవకాశం ఉన్నట్టే’’ అని ఆశికా వెల్త్ అడ్వైజర్స్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో అమిత్జైన్ అభిప్రాయపడ్డారు. ‘‘ఇన్వెస్టర్లు తమ దగ్గరున్న నిధుల్లో 40 శాతాన్ని ఆర్బిట్రేజ్ ఫండ్స్కు కేటాయించుకోవాలి. ఇవి 7–8 శాతం వరకు రాబడులను ఇస్తాయి. మిగిలిన 60 శాతం నిధులను మిడ్క్యాప్, మల్టీక్యాప్ ఫండ్స్లో వచ్చే ఆరు నెలల కాలంలో క్రమంగా ఇన్వెస్ట్ చేసుకోవాలి’’ అని అమిత్జైన్ సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో హెల్త్కేర్ రంగంలోని కంపెనీలు, ముఖ్యంగా డయాగ్నస్టిక్స్ కంపెనీలు మంచి పనితీరు చూపిస్తాయని పేర్కొన్నారు. అందరూ ఇంటికే పరిమితం కావడం, ఇంటి నుంచే పని చేస్తున్నందున డేటాకు డిమాండ్ భారీగా ఉంటుందని కనుక టెలికం కంపెనీలను సైతం పెట్టుబడులకు పరిశీలించొచ్చని సూచించారు. అలాగే, ఎఫ్ఎంసీజీ, రియల్ ఎస్టేట్ రంగాలపై ప్రస్తుత పరిస్థితుల ప్రభావం తక్కువే ఉంటుందన్నారు. -
ఆర్థిక వ్యవస్థపై ఆర్బీఐ కీలక ప్రకటన
సాక్షి, ముంబై: దేశీయ ఆర్థిక వ్యవస్థపై మందగమనం ఆందోళనలు చెలరేగుతున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక ప్రకటన చేసింది. వృద్ధి బలహీనంగా ఉన్నప్పటికీ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉందని శుక్రవారం వెల్లడించింది. ఆర్థిక వృద్ధి మందగించినప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థ అలాగే ఉందని ఫైనాన్షియల్ స్టెబిలిటీ తాజా నివేదికలో తెలిపింది. ఈ ఏడాది రెండవ త్రైమాసికంలో 4.5 శాతంతో జీడీపీ ఆరు సంవత్సరాల కనిష్టానికి పడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో డిసెంబరు ద్రవ్య విధాన సమీక్షలో ఆర్బీఐ తన వృద్ధి అంచనాను 240 బేసిస్ పాయింట్లు తగ్గించి 5 శాతంగా పేర్కొంది. గ్లోబల్ రిస్క్లు, స్థూల ఆర్థిక పరిస్థితులపై రిస్క్ పర్సెప్షన్స్, ఫైనాన్షియల్ మార్కెట్ రిస్క్లు లాంటి ప్రధాన రిస్క్ గ్రూపుల ప్రభావం మన దేశ ఆర్థిక వ్యవస్థపై సాధారణ స్థాయిలో ఉంటుందని భావిస్తున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది. ఏదేమైనా, దేశీయ వృద్ధి, ఆర్థిక, కార్పొరేట్ రంగం, బ్యాంకుల ఆస్తి నాణ్యత వంటి వివిధ రంగాల్లోని నష్టాల అవగాహన 2019 ఏప్రిల్ -అక్టోబర్ మధ్య పెరిగిందని ఆర్బీఐ తెలిపింది. -
కార్వీపై ఇన్వెస్టర్ల ఫిర్యాదులు
న్యూఢిల్లీ: ఫైనాన్షియల్ సర్వీసుల్లో ఉన్న హైదరాబాద్ కంపెనీ కార్వీపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. తమకు రావాల్సిన మొత్తాలను కార్వీ చెల్లించడం లేదంటూ సోషల్ మీడియా వేదికగా ప్రధాని కార్యాలయంతోపాటు ఆర్థిక శాఖ, సెబీకి దేశవ్యాప్తంగా ఉన్న ఇన్వెస్టర్ల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. దీనినిబట్టి చూస్తుంటే నగదు కొరతతో కార్వీ ఇబ్బంది పడుతోందని సమాచారం. కాస్టర్ సీడ్ (ఆముదం) కాంట్రాక్టుల్లో కార్వీ క్లయింట్లు పెద్ద ఎత్తున నష్టపోవడంతో.. వారి నుంచి రావాల్సిన బాకీలు పేరుకుపోవడం కార్వీ ప్రస్తుత పరిస్థితికి కారణమని తెలుస్తోంది. ఇన్వెస్టర్లు ఒకరిని చూసి ఒకరు కార్వీపై ఫిర్యాదులు చేస్తున్నారు. తన ట్రేడింగ్ అకౌంట్లో ఉన్న నగదు నిల్వను బ్యాంకు ఖాతాకు మళ్లించాల్సిందిగా కోరితే, సర్వర్ సమస్య అంటూ దాటవేస్తున్నారని దీపక్ ముంద్రా అనే ఇన్వెస్టర్ ట్వీట్ చేశారు. ఎన్నిసార్లు కోరినా సర్వర్ సమస్య అంటున్నారని, కారీ్వలో ఏదో తప్పు జరుగుతోందని అనుమానం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు కోరినా చెల్లింపులు జరపడం లేదని, కార్వీ చర్యలతో నమ్మకం కోల్పోయామని పుణే ఇన్వెస్టర్ బందియా షా ఆవేదన వ్యక్తం చేశారు. కార్వీ తీవ్ర ఇబ్బందుల్లో ఉందని, సాయం చేయాలంటూ సెబీని కోరారు. 20 రోజులుగా వెంటపడుతున్నా స్పందించడం లేదంటూ ఎంకేఆర్ అనే ఇన్వెస్టర్ ఆరి్థక శాఖకు విన్నవించారు. వందకుపైగా కాల్స్ చేసినా ఫలితం లేదని గీతేష్ యోలే అనే ఇన్వెస్టర్ ప్రధాని కార్యాలయంతోపాటు ఆర్థిక శాఖకు ఫిర్యాదు చేశారు. ‘భారత్లో అసలేం జరుగుతోంది. బీఎంఏ దారిలో కార్వీ’ అని ట్వీట్ చేశారు. -
ఏపీ ఆర్థిక వ్యవస్థ కుదేలు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు స్వార్థ రాజకీయ ప్రయోజనాలు, అస్తవ్యస్త విధానాలతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యిందని ఆర్థిక శాఖ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఆర్థిక ఏడాది చేపట్టే పనులు, కార్యక్రమాల కోసం పైసలకు తడుముకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చారని సీనియర్ అధికారులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది ముగిసిన ఆర్థిక సంవత్సరంలో చెల్లించాల్సిన దాదాపు 14వేల కోట్ల రూపాయల బిల్లులను పెండింగ్లో పెట్టేశారు. అలాగే మార్చి చివరి రోజుల్లో వచ్చిన రూ. 8 వేల కోట్ల బిల్లులనూ ఆర్థిక శాఖ తిరస్కరించింది. హడావిడిగా మార్చి 18, 19, 20వ తేదీల్లో బిల్లులను సమర్పించడం అంటే వాస్తవంగా పనులు జరిగాయా లేదా అనే విషయం తెలియదు. ఈ బిల్లులను స్క్రూటినీ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆ రూ. 8 వేల కోట్ల బిల్లులను తిరస్కరిస్తూ మళ్లీ ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్తగా బిల్లులు సమర్పించాల్సిందిగా ఆర్థిక శాఖ సంబంధిత శాఖలకు సూచించింది. ఇవన్నీ కూడా వివిధ కేంద్ర పథకాల ద్వారా వచ్చిన నిధులకు మ్యాచింగ్ గ్రాంటుగా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన నిధులతో పాటు వివిధ కార్పొరేషన్ల నుంచి తీసుకున్న నిధులకు సంబంధించిన బిల్లులని ఆయా వర్గాలు చెబుతున్నాయి. అలాగే వివిధ శాఖల నిర్వహణకు సంబంధించిన బిల్లులు గత ఆర్థిక సంవత్సరంలో చెల్లించకుండా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోకి తీసుకొచ్చారు. మొత్తంగా 22 వేల కోట్ల రూపాయల బిల్లుల భారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంపై పడుతోంది. ఈ ఏడాది తొలి నాలుగు నెలలకే ఓటాన్ అకౌంట్ కేటాయింపులకు అసెంబ్లీ ఆమోదం తీసుకున్నారు. ఇప్పుడు ఆ బిల్లులు చెల్లించడానికి ఆయా శాఖలకు నాలుగు నెలలకు కేటాయించిన నిధులు కూడా సరిపోని పరిస్థితి నెలకొందని ఆర్థిక శాఖ వర్గాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. గతేడాది పలు పథకాలకు కేంద్రం నుంచి వచ్చిన నిధుల్లో రూ. 4 వేల కోట్ల వరకు ఇతర అవసరాలకు మళ్లించేశారని, ఇప్పుడు ఆ నిధులనూ ఈ ఆర్థిక సంవత్సరంలో చెల్లించాల్సి ఉంటుందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. చంద్రబాబు అతి తెలివితేటలకు, రాజకీయ ప్రయోజనాలకు రాష్ట్ర ఖజానాను అస్థవ్యస్తం చేసేశారనే అభిప్రాయాన్ని ఆర్థిక శాఖ వర్గాలే వ్యక్తం చేస్తున్నాయి. అన్ని విభాగాల్లో అదే తీరు.. గత ఆర్థిక సంవత్సరంలో ఇవ్వాల్సిన బిల్లులు రాకపోవడంతో అనేకమంది ఇప్పుడు సచివాలయంలోని ఆర్థిక శాఖ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ‘వివిధ రంగాల కార్పొరేషన్లకు చెందిన నిధులను లాగేసుకోవడంతో ఆయా కార్పొరేషన్ల వ్యక్తిగత ఖాతాల్లో నిధులు ఖాళీ అయ్యాయి. ఆఖరికి గ్రామీణాభివృద్ధి సెస్ను కూడా దారి మళ్లించేశారు. గత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కేటాయింపుల మేరకు కాకుండా ప్రభుత్వ పెద్దల ఇష్టారాజ్యం మేరకు నిధులు ఇవ్వడంతో ఆ బడ్జెట్కు విశ్వసనీయత లేకుండా పోయింది. ఈ ఆర్థిక ఏడాది కేటాయింపులు గతేడాది బిల్లుల చెల్లింపులకే సరిపోతాయి. ప్రస్తుతం వివిధ శాఖల్లో చేపట్టే సంక్షేమ కార్యక్రమాలకు నిధులు ఎక్కడి నుంచి వస్తాయనేది ప్రశ్నార్థకంగా మారింది’ అని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. పరిస్థితిని చక్కదిద్దడానికి కొత్త ప్రభుత్వానికి చాలా సమయం.. ‘గతేడాది పేదల గృహ నిర్మాణాలకు బిల్లులను చెల్లించలేదు. విద్యుత్ సబ్సిడీ కూడా చెల్లించకుండా ట్రాన్స్కో ద్వారా బయట అప్పులు చేయించారు. రేషన్ బియ్యానికి ఇవ్వాల్సిన సబ్సిడీ నిధులనూ ఇవ్వకుండా పౌర సరఫరాల సంస్థ ధాన్యం కొనుగోలుకు చేస్తున్న అప్పుల నుంచి సబ్సిడీ భరించాల్సిందిగా సూచించారు. ఈ ఆర్థిక సంవత్సరం నాలుగు నెలల ఓటాన్ అకౌంట్ బడ్జెట్ తలకిందులైపోయింది. కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టి పరిస్థితిని చక్కదిద్దాలంటే చాలా సమయం పడుతుంది’ అని సీనియర్ ఐఏఎస్ అధికారులు అంటున్నారు. ఈ నెలలో ఇప్పటికే మూడు రోజులు ఓవర్ డ్రాఫ్ట్కు వెళ్లారంటే పరిస్థితిని చంద్రబాబు సర్కారు ఎంతగా దిగజార్చిందో అర్థం చేసుకోవచ్చు. ఈ నెల 5న రూ. 92.08 కోట్లు, 6న రూ. 2,513.77 కోట్లు, 9న రూ. 650.61 కోట్ల మేర ఓడర్ డ్రాఫ్ట్కు వెళ్లడం గమనార్హం. -
భారత్ నెత్తిమీద ఆర్థిక పిడుగు
సాక్షి, న్యూఢిల్లీ : యూపీఏ ప్రభుత్వం హయాంలో డాలర్తో రూపాయి మారకం విలువ దారుణంగా పడిపోయిందంటూ 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల ప్రచారం సందర్భంగా అప్పటి ప్రధాని అభ్యర్థిగా పోటీ చేస్తున్న నరేంద్ర మోదీ తీవ్రంగా విమర్శించారు. అప్పుడు డాలర్తో రూపాయి మారకం విలువ 58 పైసల నుంచి 62 పైసల మధ్య ఊగిసలాడింది. ఇప్పుడు అదే నరేంద్ర మోదీ ప్రభుత్వం హయాంలో గురువారం నాడు డాలర్తో రూపాయి మారకం విలువ మొన్నెన్నడు లేనివిధంగా 69.10 రూపాయలకు పడిపోయింది. డాలర్ విలువ పడిపోవడం అంటే భారత్ దిగుమతి చేసుకునే అన్ని వస్తువులపై ఆర్థిక భారం అధికమవుతుందన్నది అర్థం. ముఖ్యంగా మనం దిగుమతి చేసుకునే 80 శాతం చమురుపై అధిక ఆర్థిక భారం పడుతుంది. పర్యవసానంగా ద్రవ్యోల్బణం శాతం పెరిగిపోయి సామాన్య మానవులపై ఆర్థిక భారం మరింత పెరుగుతోంది. నేడు చమురు ధరలు నాలుగేళ్ల గరిష్ట స్థాయిలో కొనసాగుతున్నాయి. డాలర్తో రూపాయి మారకం విలువ పడపోవడం వల్ల ముంచుకొచ్చే మరో ప్రమాదం గురించి తెల్సిందే. భారత్ నుంచి విదేశీ సంస్థాగత పెట్టుబడులు వెనక్కి పోతాయి. గత ఏప్రిల్ 1వ తేదీ నుంచి జూన్ 4వ తేదీ వరకు దేశం నుంచి 670 కోట్ల డాలర్ల పెట్టుబడులను విదేశీయులు ఉపసంహరించుకున్నారు. రూపాయి మారకం విలువ పడిపోయి ద్రవ్యోల్బణం పెరిగిపోవడం వల్ల ఇప్పటికే దేశాన్ని పీడిస్తున్న సమస్యలు రెట్టింపు అవుతాయని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజు రోజుకు తీవ్రమవుతున్న నిరుద్యోగ సమస్య మరింత తీవ్రమవుతోంది. ఏటా రెండు కోట్ల మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామంటూ అధికారంలోకి వచ్చిన మోదీ ఏటా 60 లక్షలకు మించి ఉద్యోగాలు కల్పించలేకపోతున్నారు (అవి కూడా ఖాళీ అవుతున్న ఉద్యోగాలను భర్తీ చేయడం ద్వారానే). దేశంలో ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న వ్యవసాయ రంగం కూడా మందగమనంతోనే నడుస్తోంది. జాతీయ స్థూల ఉత్పత్తి కూడా గతేడాది 6.5 శాతమే. జీడీపీని రెండంకెలు దాటిస్తామంటూ మోదీ ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ గత నాలుగేళ్లుగా జీడీపీ వృద్ధి రేటు 5.7 శాతం నుంచి 6.5 శాతం మధ్యనే కొట్టుమిట్టాడుతోంది. మోదీ ప్రభుత్వానికి ముందు అంటే, 2013–2014 ఆర్థిక సంవత్సరంలో జీడీపి రేటు 7.5 శాతం నమోదయింది. మరోపక్క బ్యాంకుల్లో మొండి బకాయిలు లేదా నిరర్థక ఆస్తులు ఆందోళనకరంగా పెరిగి పోతున్నాయి. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల్లో నిరర్థక ఆస్తుల శాతం గత మార్చి నెల నాటికి 11. 6 శాతం ఉండగా, 2019 మార్చి నాటికి 12.2 శాతానికి పెరుగుతాయని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. మూలిగే నక్కమీద తాడి పండు పడ్డట్లు అమెరికా ఒత్తిళ్లకు లొంగిన భారత్ గురువారం నాడు ఇరాన్ నుంచి చమురు ఉత్పత్తుల దిగుమతి నిలిపివేస్తామని ప్రకటించింది. భారత్కు చమురును దిగుమతి చేస్తున్న మూడవ అతిపెద్ద దేశం ఇరాన్. ఇరాన్ నుంచి దిగుమతులను నిలిపివేస్తే చమురు దిగుమతులపై ఆర్థిక భారం మరింత పెరుగుతుంది. చమురు ధరలు పెరుగుతున్నా, పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ లాంటి నిర్ణయాలు బెడిసికొట్టినా భారత ఆర్థిక వ్యవస్థ ఇంకా కుప్పకూలకపోవడం అదృష్టమేనని, ఇది మరెంతో కాలం కొనసాగే అవకాశం లేదని ‘జేపీ మోర్గాన్’ చీప్ ఎమర్జింగ్ మార్కెట్ ఎకానమిస్ట్ జహంగీర్ అజీజ్ లాంటి అంతర్జాతీయ ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను కలిగిన భారత్లో ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తానన్నది నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇచ్చిన ముఖ్యమైన హామీల్లో ఒకటి. ఇప్పుడాయన ఆర్థిక వ్యవస్థ గురించి అసలు పట్టించుకోకుండా ప్రధానంగా రాజకీయాలపైనే దృష్టిని కేంద్రీకరిస్తున్నారు. ఆయన హయాంలో అరుణ్ జైట్లీ పార్ట్టైమ్ ఆర్థిక మంత్రిగా పనిచేస్తుండగా, ప్రధాన ఆర్థిక వ్యూహకర్త (చీఫ్ స్టాటిస్టిసియన్) మొదటి నుంచి లేరు. ప్రధాన ఆర్థిక సలహాదారు అర్వింద్ సుబ్రమణియన్ ఇటీవలనే తన రాజీనామాను ప్రకటించారు. -
దేశానికి ఆదర్శంగా నిలిచాం: ఈటల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఏర్పడిన ఆరు నెలల్లోనే పరిపాలనపై పట్టు సాధించి, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టామని ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. రాష్ట్రానికి ఆదాయాన్ని పెంచే మార్గాల్ని అన్వేషించేందుకు బుధవారం కమర్షియల్ ట్యాక్స్ డిపార్టుమెంట్ నిర్వహించిన సదస్సుకు ముఖ్య అతిథిగా మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రానికి ఆదాయం సమకూర్చడంలో వాణిజ్య పన్నుల శాఖదే కీలక పాత్ర అని, ఆర్థిక శాఖ కేవలం నిధుల్ని ఖర్చు పెట్టేందుకు ప్రణాళికలను మాత్రమే రూపొందిస్తుందన్నారు. ‘‘రాష్ట్ర ఏర్పాటుకు ముందు మనం నిలదొక్కుకోగలమా అని అనేక మంది సందేహాలు వ్యక్తం చేశారని, కానీ నేడు దేశ మన్ననలు పొందిన ఏకైక రాష్ట్రం తెలంగాణే’’ అని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ సమర్థులైన అధికారులకు బాధ్యతలు అప్పగించారని, ఆ నమ్మకాన్ని వాళ్లు నిలబెట్టుకున్నారంటూ ప్రిన్సిపల్ సెక్రటరీ సోమేష్ కుమార్, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ అనిల్ను మంత్రి అభినందించారు. దౌర్జన్యంగా పన్నులు వసూలు చేయాల్సిన అవసరం లేదన్నారు. పన్నులు చెల్లిస్తే సొమ్ము భద్రంగా ఉంటుందనే భావన అందరిలోనూ వచ్చిందని, అందుకే చెల్లించే వారి సంఖ్య పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నిధుల విషయంలో పురోగతి సాధిం చామన్నారు. నీళ్ల విషయంలో ముందడుగు వేస్తున్నామని, ఉపాధి కల్పనలోనూ వృద్ధి సాధించేందుకు ప్రయత్నాలు జరుగుతు న్నాయని వివరించారు. -
సెంట్రల్ ఎక్సైజ్ శాఖ పాత్ర కీలకం
హైదరాబాద్: సెంట్రల్ ఎక్సైజ్ శాఖ దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకపాత్ర పోషిస్తోందని కస్టమ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ అధ్యక్షుడు జస్టిస్ డాక్టర్ సతీశ్చంద్ర అన్నారు. గురువారం నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్లోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో 74వ సెంట్రల్ ఎక్సైజ్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ సతీశ్చంద్ర మాట్లాడుతూ.. పన్ను చెల్లింపుదారుల పట్ల అధికారులు స్నేహపూర్వకంగా వ్యవహరించాలని సూచిం చారు. జీఎస్టీ బిల్లును ప్రతి ఒక్కరూ స్వాగతించాలని, ఆ బిల్లు మంచి ఫలితాలను అందిస్తుందని ఆశిద్దామని అన్నారు. ఒలంపిక్ రజత పతక గ్రహీత పి.వి. సింధు మాట్లాడుతూ.. జీఎస్టీ బిల్లుకు ప్రచారకర్తగా ఎంపిక కావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ ఎంపిక తన భవిష్యత్పై మరింత బాధ్యతను పెంచిం దన్నారు. కమిషనర్ సందీప్ ఎం. భట్నాగర్ మాట్లాడుతూ.. జీఎస్టీ బిల్లు రావడంతో అధికారుల్లో ఆందోళనగా ఉందని జరుగుతున్న ప్రచారం అవాస్తవమన్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది పెద్ద మొత్తంలో పన్నులు వసూలు చేసినట్లు తెలిపారు. పన్ను వసూళ్లలో ప్రతిభ కనబరిచిన అధికారులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీత విభావరి ఆహుతులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో పలువురు సెంట్రల్ ఎక్సైజ్ అధికారులు పాల్గొన్నారు. -
మాల్యాకు రుణాలిప్పించింది వారే..
మన్మోహన్, చిదంబరంలపై బీజేపీ ఆరోపణలు న్యూఢిల్లీ: బడ్జెట్ సమావేశాల ప్రారంభం నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేతలపై బీజేపీ సంచలన అవినీతి ఆరోపణలు ఎక్కుపెట్టింది. విజయ్ మాల్యాకు చెందిన కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ కంపెనీకి యూపీఏ హయాంలో అప్పటి ప్రధాని మన్మోహన్, ఆర్థిక మంత్రి చిదంబరంలు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించేందుకు సాయం చేశారని ఆరోపించింది. ఈ ఆరోపణలను మన్మోహన్, చిదంబరంలు కొట్టిపడేశారు. మన్మోహన్కు మాల్యా లేఖలు కింగ్ఫిషర్కు అప్పులు ఇప్పించేందుకు జోక్యం చేసుకోవాలంటూ మాల్యా.. మన్మోహన్కు లేఖలు రాశారని, తర్వాత ఆ కంపెనీకి రుణాలు అందాయని బీజేపీ ప్రతినిధి సంబిత్ పాత్రా సోమవారమిక్కడ విలేకర్ల సమావేశంలో చెప్పారు. ‘2011 నవంబర్ 14న అలాంటి ఒక లేఖ రాసిన తర్వాత.. కింగ్ఫిషర్ ఇబ్బందులనుంచి గట్టెక్కేందుకు మార్గాలు అన్వేషించాలని మన్మోహన్ మీడియాతో చెప్పారు.. బ్యాంకుల నుంచి నిధులు విడుదల చేయించాలని మాల్యా మరో లేఖ రాశారు. కింగ్ఫిషర్.. డియాజియో కంపెనీతో ఒప్పందం కోసం చర్చలు జరుపుతున్నప్పుడు.. ఎస్బీఐ నుంచి నిరభ్యంతర పత్రం పొందేందుకు జోక్యం చేసుకోవాలని మాల్యా 2013 మార్చిలో చిదంబరానికి లేఖ రాశారు. మాల్యాకు అప్పులు ఇప్పించేలా చేసిన అవినీతి చేతులు చిదంబరం, మన్మోహన్లవే. ఇందులో 10, జన్పథ్(సోనియా నివాసం) పాత్ర కూడా ఉందా?’ అని పాత్రా అన్నారు. ఆర్థిక వ్యవస్థ బాగా లేదు భారతదేశ ఆర్థిక వ్యవస్థ సరిగ్గా లేదని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పరిశోధన విభాగం తయారు చేసిన ‘రియల్ స్టేట్ ఆఫ్ ఎకానమీ 2017’ డాక్యుమెంట్ను ఆయన ఏఐసీసీ కార్యాలయంలో విడుదల చేసి ప్రసంగించారు. ‘భారత ఆర్థిక వ్యవస్థ సరైన స్థితిలో లేదన్నది స్పష్టం. ఐఎంఎఫ్ కూడా మన స్థూల జాతీయోత్పత్తి(జడీపీ) వృద్ధి రేటును తగ్గించింది. అది 7.6 శాతంగా కాకుండా 6.6 శాతం కంటే తక్కువగా నమోదవనుంది’ అని అన్నా రు. మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం మాట్లాడుతూ.. ప్రభుత్వం చెబుతున్న జీడీపీ లెక్కలు సందేహాస్పదమన్నారు. -
ఆదాయపు పన్నుపైనే ఆశలు!
బేసిక్ లిమిట్ను పెంచాలంటున్న నిపుణులు 10 శాతం శ్లాబును మరింత విస్తరించాలి కొనుగోళ్లను పెంచటం తక్షణ కర్తవ్యం అలా చేస్తేనే ఆర్థిక వ్యవస్థ పరుగులు దానికి పన్ను మినహాయింపులే శరణ్యం ఫిక్కీ, ఏసీఏఐ ప్రతిపాదనలు ఈ సారి అరుణ్ జైట్లీ పెట్టబోయే బడ్జెట్కు చాలా ప్రత్యేకతలున్నాయి. ఒకటి... ఫిబ్రవరి నెలాఖరుకు బదులు ఈ సారి ఫిబ్రవరి నెల మొదట్లోనే పెడుతున్నారు. రెండోది పెద్ద నోట్లను రద్దు చేసి... డిజిటల్ లావాదేవీల్ని పెంచటానికంటూ పలు చర్యలు చేపట్టాక ఈ బడ్జెట్ను తెస్తున్నారు. మూడోది... పెద్ద నోట్ల రద్దుతో ఇపుడు ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదనే విమర్శలొస్తున్న తరుణంలో, ఎకానమీకి ఊతమివ్వటానికి ఈ బడ్జెట్లో పలు చర్యలు తీసుకోవచ్చనే అంచనాలు చాలానే ఉన్నాయి. వీటన్నిటికీ తోడు... ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. వీటన్నిటి నేపథ్యంలో జైట్లీ ఈ సారి గత రెండు బడ్జెట్లకు భిన్నమైన బడ్జెట్ తెస్తారని ఫిక్కీ, సీఐఐ, డెలాయిట్, కేపీఎంజీ వంటి ఆర్థిక సంస్థలతో సహా వివిధ రంగాల నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థను గాడిలోకి తెచ్చి పరుగులు పెట్టించాలంటే ప్రధానంగా ఆదాయపు పన్ను శ్లాబుల్లో మినహాయింపులు తప్పనిసరి అన్నది వారి విశ్లేషణ. వారి ప్రతిపాదనల వివరాలివీ... ఫిక్కీ, ఏసీఏఐ ప్రతిపాదనలు 1. ఆదాయపు పన్ను ప్రాథమిక మినహాయింపు ప్రస్తుతం రూ.2.5 లక్షలుగా ఉంది. దీన్ని రూ.3 లక్షలకు పెంచాలి. 2. మినహాయింపులు పోగా ప్రస్తుతం రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల వరకూ ఉండే పన్ను చెల్లించాల్సిన ఆదాయంపై 10 శాతం పన్ను విధిస్తున్నారు. దీన్ని రూ.10 లక్షల ఆదాయం వరకూ వర్తింపజేయాలి. 3. ప్రస్తుతం రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల మధ్య పన్ను చెల్లించాల్సిన ఆదాయం ఉటే దానిపై 20 శాతం పన్ను విధిస్తున్నారు. ఆ పరిమితిని రూ.20 లక్షల వరకూ వర్తింపజేయాలి. 4. ఇక రూ.10 లక్షలు పైబడి పన్ను చెల్లించాల్సిన ఆదాయం ఉంటే... వారు ప్రస్తుతం 30 శాతం పన్ను చెల్లించాల్సి వస్తోంది. దాన్ని రూ.20 లక్షలు పైబడ్డ వారికి మాత్రమే వర్తింపజేయాలి. డెలాయిట్ సర్వేలో తేలిందిదీ... ప్రముఖ ఆడిటింగ్ సంస్థ డెలాయిట్ నిర్వహించిన సర్వేలో... రూ.2.50 లక్షలుగా ఉన్న పన్ను మినహాయింపు పరిమితిని రూ.5 లక్షలకు పెంచాలని పలువురు సూచించారు. దీనివల్ల ప్రజల వద్ద నగదు మిగులుతుందని, కొనుగోళ్లు పెరుగుతాయని, పొదుపు పెరిగి పెట్టుబడులకు అవకాశం ఏర్పడుతుందని సంస్థ అంచనా వేస్తోంది. అలాగే ఐటీ చట్టం 80సీ మినహాయింపుల్ని రూ.1,50,000 నుంచి రూ.2,50,000కు పెంచాలన్నది మరో సూచన. అంతేకాక నేషనల్ పింఛన్ పథకం, భవిష్య నిధి(పీఎఫ్) నుంచి నగదు ఉపసంహరణపై పూర్తిగా పన్ను మినహాయించాలి. ముందస్తు పన్ను చెల్లింపునకు మినహాయింపును మరింత పెంచాలి. వైద్య ఖర్చుల మినహాయింపు రూ. 15,000 నుంచి రూ.50,000కు పెంచాలి. ట్రావెలింగ్ అలవెన్స్పై రూ. 5,000 వరకు మినహాయింపు ఇవ్వాలి. శ్లాబుల్ని సవరించాలి: సీఐఐ పన్ను శ్లాబుల్ని సవరించాలని భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) సూచించింది. బేసిక్ లిమిట్ను ప్రస్తుతమున్న రూ.2.50 లక్షల నుంచి కనీసం రూ.3 లక్షలకు పెంచాలని, శ్లాబుల్ని కూడా సవరించాలని సీఐఐ కోరింది. వృద్ధి ఆధారిత బడ్జెట్ అవసరం వినియోగాన్ని ప్రోత్సహించడం, పెట్టుబడుల్లో ప్రజల భాగస్వామ్యం పెంచడం, డిజిటలైజేషన్కు ప్రోత్సాహం, పన్ను పరిధిని విస్తరించడం, అధిక వృద్ధి సాధించేలా మొత్తంగా 2017 కేంద్ర బడ్జెట్ వృద్ధి ఆధారిత బడ్జెట్గా ఆశిస్తున్నాం. గార్, పన్ను మినహాయింపులు, జీఎస్టీలకు సంబంధించి విధానాల్ని స్పష్టంగా నిర్వచించాలని కోరుతున్నాం. ప్రస్తుత ఆర్థిక మందగమనం నేపథ్యంలో వ్యాపార నిర్వహణ సులభతరం చేయడం మరో కీలకాంశం. అలాగే వ్యవసాయం, మౌలిక వసతులు, సేవా రంగాలపై మరింత దృష్టిపెడతారని ఆశిస్తున్నాం. – ఎన్.ఎహెచ్.భన్సాలీ, సీఈవో, ఇమామీ లిమిటెడ్(ఫైనాన్స్,స్ట్రాటజీ అండ్ బిజినెస్ డెవలప్మెంట్) జూలై తరవాతే జీఎస్టీ: కేపీఎంజీ ప్రముఖ ఆడిటింగ్ సంస్థ కేపీఎంజీ నిర్వహించిన ప్రీ బడ్జెట్ సర్వేలో వివిధ రంగాలకు చెందిన దాదాపు 750 మంది పాల్గొన్నారు. వారందరి అభిప్రాయాల్ని క్రోడీకరించిన అనంతరం సంస్థ తన నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం... ► దాదాపు సగం మంది నిపుణులు ఈ సారి గార్ (జనరల్ యాంటీ ఎవాయిడెన్స్ రూల్స్)ను వాయిదా వేయాలని కోరారు. గార్ నిబంధనల్ని 2012 బడ్జెట్లో ప్రవేశపెట్టారు. అయితే సరైన రీతిలో నిబంధనలు రూపొందించకపోవడంతో అమలు వాయిదా పడుతూ వచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచే గార్ను అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. అలాగే ఆదాయం లెక్కింపు, వెల్లడి నిబంధనలను (ఐసీడీఎస్) వాయిదా వేయాలని దాదాపు 60 శాతం మంది అభిప్రాయపడ్డారు. ► నోట్ల రద్దు సమీప భవిష్యత్తులో తమ వ్యాపారాలపై ప్రభావం చూపే అవకాశం లేదని పలువురు పేర్కొన్నారు. నోట్ల రద్దుతో ఆదాయపు పన్ను వసూళ్లు పెరుగుతాయని దాదాపు 82 శాతం మంది అంచనా వేశారు. ► జీఎస్టీ అమలుకు 1, జులై 2017 అనువైనదని 49 శాతం మంది చెప్పగా... 43 శాతం మంది మాత్రం జులై తర్వాతే జీఎస్టీ అమలు చేయాలని కోరారు. బడ్జెట్ సమావేశాల్లో జీఎస్టీ నమూనా చట్టం ఆమోదించాలని 68 శాతం సూచించగా... జీఎస్టీ అమలు నేపథ్యంలో ఈ బడ్జెట్లో పన్ను మినహాయింపులు, రాయితీ ఇవ్వాలని 82 శాతం మంది కోరారు. జీఎస్టీ ఆర్థిక రంగంపై సానుకూల ప్రభావం చూపుతుందని 95 శాతం మంది అభిప్రాయపడ్డారు. ► 85 శాతం మంది వ్యక్తిగత ఆదాయపు పన్ను శ్లాబుల్లో మార్పులు ఆశిస్తున్నారు. 94 శాతం ఈ బడ్జెట్లో పన్ను మినహాయింపుల్లో ఉపశమనం దక్కవచ్చని భావిస్తున్నారు. ప్రత్యక్ష పన్నుల్లో సంస్కరణలు ఆశిస్తున్నాం ఈ బడ్జెట్ దేశానికే కాకుండా, బీజేపీ ప్రభుత్వానికి చాలా కీలకమైంది. జీడీపీ వృద్ధి అంచనాల్ని అందుకోవడం, నల్లధనం వెలికి తీసేందుకే నోట్ల రద్దు నిర్ణయమని నిరూపించుకోవడం కేంద్ర ప్రభుత్వం ప్రధాన ఎజెండాలు.. ఈ బడ్జెట్లో ప్రత్యక్ష పన్నుల సంస్కరణలు, భూముల రిజిస్ట్రేషన్ సంస్కరణలతో పాటు డిజిటలైజేషన్కు మరింత ప్రోత్సాహం ఉంటుందని ఆశిస్తున్నాం. ఆర్థిక సమానత్వ సాధనకు, మేకిన్ ఇండియా కోసం కొత్త పథకాలు ప్రవేశపెడతారని ఆశిస్తున్నాం – సంజయ్ సేథీ, సీఈవో, షాప్క్లూస్ -
సంక్షోభాల్లో బంగారమే ఆదుకుంది
పసిడి నిల్వలతోనే ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది: ఆర్బీఐ మాజీ గవర్నర్ వైవీ రెడ్డి ♦ ప్రస్తుతం బంగారంపై అనేక అపోహలు నెలకొన్నాయి ♦ కడ్డీలు, బిస్కెట్లు భారీగా ఉంటేనే నల్లధనంగా గుర్తించాలి ♦ ప్రజల ఆభరణాలకు భరోసా ఉండాలి ♦ ఘనంగా ముగిసిన హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ సాక్షి, హైదరాబాద్: దేశం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్న అనేక సందర్భాల్లో బంగారం నిల్వలు మన ఆర్థిక వ్యవస్థను ఆదుకొన్నాయని ఆర్బీఐ మాజీ గవర్నర్ వైవీ రెడ్డి చెప్పారు. విదేశాల తరహాలో బంగారాన్ని కేవలం ఒక మారక వస్తువుగా అంచనా వేయడం సరికాదని, దేశ చరిత్ర, సంస్కృతిలో దానికి గొప్ప స్థానం ఉందని పేర్కొన్నారు. హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ ముగింపు ఉత్సవాల్లో భాగంగా ఆదివారం మూడోరోజు జరిగిన ప్లీనరీలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ‘గోల్డ్: బ్లాక్, వైట్ అండ్ ఎల్లో’ అన్న అంశంపై ఆయన కీలకోపన్యాసం చేశారు. ‘‘హోటల్కు వెళ్లి రూ.10 వేలు ఖర్చు చేసినట్లుగా బంగారాన్ని ఖర్చు చేయడం సరైంది కాదు. బంగారం నిల్వలు పుష్కలంగా ఉంటేనే దేశ ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది. మన వద్ద ఉండే బంగారం నిల్వలపైన ఆధారపడే ప్రపంచ దేశాల్లో మనకు ఒక హోదా లభిస్తుంది. 1990లో దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకొనిపోయినప్పుడు బంగారమే కాపాడింది. ప్రభుత్వం వద్ద బంగారం నిల్వలు పూర్తిగా పడిపోయాయి. ఆ సమయంలో ప్రజల వద్ద ఉన్న బంగారం, ఆభరణాలు ఎంతో ఆదుకున్నాయి. అయితే నల్లధనం కూడా బంగారం రూపంలోనే ఉంది. 1990 వరకు ఉన్న నల్లధనం అంతా బంగారం రూపంలోనే బయటకు వచ్చింది. 1997లో బంగారంపై ఒక విధానం అమల్లోకి వచ్చింది. అప్పట్నుంచి బ్యాంకు లావాదేవీల్లో దీన్ని వినియోగిస్తున్నారు’’ అని చెప్పారు. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో బంగారంపై ప్రజల్లో అనేక అపోహలు నెలకొన్నాయని, ఏది నల్లధనం కిందకు వస్తుంది? ఏది రాదు అన్న అంశంపై స్పష్టత అవసరమని అన్నారు. కడ్డీలు, బిస్కెట్ల రూపంలో భారీ ఎత్తున ఉన్న నిల్వలనే నల్లధనం కింద గుర్తించాలన్నారు. ప్రజల వద్ద ఉన్న బంగారు ఆభరణాలకు భరోసా ఉండాలని పేర్కొన్నారు. 11 మంది జీవిత గాథలతో హర్షమందిర్ పుస్తకం ప్రముఖ మానవ హక్కుల ఉద్యమ నేత, రచయిత హర్షమందిర్ ఇటీవల రచించిన ‘ఫాటల్ యాక్సిడెంట్స్ ఆఫ్ ఎ బర్త్’ పుస్తకంపై నిర్వహించిన చర్చా కార్యక్రమం ఆకట్టుకుంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో అణచివేతకు, హింసకు గురవుతున్న సామాజిక వర్గాలకు చెందిన 11 మంది వ్యక్తుల వాస్తవిక జీవితాలను ఆయన తన పుస్తకంలో కథలుగా రాశారు. హెచ్సీయూలో ఆత్మహత్యకు పాల్పడిన రోహిత్ వేములకు ఆ పుస్తకాన్ని అంకితం చేసినట్లు హర్షమందిర్ వివరించారు. ‘‘ఏ మనిషి కూడా ఎక్కడ, ఎలాంటి పరిస్థితుల్లో, ఏ కులంలో పుట్టాలో తెలుసుకొని పుట్టడు. కానీ దురదృష్టవశాత్తు చాలామంది వారి కులం, పరిస్థితుల వల్ల హింసకు, వివక్షకు గురవుతున్నారు’’ అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ముగిసిన వేడుకలు మూడ్రోజులపాటు కన్నులపండువగా జరిగిన 7వ హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ వేడు కలు ఘనంగా ముగిశాయి. సుమారు 16 వేల మందికి పైగా సందర్శకులు తరలి వచ్చారు. 11 దేశాల నుంచి 139 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణ, ఏపీల్లో మహిళల అక్రమ రవాణా: సునీతా కృష్ణన్ తెలుగు రాష్ట్రాల్లో మహిళలు, బాలికల అక్రమ రవాణా ప్రమాద కరంగా ఉందని ప్రజ్వల సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ సునీతా కృష్ణన్ ఆందోళన వ్యక్తం చేశారు. మనుషుల అక్రమ రవాణాపై జరిగి న చర్చలో ఆమె మాట్లాడారు. హైదరాబాద్ వంటి రాజధాని నగరంలోనూ మనుషుల అక్రమ రవాణా మాఫియా వేళ్లూనుకుంద న్నారు. ఇలాంటి నేరాలపై ఉక్కుపాదం మోపేందుకు కఠిన చట్టాలు అవసరమ న్నారు. తన 15వ ఏటా సామూహిక అత్యా చారానికి గురైనప్పుడు సమాజం నుంచి వివక్షకు, బహిష్కరణకు గురయ్యా నని ఆమె చెప్పారు. బెంగళూరులో మిస్వరల్డ్ పోటీలకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టినప్పుడు జైలుకు వెళ్లానని అప్పుడు తన సొంత కుటుంబం నుంచే వివక్షను ఎదు ర్కోవలసి వచ్చిందని చెప్పారు. ఈ రెండు సందర్భాల్లోనూ కుంగిపోకుండా బలంగా నిలబడి పోరాడినట్లు గుర్తు చేసుకున్నారు. ప్రజ్వల సంస్థ ద్వారా ఇప్పటివరకు 17 వేల మందికిపైగా మహిళలను అక్రమ రవాణా, వ్యభిచారం నుంచి విముక్తులను చేసి పునరావాసం కల్పించినట్లు చెప్పారు. -
'పెద్ద నోట్ల రద్దుతో బీజేపీకే ప్రయోజనం'
-
బీజేపీ ‘మిత్రులకు’ ముందే తెలుసు
- పెద్ద నోట్ల రద్దు పెద్ద స్కామ్: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ - సామాన్యులపై సర్జికల్ స్ట్రైక్స్ అని వ్యాఖ్య న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు పెద్ద స్కామని... కేంద్రంలోని అధికార బీజేపీ ‘మిత్రులకు’ దీనిపై ముందే సమాచారముందని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు. ప్రధాని మోదీ తీసుకున్న ఈ నిర్ణయం సామాన్యులు, చిన్నమొత్తాల పొదుపులపై సర్జికల్ స్ట్రైక్స్ అని... నల్ల ధనం, బ్లాక్ మార్కెటర్లపై కాదని పేర్కొన్నారు. ‘బీజేపీ పంజాబ్ లీగల్ సెల్ అధినేత సంజీవ్ కాంబోజ్ నోట్ల రద్దుకు ఒక రోజు ముందే రూ.2,000 నోటును సామాజిక మాధ్యమంలో పెట్టారు. ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ మధ్య బ్యాంకుల్లో ఒక్కసారిగా భారీ స్థారుులో డబ్బు డిపాజిటరుుంది. అధికార పార్టీ వారికి నోట్ల రద్దుపై ముందే సమాచారం అందడం వల్లే డిపాజిట్లు జరిగాయని స్పష్టమవుతోంది’ అని ఆరోపించారు. ‘నల్ల ధనం పేరుతో దేశంలో పెద్ద కుంభకోణం జరుగుతోంది. ఏటీఎంలలో డబ్బు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొత్త రూ.500, రూ.2,000 నోట్లను ఇప్పుడున్న ఏటీఎంలు పంపిణీ చేయలేవు. ఈ పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా ఉన్న ఏటీఎంలను కేంద్రం ఎలా మార్చగలదు? విషయం తెలిసే సంక్షోభం సృష్టించారు. మోదీ దృష్టిలో నల్లధనం అంటే ఏది? అంబానీ, అదానీ, శరద్పవార్, సుభాష్ చంద్ర, బాదల్ వంటి బడా పారిశ్రా మికవేత లు కూడబెట్టిన నల్లధనమా? లేదంటే రైతులు, రిక్షావారు, కూలి చేసుకు బతికేవారు సంపాదిం చిందా..’ అని ప్రశ్నించారు. కొత్త నోట్లు ఇచ్చేం దుకు ప్రజల నుంచి కమీషన్లు తీసుకొంటున్న వారితో పాటు ముందుగానే విషయం తెలుసు కుని బ్యాంకుల్లో డిపాజిట్లు చేసుకున్న ‘మిత్రు ల’ జాబితా బయటపెట్టాలన్నారు. ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం... ఈ నిర్ణయం భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని, చివరకు నిరుద్యో గానికి దారితీస్తుందని హెచ్చరించారు. ‘ప్రజ ల్లో భయాందోళనలు నెలకొన్నారుు. వ్యవస్థపై ప్రజలు విశ్వాసం కోల్పోతే అది సరైన నిర్ణయ మనిపించుకోదు’ అని అన్నారు. నల్ల ధనాన్ని మళ్లీ పంపిణీ చేసుకోవడానికే ఇది ఉపయో గపడుతుందన్నారు. ‘నల్ల’కుబేరులకు ఆప్ వత్తాసు: బీజేపీ నల్ల కుబేరులకు మద్దతు తెలుపుతోందంటూ కేజ్రీవాల్ చేసిన ఆరోపణలను బీజేపీ తిప్పికొ ట్టింది. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసే వారిని ప్రజలు పట్టించుకోరని బేజేపీ ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఇది బీజేపీ మరో జిమ్మిక్కు: కాంగ్రెస్ పెద్ద నోట్ల రద్దు బీజేపీ మరో జిమ్మిక్కని... నిజంగా నల్ల ధనం వెలికి తీయాలనే ఆలోచనే ఉంటే రాబోయే యూపీ, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ పెట్టే ఖర్చెంతో బహిర్గతం చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. 2014 ఎన్నికల ఖర్చుపై లెక్క తేల్చేందుకు విచారణ కమిషన్ను వేయాలని కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ కోరారు. ఎలాంటి ప్రణాళికా లేకుండా బీజేపీ తీసుకున్న తొందరపాటు నిర్ణయమి దన్నారు. తమ ప్రభుత్వ హయాంలో 2005కు ముందు నోట్లను రద్దు చేయాలనుకొం టున్నామని ప్రకటిస్తే బీజేపీ దాన్ని పేదల వ్యతిరేక నిర్ణయమని అభివర్ణించిందన్నారు. పూర్తిస్థారుులో కరెన్సీ ముద్రణ: ఆర్బీఐ ముంబై: ప్రస్తుతమున్న భారీ డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని ప్రింటింగ్ ప్రెస్సుల్లో పూర్తి స్థారుులో నోట్లను ముద్రిస్తున్నామని ఆర్బీఐ ప్రకటించింది. దేశవ్యాప్తంగా నాలుగు వేలకు పైగా కేంద్రాల్లో నోట్లు అందుబాటులో ఉంచామని, వాటిని బ్యాంకుల బ్రాంచీలతో అనుసం ధానించామని తెలిపింది. ఏటీఎంలు, బ్యాంకు లపై ఒత్తిడి తగ్గించడానికి ప్రజలు క్రెడిట్, డెబిట్ కార్డులు, నెట్ వంటి ప్రత్యామ్నాయ పద్ధతుల్లో లావాదేవీలు జరపాలని కోరింది. -
మా పట్ల ఔదార్యం చూపండి
♦ చట్టంలోనివేగాక ఇతరత్రా సాయమూ చేయండి ♦ అసెంబ్లీ సీట్లను 225కు పెంచండి ♦ కేంద్ర ప్రభుత్వానికి సీఎం చంద్రబాబు వినతి ♦ హోదా, ఆర్థికసాయం సహా పదిహేడు అంశాలతో తీర్మానం ప్రతిపాదన సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పునర్వ్యవస్థీకరణతో ఆంధ్రప్రదేశ్లో ఉత్పన్నమైన సమస్యల పరి ష్కారానికి కేంద్రం ఉదారత చూపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అంశాలతోపాటు ఇతరత్రా సాయమూ అందించాలని కోరారు. నిర్దిష్ట గడువులోగా రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం రాష్ట్ర శాసనసభలో 77వ నిబంధన కింద తీర్మానాన్ని ప్రవేశపెడుతూ సుదీర్ఘ ఉపన్యాసం చేశారు. రాష్ట్ర ఆర్థిక, సామాజిక స్థితిగతులను అంకెలతోసహా వివరించారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ఆమోదించే సందర్భంలో.. 2014 ఫిబ్రవరి 20న అప్పటి ప్రధాని రాజ్యసభలో ఇచ్చిన హామీల్ని త్వరగా అమలు చేయాలని కేంద్రాన్ని కోరారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ఆర్థికసాయం, పోల వరం ప్రాజెక్టును 2018లోగా పూర్తి చేయడం, పారిశ్రామిక రంగానికి పన్నురాయితీలు, ప్రోత్సాహకాలు, వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ, విశాఖలో రైల్వేజోన్, ఆస్తులు, అప్పుల పంపిణీ, స్థానికత, శాసనసభ సీట్లను 175 నుంచి 225కు పెంచడంసహా మొత్తం 17 అంశాలతో ఆయన తీర్మానాన్ని ప్రతిపాదించారు. అనంతరం అందులోని ఒక్కో అంశాన్ని వివరించారు. తలసరి ఆదాయం తక్కువే.. దక్షిణాదిలోని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో తలసరి ఆదాయం రూ.35 నుంచి రు.40 వేలు తక్కువగా ఉందని సీఎం చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుత తలసరి ఆదాయం రూ.95,689గా ఉంటే తెలంగాణలో 1,29,182గా ఉందన్నారు. అయినప్పటికీ 10.99 శాతం వృద్ధిని రాష్ట్రం సాధించిందని వివరించారు. అయితే నిర్మాణాత్మక మార్పులు రాకుండా ఆదాయం పెరిగే అవకాశం లేదన్నారు. వ్యవసాయాదాయం ఎక్కువగా ఉన్నచోట తక్కువ పన్నులు(ట్యాక్స్లు) వస్తాయని చెప్పారు. విభజన నాటికి ఆడిటర్ జనరల్ లెక్కప్రకారం రాష్ట్ర ఆర్థిక లోటు రూ.16,079 కోట్లుగా ఉంటే కేంద్రం నుంచి ఇప్పటివరకు కేవలం 2,303 కోట్లే వచ్చాయని, ఇంకా రూ.13,776 కోట్లు రావాల్సి ఉందన్నారు. 14వ ఆర్థిక సంఘ నివేదిక ప్రకారం.. 2019 వరకు కూడా రాష్ట్రం ఆర్థిక లోటు నుంచి తేరుకునే పరిస్థితి లేదన్నారు. పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర నిధులు వ్యయం చేసినా కేంద్రం నుంచి తిరిగి రాబడతామని చెప్పారు. ఉత్తరాఖండ్, బుందేల్ఖండ్, హిమాచల్కు ఇచ్చిన ప్యాకేజీలు తమకూ ఇవ్వాలని కోరారు. అసెంబ్లీ సీట్ల పెంపు పెద్ద కష్టం కాదు... అసెంబ్లీ సీట్లను 175 నుంచి 225కు పెంచడం పెద్ద కష్టం కాదని చంద్రబాబు అన్నారు. బిల్లులో పెట్టాలని కోరామని, పెంచుతామని కేంద్రం హామీ ఇచ్చిందని చెప్పారు. డీలిమిటేషన్కు, అసెంబ్లీ సీట్ల పెంపునకు సంబంధం లేదన్నారు. సీట్ల పెంపువల్ల ఎటువంటి ఆర్థిక భారమూ ఉండబోదన్నారు. పార్లమెంటు సీట్లకు, దీనికి సంబంధం ఉండదన్నారు. పార్లమెంటులో బిల్లును ఆమోదించి రాష్ట్రపతికి పంపడం ద్వారా సీట్లు పెరుగుతాయన్నారు. కేంద్రం జోక్యం చేసుకోవాలి షెడ్యూల్ 9, 10లోని సంస్థల ఏర్పాటుకు ఎంత వ్యయమవుతుందో అంత డబ్బు ఇమ్మని కోరినట్టు ఆయన తెలిపారు. ఆస్తులు-అప్పుల పంపిణీపై ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు కలసి కూర్చుని ఏడాదిలోగా పరి ష్కరించుకోవాల్సి ఉన్నా.. అది జరగనందున కేంద్రప్రభుత్వమే జోక్యం చేసుకోవాలన్నారు. ఎవరికీ అన్యాయం జరక్కుండా పంపిణీ చేయాలని కోరారు. మిగతా రాష్ట్రాలతో సమానంగా ఏపీ అభివృద్ధి చెందేవరకూ ఆదుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశా రు. రాష్ట్రాభివృద్ధికి, మెరుగైన ఆర్థిక వ్యవస్థ ఏర్పాటుకు అందరూ కలసి రావాలన్నారు. తాను ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఏకగ్రీవం గా ఆమోదించాలని సభకు విజ్ఞప్తి చేశారు. -
ఖజానా ఖాళీ!
♦ ప్రస్తుతం రూ.3.5 కోట్లు మైనస్లోకి ♦ తగ్గిన రాబడి.. పెరిగిన ఖర్చులు ♦ గండికొట్టిన కొత్త మున్సిపాలిటీలు ♦ చక్కదిద్దే పనిలో యంత్రాంగం ♦ కొత్త పనులు చేపట్టవద్దని నిర్ణయం జిల్లా ప్రజాపరిషత్ ఆర్థిక వ్యవస్థ చతికిలపడింది. ఒకప్పుడు రూ.కోట్లతో కళకళలాడిన జెడ్పీ ఖజానా ఇప్పుడు లోటు బడ్జెట్తో డీలా పడింది. రాబడి భారీగా తగ్గుతుండగా.. ఖర్చులు విపరీతంగా పెరుగుతుండడంతో ఈ పరిస్థితి తలెత్తింది. సాధారణ పద్దు కింద చేపట్టే పనులు భారీగా పెరగడంతో తాజాగా ఖజానా రూ.3.5కోట్ల లోటుకు పడిపోయింది. దీంతో ఆర్థిక పరిస్థితి చక్కబడే వరకు కొత్తగా పనులు చేపట్టవద్దని జెడ్పీ యంత్రాంగం నిర్ణయం తీసుకుంది. - సాక్షి, రంగారెడ్డి జిల్లా సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాపరిషత్కు పలు పద్దుల కింద రాబడి ఉంటుంది. నగరం చుట్టూ విస్తరించి ఉండడం.. రియల్ వ్యాపారం జోరుగా సాగడంతో స్టాంపుడ్యూటీ పద్దులో ఏటా రూ.20కోట్ల వరకు ఆదాయం ఉండేది. అంతేకాకుండా పన్నుల రూపంలో వ చ్చే ఆదాయంలో తలసరి గ్రాంటు కింద ఏటా రూ.42లక్షలు, సీనరేజీ కింద రూ. 1.5కోట్ల వరకూ రాబడి వచ్చేది. పట్టణీకరణ నేపథ్యంలో కొత్త మున్సిపాలిటీల ఏర్పాటుతో జిల్లా పరిషత్ ఆదాయం క్రమంగా తగ్గుతోంది. ఇటీవల కొత్తగా ఐదు నగరపంచాయతీలు ఏర్పాటయ్యాయి. జనాభా ప్రాతిపదికన గణాంకాలన్నీ మున్సిపల్ పరిధిలోకి చేర్చడంతో ఆదాయం అంతా మున్సిపాలిటీలకు దక్కుతోంది. ఈ క్రమంలో జెడ్పీ ఆదాయానికి భారీగా గండిపడింది. 2014-15 వార్షిక సంవత్సరంలో జెడ్పీకి వివిధ పద్దుల కింద రూ.15.03 కోట్ల ఆదాయం వచ్చింది. ప్రస్తుత వార్షికంలో ఇప్పటివరకు కేవలం రూ. 5.42 కోట్లు మాత్రమే సమకూరింది. జెడ్పీ సాధారణ నిధుల కింద రోడ్లు, ఇతర కమ్యునిటీ హాళ్లు, భూగర్భ డ్రైనేజీ తదితర నిర్మాణాలు భారీగా చేపట్టారు. జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచుల సంఖ్య గతంతో పోల్చితే ప్రస్తుతం అధికార పార్టీకి భారీ మెజార్టీ ఉంది. ఈక్రమంలో సభ్యుల డిమాండ్ల మేరకు పనులు పెద్ద సంఖ్యలో మంజూరు చేశారు. అయితే రాబడి భారీగా తగ్గడంతో తాజాగా జెడ్పీ ఖజానా లోటుకు చేరుకుంది. ప్రస్తుతం వివిధ పనులకు సంబంధించి రూ.3.5కోట్లు చెల్లించాల్సి ఉంది. అయితే జెడ్పీ ఖజానా నిండుకున్న నేపథ్యంలో ప్రత్యామ్నా ఏర్పాట్లపై యంత్రాంగం దృష్టి సారించింది. స్టాంపు డ్యూటీ కింద ప్రభుత్వం నుంచి జెడ్పీకి నిధులు రావాల్సి ఉన్నప్పటికీ.. లోటును భర్తీ చేయాలంటే మరిన్ని నిధులు కావాల్సి ఉంటుందని జెడ్పీ అధికారవర్గాలు చెబుతున్నాయి. -
వృద్ధిబాటలో ఉన్నది మనమే
ప్రపంచం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నా భారత్లో వేగంగా అభివృద్ధి ♦ ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ ఇవే చెబుతున్నాయి ♦ దయానంద్ సరస్వతి జయంతి కార్యక్రమంలో మోదీ న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ పరిస్థితిపై ప్రతిపక్షాల విమర్శలను ప్రధాని మోదీ తోసిపుచ్చారు. యావత్ ప్రపంచమంతా ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటుంటే భారత్ మాత్రమే తమ ప్రభుత్వ విధానాల కారణంగానే అభివృద్ధిపథంలో వడివడిగా ముందుకెళ్తోందన్నారు. ‘‘ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ సహా అందరూ ఇదే చెబుతున్నారు. ప్రపంచం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంటే కేవలం భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా పెద్ద ఆర్థిక దేశాల్లోకెల్లా భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక రంగంగా నిలిచినట్లు ప్రపంచ దేశాల ప్రజలు చెబుతున్నారు’’ అని పేర్కొన్నారు. 1875లో ఆర్య సమాజ్ను స్థాపించిన స్వామి దయానంద్ సరస్వతి జయంతి సందర్భంగా ఆదివారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో మోదీ మాట్లాడారు. ముద్ర పథకం ద్వారా 2 కోట్ల మందికిపైగా ప్రజలు లబ్ధి పొందారని, రూ. లక్ష కోట్లకుపైగా ఆర్థిక తోడ్పాటు అందించామన్నారు. 21వ శతాబ్దం విజ్ఞాన శకమని...విజ్ఞాన రంగంలో భారత్ యావత్ ప్రపంచానికి సారథ్యం వహించిందని గుర్తుచేశారు. దేశంలో ప్రస్తుతం ప్రభుత్వరంగం, ప్రైవేటు రంగం ఉండగా తాము వ్యక్తిగత రంగాన్ని ప్రవేశపెట్టాలనుకుంటున్నట్లు చెప్పారు. ప్రజలంతా ఉద్యోగాలు కోరుకునే వారిలా కాకుండా ఉద్యోగాలిచ్చేలా ఎదిగేందుకు స్వీయ సమృద్ధి, స్వీయ ఉపాధి సాధించాలన్నారు. దేశ జనాభాలో 60 శాతం మంది 35 ఏళ్లలోపు వారేనని...అందువల్ల దేశాభివృద్ధికి యువత శక్తిని ఉపయోగించుకోవడంపై దృష్టిసారించామన్నారు. నైపుణ్యాభివృద్ధి పథకాన్ని ప్రవేశపెట్టి దాని కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేశామని తెలిపారు. -
వృద్ధిలో ఈ ఏడాది... చాంపియన్ ఇండియానే!
ప్రపంచ బ్యాంక్ నివేదిక * వృద్ధిరేటు అంచనా 7.8 శాతం * వృద్ధి వేగంలో భారత్ తర్వాత చైనా, అమెరికా ఐక్యరాజ్య సమితి: భారత్ 2016లో కూడా ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందని ప్రపంచ బ్యాంక్ తన తాజా నివేదికలో పేర్కొంది. అయితే వృద్ధి రేటును గత జూన్లో 7.9 శాతంగా అంచనావేయగా దానిని 7.8 శాతానికి తగ్గించింది. ఈ స్థాయి వృద్ధి రేటును కూడా భారత్మినహా ఏ దేశం సాధించలేదని పేర్కొంది. కాగా ప్రపంచం మొత్తంమీద వృద్ధి రేటును జూన్లో 3.3 శాతంగా అంచనావేయగా, దానిని తాజాగా 2.9 శాతానికి కుదించింది. నివేదికలోని ముఖ్యాంశాలు... * భారత్ తరువాత వృద్ధి స్పీడ్లో చైనా ఉంది. 2016లో 6.7 శాతం వృద్ధి రేటు నమోదవుతుంది. 2017లో ఈ రేటు 6.5 శాతంగా ఉంటుంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 2.7 శాతం వృద్ధి సాధిస్తుంది. వచ్చే రెండేళ్లలో ఈ రేటు వరుసగా 2.4 శాతం, 2.2 శాతంగా ఉంటుంది. * భారత్ 2017 వృద్ధి రేటు అంచనా 7.9 శాతం. సంస్కరణల వేగం నెమ్మదించినప్పటికీ ఈ స్థాయి వేగం నమోదవుతుంది. అయితే 2018 వృద్ధిరేటు అంచనాను సైతం 8 శాతం నుంచి 7.9 శాతానికి కుదించింది. ఇతర ప్రధాన అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోల్చిచూస్తే... భారత్ చక్కటి పనితీరును ప్రదర్శిస్తోంది. సమీప భవిష్యత్తులో అంతర్జాతీయ ఒడిదుడుకులను తట్టుకునే పరిస్థితి ఉంది. దేశీయ వాణిజ్యం పటిష్టమయ్యే సూచనలు ఉన్నాయి. తగిన పాలసీ నిర్ణయాల రూపకల్పన సామర్థ్యం ఉంది. * అయితే కొన్ని సవాళ్లూ ఉన్నాయి. ముఖ్యంగా సంస్కరణల విషయంలో ఈ సవాళ్లను ప్రస్తావించుకోవచ్చు. ఎగువ సభలో పాలకపార్టీకి మెజారిటీ లేకపోవడం- సంస్కరణల విషయంలో ముందుకు వెళ్లలేని పరిస్థితిని సృష్టిస్తోంది. వస్తువులు, సేవల పన్ను (జీఎస్టీ) అమలు విషయంలో జరుగుతున్న జాప్యాన్ని ఇక్కడ ప్రస్తావించుకోవచ్చు. ఆయా అంశాల ప్రభావం దేశీయ మార్కెట్పై కూడా పడుతోంది. భూ సంస్కరణలు నెమ్మదించడం పెట్టుబడుల జాప్యానికి సైతం దారితీస్తోంది. దేశంలో పారిశ్రామిక రంగం మందగమనాన్ని కూడా నివేదిక ప్రస్తావించింది. అయితే ప్రభుత్వ చొరవల కారణంగా పెట్టుబడుల ప్రక్రియ ముఖ్యంగా మౌలిక రంగంలో క్రమంగా పుంజుకుంటోంది. * దేశంలో మౌలిక రంగం పురోగతికి, పెట్టుబడుల వృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై అమెరికా కఠిన ద్రవ్య విధానం ప్రభావం పడే అవకాశం ఉంది. * అంతర్జాతీయంగా ముడి చమురు ధరల దిగువస్థాయి ధోరణి భారత్ సంస్థలకు ఇంధన వ్యయాలను తగ్గిస్తుంది. దేశ ఆర్థిక వ్యవస్థకు లాభించే అంశం ఇది. * కరెంట్ అకౌంట్లోటు, విదేశీ మారక ద్రవ్య నిల్వలు, నికర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) రాక వంటి అంశాలు సానుకూలంగా ఉన్నాయి. -
ఇబ్బందుల్లోనే ఆర్థిక వ్యవస్థ
4 నెలల కనిష్టానికి పారిశ్రామిక ఉత్పత్తి * సెప్టెంబర్లో వృద్ధి రేటు 3.6 శాతం * అక్టోబర్ రిటైల్ ద్రవ్యోల్బణం 5% న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందులు తొలగిపోలేదని గురువారం విడుదలైన తాజా పారిశ్రామిక ఉత్పత్తి, రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు పేర్కొంటున్నాయి. వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం అక్టోబర్లో 5 శాతంగా నమోదయ్యింది. ఇక సెప్టెంబర్ పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) కేవలం 3.6 శాతం వృద్ధిని మాత్రమే నమోదుచేసుకుంది. తయారీ రంగంతోపాటు, కాస్మొటిక్స్ వంటి నాన్-డ్యూరబుల్స్ వినియోగ వస్తువుల విభాగం పేలవ పనితీరు ఐఐపీ గణాంకాలు అంతంతమాత్రంగా నమోదుకావడానికి కారణం. గడచిన నాలుగు నెలల్లో ఇంత దిగువస్థాయి వృద్ధి నమోదుకావడం ఇదే తొలిసారి. ఆగస్టు నెలలో ఈ వృద్ధి రేటు 6.2 శాతం. కాగా గత ఏడాది సెప్టెంబర్లో మాత్రం ఈ రేటు 2.6 శాతంగా ఉంది. ఇదిలావుంటే... ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో (ఏప్రిల్ నుంచి సెప్టెంబర్) చూస్తే... ఈ రేటు 2.9 శాతం నుంచి 4 శాతానికి పెరిగింది. జూన్ (4.2 శాతం), జూలై (4.1 శాతం), ఆగస్టు (6.2 శాతం) ఫలితాలు దీనికి కారణం. కీలక విభాగాల ఉత్పత్తి ఇలా... తయారీ: వార్షిక ప్రాతిపదికన సెప్టెంబర్లో వృద్ధి రేటు 2.7 శాతం నుంచి 2.6 శాతానికి పడింది. మొత్తం సూచీలో 75 శాతం వాటా ఉన్న ఈ రంగంలోని మొత్తం 22 గ్రూపుల్లో సగం మాత్రమే సెప్టెంబర్లో వృద్ధి రేటును నమోదుచేసుకున్నాయి. కాగా ఆరు నెలల్లో ఈ రేటు 2.2 శాతం నుంచి 4.2 శాతానికి ఎగసింది. మైనింగ్: ఈ రంగంలో వృద్ధి రేటు 0.1% నుంచి 3%కి ఎగసింది. ఆరు నెలల్లో మాత్రం ఈ రేటు 1.7 శాతం నుంచి 1.5 శాతానికి తగ్గింది. విద్యుత్: సెప్టెంబర్లో ఈ రేటు 3.9 శాతం నుంచి 11.4 శాతానికి పెరిగింది. అయితే ఆరు నెలల్లో మాత్రం ఈ రేటు 10.4 శాతం నుంచి 4.5 శాతానికి దిగింది. కేపిటల్ గూడ్స్: పెట్టుబడులకు, డిమాండ్కు సూచికగా ఉన్న ఈ భారీ ఉత్పత్తుల విభాగంలో వృద్ధి 12.3 శాతం నుంచి 10.5 శాతానికి పడింది. ఆరు నెలల్లో వృద్ధి మాత్రం 6% నుంచి 7.9%కి పెరిగింది. వినియోగ వస్తువులు: మొత్తంగా వినియోగ వస్తువుల విభాగం - 4.0 శాతం క్షీణత నుంచి 0.6 శాతం వృద్ధికి మళ్లింది. ఇందులో ఒక విభాగమైన కన్జూమర్ డ్యూరబుల్స్లో వృద్ధి కూడా -11.1% క్షీణత నుంచి 8.4 శాతం వృద్ధి బాటకు మళ్లింది. కాగా కన్జూమర్ నాన్ డ్యూరబుల్ గూడ్స్ విభాగంలో అసలు వృద్ధి నమోదుకాకపోగా -4.6 శాతం క్షీణత నమోదయ్యింది. 2014 సెప్టెంబర్లో ఈ విభాగం వృద్ధి 1.3 శాతం. ఈ మూడు విభాగాలనూ ఆరు నెలల్లో చూస్తే... మొత్తం వినియోగ వస్తువుల విభాగం -2.4 శాతం క్షీణత నుంచి 2.4 శాతం వృద్ధికి మళ్లింది. కన్జూమర్ డ్యూరబుల్స్ విభాగం -12.5 శాతం క్షీణత నుంచి 7.6 శాతం వృద్ధికి మారింది. నాన్-డ్యూరబుల్స్ విభాగం 1.9 శాతం వృద్ధి నుంచి -0.9 శాతం క్షీణతకు పడిపోయింది. స్థూల ఆర్థిక రంగానికి సంబంధించి కఠిన సవాళ్లు ఇంకా కొనసాగుతున్నాయని తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నట్లు అసోచామ్ సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్ పేర్కొన్నారు. పరిస్థితిని ఎదుర్కొనడానికి కేంద్రం ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. సామాన్యుడిపై ధరల భారం అక్టోబర్లో రిటైల్ ద్రవ్యోల్బణం 5% పెరగ్గా, ఆగస్టులో ఇది 4.41 శాతం. తాజాగా ముగిసిన నెలలో ఆహార ఉత్పత్తులు, పానీ యాల విభాగంలో ధరల పెరుగుదల స్పీడ్ (రేటు) గత ఏడాది ఇదే నెలతో పోల్చితే 5.34 శాతం పెరిగింది. పప్పు దినుసుల ధరలు మాత్రం భారీగా 42.20 శాతం ఎగశాయి. 4 శాతం పైన పెరిగిన ఆహార ఉత్పత్తులను చూస్తే... సుగంధ ద్రవ్యాలు (10 శాతం), ప్రిపేర్డ్ మీల్స్ (7 శాతం), మాంసం, చేపలు (5 శాతం), పాలు, పాల ఉత్పత్తులు (5 శాతం), చమురు, వెన్న పదార్థాలు (5 శాతం), ఆల్కాహాలేతర పానీయాలు (4 శాతం) ఉన్నాయి. కూరగాయల ధరలు 2.5 శాతం ఎగశాయి. చక్కెర, తత్సంబంధ ఉత్పత్తుల ధరలు మాత్రం 10 శాతం పైగా తగ్గాయి. సీపీఐలో మిగిలిన విభాగాలు చూస్తే... పాన్, పొగాకు ఇతర మత్తు ప్రేరిత ఉత్పత్తుల ధరలు 10 శాతం పెరిగాయి. దుస్తులు, పాదరక్షల ధరలు 5.62 శాతం, హౌసింగ్ 5 శాతం పెరగ్గా, ఇంధన, విద్యుత్ విభాగంలో రేటు 5 శాతం పైగా ఎగసింది. 2016 జనవరి నాటికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిటైల్ ద్రవ్యోల్బణం లక్ష్యం 5.8 శాతం. -
క్యూ3లో చైనా వృద్ధి రేటు 6.9%
బీజింగ్: చైనా ఈ ఏడాది మూడవ త్రైమాసికంలో (జూలై, ఆగస్టు, సెప్టెంబర్) 6.9 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంది. 2009 ప్రపంచ ఆర్థిక సంక్షోభం తరువాత చైనా వృద్ధి ఈ స్థాయిలో నమోదుకావడం ఇదే తొలిసారి. ఈ పరిస్థితుల్లో దేశాభివృద్ధికి దోహదపడే విధంగా ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను కలిగిన దేశం తాజాగా కొత్త ఉద్దీపన చర్యలు ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. దేశం నుంచి ఎగుమతులు పడిపోవడం ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో దేశం 7 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. మెరుగుపడుతున్న సేవలు, వినియోగం ... దేశ గణాంకాల బ్యూరో విభాగం విడుదల చేసిన వివరాల ప్రకారం.. గడచిన మూడు త్రైమాసికాల్లో దేశ జీడీపీ విలువ 48.79 ట్రిలియన్ యువాన్లు (7.68 ట్రిలియన్ల అమెరికన్ డాలర్లు). మొత్తం జీడీపీ విలువలో సగం సేవారంగం నుంచి వచ్చిందని గణాంకాలు తెలిపాయి. ‘అమెరికా వడ్డీరేట్ల పెంపు అంచనాలు కమోడిటీ, స్టాక్, ఫారెన్ కరెన్సీ మార్కెట్లపై ప్రభావితం చూపుతున్నాయి. పలు దేశాలు తమ కరెన్సీల విలువను తగ్గిస్తున్నాయి. ఈ ప్రభావం చైనా ఎగుమతులపై పడుతోంది. చైనా ఆర్థిక వ్యవస్థపై ప్రతికూలతల్లో ఇది ఒకటి’ అని నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రతినిధి షాంగ్ లియూన్ పేర్కొన్నారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అంచనాల ప్రకారం చైనా ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు గత ఏడాది 7.3 శాతం నుంచి ఈ ఏడాది 6.8 శాతానికి పడిపోతుంది. వచ్చే ఏడాది ఈ రేటు 6.3 శాతంగా ఉండనుంది. ఈ పరిస్థితుల్లో 7 శాతం పైగా వృద్ధి రేటుతో భారత్ ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందిన దేశం హోదా దక్కించుకుంటుందన్న విశ్లేషణలు వస్తున్నాయి. -
జీడీపీ గణాంకాలపై దృష్టి..!
- విదేశీ అంశాలు; చమురు, రూపాయి కదలికలు కూడా - ఈ వారం స్టాక్ మార్కెట్ ట్రెండ్పై నిపుణుల విశ్లేషణ - నేడు విడుదల కానున్న క్యూ1 జీడీపీ గణాంకాలు ముంబై: దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి స్థూల గణాంకాలు, విదేశీ నిధుల ప్రవాహం, అంతర్జాతీయ పరిణామాలు ఈ వారం మన స్టాక్ మార్కెట్లకు దిశానిర్ధేశం చేయనున్నాయి. ప్రస్తుతం నెలకొన్న తీవ్ర హెచ్చుతగ్గుల ధోరణి ఇప్పుడప్పుడే తొలగిపోయే అవకాశం లేదని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రధానంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2015-16) జూన్తో ముగిసిన త్రైమాసికానికి స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) గణాంకాలు నేడు(సోమవారం) విడుదల కానున్నాయి. దీంతోపాటు రుతుపవనాల పురోగతి, డాలరుతో రూపాయి మారకం విలువ కదలికలు, అంతర్జాతీయంగా ముడిచమురు ధరల్లో హెచ్చుతగ్గులు కూడా దేశీ మార్కెట్లలో ట్రెండ్ను నిర్ధేశించడంలో కీలకంగా నిలుస్తాయని విశ్లేషకులు చెబుతున్నారు. తీవ్ర హెచ్చుతగ్గులు కొనసాగవచ్చు... సంస్కరణలకు సంబంధించి ప్రభుత్వం తీసుకోబోయే తదుపరి చర్యలు, ఆగస్టునెలకు సంబంధించి వాహన కంపెనీల అమ్మకాల డేటా(1న విడుదల అవుతుంది) కూడా స్వల్పకాలంలో మార్కెట్పై ప్రభావం చూపుతుందని క్యాపిటల్ వయా గ్లోబల్ రీసెర్చ్ సీఎంటీ రీసెర్చ్ డెరైక్టర్ వివేక్ గుప్తా పేర్కొన్నారు. ఈ వారం కూడా తీవ్ర హెచ్చుతగ్గులు ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవలి స్టాక్ మార్కెట్ పతనానికి పూర్తిగా విదేశీ అంశాలే కారణమని.. స్థూలంగా చూస్తే మన మార్కెట్ ఇంకా పటిష్టంగానే ఉందని గుప్తా పేర్కొన్నారు. భారీస్థాయిలో ఒడిదుడుకులు నెలకొన్నప్పుడు మార్కెట్ కుదుటపడేందుకు(బాటమ్ అవుట్) కొంత కాలం పడుతుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ‘గత వారంలో వెనక్కివెళ్లిన భారీ విదేశీ నిధులు మళ్లీ తక్షణం మార్కెట్లోకి తిరిగివచ్చే అవకాశాల్లేవు. ఇటీవల ఎదుర్కొన్న కుదుపులు కొనసాగవచ్చు. సమీప కాలంలో ఇన్వెస్టర్లు చైనా, అమెరికా(ముఖ్యంగా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపునకు సంబంధించి) నుంచి వచ్చే వార్తలపై నిశితంగా దృష్టిపెట్టాలి. అంతర్జాతీయంగా మార్కెట్లలో నెలకొన్న తాజా పరిణామాల కారణంగా ఫెడ్ వడ్డీరేట్ల పెంపును డిసెంబర్ వరకూ వాయిదా వేయొచ్చన్న వాదనలు జోరుగా వినబడుతుండటమే దీనికి కారణం. ఇక ఇప్పుడున్న ఒడిదుడుకుల సమయంలో సంస్థాగతంగా పటిష్టంగా ఉన్న కంపెనీల షేర్లను కొనుగోలు చేయడమే సరైన వ్యూహం’ అని రిలయన్స్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ హితేష్ అగర్వాల్ పేర్కొన్నారు. జీడీపీ అంచనాలు... జూన్ క్వార్టర్(క్యూ1) జీడీపీ వృద్ధి రేటు 7-7.5 శాతం శ్రేణిలో ఉండొచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. గతేడాది చివరి త్రైమాసికం(క్యూ4)లో వృద్ధి రేటు 7.5 శాతంగా నమోదవగా, క్యూ1లో ఇది 6.7 శాతంగా ఉంది. ఈ ఏడాది తొలి క్వార్టర్లో వృద్ధి 7.4-7.5 శాతంగా ఉండొచ్చని... ప్రధానంగా వ్యవసాయ రంగం వృద్ధి రేటు దిగజారే అవకాశం ఉందని క్రిసిల్ చీఫ్ ఎకనమిస్ట్ డీకే జోషి పేర్కొన్నారు. గత వారం మార్కెట్... చైనా మందగమనం, ఆ దేశ కరెన్సీ యువాన్ డీవేల్యూ ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లు గత వారంలో తీవ్ర కుదుపులకు గురైన సంగతి తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో సెన్సెక్స్ గత సోమవారం ఏకంగా 1,700 పాయింట్ల మేర కుప్పకూలింది. అయితే, ఆ తర్వాత భారీగానే కోలుకున్నప్పటికీ... వారం మొత్తంమీద 974 పాయింట్లు(3.55%) నష్టపోయి 26,392 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం గత వారంలో 298 పాయింట్లు(3.59%) క్షీణించి 8,002 వద్ద స్థిరపడింది. రూ.17,555 కోట్లు వెనక్కి తీసుకున్న ఎఫ్పీఐలు న్యూఢి ల్లీ: విదేశీ ఇన్వెస్టర్లు భారత క్యాపిటల్ మార్కెట్ నుంచి రూ.17,555 కోట్లను వెనక్కు తీసుకున్నారు. డిపాజిటరీస్ గణాంకాల ప్రకారం.. విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐ) ఆగస్ట్ 28 వరకు ఈక్విటీ మార్కెట్ల నుంచి రూ.16,936 కోట్లను వెనక్కు తీసుకున్నారు. అదే సమయంలో మరో రూ.619 కోట్లను రుణ మార్కెట్ల నుంచి విత్డ్రా చేసుకున్నారు. దీంతో మొత్తంగా ఎఫ్పీఐలు రూ.17,555 కోట్లను భారత స్టాక్ మార్కెట్ నుంచి వెనక్కు తీసుకున్నారు. స్టాక్ మార్కెట్ భారీగా కుప్పకూలిన సోమవారం ఒక్కరోజే ఎఫ్పీఐలు నికరంగా రూ.5,173 కోట్ల షేర్లను విక్రయించారు. -
చరిత్ర తెలిసి ఉంటేనే.. సేవ చేయగలం
నల్లగొండ టూ టౌన్: ‘తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ద్వారా నిర్వహించే పరీక్షల్లో తెలంగాణ చరిత్రను సిలబస్గా చేర్చడంపట్ల అభ్యర్థులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మన కళ్లముందున్న మన చరిత్రను చూడాలి. మన ఆర్థిక వ్యవస్థ గురించి తెలుసుకోవడానికి, రాసుకోవడానికి వెసులుబాటు ఉంది. తెలంగాణ ఆర్థిక వ్యవస్థపై అద్భుతమైన సమాచారం అందుబాటులో ఉంది. అభ్యర్థులందరూ దీనిని సద్వినియోగం చేసుకుని పోటీ పరీక్షల్లో విజయం సాధించాలి. మన చరిత్ర మనకు తెలియకపోతే మన ప్రాంతానికి సేవ చేయలేరు. ఉద్యోగులకు ప్రాంతం గురించి పూర్తిగా తెలిసి ఉండాల్సిందే.’ అని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం. కోదండరాం అన్నారు. శుక్రవారం నల్లగొండలోని చిన వెంకటరెడ్డి ఫంక్షన్హాలులో ‘సాక్షి- భవిత’ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రూప్స్ పరీ క్షలపై అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో గ్రూప్స్ పరీక్షలు రాసి ఉన్నతస్థాయి ఉద్యోగాలు సాధించాలన్న బలమైన ఆకాంక్ష ఈ ప్రాంత విద్యార్థుల్లో ఉందన్నారు. అయితే, ఉద్యోగంరాని వారు బాధపడకుండా పట్టుదలతో ముందుకు సాగాలని సూచించారు. టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో నిజాయితీతో పారదర్శకంగా పరీక్ష నిర్వహిస్తారనే నమ్మకం తనకు ఉందన్నారు. ‘సాక్షి’ నిర్వహిస్తున్న సదస్సులకు హాజరవుతున్న అభ్యర్థులలో ఎక్కువ మంది రైతు కుటుంబాలు, గ్రామీణ ప్రాంతాలేవారే కనుక సబ్జెక్టుపై వారికి పూర్తిస్థాయిలో అవగాహన ఉంటుందని పేర్కొన్నారు. టీఎస్పీఎస్సీ సభ్యుడు విఠల్ మాట్లాడుతూ ఐదారునెలల పాటు అహర్నిశలు శ్రమించి టీఎస్పీఎస్సీ లో కీలకమార్పులు తీసుకొచ్చామన్నారు. ఎలాంటి అవకతవకలు లేకుండా పూర్తి నిబద్ధతతో పరీక్ష లు జరుగుతాయన్నారు. పరీక్షకేంద్రాల్లో బయోమెట్రిక్ పద్ధతిని అమల్లోకి తేవాలని కమిషన్ నిర్ణయించిందని, పరీక్ష రాసిన వ్యక్తే ఇంటర్వ్యూకు హాజరయ్యారా లేదా అని నిర్ధారించేందుకు ఇంటర్వ్యూ వేళ కూడా బయోమెట్రిక్ తీసుకుంటామని, నాలుగు వైపులా కని పించే విధంగా పరీక్ష గదిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని విఠల్ తెలిపారు. కవి, రచయిత సుంకిరెడ్డి నారాయణరెడ్డి చరిత్రపై అవగాహన కల్పించారు. సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మాట్లాడుతూ సిల బస్ పుస్తకాలను సాక్షి సహకారంతో పేద విద్యార్థులకు అందించేందుకు ప్రతీక్రెడ్డి ఫౌండేషన్ ద్వారా ప్రయత్నిస్తామని చెప్పారు. ‘సాక్షి’ ఎడిటర్ వర్ధెల్లి మురళి మాట్లాడుతూ గ్రూప్స్ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థుల్లో గందరగోళం తొలగిం చడానికే అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ‘సాక్షి’ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ దిలీప్రెడ్డి మాట్లాడుతూ గ్రూప్స్ పరీక్షల కోసం త్వరలోనే సాక్షి హెల్ప్లైన్ నంబర్ను కూడా ప్రకటిస్తామని తెలి పారు. తెలంగాణ గ్రూప్-1 అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిండ్ల చంద్రశేఖర్గౌడ్ మాట్లాడుతూ పరీక్ష అయిపోయే వరకు అభ్యర్థులు తమ జేబుల్లో సిల బస్ కాగితం పెట్టుకుని తిరగాలన్నారు. ప్రముఖ కవి, రచయిత వేణు సంకోజు సమన్వయకర్తగా వ్యవహరించిన ఈ సదస్సులో ‘సాక్షి’ మఫిసిల్ ఎడిటర్ ఎస్.చలపతిరావు, నెట్వర్క్ ఇన్చార్జ్ కె.శ్రీకాంత్రావు, నల్లగొండ మునిసిపల్ చైర్మన్ బొడ్డుపల్లి లక్ష్మితోపాటు వేల సంఖ్యలో నిరుద్యోగులు హాజరయ్యారు. సదస్సు ప్రాంగణం కిక్కిరిసిపోయింది. -
ఈ ఏడాదే వడ్డీ రేట్ల పెంపు...
అమెరికా ఫెడ్ రిజర్వ్ - అనిశ్చితి టాప్ లిస్ట్లో చైనా, గ్రీస్లు ఉన్నట్లు వ్యాఖ్య వాషింగ్టన్: ఆర్థిక వ్యవస్థ అనుకున్న ఫలితాలను సాధిస్తే... ఈ ఏడాది చివరికల్లా వడ్డీరేటు పెంపు ఖాయమని అమెరికా ఫెడరల్ రిజర్వ్ చీఫ్ జన్నెత్ ఎలెన్ బుధవారం స్పష్టం చేశారు. పరపతి విధాన పరిస్థితిని తెలియజేయడానికి ఆమె హౌస్ ఫైనాన్షియల్ సర్వీస్ కమిటీ ముందు హాజరయ్యారు. రేటు పెంపు ఖచ్చితంగా ఎప్పుడు? ఎంత? అన్నది మాత్రం చెప్పలేమని అన్నారు. ప్రస్తుతం ఫెడ్ వడ్డీరేటు 0.25 శాతంగా ఉంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ పురోగతిలో ఉందని అన్నారు. కాగా ఉద్యోగాల మార్కెట్ తగిన విధంగా ఇంకా మెరుగుపడలేదన్నారు. అయితే ఇందుకు సంబంధించి నిరుద్యోగిత రేటు మాత్రం క్రమంగా తగ్గుతోందని వివరించారు. దేశంలో ద్రవ్యోల్బణం ఫెడ్ లక్ష్యాల కన్నా తక్కువగా ఉందని అన్నారు. గ్రీస్, చైనాలు ఆర్థిక అనిశ్చితికి సంబంధించి జాబితాలో టాప్లో ఉన్నాయని వ్యాఖ్యానించడం విశేషం. వినియోగదారుల వ్యయం క్రమంగా పెరుగుతోందని, ఇది వేగవంతమైన రికవరీకి దారితీసే అవకాశం ఉందని అన్నారు. కమిటీ కఠిన వైఖరి..: కాగా నివేదికను వివరించడానికి ముందు ఎలెన్ కమిటీ చైర్మన్ జెబ్ హెన్సార్లింగ్ నుంచి కొంత కఠిన పరిస్థితిని ఎదుర్కొనాల్సి వచ్చింది. పలు కీలక డాక్యుమెంట్ల కోసం కమిటీ విజ్ఞప్తిని సైతం ఫెడ్ పట్టించుకోవడం లేదని అన్నారు. తనది సొంత వ్యవహారం అన్నట్లు ఫెడ్ వ్యవహరిస్తోందంటూ... చట్టానికి ఫెడ్ అతీతం కాదని అన్నారు. ఆర్థికాంశాలకు సంబంధించి హౌస్ ఇన్వెస్టిగేషన్కు ఫెడ్ సహకరించాలని సూచించారు. లేదంటే హౌస్ ప్యానల్ గౌరవ ప్రతిష్టలు, విశ్వసనీయతలకు విఘాతం కలిగించినట్లవుతుందని అన్నారు. -
8-10% వృద్ధి సాధ్యమే..
పన్ను ఆదాయాలు పెరుగుతున్నాయ్.. - ఈసారి వరుణుడు కరుణిస్తున్నాడు... - ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యలు న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు జోరందుకుంటోందని, ఈ ఏడాది పన్నుల ఆదాయాలు కూడా దండిగానే వస్తాయని భావిస్తున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. స్థూల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతుండటం... ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల ప్రభావంతో మళ్లీ 8-10 శాతం వృద్ధిరేటు సుసాధ్యం కానుందని కూడా ఆయన చెప్పారు. ప్రతిపాదిత వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) వ్యవస్థ, ఇన్ఫ్రా రంగంలో పెట్టుబడుల జోరు, స్మార్ట్సీటీలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టడం వంటి చర్యలన్నీ వృద్ధిని పరుగులు తీయించేందుకు దోహదం చేస్తాయని జైట్లీ తెలిపారు. ఆదివారమిక్కడ జరిగిన నాబార్డు వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 37.5 శాతం పెరిగిన పరోక్ష పన్ను వసూళ్లు గతేడాదికంటే ఈసారి పన్ను వసూళ్లలో మంచి పురోగతి కనబడుతుండటం ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు అంత్యంత సానుకూల సంకేతంగా జైట్లీ పేర్కొన్నారు. ఈఏడాది తొలి త్రైమాసికంలో(ఏప్రిల్-జూన్) పరోక్ష పన్నుల ఆదాయం 37.5 శాతం ఎగబాకి రూ.1.54 లక్షల కోట్లుగా నమోదైన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. గతేడాది ఇదే కాలంలో ఈ మొత్తం రూ.1.12 కోట్లుగా ఉన్నట్లు తాజా గణంకాలు చెబుతున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్నప్పటికీ.. గతేడాది మన స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు 7.3 శాతంగా నమోదుకావడం చెప్పుకోదగిన విషయమేనని.. ఈ సంవత్సరం(2015-16)లో 8 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నట్లు జైట్లీ చెప్పారు. అయితే, దేశీయంగా కొన్ని సవాళ్లు పొంచిఉన్నాయని.. వీటిపై మరింత దృష్టిసారించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇంకా అనిశ్చితిలోనే కొనసాగుతోందన్న జైట్లీ.. ఈ ఏడాది వృద్ధి అంచనాలను ఐఎంఎఫ్ 3.3 శాతానికి తగ్గించిన విషయాన్ని గుర్తుచేశారు. ఇక గ్రీస్ సంక్షోభంపై మాట్లాడుతూ.. అన్ని దేశాలూ దీన్ని ఒక గుణపాఠంగా తీసుకోవాలన్నారు. తమ పరిమితులు, అవసరాలను దృష్టిలో ఉంచుకొనే వ్యయాలు చేయాలన్నది గ్రీస్ ఇచ్చిన అతిపెద్ద సందేశమని చెప్పారు. రైతులకు కొత్త వ్యవసాయ బీమా పథకం! ఈ ఏడాది వరుణుడు కరుణిస్తున్నాడని.. వర్షాలు ఆశించిన స్థాయిలోనే పడుతుండటం అటు రైతులకు, ఇటు దేశ ఆర్థిక వ్యవస్థకు శుభపరిణామమని ఆర్థిక మంత్రి జైట్లీ పేర్కొన్నారు. వర్షాలు ఇలాగే కొనసాగితే పప్పులు, ఇతర ఆహారోత్పుత్తుల ధరలు దిగొచ్చే అవకాశం ఉందని చెప్పారు. రైతుల కోసం ఒక కొత్త వ్యవసాయ బీమా పథకాన్ని తీసుకొచ్చే ప్రయత్నాల్లో ప్రభుత్వం ఉందని చెప్పారు. రైతులు ఒక్క వర్షాలను మాత్రమే నమ్ముకోకుండా చూడటమే ఈ కొత్త పథకం ప్రధానోద్దేశమని జైట్లీ వ్యాఖ్యానించారు. రుతుపవన వర్షాలు కాస్త ఆలస్యమైనప్పటికీ.. వర్షపాతం జూన్లో సాధారణం కంటే 25 శాతం అధికంగా నమోదైందని జైట్లీ పేర్కొన్నారు. కరువు భయాలు ఇక తొలగినట్టేనని.. మిగిలిన కాలానికి కూడా వర్షాలు ఆశాజనకంగానే ఉండొచ్చన్నారు. కరువు ఆందోళనలను తొలగించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని.. ఇటీవలే ప్రకటించిన రూ.50,000 కోట్ల జాతీయ సాగునీటి పథకం ఇందులో ప్రధానమైనదని కూడా జైట్లీ తెలిపారు. వ్యవసాయ రంగం కోసం మరిన్ని చర్యలకు సిద్ధంగా ఉన్నామని హామీనిచ్చారు. -
ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాం
ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని పెంపొందించాం... * ప్రజల ఆకాంక్షలను తీర్చేందుకు మరిన్ని చర్యలు... * ఏడాది పాలనపై బహిరంగ లేఖలో ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీ: దారీతెన్నూలేని ఆర్థిక వ్యవస్థను తమ ప్రభుత్వ ఏడాది పాలనలో చక్కదిద్దామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అంతేకాకుండా, ద్రవ్యోల్బణానికి కళ్లెం వేయడం, ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని పెంపొందించిన ఘనత కూడా తమదేనని చెప్పారు. ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న భారీ ఆకాంక్షలను నెరవేర్చడం కోసం రానున్న రోజుల్లో మరిన్ని చర్యలు చేపడతామని ప్రధాని హామీనిచ్చారు. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా మోదీ ప్రజలకు రాసిన బహిరంగ లేఖలో ఈ ఆర్థికపరమైన అంశాలను ప్రస్తావించారు. ‘మా ప్రభుత్వ హయాంలో ఎకానమీ పునరుత్తేజితమైంది. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన వృద్ధి సాధిస్తున్న దేశంగా భారత్ ఆవిర్భవించింది. ద్రవ్యలోటును అదుపులోకి తీసుకొచ్చాం. విదేశీ పెట్టుబడులు పెరిగాయి. అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలు భారత్పై సానుకూల ధోరణిని అనుసరించేలా చేయగలిగాం’ అని మోదీ తన లేఖలో పేర్కొన్నారు. పెండింగ్ సంస్కరణలకు మోక్షం... తాము అధికారంలోకి వచ్చాకే డీజిల్ ధరలపై నియంత్రణల తొలగింపు... బీమా, రక్షణ వంటి కీలక రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్డీఐ) పరిమితి పెంపు వంటి పెండింగ్లో ఉన్న పలు సాహసోపేతమైన సంస్కరణలకు ఆమోదముద్ర వేశామని ప్రధాని పేర్కొన్నారు. వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) అమల్లో పురోగతి సాధించామన్నారు. ‘నవ భారత్ నిర్మా ణం, గాడితప్పిన ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించడం కోసం మీరంతా(ప్రజలు) నమ్మకంతో ఏడాది క్రితం నాకు పట్టంగట్టారు. ఈ దిశగా మేమెంతో ప్రగతి సాధించాం. ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఇంకా చేయాల్సింది చాలా ఉంది’ అని మోదీ వ్యాఖ్యానించారు. 2014-15లో 7.4%గా నమోదైన జీడీపీ వృద్ధి రేటు(బేస్ ఇయర్ మార్పు తర్వాత) ఈ ఏడాది 8%పైగా ఉండొచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది. విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని వెనక్కిరప్పించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేయడమే కాకుండా.. పార్లమెంటులో దీనికి సంబంధించి చట్టాన్ని కూడా తీసుకొచ్చామని ప్రధాని వివరించారు. మోదీ ఇంకా ఏం చెప్పారంటే.. * అందరికీ బ్యాంకింగ్ సేవల కల్పన కోసం ప్రారంభించిన జన ధన యోజన పథకం ద్వారా 15 కోట్ల బ్యాంక్ ఖాతాలను తెరిపించాం. దీనిద్వారా రూ.15,800 కోట్ల విలువైన డిపాజిట్లు ఖాతాల్లో జమయ్యాయి. * సామాజిక భద్రతకోసం ఉద్దేశించిన పెన్షన్, జీవితబీమా, ప్రమాద బీమా స్కీమ్లలో తొలి వారం రోజుల్లోనే 6.75 కోట్లమంది చేరారు. * ఉద్యోగాల కల్పనలో కీలక పాత్ర పోషిస్తున్న చిన్న వ్యాపారవేత్తలకు తగిన రుణ సదుపాయం అందించేందుకు రూ.20,000 కోట్లతో ముద్రా బ్యాంక్ను నెలకొల్పాం. * లక్షలాది కొత్త కొలువుల సృష్టే లక్ష్యంగా ‘మేక్ ఇన్ ఇండియా’కు రూపకల్పన చేశాం. భారత్ను వ్యాపారాలకు అత్యంత అనువైన దేశంగా మార్చడంపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టాం. * వంటగ్యాస్ ఇతరత్రా ప్రభుత్వ సబ్సిడీలను నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి చేర్చేలా తగిన చర్యలు తీసుకున్నాం. * దేశాభివృద్ధిలో రాష్ట్రాలకు తగిన భాగస్వామ్యం కల్పించేలా ‘టీమ్ ఇండియా’ భావనను పెంపొ ందిస్తున్నాం. బొగ్గు గనుల వేలాన్ని పారదర్శకంగా నిర్వహించడం కోసం మైనింగ్ చట్టంలో మార్పులు చేయడమేకాకుండా దీనిద్వారా లభిం చనున్న రూ.3.35 లక్షల కోట్ల ఆదాయాన్ని సంబంధిత రాష్ట్రాలకు అందిస్తున్నాం. * నిలిచిపోయిన హైవే ప్రాజెక్టులను పునరుద్ధరించాం. మా హయాంలోనే విద్యుత్ఉత్పత్తి ఆల్టైమ్ గనిష్టానికి చేరింది. ఏటా రూ.20 వేల కోట్ల ప్రభుత్వ నిధులను అందిచేలా కొత్తగా జాతీయ మౌలికరంగ పెట్టుబడి ఫండ్ను నెలకొల్పాం. -
‘రీట్స్’తో మార్కెట్లోకి 96 బిలియన్ డాలర్ల నిధులు!
ముంబై: రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టుల(రీట్స్)కు బడ్జెట్లో ప్రతిపాదించిన పన్ను ప్రోత్సాహకాలతో 96 బిలియన్ డాలర్ల(దాదాపు రూ. 6 లక్షల కోట్లు) విలువైన నిధులు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని పరిశ్రమ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆఫీసులు, రిటైల్, గిడ్డంగులు ఇతరత్రా విభాగాల్లో వాడకంలో ఉన్న వాణిజ్యపరమైన స్థిరాస్తులను రానున్న కొద్ది సంవత్సరాల్లో ‘రీట్స్’ రూపంలో లిస్టింగ్ చేయడం ద్వారా ఈ మేరకు నిధుల ప్రవాహం ఉండొచ్చనేది వారి అభిప్రాయం. కేపీఎంజీ, నైట్ ఫ్రాంక్, హరియాని అండ్ కో రూపొందించిన సంయుక్త నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. దేశవ్యాప్తంగా మొత్తం 141 కోట్ల చదరపు అడుగుల వాణిజ్య రియల్టీ ఆస్తులను రీట్స్ ప్లాట్ఫామ్ ద్వారా మార్కెట్లో లిస్టింగ్ చేసే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. ఇందులో అత్యధిక వాటా ఏడు మెట్రో నగరాలదేనని కూడా తెలిపింది. అయితే, పన్ను సంబంధ అంశాలు, కొన్ని నియంత్రణపరమైన అడ్డంకులు ‘రీట్స్’ విజయవంతానికి సమస్యలు సృష్టించవచ్చని.. దీన్ని పరిష్కరించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అభిప్రాయపడింది. ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం... పెట్టుబడులకు ప్రోత్సాహకరమైన వాతావరణం నేపథ్యంలో రియల్టీ మార్కెట్లో రీట్స్కు అపారమైన అవకాశాలు ఉన్నాయని నివేదిక పేర్కొంది. బీమా కంపెనీలు కూడా రీట్స్లో పెట్టుబడి పెట్టేందుకు ఆస్కారం కల్పించేలా ఐఆర్డీఏ నిబంధనల సడలింపు, ఆస్తుల బదలాయింపునకు రాష్ట్ర ప్రభుత్వాలు స్టాంప్ డ్యూటీలో వన్టైమ్ మాఫీ సదుపాయం కల్పించడం వంటివి రీట్స్ విజయవంతానికి కీలకంగా నిలుస్తాయని.. దీనివల్ల ఇన్వెస్టర్ల సంఖ్య కూడా విస్తృతం అవుతుందని నివేదిక సూచించింది. -
బ్యాంకుల రుణ వృద్ధి అంతంతే!
ముంబై: ఆర్థిక వ్యవస్థలో డిమాండ్కు అద్దంపట్టే బ్యాంకింగ్ రుణ వృద్ధి రేటు పేలవంగానే ఉన్నట్లు తాజా గణాంకాలు తెలిపాయి. 2015 ఫిబ్రవరి 20వ తేదీతో ముగిసిన పక్షం రోజుల్లో బ్యాంకింగ్ రుణం వార్షికంగా రూ.64,53,394 కోట్లుగా ఉంది. 2014 ఇదే కాలానికి బ్యాంకింగ్ రుణం రూ.58,45,833 కోట్లు. అంటే కేవలం వార్షికంగా రుణ వృద్ధి రేటు 10.39 శాతం పెరిగిందన్నమాట. ఆర్థిక వ్యవస్థ మందగమనాన్ని రుణ వృద్ధి తీరు వెల్లడిస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజా గణాంకాలు ఈ విషయాన్ని తెలిపాయి. ఇక రుణ డిమాండ్ కన్నా అధికంగా డిపాజిట్ల పరిమాణం పెరుగుదల ఉంది. ఈ పరిమాణం 11.85 శాతం వృద్ధితో రూ.75,76,609 కోట్ల నుంచి రూ.84,74,824 కోట్లకు చేరింది. -
మార్కెట్లో హెచ్చుతగ్గులుంటాయ్
* ఒడిదుడుకులకు కారణాలు * 26న రైల్వే బడ్జెట్, డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు * 27న ఆర్థిక సర్వే * 28న సాధారణ బడ్జెట్ న్యూఢిల్లీ: ఈ వారం ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే వివిధ సంఘటనలున్నందున స్టాక్ మార్కెట్ తీవ్ర హెచ్చుతగ్గులకు లోనుకావొచ్చని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. రైల్వే, కేంద్ర సాధారణ బడ్జెట్లను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న సందర్భంగా మార్కెట్లో ఒడిదుడుకులు ఏర్పడతాయని వారు హెచ్చరించారు. అలాగే ఫిబ్రవరి డెరివేటివ్ సిరీస్ కాంట్రాక్టులు వచ్చే గురువారం ముగియనున్నందున, సూచీల కదలికలు తీవ్రంగా వుంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు. వచ్చే గురు, శుక్ర, శనివారాల్లో (26, 27, 28 తేదీల్లో) వరుసగా రైల్వే, ఆర్థిక సర్వే, సాధారణ బడ్జెట్లను ఆయా మంత్రులు లోక్సభలో ప్రవేశపెడతారు. శనివారం స్టాక్ మార్కెట్కు సెలవురోజైనప్పటికీ, సాధారణ బడ్జెట్ ప్రతిపాదనలు వెల్లడయ్యే ఈ శనివారం మాత్రం స్టాక్ ఎక్స్ఛేంజీల్లో ట్రేడింగ్ 9-3.30 గంటల మధ్య యథావిధిగా కొనసాగుతుంది. దాంతో ఈ వారం మార్కెట్ వరుసగా ఆరురోజులపాటు పనిచేస్తుంది. సంబంధిత రంగాలపై ఆసక్తి... ఈ వారం ప్రారంభం నుంచీ బడ్జెట్ ముందస్తు అంచనాలకు అనుగుణంగా కొన్ని రంగాలపై ఇన్వెస్టర్లు ఆసక్తి కనబరుస్తారని, ఆయా షేర్లలో ట్రేడింగ్ కార్యకలాపాలు ముమ్మరమవుతాయని నిపుణులు పేర్కొన్నారు. బడ్జెట్లో ప్రకటించబోయే సంస్కరణల పట్ల అంచనాలు, వాటి ప్రతిపాదనల ఆధారంగా సమీప భవిష్యత్తులో సూచీల కదలికలుంటాయని వారు తెలిపారు. వచ్చే కొద్దిరోజుల్లో ఎన్ఎస్ఈ ప్రధాన సూచీ నిఫ్టీ హెచ్చుతగ్గులకు లోనుకావొచ్చని, అయితే వారం మొత్తంమీద ప్రధాన అప్ట్రెండ్ మాత్రం కొనసాగవచ్చని క్యాపిటల్వయా గ్లోబల్ రీసెర్చ్ డెరైక్టర్ వివేక్ గుప్తా చెప్పారు. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులు, డాలరుతో రూపాయి మారకపు విలువ కదలికలు మార్కెట్ను ప్రభావితం చేస్తాయని ఆయన అన్నారు. ప్రభావం తగ్గుతోంది... చాలావరకూ సంస్కరణలు బడ్జెట్తో సంబంధం లేకుండానే జరుగుతున్నందున కొన్నేళ్లుగా మార్కెట్పై బడ్జెట్ ప్రభావం తగ్గుతోందని డీఎస్పీ మెరిలించ్ రీసెర్చ్ అనలిస్ట్ జ్యోతివర్థన్ జైపూరియా చెప్పారు. బడ్జెట్లలో పన్నులు, సుంకాల మార్పులు కూడా స్వల్పంగానే వుంటున్నాయని అన్నారు. ఎఫ్ఐఐల పెట్టుబడులు రూ. 16,500 కోట్లు... విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐలు) ఫిబ్రవరి నెలలో ఇప్పటివరకూ క్యాపిటల్ మార్కెట్లో రూ. 16,500 కోట్లు పెట్టుబడి పెట్టారు. దీంతో ఈ ఏడాది ఇప్పటివరకూ వారు చేసిన పెట్టుబడుల మొత్తం రూ. 50,205 కోట్లకు చేరింది. జనవరి నెలలో రూ. 33,688 కోట్ల నిధులు మార్కెట్లోకి ప్రవహించాయి. ఫిబ్రవరిలో ఇప్పటివరకూ ఎఫ్ఐఐలు ఈక్విటీ మార్కెట్లో రూ. 6,850 కోట్లు, రుణపత్రాల్లో రూ. 9,667 కోట్లు పెట్టుబడులు పెట్టడంతో, ఈ నెల మొత్తం విలువ రూ. 16,516 కోట్లకు చేరినట్లు సెంట్రల్ డిపాజిటరీ డేటా వెల్లడిస్తున్నది. -
పారిశ్రామిక వృద్ధి అంతంతే..!
* డిసెంబర్లో 1.7 శాతం * గనుల రంగం పేలవం న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి సూచీ(ఐఐపీ) వృద్ధి రేటు 2014 డిసెంబర్లో నామమాత్రంగా 1.7 శాతంగా నమోదయ్యింది. గనులు, తవ్వకాల రంగం పేలవ పనితీరు దీనికి ప్రధాన కారణం. అయితే 2013 డిసెంబర్తో పోల్చిచూస్తే మాత్రం వృద్ధి కొంత బెటర్. అప్పట్లో ఈ వృద్ధి రేటు నామమాత్రంగా 0.1 శాతంగా ఉంది. కాగా 2014 నవంబర్లో ఐఐపీ వృద్ధి రేటును స్వల్పంగా 3.8 శాతం నుంచి 3.9 శాతానికి సవరించారు. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకూ ఐఐపీ వృద్ధి రేటు 2013-14 ఇదే కాలంతో పోల్చిచూస్తే, 0.1 శాతం నుంచి 2.1 శాతానికి ఎగసింది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) ఆధారంగా కేంద్రం ఈ పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి రేటు గణాంకాలను విడుదల చేస్తుంది. గురువారం విడుదలైన తాజా డిసెంబర్ గణాంకాలను విభాగాల వారీగా చూస్తే... ⇒ మొత్తం సూచీలో దాదాపు 75 శాతం వాటా కలిగిన తయారీ రంగం డిసెంబర్లో 2.1 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. ఆర్థిక సంవత్సరం 9 నెలల కాలంలో ఈ రేటు 2013-14 ఇదే కాలంతో పోల్చితే క్షీణత నుంచి బైటపడింది. మైనస్ 0.4 శాతం నుంచి 1.2 శాతం వృద్ధి బాటకు మళ్లింది. తయారీ రంగంలోని మొత్తం 22 పారిశ్రామిక గ్రూపుల్లో 13 సానుకూల ఫలితాలను నమోదుచేసుకున్నాయి. ⇒ మైనింగ్ రంగం 2.6 శాతం వృద్ధి బాట నుంచి -3.2 శాతం క్షీణ బాటకు మళ్లింది. ఏప్రిల్-డిసెంబర్ మధ్య మాత్రం ఈ రేటు సానుకూలంగా ఉంది. -1.5 శాతం క్షీణత నుంచి 1.7 శాతం వృద్ధి రేటులో ఉంది. ⇒ ఇక డిమాండ్కు ప్రతిబింబమైన భారీ యంత్రపరికరాల తయారీ విభాగం క్యాపిటల్ గూడ్స్ 4.1 శాతం వృద్ధి సాధించింది. 9 నెలల్లో -0.4 శాతం క్షీణ రేటు 4.8 శాతం వృద్ధి బాటలో ఉంది. ⇒ విద్యుత్ రంగం వృద్ధి రేటు 7.5 శాతం నుంచి 4.8 శాతానికి తగ్గింది. ఏప్రిల్-డిసెంబర్ మధ్య కాలంలో వృద్ధి రేటు 5.6 శాతం నుంచి 10 శాతానికి పెరిగింది. బడ్జెట్లో చర్యలు అవసరం: కార్పొరేట్లు పారిశ్రామిక ఉత్పత్తి మందగమనంలో ఉన్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లు తగ్గించాలని, పెట్టుబడుల వృద్ధికి ఫిబ్రవరి 28 బడ్జెట్లో కేంద్రం తగిన చర్యలు తీసుకోవాలని పారిశ్రామిక వర్గాలు విజ్ఞప్తి చేశాయి. ఈ దిశలో కేంద్రం బడ్జెట్లో తగిన చర్యలు తీసుకుంటుందని తాము విశ్వసిస్తున్నట్లు ఫిక్కీ సెక్రటరీ జనరల్ దిదార్ సింగ్ అన్నారు. కేంద్రంలో కొత్తగా ఏర్పడిన సుస్థిర ప్రభుత్వం నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న ఉత్సాహానికి మరికొంత ఊపును ఇవ్వడానికి పటిష్ట, సుస్థిర విధాన పరమైన చర్యలూ అవసరమని అసోచామ్ ప్రెసిడెంట్ రాణా కపూర్ వ్యాఖ్యానించారు. జనవరిలో రిటైల్ ధరలు 5.11 శాతం అప్ న్యూఢిల్లీ: రిటైల్ వస్తువుల ధరలు జనవరిలో 5.11 శాతం పెరిగాయి. అంటే 2014 జనవరి రిటైల్ ధరలతో పోల్చితే 2015 జనవరిలో రిటైల్ ధరలు 5.11 శాతం పెరిగాయన్నమాట. పండ్లు (10.62 శాతం), కూరగాయల (9 శాతం) ధరల పెరుగుదల ప్రభావం మొత్తం రిటైల్ బాస్కెట్ ధరలపై పడింది. పాలు, పాల ఉత్పత్తుల ధరలు కూడా 9.38 శాతం ఎగశాయి. కొత్తగా మార్చిన 2011-12 బేస్ ఇయర్ ప్రాతిపదికన కేంద్రం తాజా గణాంకాలను విడుదల చేసింది. దీని ప్రకారం డిసెంబర్లో వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 4.28%. 2013-14తో పోల్చితే 2014-15లో రిటైల్ ద్రవ్యోల్బణం తక్కువగా ఉంటుందని కొత్త సిరీస్లో ద్రవ్యోల్బణం గణాంకాల విడుదల సందర్భంగా చీఫ్ స్టాటిస్టీషియన్ టీసీఏ అనంత్ తెలిపారు. ఒక్క ఆహార వస్తువుల విభాగాన్ని చూస్తే(ఆహారోత్పత్తులు, పానీయాలు) ద్రవ్యోల్బణం 6.13%గా ఉంది. సీపీఐ గణాంకాలతో పాటు, ఒక్క ఆహార ఉత్పత్తులకు సంబంధించి వినియోగ ఆహార ధరల సూచీ(సీఎఫ్పీఐ)ని కేంద్రం విడుదల చేసింది. వార్షికంగా ఈ సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 6.06% పెరిగింది. -
బ్యాంకులకు ‘కొసరు’ లాభం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్న సంకేతాలు ఇంకా బ్యాంకింగ్ ఫలితాల్లో ప్రతిబింబించడం లేదు. ఇప్పటికీ కార్పొరేట్ రుణాలకు డిమాండ్ పుంజుకోకపోవడంతో బ్యాంకులు చిన్న రుణాలపై దృష్టిసారిస్తున్నాయి. ఇదే సమయంలో మొండి బకాయిలు కొండలాగా పెరిగిపోతున్నాయి. కార్పొరేట్ రుణాలకు డిమాండ్ లేదని, బ్యాంకింగ్ వ్యాపారంలో వృద్ధి అంతంతమాత్రంగానే ఉందని ఇప్పటివరకూ ప్రకటించిన బ్యాంకుల ఫలితాల విశ్లేషణలో వెల్లడవుతున్నది. చాలా బ్యాంకుల వృద్ధి 15 శాతం లోపునకే పరిమితమయ్యింది. రుణ వితరణ పెరగకపోవడంతో ఎన్పీఏలు ఎగబాకాయి. బ్యాంకింగ్ వ్యాపారానికి ప్రధానమైన వడ్డీ ఆదాయం వృద్ధి అంతంతమాత్రమే వుండగా, వివిధ ఫీజుల ద్వారా ఆర్జించే ఇతర ఆదాయాలు బాగా పెరగడంతో బ్యాంకులు లాభాల్ని ప్రదర్శించగలిగినట్లు ఫలితాలు చెపుతున్నాయి. ఆదుకున్న ఇతరాదాయాలు ఒకట్రెండు బ్యాంకులను మినహాయిస్తే చాలా బ్యాంకులను ఇతరాదాయాలే ఆదుకున్నాయి. ముఖ్యంగా పీఎస్యూ బ్యాంకుల్లో ఇది చాలా స్పష్టంగా కనిపించింది. ఈ సమీక్షా కాలంలో పీఎన్బీ నికర వడ్డీ ఆదాయంలో కేవలం 3% వృద్ధి నమోదైతే ఇతర ఆదాయంలో మాత్రం ఏకంగా 73% పెరిగింది. అలాగే కెనరా బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం 8% పెరిగితే, ఇతర ఆదాయంలో 32% వృద్ధి నమోదయ్యింది. హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ బ్యాంకుల్లో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నికర వడ్డీ ఆదాయంలో 23% వృద్ధి నమోదైతే, ఇతర ఆదాయంలో 11% పెరుగుదలే కనిపించింది. యాక్సిస్ బ్యాంక్ వడ్డీ ఆదాయంలో 20%, ఇతర ఆదాయంలో 10% వృద్ధి నమోదయ్యింది. ఇక మిగిలిన బ్యాంకులను పరిశీలిస్తే మాత్రం లాభాల్లో ఇతర ఆదాయాలే కీలకపాత్ర పోషించాయి. కార్పొరేట్స్కు దూరం.. ఆర్థిక వృద్ధిరేటు పెరుగుతున్నా... రుణాలు తీసుకోవడానికి కార్పొరేట్ సంస్థలు ముందుకు రావడం లేదు. కానీ కార్పొరేట్ రుణాల విషయంలో ప్రభుత్వరంగ బ్యాంకులతో పోలిస్తే ప్రైవేటు బ్యాంకుల్లో పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. ప్రైవేటు బ్యాంకుల్లో హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ బ్యాంక్ కార్పొరేట్ రుణాల్లో రెండంకెలపైన వృద్ధి నమోదైతే, ఐసీఐసీఐ బ్యాంక్లో మాత్రం ఈ వృద్ధి 4.5 శాతంగా ఉంది. హెచ్డీఎఫ్సీ నాన్ రిటైల్ రుణాల్లో 36 శాతం వృద్ధి నమోదైతే, యాక్సిస్ బ్యాంక్లో 13% వృద్ధి నమోదయ్యింది. ప్రభుత్వరంగ బ్యాంకులైతే కార్పొరేట్ రుణాల జోలికి వెళ్లకుండా ఆటోమొబైల్, పర్సనల్ లోన్స్, వ్యవసాయం, హోమ్లోన్స్, ఎంఎస్ఎంఈ రుణాల కేసి చూస్తున్నాయి. దేశంలో రెండో అతిపెద్ద పీఎస్యూ బ్యాంక్ పీఎన్బీ కార్పొరేట్ రుణాల్లో 3.1% వృద్ధి మాత్రమే సాధించింది. పెరుగుతున్న ఎన్పీఏలు...: బ్యాంకింగ్ రంగాన్ని ఎన్పీఏలు ఇంకా వెన్నాడుతూనే ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకుల్లో పరిస్థితి ఒకే విధంగా ఉంది. వీటిని తగ్గించుకోవడానికి బ్యాంకులు చేస్తున్న ప్రయత్నాలు అంతగా ఫలితమివ్వడం లేదు. వచ్చే ఐదు నెలల్లో మరో రూ. 60 వేల కోట్ల నుంచి లక్ష కోట్లు రుణాలు పునర్ వ్యవస్థీకరించాల్సి రావచ్చని ఇండియా రేటింగ్స్ అంచనా వేస్తోంది. ప్రస్తుతం అన్ని బ్యాంకులు కలిసి 3.45 లక్షల కోట్ల రుణాలను పునర్ వ్యవస్థీకరించగా, మరో 2.55 లక్షల కోట్ల రుణాలు ఎన్పీఏలుగా మారాయి. ప్రస్తుత ఫలితాలను పరిశీలిస్తే గతేడాదితో పోలిస్తే ఎన్పీఏలు భారీగా పెరిగినట్లు కనిపిస్తున్నా... తొలి త్రైమాసికంతో పోలిస్తే వీటి పెరుగుదల ఉధృతి తగ్గడం కొద్దిగా ఊరటనిచ్చే అంశం. ఎన్పీఏల బెడద ఇంకా ఉన్నప్పటికీ గత మూడేళ్లతో పోలిస్తే కొత్తగా ఏర్పడుతున్న ఎన్పీఏల్లో తగ్గుదల కనిపిస్తోందని మరో రేటింగ్ సంస్థ మూడీస్ పేర్కొంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎన్పీఏలు విలువ పరంగా పెరిగినట్లు కనిపించినప్పటికీ శాతాల్లో చూస్తే ఏడు బేసిస్ పాయింట్లు తగ్గడం విశేషం. అలాగే యాక్సిస్ బ్యాంక్లో గతేడాదితో పోలిస్తే ఎన్పీఏల్లో 32 శాతం వృద్ధి నమోదైనట్లు కనిపించినా, తొలి త్రైమాసికంతో పోలిస్తే ఈ వృద్ధి కేవలం 4 శాతం మాత్రమే. రానున్న కాలంలో వడ్డీరేట్లు తగ్గే అవకాశం ఉండటంతో ఇక ఎన్పీఏలు తగ్గడమే కాని పెరగడం ఉండదని బ్యాంకింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి. బ్యాలెన్స్షీట్పై దృష్టి... గత కొన్నేళ్లుగా దెబ్బతిన్న బ్యాలెన్స్ షీట్ను చక్కదిద్దడంపై బ్యాంకులు ప్రధానంగా దృష్టిసారిస్తున్నాయి. రుణాలకు డిమాండ్ లేకపోవడంతో డిపాజిట్ల సేకరణను తగ్గించుకుంటున్నాయి. ప్రధానంగా అధిక వడ్డీరేటుకు వసూలు చేసే బల్క్ డిపాజిట్లను వదలించుకోవడంతో పాటు, దీర్ఘకాలిక డిపాజిట్లపై వడ్డీరేట్లను తగ్గించేస్తున్నాయి. రుణాలకు డిమాండ్ పెరిగే వరకు డిపాజిట్ల సేకరణ వ్యయాన్ని తగ్గించడంపై దృష్టిసారిస్తున్నట్లు ఆంధ్రాబ్యాంక్ సీఎండీ రాజేంద్రన్ తెలిపారు. అధిక వడ్డీరేటు ఉన్న బల్క్ డిపాజిట్లను వదిలించుకోవడంతో పాటు, అధిక వడ్డీరేటు ఉన్న రుణాలపైనే ఎక్కువ దృష్టిసారిస్తున్నట్లు ఎస్బీహెచ్ ఎండీ శంతను ముఖర్జీ వెల్లడించారు. అలాగే కొన్ని బ్యాంకులు ఎన్పీఏలను అసెట్ రీ కన్స్ట్రక్షన్ కంపెనీలకు విక్రయించడం ద్వారా బ్యాలెన్స్ షీట్ను మెరుగుపర్చుకుంటున్నాయి. ఈ మూడు నెలల కాలంలో ఐసీఐసీఐ బ్యాంక్ రూ. 290 కోట్లు, బీవోఐ రూ. 106 కోట్లు, ఎస్బీహెచ్ రూ. 200 కోట్ల ఎన్పీఏలను విక్రయించాయి. పరుగులు తీస్తున్న బ్యాంక్ షేర్లు రెండో త్రైమాసిక ఫలితాలు మొదలైనప్పటి నుంచి బ్యాంక్ షేర్లు పరుగులు తీస్తున్నాయి. గత నెల రోజుల్లో నిఫ్టీ 5% పెరిగితే బ్యాంక్ నిఫ్టీ మాత్రం 13%పైగా ఎగసింది. రానున్న కాలంలో వడ్డీరేట్లు తగ్గుముఖం పట్టనున్న సంకేతాలకు తోడు, ఎన్పీఏల వృద్ధిరేటు తగ్గడం బ్యాంక్ షేర్లు పెరగడానికి ప్రధాన కారణంగా మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం ప్రైవేటు రంగ బ్యాంక్ షేర్లు పెరుగుతున్నా, రానున్న కాలంలో పీఎస్యూ బ్యాంక్ షేర్లూ పరుగులు తీయొచ్చని జెన్మనీ జాయింట్ ఎండీ సతీష్ కంతేటి చెప్పారు. చాలా పీఎస్యూ బ్యాంకులు బాండ్స్లో ఎక్కువగా పెట్టుబడులు పెట్టాయని, ఒక్కసారి వడ్డీరేట్లు తగ్గితే ఈ బాండ్ ఈల్డ్స్ పెరుగుతాయని, ఆ మేరకు బ్యాంకుల ఇతరాదాయాలు భారీగా పెరిగే అవకాశం ఉందన్నారు. మొత్తం మీద బాంకింగ్ రంగంలో ఎన్పీఏలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయని, ఒక్కసారి వడ్డీరేట్లు తగ్గితే ఎన్పీఏలు తగ్గుముఖం పడతాయంటున్నారు. మొండి బకాయిల తీరు ఇదీ... బ్యాంకు పేరు జీఎన్పీఏ(క్యూ2-15) జీఎన్పీఏ(క్యూ2-14) ఐసీఐసీఐ 11,547 కోట్లు (3.12%) 10,028 కోట్లు (3.08%) హెచ్డీఎఫ్సీ 3,362 కోట్లు (1.02%) 2,942 కోట్లు (1.1%) యాక్సిస్ 3,613 కోట్లు (1.3%) 2,734 కోట్లు (1.2%) పీఎన్బీ 20,752 కోట్లు(5.65%) 16,526 కోట్లు (5.1%) బీవోఐ 14,127 కోట్లు ( 3.54%) 9,880 కోట్లు (2.93%) ఆంధ్రా బ్యాంక్ 6,884 కోట్లు (5.99%) 5,187 కోట్లు (5.15%) కెనరా బ్యాంక్ 9,164 కోట్లు (2.92%) 7,475 కోట్లు (2.64%) ఇండియన్ బ్యాంక్ 5,003 కోట్లు (4.21%) 4,179 కోట్లు (3.76%) స్థూల నిరర్థక ఆస్తులు (జీఎన్పీఏ) రూ. కోట్లలో, బ్రాకెట్లో స్థూల నిరర్థక ఆస్తులు శాతాల్లో ఇవ్వడం జరిగింది -
తీవ్ర హెచ్చుతగ్గులకు చాన్స్
న్యూఢిల్లీ: ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులను చవిచూస్తాయని విశ్లేషకులు అంచనా వేశారు. సెప్టెంబర్ డెరివేటివ్ సిరీస్ ముగింపు నేపథ్యంలో ప్రధాన సూచీలు హెచ్చుతగ్గులకు లోనయ్యే అవకాశముందని చెప్పారు. గురువారం(25న) ఎఫ్అండ్వో కాంట్రాక్ట్ల గడువు ముగియనుంది. మరోవైపు అంతర్జాతీయ సంకేతాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలు వంటి అంశాలు సైతం కీలకంగా నిలవనున్నాయని విశ్లేషకులు పేర్కొన్నారు. ఇక ముడిచమురు ధరలు సైతం సెంటిమెంట్ను ప్రభావితం చేస్తాయని తెలిపారు. కాగా, సమీప కాలానికి ఈ నెల చివర్లో(30న) రిజర్వ్ బ్యాంక్ చేపట్టనున్న పరపతి సమీక్ష మార్కెట్ల ట్రెండ్ను నిర్దేశించనుందని అత్యధిక శాతం మంది నిపుణులు అభిప్రాయపడ్డారు. అయితే వడ్డీ రేట్ల విషయంలో రిజర్వ్ బ్యాంక్ ప్రస్తుత పరిస్థితినే కొనసాగించే అవకాశముందని క్యాపిటల్వయా గ్లోబల్ రీసెర్చ్ డెరైక్టర్ వివేక్ గుప్తా అంచనా వేశారు. ఆర్థిక వ్యవస్థపై ఆశలు దేశీయంగా మార్కెట్లను ప్రభావితం చేయగల ప్రధాన అంశాలులేని నేపథ్యంలో ఎఫ్ఐఐల పెట్టుబడులు, రూపాయి కదలికలు వంటి అంశాలకు ప్రాధాన్యత ఉంటుందని సియాన్స్ అనలిటిక్స్ సీఈవో అమన్ చౌదరి అభిప్రాయపడ్డారు. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమీక్షపై అంచనాలతో గత వారం మొదట్లో మార్కెట్లు డీలాపడినప్పటికీ, రేట్ల పెంపు నిర్ణయం లేకపోవడంతో చివర్లో జోరందుకున్న సంగతి తెలిసిందే. దీనికితోడు దేశీయంగా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందన్న ఆశలు ఈ వారం మార్కెట్లను ముందుకు దౌడు తీయించగలవని అమన్ అంచనా వేశారు. పాలసీ సమీక్ష వివరాలను వెల్లడిస్తూ ఫెడరల్ రిజర్వ్ చైర్ఉమన్ జానట్ యెలెన్ మరికొంత కాలం నామమాత్ర వడ్డీ రేట్లనే కొనసాగించనున్నట్లు ప్రకటించడంతో ఇన్వెస్టర్లు ఊపిరి పీల్చుకున్నారని పలువురు నిపుణులు వ్యాఖ్యానించారు. అమెరికా ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నెలకు 85 బిలియన్ డాలర్లను అమెరికా బ్యాంకింగ్ వ్యవస్థలోకి పంప్ చేయడం ద్వారా ఫెడరల్ రిజర్వ్ అమలు చేస్తున్న సహాయక ప్యాకేజీ అక్టోబర్లో ముగియనున్న నేపథ్యంలో రేట్ల పెంపు వాయిదా నిర్ణయానికి ప్రాధాన్యత ఏర్పడిందని వివరించారు. ఫెడ్ తాజా నిర్ణయంతో మరికొంతకాలం విదేశీ పెట్టుబడులకు ఢోకా ఉండబోదని, ఇది భారత్సహా వర్థమాన మార్కెట్లకు తీపి కబురు అందించిందని వ్యాఖ్యానించారు. మోడీ యూఎస్ పర్యటన ప్రధాని నరేంద్ర మోడీ ఈ వారంలో అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. దీనిలో భాగంగా ఈ నెల 29-30న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతోపాటు మోడీ వైట్హౌస్ను సందర్శించనున్నారు. పర్యటనకు సంబంధించిన అంశాలపై ఇన్వెస్టర్లు నిశితంగా దృష్టిసారిస్తారని విశ్లేషకులు పేర్కొన్నారు. కాగా, గడిచిన వారం ఎగుడుదిగుడు నడకలో సాగిన సెన్సెక్స్ నికరంగా 29 పాయింట్లు మాత్రమే జమ చేసుకోవడం గమనార్హం. వెరసి 27,090 వద్ద ముగిసింది. -
భారత్కు రండి... చకచకా అనుమతులు..
జపాన్ ఇన్వెస్టర్లకు ప్రధాని మోడీ పిలుపు... ►పీఎంఓలోని క్లియరెన్స్ విభాగంలో ఇద్దరు జపాన్ ప్రతినిధులకు చోటు ►ఎఫ్డీఐలకు ఆమోదాన్ని త్వరలోనే చట్టబద్ధం చేస్తాం... ►ఇన్ఫ్రా, పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల్లో జాప్యాలకు అడ్డుకట్ట ►సుపరిపాలనకే తన మొదటి ప్రాధాన్యత అని స్పష్టీకరణ వ్యాపారం నా రక్తంలోనే ఉంది.. నేను గుజరాతీని. వ్యాపారం అనేది నా రక్తంలోనే ఉంది. వ్యాపార సంస్థలకు మినహాయింపులు అక్కర్లేదు. వాటికి కావాల్సిందల్లా ఎదిగేందుకు అనువైన వాతావరణమే. అందుకు తగిన విధానాలను రూపొందించడం అనేది లీడర్, ప్రభుత్వం బాధ్యత. విధాన నిర్ణయాలు సరిగ్గా ఉంటే ఎలాంటి వివక్షా లేకుండా అందర్నీ సమానంగా చూడటం సాధ్యపడుతుంది. టోక్యో: భారత్లో పెట్టుబడులు పెట్టే జపాన్ ఇన్వెస్టర్లకు ప్రధాని నరేంద్ర మోడీ రెడ్కార్పెట్ పరిచారు. ఇన్వెస్ట్మెంట్కు సంబంధించిన అనుమతులను వేగవంతం చేస్తామని జపాన్ ఇన్వెస్టర్లకు మోడీ హామీనిచ్చారు. అంతేకాకుండా జపాన్ పెట్టుబడుల క్లియరెన్స్ల కోసం ప్రధాని కార్యాలయం(పీఎంఓ)లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసే నిర్ణయాత్మక బృందంలో ఇద్దరు జపాన్ ప్రతినిధులకు చోటు కల్పిస్తామని కూడా ఆయన ప్రతిపాదించారు. తద్వారా తాము అక్కడి ఇన్వెస్టర్లకు ఎంత ప్రాధాన్యమిస్తున్నామనేది స్పష్టం చేశారు. జపాన్ పర్యటనలో భాగంగా జపనీస్ వాణిజ్య, పరిశ్రమల మండలి(నిప్పన్ కీడన్రెన్), జపాన్-భారత్ వాణిజ్య సహకార సంఘం సోమవారమిక్కడ సంయుక్తంగా ఏర్పాటు చేసిన విందు సమావేశంలో ఆయన మాట్లాడారు. రైల్వేల్లో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్డీఐ)తో పాటు రక్షణ, బీమా రంగాల్లో ఎఫ్డీఐ పరిమితిని 26% నుంచి 49%కి పెంచుతూ తమ ప్రభుత్వం తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలకు చట్టపరమైన మార్పులను సాధ్యమైనంత తొందరగా సాకారం చేయనున్నామని మోడీ ప్రకటించారు. విధానపరమైన నిర్ణయాల్లో జాప్యాలను తొలగిస్తామని... మౌలిక వసతులు, పునరుత్పాదక ఇంధన రంగాల్లో భారీగా పెట్టుబడులు పెట్టాల్సిందిగా జపాన్ పారిశ్రామికవేత్తలు, ఇన్వెస్టర్లకు ఆయన పిలుపునిచ్చారు. మోడీతో పాటు జపాన్ పర్యటకు వెళ్లిన కార్పొరేట్ బృందంలో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, సునీల్ మిట్టల్, చందా కొచర్, కిరణ్ మజుందార్ షా, ఆది గోద్రెజ్, సునీల్ ముం జాల్, బాబా కల్యాణి తదితర దిగ్గజాలు ఉన్నారు. సింగిల్ విండో క్లియరెన్స్లపై దృష్టి... వ్యాపారానికి సానుకూల వాతావరణాన్ని కల్పించడం, విధానాల్లో సరళీకరణ, సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా వినియోగించడం, అనుమతి ప్రక్రియల వేగవంతం వంటి అంశాలు చాలా కీలకమైనవని.. అందుకే సింగిల్ విండో క్లియరెన్సులపై తాను దృష్టిసారించినట్లు ఆయన వెల్లడించారు. ‘ప్రభుత్వం, పారిశ్రామిక రంగం మధ్య సమన్వయం ఎంత ముఖ్యమో నాకు బాగా తెలుసు. గుజరాత్లో సీఎంగా ఉన్నప్పుడు నేను చేపట్టిన సంస్కరణలు, ప్రయోగాలను జాతీయ స్థాయిలో అమలు చేస్తా’ అని మోడీ పేర్కొన్నారు. జపాన్లోని నిర్వహణపరమైన మెలకువలను తమ ప్రభుత్వం కూడా అందిపుచ్చుకోనుందని.. ఇందుకోసం జపనీస్ మేనేజ్మెంట్(కెజైన్) సిస్టమ్ను పీఓఎంలో ప్రవేశపెట్టనున్నట్లు మోడీ వెల్లడించారు. ఇందుకు తగిన శిక్షణ కూడా ఇప్పిస్తున్నట్లు చెప్పారు. పట్టాలెక్కిన ఆర్థిక వ్యవస్థ... తమ సర్కారు తొలి 100 రోజుల పాలనలో చేపట్టిన ఆర్థిక సంస్కరణలు త్వరలోనే తగిన ప్రతిఫలాన్నివ్వనున్నాయని ప్రధాని జపాన్ ఇన్వెస్టర్లకు వివరించారు. తాను తీసుకున్న కొన్ని వేగవంతమైన నిర్ణయాలను ప్రస్తావించారు. అహ్మదాబాద్లో జపనీన్ బ్యాంక్ ఏర్పాటుకు అనుమతి, అరుదైన ఖనిజాల వెలికితీతకు సంబంధించిన ఒప్పందం వంటివి ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు రెండున్నరేళ్ల గరిష్టమైన 5.7 శాతానికి పుంజుకోవడాన్ని ఆయన ప్రముఖంగా పేర్కొన్నారు. ‘నిరుత్సాహకర పరిస్థితులు ఇక తొలగినట్లే. మా ప్రభుత్వ 100 రోజుల పరిపాలనను చూడండి. అంతకుముందు వృద్ధి రేటు 5-5.4 శాతం స్థాయిలో మందగమనంలో ఉండేది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలోనే భారీగా పుంజుకొని 5.7 శాతానికి వృద్ధి చెందింది. ఇదంతా భవిష్యత్తుపై ఆశలను చిగురింపజేస్తోంది. సానుకూల సెంటిమెంట్ నెలకొనేలా చేసింది.’ అని ఆయన చెప్పారు. మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని గత యూపీఏ ప్రభుత్వ దశాబ్ద కాలపు పనితీరుపై మోడీ విమర్శలు గుప్పించారు. ‘30 ఏళ్ల తర్వాత భారత్లో పూర్తిస్థాయి మెజారిటీతో మా ప్రభుత్వం కొలువుదీరింది. 125 కోట్ల భారతీయుల ఆకాంక్షలు, వాళ్ల జీవన ప్రమాణాలను పెంచే దిశగా మాపై బాధ్యత మరింత పెరిగింది’ అని మోడీ వ్యాఖ్యానించారు. -
మెప్పించిన మారుతీ..
►క్యూ1లో రూ.762 కోట్ల నికర లాభం; 21% అప్ ►ఆదాయం రూ.11,074 కోట్లు;11 శాతం వృద్ధి ►అమ్మకాల్లో 12.6% పెరుగుదల.. ►త్వరలో మిడ్సైజ్ సెడాన్ సియాజ్, ఎల్సీవీ, కాంపాక్ట్ ఎస్యూవీ... న్యూఢిల్లీ: దేశీ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా ఆకర్షణీయమైన ఫలితాలను నమోదు చేసింది. ఈ ఏడాది తొలి త్రైమాసికం(2014-15)లో రూ.762 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో రూ.632 కోట్లతో పోలిస్తే లాభం 21% ఎగబాకింది. అమ్మకాలు పుంజుకోవడం, వ్యయ నియంత్రణ, ఫారెక్స్ రాబడులు ఇందుకు ప్రధానంగా దోహదం చేశాయి. కాగా, కంపెనీ మొత్తం ఆదాయం 11% వృద్ధితో రూ.9,995 కోట్ల నుంచి రూ.11,074 కోట్లకు పెరిగింది. అమ్మకాల జోరు... ‘సన్నగిల్లిన వినియోగదారుల విశ్వాసం, అధిక ద్రవ్యోల్బణం ఇతరత్రా పలు ప్రతికూలాంశాలతో గతేడాది ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. అయితే, ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల తర్వాత సుస్థిర ప్రభుత్వం కొలువుదీరడంతో వినియోగదారుల్లో విశ్వాసం మళ్లీ పుంజుకుటోంది. తొలిసారి కారు కొనుగోలు చేసేవాళ్లు పెరిగారు. దీంతో కంపెనీ టాప్ సెల్లింగ్ మోడల్ అయిన ఆల్టో అమ్మకాలు క్యూ1లో 30 వేల మార్కును అధిగమించాయి’ అని మారుతీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్(సీఎఫ్ఓ) అజయ్ సేథ్ పేర్కొన్నారు. కాగా, ఏప్రిల్-జూన్ క్వార్టర్లో కంపెనీ మొత్తం 2,99,894 వాహనాలను విక్రయించింది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 12.6 శాతం వృద్ధి నమోదైంది. దేశీయంగా 2,70,643 వాహనాలు(10.3% వృద్ధి) అమ్ముడవగా... 29,251 వాహనాలను(38.7% వృద్ధి) ఎగుమతి చేసింది. క్యూ1లో మాతృసంస్థ సుజుకీ మోటార్ కార్పొరేషన్కు రూ.689 కోట్లను రాయల్టీ రూపంలో చెల్లించినట్లు ఆయన వెల్లడించారు. కాగా, ప్రస్తుత 2014-15 ఏడాదిలో రూ.4,000 కోట్ల పెట్టుబడులను వెచ్చించనున్నట్లు అజయ్ సేథ్ చెప్పారు. ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేరు గురువారం బీఎస్ఈలో ధర 1.07 శాతం నష్టంతో రూ.2,525 వద్ద స్థిరపడింది. కొత్త కార్ల క్యూ...: దేశీ మార్కెట్లో తమ వాటాను మరింత పటిష్టం చేసుకునేందుకు మారుతీ కొత్త కార్ల విడుదలకు సమాయత్తమవుతోంది. వచ్చే 12 నెలల్లో మిడ్సైజ్ సెడాన్ సియాజ్, ఎల్సీవీ(లైట్ కమర్షియల్ వెహికల్), కాంపాక్ట్ ఎస్యూవీ(స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్)తో తదితర వాహనాలను ప్రవేశపెట్టనున్నట్లు మారుతీ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ భారతి వెల్లడించారు. ఇప్పుడున్న మోడళ్లను మరింత మెరుగుపరచనున్నట్లు కూడా ఆయన పేర్కొన్నారు. -
ఉమన్ విత్ నో మనీ..!
స్ఫూర్తి ఒక్కసారిగా ప్రపంచ ‘ఆర్థిక వ్యవస్థ’ కుప్పకూలితే... అసలు ద్రవ్యమానం అనే దానికి చెల్లుబడి లేకుండా పోతే.. ఏదీ కొనే పరిస్థితి, అమ్మే పరిస్థితి లేకపోతే... అప్పుడు మనిషి ఎలా బతుకుతాడు, కొనడం, అమ్మడం అనే ప్రక్రియ లేకపోతే మనిషి జీవితం ఎలా ఉంటుంది? అనే సందేహం వచ్చింది 30 ఏళ్ల గ్రేటా టౌబర్ట్కు. అయితే గొప్ప ఆర్థికవేత్తలతో సహా అనేక మంది ఆమెకు వచ్చిన సందేహానికి సమాధానాన్ని చెప్పలేక నీళ్లు నమిలారు. దాంతో తనే సొంతంగా ఆ అంశం గురించి అధ్యయనం చేయాలనుకొంది గ్రేటా. డబ్బు లేకపోతే... అనేది తన సందేహం కాబట్టి... తను దేన్నీ డబ్బుతో ‘కొనకూడదు’ అని నిర్ణయించుకొంది. అంటే ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకొనే వరకూ అవి నిత్యావసరాలు అయినా... అత్యవసరాలు అయినా... దేనినీ కొనకూడదు! వీలైతే తయారు చేసుకోవడం, లేకపోతే సెలైంట్గా ఉండటం. ఈ ప్లాన్ ప్రకారం బతకాలని ప్రణాళిక రచించుకొంది. అందుకు తగ్గట్టుగా సెకండ్ హ్యాండ్ బట్టలమ్మే ఒక షాప్ను సందర్శించి, వాళ్లకు తను తయారు చేసిన కాంపోస్టు ఎరువును ఇచ్చి బట్టలు తెచ్చుకొంది. అలాగే టూత్ పేస్ట్ల దగ్గర నుంచి ఫేస్క్రీమ్ల వరకూ అన్నింటినీ అందుబాటులో ఉన్న వాటితోనూ, వస్తుమార్పిడి ద్వారా కొనుక్కోదగిన వాటితోనూ సమకూర్చుకుంది. ఈ విధంగా ఏడాది పాటు గడిపేసిందామె. డబ్బు అనేది ఖర్చు చేయకుండా ఆమె కొనసాగించిన జీవనశైలిని, పైసా ఖర్చు చేయకుండానే తూర్పు జర్మనీలోని తన ఊరి నుంచి 1,700 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి బార్సిలోనా చేరుకొన్న విధానం గురించి పూర్తి వివరాలను గ్రంథస్థం చేసింది.‘అపోకలిప్స్ జెట్జ్’ పేరుతో ఆ పుస్తకాన్ని విడుదల చేసింది. ఇదిగాక ఏడాది పాటు అందరికీ భిన్నంగా గడపడం ద్వారా సాధించింది ఏమిటి? అని ప్రశ్నిస్తే.. ‘‘ఎన్నో పాఠాలు’’ అని చెబుతుందామె. ఈ ప్రయాణంలో తన మదిలో జరిగిన చింతనతో ఆహార వృథాపై ఆందోళన తలెత్తిందని ఆమె చెబుతోంది. ఆర్థికమాంద్యంతో అల్లాడుతున్న దేశాలు కూడా ఇంకా ఆహార వృథాను అరికట్టడం లేదని, ప్రపంచానికి ఇదే పెనుప్రమాదం అవుతుందని అభిప్రాయపడింది. ఆమె చెప్పిన మరో విషయం ఏమిటంటే.. ప్రస్తుతం సమాజంలో డబ్బు ఖర్చు పెట్టకుండా బతకడం అనేది చాలా కష్టమైన పని, అలా ‘రాడికల్’గా బతకడం ఎక్కువ కాలం సాధ్యమయ్యే పని కాదు... వృథా ఖర్చు, ఆ ఖర్చు ద్వారా వనరులను వృథా చేయకుండా మాత్రం జీవితాంతం బతకగలనని విశ్వాసం వ్యక్తం చేసింది! -
ఈక్విటీల్లో ఇవి ఉండాల్సిందే..
స్టాక్ సూచీలు నూతన గరిష్ట స్థాయిలను దాటి దూసుకుపోతున్న తరుణంలో షేర్ల పెట్టుబడిలో ఉండే లాభనష్టాలు, ఇన్వెస్ట్ చేసే ముందు పాటించాల్సిన నియమాలతో పాటు, ప్రస్తుత ర్యాలీలో ఏ రంగాల షేర్లు పెరిగే అవకాశం ఉందన్న దానిపై ఐఐఎఫ్ఎల్ ప్రైవేట్ వెల్త్ మేనేజ్మెంట్ సీఐవో ఉమాంగ్ సలహాలు,సూచనలు ప్రత్యేకంగా ‘ప్రాఫిట్’ పాఠకుల కోసం ... సుదీర్ఘ కాలం తర్వాత కేంద్రంలో ఏక పార్టీ పూర్తిస్థాయి మెజార్టీతో అధికారం చేపట్టడంతో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే విధంగా కీలకమైన ఆర్థిక సంస్కరణలను చేపట్టే అవకాశం ఏర్పడింది. ఈ అంశమే విదేశీ ఇన్వెస్టర్లను అమితంగా ఆకర్షిస్తోంది. గత రెండేళ్లలో ఎఫ్ఐఐలు సగటున ఏడాదికి 22 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేస్తే ఈ ఏడాది జూన్ 18 నాటికే 10 బిలియన్ డాలర్లకు పైగా ఇన్వెస్ట్ చేశారు. అలాగే గత రెండేళ్లుగా తగ్గిన దేశీయ పొదుపు రేటు తిరిగి పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రెండు అంశాలు కూడా స్టాక్ మార్కెట్లోకి కొత్త నిధుల ప్రవాహాన్ని సూచిస్తున్నాయి. రానున్న కాలంలో స్టాక్ మార్కెట్లు మరింత పైకి ఎదిగే అవకాశాలు కనిపిస్తుండటంతో ఈక్విటీలు మంచి లాభాలను అందిస్తాయనే అంచనాలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈక్విటీ పోర్ట్ఫోలియో ఏ విధంగా ఉండాలో ఇప్పుడు చూద్దాం... మిడ్క్యాప్దే జోరు ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిలో పడుతున్నప్పుడు మిడ్, స్మాల్ క్యాప్ విభాగంలో మంచి కంపెనీల షేర్లు అత్యధికంగా లాభపడతాయి. సహజంగా పెరుగుతున్న వృద్ధిరేటుతో పాటే ఈ కంపెనీల వ్యాపార, ఆదాయాలు గణనీయంగా పెరుగుతాయి. వాటి భవిష్యత్తు ఆదాయాలు, లాభాలను దృష్టిలో పెట్టుకొని కంపెనీల షేర్ల ధరల రీ-రేటింగ్ జరుగుతుంది. బుల్ మార్కెట్ ర్యాలీలో లార్జ్ క్యాప్ షేర్ల కంటే మిడ్ క్యాప్ షేర్లే ఎక్కువ లాభాలను అందిస్తాయి. ఉదాహరణకు గత బుల్ ర్యాలీనే పరిశీలిస్తే... 2003-2007లో నిఫ్టీ 47 శాతం పెరిగితే నిఫ్టీ మిడ్క్యాప్ ఇండెక్స్ 55 శాతం వార్షిక వృద్ధిరేటును అందించింది. కాబట్టి మిడ్, స్మాల్ క్యాప్ విభాగంలో మంచి కంపెనీల షేర్లు తప్పకుండా మీ పోర్ట్ఫోలియోలో ఉండే విధంగా చూసుకోవాలి అదే బాటలో సైక్లికల్స్ బుల్ ర్యాలీలో మంచి పనితీరు కనపర్చే వాటిల్లో సైక్లికల్స్ అంటే.. క్యాపిటల్ గూడ్స్, మెటల్స్, బ్యాంకింగ్, ఇన్ఫ్రా రంగాలు ఉంటాయి. వృద్ధిరేటు మందగించడంతో ఈ రంగాలకు చెందిన కంపెనీల ఆదాయం 40 -60% పడిపోయింది. దీంతో ఈ షేర్లు వాటి సగటు ట్రేడింగ్ స్థాయి కంటే చాలా చౌక ధరల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఆర్థిక వ్యవస్థ గాడిలో పడితే ముందుగా పెరిగేది ఈ సైక్లికల్సే కాబట్టి వీటిపై ఓ కన్నేసి ఉంచాలి. పీఎస్యూలదే భవిష్యత్తు ప్రధాని నరేంద్ర మోడీ ఆర్థిక సంస్కరణల్లో మొదటి ప్రాధాన్యత పీఎస్యూలను సంస్కరించడమే. గుజరాత్ ముఖ్యమంత్రిగా పీఎస్యూలను ఆయన గాడిలో పెట్టిన విషయం తెలిసిందే. సరైన నిర్వహణ సామర్థ్యం లేక చాలా పీఎస్యూ కంపెనీలు పూర్తిస్థాయిలో లాభాలను పొందలేకపోతున్నాయి. స్టాక్ మార్కెట్లో నమోదైన 81 ప్రభుత్వరంగ కంపెనీల పదేళ్ల సగటు లాభాలు 12.5 శాతంగా ఉంటే ఇదే సమయంలో బీఎస్ఈలోని టాప్ 100 కంపెనీల సగటు లాభాలు 19.2%గా ఉన్నాయి. బ్యాంకులను మినహాయిస్తే 52 పీఎస్యూల సగటు లాభాలు 9.8 శాతం. పీఎస్యూలు రానున్న కాలంలో మరింత వృద్ధి చెందే అవకాశం ఉందని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుత బుల్ ర్యాలీలో మిగిలిన వాటికంటే ఈ మూడు రంగాలు మరింత మెరుగైన పనితీరును కనపర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలా అని మీ మొత్తం పెట్టుబడి అంతా ఈ మూడింటికే కేటాయించడం మంచిది కాదు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు కేవలం ఒకే రంగానికి కాకుండా అన్ని రంగాలకు కేటాయించే విధంగా చూసుకోవాలి. అందులో కొద్దిగా అధిక భాగం ఈ మూడింటికి కేటాయించడం ద్వారా రిస్క్ తగ్గించుకొని అధిక లాభాలను పొందే అవకాశం ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఆర్థిక వృద్ధికి దోహదం చేసే రంగాల్లో ఇన్వెస్ట్ చేసే ఫండ్స్ను ఎంచుకోండి. -
చేదు గుళికలా? తీపి పలుకులా?
సబ్సిడీల కోత తప్పదనే సంకేతాలు... - రైల్వే చార్జీల వడ్డనే నిదర్శనమంటున్న విశ్లేషకులు - వృద్ధిని గాడిలోపెట్టడం, ఆర్థిక క్రమశిక్షణే లక్ష్యం - ఐటీ మినహాయింపు పరిమితి పెంపుపై ఉత్కంఠ - ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తొలి బడ్జెట్పైనే దేశవ్యాప్తంగా ఆసక్తి... పదేళ్ల ఎదురుచూపుల తర్వాత బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన మోడీ సర్కారు తొలి బడ్జెట్ ఎలా ఉండబోతోంది? ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమర్పించనున్న మొట్టమొదటి బడ్జెట్లో దేశ ప్రజలకు చేదు గుళికలు ఉంటాయా? తీపి కబుర్లు వినిపిస్తారా? ఇవే ఇప్పుడు అందరి మదిలోనూ మెదులుతున్న ప్రశ్నలు. అసలే ఆర్థిక వ్యవస్థ తీవ్ర మందగమనంతో ఆపసోపాలు పడుతున్న తరుణంలో కార్పొరేట్ రంగం అనేక ఆశలతో ప్రభుత్వంవైపు చూస్తోంది. మరోపక్క, ద్రవ్యోల్బణం సెగతో అల్లాడుతున్న ప్రజలు కూడా బడ్జెట్లో తమకు ఉపశమనం కలిగించే చర్యలు ఉంటాయన్న నమ్మకంతో ఎదురుచూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జైట్లీ తొలి పరీక్షను ఎలా ఎదుర్కొంటారన్న ఆసక్తి దేశవ్యాప్తంగా నెలకొంది. 2014-15 ఆర్థిక సంవత్సరానికిగాను మోడీ ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ను వచ్చే నెల 10న ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో వివిధ వర్గాల ఆశలు, ఆకాంక్షలు, విజ్ఞప్తులు ఇతరత్రా అంశాల సమాహారంతో అందిస్తున్న ‘కౌంట్డౌన్’ ఇది... ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ సైన్యం యూపీఏ ప్రభుత్వ తప్పులను ఎండగడుతూనే... ప్రజలకు ఊరటనిచ్చే అనేక వరాలు, హామీలను కూడా గుప్పించింది. దీనికి ప్రతిఫలంగా భారీ మెజారిటీతో సుస్థిర మోడీ సర్కారు కొలువుదీరింది. వస్తూవస్తూనే ఆర్థిక వ్యవస్థను గాడిలోపెట్టాలంటే కొన్ని కఠిన చర్యలు తప్పవంటూ కుండబద్దలుకొట్టిన మోడీ... అదేంటో వెంటనే చూపించారు. రైల్వే చార్జీలను(ప్రయాణికులు, సరుకు రవాణా రెండూ) భారీగా పెంచేసి ప్రజలు, కార్పొరేట్లపై మోయలేని భారం మోపారు. పడిపోతున్న వృద్ధిరేటుకు చికిత్స చేయడమే లక్ష్యమంటూ ఊదరగొడుతున్న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తన తొట్టతొలి బడ్జెట్లో మరెన్ని బాంబులు పేల్చుతారోనని అటు కార్పొరేట్లు, ఇటు సామాన్య ప్రజల్లో ఆందోళనలు నెలకొన్నాయి. అదుపుతప్పుతున్న ద్రవ్యలోటును కట్టడి చేయడం, వృద్ధి రేటును తిరిగి పట్టాలెక్కించాలంటే సబ్సిడీల కోత, వస్తు సేవల పన్ను(జీఎస్టీ) అమలు వంటి కీలక చర్యలు తప్పవంటూ నిపుణులు, ప్రపంచబ్యాంక్ వంటి సంస్థలు పదేపదే చెబుతున్నారు. దీనికి అనుగుణంగానే రైల్వే చార్జీల పెంపుతో మోడీ ప్రభుత్వం సంకేతాలు కూడా ఇచ్చింది. అయితే, అందరూ ఆందోళన చెందుతున్నట్లుగా మరీ అంత చేదు గుళికలేవీ బడ్జెట్లో ఉండకపోవచ్చని... ఒకవేళ ఒకటోరెండో ఇలాంటి చర్యలు ఉన్నప్పటికీ ఆమోదనీయ స్థాయిలోనే ఉంటాయని సిట్రస్ అడ్వయిజర్స్ వ్యవస్థాపకుడు సంజయ్ సిన్హా అభిప్రాయపడ్డారు. ‘రైల్వే చార్జీల పెంపు ద్వారా సబ్సిడీలను వీలైనంతమేర కోతపెట్టే దిశగా తాము అడుగులేస్తున్న సంకేతాలను ప్రభుత్వం ఇచ్చింది. దీనికితోడు ఆర్థిక సంస్కరణలను మరింత పరుగులు పెట్టిస్తామన్న సందేశాన్ని కూడా మోడీ ప్రభుత్వం స్పష్టంగా వినిపించింది’ అని ఆయన అంటున్నారు. రైల్వేల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్డీఐ)ను అనుమతించే ప్రతిపాదనను రైల్వే బడ్జెట్లో ప్రకటించేలా కసరత్తు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఐటీ మినహాయింపువైపే చూపు... సబ్సిడీల తగ్గింపు, పన్ను ఆదాయాల పెంపు వంటి కఠిన చర్యలపై దృష్టిపెడుతూనే... మధ్యతరగతి వర్గాలను సంతృప్తిపరిచేలా మోడీ తన వ్యూహాన్ని అమలు చేయొచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వ్యక్తిగత ఆదాయపు పన్ను(ఐటీ) మినహాయింపు పరిమితిని ఇప్పుడున్న రూ. 2 లక్షల నుంచి రూ.3-5 లక్షల స్థాయి పెంచొచ్చనే ఊహాగానాలు జోరందుకున్నాయి. ఇలాంటి ‘ఫీల్ గుడ్ ఫ్యాక్టర్స్’పై జైట్లీ కచ్చితంగా దృష్టిపెట్టొచ్చని.. దీనివల్ల దేశవ్యాప్తంగా ప్రభుత్వంపై చాలా సానుకూలత పెరిగేందుకు దోహదం చేస్తుంది’ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ై డెరెక్ట్ ట్యాక్స్ కోడ్(డీటీసీ)లో ఐటీ మినహాయింపు పరిమితిని రూ.3 లక్షలుగా ప్రతిపాదించడం తెలిసిందే. దీనికి బీజేపీ నేత, మాజీ ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల స్థాయీ సంఘం కూడా ఓకే చెప్పింది. మరి స్వయంగా వాళ్ల సర్కారే ఇప్పుడు కేంద్రంలో కొలువుదీరిన నేపథ్యంలో ఒకవేళ డీటీసీ తక్షణం అమలు చేయకపోయినా, ఈ ప్రతిపాదనను కార్యరూపంలోకి తీసుకొస్తుందా లేదా అనే ఆసక్తి నెలకొంది. జైట్లీ బడ్జెట్పై 10 కీలక అంచనాలు.. 1 ఐటీ మినహాయింపు పరిమితి ఇప్పుడున్న రూ.2 లక్షల స్థాయి నుంచి పెంపు. 2 పొదుపును ప్రోత్సహించేందుకుగాను ఆదాయపు పన్ను మినహాయింపునకు ఉద్దేశించిన సెక్షన్ 80సీలో మార్పులు చేర్పులు. ప్రస్తుతం ఈ విభాగం కింద రూ. లక్ష వరకూ వ్యయం, పొదుపు మొత్తంపై ఐటీ మినహాయింపు ఉంది. 3 కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కొన్ని సామాజిక పథకాల రద్దు. ఈ నిధులను నేరుగా రాష్ట్రాలకే బదలాయించడం ద్వారా వాటికి మరింత స్వేచ్ఛనిచ్చేలా వ్యూహం. 4 పారిశ్రామిక రంగం నుంచి పెట్టుబడుల జోరు పెంచేందుకుగాను పన్ను ప్రోత్సాహకాలు. 5 స్టాక్ మార్కెట్ జోరు నేపథ్యంలో డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యాన్ని పెంచడం ద్వారా ఖజానాకు మరిన్ని నిధులు జమచేయడం. 6 జీఎస్టీ అమలుకు నిర్ధిష్ట డెడ్లైన్. వచ్చే ఏడాది మధ్యనుంచి లేదా 2016 ఏప్రిల్ నుంచి అమలు చేసేలా ప్రకటన. 7 పరోక్ష పన్నుల(ఎక్సైజ్, కస్టమ్స్)ల్లో కొన్ని స్వల్ప మార్పులు. 8 ఏప్రిల్ 1, 2015 నుంచి డెరైక్ట్ ట్యాక్స్ కోడ్(డీటీసీ) అమలు ప్రకటన. విధివిధానాలు ఈ ఏడాదిలోనే ఖరారు చేసేలా. 9 విద్య, నైపుణ్యాల పెంపు, ఆరోగ్యం, పట్టణాభివృద్ధి పథకాలకు భారీగా నిధుల కేటాయింపు. గ్రామీణ ఇళ్ల నిర్మాణం, రోడ్లు, ప్రత్యేక ఆర్థిక, తయారీ మండళ్లపై ప్రత్యేక దృష్టి. 10 వృద్ధికి ఊతమిచ్చేవిధంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, భూసేకరణ చట్టాల్లో మార్పులు. చర్యలకు సమయమిదే: జైట్లీ న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థ మరింత వేగంగా అభివృద్ధి చెందేలా చర్యలు చేపట్టాల్సిన సమయం ఆసన్నమైందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ‘గత రెండేళ్లలో ఆర్థిక ప్రగతి మందగించింది. ఇది ఓ సవాలు వంటిది. ఆర్థిక వృద్ధికి చర్యలు చేపట్టాల్సిన సమయం ఇదే’ అని ఆయన ఉద్ఘాటించారు. రక్షణ మంత్రి కూడా అయిన జైట్లీ మంగళవారం న్యూఢిల్లీలో నేవీ వేడుకల సందర్భంగా మీడియాతో మాట్లాడారు. వరుసగా రెండేళ్లలో 5% కంటే తక్కువ వృద్ధి రేటు నమోదు కావడం రెవెన్యూ వసూళ్లపై ప్రతికూల ప్రభావం చూపిందని చెప్పారు. ఇన్వెస్టర్లలో విశ్వాసం పునరుద్ధరించడానికీ పారిశ్రామిక, వ్యవసాయ సంఘాలతో పాటు ఇతర వర్గాలతో చర్చించినట్లు తెలిపారు. -
రుణ సమీకరణకు నవభారత్, అవంతి కసరత్తు
ఫాస్ట్ ట్రాక్... హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వడ్డీరేట్లు తగ్గడమే కాని పెరిగే అవకాశం లేదన్న స్పష్టమైన సంకేతాలకు తోడు ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతుందన్న నమ్మకంతో రాష్ట్ర కంపెనీలు విస్తరణ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇందుకు కావల్సిన నిధులను రుణాల రూపంలో సేకరించడానికి వాటాదారుల అనుమతి కోసం ఎదురు చూస్తున్నాయి. ఫెర్రోఅల్లాయిస్, విద్యుత్ ఉత్పాదక రంగంలో ఉన్న నవభారత్ వెంచర్స్ రుణాల రూపంలో రూ.3,000 కోట్లు సమీకరించాలని తాజాగా నిర్ణయించింది. ఇందుకోసం వాటాదారుల అనుమతి కోసం పోస్టల్ బ్యాలెట్, ఈ-వోటింగ్ ప్రక్రియను ప్రారంభించింది. 2012లోనే నవభారత్ వెంచర్స్ గరిష్టంగా రూ.10,000 కోట్లు సమీకరించడానికి బోర్డు అనుమతి మంజూరు చేసినప్పటికీ కొత్త కంపెనీల చట్టం ఇంత మొత్తం సమీకరించడానికి అంగీకరించకపోవడంతో రూ.3,000 కోట్లు సమీకరించాలని కంపెనీ నిర్ణయించింది. ఇదే బాటలో చేపలకు ఆహారాన్ని ఉత్పత్తి చేసే అవంతి ఫీడ్స్ కూడా వ్యాపార విస్తరణ కార్యకలాపాల కోసం రూ.500 కోట్లు సమీకరించనుంది. అదే విధంగా ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్న రిజిస్ట్రార్ ఆఫీసును విశాఖపట్నానికి కూడా మారుస్తోంది. ఈ రెండు నిర్ణయాలపై ఆమోదాన్ని కోరుతూ కంపెనీ వాటాదారుల అనుమతి కోరుతోంది. జూన్ 28న ప్రారంభమయ్యే పోస్ట్ బ్యాలెట్/ఈ వోటింగ్ జూలై 8తో ముగుస్తుంది. -
డెట్ నుంచి ఈక్విటీలోకి మారుదామా?
నిమేష్ షా ఎండీ. ఐసీఐసీఐ ప్రు ఏఎంసీ గత రెండేళ్లలో పూర్తిగా స్తంభించిన ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం నెమ్మదిగా కోలుకుంటోంది. ఆర్థిక వాతావరణం మెరుగుపడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయ్. వాణిజ్య లోటు తగ్గడం, టోకు, రిటైల్ ధరల ద్రవ్యోల్బణ పరిస్థితులు ఉపశమించడం వంటి అంశాలను ఇందుకు నిదర్శనాలుగా పేర్కొనవచ్చు. ప్రధానంగా దిగుమతులు తగ్గడంతో కరెంట్ ఖాతాలోటు జీడీపీలో 0.9%కు దిగివచ్చింది. ఇదే విధంగా 2009 ఫిబ్రవరిలో 12%కు చేరిన టోకు ధరల ద్రవ్యోల్బణం. ఈ ఫిబ్రవరిలో 4.3%కు దిగివచ్చింది. దీంతో పాలసీ సమీక్షలో వడ్డీ రేట్ల తగ్గింపు నిర్ణయాలను తీసుకునేందుకు వీలు చిక్కుతుంది. ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల తరువాత కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటైతే ఆర్థిక వృద్ధిపై దృష్టిపెట్టేందుకు అవకాశం లభిస్తుంది. ఫలితంగా ఇన్ఫ్రా రంగానికి తగిన ప్రాధాన్యత లభిస్తుంది. దీంతో ఉద్యోగ కల్పన, వినియోగం, పొదుపు వంటివి పుంజుకునేందుకు వీలు చిక్కుతుంది. ఆర్థిక పరిస్థితులు పుంజుకోవడం, వృద్ధిపై ప్రత్యేక దృష్టి, వడ్డీ రేట్ల తగ్గింపు వంటి అంశాలు అటు ఈక్విటీలు, ఇటు రుణ సెక్యూరిటీల(డెట్)లో పెట్టుబడులకు దారితీస్తాయి. చిన్న షేర్లు అనుకూలం దేశీ స్టాక్ మార్కెట్లకు ప్రామాణికంగా పరిగణించే బీఎస్ఈ సెన్సెక్స్ నూతన గరిష్టస్థాయిల వద్ద కదులుతోంది. గతంలో నమోదు చేసిన గరిష్టస్థాయిని దాటి నిలబడటానికి సెన్సెక్స్కి ఆరేళ్ల సమయం పట్టింది. ఇదే సమయంలో సెన్సెక్స్లోని కొన్ని బ్లూచిప్ షేర్ల ధరలు 2008 గరిష్ట స్థాయిలను అధిగమించినా, చాలా మధ్య, చిన్న తరహా కంపెనీలు ఇంకా వెనకబడి ఉన్నాయి. 2008 జనవరిలో మిడ్ క్యాప్ ఇండెక్స్ 10,113ను తాకగా, ప్రస్తుతం 7,339 వద్ద ఉంది. అంటే ఇంకా 27% వెనకబడి ఉంది. వెరసి మిడ్ క్యాప్ షేర్లు పెట్టుబడులకు అత్యంత ఆకర్షణీ యంగా ఉన్నాయి. పెట్టుబడులపై భారీ ఆర్జన(రిటర్న్)కు మిడ్ క్యాప్స్లో అధిక అవకాశాలు కనిపిస్తున్నాయ్. గత కొన్నేళ్లుగా దేశీ ఇన్వెస్టర్లు పసిడి , రియల్టీ వంటి ఆస్తుల కొనుగోలుపై పెట్టుబడులు వెచ్చిస్తూ వచ్చారు. అయితే ప్రస్తుత సంకేతాల ప్రకారం ఇన్వెస్టర్లు ఈక్విటీ కొనుగోళ్లకు ప్రాధాన్యత ఇవ్వొచ్చు. భవిష్యత్ లాభాల కోసం ప్రధానంగా మిడ్, స్మాల్ క్యాప్ షేర్లలో పెట్టుబడులను చేపట్టవచ్చు. డెట్ ఆకర్షణీయం కాదు డెట్లో పెట్టుబడులు ఇకపై అంత ఆకర్షణీయ ఫలాలను అందించలేకపోవచ్చు. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి బాట పడితే వడ్డీ రేట్ల తగ్గింపుపై రిజర్వ్ బ్యాంక్ దృష్టి పెడుతుంది. 2002 నుంచి చూస్తే గత 11ఏళ్లలో వడ్డీ రేట్లు 10.4-4.75% మధ్య హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. వడ్డీ రేట్లు ఎప్పుడు పెరిగితే అప్పుడు ఆర్థిక వృద్ధి మందగిస్తుంది. అలాకాకుండా వృద్ధి వేగమందుకుంటే వడ్డీ రేట్లను ఆర్బీఐ తగ్గిస్తుంది. 2002-04 మధ్య కాలంలో వడ్డీ రేట్లు 10% స్థాయి నుంచి 5%కు తగ్గాయి. మళ్లీ 2008లో 9% నుంచి 5%కు నెమ్మదిగా దిగివచ్చాయి. ఇక ఈ ఆర్థిక సంవత్సరం(2014-15)లోనూ టోకు, రిటైల్ ధరల వేగం 7.5-4.5% స్థాయిలోనే స్థిరంగా ఉండే అవకాశముంది. ఇదే విధంగా కరెంట్ ఖాతా లోటు 1.5%గా నిలిస్తే రూపాయికి కూడా స్థిరత్వం లభిస్తుంది. వీటికితోడు ఓ మోస్తరుగా ఉన్న రుణ వృద్ధి కూడా వడ్డీ తగ్గింపునకు దారితీస్తుంది. -
ప్రగతికి పది సూత్రాలు...!
మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదిగేందుకు చిదంబరం ప్రణాళిక న్యూఢిల్లీ: మరో మూడు దశాబ్దాల్లో ... అంటే 2043 నాటికి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఆవిర్భవించేందుకు దోహదపడే 10 సూత్రాల ప్రణాళికను కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం ప్రకటించారు. లోక్సభలో సోమవారం 2014-15 మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన ఈ సంగతి వెల్లడించారు. ‘స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) పరిమాణంపరంగా ప్రపంచంలో భారత ఆర్థిక వ్యవస్థ 11వ స్థానంలో ఉంది. మున్ముందు ఇండియా మరిన్ని ఘన విజయాలు సాధించనుంది. వచ్చే మూడు దశాబ్దాల్లో మన నామమాత్రపు జీడీపీ భారత్ను మూడో ర్యాంకులో నిలబెడుతుందని పలువురి అభిప్రాయం. అమెరికా, చైనాల తర్వాత అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ భారత్దే అవుతుంది. అభివృద్ధి చెందిన దేశాల అదృష్టం ప్రభావం ఇప్పుడు వర్ధమాన దేశాలపై పడినట్లే భవిష్యత్తులో చైనా, ఇండియాల ప్రభావం మిగిలిన ప్రపంచంపై గణనీయంగా ఉంటుంది. కనుక భారత ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయడం మన బాధ్యత...’ అని చిదంబరం తెలిపారు. ద్రవ్య పటిష్టీకరణ: 2016-17 నాటికి ద్రవ్యలోటును జీడీపీలో 3%కి తగ్గించాలి. ద్రవ్యలోటును ఎప్పటికీ దీనికంటే తక్కువగానే ఉంచాలి. విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించాలి: కరెంటు అకౌంటు లోటు మరి కొన్నేళ్లపాటు ఉంటుంది కాబట్టి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్డీఐ). విదేశీ సంస్థాగత పెట్టుబడులు(ఎఫ్ఐఐ), విదేశీ వాణిజ్య రుణాల(ఈసీబీ) వంటి విదేశీ పెట్టుబడులతోనే సమస్యను అధిగమించాలి. కనుక విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించాలి. ధరల స్థిరీకరణ, అభివృద్ధి: అధిక వృద్ధి రేటు లక్ష్యంగా ఉన్న వర్ధమాన ఆర్థిక వ్యవస్థలో ఓ మాదిరి ద్రవ్యోల్బణ రేటు ఆమోదయోగ్యమే. ద్రవ్య విధాన రూపకల్పన సమయంలో ధరల స్థిరీకరణ - వృద్ధి విషయంలో సమతుల్యాన్ని రిజర్వు బ్యాంకు సాధించాల్సి ఉంది. ద్రవ్య సంస్కరణలు: ద్రవ్య, శాసన సంస్కరణల సంఘం సిఫార్సులను తక్షణమే అమలు చేయాలి. ఇందుకు చట్టాల్లో మార్పుల అవసరం లేదు. మౌలిక సౌకర్యాలు: దేశంలో మౌలిక సౌకర్యాలను పునర్నిర్మించాలి. కొత్త సౌకర్యాలను భారీగా కల్పించాలి. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) పద్ధతిని మరింత విస్తృతంగా వినియోగించాలి. పెట్టుబడుల సమీకరణ, దీర్ఘకాలిక నిధుల కోసం కొత్త సంస్థలను నెలకొల్పాలి. తయారీ రంగం: ప్రభుత్వం ఈ రంగంపై దృషి ్టసారించాలి. ముఖ్యంగా ఎగుమతులకు ఉద్దేశించిన తయారీరంగంపై దృష్టికేంద్రీకరించాలి. ఎగుమతయ్యే ఉత్పత్తులపై రాష్ట్ర, కేంద్ర పన్నులను రద్దు చేయాలి లేదా తగ్గించాలి. వస్తువులను దిగుమతి కంటే ఇక్కడే తయారు చేసేలా ప్రోత్సహించేందుకు కనీస ధర రక్షణ కల్పించాలి. సబ్సిడీలు: వనరులు పరిమితంగానూ, వాటిని కోరేవారు అధికంగానూ ఉన్నందున ప్రభుత్వం నిజంగా సబ్సిడీలు అవసరమైన వారిని గుర్తించి, పూర్తిగా అర్హులైన వారికే ఇవ్వాలి. నగరీకరణ: ప్రభుత్వం తగినంత దృష్టి సారించని పక్షంలో దేశంలోని నగరాలు పాలించలేనివిగానూ, నివసించజాలనివిగానూ మారే అవకాశముంది. పౌరులకు మరింత మెరుగైన పాలన అందించే విధంగా కొత్త వనరులను సృష్టించి, వినియోగించాలి. నైపుణ్యాల వృద్ధి: మాధ్యమిక విద్య, యూనివర్సిటీ విద్య, సంపూర్ణ పారిశుధ్యం, సార్వత్రిక ఆరోగ్య సంరక్షణలతో పాటు నైపుణ్యాల అభివృద్ధికి కూడా ప్రభుత్వం సమాన ప్రాధాన్యతనివ్వాలి. బాధ్యతలు పంచుకోవాలి: ప్రధాన ప్రాజెక్టుల ఆర్థిక వ్యయంలో సహేతుకమైన భాగాన్ని భరించడానికి రాష్ట్రాలు సుముఖంగా ఉండాలి. తద్వారా రక్షణ, రైల్వేలు, జాతీయ రహదారులు, టెలికమ్యూనికేషన్ల వంటి రంగాలకు కేంద్రం మరిన్ని నిధులు కేటాయించగలుగుతుంది.