Huge Loss
-
అయ్యో.. లాస్ ఏంజెలెస్! 24కు చేరిన మృతుల సంఖ్య
అమెరికాలోని లాస్ ఏంజెలెస్లో కార్చిచ్చు ఎంతకీ శాంతించడం లేదు. ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమై ప్రాంతంపై వరుసగా ఆరో రోజు కూడా దాని ప్రతాపం చూపించింది. దీనికారణంగా ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 24కి చేరింది. మరో పాతిక మంది ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది. తీవ్రమైన గాలులు వీస్తుండటంతో మంటలు ఒక చోట నుంచి మరోచోటుకు వేగంగా వ్యాపిస్తున్నాయి. ‘‘అమెరికా చరిత్రలోనే ఇది అత్యంత వినాశకరమైన ప్రకృతి వైపరీత్యం’’ అని కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసోమ్ అభివర్ణించారు. కార్చిచ్చు(Wildfires)తో ఇటిప్పదాకా 24 మంది బలయ్యారు. పాలిసేడ్స్లో 8 మంది, ఎటోన్లో 16 మంది మరణించారు. చనిపోయినవాళ్లలో ‘కిడ్డీ కాపర్స్’ ఫేమ్ నటుడు రోరీ సైక్స్ కూడా ఉన్నాడు. కార్చిచ్చుతో ఆర్థికంగా వాటిల్లిన నష్టం 150 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. ఇప్పటివరకూ కార్చిచ్చుతో 62 చదరపు మైళ్ల విస్తీర్ణం దగ్ధమైంది. 12,000 నిర్మాణాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. ఇది శాన్ ఫ్రాన్సిస్కో వైశాల్యం కన్నా అధికం. ఇక.. పాలిసేడ్స్ ఫైర్ను 11శాతం, ఎటోన్ ఫైర్ను 15 శాతం అదుపు చేయగలిగినట్లు అధికారులు పేర్కొన్నారు. మంటలను ఆర్పివేయడానికి స్థానిక అగ్నిమాపక దళంతో పాటు కెనడా, మెక్సికో నుంచి వచ్చిన అదనపు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. మొత్తంగా 14 వేల మంది సిబ్బంది, 1,354 అగ్నిమాపక యంత్రాలు, 84 ఎయిర్క్రాఫ్ట్లు ఇందులో పాలుపంచుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.మరోవైపు.. లాస్ ఏంజెలెస్ కౌంటీలో 1.5 లక్షల మందిని నివాసాలు ఖాళీ చేయాలని ఆదేశించిట్లు తెలిపారు. ఇప్పటికే ఇళ్లు కోల్పోయి సహాయ శిబిరాల్లో తలదాచుకుంటున్నవారికి నిత్యావసరాలు, దుస్తులు అందించేందకు దాతలు పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారు.సంబంధిత వార్త: ఎందుకీ కార్చిచ్చు!ఇక వినాశం(Disaster movies) ఆధారంగా సినిమాలు తీసే హాలీవుడ్లో.. మంటలతో అదే తరహా పరిస్థితులు కనిపిస్తున్నాయి. పలువురు తారలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఆంటోనీ హోప్కిన్స్, పారిస్ హిల్టన్, మెల్ గిబ్సన్, బిల్లీ క్రిస్టల్ లాంటి తారల ఇళ్లు కార్చిచ్చు ధాటికి బూడిదయ్యాయి. ఇదిలా ఉంటే.. కాలిఫోర్నియా కార్చిచ్చు రాజకీయ రంగు పులుముకుంది. అధికారుల చేతగానితనమేనని కాబోయే అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ విమర్శించగా.. డెమోక్రట్ సెనేట్, కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసోమ్ ఆ విమర్శలను తిప్పి కొట్టారు. అంతేకాదు.. లాస్ ఏంజెలెస్ పూర్తిగా నాశనం కావడంతో.. ‘‘లాస్ ఏంజెలెస్ 2.0’’ పేరిట పునర్మిర్మాణ ప్రాజెక్టు చేపట్టినట్లు తెలిపారాయన. మరోవైపు.. ఫెడరల్తో పాటు స్థానిక దర్యాప్తు సంస్థలు కార్చిచ్చు రాజుకోవడానికి గల కారణాలను పసిగట్టే పనిలో ఉన్నాయి. హాలీవుడ్ స్టార్ల నిర్వాకంతో..ఇదిలా ఉంటే.. మంటల్ని ఆర్పేందుకు నీటి కోరత అక్కడ ప్రధాన సమస్యగా మారింది. అయితే.. హాలీవుడ్ స్టార్ల నిర్వాకం వల్లే లాస్ ఏంజెలెస్కి ఈ దుస్థితి తలెత్తిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. జలాలను ఇష్టారాజ్యంగా దుర్వినియోగం చేయడంతో.. మంటలను చల్లార్చేందుకు నీటి కొరత ఎదురవుతోందని చెబుతున్నారు. కొందరు స్టార్లు తమకు కేటాయించిన నీటి కంటే కొన్ని రెట్లు అదనంగా వాడుకున్నారంటూ డెయిలీ మెయిల్ ఓ కథనం ప్రచురించింది.నటి కిమ్ కర్దాషియన్ ది ఓక్స్లోని తన ఇంటి చుట్టూ తోటను పెంచేందుకు తనకు కేటాయించిన నీటి కంటే అధికంగా నీటిని వాడినట్లు అధికారులు గుర్తించారు. అలాగే.. సిల్వస్టర్ స్టాలోన్, కెవిన్ హార్ట్ వంటి వారు అదనంగా నీరు వాడుకుని జరిమానాలు చెల్లించారు. కొందరు హాలీవుడ్ స్టార్లు గంటకు 2,000 డాలర్లు చెల్లించి.. ప్రైవేటు ఫైర్ఫైటర్లను నియమించుకున్నారని డెయిలీ మెయిల్ పేర్కొంది. ఇక ప్రస్తుతం పసిఫిక్ పాలిసేడ్స్లో అన్ని హైడ్రెంట్లు పనిచేస్తున్నాయని డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ అండ్ పవర్ పేర్కొంది. కానీ, 20శాతం హైడ్రెంట్లలో నీటి ప్రెజర్ చాలకపోవడంతో.. కొన్ని చోట్ల ట్యాంకర్లతో నీటిని తరలిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇదీ చదవండి: అందుకే కెనడా ప్రధాని రేసు నుంచి వైదొలిగా: అనిత -
ఓ మై గాడ్.. అణు బాంబు పడిందా?
ఈ భూమ్మీద అత్యంత విలాసవంతమైన ప్రాంతాల్లో అదొకటి. సినీ ప్రముఖులు, ధనవంతులకు నెలవుగా ఉండేదది. అలాంటి ప్రాంతం మరుభూమిగా మారింది. ఎటు చూసినా.. కార్చిచ్చు, దాని ధాటికి పూర్తిగా దగ్ధమై బూడిద మిగిలిన దృశ్యాలే కనిపిస్తున్నాయి. కాలిఫోర్నియా చరిత్రలోనే అత్యంత భారీ నష్టం కలగజేసిన కార్చిచ్చుగా ఇది మిగిలిపోనుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటిదాకా సుమారు రూ.12లక్షల కోట్ల నష్టం వాటిల్లి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. మునుముందు ఇది ఇంకా పెరగవచ్చని చెబుతున్నారు. అమెరికాలోనే అత్యంత ఖరీదైన గృహాలు ఇక్కడ ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. ఇప్పటిదాకా 9,000 నిర్మాణాలు కాలిబూడిదయ్యాయి. ఒక్క ఫసిఫిక్ పాలిసాడ్స్లోనే 5,300 నిర్మాణాలు దగ్ధమయ్యాయి. అంటోనీ హోప్కిన్స్, పారిస్హిల్టన్, బిల్లీ క్రిస్టల్ లాంటి ప్రముఖుల ఇళ్లు ఇందులో ఉన్నాయి. ఇప్పటిదాకా దాదాపు రెండు లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు ప్రకటించారు. తాజాగా.. గురువారం మరోసారి మంటలు చెలరేగాయి. దీంతో నేషనల్ గార్డ్(National Guard)ను రంగంలోకి దించాల్సి వచ్చింది. కార్చిచ్చు తర్వాతి దృశ్యాలు భయానకంగా ఉన్నాయి. ఇక్కడ అణు బాంబు పడిందా? అనే రీతిలో పరిస్థితి ఉందని లాస్ ఏంజెల్స్ కౌంటీ షరీ రాబర్ట్ లూనా అభిప్రాయపడ్డారు. శాటిలైట్ చిత్రాలు ఆ పరిస్థితిని తలపిస్తున్నాయన్నారు. తీవ్రమైన పెనుగాలుల కారణంగా మంటలు శరవేగంగా వ్యాపిస్తున్నాయి. దీనికి తోడు సరిపడా నీరు లేకపోవడంతో మంటలను ఆర్పడం కష్టతరంగా మారుతోంది.పసిఫిక్ పాలిసాడ్స్లో 19 వేల ఎకరాలు, ఈటొన్ ఫైర్ 13,600 ఎకరాలు, అల్టాడెనాలో 13వేల ఎకరాలు,కెన్నెత్ 791 ఎకరాలు, సన్సెట్ 60 ఎకరాలు, హురస్ట్ 855 లో ఎకరాలు బూడిదయ్యాయి.ఇక ఆల్టడెనా ప్రాంతంలో 83 సంవత్సరాల వృద్ధుడు ఈ కార్చిచ్చులో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య పెరిగింది. ఇప్పటిదాకా ఏడుగురు చనిపోయినట్లు అధికారులు చెబుతున్నప్పటికీ.. కార్చిచ్చు తీవ్ర దృష్ట్యా ఆ సంఖ్యే ఎక్కువే ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. కార్చిచ్చు ధాటికి మరోపక్క మూగజీవాలు మరణిస్తున్నాయి. ఇళ్లను ఖాళీ చేస్తూ వెళ్తున్న వాళ్లు.. తమ వెంట పెంపుడు జంతువులను కూడా తీసుకెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాకు చేరుతున్నాయి. The boy saved the rabbit from being burned in the fire #LosAngelesFire #CaliforniaWildfires #LosAngelesWildfires #California #LosAngeles #PalisadesFire pic.twitter.com/g9IAtyStGh— Sara 🇵🇸 (@saraanwar45) January 9, 2025దొంగతనాలు.. కర్ఫ్యూ విధింపువిలువైన వస్తువుల కంటే తమ ప్రాణాలు ముఖ్యమనుకుంటూ కట్టుబట్టలతో జనాలు అక్కడి నుంచి వెళ్లిపోతున్నారు. . అయితే.. ఇదే అదనుగా ముఠాలు చెలరేగిపోతున్నాయి. ఆ ఇళ్లల్లో విలువైన వస్తువులను దొంగలు దోచుకుంటున్నాయి. తాజాగా అక్కడి షరీఫ్ డిపార్ట్మెంట్ 20మంది లూటర్లను అరెస్టు చేసినట్లు ప్రకటించారు. అయితే ఇది ఇలాగే కొనసాగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించి పహారా కాస్తున్నారు. సంక్షోభ సమయంలో దోచుకుకోవాలనే ఆలోచనలు రావడం సిగ్గుచేటు అని అక్కడి పోలీస్ అధికారి ఒకరు ప్రకటించారు.ఇంకా ఎక్కువే..అక్యూవెదర్ అంచనాల ప్రకారం.. నష్టం 150 బిలియన్ డాలర్లు (సుమారు రూ.12లక్షల కోట్లు)గా ఉండొచ్చని తెలుస్తోంది. ఈ సంస్థ ప్రతినిధి, ప్రముఖ సైంటిస్ట్ జోనాథన్ పోర్టర్ మాట్లాడుతూ.. కేవలం 24 గంటల్లోనే ఈ అంచనాలు మూడింతలు పెరిగాయన్నారు మరోవైపు అమెరికా బీమా రంగం కూడా ఈ కార్చిచ్చు దెబ్బకు కుదేలయ్యే పరిస్థితి కనిపిస్తోంది. జేపీ మోర్గాన్, మార్నింగ్ స్టార్ అంచనాల ప్రకారం 20 బిలియన్ డాలర్ల వరకు బీమా సంస్థలకు నష్టం రావచ్చని అంచనా వేస్తున్నారు. మరోవైపు దక్షిణ కాలిఫోర్నియాలో కార్చిచ్చు బాధిత ప్రాంతాల్లో ఆరు నెలల పాటు ప్రభుత్వం ఖర్చులు భరిస్తుందని అధ్యక్షుడు జోబైడెన్(Joe Biden) ప్రకటించారు. శిథిలాల తొలగింపు వంటి చర్యల్లో సాయం చేస్తామన్నారు.ఒకరి అరెస్ట్కార్చిచ్చు(Wildfires) ఎందుకు రాజుకుంది అనేదానిపై ఇంకా స్పష్టమైన ప్రకటన అధికారుల నుంచి రాలేదు. అయితే.. ఉడ్లాండ్ హిల్స్లో ఓ వ్యక్తి ఉద్దేశపూర్వకంగా కెన్నిత్ కార్చిచ్చును అంటించినట్లు అనుమానిస్తున్నారు. ఇప్పటికే భద్రతా దళాలు అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాయి. Photo Credits: MAXAR, Planet -
యూకే ఎన్నికల్లో లేబర్ పార్టీ భారీ విక్టరీ
లండన్: యూకే సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ భారీ విజయం సాధించింది. అత్యధికంగా 400కి పైగా స్థానాల్లో నెగ్గి చరిత్రాత్మక విజయం కైవసం చేసుకుంది. మరోవైపు.. దశాబ్దంన్నరపాటు అప్రతిహతంగా బ్రిటన్ను ఏలిన కన్జర్వేటివ్ పార్టీకి ఈ ఎన్నికల్లో భంగపాటు ఎదురైంది. రిషి సునాక్ సారధ్యంలో ఆ పార్టీ కేవలం 119 స్థానాల్లో నెగ్గి ఓటమి చవిచూసింది. గురువారం యూకే హౌజ్ ఆఫ్ కామన్స్ 650 స్థానాలకు పోలింగ్ జరిగింది. పోలింగ్ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ వెలువడగా.. ఆ వెంటనే కౌంటింగ్ మొదలైంది. శుక్రవారం ఉదయం నుంచి ఫలితాలు వెల్లడయ్యాయి. ఊహించినట్లుగానే.. లేబర్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటుతూ వచ్చారు. తాజా సమాచారం ప్రకారం.. లేబర్ పార్టీ 411 స్థానాల్లో నెగ్గి ఘన విజయం సాధించింది. కన్జర్వేటివ్ పార్టీ 119 స్థానాలకు మాత్రమే పరిమితం అయ్యింది. లిబరల్ డెమోక్రట్స్ పార్టీ 71 స్థానాలు దక్కించుకుంది. సంబంధిత వార్త: 50 ఏళ్లకు రాజకీయాల్లోకి ఎంట్రీ.. ఎవరీ కీర్ స్టార్మర్ఇదిలా ఉంటే.. ఫలితాలు వెలువడ్డాక కాసేపటికే రిషి సునాక్ ఓటమిని అంగీకరించారు. ఈ ఎన్నికల్లో తమకు మద్దతుగా నిలిచిన వాళ్లకు రిషి సునాక్ కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే యూకే కాబోయే ప్రధాని, లేబర్ పార్టీ నేత కీర్ స్టార్మర్కు అభినందనలు తెలియజేశారు. సంబంధిత వార్త: నన్ను క్షమించండి: రిషి సునాక్ఘోర పరాభవం నుంచి..2019 సార్వత్రిక ఎన్నికల్లో జెర్మీ కోర్బిన్ నేతృత్వంలో లేబర్ పార్టీ కేవలం 201 స్థానాలే గెల్చుకుంది. 1935 తర్వాత ఆ పార్టీ ఎదుర్కొన్న ఘోరమైన పరాభవం ఇదే. అదే సమయంలో బోరిస్ జాన్సన్ నేతృత్వంలో 365 స్థానాలు గెలిచి వరుసగా అధికారం కైవసం చేసుకుంది. అయితే 14 ఏళ్లుగా అధికారంలో ఉన్న కన్జర్వేటివ్ పార్టీని.. ఈసారి ఓటర్లు పక్కనపెట్టేశారు. లేబర్ పార్టీని ఆదరించి అఖండ మెజారిటీతో గెలిపించారు. వ్యతిరేకత ఇలా.. బ్రెగ్జిట్ తర్వాత మందగించిన ఆర్థిక వ్యవస్థ, అధికార పార్టీ కన్జర్వేటివ్ కుంభకోణాలు ప్రజారోగ్య వ్యవస్థ, మౌలిక సదుపాయాల కల్పనలో వైఫ్యలం, 14 ఏళ్ల పాలనలో ఐదుగురు ప్రధానుల్ని మార్చడం, వాళ్ల అనాలోచిత నిర్ణయాలు.. ఇలా కన్జర్వేటివ్ పార్టీ పట్ల జనాల్లో వ్యతిరేకత పెరిగిపోయింది. బోరిస్ జాన్సన్, లిజ్ ట్రస్ తర్వాత.. అనూహ్య పరిణామాల మధ్య బ్రిటన్ ప్రధాని పదవి చేపట్టారు రిషి సునాక్. అయితే కన్జర్వేటివ్ పార్టీ ప్రజా వ్యతిరేకతను పసిగట్టి ఆరు నెలల ముందుగానే ఎన్నికలకు వెళ్లారాయన. అయినప్పటికీ ఫలితాలు వ్యతిరేకంగానే వచ్చాయి. Thank you, Holborn and St Pancras, for putting your trust in me again.Change begins right here. pic.twitter.com/XZfi5OIoyH— Keir Starmer (@Keir_Starmer) July 5, 2024 To the hundreds of Conservative candidates, thousands of volunteers and millions of voters:Thank you for your hard work, thank you for your support, and thank you for your vote. pic.twitter.com/GcgvI7bImI— Rishi Sunak (@RishiSunak) July 4, 2024 లేబర్ పార్టీ అధికారంలోకి వస్తే అధిక పన్నులు చెల్లించాల్సి వస్తుందని సునాక్ ఎన్నికల ప్రచారం వర్కవుట్ కాలేదు. అదే సమయంలో.. తరచూ ప్రధానులు మారే అస్థిర ప్రభుత్వాన్ని దించేయాలని, దారి తప్పిన బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ గాడిన పడాలంటే లేబర్ పార్టీని గెలిపించాలని స్టార్మర్ ఓటర్లకు చేసిన విజ్ఞప్తి ఫలించింది. ఎగ్జిట్పోల్స్ నిజమయ్యాయి!యూకేలోని ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్, నార్తర్న్ ఐర్లాండ్ వ్యాప్తంగా ఎన్నికలు జరిగాయి. మొత్తం 650 సీట్లు ఉన్న యూకే పార్లమెంట్ దిగువ సభ(హౌజ్ ఆఫ్ కామన్స్)లో ఏకంగా 410 స్థానాలు కీర్ స్మార్టర్ నేతృత్వంలో లేబర్ పార్టీ దక్కించుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ సంస్థలు తెలిపాయి. కన్జర్వేటివ్ కేవలం 131 స్థానాలకు పరిమితం కావొచ్చని తెలిపాయి. -
Vishaka: స్టీల్ ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్లో శనివారం( జనవరి 13) సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. స్టీల్ ప్లాంట్లోని బ్లాస్ట్ ఫర్నేస్-3లో పేలుడు సంభవించడంతో మంటలు చెలరేగాయి. పేలుడు ధాటికి అక్కడే పనిచేస్తున్న పలువురు గాయపడ్డారు. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ప్లాంటుకు చేరుకుని మంటలార్పుతున్నారు. అగ్నిప్రమాదం కారణంగా ప్లాంటులో భారీ ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. గతంలోనూ స్టీల్ ప్లాంట్లో జరిగిన పలు అగ్ని ప్రమాదాల్లో ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించాయి. ఇదీచదవండి.. లొంగిపోయి పూచికత్తులు సమర్పించిన చంద్రబాబు -
అన్నదాతలను నట్టేట ముంచిన అకాల వర్షాలు
-
సింగిల్ ట్రాన్సాక్షన్లో కోటి తగలెట్టేశా, ఈ ఘోర తప్పిదం నావల్లే!
సాక్షి, ముంబై: ట్రేడింగ్ అంటేనే చాలా అవగాహన అంతకుమించిన అప్రతమత్తత అవసరం. అందులోనూ ఇక క్రిప్టో మార్కెట్ ట్రేడింగ్లో మరింత జాగ్రత్తగా ఉండాలి. అలా క్రిప్టో లావాదేవాల్లో చోటుచేసుకున్న ఒక్క పొరపాటు అతని జీవితాన్ని నాశనం చేసింది. అనుకోకుండా కోటిరూపాయల ఎన్ఎఫ్టీలని కోల్పోయాడు. అంతేకాదు అతని నికర విలువ దాదాపు మూడో వంతు తుడిచి పెట్టుకు పోయింది. ఆనక పొరబాటు గుర్తించి లబోదిబోమన్నాడు. ఈ విషయాన్ని బాధితుడు స్వయంగా ట్విటర్ ద్వారా తెలియజేశాడు. వివరాలను పరిశీలిస్తే.. బ్రాండన్ రిలే ఎన్ఎఫ్టీ కలెక్టర్. ఈక్రమంలో CryptoPunk #685 అనే NFTని 77 ఈథర్లు లేదా దాదాపు 1 కోటి రూపాయలకు కొన్ని వారాల కిందట కొనుగోలు చేశాడు. దీన్ని ప్రపంచ రెండో అతిపెద్ద క్రిప్టో ఎథేరియం మార్కట్ ప్లేస్లో ర్యాపింగ్ (ర్యాపింగ్అంటే ఓపెన్సీ లేదా రారిబుల్ వంటి Ethereum మార్కెట్ప్లేస్లలో NFTల ట్రేడింగ్) చేసే సమయంలో పొరపాటున బర్న్ ఎడ్రస్కి షేర్చేశాడు. (బర్న్ ఎడ్రస్ కి చేరితే ఇక జీవితంలో అది తిరిగి రాదు. ప్రైవేట్ కీ లేని దీన్ని యాక్సెస్ చేయలేరు) డిజిటల్ వాలెట్లోని నిధులను యాక్సెస్ చేయడానికి ఉపయోగించే ప్రైవేట్ కీ..వర్చువల్ వాలెట్ ‘బర్న్’ అడ్రస్కి చేరితే సంబంధిత ఎన్ఎఫ్టీ శాశ్వతంగా నాశన మవుతుంది. రిలే విషయంలో అదే జరిగింది. తనుకెదురైన చేదు అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసిన రిలే తనకు ఈ విషయాలపై అవగాహన లేదనీ అన్ని సూచనలను కచ్చితంగా పాటించినప్పటికీ లావాదేవీలో చిన్న పొరపాటు నాశనం చేసిందని వాపోయాడు. అసలు ర్యాప్డ్ నెట్ వర్క్ ఎలా పనిచేస్తుందో అవగాహన లేదు..ఇది కచ్చితంగా నేను చేసిన తప్పే..అదే నన్ను ముంచేసింది..దీనిపై అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించాడు. Today I accidentally burned a @cryptopunksnfts trying to wrap punk 685. I was so focused on following the instructions exactly, that I slipped up, destroying a third of of my net worth in a single transaction. @yugalabs please sell me the @v1punks 685 as a consolation. 🙏🏼 pic.twitter.com/jHoTGvlc7j — Brandon Riley (@vitalitygrowth) March 25, 2023 -
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
-
టెస్లా.. సింగిల్ డేలో 100 బిలియన్ డాలర్లు ఢమాల్
ప్రపంచంలో ఆటోమేకర్ కింగ్గా ఉన్న విరజిల్లుతున్న టెస్లాకు ఘోరమైన దెబ్బ పడింది. ఒక్కరోజులో.. కేవలం ఒకేఒక్క రోజులో 100 బిలియన్ డాలర్ల మేర కంపెనీ మార్కెట్ వాల్యూ పడిపోయింది. స్టాక్ మార్కెట్లో గురువారం టెస్లా షేర్లు 12 శాతం పడిపోవడమే ఈ భారీ నష్టానికి కారణమని తెలుస్తోంది. 2022 ఆరంభంలోనే ఈమేర భారీ దెబ్బ పడగా.. చాలాకాలం తర్వాత ఈ మేర దిగజారిపోవడం గమనార్హం. ఇదిలా ఉంటే అమెరికన్ ఆటో మేకర్ టెస్లా.. బుధవారం నాడు 2021 ఏడాదికి నాలుగో క్వార్టర్ ఫలితాల్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రపంచంలోనే కిందటి ఏడాది భారీ లాభాల్ని ఆర్జించిన ఏకైక ఈవీ ఆటోమేకర్గా టెస్లా నిలవడం విశేషం. అయితే ఇంత లాభాల్లో ఉన్నా చిప్ కొరతల కారణంగా.. 2022లో కొత్త మోడల్స్ను తీసుకురాలేమని టెస్లా సీఈవో ఎలన్ మస్క్ స్వయంగా ప్రకటించడం ఇన్వెస్టర్ల ఆసక్తిని దెబ్బ తీసింది. ముఖ్యంగా లేబర్ షార్టేజ్ ప్రస్తావనతో పాటు సైబర్ట్రక్ ఆలస్యం, కొత్త మోడల్స్ తేలేకపోతున్నట్లు(మోడల్ 3 కంటే చౌకైన ఈవీ మోడల్ తేబోతున్నట్లు ప్రకటించి.. కస్టమర్లు, ఇన్వెస్టర్లలో ఆశలు రేపాడు) ప్రకటించడంతో ఇన్వెస్టర్లు టెస్లా షేర్ల మీద ఆసక్తి కనబరచలేకపోయారు. పైగా అర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మీద ఫోకస్ను జీర్ణించుకోలేకపోయారు. ఈ పరిణామాలతో షేర్ల అమ్మకానికే మొగ్గు చూపించగా.. గురువారం ఒక్కరోజే 100 బిలియన్ డాలర్ల మేర టెస్లా వాల్యూ పడిపోయింది. ప్రస్తుతం కంపెనీ విలువ 1.2 ట్రిలియన్ డాలర్లుగా ఉన్నట్లు బ్లూమ్బర్గ్ గణాంకాలు చెప్తున్నాయి. సంబంధిత వార్త: లాభాల్లో కింగూ.. అయినా ఇలాంటి నిర్ణయమా? రీజన్ ఏంటంటే.. -
పాపం.. మిలియనీర్ల పుట్టి ముంచుతున్న బిట్కాయిన్
Bitcoin Crash Effect Thousands Of Investors Vanished: బిట్కాయిన్.. క్రిప్టోకరెన్సీలో అత్యంత విలువైంది. దీని దరిదాపుల్లో మరే కరెన్సీ లేకపోవడం గమనార్హం. ఏళ్ల తరబడి వీటికి నమ్ముకున్న వాళ్లకు అదృష్టం కలిసొచ్చి.. ఇప్పుడు విపరీతమైన లాభాలు తెచ్చిపెడుతోంది. ఇప్పటివరకు బాగానే ఉన్నా.. ఈ మధ్యకాలంలో పరిణామాలతో బిట్కాయిన్కు బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యింది!. ప్రస్తుతం ఇది చేస్తున్న నష్టం మాత్రం మామూలుగా ఉండడం లేదు. సుమారు 30 వేలమంది బిట్కాయిన్ మిలియనీర్లు క్రిప్టో మార్కెట్ నుంచి పూర్తిగా కనుమరుగు అయిపోయారు. కారణం.. గత మూడు నెలల్లో బిట్కాయిన్ డిజిటల్ మార్కెట్లో జరుగుతున్న పరిణామాలు. నవంబర్లో 69,000 డాలర్లుగా ఉన్న బిట్కాయిన్ విలువ తాజాగా(గురువారం) 36,000 డాలర్లకు చేరుకుంది. క్రిప్టోకరెన్సీపై పలు దేశాల నియంత్రణ పరిశీలన, భౌగోళిక రాజకీయ అశాంతి, అల్లకల్లోలం అవుతున్న మార్కెట్లు, కరోనా పరిస్థితుల వల్లే ఇదంతా అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫిన్బోల్డ్ అనే పోర్టల్ సమాచారం ప్రకారం.. అక్టోబర్ నుంచి జనవరి మధ్య 1 మిలియన్ డాలర్ కంటే ఎక్కువ ఉన్న బిట్కాయిన్ కలిగి ఉన్న వాలెట్లు 28,186( 24.26 శాతం) తగ్గాయి. ముఖ్యంగా ఈ మూడు నెలల్లో గతంలో బిట్కాయిన్ ద్వారా ధనవంతులైన ఎంతో మంది.. భారీ నష్టంతో బికారీలుగా మారిపోయారు. అంతేకాదు ‘‘1,00,000డాలర్లు కంటే ఎక్కువ ఉన్న వాలెట్లు 30.04 శాతం పడిపోయి 505,711 నుండి 353,763కి చేరుకున్నాయి. ఒక మిలియన్ డాలర్, అంతకు మించి ఉన్నవి 105,820 నుండి 80,945కి 23.5 శాతం పడిపోయి 80,945కి పడిపోయింది. 10 మిలియన్ల డాలర్లు.. అంతకంటే ఎక్కువ ఉన్న వాలెట్లు కూడా 32.08 శాతం తగ్గి 10,319 నుండి 7,008కి పడిపోయాయి’’ అని ఫిన్బోర్డ్ నివేదిక పేర్కొంది. అయితే పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా రక్షణగా బిట్కాయిన్ను అభివర్ణిస్తున్నారు కొందరు ఆర్థిక నిపుణులు. బిట్కాయిన్ చేస్తున్న డ్యామేజ్ను పరిగణనలోకి తీసుకోవద్దని చెప్తూ.. ముందు మంచి భవిష్యత్తు ఉందని అంచనా వేస్తున్నారు. కానీ, బిట్కాయిన్, ఇతర డిజిటల్ క్రిప్టోకరెన్సీలు కనిష్టానికి చేరుకోవడంతో పాటు గ్లోబల్ క్రిప్టో మార్కెట్లో 1 ట్రిలియన్ డాలర్ల మేర నష్టం వాటిల్లజేశాయి మరి!. చదవండి: బిట్కాయిన్ చెల్లదంటే చెల్లదు- ఐఎంఎఫ్ -
సెన్సార్ చిక్కులు.. రూ.40 వేల కోట్ల నష్టం!!
సెన్సార్ చిక్కులు సాధారణంగా ఈ మాటను తరచూ సినీ పరిశ్రమలో వింటుంటాం. అయితే వెబ్ కంటెంట్ విషయంలో ఆ చిక్కులు తక్కువే!. అందుకే ఫిల్మ్ మేకర్స్ డిజిటల్ కంటెంట్కు ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. కానీ, ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్ కంటెంట్కూ కోతలు తప్పడం లేదు. దీనివల్ల గ్లోబల్ ఎకానమీకి వేల కోట్ల నష్టం వాటిల్లుతోంది. ఇంటర్నెట్ సెన్సార్షిప్ వల్ల పోయినేడాది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. డిజిటల్ సెక్యూరిటీ & రైట్స్ గ్రూప్ ‘టాప్10వీపీఎన్’ నివేదిక ప్రకారం.. ఈ నష్టం మొత్తంగా 5.5 బిలియన్ డాలర్లకు(సుమారు 40 వేల కోట్ల రూపాయలకు పైనే) ఉందని తెలుస్తోంది. 2021లో ఇంటర్నెట్-సోషల్ మీడియాపై ఆంక్షలు, ఇంటర్నెట్ అంతరాయం(షట్డౌన్), సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్పై ప్రభుత్వాల ఆధిపత్యం-కఠిన చట్టాల అమలు, వెబ్ కంటెంట్పై ఉక్కుపాదం.. తదితర కారణాల వల్ల ఈ మేర నష్టం వాటిల్లినట్లు నివేదిక పేర్కొంది. ►ఎక్కువ నష్టపోయింది మయన్మార్ దేశం. సుమారు 2.8 బిలియన్ డాలర్ల(మన కరెన్సీలో 18 వేల కోట్ల రూపాయలపైనే) నష్టపోయింది. మిలిటరీ చర్యల వల్లే ఈ నష్టం కలిగినట్లు తెలుస్తోంది. ఇక నైజీరియా ఈ లిస్ట్లో రెండో ప్లేస్లో ఉంది. జూన్లో ట్విటర్ను బ్లాక్ చేయడం తదితర పరిణామాల వల్ల నైజీరియా 1.5 బిలియన్ డాలర్ల నష్టం చవిచూసినట్లు తెలుస్తోంది. ►భారత్లో కొత్త ఐటీ రూల్స్ వల్ల ఈ నష్టం ప్రధానంగా వాటిల్లింది. దీనికి తోడు పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్పై నిషేధం-ఆంక్షలు, ఓటీటీ కంటెంట్పై ఉక్కుపాదం(పూర్తిస్థాయి సెన్సార్షిప్ రాలేదింకా), కరోనాపై ఫేక్- అశ్లీల కంటెంట్, ఇతర కథనాల నియంత్రణ తదితర కారణాలు ఉన్నాయి. (లెక్కపై స్పష్టత రావాల్సి ఉంది). ►2021 ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ ఆంక్షలతో 486 మిలియన్ ప్రజలు ఇబ్బందిపడగా.. 2020లో 268 మిలియన్ ప్రజలు ఇబ్బందిపడ్డారు. అంటే 81 శాతం పెరిగిందన్నమాట. కేవలం ప్రభుత్వాల ఆంక్షలు-నిషేధాజ్ఞల కారణంగా వాటిల్లిన నష్టం 36 శాతానికి(2020తో పోలిస్తే) పెరిగింది. ఎలాగంటే.. ఇంటర్నెట్ షట్డౌన్, కఠిన ఆంక్షల వల్ల ఈమేర నష్టం వాటిల్లితే.. ఒకవేళ మొత్తంగా ఇంటర్నెట్ ఆగిపోతే పరిస్థితి ఎలా ఉంటుందో కదా!. అసలు నష్టం ఎందుకు వాటిల్లుతుందంటే.. ఇంటర్నెట్ బ్రౌజింగ్, ఇతరత్ర సేవలు, అడ్వర్టైజింగ్, కస్టమర్ సపోర్ట్ సేవలకు విఘాతం, ప్రత్యేకించి సోషల్ మీడియా ఆగిపోవడం వల్ల ఆదాయానికి భారీ గండిపడుతుంది. 2022లో మొదలైంది.. ఇక ఈ ఏడాదిలోనూ ఇంటర్నెట్ స్వేచ్ఛకు అడ్డుకట్ట పడడం ఇప్పటికే మొదలైంది. కజకస్తాన్(మధ్య ఆసియా దేశం), సూడాన్లలో నెలకొన్న సంక్షోభాల దృష్ట్యా ఇంటర్నెట్ షట్డౌన్ కొనసాగుతోంది. వీటి నష్టం వివరాలు ఇప్పట్లో చెప్పడం కష్టం. చదవండి: భారత్లో ఇక ఏరకంగానూ పోర్న్ వీడియోల వీక్షణ కుదరదు! -
భలేవాడివి బాసు! 97 కోట్లు లాస్.. హ్యాపీగా ఉందన్న సీఈవో
‘గెలిస్తే ఏముంటుంది? ఓడితేనే కదా.. అసలు కిక్కు ఉండేది’ అనే టైప్ కాదు ఈ బాస్. అలాంటప్పుడు అంత లాస్లో ఆనందమా? ఈయనేం మనిషిరా బాబూ! అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే ఆయన సంతోషంలో ఒక పరమార్థం ఉంది కాబట్టి. యూకేకి చెందిన ప్రముఖ కాస్మోటిక్ కంపెనీ లష్ శుక్రవారం కీలక అడుగు వేసింది. లష్ తన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టిక్టాక్, స్నాప్ఛాట్ అకౌంట్లను పూర్తిగా డిలీట్ చేసి పారేసింది. కేవలం ఒక్క ఫేస్బుక్ అకౌంట్ క్లోజ్ చేసినందుకే 10 మిలియన్ పౌండ్లు(13.3 మిలియన్ డాలర్లు.. మన కరెన్సీలో 97కోట్ల 50 లక్షలకు పైమాటే) నష్టం వాటిల్లిందని కంపెనీ సీఈవో మార్క్ కంస్టాన్టైన్ సంతోషంగా ప్రకటించుకున్నారు. మిగతావి కలిపితే ఆ నష్టం మరో మూడునాలుగు మిలియన్ పౌండ్ల మధ్య ఉండొచ్చని ఆయన చెప్తున్నారు. ‘‘ఇదేం పీఆర్స్టంట్ కాదు. దీనివల్ల మాకు పెద్ద దెబ్బే. అయినా ఈ నిర్ణయం తీసుకోవడానికి గట్టి కారణం ఉంది. సోషల్ మీడియా వల్ల టీనేజర్ల మానసిక స్థితిపై ప్రతికూల ప్రభావం పడుతుందన్న ఆరోపణల్ని లష్ కంపెనీ నమ్ముతోంది. ఓవైపు పిల్లల ప్రాణాలు పోతుంటే.. ఆ ప్లాట్ఫామ్ల ద్వారా మేం ఎలా ప్రమోట్ చేసుకోగలం. కస్టమర్ల ప్రాణాలకు విలువ ఇవ్వకుండా చేసే వ్యాపారం మాకెందుకు!. దీనికి తోడు దశాబ్దానికిపైగా క్లైమేట్ ఛేంజ్పై ఆందోళన వ్యక్తం అవుతున్నా.. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు పట్టించుకోవట్లేదని, అందుకే వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని తృణప్రాయంగా వదిలేస్తూ ఆ అకౌంట్లను తొలగిస్తున్నాం ఒక ప్రకటనలో లష్ పేర్కొంది. అంతేకాదు కొవిడ్ సమయంలో కఠిన ఆంక్షల మధ్యే తమ వ్యాపారం ఆటుపోట్లను ఎదుర్కొంటూ నిలదొక్కుకుందని, అలాంటిది సోషల్ మీడియా ప్రమోషన్ దూరమైనంత మాత్రాన తామేం ఇబ్బందిగా భావించబోమని, తాము కస్టమర్లని నమ్ముకున్నామని మార్క్ కంస్టాన్టైన్ చిరునవ్వుతో ధీమాగా చెప్తున్నారు. సోషల్ మీడియా ప్రమోషన్ ఎంత పవర్ఫుల్దో తెలియంది కాదు. ప్రస్తుతం ఇయర్ ఎండ్ సీజన్ నడుస్తోంది. సాధారణంగా షాపింగ్ బిజీ ఉంటుంది. ఈ తరుణంలో సోషల్ మీడియా అకౌంట్లను ప్రమోషన్ కోసం వాడుకుంటాయి కంపెనీలు. కానీ, లక్షల మంది ఫాలోవర్స్ను దూరం చేసుకుంటూ లష్ ఇలా నిర్ణయం తీసుకోవడం హర్షించదగ్గ పరిణామం. ఇదిలా ఉంటే లష్కు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో కలిపి 11 మిలియన్కు పైగా ఫాలోవర్స్ ఉండేవాళ్లు డిలీట్ చేసిన నాటికి(శుక్రవారం, 26 2021). గతంలో 2019లోనూ లష్ ఆల్గారిథమ్ విషయంలో ఫేస్బుక్పై అసంతృప్తితో కొన్నాళ్లు దూరం పెట్టింది కూడా. ఇదిలా ఉంటే జార్జ్ ఫ్లాయిడ్ ఉదంతం తర్వాత ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లను చాలా కంపెనీలు తొలగించడం చేశాయి. చదవండి: ది గ్రేట్ అలెగ్జాండర్ గుర్రం కనిపెట్టిన పదార్థం.. వందల కోట్ల వ్యాపారానికి నాంది -
భారీ నష్టాల్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్లు
-
ఫేస్బుక్, వాట్సాప్ డౌన్.. జుకర్బర్గ్ పుట్టి ముంచిన ఆ ఒక్కడు!
WhatsApp, Facebook, Instagram restore services after 6-hours of outage: ఫేస్బుక్ స్థాపించినప్పటికీ ఇప్పటిదాకా చూసుకుంటే.. సోమవారం(అక్టోబర్ 4న) తలెత్తిన సమస్య ఆ సంస్థకు భారీ నష్టాన్ని చేసింది. ఆరు గంటలపాటు ఆగిపోయిన ఫేస్బుక్ దాని అనుబంధ యాప్ సర్వీస్లు ఫేస్బుక్ మెసేంజర్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ సేవలను సైతం స్తంభింపజేసింది. తిరిగి సర్వీసులు ప్రారంభమైనప్పటికీ.. మొదట్లో మొండికేశాయి కూడా. ఈ ప్రభావం ఇంటర్నెట్పై పడగా.. ట్విటర్, టిక్టాక్, స్నాప్ఛాట్ సేవలు సైతం కాసేపు నెమ్మదించాయి. ఏది ఏమైనా ఈ బ్రేక్డౌన్ ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్బర్గ్కు మాత్రం కోలుకోలేని నష్టాన్ని మిగిల్చినట్లు తెలుస్తోంది. ఫేస్బుక్, దాని అనుబంధ సేవల సర్వీసుల విఘాతం వల్ల మార్క్ జుకర్బర్గ్ భారీ నష్టం వాటిల్లింది. సుమారు ఏడు బిలియన్ల డాలర్ల(మన కరెన్సీలో దాదాపు 50 వేల కోట్ల రూపాయలకు పైనే) నష్టం వాటిల్లింది. ఫేస్బుక్ స్థాపించినప్పటి నుంచి ప్రపంచం మొత్తం మీద ఇంత సమయం పాటు సర్వీసులు నిలిచిపోవడం, ఈ రేంజ్లో డ్యామేజ్ జరగడం ఇదే మొదటిసారి. అంతేకాదు ఈ దెబ్బతో జుకర్బర్గ్ స్థానం అపర కుబేరుల జాబితా నుంచి కిందకి పడిపోయింది. సెప్టెంబర్ మధ్య నుంచి ఫేస్బుక్ స్టాక్ 15 శాతం పడిపోగా.. ఒక్క సోమవారమే ఫేస్బుక్ సర్వీసుల విఘాతం ప్రభావంతో 5 శాతం పడిపోయిందని బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ వెల్లడించింది. దీంతో ఐదో స్థానం నుంచి కిందకి జారిపోయాడు జుకర్బర్గ్. ప్రస్తుతం 120.9 బిలియన్ డాలర్లతో బిల్గేట్స్ తర్వాత రిచ్ పర్సన్స్ లిస్ట్లో ఆరో ప్లేస్లో నిలిచాడు మార్క్ జుకర్బర్గ్. అతని వల్లే.. ఇక ఫేస్బుక్ అనుబంధ సర్వీసులు ఆగిపోవడంపై యూజర్ల అసహనం, ఇంటర్నెట్లో సరదా మీమ్స్తో పాటు రకరకాల ప్రచారాలు సైతం తెర మీదకు వచ్చాయి. ది వాల్ స్ట్రీట్ జర్నల్ ‘నెగెటివ్’ కథనాల ప్రభావం వల్లే ఇలా జరిగి ఉంటుందని, కాదు కాదు ఇది హ్యాకర్ల పని రకరకాల అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే ఇది సాంకేతికపరమైన సమస్యే అని తెలుస్తోంది. డొమైన్ నేమ్ సిస్టమ్(డీఎన్ఎస్).. ఇంటర్నెట్కు ఫోన్ బుక్ లాంటిది. ఇందులో సమస్య తలెత్తడం వల్ల సమస్య తలెత్తవచ్చని మొదట భావించారు. ఆ అనుమానాల నడుమే.. బీజీపీ (బార్డర్ గేట్వే ప్రోటోకాల్)ను ఓ ఉద్యోగి మ్యానువల్గా అప్లోడ్ చేయడం కారణంగానే ఈ భారీ సమస్య తలెత్తినట్లు సమాచారం. అయితే ఆ ఉద్యోగి ఎవరు? అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? కావాలనే చేశాడా? పొరపాటున జరిగిందా? తదితర వివరాలపై స్పష్టత రావాల్సింది ఉంది. సర్వీసులు ఎందుకు నిలిచిపోయాయనేదానిపై ఫేస్బుక్ నుంచి స్పష్టమైన, అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. బీజీపీ రూట్స్లో సర్వీసులకు విఘాతం కలగడం వల్ల ఫేస్బుక్, దానికి సంబంధించిన ప్రతీ వ్యాపారం ఘోరంగా దెబ్బతిందని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాదు కొద్దిగంటల పాటు ఫేస్బుక్ ఉద్యోగుల యాక్సెస్ కార్డులు పని చేయకుండా పోయాయట. దీంతో వాళ్లంతా కాలిఫోర్నియాలోని మెన్లో పార్క్ హెడ్ ఆఫీస్ బయటే ఉండిపోయారు. ఇక బోర్డర్ గేట్వే ప్రోటోకాల్ (BGP) అనేది గేట్వే ప్రోటోకాల్ను సూచిస్తుంది, ఇది స్వయంప్రతిపత్త వ్యవస్థల మధ్య రూటింగ్ సమాచారాన్ని మార్పిడి చేయడానికి ఇంటర్నెట్ని అనుమతిస్తుంది. Seeing @Facebook's BGP announcements getting published again. Likely means service is on a path to getting restored. — Matthew Prince 🌥 (@eastdakota) October 4, 2021 చదవండి: వాట్సాప్, ఇన్స్టా, ఫేస్బుక్ సేవలు పునరుద్ధరణ చదవండి: ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ సేవలకు విఘాతం -
ఒక్క టెస్ట్ మ్యాచ్ రద్దవడం వల్ల ఇంత భారీ నష్టమా..?
మాంచెస్టర్: ఐదు టెస్ట్ల సిరీస్లో భాగంగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య శుక్రవారం నుంచి ప్రారంభం కావాల్సిన ఆఖరి టెస్ట్ కరోనా కారణంగా రద్దైన విషయం తెలిసిందే. భారత శిబిరంలో కోచ్ రవిశాస్త్రి సహా నలుగురు కోచింగ్ సిబ్బంది కరోనా బారిన పడటంతో ఇరు దేశాల క్రికెట్ బోర్డుల పరస్పర అంగీకారంతో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ ఒక్క మ్యాచ్ రద్దు కావడం వల్ల లాంకషైర్ క్రికెట్కు, ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ)కు భారీ నష్టం వాటిల్లిందని సమాచారం. ఈ నష్టం భారత కరెన్సీలో వందల కోట్లకు పైగా ఉండవచ్చని ఈసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రసార హక్కులు ఇతరత్రా మార్గాల ద్వారా 30 మిలియన్ పౌండ్లు (దాదాపు రూ. 304 కోట్లు) వరకు నష్టం వాటిల్లిందంటూ ఈసీబీకి అధికారి ఒకరు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే అర్ధంతరంగా రద్దైన ఈ మ్యాచ్ను వచ్చే ఏడాది భారత పర్యటనలో పరిమిత ఓవర్ల సిరీస్తో పాటు నిర్వహించాలని ఇరు బోర్డులు పరస్పర అంగీకారానికి వచ్చినట్లు సమాచారం. ఈ విషయమై బీసీసీఐ సూచనప్రాయంగా అంగీకారం తెలిపినట్లు జై షా వెల్లడించారు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23లో భాగం జరుగుతున్న సిరీస్ కాబట్టి ఇరు జట్లకు అన్యాయం జరగకుండా ఉండేందుకే ఇరు దేశాల క్రికెట్ బోర్డులు ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాగా, మ్యాచ్ రద్దు ప్రకటన అనంతరం తొలుత టీమిండియా మ్యాచ్ను వదులుకోవడానికి సిద్ధమైందంటూ (forfeit the match) ప్రకటన విడుదల చేసిన ఈసీబీ.. నిమిషాల వ్యవధిలోనే ఆ పదాన్ని తొలగించి.. టీమిండియా కరోనా కేసుల భయం కారణంగా జట్టును బరిలోకి దించలేకపోతుందంటూ మార్చేసింది. మరోవైపు సిరీస్ ఫలితంపై ఐసీసీ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన విడుదల చేయకపోగా ఈసీబీ మాత్రం ఓ విషయాన్ని స్పష్టం చేసింది. ఒకవేళ మ్యాచ్ రీ షెడ్యూల్ అయినా.. ఆ మ్యాచ్తో ప్రస్తుత సిరీస్కు సంబంధం ఉండదని, అది స్టాండ్ అలోన్ మ్యాచ్ అవుతుందని(సెపరేట్ మ్యాచ్) ఈసీబీ క్లారిటీ ఇచ్చింది. దీంతో ఈ సిరీస్ను టీమిండియా(2-1) అనధికారికంగా కైవసం చేసుకున్నట్టేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చదవండి: రీ షెడ్యూల్ అయినా సిరీస్తో సంబంధం ఉండదు: ఈసీబీ చీఫ్ -
బెల్లంకొండ శ్రీనివాస్ ఛత్రపతి మూవీ మేకర్స్కు భారీ నష్టం
టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ హిందీ రీమేక్ చిత్రం ‘ఛత్రపతి’ మేకర్స్కు భారీ నష్టం వాటిల్లినట్లు సమాచారం. వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ తెలుగు రీమేక్ చిత్రం ఏప్రిల్లో సెట్స్పైకి వెళ్లాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఛత్రపతి కోసం మేకర్స్ హైదరాబాద్లో 6 ఎకరాల స్థలంలో ఓ భారీ విలేజ్ సేట్ వేశారట. ఇప్పటికే కోవిడ్తో నష్టపోయిన నిర్మాతలకు ప్రస్తుతం కురుస్తున్న వరుస వర్షాల కారణంగా దాదాపు 3 కోట్ల రూపాయల నష్టం వచ్చినట్లు తెలుస్తోంది. అప్పడు షూటింగ్ కోసం వేసిన ఈ భారీ విలేజ్ సేట్ ఈ వర్షాలకు తీవ్రంగా దెబ్బతినట్లు సమాచారం. ఇంకా సినిమా షూటింగ్ మొదలు కాకముందే మేకర్స్కు 3 కోట్ల నష్టం రావడం నిజంగా బాధించే విషయమే. ఇక ఈ సెట్ సినిమాకు చాలా కీలకం కానుండటంతో మరో ఆలోచన లేకుండా నిర్మాతలు దీనిని పున:నిర్మించే ఆలోచనలో పడ్డారట. ఈ వర్షాలు తగ్గిన వెంటనే తిరిగి సెట్ను నిర్మించే పనులు చేపట్టాలని మేకర్స్ నిర్ణయించినట్లు సినీ వర్గాల నుంచి సమాచారం. కాగా అల్లుడు శీను సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయం అయిన బెల్లంకొండ శ్రీనివాస్కు ఇప్పటిదాకా ఒక్క పెద్ద హిట్ కూడా పడలేదు. దీంతో రీమేక్ చిత్రాలనే నమ్ముకొని సినిమాలు చేస్తున్నాడు. తమిళ రీమేక్ రాక్షసుడు అనంతరం ప్రస్తుతం బెల్లంకొండ చేస్తోన్న రీమేక్ చిత్రం ఛత్రపతి. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పానక్కర్లేదు. ఈ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న బెల్లంకొండ సరసన అనన్య పాండే నటిస్తున్నట్లు సమాచారం. చదవండి: ఛత్రపతి రీమేక్లో సాయి శ్రీనివాస్ -
పరిశ్రమలు పాతాళానికి!
న్యూఢిల్లీ: భారత పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ) 2020 జూన్లో భారీ క్షీణతను నమోదుచేసుకుంది. 2019 జూన్తో పోల్చుకుంటే, అసలు వృద్ధిలేకపోగా ఏకంగా మైనస్ 16.6 శాతం క్షీణతలోకి జారిపోయింది. తయారీ, మైనింగ్, విద్యుత్ ఉత్పత్తి రంగాలు తీవ్ర నిరాశను మిగిల్చాయి. మంగళవారం మంత్రిత్వశాఖ విడుదల చేసిన గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలను చూస్తే... ► మొత్తం సూచీలో దాదాపు 60 శాతంపైగా ప్రాతినిధ్యం వహించే తయారీ రంగంలో ఉత్పత్తి ఏకంగా 17.1% క్షీణతను నమోదుచేసుకుంది. ► మైనింగ్ రంగం మైనస్ 19.8 శాతం క్షీణ రేటును నమోదుచేసుకుంది ► ఇక విద్యుత్ ఉత్పత్తి మైనస్ 10 శాతం పడిపోయింది. ► రిఫ్రిజిరేటర్లు, స్పోర్ట్స్ పరికరాలు, బొమ్మలు వంటి కన్జూమర్ డ్యూరబుల్స్ ఏకంగా –35.5 శాతం క్షీణించాయి. ► త్వరిత వినియోగ వస్తువుల విభాగంలో (కన్జూమర్ నాన్ డ్యూరబుల్స్) మాత్రం 14 శాతం వృద్ధి నమోదుకావడం గమనార్హం. ► భారీ యంత్ర పరికరాలకు సంబంధించిన క్యాపిటల్ గూడ్స్ విభాగంలో ఈ క్షీణ రేటు ఏకంగా 36.9 శాతంగా ఉంది. ► మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ)లో 40 శాతంపైగా వెయిటేజ్ ఉన్న ఎనిమిది మౌలిక పరిశ్రమల గ్రూప్– జూన్లో (2019 జూన్తో పోల్చి) అసలు వృద్ధిలేకపోగా మైనస్ 15 శాతం క్షీణించింది. ఎనిమిది రంగాల్లో ఏడు – బొగ్గు (–15.5 శాతం), క్రూడ్ ఆయిల్ (–6 శాతం) , సహజ వాయువు (–12 శాతం), రిఫైనరీ ప్రొడక్టులు (–8.9 శాతం), స్టీల్ (–33.8 శాతం) , సిమెంట్ (–6.9 శాతం), విద్యుత్ (–11 శాతం) ఉత్పత్తి క్షీణ రేటును నమోదుచేసుకోవడం గమనార్హం. ఒక్క ఎరువుల రంగం మాత్రం వృద్ధి ధోరణిని కనబరచింది. నెలవారీగా మెరుగుపడిన ఇండెక్స్ కాగా, సాంప్రదాయకంగా గణాంకాలను వార్షికంగా పోల్చి చూసినా, కరోనా ప్రభావిత నెలల లెక్కలను అంతక్రితం లెక్కలతో పోల్చడం అంత సబబుకాదని గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ పేర్కొనడం గమనార్హం. వార్షికంగా క్షీణ రేట్లు కనబడినా, నెలవారీగా గణాంకాలు కొంత మెరుగుపడ్డం ఊరటనిచ్చే అంశం. ఏప్రిల్లో 53.6 వద్ద ఉన్న సూచీ, మేలో 89.5కు ఎగసింది. జూన్లో మరింతగా పెరిగి 107.8కి ఎగసింది. క్యూ1లో 35.9 శాతం క్షీణత ఇక ఏప్రిల్ నుంచి జూన్ మధ్య కాలంలో చూసినా కూడా పారిశ్రామిక ఉత్పత్తి మైనస్ 35.9 శాతం క్షీణతను నమోదు చేసుకుంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో 3 శాతం వృద్ధి నమోదయ్యింది. -
'దుబాయ్' భారం..!
ఎన్ని అవాంతరాలొచ్చినా ఐపీఎల్ సీజన్–13 జరగడం ఖాయమైంది. కరోనా కబళిస్తున్నా... భారత్–చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్నా, ఉన్నపళంగా భారీ ఆర్థిక నష్టం వాటిల్లినా లీగ్ నిర్వహణకే బీసీసీఐ మొగ్గు చూపింది. నిర్వహణపై అమితాసక్తితో ఎదురు చూసిన ఫ్రాంచైజీలకు యూఏఈలో టోర్నీ జరగడం మొత్తం ఆర్థికంగా నష్టపరిచే అంశం. వారి ఆదాయంపై పెద్ద ఎత్తున దెబ్బ పడనుంది. అయితే పూర్తిగా లీగ్ రద్దు కావడంతో పోలిస్తే ఎంతో కొంత ఆదాయం రానుండటం ఊరట కలిగించే అంశం. సాక్షి క్రీడా విభాగం: ఐదేళ్లకు ఏకంగా రూ. 2199 కోట్ల భారీ డీల్... సాలీనా రూ. 440 కోట్ల చెల్లింపులు... ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్షిప్ కోసం వివో 2017లో చేసుకున్న ఒప్పందం ఇది. ఐపీఎల్ రెవిన్యూ షేరింగ్ అగ్రిమెంట్లో ఫ్రాంచైజీలకు టైటిల్ స్పాన్సర్షిప్ అనేది కీలక ఆదాయ వనరు. మొత్తం టైటిల్ స్పాన్సర్షిప్లో సగభాగం (దాదాపు 1000 కోట్లు) లీగ్లోని 8 ఫ్రాంచైజీలకు అందజేస్తారు. అంటే ఏడాదికి రూ. 20 కోట్లకు పైగానే ఫ్రాంచైజీలు ఆర్జిస్తున్నాయి. రాజకీయ కారణాలతో చైనా మూలాలున్న వివో తప్పుకోవడంతో ఆ ప్రభావం ఫ్రాంచైజీలపై పడనుంది. ప్రస్తుత ఆర్థిక మాంద్య పరిస్థితుల్లో ‘వివో’ ఇచ్చే మొత్తాన్నే ఇవ్వగల కొత్త స్పాన్సర్ దొరకడం కష్టమే. మరోవైపు ప్రేక్షకులు లేకుండా మ్యాచ్లు నిర్వహిస్తుండటంతో టిక్కెట్ల విక్రయం ద్వారా లభించే గేట్ రెవెన్యూ కూడా ఫ్రాంచైజీలు కోల్పోనున్నాయి. మీడియా హక్కులే ఆలంబన... ప్రస్తుతం ఫ్రాంచైజీల్ని లీగ్ నిర్వహణ వైపు నడిపిస్తోన్న ఆదాయ వనరు మీడియా హక్కులు. ఈ హక్కుల్ని స్టార్ ఇండియా యాజమాన్యం 2017లో రికార్డు మొత్తానికి సొంతం చేసుకుంది. ఐదేళ్ల కాలానికి రూ. 16,347 కోట్లతో ఈ ఒప్పందం కుదిరింది. క్రికెట్ మీడియా హక్కుల ఒప్పందంలో చరిత్ర సృష్టించిన ఈ భారీ డీల్తో ఫ్రాంచైజీలు ఏటా రూ. 150 కోట్లు ఆర్జిస్తున్నాయి. ఈ మీడియా హక్కుల ఫలితంగా ప్రతి సీజన్కు రూ. 50 కోట్లు లాభం ఉంటుందని అంచనా. ఇతర ఆదాయ మార్గాల్లోనూ కోత! మీడియా హక్కులతో పాటు కిట్, జెర్సీ, హెల్మెట్లకు వేరు వేరు సంస్థలు స్పాన్సర్లుగా వ్యవహరిస్తుంటాయి. వీటి ద్వారా ఫ్రాంచైజీలు సీజన్కు రూ. 45–50 కోట్లు ఆర్జిస్తున్నాయి. అయితే గత సీజన్లో ఒక జట్టుకు రూ. 33 కోట్లు ఆదాయాన్ని సమకూర్చిన ఒక ప్రధాన స్పాన్సర్... ఈ సారి అంత మొత్తం ఇవ్వలేమంటూ సంప్రదింపులకు దిగింది. మిగతా జట్లకూ ఇదే అనుభవం ఎదురయ్యే అవకాశం లేకపోలేదు. కరోనా కారణంగా ఈ సారి ఈ ఆదాయంలో కూడా గండిపడే అవకాశముంది. ఖర్చులు అదనం యూఏఈలో జరిగే టోర్నీ కోసం ఆటగాళ్ల భద్రత దృష్ట్యా చార్టెడ్ ఫ్లయిట్స్ను ఫ్రాంచైజీలు వినియోగించనున్నాయి. లీగ్ జరిగినన్ని రోజులు ఆటగాళ్ల వసతి, వారుండే హోటళ్లలో బయో సెక్యూర్ పరిస్థితుల ఏర్పాటు, రవాణా వీటన్నింటికి భారీగా ఖర్చయ్యే అవకాశముంది. వీటి కోసమే దాదాపు రూ. 10–12 కోట్లు ఖర్చయ్యే అవకాశముందని ఫ్రాంచైజీలు పేర్కొన్నాయి. భారత్లో ఖర్చుతో పోలిస్తే ఇది 50–60 శాతం అదనం. మరో వైపు టికెట్లు అమ్మకపోవడం ద్వారా తాము కోల్పోయే ‘గేట్ రెవెన్యూ’కు నష్టపరిహారం చెల్లించాలంటూ ఫ్రాంచైజీలు చేసిన విజ్ఞప్తిని బీసీసీఐ నిర్ద్వద్వంగా తిరస్కరించింది. అదే విధంగా ఈ ఏడాది మ్యాచ్లు జరగకపోయినా దేశంలో ఎనిమిది ఐపీఎల్ జట్లకు కేంద్రాలుగా ఉన్న రాష్ట్ర సంఘాలకు ప్రతీ ఏటా ఒక్కో ఫ్రాంచైజీ చెల్లించే రూ. 8 కోట్లు (మొత్తం రూ. 64 కోట్లు) కూడా ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ మొత్తాన్ని దిగువ స్థాయి క్రికెట్ను ప్రోత్సహిస్తేందుకు ఉపయోగిస్తామని, ఈ డబ్బు లేకపోతే ఆయా సంఘాల్లో క్రికెట్ దెబ్బ తింటుందని బోర్డు అభిప్రాయ పడింది. -
విజన్ ఫండ్ సీఈఓకు రెట్టింపు వేతనం
ముంబై: జపాన్ దిగ్గజ సంస్థ సాఫ్ట్ బ్యాంక్ గ్రూప్కు చెందిన విజన్ ఫండ్ తీవ్ర నష్టాలను చవిచూస్తుంది. ప్రస్తుతం విజన్ ఫండ్ రూ.1700 కోట్ల నష్టాలను ఎదుర్కొంటుంది. ఈ సంక్షోభ సమయంలో విజన్ ఫండ్ సీఈఓ రాజీవ్ మిశ్రాకు రెట్టింపు వేతనాన్ని(కోటి యాబై లక్షల డాలర్లు) పెంచడం పట్ల మార్కెట్ నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే విజన్ ఫండ్ పది శాతం ఉద్యోగులకు ఉద్వాసన పలకనుందన్న ఊహాగానాల నేపథ్యంలో రాజీవ్ మిశ్రాకు రెట్టింపు వేతనం పెంచడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం టోక్యో, కాలిఫోర్నియాలో విజన్ ఫండ్ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తుంది. తాజాగా సాప్ట్ బ్యాంక్ తిరిగి పుంజుకోవడానికి అక్షయ్ నహేతా సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా, సీనియర్ అడ్వైజర్గా కెంటారోను నియమించుకోనున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. సీఈఓ వేతన పెంపుకు సంబంధించి కారణాలను మాత్రం కంపెనీ వెల్లడించలేదు. -
లాక్డౌన్ ఎఫెక్ట్ : నష్టం ఎంతంటే..
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి కట్టడికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన 21 రోజుల లాక్డౌన్ దేశ ఆర్థిక వ్యవస్ధపై పెనుప్రభావం చూపింది. ఫ్యాక్టరీలు, వ్యాపారాల మూతతో పాటు.. థియేటర్లు, మాల్స్, షాపుల షట్డౌన్.. విమానాలు, రైళ్లు సహా రవాణా నిలిచిపోవడంతో ఆర్థిక కార్యకలాపాలకు బ్రేక్ పడి పెద్దమొత్తంలో లావాదేవీలు స్తంభించాయి. ప్రపంచంలోనే అతిపెద్ద లాక్డౌన్తో ఈ మూడువారాల్లో భారత ఆర్థిక వ్యవస్థ రూ 7లక్షల కోట్ల నుంచి రూ 8 లక్షల కోట్లను కోల్పోయింది. కరోనా కట్టడికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన మేరకు మార్చి 25 నుంచి అమల్లోకి వచ్చిన లాక్డౌన్తో నిత్యావసరాల సరఫరా మినహా 70 శాతం మేర ఆర్థిక, వాణిజ్య కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకుంటున్న తరుణంలో మహమ్మారి ఎకానమీపై విరుచుకుపడిందని విశ్లేషకులు, పరిశ్రమ సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. దేశవ్యాప్త లాక్డౌన్తో ఆర్థిక వ్యవస్థకు రూ 8 లక్షల కోట్ల వరకూ నష్టం వాటిల్లిందని సెంట్రమ్ ఇనిస్టిట్యూషనల్ రీసెర్చి అంచనా వేసింది. లాక్డౌన్తో రోజుకు రూ 35,000 కోట్లకు పైగా నష్టమని, 21 రోజులకు రూ 7.5 లక్షల కోట్ల నష్టం తప్పదని ఎక్యూట్ రేటింగ్స్ అండ్ రీసెర్చ్ లిమిటెడ్ ఇప్పటికే వెల్లడించింది. చదవండి : లాక్డౌన్ పక్కాగా అమలు చేస్తే ఇలాగే ఉంటది! కోవిడ్-19 వ్యాప్తితో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ నిర్వీర్యం కావడంతో పాటు భారత్లోని పలు ప్రాంతాల్లో మార్చి తొలివారం నుంచే పాక్షిక షట్డౌన్, మార్చి 25 తర్వాత దేశమంతటా లాక్డౌన్ అమలు అనివార్యమైందని ఆ సంస్థ పేర్కొంది. లాక్డౌన్ పొడిగించిన పక్షంలో ఆర్థిక వ్యవస్థ భారీగా దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా మహమ్మారి వ్యాప్తి, లాక్డౌన్ ప్రభావంతో రవాణా, హోటల్, రెస్టారెంట్, రియల్ఎస్టేట్, వినోద రంగం సహా పలు రంగాలు తీవ్రంగా దెబ్బతింటాయని పేర్కొంది. ఇక లాక్డౌన్తో దేశవ్యాప్తంగా ట్రక్కులు నిలిచిపోవడంతో ట్రక్కు రవాణా రంగానికి 15 రోజుల లాక్డౌన్తో రూ 35,200 కోట్ల నష్టం వాటిల్లిందని ఏఐఎంటీసీ ప్రధాన కార్యదర్శి నవీన్ గుప్తా వెల్లడించారు. మరోవైపు లాక్డౌన్తో నిర్మాణ రంగం కుదేలైందని, మహమ్మారి ప్రభావంతో కొనుగోలుదారుల సెంటిమెంట్ దెబ్బతినడం..కొనుగోళ్లు నిలిచిపోవడంతో రియల్ఎస్టేట్ రంగానికి రూ లక్ష కోట్ల నష్టం ఎదురైందని జాతీయ రియల్ఎస్టేట్ అభివృద్ధి మండలి అధ్యక్షలు నిరంజన్ హిరనందాని వెల్లడించారు. లాక్డౌన్తో రిటైల్ రంగానికి రూ 30,000 కోట్ల పైగా నష్టం వాటిల్లిందని అఖిలభారత వర్తక సమాఖ్య అంచనా వేసింది. మరోవైపు ప్రజల ప్రాణాలతో పాటు ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడం రెండూ కీలకమైనవని ప్రధాని పేర్కొనడంతో మంగళవారం ఉదయం జాతిని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ చేసే ప్రసంగంపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. లాక్డౌన్ కొనసాగింపు విధివిధానాలు, మినహాయింపులపై ఎలాంటి ప్రకటన చేస్తారనేది ఉత్కంఠ రేపుతోంది. మరోవైపు పేదలు, వలస కూలీల ప్రయోజనాలు కాపాడుతూనే లాక్డౌన్ పొడిగింపుపై నిర్ణయం ఉంటుందని భావిస్తున్నారు. చిన్నమధ్యతరహా పరిశ్రమల కార్యకలాపాలకూ మినహాయింపు ఇస్తారని చెబుతున్నారు. -
కడగండ్లు మిగిల్చిన అకాల వర్షం
సాక్షి, నెట్వర్క్: రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో గురువారం కురిసిన అకాల వర్షాలు రైతులను తీవ్రంగా దెబ్బతీశాయి. కోత కు వచ్చిన వరి పైర్లు నేలకొరిగాయి. కొన్ని చోట్ల మామిడి తోట లకు నష్టం వాటిల్లింది. ఇతర పంటలు కూడా దెబ్బతిన్నాయి. ► ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాల్వంచ, అన్నపురెడ్డిపల్లి, ములకలపల్లి, దమ్మపేట, అశ్వారావుపేట, మణుగూరు, అశ్వాపురం, సత్తుపల్లి మండలాల్లో కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తో పాటు కల్లాల్లోని మిర్చి, మొక్కజొన్న పంట తడిసిపోయిం ది. కొన్నిచోట్ల మామిడి కాయలు నేలరాలాయి. ► సిద్దిపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. కొమురవెళ్లి మండలంలో వడగళ్లు పడ్డాయి. నంగునూరులో ధాన్యం నేలరాలింది. గజ్వేల్ మండలంలో వరి, మామిడితోటలకు నష్టం జరిగింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నష్టం అపారం యాదాద్రి భువనగిరి జిల్లాలో రాజాపేట, తుర్కపల్లి మండలాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షానికి తీవ్ర నష్టం వాటిల్లిం ది. రాజాపేట మండలంలో మామిడి తోటలు దెబ్బతినగా తు ర్కపల్లి మండలంలో మామిడి తోటలతో పాటు వరికి తీరని నష్టం వాటిల్లింది. విద్యుత్æ స్తంభాలు కూలిపోవడంతో కరెంట్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. గాలులకు పలు చోట్ల ఇళ్ల పైకప్పులు ఎగిరి పడ్డాయి. చెట్లు కూలిపోయాయి. కోతకు వచ్చి న వరి పంట 2,963 ఎకరాల్లో పూర్తిగా ధ్వంసమైంది. నిమ్మ, మామిడి, కూరగాయల తోటలు దెబ్బతిన్నాయి. ఇక నల్లగొండ జిల్లా చింతపల్లి మండలంలో వడగండ్లతో కూడిన వర్షం కురవడంతో చేతికొచ్చిన వరిపైరు పూర్తిగా నేలపాలైంది. చింతపల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో వసతులు లేకపోవడంతో ధాన్యం నీటిపాలైంది. అలాగే వింజమూరు, వర్కాల గ్రామాల్లో వరి పైరుకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఉమ్మడి పాలమూరులో భారీ నష్టం.. : మహబూబ్నగర్ జిల్లాలోని చిన్నచింతకుంట, మూసాపేట, అడ్డాకుల, రాజాపూర్, మహబూబ్నగర్ రూరల్, బాలానగర్ మండలాల్లో దాదాపు వెయ్యి ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లిందని అంచనా. వనపర్తి జిల్లాలో రెండు గంటల పాటు భారీ వర్షం కురవడంతో పంటలకు పెద్ద ఎత్తున నష్టం జరిగింది. కొత్తకోట, వనపర్తి, పెద్దమందడి మం డలాల్లో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోయింది. శుక్రవారం ఉద్యాన, వ్యవసాయ శాఖ అధికారులు నష్టం వివరాల ను అంచనా వేయనున్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ మం డలంలోని ఖానాపూర్, పంచలింగాల, కర్ని, రుద్రసముద్రం, కాట్రెవ్పల్లి, మక్తల్ గ్రామాల్లో వెయ్యి ఎకరాల్లో పంట నేల వాలింది. నర్వ మండలం కొత్తపల్లి, జక్కన్నపల్లి, రాయికోడ్, నర్వ, యాంకి గ్రామాల్లో వడ్లు రాలిపోగా.. మామిడి తోటలు దెబ్బతిన్నాయి. జోగుళాంబ గద్వాల జిల్లా చింతరేవుల, నర్సన్దొడ్డి, రేవులపల్లి, ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో వడగండ్ల వానతో పండ్ల తోటలు దెబ్బతిన్నాయి. గ్రేటర్ హైదరాబాద్లో పలు చోట్ల భారీ వర్షం ఉపరితల ద్రోణి ప్రభావంతో గురువారం గ్రేటర్ హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. సాయంత్రం వేళ కురిసిన వర్షానికి పలు ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాల్లో వరదనీరు పోటెత్తింది. తూర్పు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని.. తూర్పు విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోందని బేగంపేట్లోని వాతావరణ శాఖ తెలిపింది. రాగల 24 గంటల్లో నగరంలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షం కురిసే అవకాశాలున్నట్లు ప్రకటించింది. కాగా అత్యధికంగా బొల్లారంలో 3.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. క్యాంప్ ఆఫీస్పై పిడుగు.. దేవరకొండ ఎమ్మెల్యేకు తప్పిన ముప్పు నల్లగొండ జిల్లా దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రనాయక్ క్యాంప్ కార్యాలయం పెంట్హౌస్æ ప్రహరీపై గురువారం పిడుగుపడింది. పిడుగుపాటుకు క్యాంప్ కార్యాలయం పెంట్హౌస్ ప్రహరీ గోడ పాక్షికంగా దెబ్బతిన్నది. ఆ సమయంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కుటుంబసభ్యులతో కలసి భోజనం చేస్తున్నారు. ఎమ్మెల్యే, ఆయన కుటుంబసభ్యులు సురక్షితంగా ఉండటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
పసుపు రైతులపై కరోనా ఎఫెక్ట్
-
వంద రోజుల్లో రూ 12.5 లక్షల కోట్లు ఆవిరి..
ముంబై : నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన తొలి వంద రోజుల్లో రూ 12.5 లక్షల కోట్ల మదుపరుల సంపద ఆవిరైంది. మే 30 నుంచి బీఎస్ఈ సెన్సెక్స్ ఆరు శాతం (2357 పాయింట్లు), ఎన్ఎస్ఈ నిఫ్టీ ఏడు శాతం (858 పాయింట్లు) కోల్పోవడంతో ఇన్వెస్టర్ల సంపద భారీగా హరించుకుపోయింది. మోదీ ప్రభుత్వం రెండోసారి పాలనా పగ్గాలు చేపట్టే ముందు రోజు బీఎస్ఈలో లిస్టయిన కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ 1,53,62,936 కోట్లు కాగా, సోమవారం మార్కెట్ ముగిసిన సమయానికి దాని విలువ రూ 1,41,15,316 కోట్లకు పడిపోయింది. ఆర్థిక మందగమనం, విదేశీ నిధులు వెనక్కిమళ్లడం, కార్పొరేట్ ఫలితాలు సానుకూలంగా లేకపోవడం వంటి అంశాలు స్టాక్ మార్కెట్ల పతనానికి కారణమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా విదేశీ మదుపరులు మార్కెట్ నుంచి పెట్టుబడులను వెనక్కితీసుకుంటుండటంతో ఈక్విటీ మార్కెట్లు డీలా పడుతున్నాయని చెబుతున్నారు. మోదీ సర్కార్ తిరిగి అధికారం చేపట్టిన అనంతరం ఇప్పటివరకూ విదేశీ మదుపరులు రూ 28,260 కోట్ల విలువైన షేర్లను విక్రయించారని ఎన్ఎస్డీఎల్ డేటా వెల్లడించింది. 2018 ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో లాంగ్టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పన్ను విధించడంతో పాటు, డివిడెండ్ పంపిణీ పన్ను పొందుపరచడంతో అప్పటినుంచే మార్కెట్లో స్లోడౌన్ ప్రారంభమైందని ఐడీబీఐ క్యాపిటల్ రీసెర్చ్ హెడ్ ఏకే ప్రభాకర్ చెప్పుకొచ్చారు. -
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
-
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
ముంబై : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసంలో జీడీపీ వృద్ధి ఐదు శాతానికి పరిమితమైందనే గణాంకాలతో స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. జీడీపీ వృద్ధి రేటుతో పాటు అమెరికా-చైనా ట్రేడ్వార్ భయాలు మార్కెట్ సెంటిమెంట్ను ప్రభావితం చేశాయి. ఆర్థిక మందగమనాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం పలు చర్యలు ప్రకటించినా మదుపుదారులు కొనుగోళ్లకు దూరంగా ఉన్నారు. అన్ని రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడి నెలకొనడంతో బీఎస్ఈ సెన్సెక్స్ 460 పాయింట్ల నష్టంతో 36,872 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 143 పాయింట్ల నష్టంతో 10,879 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. -
అకాల వర్షాలు : ప్రధాని తీరుపై విపక్షం ఫైర్
సాక్షి, న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్, రాజస్ధాన్, గుజరాత్, మహారాష్ట్రలో రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలులతో 34 మంది మరణించారు. అకాల వర్షాలు నాలుగు రాష్ట్రాలను ముంచెత్తడంతో భారీ నష్టం వాటిల్లింది. మధ్యప్రదేశ్లోని పలు జిల్లాల్లో భారీ వర్షంతో 11 మంది మృత్యువాతన పడ్డారు. ఖర్గోనే జిల్లాలో ఈదురుగాలులు, భారీ వర్షాలకు వందలాది ఇళ్లు నీటమునిగాయి. జముదిర్ సర్వార్ గ్రామంలో పిడుగుపాటుతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు. ఇక గుజరాత్లో భారీ వర్షాలు, పిడుగుపాటుకు 9 మంది మరణించారు. మెహసనా, బనస్కంత, సబర్కంత ప్రాంతాల్లో భారీ వర్షాలతో భారీగా పంట నష్టం వాటిల్లింది. మరోవైపు మహారాష్ట్రలో భారీ వర్షాలు, పిడుగుపాటు కారణంగా ఏడుగురు వ్యక్తులు మరణించారు. నాసిక్, పుణేలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం జనజీవనాన్ని అస్తవ్యస్థం చేసింది. రాజస్ధాన్లో భారీ వర్షాలకు ఏడుగురు వ్యక్తులు మరణించారు. అకాల వర్షాలతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లడంతో పాటు పెద్దసంఖ్యలో మట్టిఇళ్లు దెబ్బతిన్నాయి. మోదీపై భగ్గుమన్న కాంగ్రెస్ గుజరాత్లో భారీ వర్షాలతో ఆస్తి, ప్రాణ, పంట నష్టం వాటిల్లడంపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. అకాల వర్షాలతో మరణించిన వారి కుటుంబ సభ్యులకు ప్రధాని సహాయ నిధి నుంచి రూ 2 లక్షల ఎక్స్గ్రేషియాను ప్రధాని కార్యాలయం ప్రకటించింది. కాగా గుజరాత్ సహా నాలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలతో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవిస్తే ప్రధాని కేవలం గుజరాత్నే ప్రస్తావించడం పట్ల విపక్ష కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. గుజరాత్లో భారీ వర్షాలతో వాటిల్లిన నష్టంపై ప్రధాని దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం సంతోషమే..కానీ కాంగ్రెస్ పాలిత మధ్యప్రదేశ్లోనూ అకాల వర్షాలతో ప్రాణ నష్టం జరిగిందని, ఇక్కడ బీజేపీ అధికారంలో లేకపోయినా తమ రాష్ట్రంలో అకాల వర్ష బాధితులకు కూడా ప్రధాని సంతాపం తెలపాలని ఆ రాష్ట్ర సీఎం కమల్ నాధ్ ట్వీట్ చేశారు. మధ్యప్రదేశ్లో బాధితులకు ఎలాంటి సాయం చేయని ప్రదాని గుజరాత్ పట్ల పక్షపాతం చూపారని కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ ఆక్షేపించారు. -
సంపద కోల్పోవడంలోనూ ప్రపంచ కుబేరుడి అరుదైన రికార్డు
ముంబై : అంతర్జాతీయ మార్కెట్లు ముఖ్యంగా అమెరికా మార్కెట్లు భారీగా పతనమవడంతో ప్రపంచ కుబేరుడు, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ భారీగా సంపద కోల్పోయారు. గడిచిన రెండు రోజులుగా ఆయన 19.2 బిలియన్ డాలర్లు(సుమారు 1.40 లక్షల కోట్ల రూపాయలు) నష్టపోయారని బ్లూమ్బర్గ్ నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది జూలైలో ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్బర్గ్ 16.5 బిలియన్ డాలర్లు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సంపద కోల్పోవడంలోనూ జెఫ్ బెజోస్ కొత్త రికార్డు సృష్టించారని నివేదిక పేర్కొంది. సోమవారం నాడు అమెరికా మార్కెట్ సూచీ భారీగా కుదుపులకు లోనవడంతో అమెజాన్ షేర్లు 6.3 శాతం మేర పడిపోయాయి. కాగా అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదం ముదురుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ ఆర్థికవ్యవస్థ వృద్ధి అంచనాలను ప్రపంచ ఆర్థిక సంస్థ కుదించింది. ఈ రెండు దేశాలూ వచ్చే ఏడాదిలో వాణిజ్య వివాద ప్రభావాలను చవి చూడాల్సి వస్తుందని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గత నెల రోజులుగా ప్రపంచంలోని 500 మంది టాప్ బిలియనీర్లు భారీగా సంపద కోల్పోతున్నారని బ్లూమ్బర్గ్ వెల్లడించింది. ఈ ర్యాంకింగ్లో జెఫ్ బెజోస్ మొదటి స్థానంలో కొనసాగుతుండగా.. మెక్సికన్ టెలికాం టైకూన్ కార్లస్ స్లిమ్ 2.5 బిలియన్ డాలర్ల సంపద కోల్పోయి రెండో స్థానాన్ని ఆక్రమించారు. -
తెలంగాణలో వర్షాలతో రైతులకు భారీ నష్టం
-
థియేటర్ల బంద్తో తీవ్రంగా నష్టపోతున్నాం
-
మిస్సైల్ ఎఫెక్ట్: మార్కెట్లు ఢమాల్
ముంబై:అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక వాతావరణం దేశీయ మార్కెట్లను ప్రభావితం చేసింది. ఆరంభంనుంచి బలహీనంగా మార్కెట్లలో ఎక్కడా కోలుకున్న ధోరణి కనిపించలేదు. తీవ్రమైన అమ్మకాల ఒత్తిడి కారణంగా భారీ పతనాన్ని నమోదు చేశాయి. సెన్సెక్స్ 363 పతనమై, 31387వద్ద నిఫ్టీ ,121 పాయింట్లు క్షీణించి 9782 వద్ద చేరింది. దీంతో ప్రధాన సూచీలు రెండూ కీలక మద్దతు స్థాయిలకు దిగువకు చేరాయి. ముఖ్యంగా జపాన్ మీదుగా ఉత్తర కొరియా మిస్సైల్ ప్రయోగంతో యూరప్ మార్కెట్లు నష్టాలతో మొదలయ్యాయి. దీంతో ఆసియా మార్కెట్లు, దేశీయ మార్కెట్లు ఢమాల్ అన్నాయి. దాదాపు అన్ని రంగాలూ నీరసించగా ఐటీ, బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, ఫార్మా నష్టపోతున్నాయి. ముఖ్యంగా ఎన్టీపీసీ టాప్ లూజర్గా ఉంది. అలాగే హెచ్డీఎఫ్సీ, హెచ్సీఎల్ టెక్, టాటా పవర్, కోల్ ఇండియా, టాటా మోటార్స్ డీవీఆర్, అదానీ పోర్ట్స్, ఇన్ఫ్రాటెల్, ఐబీహౌసింగ్, సన్ ఫార్మా 3-1.5 శాతం కుప్పకూలగా బీపీసీఎల్, డాక్టర్ రెడ్డీస్ మాత్రమే స్వల్ప లాభాలతో ఉన్నాయి. -
బ్యాంకుల దెబ్బ..5వ రోజూ భారీ నష్టాలే
ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు వరుసగా ఐదో రోజు కూడా భారీ నష్టాలతోనే ముగిశాయి. మరోవైపు యూరప్సహా ఆసియా మార్కెట్లన్నీ నెగిటివ్గా ఉండగంతో దేశీయంగానూ దాని ప్రభావం కనిపించింది. ఆరంభంనుంచీ భారీ అమ్మకాల ఒత్తిడితో భారీ పతనాన్ని నమోదు చేసిన మార్కెట్లు చివరలో రీ బౌండ్ అయ్యాయి. చివరికి సెన్సెక్స్ 318పాయింట్లు పతనమై 31,213 కు చేరగా.. నిఫ్టీ 109 పాయింట్లు పడిపోయి 9,710 వద్ద ముగిసింది. ఒక దశలో సెన్సెక్స్ 400 పాయింట్లకు పైగా కోల్పోగా,నిఫ్టీ సాంకేతికంగా కీలకమైన 9,700 స్థాయి కిందికి దిగజారినా ఆఖరి అర్ధగంటలో పుల్ బ్యాక్ ర్యాలీ వచ్చింది. దీంతో వారాంతంలో కోలుకోవడం విశేషం. అయితే ఎనలిస్టులు మాత్రం అప్రమత్తతను వ్యక్తం చేస్తున్నారు. దాదాపు అన్ని రంగాల్లోనూ అమ్మకాల ఒత్తిడి కొనసాగగా ప్రభుత్వ బ్యాంకులు మరింత కుదేలయ్యాయి. దీంతో పీఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ 5 శాతం మెటల్, ఆటో, రియల్టీ రంగాలు పతనమయ్యాయి. ఫలితాల దెబ్బతో బాష్, ఎస్బీఐ, టీవీఎస్ మోటార్ నష్టపోగా, హిందాల్కో, వేదాంతా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎంఅండ్ఎం, ఎల్ అండ్ టీ, ఓఎన్జీసీ, ఆర్ఐఎల్, హెచ్యూఎల్, ఐషర్, టీసీఎస్ షేర్లలో అమ్మకాల తీవ్రత కొనసాగింది. డాక్టర్ రెడ్డీస్, బీపీసీఎల్, అరబిందో, ఇన్ఫోసిస్, గెయిల్, విప్రో, పవర్గ్రిడ్, అల్ట్రాటెక్ లాభపడిన వాటిల్లోఉన్నాయి. అటు డాలర్ మారకంలో రుపీ మరింత పతనమైంది. 0.13 పైసల నష్టపోయి రూ. 64.21 వద్ద ఉండగా, ఎంసీఎక్స్ మార్కెట్ లో పుత్తడి పది గ్రా. రూ.87 ఎగిసి రూ. 29, 263 వద్ద ఉంది. -
రైతు కంట్లో కారం
ఒక్కో ఎకరాకు లక్ష దాకా నష్టపోయిన మిర్చి రైతు ► అన్ని పెట్టుబడులతో కలిపి ఎకరానికి రూ.1.60 లక్షలు ఖర్చు ► ఎకరానికి సగటున 25 క్వింటాళ్ల దిగుబడి.. క్వింటాకు 4 వేల ధర ► ఈ లెక్కన పెట్టుబడిలోనే రూ.60 వేల నష్టం.. రైతు దంపతుల కష్టాన్నీ కలిపితే రూ.లక్ష పైనే.. ► రాష్ట్రవ్యాప్తంగా మిర్చి రైతుల నష్టం రూ.2 వేల కోట్ల కన్నా ఎక్కువే.. ► ధర దగాతో నిండా మునిగిన రైతన్న బొల్లం శ్రీనివాస్, సాక్షి, ఖమ్మం: ఆరుగాలం చేసిన కాయకష్టానికి నష్టమే మిగిలింది. ఎండనక.. వాననక.. పగలనక.. రేయనక మిర్చి పంట సాగు చేసిన రైతన్నకు నష్టాలు తప్ప చేతిలో చిల్లి గవ్వ మిగల్లేదు. దిగుబడి ఆశించినంతగా వచ్చినా.. మార్కెట్ మాయాజాలంతో నిండా మునిగారు. గత ఏడాది ధరను చూసి ఈసారి రాష్ట్రంలో రైతులు 2.61 లక్షల ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో ఎన్నడూ లేనంతగా మిర్చి విస్తీర్ణం పెరి గింది. పంట చేతికొచ్చాక తీరా ధరలు పతనం కావడంతో రైతు కంట్లో కారం పడినట్లయింది. పంట సాగు చేసిన రైతు ఎకరానికి కనీసం రూ.60 వేల చొప్పున నష్టపోయాడు. రైతు కష్టాన్నీ లెక్కలోకి తీసుకుంటే ఇది రూ.లక్షపైనే ఉంటుంది! పెట్టుబడి కూడా దక్కలేదు.. పత్తి సాగు చేయవద్దని ప్రభుత్వం ప్రకటిం చడంతో రైతులు మిర్చి వైపు మొగ్గుచూపారు. గతంతో పోలిస్తే ఈ ఖరీఫ్లో మిర్చి సాగు ఎక్కువగా అయింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 85 వేల ఎకరాలు, ఉమ్మడి వరంగల్ జిల్లాలో సుమారు 60 వేల ఎకరాల్లో ఈ పంటను సాగు చేశారు. వాతావరణం అనుకూలించడం, చీడపీడలు లేకపోవడంతో ఎకరానికి 25 నుంచి 30 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. గతంలో మాదిరిగా ధర బాగానే ఉంటుందని రైతులు ఆశించారు. ఫిబ్రవరిలో మిర్చి కోత ప్రారంభంలో ధర రూ.10 వేల దాకా ఉండటంతో ఈ ధర చివరి వరకు ఉంటుందని అనుకున్నారు. తీరా అందులో సగం ధర కూడా దక్కకలేదు. ఎకరాకు రూ.1.60 లక్షల పెట్టుబడి పెట్టారు. సగటున 25 క్వింటాళ్ల దిగుబడికి.. గతంలో ఉన్న ధర(రూ.10 వేలు)ను బట్టి చూస్తే పంట అమ్మినందుకు రూ.2.50 లక్షలు రైతుకు దక్కాలి. రైతు శ్రమను మినహాయిస్తే సుమారు రూ.లక్ష వరకు మిగలాలి. కానీ ధర అమాంతం తగ్గడంతో క్వింటాల్కు సగటున రూ.4 వేలే దక్కాయి. అంటే రైతు ఎకరాకు రూ.1.60 లక్షలు ఖర్చు చేస్తే చివరికి దక్కింది రూ.లక్ష. అంటే రూ.60 వేల నష్టం! రైతు దంపతుల శ్రమ విలువతో కలిపి చూస్తే ఈ మొత్తం రూ.లక్షకు పైనే!! పంటను చేలపైనే వదిలేసి.. ధర లేక.. సాగు ఖర్చు కూడా రావడం లేదని భావించిన రైతులు ఒకట్రెండు కోతలు తీసిన తర్వాత మిగిలిన పంటను చేలపైనే వదిలేశారు. రూ.150 నుంచి రూ.200 కూలీ ఇస్తే పొద్దంతా మిర్చి ఏరేవారు. ఈసారి కూలీల కొరత ఏర్పడడంతో కొందరు రైతులు గ్రూపుగా ఏర్పడి ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా నుంచి రవాణా ఖర్చులు భరించి కూలీలను తెచ్చారు. కేజీకి రూ.15 నుంచి రూ.20 వరకు ఇవ్వాలని కూలీలు డిమాండ్ చేయడంతో విధి లేని పరిస్థితుల్లో రైతులు ఆ మేరకు చెల్లించారు. మొదటి, రెండు కోతల తర్వాత ధర అమాంతం రూ.2,500, రూ.3 వేలకు పడిపోవడంతో కూలీ, రవాణా ఖర్చు కూడా గిట్టదని పంటను రైతులు చేలపైనే వదిలారు. ఆగిన శుభకార్యాలు.. మిర్చి ధర అమాంతం పడిపోవడంతో రైతు కుటుంబాల్లో శుభకార్యాలు నిలిచిపోయాయి. దిక్కులేని పరిస్థితుల్లో పంటను తక్కువ ధరకు అమ్ముకోవడంతో చేతిలో డబ్బులు లేక రైతులు తమ పిల్లల పెళ్లిళ్లను వాయిదా వేసుకున్నారు. కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. సాగు ఖర్చుతోపాటు ఎకరానికి రూ.25 వేలు కౌలు చెల్లించి చివరికి ధర రాక.. వారంతా కుదేలయ్యారు. దుక్కి నుంచి మార్కెట్ దాకా.. మిర్చి వేసేందుకు దుక్కి నుంచి మార్కెట్కు తరలించే వరకు.. సాగు, రవాణా ఖర్చులతో సహా ఎకరానికి రూ.1.60 లక్షల ఖర్చవుతుంది. రైతు దంపతుల కష్టాన్ని లెక్కలోకి తీసుకుంటే ఇది మరింతగా పెరుగుతుంది. ఎకరాకు ఖర్చుల వివరాలివీ..(రూ.లలో..) దుక్కి దున్నితే 8,500 15 ప్యాకెట్ల విత్తనాలు, నారు పెంపకం 6,500 సూపర్, పొటాష్, డీఏపీ, రిజెంట్ గుళికలు 6,500 తోట వేసిన తర్వాత అరక పాట్లు 6, 7 సార్లు 10,000 చీడ పీడల నివారణకు మందుల పిచికారికి 40,000 మిర్చి పంట ఎదుగుదలకు రసాయన ఎరువులు 8,500 మిర్చి ఏరేందుకు కూలీల ఖర్చు 70,000 బస్తాల్లో తొక్కి మార్కెట్కి తరలించేందుకు 10,000 మొత్తం ఖర్చు 1,60,000 రైతుల అభిప్రాయాలు.. బిడ్డ పెళ్లి వాయిదా వేసుకున్నా – భూక్యా ఖాసీరామ్, మేకలతండా, కారేపల్లి మండలం మిర్చి వేసి నష్టపోయా. బిడ్డ పెళ్లి వాయిదా వేసుకున్న. రూ.20 వేల చొప్పున 4 ఎకరాలను రూ.80 వేలకు కౌలుకు తీసుకొని పంట సాగు చేసిన. పెట్టుబడికి రూ.2.40 లక్షలు, మిర్చి ఏరిస్తే కూలీలకు రూ.1.50 లక్షలను అప్పు తెచ్చి పెట్టితే.. 80 క్వింటాళ్ల మిర్చి వచ్చింది. 20 క్వింటాళ్లను రూ.4 వేల చొప్పున అమ్మితే..రూ.80 వేలే వచ్చాయి. అప్పు ఇచ్చినోళ్లు, కూలోళ్లు ఇంటి చుట్టు తిరుగుతున్నరు. ఉన్న మిర్చి అమ్ముదామంటే.. రూ.1900, రూ.2 వేలకు అడుగుతున్నరు. ఏం చేయాలో దిక్కు తోచట్లేదు. ధర లేక అమ్మలేదు – యల్లంకి వెంకటేశ్వర్లు, కారేపల్లి ధర లేకపోవడంతో 40 క్వింటాళ్ల మిర్చి అమ్మకుండా అట్లే ఉంచిన. నేను 3 ఎకరాల్లో మిర్చి సాగు చేసిన. రూ.1.50 లక్షల పెట్టుబడితోపాటు, మిర్చి ఏరించినందుకు రూ.1.20 లక్షల ఖర్చు వచ్చింది. 45 క్వింటాళ్ల దిగుబడిలో 5 క్వింటాళ్లను మొదట్లో రూ.10 వేల చొప్పున అమ్మిన. అప్పటి నుంచి రేటు తగ్గుకుంటూ వచ్చింది. ఇప్పుడు రూ.2 వేల చొప్పున అడుగుతున్నరు. అమ్మితే..కూలోళ్లకు ఏమి ఇయ్యాలి..? అప్పు తెచ్చిన కాడ ఏం కట్టాలి..? వ్యవసాయం బంద్ చేసి కూలీకి పోదామనుకుంటున్నా.. – బానోతు వీరన్న, గేటు కారేపల్లి పోయిన ఏడాది చెల్లి పెళ్లికి, ఇల్లు మరమ్మతులకు తెచ్చిన అప్పు రూ.2 లక్షలు మిర్చి పంట మీద తీర్చుదామనుకున్నా. ఈ అప్పు కాకుండానే మళీŠల్ రూ.2 లక్షలు అప్పు అయింది. రూ.60 వేలు పెట్టి 2.5 ఎకరాలు కౌలుకు తీసుకుని, రూ.1.50 లక్షలు పెట్టుబడి పెట్టిన. మిర్చి ఏరిస్తే రూ.1.70 లక్షలు అయింది. మొత్తంగా రూ.3.20 లక్షలు అప్పు తెచ్చి సాగుచేస్తే..60 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ధర లేకపోవడంతో.. రూ.3 వేల చొప్పున అమ్ముకోవాల్సి వచ్చింది. రూ.2 లక్షలు అప్పు తీరుతుందనుకుంటే.. మరో రూ.2 లక్షలు అప్పు అయింది. వ్యవసాయం బంద్ చేసి కూలీ పనులకు పోదామనుకుంటున్నా. ఫలితం లేదు.. సుతారి పనికి పోత..గుగులోతు సేట్రామ్, మేకలతండా, కారేపల్లి మండలం నాకున్న 4 ఎకరాల్లో మిర్చి పంటకు రూ.2 లక్షల వరకు పెట్టుబడి పెట్టిన. నకిలీ విత్తనాలు రావడంతో.. తోట సగం నాశనమైంది. 40 క్వింటాళ్లేæ దిగుబడి వచ్చింది. మిర్చి బాగా లేదని సేటు క్వింటాకు రూ.1900 మాత్రమే సేటు పెట్టిండు. ఏం చేయాల వచ్చిన కాడికే.. తీసుకొని వచ్చి కూలోళ్లకు ఇచ్చిన. కష్టపడి ఎవుసం చేస్తే.. కుటుంబాన్ని సాదుకోలేక పోతున్నం. మా ఊరోళ్లతో ఖమ్మం సుతారి పనికి పోత. అప్పు చేసి ఆపరేషన్ చేయించుకున్నా...– తాటికింది మంగమ్మ, సింగరాయపాలెం, కొణిజర్ల మండలం మాకు ఎకరం పొలం ఉంది. మరో ఎకరం కౌలుకు తీసుకున్నాం. కౌలు రూ.30 వేలు ముందే చెల్లించాం. రెండు ఎకరాలు తోట వేసాం. మొదట నకిలీ మిర్చి విత్తనాలతో కాత రాకుంటే తోట పీకి వేసి మళ్లీ వేసాం. అంతా కలిపి ఎకరానికి రూ.90 వేలు ఖర్చయింది. కౌలుతో కలిపి రెండు ఎకరాలకు రూ 2.10 లక్షలు వచ్చింది. మొదటి కోత 10 క్వింటాళ్లు వచ్చింది. రూ.5 వేలు లెక్క అమ్మాం. ఇంతలో నాకు కడుపు నొప్పి రావడంతో రూ.లక్ష అప్పు చేసి ఆపరేషన్ చేయించారు. రెండోసారి మిర్చి కోయిస్తే 22 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. అమ్మడానికి పోతే రూ 2,800 కి అడిగారు. ఆ రేటుతో అమ్మితే అప్పులు కూడా తీరవు. పాత అప్పులు తీరుద్దామనుకున్నా..బండారు వీరభద్రం, చిన్నగోపతి, కొణిజర్ల మండలం నాకు 3 ఎకరాల పొలం ఉంది. మరో ఒకటిన్నర ఎకరం కౌలుకు తీసకున్నా. రెండెకరాలలో మిర్చి సాగు చేశా. కౌలు రూ.25 వేలు. ఎకరానికి 16 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. పెట్టుబడులకు రూ.80 వేల దాకా ఖర్చు వచ్చింది. మిర్చి అమ్ముదామని ఖమ్మం మార్కెట్కు తీసుకపోతే రూ.3,100 చొప్పున అడిగారు. తిరిగి ఇంటికి వేసుకుని వచ్చా. ఇప్పుడు ఎంతకో కొంతకు అమ్ముదామన్నా కొనే నాథుడు కరువయ్యాడు. పాత అప్పులతో కలుపుకుంటే రూ.4 లక్షల అప్పులు మిగిలాయి. పంట కోయకుండా వదిలేశా..– కొత్తపల్లి మంగారావు, సింగరాయపాలెం, కొణిజర్ల మండలం సింగరాయపాలెంలో ఎకరం రూ.30 వేలు చొప్పున 3 ఎకరాలు కౌలుకు తీసుకున్నా. నాకున్న 2 ఎకరాల పొలంలో నీళ్లు కోసం మూడుసార్లు బోర్లు వేయించా, రూ.2 లక్షలు ఖర్చు అయింది. చుక్క నీళ్లు పడలేదు. 2 ఎకరాలలో మిర్చి సాగు చేశా. పంటకు రూ.1.50 లక్షలు అప్పు తెచ్చాను. ఇద్దరు ఆడపిల్లలున్నారు. పంట మంచిగా పండితే పెద్ద పిల్ల పెళ్లి చేద్దామనుకున్నా. అనుకున్నట్లు గానే పంట మంచి గానే పండింది. కానీ ధర లేదు. పంట కోయిస్తే కోత కోసిన కూలీలకు కూడా సరిపోవని అలాగే వదిలేశా. లక్ష పెట్టుబడి...లక్షన్నర కూలీ..– ఆడెపు వెంకన్న, కూసుమంచి నేను రెండెకరాల్లో తోట వేస్తే 30 క్వింటాళ్లు దిగుబడి వచ్చింది. అమ్మితే రూ.1.80 లక్షలు వచ్చింది. కూలీ, పెట్టుబడి ఖర్చు రూ.2.50 లక్షలు వచ్చింది. ఇలా అయితే మిర్చి పంటను ఎలా సాగు చేస్తాం. మాకు లాభాలు ఎలా వస్తాయి? మరోసారి మిరప తోటలు వేయాలంటే భయమేస్తోంది. ఇదీ నష్టం లెక్క.. ఈ ఏడాది మిర్చి సాగు 2.61 లక్షల ఎకరాలు దిగుబడి(ఎకరాకు 25 క్వింటాళ్ల చొప్పున) 65.25 లక్షల క్వింటాళ్లు ఎకరాకు రైతు చేసిన ఖర్చు 1.60 లక్షలు 2.61 లక్షల ఎకరాలకు ఖర్చు 4,176 కోట్లు క్వింటాల్కు దక్కిన సగటు ధర 4 వేలు 65.25 లక్షల క్వింటాళ్లకు 2,610 కోట్లు అంటే.. రైతు రూ.4,176 కోట్లు ఖర్చు పెడితే నికరంగా చేతికొచ్చింది.. రూ.2,610 కోట్లు! రైతు ఆరుగాల కష్టానికి ప్రతిఫలం రూ.1,566 కోట్ల నష్టం! రైతు దంపతుల ఆరేడు నెలల కష్టాన్ని కూడా కలిపితే ఈ మొత్తం నష్టం రూ.2 వేల కోట్లపైనే..!!! -
పాల్వంచలో అగ్ని ప్రమాదం : భారీగా ఆస్తినష్టం
పాల్వంచ : కొత్తగూడెం జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పాల్వంచ శాస్త్రిరోడ్డు సమీపంలో ఉన్న వెంకటేశ్వర ఏజెన్సీ డిస్ట్రిబ్యూషన్ దుకాణంలో ఆదివారం అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో షాపులోని సరుకులు భారీగా దహనమయ్యాయి. సమాచారం అందుకున్న కొత్తగూడెం ఫైర్ అధికారులు రెండు ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు. సుమారు రూ.20 లక్షల మేర ఆస్తినష్టం సంభవించినట్లు షాపు యజమాని చెప్పారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. -
ఆ బ్యాంకుకు రూ. 743 కోట్ల నష్టాలు
ప్రభుత్వ రంగంలోని అలహాబాద్ బ్యాంకు భారీ నష్టాలు నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో రూ. 620.90 కోట్ల నికర లాభాలు సాధించిన ఈ బ్యాంకు.. ఈసారి ఏకంగా రూ. 743.31 కోట్ల నికర నష్టాల్లోకి జారిపోయింది. గత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు నిరర్ధక రుణాలు రూ. 2,856.66 కోట్ల నుంచి రూ. 5,253.19 కోట్లకు పెరిగాయి. కానీ ఈ మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో స్థూల నిరర్ధక రుణాలు రూ. 15,384.57 కోట్లుగాను, నికర నిరర్ధక రుణాలు రూ. 10,292.51 కోట్లుగాను తేలాయి. వీటి ఫలితంగానే అలహాబాద్ బ్యాంకు తీవ్ర నష్టాలలో మునిగిపోయింది. -
ముంచెత్తిన వాన..
* మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో వర్ష బీభత్సం * పంటలకు భారీ నష్టం.. అంధకారంలో సిద్దిపేట సాక్షి, నెట్వర్క్: మెదక్, రంగారెడ్డి జిల్లాలను శనివారం కూడా వర్షం ముంచెత్తింది. మెదక్ జిల్లా సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. గాలివాన ప్రభావంతో విద్యుత్ స్తంభాలు పడిపోవడం, తీగలు తెగిపోవడంతో సిద్దిపేట పట్టణం అంధకారంలో మునిగిపోయింది. ఇక్కడ 45 నిమిషాల పాటు ఏకధాటిగా వర్షం కురిసింది. హైదరాబాద్, మెదక్, ఇతర ప్రధాన రహదారులపై రాకపోకలు స్తంభించాయి. గజ్వేల్ నియోజకవర్గంలో పంటలు దెబ్బతిన్నాయి. పలుచోట్ల వడగళ్ల వాన పడింది. గజ్వేల్-ప్రజ్ఞాపూర్ ఆరు లేన్ల రహదారి పనుల్లో భాగంగా బిగించిన విద్యుత్ స్తంభాలు ఈదురుగాలులకు వంగిపోయాయి. రద్దీగా ఉండే రహదారిపై ఇవి వంగిపోవడంతో ప్రయాణికులు భీతిల్లారు. ట్రాన్స్ఫార్మర్ నేలకూలింది. అలాగే, రంగారెడ్డి జిల్లాలో పలుచోట్ల ఈదురుగాలులతో చెట్లు నేలకొరిగాయి. చేవెళ్ల మండల పరిధిలోని పలు గ్రామాల్లో భారీ వర్షానికి క్యారెట్, బీట్రూట్ తదితర పంటలకు నష్టం జరిగింది. మొయినాబాద్ మండలంలో పిడుగుపాటుతో 4 పశువులు మృత్యువాత పడ్డాయి. శంషాబాద్, కందుకూరు మండలాల్లో భారీ వర్షానికి మామిడికాయలు నేలరాలాయి. కొలన్గూడలో వడగళ్ల ధాటికి బండ నర్సింహాకు చెందిన 5 గొర్రెలు, 5 మేకలు మృతి చెందాయి. కందుకూరు మండలం బేగంపేటలో ఈదురుగాలులకు దెయ్యాల ఐలయ్య ఇంటి పైకప్పు రేకులు లేచిపోయాయి. గ్రామంలోని వ్యవసాయ పొలంలో యాదయ్యకు చెందిన ఇల్లు కూలిపోయి ఆయన భార్య యాదమ్మకు స్వల్పగాయాలయ్యాయి. శంషాబాద్ మండలం చిన్నగోల్కొండలో దాదాపు పది ఇళ్ల రేకులు లేచిపోయాయి. -
ప్రభుత్వ బ్యాంకులకు మొండి బకాయిల భారం
♦ రూ. 51 కోట్లకు తగ్గిన పీఎన్బీ లాభం ♦ దేనా, ఆలహాబాద్ బ్యాంక్లకు భారీ నష్టం న్యూఢిల్లీ/ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకులకు మొండి బకాయిలు గుదిబండలా మారుతున్నాయి. మొండి బకాయిల కేటాయింపుల కారణంగా ఈ బ్యాంకుల నికర లాభాల్లో భారీగా కోత పడుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలానికి సంబంధించి మంగళవారం ఆర్థిక ఫలితాలు ప్రకటించిన పంజాబ్ నేషనల్ బ్యాంక్, దేనా బ్యాంక్, అలహాబాద్ బ్యాంకుల నికర లాభాలపై మొండి బకాయిలు విశ్వరూపం చూపించాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నికర లాభం 93 శాతం క్షీణించగా, దేనా బ్యాంక్కు రూ.663 కోట్లు, అలహాబాద్ బ్యాంక్కు రూ.486 కోట్ల చొప్పున నికర నష్టాలు వచ్చాయి. వివరాలు... దేనాబ్యాంక్కు 663 కోట్ల నష్టం దేనా బ్యాంక్కు డిసెంబర్ క్వార్టర్లో రూ.663 కోట్ల నష్టం వచ్చింది. మొండి బకాయిలు భారీగా పెరగడమే దీనికి ప్రధాన కారణమని తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్కు రూ.77 కోట్ల నికర లాభం ఆర్జించామని వివరించింది. గత క్యూ3లో రూ.2,867కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ3లో రూ.2,722 కోట్లకు తగ్గిందని పేర్కొంది. స్థూల మొండి బకాయిలు 5.61 శాతం నుంచి9.85 శాతానికి పెరిగినట్లు బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. 93% తగ్గిన పీఎన్బీ నికర లాభం పంజాబ్ నేషనల్ బ్యాంక్ నికర లాభంపై మొండి బకాయిలకు కేటాయింపులు తీవ్రమైన ప్రభావం చూపాయి. గత క్యూ3లో రూ.775 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో 93 శాతం క్షీణించి రూ.51 కోట్లకు పడిపోయిందని పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) తెలిపింది. మొత్తం ఆదాయం మాత్రం రూ.12,905 కోట్లనుంచి 8 శాతం వృద్ధితో రూ.13,891 కోట్లకు పెరిగిందని పంజాబ్ నేషనల్ బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉషా అనంతసుబ్రహ్మణ్యన్ చెప్పారు ఈ క్యూ3లో నికర వడ్డీ ఆదాయం రూ.4,120 కోట్లు, వడ్డీయేతర ఆదాయం రూ.1,671 కోట్లు చొప్పున ఆర్జించామని చెప్పారు. పరిశ్రమ తీవ్రమైన కష్టాల్లో ఉందని, రుణాలు అధికంగా ఇచ్చే బ్యాంకుల్లో ఒకటైనందున తమ బ్యాంక్పై తీవ్రమైన ప్రభావం పడిందని. క్యూ3 ఫలితాల వెల్లడి సందర్భంగా ఉషా మాట్లాడారు. అలహాబాద్ బ్యాంక్... అధిక కేటాయింపుల ఫలితం అలహాబాద్ బ్యాంక్కు 3వ త్రైమాసికలో రూ.486 కోట్ల నికర నష్టం వచ్చింది. మొండి బకాయిలకు భారీ కేటాయింపుల కారణంగా ఈ స్థాయిలో నష్టాలు వచ్చాయని బ్యాంక్ తెలిపింది. గత క్యూ3లో రూ.164 కోట్ల నికర లాభం వచ్చిందని పేర్కొంది. గత క్యూ3లో రూ.5,387 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ3లో రూ.5,030కు తగ్గిందని తెలిపింది. స్థూల మొండి బకాయిలు 5.46 శాతం నుంచి 6.40 శాతానికి ఎగశాయి. -
చిత్తూరు జిల్లాలో వర్షాలు కారణంగా భారీ నష్టం
-
తెలంగాణలో భారీ వర్షం..రైతులకు తీవ్ర నష్టం
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా గురువారం అర్ధరాత్రి నుంచి కురిసిన అకాల వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వర్షం కారణంగా వాణిజ్య పంటలతో పాటూ కూరగాయలు, పండ్ల తోటలకు కూడా నష్టం వాటిల్లింది. పిందె దశలో ఉన్న మామిడి తోటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కాగా భారీ వర్షం కారణంగా జిల్లాలోని పలు రోడ్లపై నీరు నిలిచి రాక పోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వరంగల్, ఖమ్మం, కరీంనగర్ , నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో వర్షాలు తీవ్రం ప్రభావం చూపాయి. అకాల వర్షాలతో రైతులకు అపార నష్టం వాటిల్లింది. నల్లగొండ: జిల్లాలోని హుజూర్ నగర్, కోదాడలో ఈదురుగాలులతో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. వందల ఎకరాల్లో వరి కి నష్టం వాటిల్లింది. నడిగూడెంలో మామిడి తోటలు ధ్వంసం అయ్యాయి. హుజుర్ నగర్ మార్కెట్ యార్డులో అమ్మకానికి సిద్ధంగా ఉన్న ధాన్యం తడిసిపోయింది. రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లాలోని చేవేళ్ల, పరిగి ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో కూరగాయాల పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వరంగల్: జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షాలు పడ్డాయి. వేలాది ఎకరాల్లో పంట నష్టపోయింది. వర్షాల కారణంగా రోడ్లు దెబ్బతిని పలుచోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. చిన్నారావు పేట మండలంలో కోళ్ల షెడ్లు కూలి 50 వేల కోళ్లు మృత్యవాత పడ్డాయి. పలు చోట్ల పిడుగుపాటుతో 15 ఇళ్లు ధ్వంసం అయ్యాయి. ఖమ్మం: ఖమ్మం జిల్లాలోని పినపాక నియోజక వర్గంలో అకాల వర్షంతో మామిడి పంటకు తీవ్రంగా నష్టపోయింది. చేతికొచ్చిన కాపు నేలరాలడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మొండికొండ ప్రధాన రహదారిపై చెట్లు విరిగిపడ్డాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. -
అకాల వర్షం... రైతుకు భారీ నష్టం
కర్నూలు(అగ్రికల్చర్) : అకాల వర్షాలు రైతుల కష్టార్జితాన్ని నీటిపాలు చేశాయి. ఊహించని విధంగా పలు మండలాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురియడంతో వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి రేయింబవళ్లు శ్రమించి పండించిన పంటలు దెబ్బతినడంతో రైతుల ఆందోళన చెందుతున్నారు. కల్లందొడ్లలో మిరప ఆరబెట్టుకున్నారు. పంట నూర్పిళ్లు కూడా చురుగ్గా జరుగుతున్నాయి. పశుగ్రాసాలను వాములుగా వేస్తున్నారు. అయితే ఆదివారం రాత్రి కురిసిన వర్షం రైతులకు నష్టాలను మిగిల్చింది. పగిడ్యాలలో ఏకంగా 61 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. కర్నూలులో 37, గూడూరులో 21.8, కల్లూరులో 15.8, వెల్దుర్తిలో 15.2, ఓర్వకల్లులో 13.6, శ్రీశైలంలో 12.8, గోనెగండ్లలో 15.6 మిల్లీమీటర్ల ప్రకారం వర్షాలు కురిసాయి. ఈ వర్షాల వల్ల కల్లందొడ్లలో ఉన్న ఎండుమిర్చితో పాటు నూర్పిళ్లు చేస్తున్న వివిధ పంటలు తడిచిపోయాయి. ఎండుమిర్చి తడవడం వల్ల రంగు మారే ప్రమాదం ఏర్పడింది. ఇందువల్ల గిట్టుబాటు ధర లభించదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాల వల్ల జరిగిన పంట నష్టంపై వెంటనే వివరాలు పంపాలని జేడీఏ ఠాగూర్నాయక్ వ్యవసాయాధికారులను ఆదేశించారు. అకాల వర్షంతో రాకపోకలకు అంతరాయం నందికొట్కూరు: అకాల వర్షం వాహనాల రాకపోకలకు అంతరాయం కలగించింది. సోమవారం ఉదయం 6 గంటలకు వర్షం కురిసింది. దీంతో కర్నూలు-గుంటూరు ప్రధాన రహదారి వైపు వెళ్లే వాహనాలు కల్వర్టు నిర్మాణం పక్కన్న ఉన్న పొలం రస్తాలో ఇరుక్కపోయాయి. దీంతో దాదాపు రెండు గంటల పాటు రాకపోకలకు అంతరాయం కలిగింది. కొన్ని వాహనాలు ఉప్పల దడియా, మిడ్తూరు మీదుగా నందికొట్కూరు, ఆత్మకూరు, గుంటూరు వైపు వెళ్లాయి. విషయం తెలుసున్న ఎమ్మెల్యే, ఎంపీపీ, ఆర్ అండ్ బీ అధికారులు వాహనాలు ఇరుకున్న ప్రాంతాలను పరిశీలించారు. కల్వర్టు నిర్మాణ పనులు చేస్తున్న కాంట్రాక్టర్పై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆర్ అండ్ బీ అధికారులు, కాంట్రాక్టర్ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. -
ఇదేం పరిహారం?
కాఫీ రైతులకు మొక్కుబడి సాయం జీఓను తప్పుబడుతున్న గిరిజనులు ఎకరానికి రూ.10 వేలేనని ఉత్తర్వులు 50 శాతం నిబంధనలతో అందేది నామమాత్రమే హుదూద్ తుపానుకు దెబ్బతిన్న కాఫీ రైతులకు ప్రభుత్వం మొక్కుబడి పరిహారాన్ని ప్రకటించింది. గిరిజన రైతులు 15 ఏళ్ల నుంచి ఫలాశయం పొందుతున్న కాఫీ తోటలు ధ్వంసమై ఆయా కుటుంబాలు వీధిన పడగా ఆదుకోవలసిన వేళ ప్రభుత్వం తూతూమంత్రంగా సాయం ప్రకటిస్తోంది. పలు నిబంధనలతో అతి తక్కువ పరిహార జీఓను విడుదల చేయడాన్ని బాధిత రైతులు తప్పుపడుతున్నారు. పాడేరు: ఏడాదికి ఎకరం కాఫీ, మిరియాల పంటల ద్వారా రూ.లక్ష వరకు ఆదాయం పొందే కాఫీ రైతులను హుదూద్ తుపాను కోలుకోలేని దెబ్బతీసింది. కాఫీ మొక్కలన్నీ నీడ నిచ్చే చెట్ల సంరక్షణలోనే ఎదిగి ఫలసాయాన్ని ఇస్తాయి. తుపానుకు నీడనిచ్చే చెట్లు, వాటికి అల్లుకున్న మిరియాల పాదులన్నీ నేలకూలడంతో కాఫీ రైతులకు భారీ నష్టం వాటిల్లింది. ఏజెన్సీ వ్యాప్తంగా 11 మండలాల పరిధిలో లక్షా 40 వేల ఎకరాల విస్తీర్ణంలో కాఫీ తోటలు ఉండగా 96 వేల ఎకరాల తోటలు ఫలసాయాన్ని ఇస్తున్నాయి. ఇందులో సుమారు 30 వేల ఎకరాల్లో పంట తుపాను ధాటికి ధ్వంసమైంది. ఫల సాయానికి దగ్గరగా ఉన్న మరో 10 వేల ఎకరాల్లో కాఫీ తోటలు కూడా నాశనమయ్యాయి. నీడనిచ్చే చెట్లు నేలకూలడంతో కాఫీ మొక్కలకు రక్షణ కరువైంది. ఇవన్నీ వాడిపోయి పూర్తిగా నాశనం అయ్యే పరిస్థితి నెలకొంది. విరగ్గాసినా దక్కని ఫలం : ఈ ఏడాది విరగ్గాసిన కాఫీ తోటల్లో ఫల సాయాన్ని నవంబరు మొదటివారంలో సేకరించాల్సిన తరుణంలో హుదూద్ తుపాను గిరిజన రైతుల ఆశలను అడియాసలు చేసింది. కోలుకోలేని దెబ్బను మిగిల్చిన తరుణంలో ప్రభుత్వం ఎకరం పంటకు రూ.లక్ష ఇచ్చినా కాఫీ రైతులకు ఏర్పడిన నష్టాన్ని పూడ్చలేం. అయితే తక్షణ సహాయం కింద ఎకరానికి రూ.లక్ష చెల్లించి మళ్లీ నీడనిచ్చే సిల్వర్ఓక్ వృక్షాల పెంపకం, అవి ఎదిగిన తరువాత కాఫీ సాగుకు ప్రోత్సాహం అందించాల్సిన బాధ్యత పాలకులపై ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇటీవల ఏజెన్సీలో పర్యటించి హెక్టార్ పంటకు రూ.10 వేల నుంచి 20 వేలు మాత్రమే పరిహారం కింద ప్రకటించారు. ఇటీవల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మోదాపల్లి ప్రాంతంలో ధ్వంసమైన కాఫీ తోటలను పరిశీలించి ఆవేదన వ్యక్తం చేశారు. అంతకుముందే పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ధ్వంసమైన కాఫీ తోటలన్నింటిని పరిశీలించి ఎకరానికి రూ.1 లక్ష నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాఫీ రైతులకు ఏర్పడిన అపార నష్టాన్ని జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లగా ఆయన కూడా తీవ్రంగా స్పందించి ఎక రం కాఫీ పంటకు రూ.లక్ష చెల్లించేంత వరకు బాధిత రైతుల తరఫున పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అతి తక్కువ పరిహార జీవో ప్రభుత్వం తాజాగా నష్టపరిహారంపై ఉత్తర్వులు జారీచేసింది. పలు నిబంధనలతో అతి తక్కువ పరిహార జీఓను విడుదల చేసి బాధిత కాఫీ రైతులకు మొక్కుబడి సాయాన్నే అందించేందుకు సిద్ధమవడాన్ని గిరిజన రైతులంతా తప్పుపడుతున్నారు. 50 శాతం కాఫీ పంట ధ్వంసమైతేనే నష్టపరిహారం చెల్లిస్తామని జీఓలో పేర్కొనడం బాధిత కాఫీ రైతులను మరింత బాధిస్తోంది. 10 ఏళ్ల దాటిన కాఫీ తోట 50 శాతం పైగా ధ్వంసమైతే ఎకరానికి రూ.10 వేలు, 5 నుంచి 10 ఏళ్ల లోపు తోటకు రూ.ఆరు వేలు, 5 ఏళ్లలోపు గల తోటలకు ఎకరానికి రూ.నాలుగు వేలు అతి తక్కువ పరిహారాన్ని ప్రభుత్వం అమలు చేయడం దారుణమని బాధిత కాఫీ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏజెన్సీలోని ధ్వంసమైన కాఫీ తోటలను పూర్తిగా తొలగించి కొత్తగా కాఫీసాగు చేపట్టాలంటే మరో ఆరేళ్లపాటు గిరిజన రైతులు అష్టకష్టాలు పడాల్సి ఉంది. ఫలసాయం వచ్చే వరకు రైతులకు ఆర్థిక ఇబ్బందులు తప్పవు. ఈ నేపథ్యంలో ఎకరానికి రూ.లక్ష చెల్లించి అన్ని విధాలా ఆదుకోవలసిన ప్రభుత్వం మొక్కుబడి సాయం ప్రకటించడంతోపాటు 50 శాతం నిబంధనలను అమలు చేయడం కూడా బాధిత కాఫీ రైతులకు అన్యాయం చేయడమేనని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
విద్యుత్ వ్యవస్థకు అపార నష్టం: అజయ్ జైన్
హైదరాబాద్: హుదూద్ తుఫాన్ కారణంగా విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో విద్యుత్ వ్యవస్థకు అపార నష్టం వాటిల్లిందని ఇంధన కార్యదర్శి అజయ్ జైన్ వెల్లడించారు. తుఫాన్ కారణంగా దాదాపు 400 ట్రాన్స్ ఫార్మార్లు దెబ్బతిన్నాయని అజయ్ జైన్ తెలిపారు. విశాఖ, విజయనగరం జిల్లాల్లో విద్యుత్ సరఫరాను పునరుద్దరించేందుకు ఇతర జిల్లాల నుంచి 2 వలే మంది సిబ్బందిని తరలిస్తున్నామన్నారు. సోమవారం రాత్రికి కొన్ని ప్రాంతాలకైనా విద్యుత్ సరఫరా చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని అజయ్ జైన్ ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. -
విజయనగరం జిల్లాలో భారీనష్టం!
విజయనగరం: హుదూద్ తుపాను సృష్టించిన విధ్వంసం వల్ల విజయనగరం జిల్లాలో భారీగా ఆస్తి నష్టం జరిగింది. సముద్ర తీర గ్రామాల్లో చెట్లు నేలకొరిగాయి. జామి, ద్వారపూడిలలో చెట్లు కూలి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ జిల్లాలో మొత్తం అయిదుగురు మృతి చెందారు. ఈ జిల్లాలో దాదాపు 9500 చెట్లు కూలిపోయాయి. 12 వేల ఎకరాలలో పంటకు నష్టం జరిగింది. వరి, చెరకు, అరటి, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కూరగాయల పంటలు నీట మునిగాయి. 650 ఇళ్లు దెబ్బ తిన్నాయి. పడవలు వందల సంఖ్యలో కొట్టుకుపోయాయి. తుపాను కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సమాచార వ్యవస్థ పనిచేయడంలేదు. రోడ్లు దెబ్బతిన్నాయి. రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. ప్రజలకు నిత్యావసర వస్తువులు దొరకడంలేదు. పరిస్థితులు ఇంకా చక్కదిద్దుకోనందున జిల్లాలో రేపు కూడా పాఠశాలలకు, కళాశాలలకు జిల్లా కలెక్టర్ సెలవు ప్రకటించారు. ** -
రైతులను ముంచిన అకాల వర్షం
మిర్చి పంటలకు భారీ నష్టం నేలకొరిగిన మొక్కజొన్న నర్సంపేట/దుగ్గొండి, న్యూస్లైన్ : పంటలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్న రైతుల ను శనివారం రాత్రి కురిసిన అకాల వర్షం నష్టాల పాలు చేసింది. చేతికి వచ్చిన మిర్చి కల్లాలపైనే తడిసి ముద్దయిం ది. ఏపుగా పెరిగిన మొక్కజొన్న నేలవాలింది. ముఖ్యంగా నర్సంపేట నియోజకవర్గంలోని దుగ్గొండి, నల్లబెల్లి, నర్సం పేట వుండలాల్లో మిర్చి పంటలు అధికంగా దెబ్బతిన్నాయి. నర్సంపేట మండలం కవ్ముపల్లి, దాసరిపల్లి, చంద్రయ్యుప ల్లి, దుగ్గొండి మండలం తిమ్మంపేట, మహ్మదాపురం, మర్రి పల్లి గ్రామాలలో పెద్ద ఎత్తున దేశి రకం(టవూట) మిర్చి పంటను సాగుచేశారు. కొన్ని గ్రామాల్లో పంటను తెంపి నాగపూర్కు తరలేందుకు కల్లాలపై ఆరబోశారు. మరికొన్ని గ్రామాల్లో పంట ఇంకా తోటలోనే ఉంది. వర్షం కారణంగా మిరప పండు తడిసి నల్లబారి బూజుపట్టే అవకాశం ఉండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తోటల్లో ఉన్న కాయల తొడిమిల గుండా నీరు లోనికి చేరి కాయ మురిగి రాలిపోయే ప్రమాదముందని చెబుతున్నారు. మహ్మదాపురంలో పాలడుగుల రాజన్నకు చెందిన 20 క్వింటాళ్లు, గెడ్డ కృష్ణంరాజుకు చెందిన 20 క్వింటాళ్ల మిర్చి తడిసిపోయింది. వీరితోపాటు మరో 30 మంది రైతుల పంట కల్లాలపైనే ఉండి పోయింది. వెంకటాపురంలో నల్ల రాజిరెడ్డికి చెందిన మూడు కల్లాలలోని మిర్చి మురిగిపోయో స్థితికి వచ్చింది. నాచినపల్లిలో అండృ రాజు, శ్రీరామోజు ప్రభాకర్ పంటల పరిస్థితీ అలానే ఉంది. కాసు కుమారస్వామి, కంచరకుంట్లు నర్సింహారెడ్డి, సమ్మిరెడ్డి, గుడిపెల్లి రాంరెడ్డి, నాతి వెంకటేశ్వర్లుకు చెందిన మొక్కజొన్న పంటంతా నేలవాలింది. కంకులు వేసే దశలో కర్రలు కుప్పకూలడంతో పంటలకు పెట్టిన పెట్టుబడి పూర్తిగా నష్టపోయామని రైతులు వాపోయారు. ఆదివారం రాత్రి కూడా భారీగా వర్షం కురిసింది. దీంతో రైతులు మరింత ఆందోళనకు గురవుతున్నారు. ఎలాగైనా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. -
అకాల వర్షం....అపార నష్టం
-
పంటలను ముంచిన జల చౌర్యం
గుత్తి రూరల్, న్యూస్లైన్ : బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన అధికార కాంగ్రెస్ పార్టీ నేతల స్వార్థం 15 గ్రామాల అన్నదాతలకు భారీ నష్టం తెచ్చిపెట్టింది. చేపల పెంపకం కోసం చెరువుకు అక్రమంగా నీటిని తరలించేందుకు రిజర్వాయర్కు గండికొట్టారు. గండి కొట్టిన తర్వాత ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరిగిపోవడంతో పిల్ల కాల్వలన్నీ తెగిపోయి నీరు పంట పొలాలను ముంచెత్తింది. గంటల వ్యవధిలోనే రూ.కోటి దాకా పంట నష్టం వాటిల్లింది. బాధిత రైతులు లబోదిబోమంటున్నారు. సోమవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితుల కథనం మేరకు... ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బ్రాహ్మణపల్లి చెరువు పూర్తిగా నిండింది. ఇక్కడి కాంగ్రెస్ నేతలు చేపల పెంపకం చేపట్టాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా అనధికారికంగా ఈ చెరువులో చేప పిల్లలను వదిలారు. ఇదే సమయంలో ఆయకట్టుకు నీటిని వదలడంతో చెరువులో నీటిమట్టం తగ్గుతూ వచ్చింది. చేప పిల్లలను కాపాడుకునేందుకు ఈ సారి కాంగ్రెస్ నేతలు చెర్లోపల్లి వద్ద ఉన్న చండ్రాయునికుంట రిజర్వాయర్ నీటిపై కన్నేశారు. అక్కడి నుంచి ఎలాగైనా తమ చెరువుకు నీటిని తరలించి నింపుకోవాలనుకున్నారు. ఇందుకు ఎమ్మెల్యేను సంప్రదించారు. అందుకాయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇంకేముంది వారు సోమవారం రాత్రి మందీ మార్బలంతో వెళ్లి రిజర్వాయర్ వద్ద గండికొట్టారు. నీటి ఉధ ృతి ఎక్కువగా ఉండటంతో కాలువ వెంబడి ఉన్న గుత్తి, గుంతకల్లు, పామిడి మండలాల్లోని 15 గ్రామాల్లో దాదాపు 500 ఎకరాలలో సాగు చేసిన వేరుశనగ, జొన్న, వరి, కంది, ఆముదం పంటలు కొట్టుకుపోయాయి. ఎక్కడికక్కడ కోతకు గురికావడం, భూసారం కొట్టుకుపోవడంతో పదేళ్ల వరకు పంటలు సాగు చేసే పరిస్థితి లేకుండా పోయిందని చెర్లోపల్లికి చెందిన రైతులు రామాంజనేయులు, ఆకుల వెంకటేష్, మారెన్న, నర్సన్న, లాలెమ్మ, లక్ష్మిదేవి, ఆకుల రామాంజనేయులు, వెంకటలక్ష్మమ్మ, గోవిందు, సుంకమ్మ, ఆంజనేయులు, పెద్ద మారెప్ప, వెంకట్రాముడు, సుశీలమ్మ, రామన్న, నారాయణమ్మ కన్నీరుమున్నీరుగా విలపించారు. అధికార పార్టీ నాయకులు చేపల పెంపకం ద్వారా రూ,లక్ష నష్టం వస్తుందని కక్కుర్తి పడి రిజర్వాయర్కు గండికొట్టి తమ పంటలను నీటిపాలు చేసి.. కోటి రూపాయల దాకా పెట్టుబడులు కోల్పోయేలా చేశారని బాధితులు శాపనార్థాలు పెట్టారు. ఇంత భారీ నష్టం జరిగినా రెవెన్యూ, వ్యవసాయ, పోలీసు అధికారులు తిరిగి చూడలేదని, ఎమ్మెల్యే ఆదేశాల మేరకే వారు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జల చౌర్యంపై సీపీఐ మండల కార్యదర్శి రాము, నాయకులు పూలమాబు, రమేష్, టీడీపీ మండల మాజీ కార్యదర్శి కోనంకి కృష్ణ వేర్వేరు ప్రకటనల్లో ఖండించారు. -
పొంచి ఉన్న తుపాన్ ముప్పు
నెల్లూరు(కలెక్టరేట్), న్యూస్లైన్ : కోస్తా ప్రాంతానికి మరో తుపాన్ ముప్పు పొంచి ఉంది. రెండు రోజుల క్రితమే తీరం దాటిన హెలెన్ తుపాన్తో ఉత్తర కోస్తా కకావికలమైంది. తాజాగా ‘లెహర్’ ముప్పు కోస్తాంధ్ర మీదకు దూసుకొస్తోండటంతో జిల్లా అధికార యంత్రాం గం అప్రమత్తమైంది. అండమాన్ నికోబార్ దీవుల్లో ఏర్పడిన అల్పపీడనం క్రమేపీ బలపడి తుపానుగా మారుతోంది. దీనికి లెహర్ అనే పేరు పెట్టారు. సూపర్సైక్లోన్గా మారే ఈ తుపాను వల్ల భారీ నష్టం సంభవించే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. ప్రస్తుతం అండమాన్ నికోబార్దీవులకు సుమారు 300 కిలో మీటర్ల దూరంలో ఉన్న అల్పపీడనం తుపానుగా మారి మచిలీపట్టణం, కళింగపట్నం నడుమ కాకినాడ వద్ద తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంటోంది. తీరం దాటే సమయంలో 100 నుంచి 150 కిలో మీటర్లు వేగంతో గాలులు వీచడంతో పాటు కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు ఆ శాఖ యంత్రాంగం హెచ్చరిస్తోంది. అయితే లెహర్ తీరం దరి చేరే సమయానికి దిశ మారితే జిల్లాకు ముప్పు వచ్చే పరిస్థితి ఉండటంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. అప్రమత్తంగా ఉన్నాం :లక్ష్మీకాంతం, జేసీ అండమాన్ నికోబార్ దీవుల సమీపంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారే అవకాశం ఉందన్న సంకేతాలు అందాయి. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా తీరప్రాంతంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశాం. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని సమాచారం అందించాం. ప్రాణనష్టం జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ఆస్తినష్టం కలగకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించాం. -
విభజన జరిగితే సీమాంధ్రకు నష్టం
శ్రీకాకుళం అర్బన్, న్యూస్లైన్:రాష్ట్రాన్ని విభజిస్తే సీమాంధ్రకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, అందువల్ల సమైక్యాంధ్ర ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ వేదిక రాష్ట్ర కన్వీనర్ వి.లక్ష్మణరెడ్డి పిలుపునిచ్చారు. శ్రీకాకుళం ప్రెస్క్లబ్లో ఆది వారం వేదిక జిల్లా కన్వీనర్ పొన్నాడ వెంకటరమణ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయ పెత్తనం కోసం తెలుగుజాతిని విచ్ఛిన్నం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వాలు చేస్తున్న యత్నాలను తిప్పికొట్టాలన్నారు. రాష్ట్రాన్ని విభజించాలంటే రాజ్యాంగంలోని ఆర్టికల్-3ని సవరించాల్సి ఉంటుందన్నారు. సమైక్యాంధ్ర కోసం ఎన్జీవోలు చేసిన సమ్మె అభినందనీయమని, అయితే అందరినీ కలుపుకొనిపోలేకపోయారన్నారు. సీమాంధ్ర ప్రజలు ఇంతగా ఉద్యమిస్తున్నా సోనియాగాంధీ విభజనకే కంకణం కట్టుకోవడం దురదృష్టకరమన్నారు. సీమాంధ్రకు చెందిన కేంద్రమంత్రులు ఉద్యమాన్ని పట్టించుకోకుండా విభజన జరిగిపోయిందంటూ సమైక్యవాదాన్ని విచ్ఛిన్నం చేసేందుకు యత్నిస్తున్నారన్నారు. సమైక్యాంధ్ర కోసం అసెంబ్లీ తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రా యూనివర్సిటీ ప్రొఫెసర్ ప్రసాదరెడ్డి మాట్లాడుతూ సీమాంధ్ర మంత్రులు అధికారాన్ని ఉపయోగించి ఆస్తులు కూడగట్టుకున్నారని, విభజన జరిగితే పోయేది సామాన్య ప్రజలే కదా అనే భావన వారిలో ఉందని విమర్శించారు. ఉద్యమ తీవ్రతను పెంచి రాష్ట్ర సమైక్యత కోసం కృషి చేద్దామన్నారు. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గుంట తులసీరావు మాట్లాడుతూ రాష్ట్ర విభజనలో శాస్త్రీయత లేదన్నారు. శ్రీలంకలో తమిళ ప్రజలపై జరిగిన దాడులకు నిరసనగా శ్రీలంక పర్యటన రద్దు చేసుకోవాలన్న తమిళ ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లకు తలొగ్గిన ప్రధాన మంత్రి, కేంద్ర ప్రభుత్వం సీమాంధ్ర ప్రజల మనోభావాలను మాత్రం పట్టించుకోవడంలేదని ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు సమైక్యాంధ్రకు అనుకూలమో? ప్రతికూలమో? చెప్పలేని దుస్థితిలో ఉన్నారని విమర్శించారు. పరిరక్షణ వేదిక ప్రతినిధి దామోదరరెడ్డి మాట్లాడుతూ బలమైన రాష్ట్రం ఉండకూడదనే దురుద్దేశంతోనే కాంగ్రెస్ రాష్ట్ర విభజనకు పాల్పడుతోందన్నారు. మరోసారి ఉద్యమిస్తే విభజన ఆగిపోతుందన్నారు. వేదిక ప్రతినిధులు జామి భీమశంకర్, కాళీప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు రాజకీయ పార్టీలే కారణమన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి దుప్పల రవీంద్ర మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోసం ఉద్యమించిన ఎన్జీవోలు సమ్మె విరమించడం ప్రభుత్వకుట్రగా అభివర్ణించారు. గ్రామీణస్థాయిలో ప్రజలను సమైక్య ఉద్యమంలో భాగస్వాములను చేయాలన్నారు. జిల్లా పరిరక్షణ కమిటీ ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ కమిటీ జిల్లా కమిటీని ప్రకటించారు. కన్వీనర్గా పొన్నాడ వెంకట రమణారావు, చైర్మన్గా గుంట తులసీరావు, వైస్ చైర్మన్గా జామి భీమశంకర్, కో-కన్వీనర్గా కొంక్యాన వేణుగోపాలరావు, సభ్యులుగా దుప్పల వెంకట్రావు, గేదెల ఇందిరాప్రసాద్, గీతాశ్రీకాంత్, ఎస్.వి.ఎస్.ప్రకాష్, వాన కృష్ణచంద్, శిష్టురమేష్, జి.కృష్ణప్రసాద్, కె.ఉషారాణి, సరళకుమారి, ఇతర అన్ని జేఏసీ ప్రతినిధులు వ్యవహరిస్తారు. ఈ సమావేశంలో పూజారి జానకిరాం, పైడిరెడ్డి, అంబటి ప్రకాష్, ఇతర జేఏసీ ప్రతినిధులు పాల్గొన్నారు. -
ముంచిన వాన
ఆదిలాబాద్ , న్యూస్లైన్: ఇంద్రవెల్లి మండలంలో సుమారు 2611 ఎకరాల్లో టమాటా సాగు చేశారు. జూన్, జూలై, ఆగస్టులో కురిసిన వర్షాలకు చాలా ఎకరాల్లో వేసిన టమాటా నారు మురిగిపోరుయిది. ప్రస్తుతం పంట చేతికొస్తుండగా ఇటీవల కురిసిన వానలకు కాయలు నల్లబడి 50 శాతం కాయలు నీళ్లపాలయ్యాయి. టమాటా 25 కిలోల క్యారెట్కు రూ.700 నుంచి రూ.800 వరకు ధర ఉన్నా దిగుబడి పడిపోవడంతో అన్నదాత విలవిల్లాడుతున్నాడు. చేసేదేమి లేక నల్లబడిన కాయలను పడేస్తున్నారు. అమ్మకానికి తీసుకెళ్లినా వ్యాపారులు నల్లబడిన కాయలు ఏరేసి కొంటున్నారని రైతులు చెబుతున్నారు. ప్రతీ రైతు తోటలో సగం కాయలు ఇలా నల్లబడిపోవడంతో రైతులకు ఈ సారి అప్పులే మిగిలేలా ఉన్నాయి. ఎకరానికి సుమారు రూ.20 వేల చొప్పున పెట్టుబడి పెట్టగా అందులో సగం కూడా తిరిగొచ్చే అవకాశం లేదని ఆందోళన చెందుతున్నారు. లాభాలు పంచుతుందనుకున్న టమాటా వర్షాల కారణంగా నిలువునా ముంచి అన్నదాతకు కన్నీళ్లే మిగిల్చింది. అధికారుల నిర్లక్ష్యం.. మండలంలో భారీ ఎత్తున టమాటా తోటలకు నష్టం వాటిల్లినా సర్వే నిర్వహించడంలో అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరదకు కొట్టుకుపోరుున పంటలను మాత్రమే అధికారులు పరిగణలోకి తీసుకున్నారని చెబుతున్నారు. ఇటీవలి వర్షాలకు నల్లబడి కాయలు పెద్దమొత్తంలో నీళ్లపాలైనా అధికారులు పట్టించుకోవడంలేదని పేర్కొంటున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి సర్వే ద్వారా నల్లబడి పంట నష్టపోరుున తమను ఆదుకోవాలని కోరుతున్నారు. లేకుంటే సాగుకు దూరం కావాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. సర్వే నిర్వహిస్తున్నం - బావురే ఉద్దవ్, తహశీల్దార్, ఇంద్రవెల్లి మండలంలో నష్టపోయిన టమాటా పంటపై సర్వే నిర్వహిస్తున్నం. సర్వే పూర్తయ్యూక నష్టం ఎంతో తేలుతుంది. ఆ తర్వాత ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తాం. నష్టపోయిన రైతులకు పరిహారం అందేలా చర్యలు తీసుకుంటాం. రైతులు ఆందోళన చెందొద్దు. -
అసలు నష్టమెంత?
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: వారం రోజులుగా పంటలన్నీ నీళ్లలోనే ఉన్నాయి. నెల రోజుల్లో చేతికొచ్చే తరుణంలో పంటలన్నీ నీటిపాలయ్యాయి. నష్టం గురించి ఏమని చెప్పగలం.. బ్యాంకుల నుంచి రైతులు రూ.742 కోట్ల రుణాలు తీసుకున్నారు. పరిహారం ఇచ్చే బదులు ఆ రుణాలు మాఫీ చేస్తే మంచిది.. వ్యవసాయాధికారుల సమాధానం. .. దీన్ని బట్టి చూస్తే జిల్లాలో పంట నష్టం కనీసం రూ.742 కోట్లు ఉన్నట్లు భావించాల్సి వస్తోంది. అయితే జిల్లా అధికారుల ప్రాథమిక అంచనా ప్రకారం రూ.265 కోట్లేనట!.. నష్టాలపై సర్వే మొదలు పెట్టకుండానే ఈ విధంగా అంచనా వేయడం గమనార్హం. అసలు రైతులకు జరిగిన నష్టమెంత? దాన్ని ఏ ప్రాతిపదికన గణించాలన్నది ప్రస్తుతం వ్యవసాయాధికారులను తర్జనభర్జనలకు గురిచేస్తోంది. రెండు రోజుల క్రితం వ్యవసాయశాఖ కమిషనర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన్నుంచి ఇదే ప్రశ్న ఎదురు కాగా అధికారులు సూటిగా చెప్పలేకపోయారు. వారం రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. పంటపొలాలు చెరువులను తలపిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఎంత నష్టమని చెప్పగలమని అధికారులు సమాధానం ఇచ్చారు. అయితే ప్రాథమిక అంచనాలు సోమవారం తయారు చేశారు. జిల్లా వ్యాప్తంగా వరి పంట 2.60 లక్షల ఎకరాల్లో నీట మునిగిందని తేల్చారు. నష్టం 260 కోట్లు ఉంటుదని అంచనా వేశారు. ఉద్యాన పంటలు 4500 ఎకరాల్లో దెబ్బతిన్నాయని, రూ. 5 కోట్ల మేర నష్టం జరిగి ఉంటుందని నిర్థారణకు వచ్చారు. పంటంతా నీటిలోనే.. జిల్లాలో సుమారు నాలుగు లక్షల ఎకరాల్లో వరి పంట వేశారు. నెల రోజుల్లో చేతికి రావాల్సిన ఈ పంటంతా గత వారం రోజు లుగా నీటిలోనే ఉంది. నీరంతా బయటకు వెళ్లడానికి మరో మూడు రోజులైనా పడుతుంది. ఈ లెక్కన పది రోజులు నీటిలో నానిన పంట దక్కే అవకాశం లేదన్నమాటే. పంటలు బాగా పండితే ఎకరాకు 30 బస్తాల వరకు దిగుబడి వస్తుంది. బస్తా వరి ధాన్యం కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసినా వెయ్యి రూపాయలు. అధికారుల చెప్పిన దెబ్బతిన్న పంట విస్తీర్ణం 2.60 లక్షల ఎకరాలకే లెక్క వేస్తే రూ. 800 కోట్లు అవుతుంది. దిగుబడిని దృష్టిలో ఉంచుకొని అంచనా వేయాలి పంట సాగుకు పెట్టిన పెట్టుబడులు, దిగుబడులను దృష్టిలో ఉంచుకొని నష్టం అంచనాలు తయారు చేయాల్సిన అవసరం ఉంది. పొలాల్లోనే ఉన్న పంట నష్టాన్ని ఎలా లెక్కించాలనే మీమాంస అధికారులు వ్యక్తం చేయడం సరికాదని రైతులు అంటున్నారు. మరో 30 రోజుల్లో చేతికి రావాల్సిన పంట నీటిపాలైన విషయాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. అందువల్ల ఎకరాకు సగటు దిగుబడి ఆధారంగా నష్టం అంచనా వేయాలని కోరుతున్నారు. బ్యాంకు రుణాలతో సమానంగా నష్టం జిల్లాలో రైతులు వివిధ బ్యాంకుల నుంచి సుమారు రూ. 742 కోట్ల పంట రుణాలు తీసుకున్నట్లు అధికారుల వద్ద సమాచారం ఉంది. పంట నష్టం కూడా దాదాపు అదే స్థాయిలో ఉన్నందున రుణాలను వెంటనే మాఫీ చేయాలని.. ఇంతకంటే తామేమీ చెప్పలేమని మండల వ్యవసాయశాఖ అధికారులు జిల్లా వ్యవసాయశాఖ ఉన్నతాధికారులకు తేల్చి చెప్పినట్లు సమాచారం. ఇదే కాకుండా చాలా మంది రైతులు ప్రైవేట్గా అప్పులు తీసుకున్నారు. ఇవన్నీ గుర్తించి అన్ని రకాల అప్పులు రద్దు చేయకుంటే పరిస్థితి మరో విధంగా ఉండే అవకాశం ఉంది. భూముల్లో మేటలు జిల్లాలోని మేజర్, మైనర్ ఇరిగేషన్ చెరువులు, కాలువలు, వంశధార, నాగావళి కాలువలకు 821 చోట్ల గండ్లు పడ్డాయి. ఇంకా పలు రోడ్లు కొట్టుకుపోయాయి. వీటిని సరిచేయడానికి చాలా సమయం పడుతుంది. వేలాది ఎకరాల్లో మట్టి మేటలు వేసింది. దాన్ని తొలగించుకునేందుకు రైతులకు కనీసం మూడు నెలలు పట్టే అవకాశం ఉంది. ఇటువంటి వాస్తవిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని రైతులకు పరిహారం ఇవ్వాల్సి ఉంది. -
నిండా ముంచింది!
సాక్షి, సంగారెడ్డి: జడివాన గడగడ లాడిస్తోంది. చేతికొచ్చిన పంటలను నాశనం చేస్తోంది. రెం డు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వరి, మొక్కజొన్న, పత్తి పంటలు దెబ్బతినడంతో రైతులు నిండా మునిగారు. మార్కెట్ యార్డు ల్లో ఎండ బెట్టిన మక్కల సైతం తడిసిపోయాయి. పత్తి గూడలు తడిసి రంగు మారాయి. వరి పంటలు ఒరిగి నేల కూలాయి. పంట నష్టంపై అధికారుల్లో స్పష్టత కరువైంది. రెవె న్యూ, వ్యవసాయ శాఖలు పరస్పర విరుద్ధ గణాంకాలతో ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక లు సమర్పించడం ప్రధాన శాఖల మధ్య సమన్వయ లోపాన్ని ఎత్తి చూపింది. వ్యవసాయ శాఖ 827.5 ఎకరాల్లో పంట లు దెబ్బతిన్నట్లు నివేదించగా.. రెవెన్యూ శాఖ తన నివేదికలో కేవలం 178 ఎకరాల్లో మాత్రమే నష్టాన్ని చూపించింది. అదే విధంగా జిల్లా వ్యాప్తంగా 315 గృహాలు పాక్షికంగా, 5 గృహాలు పూర్తిగా ధ్వంసం కావడంతో రూ.16.85 లక్షల నష్టం వాటిల్లినట్లు పేర్కొంది. ఎడ తెరిపి లేని వర్షం బుధవారం సాయంత్రం నుంచి జిల్లాలో ఏకధాటిగా జడివాన కురుస్తోంది. గురువారం ఉదయం 8 గంటల వరకు జిల్లాలో 40.6 మి.మీటర్ల సగటు వర్షం కురిసింది. అత్యధికంగా దౌల్తాబాద్ మండలంలో 100.2 మి.మీటర్ల వర్షపాతం నమోదు కాగా.. చిన్నశంకరంపేటలో 85.8 మి.మీ, మునిపల్లిలో 72 మి.మీ, మెదక్లో 63, తూప్రాన్లో 61, చేగుంటలో 60.6, హత్నూరలో 60.2, మిరుదొడ్డిలో 56.6, కోహీర్ 55.6, వెల్దుర్తి 53.6, శివ్వంపేటలో 52.4, రామాయంపేట 50.3, జిన్నారంలో 50.2, వర్గల్లో 50.4 మి.మీటర్ల వర్షం కురిసింది. కల్హేర్ మినహా అన్ని మండలాల్లో వర్షం కురిసింది. డివిజన్ల వారీగా పరిశీలిస్తే.. మెదక్లో 44.6 మి.మీటర్లు, సిద్దిపేటలో 651.6 మి.మీటర్లు, సంగారెడ్డిలో 27.5 మి.మీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. మక్కల కొనుగోళ్లకు బ్రేక్ ఎడ తెరపి లేని వర్షాలు మొక్కజొన్న రైతులను రెండు విధాలుగా దెబ్బతీశాయి. వర్షాలతో తేమ శాతం పెరిగిందని మార్క్ఫెడ్ కొనుగోళ్లు నిలిపివేసింది. మళ్లీ పొడి వాతావరణం ఏర్పడిన తర్వాతే కొనుగోళ్లు చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. సిద్దిపేట మార్కెట్లో మక్కల కొనుగోళ్లు చేయాలని రైతులు ఆందోళన దిగినా తామేమీ చేయలేమంటూ అధికారులు చేతులెత్తేశారు. మార్కెట్ యార్డుల్లో ఆరబెట్టిన మక్కలు తడిసిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. అధికారులు సరఫరా చేసిన టార్పాలిన్ కవర్లు సరిపడక మక్కల నిల్వలు నీటిపాలయ్యాయి. దుబ్బాక, మిరుదొడ్డి మార్కెట్ యార్డుల్లో 1,200 క్వింటాళ్లు, సిద్దిపేటలోని మార్క్ఫెడ్ కొనుగోలు కేంద్రం ప్లాట్ఫారాలపై ఆరబెట్టిన 500 క్వింటాళ్ల మక్కలు తడిసినట్లు సమాచారం. వర్షాలతో వరి పంటలు ఒరిగి నేల వాలాయి. పుల్కల్, అందోల్, హత్నూర, పెద్ద శంకరంపేట, రామాయంపేట, జగదేవ్పూర్, వర్గల్, దుబ్బాక, నంగనూరు మండలాల్లో 772.5 ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా నిర్ధారించింది. వాస్తవంగా ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉన్నట్లు తెలుస్తోంది. మెదక్ మార్కెట్లో ఉన్న వరి ధాన్యం తడిసింది. నంగనూరు మండలంలో 55 ఎకరాల్లో పత్తి పంటలు దెబ్బతిన్నాయి. ఖరీఫ్లో సాగు చేసిన పత్తి పంటలు చేతికొచ్చిన తరుణంలో వర్షాలు కురుస్తుండడంతో పత్తి గూడలు రంగుమారుతున్నాయి. -
నిండా ముంచింది!
సాక్షి, రంగారెడ్డి జిల్లా : వరుసగా కురుస్తున్న వర్షాలు జిల్లా రైతాంగాన్ని అతలాకుతలం చేశాయి. మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు భారీగా పంటలు దెబ్బతిన్నాయి. ఖరీఫ్ సీజన్లో వర్షాలు కొంత ఆలస్యం కావడంతో సాగు పనులు సైతం జాప్యమయ్యాయి. దీంతో జిల్లాలో సీజన్ ముగిసిన తర్వాత దిగుబడులు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో చాలాచోట్ల పంటలు చేతికొచ్చే స్థితిలో ఉండగా.. మంగళవారం నుంచి కురుస్తున్న వ ర్షాలు దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపాయి. మరో వారం రోజుల్లో కోతకు రానున్న వరి పంట తాజా వర్షాల ధాటికి నీటమునిగింది. ఇబ్రహీంపట్నం మండలం ఉప్పరిగూడ గ్రామంలో ఓ రైతు వరి పొలంలో పైరుపైనే మొలకలు వచ్చాయి. శంషాబాద్ మండలంలో మొక్కజొన్న దిగుబడులను పొలాల వద్ద ఆరబెట్టగా.. ఎడతెరిపిలేని వర్షాలతో ఆరబెట్టిన చోటే మొలకలు రావడంతో రైతులు కన్నీటిపర్యంతమయ్యారు. మరోవైపు పత్తి రైతు పరిస్థితి దీనంగా మారింది. వర్షాలకు పత్తి తడిసి ముద్ద కావడంతో దిగుబడులపై ఆశలు వదులుకుంటున్నారు. మురిపించి.. ముంచెత్తి.. ఖరీఫ్ సీజన్లో ఆలస్యంగానైనా ఆశించిన మేరకు కురిసిన వర్షాలు రైతుల్ని మురిపించాయి. దీంతో రైతులు ఉత్సాహంగా సాగు పనులు చేపట్టారు. సాధారణ స్థాయి కంటే ఎక్కువ విస్తీర్ణంలో వివిధ పంటలు సాగయ్యాయి. 21,055 హెక్టార్లలో వరి సాగవ్వగా, 46,313 హెక్టార్లలో మొక్కజొన్న, 55,035 హెక్టార్లలో పత్తి పంటలు సాగయ్యాయి. ప్రస్తుతం వీటిలో చాలావరకు చేతికొచ్చే దశలో ఉన్నాయి. అయితే ప్రస్తుత వర్షాలు దిగుబడిపై పెను ప్రభావాన్నే చూపిస్తున్నాయి. అయితే గురువారం సాయంత్రం నాటికి ఎలాంటి నష్టం జరగలేదని జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు విజయ్కుమార్ పేర్కొనడం గమనార్హం. 4.2 సెంటీమీటర్ల వర్షం.. తుపాను ప్రభావంతో మూడు రోజులుగా జిల్లావ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం జిల్లాలో 4.2సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇందులో అధికంగా చేవెళ్ల మండలంలో 9.6 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. అత్యల్పంగా గండేడ్ మండలంలో 0.6 సెం. మీ వర్షం కురిసింది. అయితే గురువారం కలెక్టర్ బి.శ్రీధర్కు సమర్పించిన నివేదికలో జిల్లా ప్రణాళిక శాఖ అధికారి బాలకృష్ణ అసలు వర్షమే లేనట్లుగా జిల్లా సగటు వర్షపాతం ‘0.0’గా వివరాలు ఇవ్వడం కొసమెరుపు. -
చినుకు.. వణుకు
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్లైన్: కళ్లెదుటే కష్టమంతా కొట్టుకుపోతోంది. ఊహించని వర్షం అన్నదాతను నిలువునా మించుతోంది. చేతికొచ్చిన పంటలు నోటికి అందకుండా పోతుండటాన్ని రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. అల్పపీడన ద్రోణి జిల్లా రైతాంగాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఆళ్లగడ్డలో మిద్దె కూలిన ఘటనలో ఓ మహిళ మృతి చెందగా.. ఆదోని వ్యవసాయ మర్కెట్ యార్డులో విక్రయానికి ఉంచిన పత్తి తడిసి భారీ నష్టం వాటిల్లింది. తుపాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలతో జిల్లాలో 10వేల ఎకరాల్లో వరి, 5వేల ఎకరాల్లో వేరుశనగ, మరో 2వేల ఎకరాల్లో ఇతర పంటలు దెబ్బతిన్నట్లు సమాచారం. గూడూరు, కోడుమూరు, క్రిష్ణగిరి మండలాల్లో మినహా అన్ని చోట్లా ఒక మోస్తరు నుంచి అతి భారీ స్థాయిలో వర్షం కురిసింది. అత్యధికంగా శ్రీశైలంలో 105.6 మిల్లీమీటర్లు, అత్యల్పంగా వెల్దుర్తిలో 2.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లా మొత్తం మీద సగటున 24 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఈ కారణంగా ఆత్మకూరు పరిధిలోని 4వేల ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. కోత దశకు వచ్చిన సమయంలో ఇలా జరగడంతో రైతులు తీవ్రంగా నష్టపోనున్నారు. నందికొట్కూరులో మొక్కజొన్న రైతుల కష్టమంతా నీటి పాలైంది. రుద్రవరంలో భారీ వర్షాల వల్ల ధాన్యం తడిసి ముద్దయింది. నంద్యాల, బండిఆత్మకూరు, గోస్పాడు, మహానంది మండలాల్లో జొన్న, వరి తదితర పంటలు 2వేల ఎకారల్లో దెబ్బతిన్నాయి. కొత్తపల్లి మండలంలో భారీ వర్షాల వల్ల సుద్దవాగు పొంగి వివిధ గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. వెలుగోడులో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కుండపోతగా కురిసిన వర్షంతో శ్రీశైలంవాసులు విలవిల్లాడారు. ఆలయ వీధులు, లోతట్టు ప్రాంతాలను వర్షం నీరు చుట్టుముట్టింది.