fodder scam case
-
దాణా కుంభకోణం: 89 మందిని దోషులుగా తేల్చిన సీబీఐ కోర్టు
పాట్నా: దాణా కుంభకోణం కేసులో మొత్తం 89 మంది దోషులుగా తేలగా వారిలో 52 మందికి గరిష్ఠంగా మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు సోమవారం తీర్పునిచ్చింది. ఈ కేసులో 35 మందిని సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ శ్రీవాస్తవ్ నిర్దోషులుగా ప్రకటించారు. బీహార్లో విభజన జరగక ముందు డోరండా ట్రెజరీ నుంచి 1990 మరియు 1995 మధ్య రూ.36.59 కోట్ల అవినీతికి సంబంధించిన ఈ కేసులో మిగిలిన 36 మందిపై విచారణ సెప్టెంబర్ 1న జరుగుతుందని నిందితుల తరపు న్యాయవాది సంజయ్ కుమార్ తెలిపారు. 1990ల్లో డోరండా, డియోఘర్, దుమ్కా, చైబాసా వంటి ట్రెజరీల నుండి కోట్లాది రూపాయలను కొల్లగొట్టిన ఈ స్కాం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో దోషిగా తేలిన ఆర్జేడీ అధ్యక్షుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ ప్రస్తుతం అనారోగ్య కారణాలతో బెయిల్పై బయట ఉన్నారు. ఇది కూడా చదవండి: కమ్యూనిస్టుల కంచుకోటనే కూల్చేశా.. మీరెంత? -
లాలూ హుషారే చిక్కుల్లో పడేయనుందా?
ఢిల్లీ: బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్(75) హుషారుగా ఉండడం.. ఆయన్ని చిక్కుల్లో పడేసేలా కనిపిస్తోంది. గడ్డి కుంభకోణం కేసుల్లో ఒకదాంట్లో అనారోగ్య కారణం చూపించి బెయిల్పై బయట ఉన్న ఆయన.. సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని, ఆయన బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ, సుప్రీం కోర్టును కోరింది. ఇందుకు ఆయన హుషారుగా బ్యాడ్మింటన్ ఆడుతున్న ఫొటోలను చూపించింది కూడా!. దాణా స్కాంలోని కేసులో లాలూకు జార్ఖండ్ హైకోర్టు ఇచ్చిన బెయిల్ను రద్దు చేయాలంటూ సీబీఐ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. శుక్రవారం ఈ పిటిషన్పై జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ ఎంఎం సుందరేశ్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం వాదనలు వింది. లాలూ తరపు సీనియర్ కపిల్ సిబాల్ వాదిస్తూ.. బెయిల్ రద్దు చేయాలనే సీబీఐ అభ్యర్థనను తిరస్కరించాలని బెంచ్ను కోరారు. ఈమధ్యే కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స జరిగిందన్న విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారాయన. అలాగే.. 42 నెలలపాటు లాలూ ప్రసాద్ యాదవ్ జైల్లో గడిపిన విషయాన్ని ప్రస్తావించారు. అయితే.. సీబీఐ తరపున వాదనలు వినిపించిన అదనపు సోలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు.. ‘‘లాలూకు బెయిల్ మంజూరు విషయంలో జార్ఖండ్ హైకోర్టు న్యాయపరిధికి తగ్గటుగా వ్యవహరించలేదని.. తప్పిదం చేసిందని వాదించారు. ఆయన ఆరోగ్యంగా ఉన్నారని, బ్యాడ్మింటన్ ఆడుతున్న ఫొటోలు ప్రముఖంగా వైరల్ అయిన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ‘‘దాణా స్కాం దొరండ ట్రెజరీ కేసులో లాలూకు ఐదేళ్ల శిక్షపడింది. ఈ కేసులో దోషిగా తేలిన తర్వాత ఆయనకు బెయిల్ మంజూరైంది. బెయిల్ తర్వాత ఆయన బ్యాడ్మింటన్ ఆడుతూ ఆరోగ్యంగా కనిపించారు. అలాగే.. ఆయనకు బెయిల్ మంజూరు చేయాలనే హైకోర్టు ఆదేశం తప్పని నిరూపించేందుకు సీబీఐ సిద్ధం. ఆయన మూడున్నరేళ్ల శిక్షను ఏకకాలంలో అనుభవించలేదు. అయితే హైకోర్టు ఆయన శిక్షను ఏకకాలంలోనే అనుభవించారని పొరపడి బెయిల్ మంజూరు చేసింది’’ అని అదనపు సాలిసిటర్ జనరల్ కోర్టుకు తెలిపారు. వాదనలు ముగియడంతో.. అక్టోబర్ 17వ తేదీకి విచారణ వాయిదా వేసింది సుప్రీం కోర్టు. 1992 నుంచి 1995 మధ్య కాలంలో బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్.. ఆర్థిక, పశుసంవర్థకశాఖ పోర్ట్ఫోలియోలను తన వద్దే ఉంచుకున్నారు. ఆ సమయంలోనే 950 కోట్ల రూపాయల దాణా కుంభకోణం జరిగిందని.. ఫేక్, ఫోర్జ్డ్ బిల్లులతో ఖజానా నుంచి సొమ్ము తీశారనే అభియోగాలు నమోదు అయ్యాయి. ఇందుకు సంబంధించి ఐదు కేసులు నమోదు అయ్యాయి. ఇందులో దొరండా ట్రెజరీ కేసుకు సంబంధించి 2022 ఫిబ్రవరిలో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం లాలూకు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు 60 లక్షల రూపాయల జరిమానా కూడా విధించింది. అయితే ఈ ఏడాది ఏప్రిల్ 22వ తేదీన అనారోగ్య కారణాలు చూపించడంతో జార్ఖండ్ హైకోర్టు లాలూకు బెయిల్ మంజూరు చేసింది. ఇదిలా ఉంటే.. బెయిల్పై బయట ఉన్న లాలూ.. కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స తర్వాత హుషారుగా బ్యాడ్మింటన్ ఆడుతూ కనిపించారు. లాలూ ఆడుతున్న వీడియోని ఆయన కొడుకు తేజస్వి యాదవ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘‘దేనికీ భయపడరు. దేనికీ తలవంచరు. పోరాడారు. పోరాడుతూనే ఉంటారు. జైల్లో పెట్టినా బెదరలేదు. అంతిమంగా విజయమే సాధించారు’’ అని క్యాప్షన్ కూడా ఉంచారు. -
లాలూ ప్రసాద్ యాదవ్కు బెయిల్ మంజూరు
పాట్నా: రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్కు శుక్రవారం జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దాణా కుంభకోణం కేసులో అరెస్టై శిక్ష అనుభవిస్తున్న లాలూకు ఎట్టకేలకు బెయిల్ లభించింది. కాగా, లాలూ సీఎంగా ఉన్న సమయంలో 1990ల్లో బీహార్లో దాణా కుంభకోణం కేసు చోటుచేసుకుంది. ఈ కేసులో లాలూకు సీబీఐ కోర్టు ఐదేళ్ల శిక్షతోపాటు రూ. 60 లక్షల జరిమానా విధించింది. డోరండ ట్రెజరీ నుంచి రూ. 139.5 కోట్లను చట్ట విరుద్ధంగా విత్ డ్రా చేశారనే ఆరోపణల నేపథ్యంలో సీబీఐ కోర్టు శిక్ష విధించింది. ఇదిలా ఉండగా..ఈ కేసులో ఐదేళ్ల పాటు శిక్ష పడిన లాలూ ఇప్పటికే 42 నెలలు జైలులో గడిపారు. ఇది చదవండి: బ్రిటన్ ప్రధానితో విదేశాంగ మంత్రి భేటీ -
దాణ స్కాం కేసులో లాలూను దోషిగా తేల్చిన సీబీఐ కోర్టు
బిహార్: జార్ఖండ్లోని రాంచీలోని ప్రత్యేక సీబీఐ కోర్టు ఆర్జేడీ అధినేత బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ను దాణా కుంభకోణానికి సంబంధించిన ఐదో కేసులో దోషిగా నిర్ధారించింది. ఈ కేసులో ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్తోసహా మొత్తం 110 మంది నిందితులు ఉన్న సంగతి తెలిసిందే. అయితే జనవరి 29న డిఫెన్స్ తరపున వాదనలు పూర్తి చేసిన తర్వాత... సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. 1996లో వెలుగులోకి వచ్చిన ఈ దాణా కుంభకోణం కేసులో లాలు ప్రసాద్ యాదవ్ని సీబీఐ ప్రత్యేక కోర్టు దోషిగా నిర్థారణ చేస్తూ తీర్పును వెలువరించింది. మంగళవారం సీబీఐ కోర్టు.. దాణ కుంభకోణంకి సంబంధించిన ఐదో కేసులో.. డోరాండా ట్రెజరీ నుండి రూ. 139.35 కోట్లు అక్రమంగా విత్డ్రా చేసిననట్లు నిర్ధారించింది. ఈ మేరకు సీబీఐ కోర్టు మొత్తం దాణా కుంభకోణానికి సంబంధించి ఐదు కేసుల్లో దోషిగా తేలిన లాలూ యాదవ్ మంగళవారం ఉదయం న్యాయమూర్తి సికె శశి తీర్పును చదివేటప్పుడు కోర్టు హాలులో ఉన్నారు. ఈ కేసులో మరో 98 మంది నిందితులు భౌతికంగా హాజరు కావాల్సి ఉండగా 24 మందిని నిర్దోషులుగా విడుదల చేసింది. మిగిలిన వారిలో మాజీ ఎంపీ జగదీష్ శర్మ, అప్పటి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) చైర్మన్ ధ్రువ్ భగత్ సహా 35 మందికి మూడేళ్ల జైలు శిక్ష పడింది. ఈ కేసులో లాలూ యాదవ్తోపాటు మరో 39 మంది దోషులకు ఫిబ్రవరి 21న శిక్ష ఖరారు కానుంది. అయితే లాలు కి సంబంధించిన అన్ని కేసులు పశువుల మేత కోసం ఉద్దేశించిన ప్రభుత్వ నిధులను స్వాహా చేసినవే కావడం గమనార్హం. ఇప్పటివరకు ఆయన మొత్తం 14 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించారు. -
లాలూకు బెయిల్ ఇచ్చారు కానీ..
-
లాలూకు బెయిల్.. అయినా జైలే
రాంచీ: దాణా కుంభకోణం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ చీఫ్ లాలూప్రసాద్ యాదవ్కు జార్ఖండ్ హైకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. చైబాసా ఖజానాకు సంబంధించిన కేసులో ఆయనకు ఊరట లభించింది. అయిదేళ్ల జైలు శిక్షలో సగం శిక్ష అనుభవించడంతో రూ.2 లక్ష ల పూచీకత్తుపై బెయిల్ ఇచ్చింది. అవిభాజ్య బిహార్ సీఎంగా లాలూ ఉన్నప్పుడు చైబాసా ట్రెజరీ నుంచి తప్పుడు మార్గాల్లో రూ.33.67 కోట్లు విత్డ్రా చేసినందుకుగాను ఆయనకు జైలుశిక్ష పడింది. ఇప్పుడు బెయిల్ వచ్చినా లాలూ విడుదలయ్యే అవకాశాల్లేవు. ఎందుకంటే దాణా కుంభకోణంలోనే దుమ్కా ఖజానాకి సంబంధించిన మరో కేసులోనూ ఆయన జైలుశిక్ష అనుభవిస్తున్నారు. ఆ కేసులో రూ.3.13 కోట్లకు సంబంధించి అవకతవకలు జరిగాయి. అనారోగ్య కారణాలతో రాంచీ లోని రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ప్రస్తుతం చికిత్స పొందుతున్న లాలూ ఆరోగ్య పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని హైకోర్టు సంబంధిత అధికారులను ఆదేశించింది. దాణా కుంభకోణం 1992లో వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో రూ.950 కోట్ల మేర నిధులు దుర్వినియోగమయ్యాయి. ఎన్నికల ప్రచారానికి తొలిసారిగా దూరం లాలూప్రసాద్ యాదవ్ తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఈసారి ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. దాణా కుంభకోణం కేసులో లాలూకు 2018లో శిక్ష పడింది. దీంతో ఆయన తన కుమారుడు తేజస్వీ యాదవ్కు ఆర్జేడీ వ్యవహారాలను అప్పగించారు. జైలు నుంచే పార్టీ కార్యకలాపాలు పర్యవేక్షిస్తున్నారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్న లాలూ మరికొన్ని కేసుల్లో శిక్ష అనుభవిస్తూ ఉండడంతో ఈసారి ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం లేదు. గతేడాది లోక్సభ ఎన్నికల్లోనూ ప్రచారం చేయలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో లాలూ ప్రచా రానికి దూరంగా ఉండడం ఇదే తొలిసారి. -
కోర్టు ముందు లొంగిపోయిన లాలూ
రాంచీ: దాణా కుంభకోణం కేసుల్లో దోషి, బిహార్ మాజీ సీఎం అయిన లాలూ ప్రసాద్ యాదవ్. గురువారం సీబీఐ కోర్టు ఎదుట లొంగిపోయారు. తన తాత్కాలిక బెయిల్ గడువు ముగియడంతో సీబీఐ ప్రత్యేక కోర్టు ముందు సరెండర్ అయ్యారు. తర్వాత లాలూను బిర్సా ముండా జైలుకు తరలించారు. సీబీఐ ప్రత్యేక కోర్టుల ముందు లొంగిపోవాలని జార్ఖండ్ హైకోర్టు ఇటీవల లాలూను ఆదేశించడం తెల్సిందే. చాయ్బసా ఖజానా నుంచి అక్రమంగా నగదు ఉపసంహరించిన కేసుకు సంబంధించి తొలుత జడ్జి ఎదుట లాలూ హాజరయ్యారు. తర్వాత డియోఘర్, డమ్కా ట్రెజరీ కేసులకు సంబంధించి మరో జడ్జి ఎదుట లొంగిపోయారు. దాణా కుంభకోణానికి సంబంధించిన 4 కేసుల్లో లాలూ దోషిగా తేలారు. -
లాలూ పెరోల్పై నేడు నిర్ణయం?
రాంచీ: దాణా కుంభకోణం కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ చేసుకున్న పెరోల్ విజ్ఞప్తిపై గురువారం నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వారంలో జరిగే తన పెద్ద కొడుకు, బిహార్ మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ వివాహానికి హాజరయ్యేందుకు ఈ నెల 10 నుంచి 14 వరకు అనుమతివ్వాలని లాలూ పెరోల్కు దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆయన విజ్ఞప్తి ఇంకా పరిశీలన దశలోనే ఉందని, గురువారం నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని జార్ఖండ్ ఐజీ(జైళ్లు) హర్ష మంగ్లా చెప్పారు. -
లాలూకు ఎయిమ్స్లో చికిత్సకు అనుమతి
సాక్షి, పాట్నా : పశుగ్రాస కుంభకోణం కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్కు ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స కోసం అనుమతి లబించింది. మెడికల్ బోర్డు సిఫార్సుల మేరకు ఆర్జేడీ నేతకు కోర్టు అనుమతి మంజూరు చేసింది. లాలూ ప్రస్తుతం రాంచీలోని రిమ్స్లో చికిత్స పొందుతున్నారు. ఆయన ఏ వ్యాధితో బాధపడుతున్నారన్న వివరాలను అధికారులు వెల్లడించలేదు. పశుగ్రాసం కేసులో లాలూకు న్యాయస్ధానం 14 ఏళ్ల జైలు శిక్ష, రూ 60 లక్షల జరిమానా విధించిన విషయం తెలిసిందే. రెండు కేసుల్లో వేర్వేరుగా ఏడేళ్ల జైలు శైక్ష, ఒక్కో కేసులో రూ 30 లక్షల జరిమానా విధిస్తూ సీబీఐ న్యాయమూర్తి శివ్ పాల్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. లాలూతో సహా 18 మందిని దోషులుగా నిర్ధారించారు. -
లాలూకు జైలు శిక్ష ఖరారు
-
లాలూకు 14 ఏళ్ల జైలు శిక్ష
రాంచీ : ఆర్జేడీ అధినేత, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్కు రాంచీ సీబీఐ న్యాయస్థానం శిక్షలు ఖరారు చేసింది. దాణా స్కామ్కు సంబంధించి నాలుగో కేసులో ఈ మధ్యే లాలూను దోషిగా కోర్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు శనివారం లాలూకు 14 ఏళ్ల జైలు శిక్షను కోర్టు ఖరారు చేసింది. ఐపీసీ సెక్షన్ల కింద 7 ఏళ్లు, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ల కింద 7 ఏళ్లు.. మొత్తం 14 ఏళ్ల జైలు శిక్షను ఒకదాని వెంటే మరొకటి విధిస్తున్నట్లు న్యాయమూర్తి శివ్పాల్ సింగ్ వెల్లడించారు. అయితే తీర్పు కాపీ అందితేనే ఈ విషయంలో ఓ స్పష్టత వస్తుందని లాలూ తరపు న్యాయమూర్తి అంటున్నారు. శిక్షలతోపాటు రూ. 60 లక్షల ఫైన్ విధిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాగా, డుంక ఖజానా నుంచి డిసెంబర్ 1991- 1996 మధ్య సుమారు రూ. 3 కోట్ల 50 లక్షల రూపాయలు అక్రమంగా విత్ డ్రా చేసిన సంఘటనకు సంబంధించిన కేసు ఇది. ఈ కేసులో మొత్తం 30 మంది నిందితులు విచారణ ఎదుర్కొగా.. చివరకు లాలూను దోషిగా తేల్చారు. ఐసీసీ సెక్షన్లు 120-బీ, 419, 420, 467, 468 సెక్షన్ల కింద ఆయనకు శిక్షకు ఖరారైంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయన అనారోగ్యంతో రిమ్స్లో చికిత్స పొందుతున్నారు. ‘మా నాన్నకు ప్రాణహని ఉంది’ కాగా, శిక్షలపై స్పందించిన లాలూ తనయుడు తేజస్వి యాదవ్.. తీర్పుపై హైకోర్టుకు వెళ్లనున్నట్లు తెలిపారు. ‘బీజేపీ-జేడీయూ రాజకీయ కుట్రంలో మా నాన్న బాధితుడు అయ్యాడు. ఆయన ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది’ అని తేజస్వి తెలిపారు. ఇక మరోవైపు ఆర్జేడీ పార్టీ అత్యవసర భేటీకి పిలుపునిచ్చింది. -
నాలుగో కేసులోనూ లాలూ దోషే
-
నాలుగో కేసులోనూ లాలూ దోషే
రాంచీ: బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్కు మరో ఎదురుదెబ్బ. దాణా కుంభకోణానికి సంబంధించిన నాలుగో కేసులోనూ ఆయన దోషిగా తేలారు. డుమ్కా ఖజానా నుంచి రూ.3.13 కోట్లను అక్రమంగా ఉపసంహరించుకున్న కేసులో లాలూ పాత్ర ఉందని నిర్ధారిస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి శివ్పాల్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. లాలూతోపాటు మరో 18 మందిని దోషులుగా తేల్చారు. ఇక మాజీ సీఎం జగన్నాథ్ మిశ్రాతోపాటు 12 మందిని నిర్దోషులుగా ప్రకటించారు. దోషులకు శిక్షలు ఖరారు చేసేందుకు ఈ నెల 21 నుంచి జడ్జి వాదనలు వింటారని సీబీఐ తరఫు న్యాయవాది తెలిపారు. -
లాలూకు మరో దెబ్బ
రాంచీ : బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్కు మరో షాక్ తగిలింది. దాణా స్కామ్కు సంబంధించిన నాలుగో కేసులో కూడా లాలూను దోషిగా న్యాయస్థానం తేల్చింది. సోమవారం రాంచీ(జార్ఖండ్) సీబీఐ కోర్టు తీర్పు వెలువరించింది. ఇక ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న సీనియర్ నేత జగన్నాథ మిశ్రాను మాత్రం కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. కాగా, అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన లాలూ అటు నుంచే అటే ఉదయం కోర్టుకు వెళ్లారు. శిక్షలు ఇంకా ఖరారు కావాల్సి ఉంది. డుంక ఖజానా నుంచి డిసెంబర్ 1994-జనవరి 1996 మధ్య రూ. 3 కోట్ల 13 లక్షల రూపాయలు అక్రమంగా విత్ డ్రా చేసిన సంఘటనకు సంబంధించినదీకేసు. ఈ కేసులో మొత్తం 30 మంది నిందితులు విచారణ ఎదుర్కొన్నారు. దాణా స్కామ్ మొదటి కేసుకు సంబంధించి 2013లో లాలూకు ఐదేళ్ల శిక్ష ఖరారు. రెండో కేసు.. డిసెంబర్ 23, 2017 మూడున్నరేళ్ల శిక్ష ఖరారు. మూడో కేసు జనవరి 2018లో ఐదేళ్ల శిక్ష ఖరారు. ఇవిగాక మరో రెండు కేసులు(పట్నా, రాంచీలలో) ఆయనపై ఉన్నాయి. -
మూడో కేసులోనూ లాలూ దోషే
-
దాణా కుంభకోణం కేసులో లాలూకు మరో షాక్
-
లాలూ కోసం బెదిరింపులు.. యోగి సీరియస్
లక్నో : దాణా స్కామ్ కేసులో తీర్పునిచ్చిన న్యాయమూర్తికి బెదిరింపు ఫోన్కాల్స్ వచ్చాయన్న వార్తల నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యానాథ్ రంగంలోకి దిగారు. యూపీకి చెందిన ఇద్దరూ జడ్జిలే వీటి వెనుక ఉన్నట్లు ఆరోపణలు రావటంతో యోగి విచారణ కమిటీని నియమించారు. జలౌన్ జిల్లా(యూపీ) న్యాయమూర్తి, సబ్ డివిజినల్ న్యాయమూర్తి ఇద్దరూ తీర్పు వెలువడక ముందు రాంచీ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి శివపాల్ సింగ్ ను ఫోన్లో సంప్రదించారంట. లాలూ శిక్ష విషయంలో తాము చెప్పినట్లు చేయాలని.. లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆ ఇద్దరు.. శివపాల్ను బెదిరించారంట. ఇదే విషయాన్ని శివపాల్ మీడియా దృష్టికి తీసుకెళ్లటంతో వార్త ప్రముఖంగా ప్రచురితం అయ్యింది. దీంతో యూపీ సీఎం విచారణకు ఆదేశించారు. విచారణ కమిటీ వార్తను ఆదిత్యానాథ్ మీడియా సలహాదారు మృత్యుంజయ్ కుమార్ ధృవీకరించారు. వీలైనంత త్వరలో ఈ ఘటనపై నివేదికను అందజేస్తానని ఝాన్సీ కమిషనర్ అమిత్ గుప్తా వెల్లడించారు. మాకేం తెలీదు... ఆరోపణలపై ఇద్దరు న్యాయమూర్తులు స్పందించారు. శివపాల్ సింగ్ చెబుతున్నట్లు తాము బెదిరింపులకు పాల్పడలేదని వారంటున్నారు. జలౌన్లోని ఓ భూవివాదానికి సంబంధించి శివపాల్తో తాము చర్చించినట్లు సబ్ డివిజినల్ న్యాయమూర్తి చెబుతుండగా.. జిల్లా న్యాయమూర్తి మన్నన్ అక్తర్ మాత్రం అసలు ఆయనతో ఎప్పుడూ మాట్లాడలేదని తెలిపారు. I never talked to him (Shivpal Singh) over phone. He must issue a statement, if it happened. On the date mentioned in reports, I was in my home town, on a leave.: Mannan Akhtar, Jalaun DM on reports of him calling Special Court Judge Shivpal Singh for Lalu Yadav on #FodderScam pic.twitter.com/X920OtaQJO — ANI UP (@ANINewsUP) January 11, 2018 -
లాలూ కోసం ఇంత పెద్ద త్యాగమా?
సాక్షి, పట్నా : జైలు అనే మాట వినిపిస్తేనే అమ్మో.. అని భయం వేస్తుంది. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే ఎలాగైనా బయటపడేందుకు ఏదో ఒక విధంగా ప్రయత్నిస్తాం. కానీ, స్వయంగా కేసులు పెట్టించుకొని జైలుకు వెళ్లే సాహసం ఎవరైనా చేస్తారా?.. సినిమాల్లో అయితే సాధ్యమేగానీ, నిజజీవితంలో మాత్రం చాలా అరుదు. అలాంటి ప్రయత్నమే ఓ ఇద్దరు వ్యక్తులు చేశారు. విశ్వాసం చూపించడంలో తమకు తామే సాటి అనిపించుకున్నారు. వారు ఆర్జేడీ అధినేత, దాణా కుంభకోణం కేసులో మూడున్నరేళ్ల జైలు శిక్షకు గురైన లాలూ ప్రసాద్ యాదవ్కు అత్యంత విశ్వాసపాత్రులు. ఒకరు లాలూ వంటమనిషికాగా, మరొకరు పాలప్యాకెట్లు తీసుకురావడంవంటి సహాయక చర్యలు చేసే రాంచీకి చెందిన వ్యక్తి. వివరాల్లోకి వెళితే.. లక్ష్మణ్ మహతో, మదన్ యాదవ్ అనే ఇద్దరు వ్యక్తులు తమపై తామే తమ బంధువుతో కేసులు పెట్టించుకొని, లాలూ ప్రసాద్ యాదవ్కంటే ముందే జైలుకు వెళ్లి అక్కడ ఆయనకోసం ఎదురు చూస్తున్నారు. లక్ష్మణ్ మహతో అనే వ్యక్తి లాలూ ప్రసాద్కు పలు విధాలుగా సాయం చేసేవాడు. ముఖ్యంగా వంట చేయడంతోపాటు లాలూ రాజకీయ క్షేత్రంలో కీలకంగా పనిచేసేవాడు. ఇక మదన్ యాదవ్ అనే వ్యక్తి లాలూ ఎప్పుడు రాంచీ వచ్చినా చాలా హడావుడి చేసేవారు. చురుకుగా లాలూ చేసే పనుల్లో పాల్గొంటూనే లాలూ ఇంటి పనులు చూసుకునేవాడు. లాలూ త్వరలోనే జైలులో అడుగుపెట్టనున్నారనే విషయం గమనించి.. రాంచీలో సుమిత్ యాదవ్ అనే ఓ వ్యక్తితో తాము అతడిపై దాడి చేసినట్లు ఓ పది వేల రూపాయల దొంగతనం చేసినట్లు కేసు పెట్టించుకున్నారు. అయితే, రాంచీలోని ఓ పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదు చేసేందుకు నిరాకరించగా మరో స్టేషన్కు వెళ్లి ఎఫ్ఐఆర్ నమోదు చేయించుకున్నారు. దీంతో వారికి కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. గత డిసెంబర్ (2017) 23నే బిర్సా ముండా జైలుకు వెళ్లారు. ఈ విషయం తెలిసిన వారంతా వీళ్లు మాములోళ్లు కాదని, మహాముదుర్లని, అందుకే అలా చేశారని అంటున్నారు. కాగా, ప్రస్తుతం దాణా కుంభకోణం కేసులో శిక్షపడిన లాలూ ప్రసాద్ వారు ఉంటున్న జైలుకే వెళ్లనున్నారు. -
బెయిల్ కోసం జార్ఖండ్ హైకోర్టుకు లాలూ
సాక్షి, రాంచీ : పశుగ్రాస కుంభకోణం కేసులో జైలు శిక్ష ఎదుర్కొంటున్న ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ బెయిల్ కోసం జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయిస్తారని ఆయన న్యాయవాది తెలిపారు. తీర్పు ప్రతిని చదివిన అనంతరం వచ్చే సోమవారం లోగా తాము హైకోర్టుకు వెళతామని లాలూ న్యాయవాది ప్రభాత్ కుమార్ చెప్పారు. ఇటీవల లాలూ సోదరి మరణించిన నేపథ్యంలో పెరోల్ కోరుతూ న్యాయస్ధానాన్ని ఆశ్రయిస్తారా అని ప్రశ్నించగా అలాంటిదేమీ లేదని బదులిచ్చారు. పశుగ్రాస కుంభకోణం కేసుకు సంబంధించి డిసెంబర్ 23న బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ను సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానం దోషిగా నిర్ధారించింది. -
పెరోల్ కోరనున్న లాలూ
పాట్నా : పశుగ్రాస కుంభకోణంలో మూడున్నరేళ్ల జైలు శిక్ష ఎదుర్కొంటున్న ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ పెరోల్ కోరనున్నారు. ఆదివారం మరణించిన తన సోదరి గంగోత్రి దేవి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ఆయన పెరోల్పై విడుదలయ్యే అవకాశం ఉంది. రాంచీలోని జైలు అధికారుల ద్వారా గంగోత్రి దేవి మరణించారన్న సమాచారం లాలూకు చేరవేశామని ఆయన కుమారుడు తేజస్వి యాదవ్ తెలిపారు. మరోవైపు ఈ రోజు ఆదివారం కావడంతో అవసరమైన లాంఛనాలు పూర్తిచేసి సకాలంలో ఆయన పెరోల్ పొందడం కష్టమని తేజస్వి ఆందోళన వ్యక్తం చేశారు. తమ మేనత్త భౌతిక కాయాన్ని ఆమె స్వగ్రామానికి తరలించి అక్కడ అంత్యక్రియల ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. లాలూ కన్నా నాలుగేళ్లు పెద్దయిన గంగోత్రి తమ్ముడి విడుదల కోసం శనివారం రోజంతా ప్రార్థనలు చేశారని లాలూ భార్య, బీహార్ మాజీ సీఎం రబ్రీదేవీ తెలిపారు. పశుగ్రాస స్కాం కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానం లాలూకు మూడున్నరేళ్ల జైలు శిక్ష, రూ పదిలక్షల జరిమానా విధించిన విషయం తెలిసిందే. -
థ్యాంక్ యూ నితీశ్.. లాలూ కొడుకు ట్వీట్
పట్నా : దాణా కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్ యాదవ్ శిక్ష కాలం ఖరారయ్యాక కోర్టు తీర్పును స్వాగతిస్తూ బీజేపీ, జేడీయూలు హర్షం వ్యక్తం చేయటం ఆర్జేడీ పార్టీ శ్రేణులకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రత్యర్థులపై ఆర్జేడీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలకు దిగుతున్నారు. శత్రువులతో చేతులు కలపటమే కాకుండా.. మిత్రుడి(లాలూ)ని దారుణమైన వెన్నుపోటు పొడిచారంటూ బిహార్ సీఎం నితీష్ కుమార్ పై ఆర్జేడీ నేతలు విరుచుకుపడుతున్నారు. లాలూను ఇబ్బందులకు గురి చేసేందుకు బీజేపీ ఓ ప్రణాళికతోనే మహా కూటమిని విచ్ఛిన్నం చేసిందని.. ఈ క్రమంలో జేడీయూ కూడా వారికి తలొగ్గిందని ఆరోపణలు చేస్తున్నారు. ఇక లాలూ తనయుడు తేజస్వి యాదవ్ తన ట్విట్టర్లో ఓ వ్యంగ్య పోస్టును ఉంచారు. థాంక్యూ వెరీ మచ్ నితీష్ కుమార్ అంటూ నిన్న సాయంత్రం ఆయన తన ట్విట్టర్ పేజీలో పేర్కొన్నారు. Thank you very much Nitish Kumar — Tejashwi Yadav (@yadavtejashwi) 6 January 2018 అంతకు ముందు మీడియాతో మాట్లాడిన ఆయన బీజేపీపై విమర్శలు ఎక్కుపెట్టిన విషయం తెలిసిందే. ఒకవేళ లాలూ బీజేపీతో సంధి చేసుకుని ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని చెప్పారు. ‘‘లాలూ బీజేపీ ముందు మోకరిల్లి ఉంటే.. ఆ పార్టీ ఆయన్ని రాజా సత్యహరిశ్చంద్రుడిగా అభివర్ణించి ఉండేదేమో. ఈ విషయంలో జేడీయూ చాలా ముందుంది’’ అని తేజస్వి ఎద్దేవా చేశారు. జేడీయూ నమ్మకద్రోహాన్ని మరిచిపోలేమన్న తేజస్వి .. తీర్పుపై హైకోర్టుకు వెళ్లనున్నట్లు పేర్కొన్నారు. ఓవైపు బీజేపీ, మరోవైపు జేడీయూలు తేజస్వి వ్యాఖ్యలను తిప్పి కొడుతున్నాయి. అవినీతి కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపినప్పుడే లాలూ జైలుకు వెళ్లటం ఖాయమైపోయిందని, తేజస్వి పిల్ల రాజకీయాలు మానుకోవాలని బీజేపీ సీనియర్ నేత ఆర్పీఎన్ సింగ్ సూచించగా.. లాలూ అవినీతి రాజకీయాలకు శుభం కార్డు పడిందని జేడీయూ నేత కేసీ త్యాగి తెలిపారు. దియోగర్ ట్రెజరీ నుంచి రూ.89.27లక్షలు అక్రమంగా డ్రా చేసిన కేసుకు సంబంధించి లాలూ సహా మిగతా దోషులకు రాంచీ సీబీఐ న్యాయస్థానం మూడున్నరేళ్ల జైలుశిక్ష ఖరారు చేసిన విషయం విదితమే. -
లాలూప్రసాద్ యాదవ్ రాయని డైరీ
మాధవ్ శింగరాజు రాంచీలో చలి ఎక్కువగా ఉన్నట్లుంది. బిర్సా ముండా జైలు కూడా రాంచీలో భాగమే కనుక ఇక్కడున్నవన్నీ చలికి బిగదీసుకుపోతున్నాయి. ఈ బిగదీసుకుపోతున్న వాటిలో పద్నాలుగు రోజులుగా నేనూ ఒకడిని. ప్రార్థన, ఉదయపు నడక.. వీటితో నన్ను నేను వెచ్చబరుచుకుంటున్నాను. ఇంకా మూడేళ్ల చలికాలాలు నేనిక్కడ గడపాలి! బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇంటి నుంచి తెప్పించుకునే అవకాశం కల్పించారు. ఒక వంట మనిషిని పెట్టారు. కొన్ని పేపర్లు వస్తున్నాయి. టీవీ చూడనిస్తున్నారు. ఇవన్నీ నాకు అక్కరలేనివి. అందుకే సమకూర్చినట్లున్నారు! నాకు మనుషులు కావాలి. నేను మనుషులతో మాట్లాడాలి. అందుకు మాత్రం అనుమతించడం లేదు. అడిగినవి కాదనడం కన్నా, అక్కర్లేనివి అందివ్వడం పెద్ద శిక్ష మనిషికి! మునుపు ఇలా లేదు. గెస్ట్హౌస్నే నా కోసం జైలుగా మార్చారు. నన్ను కలవడానికి సీఎం కూడా వచ్చాడు. నేరుగా జైలుకే వచ్చాడు! హేమంత్ సొరేన్. కుర్రాడు. ‘‘లాలూజీ మీకు ఇక్కడ సౌకర్యంగానే ఉంది కదా’’ అని పక్కన కూర్చొని అడిగాడు. ‘‘లేకుంటే చెప్పండి ఏర్పాటు చేయిద్దాం’’ అన్నాడు. ‘‘నాకు మనుషులు కావాలి’’ అన్నాను. అర్థం చేసుకున్నాడు. మా పార్టీవాళ్లను పంపిస్తానన్నాడు. అవసరం అయితే తన పార్టీవాళ్లను కూడా పంపిస్తానన్నాడు. ‘‘మనవాళ్లు ఒడిశా, బెంగాల్లలో కూడా ఉన్నారు లాలూజీ, వాళ్లను కూడా రప్పిస్తాను’’ అన్నాడు. హేమంత్ సొరేన్ది జార్ఖండ్ ముక్తి మోర్చా. పేరుకు జార్ఖండ్ సీఎమ్మే కానీ, బిహార్ పిల్లాడిలా ఉండేవాడు. ‘‘మావాళ్లు చాలు హేమంత్’’ అన్నాను. ఇప్పుడు వారానికి ముగ్గురిని మాత్రమే బయటి నుంచి నన్ను కలవడానికి అనుమతిస్తున్నారు. వచ్చినవాళ్లు ‘‘ఎలా ఉన్నారు లాలూజీ’’ అని అడుగుతున్నారు. వచ్చినవాళ్లను ‘‘పార్టీ ఎలా ఉంది?’’ అని నేను అడుగుతున్నాను. అక్కడితో టైమ్ అయిపోతోంది. ఈ ఉదయం ఇంటి నుంచి అటుకులు, బెల్లం వచ్చాయి. కొన్ని పండ్లు, నువ్వులుండలు కూడా. నోటికి రుచిగా ఉన్నాయి. నా పక్క వాళ్లకు ఇచ్చాను. ‘‘బాగున్నాయి లాలూజీ’’ అన్నారు. వాళ్లెవరో నాకు తెలీదు. లోపలికి వచ్చాకే పరిచయం. ‘‘ఆ నితీశ్ కుమారే మిమ్మల్ని జైల్లో పెట్టించాడు లాలూజీ’’ అన్నాడు ఒక పరిచయస్తుడు. నవ్వాను. అతడు నా అభిమానిలా ఉన్నాడు. జైలుకు వచ్చినప్పటి నుంచీ అతను ఒకే మాట అంటున్నాడు. ‘‘మిమ్మల్ని కూడా మాతో కలిపేశారేంటి లాలూజీ’’ అని. జీవితంలో మనిషి దేనికో ఒకదానికి బందీ కావాలి. నేను పార్టీకి బందీని అయ్యాను. ఇష్టమైన దానికి బందీ అవడం కంటే స్వేచ్ఛ ఏముంది? జైల్లో ఉన్నా నేను స్వేచ్ఛాజీవినే. -
ప్లీజ్.. తక్కువ శిక్ష విధించండి: లాలూ
రాంచీ: అనారోగ్యం, వయోభారం దృష్టిలో ఉంచుకుని మానవీయ కోణంలో తనకు తక్కువ శిక్ష విధించాలని బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ సీబీఐ కోర్టు న్యాయమూర్తిని కోరారు. దాణా కుంభకోణం కేసులో డిసెంబర్ 23 నుంచి బిర్సా ముండా జైలులో ఉంటున్న లాలూను సీబీఐ జడ్జి శివపాల్ సింగ్ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించారు. తుది తీర్పు శనివారం చెప్తామని జడ్జి తమకు తెలియజేసినట్లు లాలూ తరఫు న్యాయవాది చిత్తరంజన్ చెప్పారు. అయితే, తనకు తక్కువ శిక్ష విధించాలంటూ జడ్జికి లాలూ లిఖితపూర్వకంగా విజ్ఞప్తి పంపారని లాయర్ తెలిపారు. దియోగర్ ట్రెజరీ నుంచి రూ.89.27లక్షలు అక్రమంగా డ్రా చేసిన కేసుకు సంబంధించి లాలూతోపాటు మరో 10 మందిపై కోర్టు విచారణ ఇప్పటికే పూర్తి చేసింది. -
లాలూ యాదవ్ పై జస్టిస్ సింగ్ ఆగ్రహం
సాక్షి, రాంచీ : పశుగ్రాస కుంభకోణం కేసును విచారిస్తున్న సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జస్టిస్ శివ్పాల్ సింగ్ సంచలన విషయం బయటపెట్టారు. ఈ కేసు నిందితుడు, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ సన్నిహితులు, శ్రేయోభిలాషులు తనకు ఫోన్లు చేసి ఆయనకు సానుకూలంగా తీర్పు వెలువరించాలని కోరుతున్నట్టు జస్టిస్ సింగ్ వెల్లడించారు. ఈ కేసులో ఇప్పటికే కోర్టు లాలూను దోషిగా నిర్ధారించిన విషయం తెలిసిందే. లాలూను ఉద్దేశించి జస్టిస్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘మీ శ్రేయోభిలాషులు ఫోన్లు చేసి సానుకూలంగా తీర్పు చెప్పాలంటున్నారు..అయితే నేను చట్టప్రకారమే వెళతా’ అన్నారు. దీనికి లాలూ బదులిస్తూ మీరు ఎలాంటి ఒత్తిడికి లోనవకుండా కుదురుగా తీర్పు చెప్పండి అని బదులిచ్చారు. ఈ సమయంలో కోర్టు హాలులో కేవలం ఈ కేసుకు సంబంధించిన న్యాయవాదులే ఉండాలని, ఇతరులు బయటకు వెళ్లాలని జడ్జి కోరారు. కాగా, పశుగ్రాసం కేసుకు సంబంధించి లాలూ సహా ఐదుగురు నిందితుల తరపున వాదనలను న్యాయమూర్తి ఆలకించారు. వీరికి శిక్షల ఖరారు ప్రక్రియ గురువారం జరగాల్సి ఉన్నా శుక్రవారం దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. -
జైల్లో లాలూకు చపాతీ, పప్పు!
రాంచీ: దాణా కుంభకోణం కేసులో దోషిగా తేలి జైల్లో ఉంటున్న బిహార్ మాజీ సీఎం లాలూప్రసాద్ యాదవ్(ఖైదీ నంబర్ 3351)కు అధికారులు ప్రత్యేక సదుపాయాలు కల్పించారు. ఆయనకు టీవీతో పాటు ఓ వార్తాపత్రికను అందజేసినట్లు ఇక్కడి బిర్సాముండా జైలు సూపరింటెండెంట్ అశోక్ కుమార్ చౌదరి ఆదివారం తెలిపారు. శనివారం రాత్రి లాలూకు ఆహారంగా చపాతీ, పప్పు, క్యాబేజీని అందించినట్లు వెల్లడించారు. జైలు నిబంధనల మేరకు పనిదినాల్లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ లాలూను కలుసుకునేందుకు సందర్శకుల్ని అనుమతిస్తామన్నారు. -
దాణా కేసులో లాలూ దోషి
-
దాణా కేసులో లాలూ దోషే
రాంచీ: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. 21 ఏళ్లనాటి దాణా కుంభకోణం కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు ఆయనను దోషిగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది. ఈ కుంభకోణానికి సంబంధించి ఇప్పటికే ఒక కేసులో ఆయన జైలు శిక్ష ఎదుర్కొంటూ ఉండగా.. శనివారం మరో కేసులో రాంచీ సీబీఐ కోర్టు దోషిగా తేల్చింది. కిక్కిరిసిన కోర్టు గదిలో ప్రత్యేక న్యాయమూర్తి శివ్పాల్ సింగ్ తీర్పును వెలువరిస్తూ.. బిహార్ మాజీ సీఎం లాలూ యాదవ్(69) సహా 16 మందిని దోషులుగా ప్రకటించారు. అదే సమయంలో మరో మాజీ సీఎం జగన్నాథ్ మిశ్రా(80)తో పాటు ఆరుగురిని నిర్దోషులుగా పేర్కొన్నారు. జనవరి 3న దోషులకు కోర్టు శిక్ష ఖరారు చేయనుంది. 1991–94 మధ్య కాలంలో దేవ్గఢ్ ఖజానా నుంచి రూ. 89.27 లక్షల్ని అక్రమంగా విత్డ్రా చేసిన దాణా కేసులో ఈ తీర్పు వెలువడింది. తీర్పు అనంతరం లాలూ ప్రసాద్ యాదవ్తో పాటు ఇతర నిందితుల్ని సీబీఐ కస్టడీలోకి తీసుకుని రాంచీలోని బిర్సా ముండా జైలుకు తరలించింది. తీర్పుపై లాలూ స్పందిస్తూ తనను మండేలా, అంబేడ్కర్లతో పోల్చుకునే ప్రయత్నం చేశారు. చివరకు సత్యమే గెలుస్తుందని ట్వీట్ చేశారు. ఉదయం నుంచి ఉత్కంఠ.. తీర్పు నేపథ్యంలో ఉదయం నుంచి సీబీఐ కోర్టు పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత కొనసాగింది. శనివారం తీర్పు వెలువరిస్తామని డిసెంబర్ 13నే కోర్టు చెప్పడంతో.. పెద్ద ఎత్తున లాలూ మద్దతుదారులు గుమిగూడడంతో భారీగా భద్రతా బలగాల్ని మోహరించారు. లాలూతో పాటు బిహార్ అసెంబ్లీ ప్రతిపక్ష నేత, లాలూ కుమారుడు తేజస్వీ యాదవ్ కోర్టుకు హాజరయ్యారు. న్యాయమూర్తి తీర్పును ప్రకటిస్తూ.. లాలూతో పాటు రాజకీయ నాయకులైన జగదీశ్ శర్మ, ఆర్కే రానా, ఐఏఎస్ అధికారులు బెక్ జూలియస్, పూల్చంద్ సింగ్, మహేశ్ ప్రసాద్, ప్రభుత్వాధికారులు కృష్ణ కుమార్, సుబిర్ భట్టాచార్యల్ని దోషులుగా ప్రకటించారు. దాణా సరఫరా, రవాణాదారులు మోహన్ ప్రసాద్, సుశీల్ కుమార్ సిన్హ్, సునీల్ కుమార్ సిన్హ్, రాజా రాం జోషి, గోపీనాథ్ దాస్, సంజయ్ అగర్వాల్, జ్యోతీ కుమార్ ఝా, సునీల్ గాంధీల్ని కూడా దోషులుగా తేల్చారు. జగన్నాథ్ మిశ్రా , ప్రజా పద్దుల కమిటీ మాజీ చైర్మన్ ద్రువ్ భగత్, మాజీ ఐఆర్ఎస్ అధికారి ఏసీ చౌదరీ, దాణా సరఫరాదారులు సరస్వతీ చంద్ర, సాధనా సింగ్, మాజీ మంత్రి విద్యాసాగర్ నిషాద్లను కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ప్రత్యేక సీబీఐ కోర్టు తీర్పును హైకోర్టులో సవాలు చేస్తామని ఆర్జేడీ సీనియర్ నేత రఘువంశ్ ప్రసాద్ సింగ్ చెప్పారు. న్యాయ పోరాటంతో పాటు.. రాజకీయంగానూ పోరాటం కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు. ‘ఒకే కేసులో కొందరిని విముక్తుల్ని చేయడం, మరికొందరికి జైలు శిక్ష విధించడం ఏమిటని ప్రజలు చర్చించుకుంటున్నారు’ అని మరో సీనియర్ నేత అబ్దుల్ సిద్దిఖీ వ్యాఖ్యానించారు. శిక్షాకాలం ప్రకటించాక పార్టీ భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పారు. ఓట్ల కోసం ప్రతిపక్షాలపై బీజేపీ దుష్ప్రచారం: లాలూ తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు, ఓట్ల కోసం.. ప్రతిపక్షాలపై ప్రజల అభిప్రాయాల్ని దెబ్బతీసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ట్వీటర్లో లాలూ ఆరోపించారు. తీర్పు వెలువడిన తర్వాత ఆయన వరుస ట్వీట్లు చేశారు. ‘బలవంతులైన వ్యక్తులు, వర్గాలు ఎప్పడూ సమాజాన్ని పాలిత, పీడిత వర్గాలుగా విభజిస్తూనే ఉన్నారు. అన్యాయాన్ని ప్రశ్నిస్తే కింది స్థాయి వ్యక్తులు శిక్షకు గురవుతున్నారు. నెల్సన్ మండేలా, మార్టిన్ లూథర్ కింగ్, బాబా సాహెబ్ అంబేడ్కర్ వంటి నేతలు.. వారి ప్రయత్నాల్లో విఫలమైతే చరిత్ర వారిని ప్రతినాయకులుగా పరిగణించి ఉండేది. పక్షపాతం, జాతివివక్ష, కులతత్వంతో నిండిన వ్యక్తులకు నేటికీ వారు ప్రతినాయకులే. వేరే విధంగా ఎవరూ ఆశించలేరు. పక్షపాతంతో కూడిన అసత్య ప్రచారంతో.. సత్యాన్ని అబద్ధంగా, అర్ధ సత్యంగా అనిపించేలా చేయవచ్చు. అయితే అంతిమంగా సత్యం గెలుస్తుంది. సత్యం చెప్పులు తొడుక్కునేలోపే అబద్ధం ప్రపంచాన్ని సగం చుట్టి రాగలదు.. చివరికి సత్యమే నిలుస్తుంది’ అని ట్వీట్లలో పేర్కొన్నారు. 1997లో 38 మందిపై చార్జిషీటు దాణా కుంభకోణం కేసులు వెలుగులోకి వచ్చాక 1996లో పట్నా హైకోర్టు విచారణకు ఆదేశించింది. 1997, అక్టోబర్ 27న దేవ్గఢ్ ఖజానా కేసులో 38 మందిపై చార్జిషీటు దాఖలైంది. ఈ కేసులో ఐపీసీ, అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద నిందితులపై కేసులు నమోదయ్యాయి. కేసు విచారణలో ఉండగా 11 మంది మరణించగా.. ఇద్దరు తప్పు ఒప్పుకోవడంతో 2006–07లో కోర్టు వారికి జైలు శిక్ష విధించింది. పశువుల పేరిట నిధులు స్వాహా దాణా కుంభకోణం...1980, 90 దశకాల్లో ఉమ్మడి బిహార్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. మొత్తం రూ.950 కోట్ల మేర అవినీతి జరిగినట్లు అంచనా. రెండు దశాబ్దాలకు పైగా రాజకీయ నాయకులు, ప్రభుత్వాధికారులు, దాణా సరఫరాదారులు కుమ్మక్కై.. ఉనికిలో లేని కంపెనీల నుంచి దాణా కొనుగోలు పేరిట వందల కోట్లు స్వాహా చేశారనేది ప్రధాన అభియోగం. దాణా కుంభకోణం, దానితో ముడిపడ్డ ఇతర ఆరోపణలపై మొత్తం 64 కేసులు నమోదు కాగా, ఐదు కేసుల్లో లాలూప్రసాద్ నిందితుడిగా ఉన్నారు. దేవ్గఢ్ ఖజానా నుంచి నిధుల స్వాహా కేసులో తాజా తీర్పు వెలువడింది. కుంభకోణంలోని మిగతా కేసులు ఉమ్మడి బిహార్ రాష్ట్రంలోని చాయిబాసా జిల్లా ఖజానా నుంచి రూ.37.70 కోట్ల మొత్తాన్ని కాజేశారని ఒక కేసులో సీబీఐ ఆరోపించింది. ఈ కేసులో సెప్టెంబర్ 30, 2013న కోర్టు లాలూకు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.25 లక్షల జరిమానా విధించింది. ఈ శిక్షతో లాలూ లోక్సభ సభ్యత్వం రద్దవడంతో పాటు.. ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో జార్ఖండ్ హైకోర్టు బెయిల్ నిరాకరించడంతో.. లాలూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రెండు నెలలు జైలులో ఉన్న లాలూకు 2013, డిసెంబర్ 13న సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దాణా కుంభకోణంలో దుమ్కా ఖజానా నుంచి రూ. 3.97 కోట్లు, చాయ్బసా ఖజానా నుంచి రూ. 36 కోట్లు, దోరండ ఖజానా నుంచి రూ. 184 కోట్లు అక్రమంగా విత్ డ్రా చేసిన కేసుల్ని కూడా లాలూ యాదవ్ ఎదుర్కొంటున్నారు. కుంభకోణం ఎలా బయటకొచ్చింది పెద్ద సంఖ్యలో పశువులున్నట్లుగా తప్పుడు రికార్డులు చూపి వాటి కోసం దాణా, మందులు, ఇతర పరికరాలను కొనుగోలు చేసినట్లు చూపారు. ఈ కుంభకోణం 1996లో వెలుగు చూసినా, 1980 దశకం, ఆ తర్వాత కూడా అక్రమాలు కొనసాగినట్లు గుర్తించారు. 1996లో ఆర్థికశాఖ కార్యదర్శి వీఎస్ దూబే ఆదేశాలతో జిల్లా కేంద్రాల్లో తనిఖీల్లో అవకతవకలు వెలుగులోకివచ్చాయి. 1993–96 మధ్య 40,500 కోళ్లు, 5,664 పందులు, 1,577 మేకలు, 995 గొర్రెల కొనుగోలుకు పశుసంవర్ధకశాఖకు రూ.10.5 కోట్లు కేటాయించారు. ఆ శాఖ మాత్రం ఖజానా నుంచి రూ.255.33 కోట్లు తీసుకుంది. వీటికి ఇతర ఖర్చులు కలిపి రూ.409.62 కోట్లు విత్డ్రా చేసినట్లు గుర్తించారు. ఈ లెక్కల్ని బిహార్ ఆడిటర్ జనరల్ పరిశీలించి అవినీతి ఉన్నట్లు తేల్చారు. ఈ కుంభకోణంపై సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు కావడంతో.. 1996లో పట్నా హైకోర్టు ఈ కేసును సీబీఐకు అప్పగించింది. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
సంచలన తీర్పుపై లాలూ స్పందన
రాంచీ : దాణా కుంభకోణం కేసులో సీబీఐ వెలువరిచిన సంచలన తీర్పుపై లాలూ ప్రసాద్ యాదవ్ స్పందించారు. తనను దోషిగా తేల్చడంపై లాలూ బీజేపీపై మండిపడ్డారు. బీజేపీ డర్టీ గేమ్ ఆడుతుందంటూ విమర్శల వర్షం కురిపించారు. కోర్టు తీర్పు ఏకపక్షంగా ఉందని.. న్యాయకోసం తమ పోరాటం కొనసాగిస్తామంటూ పేర్కొన్నారు. చివరికి న్యాయమే గెలుస్తుందంటూ చెప్పుకొచ్చారు. నిజం చెప్పులేసుకునే లోపే.. అబద్ధం సగం ప్రపంచాన్ని చుట్టి వస్తుందంటూ ఆరోపించారు. కోర్టు తీర్పు ఓ రాజకీయ ఎత్తుగడ మాత్రమే అంటూ లాలూ ప్రసాద్ పార్టీ ఆర్జేడీ కూడా మండిపడుతోంది. సాక్ష్యాలను తారుమారు చేశారని, ఈ కేసులో న్యాయం కోసం హైకోర్టుకు వెళ్తామంటూ పేర్కొంది. కాగ, నేడు వెలువరిచిన దాణ కుంభకోణం కేసులో లాలూని సీబీఐ స్పెషల్ కోర్టు దోషిగా తేల్చింది. లాలూతో పాటు 15 మందిని దోషులుగా తేల్చింది. లాలూ ప్రసాద్ యాదవ్ను కోర్టులోనే అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది. రాంచీ జైలుకు ఆయన్ను తరలించనున్నారు. జనవరి 3న లాలూకు శిక్ష ఖరారు చేయనున్నారు. 1991-96 కాలంలో దియోగఢ్(ప్రస్తుతం జార్ఖండ్లో ఉంది) ట్రెజరీ నుంచి దాణా కోసం రూ.84.5 లక్షలకుపైగా అక్రమంగా డ్రా చేసిన క్రమంలో సీబీఐ ఈ కేసు నమోదుచేసింది. 1997, అక్టోబర్ 27న దీనిపై సీబీఐ చార్జిషీట్ దాఖలుచేసింది. ఈ కేసు విచారణ జరుగుతున్న కాలంలో 11మంది చనిపోగా, ముగ్గురు అప్రూవర్లుగా మారిపోయారు. -
దాణా స్కామ్ కేసులో సంచలన తీర్పు
-
దాణా కుంభకోణం కేసులో సంచలన తీర్పు
రాంచీ : దాణా కుంభకోణం కేసులో బిహార్ బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్కు అతిపెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో లాలూ ప్రసాద్ యాదవ్ను దోషిగా తేల్చుతూ రాంచీలోని సీబీఐ స్పెషల్ కోర్టు శనివారం సంచలన తీర్పు వెలువరించింది. ఈ తీర్పు వెలువడే క్రమంలో లాలూ ప్రసాద్ యాదవ్, తన కొడుకు తేజస్వి యాదవ్తో కలిసి కోర్టుకు హాజరయ్యారు. ఆర్జేడీ కార్యకర్తలు కూడా భారీ ఎత్తున్న కోర్టు వచ్చారు. రెండు దశాబ్దాల అనంతరం ఈ కేసుపై నేడు సీబీఐ కోర్టు ఈ తీర్పు వెలువరించింది. అయితే బిహార్ మరో మాజీ సీఎం జగన్నాథ్ మిశ్రను సీబీఐ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. జగన్నాథ్ మిశ్రాతో పాటు ఏడుగురిని నిర్దోషులు ప్రకటించగా.. లాలూతో సహా 15 మందిని దోషులుగా తేల్చింది. లాలూ ప్రసాద్ యాదవ్ను కోర్టులోనే అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది. రాంచీ జైలుకు ఆయన్ను తరలించనున్నారు. జనవరి 3న లాలూకు శిక్ష ఖరారు చేయనున్నారు. 2013లో ఓ కేసులో లాలూకు ఐదేళ్ల జైలు శిక్ష పడగా.. ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆయనపై అనర్హత వేటు పడింది. ఇప్పటికే అనర్హత వేటు ఎదుర్కొంటున్న లాలూకు ఈ తీర్పు మరింత ప్రతికూలంగా మారింది. 1991-96 కాలంలో దియోగఢ్(ప్రస్తుతం జార్ఖండ్లో ఉంది) ట్రెజరీ నుంచి దాణా కోసం రూ.84.5 లక్షలకుపైగా అక్రమంగా డ్రాచేసినట్లు బిహార్ మాజీ సీఎంలు లాలూ, జగన్నాథ మిశ్రాలతో సహా 22 మందిపై సీబీఐ అభియోగాలు దాఖలు చేసింది. 1997, అక్టోబర్ 27న దీనిపై సీబీఐ చార్జిషీట్ దాఖలుచేసింది. ఈ కేసు విచారణ జరుగుతున్న కాలంలో 11మంది చనిపోగా, ముగ్గురు అప్రూవర్లుగా మారిపోయారు. -
లాలూ ఫ్యామిలీకి మరో షాక్.. పొగిడేసిన శతృఘ్న సిన్హా
రాంచి : లాలూ ప్రసాద్ యాదవ్ రాజకీయ జీవితానికి.. బిహార్ రాజకీయాలకు పెను మచ్చగా మిగిలిపోయిన పశువుల దాణా కుంభకోణంలోని ఓ కేసుకు సంబంధించి రాంచీ కోర్టు ఈ మధ్యాహ్నం తుది తీర్పు వెలువరించనుంది. ఈ తరుణంలో ఆయన కుటుంబానికి మరో షాక్ తగిలింది. మనీలాండరింగ్ కేసులో లాలూ కూతురు మిసా భారతి పేరును చేరుస్తూ ఈడీ ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది. మిసాతోపాటు ఆమె భర్త, మరికొందరి పేర్లను చేర్చి ఆ ఛార్జ్ షీట్ను ఢిల్లీ పటియాలా హౌజ్ కోర్టుకు ఈడీ సమర్పించింది. దాణా కుంభకోణం టైమ్ లైన్... - లాలూ ప్రసాద్ యాదవ్ బిహార్ ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో చోటుచేసుకున్న పశువుల దాణా కుంభకోణం 1996లో వెలుగులోకి వచ్చింది. సమగ్ర దర్యాప్తు చేసిన సీబీఐ.. మొత్తం ఐదు కేసులను నమోదుచేసింది. - ప్రస్తుత కేసు 84.5 లక్షల రూపాయల ప్రజా ధనం దుర్వినియోగానికి సంబంధించింది. 1994-1996 కాలంలో దియోగఢ్(ప్రస్తుతం జార్ఖండ్లో ఉంది) ట్రెజరీ నుంచి దాణా కోసం ఈ సొమ్మును అక్రమంగా డ్రా చేసినట్లు లాలూ సహా 34 మందిపై సీబీఐ 1997, అక్టోబర్ 27న చార్జిషీట్ దాఖలుచేసింది. లాలూతోపాటు, మరో కీలక నేత జగన్నాథ మిశ్రా పేర్లు ఉన్నాయి. - కేసు విచారణ జరుగుతున్న కాలంలో 11 మంది చనిపోగా, ముగ్గురు అప్రూవర్లుగా మారిపోయారు. - చియబస ట్రెజరీ నుంచి రూ.37.5 కోట్లు నగదు అక్రమంగా ఉపసంహరించిన కేసులోనూ లాలాకు సీబీఐ కోర్టు అయిదేళ్ల జైలు, రూ.25 లక్షల జరిమానా విధించింది. ఈ తీర్పుతో కొన్నాళ్లు జైళ్లో గడిపిన లాలూ 2013లో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బయటకు వచ్చారు. - ఇక కేసుపై జార్ఖండ్ హైకోర్టు 2014లో స్టే విధించింది. ఒక కేసులో అప్పటికే శిక్ష విధించబడిన వ్యక్తిపై అవే ఆధారాలు.. అవే సాక్ష్యులతో విచారించటం సరికాదని కోర్టు తెలిపింది. - అయితే సుప్రీంకోర్టు హైకోర్టు స్టే పై ఆగ్రహం వ్యక్తం చేసింది. దాణా కుంభకోణంలో వివిధ అభియోగాలు దాఖలు కావడంతో వాటన్నింటిలో లాలూ వివరణ ఇవ్వాల్సిందేనని, లేని పక్షంలో విచారణకు అడ్డంకులు ఏర్పడే అవకాశం ఉందని సీబీఐ వాదించగా.. సుప్రీంకోర్టు ఆ వాదనతో ఏకీభవించింది. - లాలూను ఇతర కేసుల్లో విచారించాలని 2017 మేలో ఆదేశించింది. దీంతో సీబీఐ న్యాయస్థానం ప్రస్తుత కేసు విచారణ ముమ్మరం చేసి, వాదనలు పూర్తిచేసింది. నేడు రాంచీ కోర్టు తుది తీర్పు వెలువరించింది. 25 ఏళ్లుగా నన్ను వేధిస్తున్నారు... కోర్టుకి వెళ్లే ముందు బీజేపీ నాపై కుట్ర చేసింది. 25 ఏళ్లుగా వేధిస్తూనే ఉన్నారు. న్యాయం దక్కుతుందని ఆశిస్తున్నా. తీర్పు ఏదైనా బిహార్ ప్రజలు, ఆర్జేడీ కార్యకర్తలు సమన్వయం పాటించాలి అని లాలూ కోర్టుకి వెళ్లే ముందు వ్యాఖ్యానించారు. లాలూ ఓ మాస్ హీరో : శతృఘ్నసిన్హా లాలూ ప్రసాద్ యాదవ్ తీర్పు నేపథ్యంలో అనూహ్య స్పందన ఒకటి వచ్చింది. నటుడు, బీజేపీ నేత శతృఘ్న సిన్హా లాలూకి మద్దతుగా ట్వీట్ చేశారు. ‘‘లాలూ ఓ మాస్ హీరో. జాతి మొత్తానికి మిత్రుడు. అలాంటి వ్యక్తికి న్యాయం దొరుకుతుందని ఆశిస్తున్నా. సత్యమేవ జయతే.. అని సిన్హా ట్వీట్ చేశారు. Hope wish & pray that the friend of the nation, hero of masses & favorite of downtrodden, one & only one Lalu Yadav gets the most desired & deserving justice. Satyamev Jayate??!!. God Bless! — Shatrughan Sinha (@ShatruganSinha) December 23, 2017 -
'లాలూ పెద్ద నటుడు.. నన్ను ముప్పుతిప్పలు'
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద నటుడని దాణా కుంభకోణం కేసును విచారించిన సీబీఐ జాయింట్ డైరెక్టర్ ఉపెన్ విశ్వాస్ చెప్పారు. ఆయన నాటకాలు ఎవరూ కనిపెట్టలేరని చెప్పారు. కేసు విచారణ సమయంలో తనను ఆయన ముప్పుతిప్పలు పెట్టినట్లు తెలిపారు. ప్రస్తుతం ఉద్యోగ విరమణ పొంది ఇంటి వద్దే ఉంటున్న ఉపెన్ విశ్వాస్ను మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఈ కేసు విచారణ సమయంలో ఆయన ఎదుర్కొన్న అనుభవాలు తెలిపారు. లాలూ కేసు విషయంలో వచ్చిన ఒత్తిడిలను తట్టుకోలేక చివరకు తాను బౌద్ధమతం స్వీకరించినట్లు తెలిపారు. మొట్టమొదటిసారి లాలూ కేసు విచారణ చేయాలని ఆదేశాలు వచ్చిన వెంటనే బిహార్ సీఎస్ నుంచి తనకు ఫోన్ వచ్చిందని, అయితే, మాట్లాడింది మాత్రం లాలూనే అని చెప్పారు. ఈ కేసు విషయంలో చూసిచూడనట్లు వ్యవహరించాలని, తన ఇమేజ్కు దెబ్బతగలకుండా ఉండాలని లాలూ కోరినట్లు కూడా ఆయన వివరించారు. తాను అగ్ర కులస్తుడిని కాదని సానుభూతి పొందే యత్నం కూడా చేశారన్నారు. ముఖ్యంగా విచారణ సమయంలో తనను పట్నాలో విచారించాలని, తర్వాత ఢిల్లీలో అని, కోల్కతాలో అని ఇలా రకరకాలుగా ఇబ్బందుల పెట్టారని చెప్పారు. దేవెగౌడ, ఐకే గుజ్రాల్వంటి నేతలు మాత్రమే కాకుండా ఆఖరికి సీబీఐ డైరెక్టర్ నుంచి కూడా ఒత్తిడిలు వచ్చాయని, ఎంతో ఇబ్బంది ఎదుర్కొన్నట్లు చెప్పారు. ఎన్ని సమస్యలు ఎదురైనా తన వంతు బాధ్యతగా విచారణ పూర్తి చేశానని, ఆఖరికి అరెస్టు చేసేందుకు అనుమతి కోరితే తమ పైఅధికారులు ఆ అవకాశం ఇవ్వలేదని, కనీసం ఆరోజు ఫోన్ కూడా ఎత్తలేదని అన్నారు. ఓ న్యాయకోవిధుడి సలహా తీసుకొని మిలిటరీ అధికారుల సహాయంతో ఆయనను అరెస్టు చేద్దామనుకున్నానని, అయినా వారు కూడా అందుకు అంగీకరించలేదని, చివరకు తనకు పై అధికారుల నుంచి షోకాజ్ నోటీసులు వచ్చాయని చెప్పారు. దాంతో తనను ఆ కేసులో నుంచి తప్పించాలనుకుంటున్నారని అర్ధమైందని, కేసు విచారణ పూర్తి చేసి సీబీఐకి అప్పగించానని తెలిపారు. -
లాలూ ‘దాణా’ కేసులో తీర్పు నేడే!
రాంచీ: బిహార్ మాజీ ముఖ్యమంత్రులు లాలూప్రసాద్ యాదవ్, జగన్నాథ్ మిశ్రా సహా 22 మందిపై నమోదైన దాణా కుంభకోణం కేసులో ఇక్కడ సీబీఐ కోర్టు శనివారం తీర్పు వెలువరించనుంది. విచారణకు హాజరయ్యేందుకు లాలూ తన కుమారుడు తేజస్వీతో కలిసి శుక్రవారం రాంచీకి చేరుకున్నారు. 1991–94 కాలంలో దియోగఢ్(ప్రస్తుతం జార్ఖండ్లో ఉంది) ట్రెజరీ నుంచి దాణా కోసం రూ.89 లక్షలకుపైగా అక్రమంగా డ్రాచేసినట్లు లాలూ సహా 38 మందిపై సీబీఐ 1997, అక్టోబర్ 27న చార్జిషీట్ దాఖలుచేసింది. ఈ కేసు విచారణ జరుగుతున్న కాలంలో 11 మంది చనిపోగా, ముగ్గురు అప్రూవర్లుగా మారిపోయారు. -
సీబీఐ కోర్టు మెట్లెక్కిన లాలూ
పాట్నా: దాణా కుంభకోణం కేసుకు సంబంధించి ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మంగళవారం సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి హాజరయ్యారు. బిహార్ మరో మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రా కూడా సీబీఐ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి దేవ్రాజ్ త్రిపాఠి కూడా కోర్టుకు వచ్చారు. దాణా పంపిణీకి సంబంధించి కోట్లలో కుంభకోణం జరిగినట్లు బయటపడటంతో 45మందిని నిందితులుగా చేర్చిన విషయం తెలిసిందే. ఇందులో పలువురు చనిపోగా.. ప్రస్తుతం 27మంది విచారణను ఎదుర్కొంటున్నారు. గతంలో జార్కండ్ కోర్టు లాలూ ప్రసాద్ యాదవ్పై నమోదైన కుట్రపూరిత ఆరోపణలన్నింటిని కొట్టి వేయగా.. ఇటీవల విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు లాలూ విచారణ ఎదుర్కోవాల్సిందేనని ఆదేశించిన విషయం తెలిసిందే. -
‘దాణా’పై నో కామెంట్: లాలూ
పట్నా: దాణా కుంభకోణానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై మాట్లాడేందుకు రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) అధ్యక్షుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ నిరాకరించారు. దీనిపై తన తరపున లాయర్లు సమాధానం ఇస్తారని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ కుంభకోణానికి సంబంధించిన నాలుగు కేసులను వేర్వేరుగా విచారణ జరపాలని సుప్రీం రెండురోజుల క్రితం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ కుంభకోణంలో మొత్తం 64కేసులు నమోదు అవ్వగా, లాలూ మీద 6 కేసులు నమోదు అయ్యాయి. ఇందులో ఒక కేసులో ఆయన దోషిగా కొంతకాలం శిక్ష అనుభవించి, ప్రస్తుతం బెయిల్పై ఉన్నారు. మరో కేసును జార్ఖండ్ కోర్టు కొట్టివేసింది. ఈ నెల 12న ఈవీఎం ట్యాంపరింగ్ ఆరోపణల మీద ఈసీ నిర్వహించే సమావేశానికి పార్టీ తరపున మనోజ్ ఝా హాజరవుతారని తెలిపారు. -
'నిర్ణయం తీసుకోవాల్సింది కోర్టేగాని సీబీఐ కాదు'
న్యూఢిల్లీ : బీహార్ మాజీ సీఎం, రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పశుగ్రాసం కుంభకోణం కేసు వ్యవహారం సీబీఐ-సొలిసిటర్ జనరల్ మధ్య చిచ్చు పెట్టింది. లాలుపై దాఖలు చేసిన అభియోగాల్ని కోర్టు తొలగించాలి తప్ప సీబీఐకి ఆ అధికారం లేదని సొలిసిటర్ జనరల్ స్పష్టం చేశారు. నిర్ణయం తీసుకోవాల్సింది న్యాయస్థానమే కానీ సీబీఐ కాదని అడిషనల్ సొలిసిటర్ జనరల్ పేర్కొంది. కాగా దాణా కుంభకోణంలో మిగిలిన మూడు పెండింగ్ కేసుల్లో అభియోగాల్ని నమోదు చేయరాదని సీబీఐ అభిప్రాయపడుతోంది. అయితే దాణా కేసుల్లో ఒకదాంట్లో లాలూకు ఇప్పటికే శిక్ష పడింది. ప్రస్తుతం బెయిల్పై ఉన్నా... శిక్ష కారణంగా ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని లాలూ ప్రసాద్ యాదవ్ కోల్పోయారు. -
'లాలూ కాళ్లు కడిగించుకున్నారు.. చెప్పులు మోయించాడు'
రాంచీ: ఓ పోలీసుతో పాదాలు కడిగించుకుని, మరో పోలీసుతో ఆర్జేడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ స్లిప్పర్లు మోయించినట్టు మీడియాలో వచ్చిన కథనాలపై విచారణకు ఆదేశించారు. పశుగ్రాసం కుంభకోణం కేసులో బిర్సా ముండా సెంట్రల్ జైలు నుంచి బెయిల్ పై విడుదలైన లాలూ ప్రసాద్ యాదవ్ రామ్ ఘర్ లోని రాజ్రప్పా ఆలయంలో పూజలు నిర్వహించారు. ఆలయంలో లాలూ పాదాలను ఓ పోలీసు కడుగుతున్న.. మరో పోలీసు స్లిప్లర్లు పట్టుకుని ఉన్న ఫోటోలు దినపత్రికల్లో వచ్చాయి. దాంతో బుధవారం అసెంబ్లీ సమావేశాల్లో లాలూ తీరును ప్రతిపక్షాలు తప్పుపడుతూ నిరసన వ్యక్తం చేశాయి. ఈ సంఘటనకు కారణమైన లాలూ పై పోలీసులు విచారణకు ఆదేశించారు. ఇప్పటికే పశుగ్రాసం కుంభకోణంలో జైలు శిక్ష అనుభవిస్తూ బెయిల్ పై విడుదలైన లాలూ మరో వివాదంలో కూరుకుపోయారు. -
లాలూ ప్రసాద్కు బెయిల్ మంజూరు
పశువుల దాణా కుంభకోణం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్కు ఊరట లభించింది. సుప్రీంకోర్టు శుక్రవారం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అయితే బెయిల్పై ఎలాంటి ఆంక్షలు తీసుకోవాలన్నది మాత్రం దిగువ కోర్టు నిర్ణయం తీసుకుంటుందని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి.సదాశివం నేతృత్వంలోని ధర్మాసనం బెయిలు తీర్పును వెలువరించింది. 1996లో బీహార్ ముఖ్యమంత్రిగా లాలూ ఉన్న సమయమంలో చోటు చేసుకున్న పశువుల దాణా కుంభకోణం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ కుంభకోణంలో లాలు ప్రసాద్, జగన్నాధ్ మిశ్రాలతోపాటు పలువురు బ్యూరోక్రాట్ల నిందితులపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఆ క్రమంలో ఈ ఏడాది అక్టోబర్ 3వ లాలు, జగన్నాధ్ మిశ్రాలతోపాటు పలువురు ఉన్నతాధికారులకు రాంచీ ప్రత్యేక సీబీఐ కోర్టు జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్లోని బిర్సాముండా జైల్లో శిక్ష అనుభవిస్తున్న విషయంవిదితమే. -
రాంచీ జైలులో లాలూతో రాష్ట్రపతి కుమారుడి భేటి!
పశుగ్రాసం కుంభకోణంలో రాంచీలోని బిర్సా ముండా సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఆర్జేడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమారుడు, కాంగ్రెస్ ఎంపీ అభిజిత్ ముఖర్జీ కలుసుకున్నారు. 1990లో తన ప్రభుత్వ హయాంలో బైబాసా ట్రెజరీ నుంచి 37.7 కోట్ల రూపాయలను అక్రమంగా విత్ డ్రా చేశారనే ఆరోపణలపై విచారణ చేపట్టిన సీబీఐ కోర్టు సెప్టెంబర్ 30 తేదిన లాలూకి శిక్షను ఖారారు చేసింది. ప్రత్యేక సీబీఐ కోర్టు వెల్లడించిన తీర్పుపై లాలూ ప్రసాద్ యాదవ్ జార్ఖండ్ హై కోర్టులో అక్టోబర్ 17 తేదిన అప్పీల్ చేయనున్నారు. రాంచీలోని బిర్సా ముంబా జైలులో లాలూతో అభిజిత్ ముఖర్జీ భేటి కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. లాలూతో భేటి తర్వాత జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తో అభిజిత్ సమావేశం కానున్నారు. -
దాణా కేసులో అక్టోబర్ 3న శిక్షలు ఖరారు
-
దాణా కేసులో 3న శిక్షలు ఖరారు చేయనున్న సీబీఐ కోర్టు
రాంచీ : బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్కు షాక్ తగిలింది. దాణా కుంభకోణం కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు లాలూను దోషిగా నిర్దారించింది. లాలూతో సహా 45 మంది నిందితులను కోర్టు దోషులుగా పేర్కొంది. 16 ఏళ్ల పాటు సాగిన విచారణలో రాంచీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. అటు.. లాలూ బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 900 కోట్ల రూపాయల విలువైన దాణా స్కాం వెలుగు చూసింది. శిక్షలను అక్టోబర్ 3న కోర్టు ఖరారు చేయనుంది. లాలూకు మూడు నుంచి ఏడేళ్లు శిక్ష పడే అవకాశం ఉంది. పశుదాణా కేసులో మొత్తం 61 కేసులను సీబీఐ నమోదు చేసింది. ఇప్పటివరకూ 1200 మందిని దోషులుగా కోర్టు ప్రకటించింది .నాటి మంత్రి జగన్నాధ్ మిశ్రాను న్యాయస్థానం దోషిగా ప్రకటించింది. ఖజానా నుంచి 37.7 కోట్లు కాజేశారని నిర్థారించింది. అలాగే ఆరుగురు రాజకీయ నాయకులను, మరో నలుగురు ఐఏఎస్ అధికారులనూ దోషులుగా ప్రకటించింది. సీబీఐ లాలూ, నాటి మంత్రి జగన్నాధ్మిశ్రా, ఇద్దరు ఐఏఎస్ అధికారులు సహా పలువురు కోట్లు మింగారని ఆరోపణలు వెల్లువెత్తాయి. చైబాస జిల్లా ట్రెజరీ నుంచి ఈ భారీ మొత్తాన్ని డ్రా చేశారని వాదనలు వినపించాయి. ఈ కుంభకోణంపై సీబీఐకేసు నమోదు చేయడంతో లాలూ 1997లో ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకున్నారు. -
దాణా కేసులో లాలూను దోషిగా తేల్చిన కోర్టు
రాంచీ : పశువుల దాణా కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ను సీబీఐ కోర్టు సోమవారం దోషిగా తేల్చింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోట్లాది రూపాయల విలువైన పశుగ్రాసం కుంభకోణం (దాణా స్కామ్)లో రాంచీ సీబీఐ కోర్టు నేడు తుది తీర్పును వెల్లడించింది. ఈ కేసు విచారణ సుమారు 16 ఏళ్ల పాటు కొనసాగింది. ఈ కేసుకు సంబంధించి ఈనెల 17తో లాలూ లాయర్ తన వాదనలను ముగించిన నేపథ్యంలో సిబిఐ ప్రత్యేక న్యాయమూర్తి పికె సింగ్ నేడు తీర్పును వెల్లడించారు. శిక్షను న్యాయస్థానం మంగళవారం ఖరారు చేయనుంది. కోర్టు తీర్పుతో లాలూ ప్రసాద్ భవితవ్యం సందిగ్ధంలో పడింది. -
నేడు తేలనున్న లాలూ ప్రసాద్ భవితవ్యం
రాంచీ : ఆర్జేడీ అధ్యక్షుడు, యూపీఏ కీలక భాగస్వామి లాలూప్రసాద్ యాదవ్ భవితవ్యం ఇవాళ తేలనుంది. దాణా కుంభకోణంలో లాలూ ప్రసాద్ యాదవ్ నేరారోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసును విచారిస్తున్న సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి పీకే సింగ్ సోమవారం తుది తీర్పు వెలువరించనున్నారు. ఈ కేసులో లాలు దోషిగా నిరూపితమైతే ఆయనకు కనీసం ఏడేళ్ల జైలు శిక్ష పడే అవకాశముందని సమాచారం. అదే జరిగితే సుప్రీంకోర్టు తాజా తీర్పు ప్రకారం లాలూపై అనర్హత వేటు పడే ప్రమాదముంది. లాలూ బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దాణా కుంభకోణం వెలుగుచూసింది. ఈ స్కాంలో లాలూ, అప్పటి మంత్రి జగన్నాధ్మిశ్రా, ఇద్దరు ఐఏఎస్ అధికారులు సహా పలువురు వ్యక్తులు... దాదాపు 38 కోట్లు స్వాహా చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. చైబాస జిల్లా ట్రెజరీ నుంచి ఈ భారీ మొత్తాన్ని డ్రా చేశారని వాదనలు వినపించాయి. ఈ కుంభకోణంపై సీబీఐకేసు నమోదు చేయడంతో లాలూ 1997లో ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకున్నారు. ఈ కేసులో మొత్తం 56మందిని నిందితులుగా పేర్కొనగా విచారణ సమయంలో ఏడుగురు మరణించారు. ఇద్దరు అప్రూవర్గా మారగా.... ఒకరికి కేసు నుంచి విముక్తి లభించింది.