impeachment
-
దక్షిణకొరియా ప్రధాని అభిశంసన కొట్టివేత
సియోల్: దక్షిణ కొరియాలో నెలకొన్న రాజకీయ అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో అక్కడి రాజ్యాంగ న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. దేశంలో మార్షల్ లాకు కారణమయ్యారనే ఆరోపణలపై ప్రధాని హన్ డక్–సూను అభిశంసిస్తూ పార్లమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని కొట్టివేయడంతోపాటు ఆయనకు తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తూ తీర్పు వెలువరించింది. గతేడాది డిసెంబర్లో అకస్మాత్తుగా దేశంలో మార్షల్ లా విధించి అభిశంసనకు గురైన అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ వ్యవహారంపై ఎటువంటి ఆదేశాలు ఇవ్వకపోవడం గమనార్హం. అయితే, మార్షల్ లా విధింపులో ఎలాంటి పాత్ర లేని హన్ విషయంలో రాజ్యాంగ కోర్టు 7–1 మెజారిటీతో వెలువరించిన తీర్పు ప్రభావం యూన్ విషయంలో ఉంటుందో లేదో ఇప్పుడే చెప్పడం కష్టమని పరిశీలకులు చెబుతున్నారు. -
తెరపైకి ట్రంప్ అభిశంసన.. అంత ఈజీనా?
అధికారం చేపట్టి పట్టుమని రెండు వారాలు కూడా కాలేదు. ఈలోపే ఆయన్ని వైట్హౌజ్ పీఠం నుంచి దించేయాలనే డిమాండ్ మొదలైంది. అమెరికా ప్రయోజనాలే ముఖ్యమంటూ.. ఆయన తీసుకుంటున్న సంచలనాత్మక నిర్ణయాలు తీవ్ర విమర్శలకు దారి తీస్తున్నాయి. అయితే ఇలాంటి చర్యలు అమెరికాకు శత్రువులను పెంచడంతో పాటు ఆయన పదవీకి ముప్పుగా మారవచ్చనే మాట ఇప్పుడు వినిపిస్తోంది. 2.0లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్నవన్నీ సంచలన నిర్ణయాలే. బయటి దేశాల నుంచే కాదు.. అమెరికాలోనూ ఆ నిర్ణయాలపై వ్యతిరేకత మేధోవర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. ఈ క్రమంలో ఆయన్ని అభిశంసించాలంటూ చేపట్టిన పిటిషన్ లక్ష సంతకాలను దాటేసింది. అదీ కేవలం 11 రోజుల్లోనే!అధికారంలోకి రాకముందే కాదు.. ఎన్నికల ప్రచారంలోనూ ఆయన అవకతవకలకు పాల్పడ్డారన్నది ఈ పిటిషన్ వెనకాల ఉన్న ప్రధాన అభియోగం. అధికారం చేపట్టిన తొలిరోజు నుంచే తీసుకున్న.. తీసుకుంటున్న నిర్ణయాలను ఈ పిటిషన్ తప్పుబడుతోంది. ముఖ్యంగా కాపిటల్ హిల్స్ నిందితులకు క్షమాభిక్ష పెట్టడం, అమెరికా పౌరసత్వంపై రాజ్యాంగ విరుద్ధంగా తీసుకుంటున్న నిర్ణయలు ఇతరత్రాలు ఉన్నాయి.వాషింగ్టన్కు చెందిన ఫ్రీ స్పీచ్ ఫర్ పీపుల్ అనే సంస్థ తన వెబ్సైట్ ద్వారా ఈ క్యాంపెయిన్ నడిపిస్తోంది. అయితే ఈ సంతకాలు లక్ష దాటిన నేపథ్యంతో.. ట్రంప్పై ప్రజా వ్యతిరేకతను కాంగ్రెస్(పార్లమెంట్)పరిగణనలోకి తీసుకోవాలని, అభిశంసన ద్వారా ఆయన్ని పదవీచ్యుతుడ్ని చేయాలని కోరుతోంది. అయితే.. ఇలా ఓ సంతకాల పిటిషన్ ద్వారా అమెరికా అధ్యక్షుడ్ని తొలగించడం సాధ్యమేనా?..సంతకాల సేకరణ ద్వారా ఏ దేశ అధినేతను తొలగించిన దాఖలాలు లేవు. రాజకీయపరమైన కారణాలతోనే.. ఒక దేశ అధినేతను అభిశంసించేందుకు వీలు ఉంటుంది.అయితే ఈ తరహా సంతకాల సేకరణ చర్యతో.. సదరు అంశానికి ప్రజల మద్ధతు ఏమేర ఉందో చూపించొచ్చు. తద్వారా మీడియా, సోషల్ మీడియాను ఆకర్షించొచ్చు. అలా.. ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా చట్టసభ్యులపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలని ఒత్తిడి మాత్రం చేయొచ్చు. అందుకే వీలైనన్ని ఎక్కువ సంతకాల్ని సేకరించే పనిలో ఉంది ఫ్రీ స్పీచ్ ఫర్ పీపుల్ గ్రూప్. అలాగే ఫ్రీ స్పీచ్ ఫర్ పీపుల్ 2017లోనూ ట్రంప్పై ఇలాంటి క్యాంపెయిన్ నడిపించినా.. ఆ టైంలో ప్రజల నుంచి పెద్దగా స్పందన దక్కలేదు.గత హయాంలో ట్రంప్ రెండుసార్లు అభిశంసన ఎదుర్కొన్నారు. 2019లో ఓసారి, 2021 కాపిటల్ దాడికి సంబంధించి రెండోసారి ఎదుర్కొన్నారు. అయితే ఆ రెండు సందర్భాల్లోనూ ఆయన తొలగింపును హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ సమర్థించగా.. సెనేట్ మాత్రం వదిలేసింది. ప్రస్తుతం హౌజ్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్తో పాటు సెనేట్లోనూ రిపబ్లికన్ పార్టీ బలంగా ఉంది. సో.. ట్రంప్పై ఈ టర్మ్లో అభిశంసన పెట్టడం అంత వీజీకాదిప్పుడు. -
అలహాబాద్ హైకోర్టు జడ్జి శేఖర్ యాదవ్పై వేటు తప్పదా?
న్యాయ్యవస్థలో అత్యంత కీలమైన వారు న్యాయమూర్తులు. రాగద్వేషాలకు అతీతంగా వీరు వ్యవహరించాల్సి ఉంటుంది. ఇటీవల కాలంలో కొంతమంది న్యాయమూర్తులు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా అలహాబాద్ హైకోర్టు సిట్టింగ్ జడ్జి జస్టిస్ డాక్టర్ శేఖర్ యాదవ్ వివాదంలో చిక్కుకున్నారు. ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ) మద్దతుగా వ్యాఖ్యానించి చిక్కుల్లో పడ్డారు. దీంతో ఆయనను న్యాయమూర్తి పదవి నుంచి తొలగిచేందుకు కేంద్రంలోని ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. రాజ్యసభలో అభిశంసన తీర్మానం పెట్టేందుకు యత్నిస్తున్నాయి.అసలేంటి వివాదం?ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఆదివారం (డిసెంబర్ 8) అలహాబాద్ హైకోర్టు లైబ్రెరీ హాల్లో విశ్వహిందూ పరిషత్ హైకోర్టు యూనిట్ లీగల్ సెల్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ) అంశంపై మాట్లాడుతూ.. మెజారిటీ ప్రజల అభీష్టం మేరకే చట్టం నడుచుకోవాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. కుటుంబంగా చూసినా, సమాజంగా చూసినా మెజారిటీ ప్రజల సంక్షేమం, సంతోషమే ముఖ్యమని అన్నారు. బహుభార్యత్వం, త్రిపుల్ తలాఖ్, హలాలా వంటి విధానాలు ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. దేశంలోని పౌరులందరినీ సమానంగా చూడాలన్నదే యూసీసీ లక్ష్యమని చెప్పుకొచ్చారు.పదవి నుంచి తొలగించాల్సిందేజస్టిస్ డాక్టర్ శేఖర్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. మతసామరస్యాన్ని భంగపరిచేలా ఆయన మాట్లాడారని ధ్వజమెత్తాయి. న్యాయమూర్తి పదవి నుంచి ఆయనను తప్పించేందుకు పార్లమెంట్లో అభిశంసన తీర్మానం పెట్టేందుకు సిద్ధమయ్యాయి. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ ముందుగా ఈ ప్రతిపాదన చేయగా సీనియర్ లాయర్లు కపిల్ సిబల్, వివేక్ తఖ్కా బలపరిచారు. రాజ్యసభలో విపక్ష సభ్యుల నుంచి బుధవారం నాటికి 38 మంది సంతకాలు సేకరించారు. న్యాయమూర్తులు రాజకీయ ప్రకటన చేయడం పట్ల ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మైనారిటీల పట్ల వ్యతిరేకతను బహిరంగంగా వ్యక్తపరిచిన జస్టిస్ శేఖర్ యాదవ్.. తాను విచారించే కేసులలో నిష్పక్షపాతంగా వ్యవహరించలేరని, ఆయనను న్యాయమూర్తి పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు సుప్రీంకోర్టు కూడా జస్టిస్ శేఖర్ యాదవ్ వ్యాఖ్యలపై స్పందించింది. అలహాబాద్ హైకోర్టు నుంచి వివరణ కోరింది.అంత ఈజీ కాదు..హైకోర్టు జడ్జిని పదవీచ్యుతుడిని చేయడం అంటే మామూలు విషయం కాదు. దానికి చాలా పెద్ద వ్యవహారమే ఉంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 124, ఆర్టికల్ 218లో దీని ప్రస్తావన ఉంది. న్యాయమూర్తిని తొలగించాలన్న తీర్మానాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టాలంటే 100 మంది లోక్సభ సభ్యులు లేదా 50 మంది రాజ్యసభ ఎంపీలు సంతకాలు చేయాలి. ఈ పిటిషన్ను లోక్సభ స్పీకర్ లేదా రాజ్యసభ చైర్మన్ను అందజేయాలి. పార్లమెంట్లో తీర్మానం ఆమోదం పొందాలంటే మూడింట రెడింతల మెజారిటీ తప్పనిసరి. పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించిన తీర్మానాన్ని అదే సెషన్లో రాష్ట్రపతికి సమర్పించాలి. తర్వాత రాష్ట్రపతి ప్రకటన చేయడం ద్వారా న్యాయమూర్తిని పదవి నుంచి తొలగిస్తారు.చదవండి: మందిర్- మసీదు పిటిషన్లపై ‘సుప్రీం’ సంచలన ఆదేశాలుఅయితే ఇదంతా మనం చెప్పుకున్నంత సులభమేమీ కాదు. పార్లమెంట్లో తీర్మానాన్ని చర్చకు అంగీకరించడానికి ముందు చాలా తతంగం ఉంటుంది. ఒకవేళ తీర్మానం ప్రవేశపెట్టేందుకు అంగీకరించిన పక్షంలో లోక్సభ స్పీకర్ లేదా రాజ్యసభ చైర్మన్ ముగ్గురు సభ్యులతో కమిటీని నియమిస్తారు. ఇందులో సుప్రీంకోర్టు జడ్జి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు ప్రముఖ న్యాయనిపుణుడు సభ్యులుగా ఉంటారు. కమిటీ నివేదిక ఆధారంగానే పార్లమెంట్ ఉభయ సభల్లో తీర్మానాన్ని చర్చకు పెడతారు. తర్వాత తీర్మానంపై ఓటింగ్ జరుపుతారు. న్యాయవ్యవస్థ స్వతంత్రతను కాపాడేందుకు ఇంత సుదీర్ఘ ప్రక్రియ నిర్వహిస్తారు. తీవ్రమైన దుష్ప్రవర్తన లేదా అసమర్థత కారణంగానే న్యాయమూర్తి పదవీత్యుడయ్యారనేలా ఈ వ్యవహారం సాగుతుంది. కాగా, తాజా వివాదం నుంచి జస్టిస్ శేఖర్ యాదవ్ బయటపడే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. అధికార ఎన్డీఏ కూటమి పార్లమెంట్ ఉభయ సభల్లో బలంగా ఉందన్న విషయం అందరికీ తెలిసిందే.గతంలోనూ తీర్మానాలుహైకోర్టు న్యాయమూర్తులపై గతంలోనూ పార్లమెంట్లో అభిశంసన తీర్మానాలు ప్రవేశపెట్టిన దాఖలాలు ఉన్నాయి. 1993లో జస్టిస్ వి రామస్వామికి వ్యతిరేకంగా లోక్సభలో ప్రవేశపెట్టిన తీర్మానం ఓడిపోయింది.2011లో కలకత్తా హైకోర్టు జడ్జి సౌమిత్రా సేన్కు వ్యతిరేకంగా రాజ్యసభ తీర్మానం ఆమోదించడంతో ఆయన రాజీనామా చేశారు. 2015లో రాజ్యసభ తీర్మానంతో గుజరాత్ హైకోర్టు జడ్జి జస్టిస్ జేబీ పార్దివాలా పదవీచ్యుతుడయ్యారు.2016-17లో ఏపీ-తెలంగాణ హైకోర్టు జడ్జి జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డిపై రెండుసార్లు పెట్టిన తీర్మానం వీగిపోయింది. 2017లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాపై పెట్టిన తీర్మానాన్ని రాజ్యసభ చైర్మన్ తిరస్కరించారు. -
ద. కొరియాలో ముదురుతున్న సంక్షోభం
సియోల్(దక్షిణకొరియా): దేశవ్యాప్తంగా అత్యయిక స్థితి(మార్షల్ లా) ప్రకటన నేపథ్యంలో దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ కార్యాలయంలో సోదాలకు పోలీసులు సాహసించారు. అయితే అధ్యక్ష కార్యాలయం భద్రతా బలగాలు వెంటనే పోలీసులను అడ్డుకున్నారు. దీంతో యూన్ కార్యాలయ ప్రధాన భవనంలోకి పోలీసులు ప్రవేశించలేకపోయారు. దీంతో పౌర సేవల కార్యాలయాల్లో పోలీసులు తనిఖీలు చేశారు. పార్లమెంట్ ఉభయ సభల్లో ఆధిక్యత లేకపోవడంతో ఏ బిల్లును ప్రవేశపెట్టినా విపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవడం, పదవి నుంచి వైదొలగాలన్న డిమాండ్లను ఎదుర్కొంటున్న అధ్యక్షుడు యూన్ యోల్ ఇటీవల అనూహ్యంగా ‘మార్షల్ లా’ప్రకటించడం తెల్సిందే. తర్వాత విపక్షాలు పార్లమెంట్లో తీర్మానం చేసి ఎమర్జెన్సీని ఎత్తేయడం, అధ్యక్షుడు యూన్ సహా పలువురు దేశద్రోహం ఆరోపణలను ఎదుర్కొంటున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో బుధవారం అధ్యక్షుడికి సంబంధించిన ఆఫీస్లలో పోలీసులు ఆకస్మిక సోదాలు చేశారు. దాడులు జరిగిన సమయంలో అధ్యక్షుడు యూన్ కార్యాలయంలో లేరు. యోన్కు సన్నిహితులైన పలువురు అధికారులు రాజీనామా చేశారు.మాజీ రక్షణ మంత్రి ఆత్మహత్యాయత్నం ‘మార్షల్ లా’విధించడానికి కారకుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నాటి రక్షణ మంత్రి కిమ్ యోంగ్ హ్యూన్ను పోలీసులు అరెస్ట్చేయగా అరెస్ట్పై మనస్తాపంతో ఆయన మంగళవారం రాత్రి జైలు గదిలో ఆత్మహత్యకు ప్రయతి్నంచినట్లు అధికారులు తెలిపారు. మార్షల్ లా విధించాలని సిఫార్సు చేసిన కిమ్ను రాజధాని సియోల్లో ఆదివారం అదుపులోకి తీసుకున్న విషయం తెల్సిందే. మంగళవారం అర్ధరాత్రి అధికారికంగా అరెస్టు వారెంట్ జారీ కాకముందే ఆయన ఆత్మహత్యాయత్నం చేశారు. ఆయన బాత్రూమ్లో ఆత్మహత్యకు ప్రయతి్నంచగా జైలు అధికారులు ఆయనను వెంటనే అడ్డుకున్నారు. వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించారు.ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడానే ఉందని రక్షణ శాఖ శాఖ పార్లమెంట్కు తెలిపింది. కిమ్పై నేరాభియోగాలు మోపాలా వద్దా అనే దానిపై పబ్లిక్ ప్రాసిక్యూటర్లు 20 రోజుల్లోపు నిర్ణయం తీసుకోనున్నారు. మరోసారి అభిశంసన గత శనివారం అధ్యక్షుడిపై ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానం వీగిపోయిన నేపథ్యంలో ప్రధాన విపక్ష డెమొక్రటిక్ పార్టీ మరోసారి అభిశంసన తీర్మానం పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. మార్షల్ లా అమలు కోసం పనిచేసిన ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులను దర్యాప్తు అధికారులు బుధవారం అరెస్ట్చేశారు. రెండోసారి అభిశంసన ప్రవేశపెట్టిన కొద్దిసేపటికే ఈ ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులను అరెస్ట్చేయడం గమనార్హం. -
అభిశంసనలు.. ఆత్మహత్య... జైలు శిక్షలు!
దక్షిణ కొరియాలో తాజాగా ఎమర్జెన్సీ విధింపు తీవ్ర దుమారానికే దారితీసింది. విపక్షాల్లోని ఉత్తర కొరియా అనుకూల దేశద్రోహ శక్తుల ఏరివేత కోసమంటూ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ తీసుకున్న నిర్ణయం దేశమంతటా అలజడి రేపింది. విపక్షాలతో పాటు సొంత పార్టీ నుంచీ దీనిపై తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. విపక్షాలన్నీ కలిసి కొన్ని గంటల్లోనే పార్లమెంటు ఓటింగ్ ద్వారా మార్షల్ లాను ఎత్తేశాయి. దేశంపై సైనిక పాలనను రుద్దజూశారంటూ విపక్ష డెమొక్రటిక్ పార్టీ యూన్పై అభిశంసన తీర్మానమూ ప్రవేశపెట్టింది. దాంతో దేశం పెను రాజకీయ సంక్షోభంలో పడింది. అభిశంసనలు, జైలు, హత్యల వంటి మరకలు దక్షిణ కొరియా అధ్యక్ష చరిత్రలో పరిపాటే. నిజానికి ఆ దేశ రాజకీయ చరిత్రంతా తిరుగుబాట్లమయమే!విద్యార్థుల తిరుగుబాటు దక్షిణ కొరియా తొలి అధ్యక్షుడు సింగ్మన్ రీ 1960లో విద్యార్థుల భారీ తిరుగుబాటు దెబ్బకు రాజీనామా చేసి తప్పుకోవాల్సి వచ్చింది. ఎన్నికల్లో రిగ్గింగ్కు పాల్పడటంతో యువతలో ఆయనపై ఆగ్రహం పెల్లుబుకింది. దిగిపోవ్సాఇందేనంటూ డిమాండ్లు వెల్లువెత్తాయి. రాజీనామా అనంతరం రీ దేశ బహిష్కరణకు గురయ్యారు. హవాయికి వెళ్లిపోయి 1965లో మరణించేదాకా అక్కడే గడిపాల్సి వచి్చంది.సైనిక తిరుగుబాటు మరో అధ్యక్షుడు యున్ పో సన్ 1961లో సైనికాధికారి పార్క్ చుంగ్ హీ సైనిక తిరుగుబాటు వల్ల పదవీచ్యుతుడయ్యాడు. అయినా యున్కు కొంతకాలం పదవిలో కొనసాగేందుకు పార్క్ అనుమతించినా నెమ్మదిగా ప్రభుత్వాన్ని తన అ«దీనంలోకి తెచ్చుకున్నారు. తరవాత 1963 ఎన్నికల్లో నెగ్గి అధికారాన్ని యున్ స్థానంలో అధ్యక్షుడయ్యారు.రాజద్రోహం, జైలు గ్వాంగ్జు తిరుగుబాటును క్రూరంగా అణచివేసిన చున్ డూ హ్వాన్ 1987లో పదవి నుంచి వైదొలిగారు. భారీ నిరసనల ఫలితంగా అధ్యక్ష పదవి నుంచి తప్పుకొన్నారు. కొరియా యుద్ధ సమయంలో తన అనుచరుడు రోహ్ టే వూకు అధికారం అప్పగించారు. అనంతరం అవినీతి, హింసతో దేశం కుదేలైంది. దాంతో తిరుగుబాటు ఇతర నేరాల కింద చున్, రోహ్ రాజద్రోహం అభియోగాలను ఎదుర్కొన్నారు. చున్కు మరణశిక్ష విధించానా తరవాత జీవిత ఖైదుగా మార్చారు. రోహ్కు ఇరవై రెండున్నరేళ్లు జైలు శిక్ష విధించారు. రెండేళ్ల జైలు శిక్ష నంతరం ఇద్దరికీ 1998లో క్షమాభిక్ష లభించింది.అవినీతి, ఆత్మహత్య 2003 నుంచి 2008 వరకు దక్షిణ కొరియా అధ్యక్షుడిగా ఉన్న రో మూ హ్యూన్ అవినీతి ఆరోపణల నేపథ్యంలో 2009లో కొండపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. సంపన్న షూ తయారీదారు కంపెనీ నుంచి లంచం తీసుకున్నారనే అభియోగాలు విచారణలో ఉండగానే జీవితాన్ని అంతం చేసుకున్నారు. 15 ఏళ్ల జైలు శిక్ష 2008 నుంచి 2013 దాకా అధ్యక్షునిగా ఉన్న లీ మ్యూంగ్ బాక్కు అవినీతి కేసులో జైలు శిక్ష పడింది. పన్ను ఎగవేత కేసులో దోషిగా తేలిన సామ్సంగ్ సంస్థ చైర్మన్ నుంచి లంచాలు తీసుకున్నట్టు రుజువైంది. దాంతో 2018లో ఆయనకు 15 ఏళ్ల జైలు శిక్ష పడింది. కానీ 2022 డిసెంబర్లో ప్రస్తుత అధ్యక్షుడు యూన్ ఆయనకు క్షమాభిక్ష ప్రసాదించారు! అధ్యక్షురాలికి అభిశంసన, జైలు దక్షిణ కొరియా తొలి అధ్యక్షురాలు పార్క్ గ్యూన్ హై 2016లో అభిశంసన ఎదుర్కొన్నారు. తరవాత జైలు శిక్ష అనుభవించారు. ఆమె మాజీ నియంత పార్క్ చుంగ్ హీ కుమార్తె. 2013 నుంచి పదవిలో ఉన్నారు. సామ్సంగ్ వంటి సంస్థల నుంచి భారీగా లంచాలు తీసుకున్నట్టు ఆరోపణలు ఎదుర్కొన్నారు. రహస్య పత్రాలను లీకేజీ, తనను విమర్శించే కళాకారులను బ్లాక్లిస్టులో పెట్టడం, వ్యతిరేకించిన అధికారులను తొలగించడం వంటి ఆరోపణలూ ఉన్నాయి. దాంతో 2017లో పార్క్ అభిశంసనకు గురయ్యారు. అభియోగాలు నిర్ధారణవడంతో 2021లో 20 ఏళ్ల జైలు శిక్ష, భారీ జరిమానా పడ్డాయి. కానీ అధ్యక్షుడు మూన్ జే ఇన్ ఆమెకు క్షమాభిక్ష పెట్టారు. ఆ సమయంలో సియోల్ ప్రాసిక్యూటర్గా ఉన్నది ప్రస్తుత అధ్యక్షుడు యూన్ కావడం విశేషం. పార్క్ తొలగింపు, జైలు శిక్ష విధింపులో ఆయనదే కీలక పాత్ర. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Parliament Session: చినికి చినికి గాలివానగా... జయ వర్సెస్ ధన్ఖడ్!
న్యూఢిల్లీ: పేరులో ఏముందంటారు. కానీ పేరు పెను వివాదానికి దారి తీయగలదని, అంతకుమించి రాజకీయ సంక్షోభానికీ కారణం కాగలదని రాజ్యసభ సాక్షిగా రుజువైంది. సమాజ్వాదీ ఎంపీ జయాబచ్చన్ పేరు విషయమై శుక్రవారం రాజ్యసభలో రాజుకున్న రగడ నాటకీయ మలుపులు తిరిగి చివరికి రాజకీయ దుమారంగా మారింది. ఏకంగా రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్ఖడ్ను ఉపరాష్ట్రపతి పదవి నుంచి తొలగించాలంటూ అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలని విపక్ష ఇండియా కూటమి నిర్ణయించుకునే దాకా వెళ్లింది! దాంతో విపక్ష సభ్యులకు, ఆయనకు మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న విభేదాలు కీలక మలుపు తిరిగాయి. వేడెక్కిన రాజ్యసభ జయాబచ్చన్ ‘పేరు’ అంశం శుక్రవారం రాజ్యసభను అమాంతం వేడెక్కించింది. విపక్ష నేత మల్లికార్జున ఖర్గేపై గత వారం బీజేపీ సభ్యుడు ఘన్శ్యాం తివారీ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలంటూ కాంగ్రెస్ ఎంపీలు డిమాండ్ చేయడంతో రగడకు బీజం పడింది. ఇది ముగిసిపోయిన అంశమని ధన్ఖడ్ బదులివ్వడంతో విపక్ష ఎంపీలంతా గొడవకు దిగారు. దీనిపై జయ మాట్లాడతాననడంతో ధన్ఖడ్ అనుమతించారు. ‘జయా అమితాబ్ బచ్చన్! మాట్లాడండి’ అన్నారు. ఆయన తన పేరును పిలిచిన తీరులో వ్యంగ్యం ధ్వనిస్తోందంటూ జయ తీవ్ర అభ్యంతరం వెలిబుచ్చారు. ‘‘నేను నటిని. హావభావాలను ఇట్టే అర్థం చేసుకోగలను. మీ మాటతీరు ఏమాత్రం అంగీకారయోగ్యంగా లేదు. మీరు సభాధ్యక్ష స్థానంలో ఉండొచ్చు గాక. కానీ మీరు మా తోటి సభ్యులు మాత్రమే’’ అన్నారు. దాంతో ధన్ఖడ్ తీవ్రంగా ఆగ్రహించారు. ‘ఇక చాలు’ అంటూ మధ్యలోనే కలి్పంచుకున్నారు. ‘‘మీకు గొప్ప పేరుండొచ్చు. కానీ నటీనటులు దర్శకుడు చెప్పినట్టు చేయాల్సిందే. సభాధ్యక్ష స్థానం నుంచి నేను చూసేది మీకు కని్పంచకపోవచ్చు. నా మాటతీరునే తప్పుబడతారా? నేనేం చేయాలో మీరు నిర్దేశించలేరు’’ అంటూ ఆక్షేపించారు. ఇందుకు విపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలపడంతో ధన్ఖడ్ మరింతగా మండిపడ్డారు. ‘‘మీరు సెలబ్రిటీ అయినా, మరెవరైనా సరే! నథింగ్ డూయింగ్. నిబంధనలను అర్థం చేసుకోవాల్సిందే. సభా మర్యాదలు పాటించి తీరాల్సిందే’’ అని బచ్చన్కు స్పష్టం చేశారు. విపక్ష ఎంపీలంతా తీవ్ర అభ్యంతరం తెలిపినా, మూకుమ్మడిగా నినాదాలకు దిగినా లెక్కచేయలేదు. ఈ అంశంపై మాట్లాడేందుకు ఎవరికీ అనుమతివ్వబోనని స్పష్టం చేశారు. ‘‘పేరు ప్రఖ్యాతులు మీకే ఉంటాయనుకోకండి. మనమంతా ఇక్కడికొచ్చేది మన బాధ్యతలు సరిగా నిర్వర్తించి పేరు సంపాదించేందుకే. పేరు ప్రఖ్యాతులకు తగ్గట్టుగా నడుచుకోవాలి’’ అంటూ క్లాసు తీసుకున్నారు. ‘‘సీనియర్ సభ్యులైనంత మాత్రాన సభాపతి స్థానాన్ని అవమానించేందుకు సభాపతి మాటతీరుకు ఉద్దేశాలు ఆపాదించేందుకు ఎవరికీ హక్కు లేదు. పరిస్థితిని బట్టి ప్రతిస్పందించాల్సి వచ్చింది. నా సొంత స్క్రిప్టునే అనుసరిస్తాను తప్ప ఎవరో చెప్పినట్టు నడుచుకునే ప్రసక్తే లేదు’’ అంటూ కుండబద్దలు కొట్టారు. విపక్ష సభ్యుల వ్యాఖ్యలేవీ రికార్డుల్లోకి వెళ్లబోవని స్పష్టం చేశారు. జయ పేరుపై రాజ్యసభలో ఆమెకు, ధన్ఖడ్కు సంవాదం జరగడం వారం రోజుల్లో ఇది మూడోసారి. మేం స్కూలు పిల్లలమా?: జయ ధన్ఖడ్ తీరుకు నిరసనగా వాకౌట్ చేస్తున్నట్టు విపక్ష సభ్యులు ప్రకటించారు. దాంతో ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ‘‘మీరు దేశం మొత్తాన్నీ అస్థిరపరిచే ప్రయత్నంలో ఉన్నారని నాకు బాగా తెలుసు. సభలో గందరగోళం సృష్టించడమే మీ ఉద్దేశం. అందుకు ఎట్టి పరిస్థితిలోనూ అనుమతించబోను. మీరంతా మీ బాధ్యతల నుంచి పారిపోతున్నారు’’ అంటూ ఆక్షేపించారు. ‘‘రాజ్యాంగాన్ని పణంగా పెట్టయినా ఖర్గే తన మాట నెగ్గించుకోవాలనుకుంటున్నారు. ఇది రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే’’ అంటూ తప్పుబట్టారు. అనంతరం సోనియాగాంధీ తదితరులతో కలిసి జయాబచ్చన్ సభ నుంచి వాకౌట్ చేశారు. సభా ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. ‘‘క్రమశిక్షణలో పెట్టేందుకు మేమేమీ స్కూలు పిల్లలం కాదు. ధన్ఖడ్ మాటతీరుతో చాలా కలత చెందాను. అధికార పక్ష సభ్యులు నిండు సభలో మా పట్ల అమర్యాదకరమైన మాటలు వాడుతున్నారు’’ అని ఆరోపించారు.87 మంది ఎంపీల సంతకాలుఉపరాష్ట్రపతి ధన్ఖడ్ అభిశంసనకు తీర్మానం ప్రవేశపెట్టాలని ఇండియా కూటమి నిర్ణయించింది. ఈ మేరకు నోటీస్పై 87 మంది విపక్ష ఎంపీలు సంతకాలు చేసినట్టు సమాచారం. ‘‘నోటీసు ఎప్పుడివ్వాలో త్వరలో నిర్ణయిస్తాం. ఇది తీర్మానం దాకా వెళ్లకపోయినా, చైర్మన్గా ధన్ఖడ్ అనుసరిస్తున్న ఏకపక్ష పోకడలను దేశ ప్రజల ముందు ఎత్తి చూపడమే మా ఉద్దేశం’’ అని విపక్షాలు స్పష్టం చేశాయి.ముందస్తు నోటీసు తప్పనిసరి రాజ్యాంగంలోని ఆరి్టకల్ 67(బి) ప్రకారం ఉపరాష్ట్రపతిని తొలగించాలని కోరుతూ మహాభిశంసన తీర్మానం ప్రవేశపెట్టవచ్చు. మెజారిటీ సభ్యుల మద్దతు లభిస్తే తీర్మానం నెగ్గి ఆయన పదవీచ్యుతుడవుతారు. అయితే మహాభిశంసన కోరుతూ తీర్మానం ప్రవేశపెట్టబోతున్నామంటూ కనీసం 14 రోజుల ముందస్తు నోటీసివ్వడం తప్పనిసరి. -
మాల్దీవుల అధ్యక్షుడిపై అభిశంసన తీర్మానం!
మాల్దీవుల అధికారపార్టీ పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్(PNC)పై తీవ్రమైన అసమ్మతి పెరుగుతోంది. దీంతో దేశ రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. తాజాగా మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జుకు చెందిన అధికార పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్పై ప్రతిపక్ష మాల్దీవీయన్ డెమోక్రటిక్ పార్టీ అభిశంసన తీర్మానం ప్రవేశపట్టడానికి కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆ దేశ మీడియా సోమవారం పలు కథనాలు ప్రచురించింది. ప్రతిపక్ష మాల్దీవీయన్ డెమోక్రటిక్ పార్టీ(ఎండీపీ), మరో భాగస్వామ్య పార్టీకి చెందిన ఎంపీలందరితో అభిశంసన తీర్మానంపై సంతకాలు చేయిస్తున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతానికి ప్రతిపక్ష ఎండీపీ అభిశంసన తీర్మానాన్ని ఇంకా పార్లమెంట్లో సమర్పించలేదు. అయితే ఆదివారం మల్దీవుల పార్లమెంట్లో అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జు ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానం ఘర్షణకు దారితీసింది. తీర్మానం ఓటింగ్ను ప్రతిపక్ష ఎంపీలు అడ్డుకున్నారు. అక్కడితో ఆగకుండా స్పీకర్కు వ్యతిరేకంగా నిరసనకు దిగారు. దీంతో అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల ఎంపీలు పార్లమెంట్లోనే తన్నుకున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రతిపక్ష పార్టీలు అన్ని మహ్మద్ మొయిజ్జు ప్రభుత్వంపై అభిశంసన తీర్మానం ప్రవేశపట్టడానికి సిద్ధమైనట్లు సమాచారం. చదవండి: Maldives: మాల్దీవుల పార్లమెంట్లో ఎంపీల కొట్లాట -
బైడెన్పై అభిశంసనకు సిద్ధమైన రిపబ్లికన్లు
అమెరికా అధ్యక్షుడు జోబైడెన్పై రిపబ్లికన్లు అభిశంసన తీర్మానానికి సిద్ధమయ్యారు. అంతర్జాతీయ లంచం కేసులో అతని ప్రమేయాన్ని వివరించే ఎఫ్బిఐ పత్రాలు బయటకు వచ్చిన నేపధ్యంలో బైడెన్పై అభిశంసనకు పూనుకున్నారు. ‘వైట్ హౌస్లో ఉంటున్న అవినీతి కుటుంబం’ సెనేటర్ చక్ గ్రాస్లీ ఎఫ్డీ-1023 ఫారమ్ను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దానిలో బైడెన్, అతని కుమారుడు హంటర్ తాము చేసిన సహాయానికి బదులుగా కైవ్కు చెందిన బురిస్మా హోల్డింగ్స్ సీఈఓను మిలియన్ల డాలర్లు చెల్లించాలని ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపించారు. ప్రతినిధి జిమ్ బ్యాంక్స్ ట్విట్టర్లో ఈ పత్రాలను తిరిగి పోస్ట్ చేస్తూ, వైట్ హౌస్లో ఉంటున్న అత్యంత అవినీతి కుటుంబం అని ఆరోపించారు. వీరి అవినీతి ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవాలంటే దీనిని చదివి తెలుసుకోండి. బైడెన్ను వెంటనే పదవి నుండి తొలగించాలని అతను కోరారు. ‘బైడెన్ నేరాలకు రుజువులున్నాయి’ గ్రాండ్ ఓల్డ్ పార్టీకి చెందిన ఇతర నాయకులు ఈ అభిశంసనకు వంతపాడారు. 80 ఏళ్ల అధ్యక్షుడిని గద్దె దించాలని డిమాండ్ చేశారు. బైడెన్ ఉక్రెయిన్లో జరుగుతున్న యుద్ధంలో అమెరికా తరపున పాల్గొన్నారు. బైడెన్ ఒక నేరస్తుడు. అతను మనల్ని డబ్బ్యుడబ్ల్యు3లోకి నడిపిస్తున్నాడు. ఎందుకంటే ఉక్రేనియన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో పాటు బైడెన్లు చేసిన నేరాలకు రుజువు ఉందంటూ ప్రతినిధి మార్జోరీ టేలర్ గ్రీన్ ఆరోపించారు. ఈ విషయంలో రిపబ్లికన్లు ఇక జాప్యం చేయలేరు. ఇందుకోసం మాకు 218 రిపబ్లికన్ ఓట్లు అవసరం. నేను మొదటి రోజు నుండి ఇదే మాటపై ఉన్నాను. అమెరికన్ ప్రజలు కూడా ఇదే అభిప్రాయంలో ఉన్నారని ఆమె పేర్కొన్నారు. మరో ప్రతినిధి ఆండీ బార్ ఇలా రాశారు.. బైడెన్ రాజీ పడ్డాడనడానికి ఇది అసలైన సాక్ష్యం. బైడెన్ కుటుంబం అవినీతిలో కూరుకుపోయిందని పేర్కొన్నారు. ‘అవి నిరాధార ఆరోపణలు’ వైట్ హౌస్ అధికారులు రిపబ్లికన్ పార్టీ సభ్యులు చేసిన ఆరోపణలను తప్పుబట్టారు. ఆ పత్రాలు నిజానిజాలతో సంబంధం లేకుండా ప్రచురితమయ్యాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ రిపబ్లికన్లు నిజానిజాలతో సంబంధం లేకుండా అధ్యక్షుడు బైడన్పై ఆరోపణలు చేయడం సరైనది కాదన్నారు. ఇది కూడా చదవండి: స్కూలుకు లేదు డుమ్మా.. 50 దేశాలు చుట్టొచ్చిందమ్మా..! 🚨BREAKING🚨 The FD-1023 form alleging then-Vice President JOE BIDEN was involved in a $5,000,000 bribery scheme with a Burisma executive has been released by @ChuckGrassley. Read 👇 pic.twitter.com/Mc6dVIwdsG — Oversight Committee (@GOPoversight) July 20, 2023 -
రిపబ్లికన్ల హ్రస్వ దృష్టి
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రెండోసారి కూడా విజయవంతంగా అభిశంసన నుంచి తప్పించుకోగలిగారు. అధ్యక్ష స్థానంలోవున్నవారు అభిశంసన తీర్మానం ఎదుర్కొనాల్సిరావడం అమెరికా చరిత్రలో ఇంతక్రితం కూడా జరిగింది. కానీ పదవినుంచి తప్పుకున్నాక కూడా అది వెన్నాడటం కొత్త రికార్డు. తన నాలుగేళ్ల పాలన, క్లైమాక్స్లో ప్రవర్తించిన తీరుతో ట్రంప్ చేజేతులా ఈ అపకీర్తి మూటగట్టుకున్నారు. ఫలితాలు వెలువడిన్పటినుంచి పదవి నుంచి తప్పుకునే వరకూ వున్న దాదాపు 80 రోజుల వ్యవధి ట్రంప్ అరాచక మనస్తత్వాన్ని మరింత బాహాటంగా బయటపెట్టింది. పదవినుంచి తప్పుకునే అధ్యక్షుడిని అమెరికాలో ‘నిరర్ధక అధ్యక్షుడి’గా అభి వర్ణించటం సంప్రదాయం. కానీ ఆ ‘నిరర్థక దశ’ను ట్రంప్ తనను తాను కాపాడుకునేందుకు ఉపయోగించుకున్నారు. దిగ్భ్రమ కలిగించే నేరాలకు పాల్పడినవారికి సైతం ఉదారంగా క్షమాభిక్ష పెట్టారు. గత నెల 6న కొత్త అధ్యక్షుడి ఎన్నికను లాంఛనంగా ప్రకటించేందుకు కాంగ్రెస్ సమావేశమైనప్పుడు తన మద్దతుదార్లను కేపిటల్ హిల్పై దాడికి పురిగొల్పారని సామాజిక మాధ్యమాల సాక్షిగా రుజువైంది. కర్రలు, తుపాకులు వగైరాలు ధరించి వచ్చిన ట్రంప్ మద్దతుదార్ల తీరు చూసి బెంబేలుపడిన అనేకమంది సెనేటర్లు ప్రాణ భయంతో బల్లలకింద దాక్కొనవలసి వచ్చింది. అక్కడ ఎంతో విధ్వంసం చోటుచేసుకుంది. ఇలా చేసినా రిపబ్లికన్ పార్టీకి ఏమాత్రం తప్పనిపించలేదంటే... పదవినుంచి దిగిపోయారు గనుక పట్టించుకోనవసరం లేదంటూ అది వాదించిందంటే ఆ పార్టీ ఎంత మితవాద శక్తిగా మారిందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి పార్టీలో ట్రంప్ వంటి నేత అధ్యక్ష స్థానం వరకూ ఎగబాకారంటే వింత ఏముంది? మెజారిటీ సభ్యులు... అంటే వందమందిలో 57 మంది ట్రంప్పై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం ఉందని అంగీకరించారు. డెమొక్రాటిక్ పార్టీకి వున్న 50 మంది సభ్యులతో పాటు రిపబ్లికన్ పార్టీకి చెందిన ఏడుగురు కూడా తీర్మానానికి మద్దతు పలకటం వల్ల ఇది సాధ్యమైంది. కానీ అభిశంసన నెగ్గాలంటే మూడింట రెండు వంతులమంది మెజారిటీ (67 మంది) అవసరం గనుక ట్రంప్ విజయవంతంగా బయట పడ గలిగారు. తీర్మానం నెగ్గితే డొనాల్డ్ ట్రంప్ భవిష్యత్తులో అధ్యక్ష పదవికి పోటీ చేయటానికి అనర్హు లయ్యేవారు. ఈ అభిశంసన వీగిపోవటం న్యాయం గెలవటంగా ట్రంప్ అభివర్ణిస్తున్నారు. తనను రాజ కీయంగా సమాధి చేద్దామనుకున్నవారి ప్రయత్నాలు విఫలమయ్యాయని సంబరపడుతున్నారు. తన చేష్టలకు ఏనాడూ పశ్చాత్తాపం ప్రకటించని ట్రంప్ అలా మాట్లాడటంలో వింతేమీ లేదు. కానీ స్వయంగా దేశాధ్యక్షుడే హింసకు పురిగొల్పటాన్ని రిపబ్లికన్ పార్టీ విస్మరించిన తీరు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఈ చర్య ద్వారా అది తనకు తాను నష్టం చేసుకోవటంతోపాటు దేశానికి కూడా నష్టచేసింది. చట్టబద్ధ పాలనను అధ్యక్షుడే అపహాస్యంపాలు చేయటం, ఆవేశంతో ఊగిపోతున్న మూకను కేపిటల్ హిల్పై దాడికి పంపటం, వారి విధ్వంసాన్ని తేలిగ్గా తీసుకోవటం, ప్రజా తీర్పును వమ్ముచేసేందుకు ప్రయత్నించటం, రాజకీయ ప్రత్యర్థులను వేధింపులకు గురిచేయటం, అణగదొక్కే ప్రయత్నం చేయటం లాంటి చర్యలను క్షమించటం రిపబ్లికన్ పార్టీ పరువును పాతాళానికి నెట్టేసింది. దేశంలో అమలవుతున్న ప్రజాస్వామ్యం లోపరహితమైనది కాదని, ప్రజలు అప్రమత్తంగా లేకపోతే అది నియంతృత్వ పోకడలున్నవారి చేతుల్లోకి జారుకుంటుందని గత నెల 6నాటి పరిణామాలు నిరూపించాయి. దీన్ని కేవలం తమకూ, డెమొక్రటిక్ పార్టీకి మధ్య జరిగే పోరుగా మాత్రమే చూడటం రిపబ్లికన్ పార్టీ హ్రస్వ దృష్టికి నిదర్శనం. పార్టీలో ఇదొక దుస్సంప్రదాయానికి కూడా అంకురార్పణ చేసింది. భవిష్యత్తులో ఒక నిర్మాణాత్మక పద్ధతిలో, మెరుగైన ఆలోచనలతో ముందుకొచ్చి అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీపడేవారికి ఆ పార్టీలో స్థానం దొరకదన్న అభిప్రాయం అందరికీ కలుగుతుంది. ట్రంప్కూ లేదా ఆయన మాదిరిగా ఇష్టానుసారం వ్యవహరించే మరో నాయకుడికి మాత్రమే ఆదరణ లభిస్తుందని శ్రేణులంతా భావిస్తాయి. ‘అందరం ఏకమవుదాం... అమెరికా ఘనతను మరోసారి చాటుదాం’ అంటూ ట్రంప్ ఇచ్చిన తాజా పిలుపు కాస్త హేతుబద్ధంగా ఆలోచించగలిగే రిపబ్లికన్ శ్రేణులను బెంబేలెత్తించివుండాలి. తీర్మానంపై మాట్లాడిన సెనేట్ రిపబ్లికన్ పక్ష నేత మెక్ కానిల్ సైతం ట్రంప్ తీరును తప్పుబట్టారు. అధ్యక్షుడిగా తన కర్తవ్యాన్ని విస్మరించి, హింసకు నైతికంగా బాధ్యుడయ్యారని అంగీకరించారు. ఇంత చెప్పినవారు అభిశంసన తీర్మానంతో గొంతు కలిపేందుకు నిరాకరించటం విడ్డూరం. ఉన్నత స్థాయికి ఎలా ఎగబాకాలో, జనాకర్షణకు మార్గాలేమిటో, సమర్ధులుగా రాణించటం ఎలాగో చెప్పేందుకు ప్రపంచవ్యాప్తంగా వ్యక్తిత్వరంగ నిపుణులు బోలెడు పుస్తకాలు రచించారు. కానీ ప్రజా తీర్పును గౌరవించటం ఎలాగో... హుందాగా పదవినుంచి వైదొలగటం ఎంత ముఖ్యమో చెప్పే పుస్తకాలు ఎవరూ రాసినట్టు లేరు. ఆ మాదిరి పుస్తకాలు అందుబాటులో వుంటే డోనాల్డ్ ట్రంప్కు అవి ఏదో మేరకు ఉపయోగపడేవి. ఏదేమైనా తాము నిష్పాక్షికమైన తీర్పరి స్థానంలో వున్నామని... దేశ చరిత్రలో మాయని మచ్చ అనదగ్గ ఒక మహాపరాధానికి కారకుణ్ణి గుర్తించి, శిక్షిం చాల్సిన కర్తవ్యం తమపై వున్నదని రిపబ్లికన్లు గుర్తించలేకపోవటం... ఫక్తు రాజకీయ నేతలుగానే వ్యవహరించటం విషాదం. -
గట్టెక్కిన ట్రంప్
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి కూడా అభిశంసన నుంచి గట్టెక్కారు. జనవరి 6న క్యాపిటల్ భవనంపై దాడికి ప్రేరేపించారని అభియోగాలు ఎదుర్కొన్న ట్రంప్ సెనేట్లో శనివారం జరిగిన ఓటింగ్లో 57–43 ఓట్ల తేడాతో బయటపడ్డారు. అమెరికా చరిత్రలో మాయని మచ్చగా నిలిచిపోయి, అయిదుగురు ప్రాణాలను బలితీసుకున్న క్యాపిటల్ భవనం ముట్టడి హింసాత్మకంగా మారిన ఘటనలో ట్రంప్ని దోషిగా నిలబెట్టడంలో డెమొక్రాట్లు విఫలమయ్యారు. గద్దె దిగిపోయిన తర్వాత కూడా అభిశంసన ఎదుర్కొన్న మొదటి వ్యక్తి ట్రంప్, అంతే కాకుండా రెండు సార్లు అభిశంసన ఎదుర్కొన్న అధ్యక్షుడు కూడా ట్రంప్ ఒక్కరే. అధ్యక్షుడిగా ఆయన తన అధికారాలన్నీ దుర్వినియోగం చేస్తున్నారన్న అభియోగాలపై గత ఏడాది ప్రవేశపెట్టిన అభిశంసన నుంచి కూడా ట్రంప్ బయటపడ్డారు. ఒకవేళ ట్రంప్ అభిశంసనకు గురైతే ఆ తర్వాత ఆయనను భవిష్యత్ ఎన్నికల్లో ఎప్పుడూ పోటీ చేయడానికి వీల్లేకుండా తీర్మానం ఆమోదించాలని సెనేట్లో డెమొక్రాట్లు భావించారు. కానీ రిపబ్లికన్ పార్టీ వారికి సహకరించలేదు. అధ్యక్ష పదవి నుంచి ట్రంప్ దిగిపోయాక ఆయనపై అభిశంసన మోపడమే సరికాదని వాదించింది. మొత్తం 100 మంది సభ్యులున్న సెనేట్లో రెండింట మూడో వంతు మెజారిటీ అంటే 67 ఓట్లు వస్తే ట్రంప్ అభిశంసనకు గురవుతారు. ఈ సారి సెనేట్లో రెండు పార్టీలకు చెరి సమానంగా 50 సీట్లు ఉన్నాయి. మరో ఏడుగురు రిపబ్లికన్ పార్టీ సభ్యులు అభిశంసనకి మద్దతునిచ్చారు. దీంతో అభిశంసనకు అనుకూలంగా 57 మంది, వ్యతిరేకంగా 43 మంది ఓటు వేశారు. 10 ఓట్లు తక్కువ రావడంతో ట్రంప్పై అభియోగాలన్నీ వీగిపోయాయి. సెనేట్లో విచారణ కేవలం అయిదు రోజుల్లోనే ముగిసిపోయింది. అభిశంసన విచారణకే రిపబ్లికన్ పార్టీ పెద్దగా సుముఖత వ్యక్తం చేయలేదు. క్యాపిటల్ భవనంపై దాడిని ఖండించినప్పటికీ, అధికారాన్ని వీడిన తర్వాత ట్రంప్పై విచారణ అక్కర్లేదని మొదట్నుంచి చెప్పిన ఆ పార్టీ వాదనలకి పెద్దగా ఆస్కారం లేకుండానే విచారణని ముగించింది. ఇప్పుడే రాజకీయ ఉద్యమం మొదలైంది సెనేట్లో అభిశంసన నుంచి బయటపడిన వెంటనే డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రకటన విడుదల చేశారు. దేశంలో తనపై నిందలు మోపినట్టుగా మరే ఇతర అధ్యక్షుడిపైన జరగలేదని పేర్కొన్నారు. ఒక మంత్రగాడిని వేటాడినట్టుగా తన వెంట బడ్డారని దుయ్యబట్టారు. నిజం వైపు నిలబడి, న్యాయాన్ని కాపాడిన తన లాయర్లకు ధన్యవాదాలు తెలిపారు. తనను రాజకీయంగా కూడా సమాధి చెయ్యాలని డెమొక్రాట్లు భావించినప్పటికీ కుదరలేదని, అసలు ఇప్పుడే తన రాజకీయ ఉద్యమం ప్రారంభమైందని ట్రంప్ అన్నారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్గా నిలబెట్టడమే తన ముందున్న కర్తవ్యమని స్పష్టం చేశారు. రాజ్యాంగాన్ని ధిక్కరించారు ట్రంప్పై అభిశంసన తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేసిన రిపబ్లికన్ సభ్యులపై డెమొక్రాట్లు మండిపడ్డారు. అమెరికా ప్రజాస్వామ్యాన్ని దెబ్బ తీసిన వ్యక్తిని కాపాడడం వల్ల ఇప్పుడు సెనేట్ కూడా అపఖ్యాతి పాలైందని అన్నారు. ట్రంప్ని ద్రోహిగా నిలబెట్టలేకపోవడం ప్రజాస్వామ్య వ్యవస్థ నుంచి పారిపోవడమేనని స్పీకర్ నాన్సీ పెలోసి వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యానికే బీటలు అమెరికాలో ప్రజాస్వామ్యం బీటలు వారిందని మరోసారి రుజువైందని అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. ప్రతీ అమెరికా పౌరుడికి నిజం వైపు నిలబడాల్సిన బాధ్యత ఉందని అన్నారు. అభిశంసన నుంచి ట్రంప్కి విముక్తి లభించిన వెంటనే బైడెన్ ఒక ప్రకటన విడుదల చేశారు. ‘అమెరికా చరిత్రలో ఇలాంటి విషాదకరమైన పరిస్థితి ఎప్పుడూ రాలేదు. మన దేశంలో హింసకి, తీవ్రవాదానికి స్థానం లేదు. అమెరికా పౌరులు, ముఖ్యంగా నాయకులందరూ నిజంవైపు నిలబడి అబద్ధాన్ని ఓడించాలి. అలా జరగకపోవడం వల్ల ప్రజాస్వామ్యం చెదిరిపోయిందని అర్థం అవుతోంది’’ అని బైడెన్ పేర్కొన్నారు. -
కనుబొమ్మలు తీసివేసి.. కోట్లలో మోసాలు
సాక్షి, ఖమ్మం: జిల్లాలోని పలువురు వ్యాపారులను రూ. కోట్లలో ముంచుతున్న సత్తుపల్లికి చెందిన ఘరానా కేటుగాడు బాబురావు ఆగడాలపై చర్యలు తీసుకోవాలని బాధితులు ఆందోళనకు దిగారు. వందలాది మందిని మోసం చేస్తూ దర్జాగా తిరుగుతున్న వైనంపై బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జైలు నుంచి బెయిల్ మీద వచ్చి కొత్త మోసాలకు పాల్పడుతున్నాడని, ఇంటీరియర్ కంపెనీ కోసం సరుకులు కావాలని వ్యాపారులకు డబ్బులు ఎగనామం పెట్టాడని తెలిపారు. మినరల్ వాటర్ కంపెనీలలో వాటాల పేరుతో లక్షలు లూఠీ చేశాడని, డబ్బులు అడిగిన బాధితులపై భార్యతో లైంగిక వేదింపుల కేసులుపెడుతున్నాడని పేర్కొన్నారు. నిజామాబాద్, కరీంనగర్, హైదరాబాద్, సీసీఎస్, సీఐడీ, విజయవాడ, గుంటూరు పోలీస్ స్టేషన్లలో ఇలా వందల కేసులు పెట్టాడని తెలిపారు. తప్పించుకు తిరుగుతున్న నిందితుడు కనుబొమ్మలు తీసేయడం, గడ్డం స్టైల్ మార్చడం, టోపీలు పెట్టడం రకరకాల వేషాలు మర్చాడంలో దిట్ట అని చెప్పారు. బాబురావుపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయినా పోలీసులు అరెస్ట్ చేయలేదని ఆరోపించారు. -
ఆ అధికారం నిమ్మగడ్డకు ఉందా..?
సాక్షి, అమరావతి: అఖిల భారత సర్వీసు అధికారులను అభిశంసించే అధికారం ఒక రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు ఉంటుందా? రాష్ట్ర ప్రభుత్వంతో నిమిత్తం లేకుండా, కనీసం వివరణ అయినా కోరకుండా తనంత తాను నేరుగా చర్యలు తీసుకోవడానికి ఉపక్రమించవచ్చా.. అసలు నిబంధనలు ఏమి చెబుతున్నాయి? ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ అడ్డగోలుగా తనకు లేని అధికారాలను దొడ్డిదారిన చెలాయించడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు? ఆయన వ్యవహార శైలి.. దుందుడుకు నిర్ణయాలు.. ఉన్నతాధికార వర్గాలలోనే కాదు సామాన్య ప్రజలలోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అధికారులను భయపెట్టి తాను అనుకున్నది చేయాలనుకుంటున్నారని, అందుకే తనకు లేని అధికారాలను చలాయించేందుకు నిమ్మగడ్డ ప్రయత్నిస్తున్నారని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. చదవండి: టీడీపీ కుట్రకు యాప్ దన్ను పంచాయతీ ఎన్నికల ఓటర్ల జాబితా తయారీలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ, కమిషనర్ గిరిజా శంకర్లపై నిమ్మగడ్డ నేరుగా సెన్సూర్ ప్రొసీడింగ్స్ జారీ చేసిన సంగతి తెల్సిందే. అయితే ఈ ప్రొసీడింగ్స్ అర్థం లేనివని, న్యాయస్థానం ఎదుట నిలబడవని ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు. అధికారుల వివరణ కోరకుండా కేంద్ర ఎన్నికల కమిషన్ సైతం చర్యలకు సిఫార్సు చేయదని, అలాంటిది ఎస్ఈసీ నేరుగా చర్యలకు ఉపక్రమించడం ద్వారా తన పరిధిని అతిక్రమించారని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. చదవండి: ప్రజారోగ్యానికి ప్రాధాన్యం: సీఎం జగన్ ‘ఎన్నికల విధుల్లో ఎవరైనా అధికారి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కమిషన్ తొలుత వారి నుంచి వివరణ కోరుతుంది. దీనిపై సంతృప్తి చెందని పక్షంలో క్రమశిక్షణ చర్యల కోసం సంబంధిత అథారిటీకి సిఫార్సు చేస్తుంది. అంతేగానీ నేరుగా చర్యలు తీసుకోదు’ అని ఓ ఉన్నతాధికారి చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నికల సమయంలో ఓ ఐపీఎస్ అధికారి ఓ పార్టీ నాయకుడిని కలవడాన్ని తప్పుబడుతూ కేంద్ర ఎన్నికల కమిషన్ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని భావించింది. అయితే అది రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది తప్ప నేరుగా చర్యలకు ఉపక్రమించలేదని ఉన్నతాధికార వర్గాలు గుర్తు చేస్తున్నాయి. నిబంధనలు ఏమి చెబుతున్నాయి..? ప్రభుత్వ అధికారులపై క్రమశిక్షణ చర్యలకు సంబంధించి ఎన్నికల కమిషన్ పరిధిపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో 2000 నవంబర్ 7వతేదీన కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ (డీవోపీటీ) స్పష్టంగా ఓ ఆఫీస్ మెమొరాండం జారీ చేసింది. దాని ప్రకారం అఖిల భారత సర్వీసు అధికారులపై క్రమశిక్షణ చర్యలకు సిఫార్సు చేసే అధికారం మాత్రమే ఎన్నికల కమిషన్కు ఉంది. అంతిమంగా క్రమశిక్షణ చర్యలు తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకే ఉంటుంది. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై చర్యలకు సంబంధించి ఎన్నికల కమిషన్ పరిధిని స్పష్టం చేస్తూ 2008 జూలై 28వ తేదీన కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ మరో మెమొరాండం జారీ చేసింది. ఆ మెమొరాండం ప్రకారం ఎవరిపైన అయినా చర్యలు తీసుకోవాలనుకుంటే ఎన్నికల కమిషన్కు సిఫార్సు చేసే అధికారం మాత్రమే ఉంటుంది. సంబంధిత అథారిటీ మాత్రమే చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎన్నికల కమిషన్ సిఫార్సు చేసిన ఆరు నెలల్లోగా చర్యలు తీసుకుని ఆ విషయాన్ని కమిషన్కు తెలియజేయాల్సి ఉంటుంది. క్రమశిక్షణ చర్యలను ఉపసంహరించాలన్నా సంబంధిత అథారిటీ ఆ అధికారి నుంచి లిఖిత పూర్వక వివరణ తీసుకుని ఎన్నికల కమిషన్ దృష్టికి తెచ్చి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. దీనిని బట్టి అర్థం కావడం లేదూ నిమ్మగడ్డ ఎంత బరితెగించి వ్యవహరించారో అని అధికార వర్గాలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నాయి. ప్రభుత్వ అధికార పరిధిలోకి చొరబడటమే.. నిమ్మగడ్డ అడ్డగోలు ప్రొసీడింగ్స్ వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. నిమ్మగడ్డ తన పరిధిని దాటి ప్రభుత్వ అధికార పరిధిలోకి చొరబడుతున్నారని ఉన్నతాధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. లేని అధికారాలతో నిమ్మగడ్డ ఏకపక్షంగా, నిబంధనలకు విరుద్ధంగా ద్వివేది, గిరిజాశంకర్లపై సెన్సూర్ ప్రొసీడింగ్స్ ఇచ్చినందున వాటిని తిరస్కరిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులిచ్చారు. అఖిల భారత సర్వీసు అధికారుల నిబంధనల మేరకు వారిపై చర్యలు తీసుకునే పరిధి రాష్ట్ర ఎన్నికల కమిషన్కు లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర క్యాడర్లో పనిచేసే అఖిల భారత సర్వీసు అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు. నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఎన్నికల కమిషన్ సిఫార్సు మాత్రమే చేయగలదని పేర్కొన్నారు. ఎస్ఈసీ జారీ చేసిన సెన్సూర్ ప్రొసీడింగ్స్ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అధికార పరిధిలోకి చొచ్చుకుని రావడమేనని, ఇది చట్టపరమైన తప్పిదమన్నారు. నిబంధనలు పాటించకుండా జారీ చేసిన ‘సెన్సూర్’ను తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. సెన్సూర్ ప్రొసీడింగ్స్ విషయంలో మాత్రమే కాదు ఇద్దరు కలెక్టర్లు, ఓ ఎస్పీని బదిలీ చేయాలని ప్రభుత్వానికి రాసిన లేఖలో కూడా నిమ్మగడ్డ అభ్యంతరకర పదజాలాన్ని వాడారని అధికారులు గుర్తు చేస్తున్నారు. -
ట్రంప్ అభిశంసన రాజ్యాంగ విరుద్ధం
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్పై రెండో దఫా అభిశంసన తీర్మానాన్ని తీసుకురావడంపై డెమొక్రాట్లపై పలువురు రిపబ్లికన్ సెనేటర్లు విరుచుకుపడ్డారు. ఈ తీర్మానం రాజ్యాంగ వ్యతిరేకమంటూ 45 మంది సెనేటర్లు తేల్చిచెప్పారు. ట్రంప్ అనునూయులు హింసకు, హేట్ స్పీచ్కు పాల్పడ్డారని, ఇందుకు ట్రంపే కారణమని డెమొక్రాట్లు చెప్పడాన్ని దుయ్యబట్టారు. నిజానికి పలుమార్లు డెమొక్రాట్లే నిజమైన విద్వేష ప్రసంగాలివ్వడం, హింసను రెచ్చగొట్టడం చేశారని రిపబ్లికన్ సెనేటర్ రాండ్ పాల్ విమర్శించారు. ట్రంప్పై తీర్మానం మతిమాలిన చర్య అని మార్క్ రూబియో, లిండ్సే గ్రాహం, టెడ్ క్రూజ్ అన్నారు. అంతకుముందు ట్రంప్పై రెండో దఫా అభిశంసన తీర్మానానికి వ్యతిరేకంగా మెజార్టీ రిపబ్లికన్ సెనేటర్లు ఓటు వేశారు. ఐదుగురు అటువైపే అభిశంసన తీర్మానంపై సెనేట్లో ఐదుగురు రిపబ్లికన్ సెనేటర్లు డెమొక్రాట్లకు అనుకూలంగా ఓటు వేశారు. మిట్ రోమ్నీ, బెన్సాసే, సుసాన్ కోలిన్స్, లీసా ముర్కోవిస్కీ, పాట్ టూమీలు తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. దీంతో తీర్మానానికి 55 అనుకూల ఓట్లు వచ్చాయి. ట్రంప్ను అభిశంసించాలంటే సెనేట్లో మూడింట్ రెండొంతుల మెజార్టీ కావాలి. అంటే డెమొక్రాట్లకు 17 మంది రిపబ్లికన్ సెనేటర్ల మద్దతు అవసరం. ఇలాంటి తీర్మానాలు అమెరికా ప్రతిష్టను భంగపరుస్తాయని రిపబ్లికన్ సెనేటర్లు వ్యాఖ్యానించారు. అభిశంసనంటే పదవి నుంచి దింపడమని, ఇప్పటికే పదవిని కోల్పోయిన వ్యక్తిని ఎలా అభిశంసిస్తారని ప్రశ్నించారు. ఇదంతా డెమొక్రాట్ల పబ్లిసిటీ స్టంటని సెనేటర్ రూబియో కొట్టిపారేశారు. కావాలంటే ట్రంప్ను ఒక పౌరుడిగా కోర్టుల ద్వారా ప్రాసిక్యూట్ చేయవచ్చని, అభిశంసన కుదరదని చెప్పారు. ట్రంప్ అభిశంసన అగ్గి రాజేయడమవుతుందని హెచ్చరించారు. ట్రయల్ కొనసాగుతుంది సెనేట్లో సాధారణ మెజార్టీ లభించినందున ట్రంప్పై అభిశంసన ట్రయల్ య«థాతథంగా కొనసాగనుంది. ఫిబ్రవరి 9న ట్రయల్ జరగనుంది. అప్పటివరకు ఇరుపక్షాలు తమ వాదనలు బలోపేతం చేసుకునే యత్నాలు చేస్తాయి. అయితే ట్రయల్ అనంతరం తీర్మానానికి రెండు సభల ఆమోదం అవసరం. డెమొక్రాట్ల అధీనంలోని హౌస్లో తీర్మానానికి ఆమోదం లభించినా సెనేట్లో మాత్రం ఆమోదం లభించదని తాజా ఓటింగ్తో తేలింది. అందువల్ల ట్రంప్పై అభిశంసన జరగకపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. -
ట్రంప్ వాషింగ్టన్ వీడేది ఎప్పుడంటే..
వాషింగ్టన్: అమెరికా నూతన అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం రోజున ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాషింగ్టన్ నుంచి వెళ్లనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. బుధవారం ఉదయం ట్రంప్ వాషింగ్టన్ నుంచి బయటకు వెళ్లనున్నారని సమాచారం. ఇప్పటికే ట్రంప్, బైడెన్ ప్రమాణ స్వీకారానికి హాజరుకాబోవడం లేదని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక వాషింగ్టన్ వెలుపల ఉన్న ఎయిర్ ఫోర్స్ వన్ ప్రధాన కార్యాలయం జాయింట్ బేస్ ఆండ్రూస్ వద్ద ట్రంప్ వీడ్కోలు కార్యక్రమానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. అధ్యక్ష పదవి నుంచి వైదొలగిన అనంతరం.. ఫ్లోరిడా పామ్ బీచ్లోని తన మార్ ఏ లాగో క్లబ్లో ట్రంప్ నూతన అధ్యాయన్ని ప్రారంభించనున్నారని సమాచారం. ఇక కొంత మంది వైట్హౌస్ సహాయకులు ట్రంప్ కోసం అక్కడ పని చేయనున్నారని తెలిసింది. (చదవండి: అభిశంసన: ట్రంప్ కన్నా ముందు ఎవరంటే) ప్రామణస్వీకారోత్సవానికి ముందే వైట్ హౌస్ సమావేశం నిర్వహించి నూతన అధ్యక్షుడు జో బైడెన్కు ఆతిథ్యం ఇవ్వాలని కొందరు వైట్హౌస్ సలహాదారులు రిపబ్లికన్ అధ్యక్షుడిని కోరుతున్నారు. అయితే ట్రంప్ అలా చేయటానికి సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు లేవని పరిపాలన అధికారి ఒకరు తెలిపారు. ఇక అమెరికా చరిత్రలో రెండుసార్లు అభిశంసనకు గురైన ఏకైక అధ్యక్షుడు ట్రంప్ మాత్రమే. తన పదవీ కాలం ముగియడానికి ముందే ట్రంప్ మరి కొందరికి క్షమాభిక్ష ప్రసాదించాలని యోచిస్తున్నట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అంతేకాక స్వీయక్షమాభిక్ష అనే అపూర్వమైన పద్దతిని ఎంచుకోనున్నారని వెల్లడించారు -
అభిశంసన: ట్రంప్ కన్నా ముందు ఎవరంటే
వాషింగ్టన్: గత వారం కాపిటల్ భవనంలోకి చొరబాట్లను ప్రేరేపించినందుకు గాను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ప్రతినిధుల సభ అభిశంసించింది. దాంతో రెండు సార్లు అభిశంసనకు గురైన ఏకైక అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ చరిత్ర సృష్టించారు. ఇక ట్రంప్ అధ్యక్ష పదవి ముగియడానికి మరి కొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది. ప్రస్తుతం ఆయన డెమొక్రాట్ నియంత్రణలో ఉన్న సెనేట్ తీసుకువచ్చిన అభిశంసన చర్య విచారణ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ట్రంప్ను తొలగించడానికి 232 మద్దతిచ్చారు. కాపిటల్ భవనంపై దాడి ఘటనలో ఐదుగురు మరణించడమే కాక అమెరికాలో ప్రజాస్వామ్య స్థానాన్ని దిగ్భ్రాంతికి గురి చేసినందుకు గాను ట్రంప్పై ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహం చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 10 మంది రిపబ్లికన్లు అధ్యక్షుడు ట్రంప్ను పదవి నుంచి తొలగించడానికి డెమొక్రాట్లలో చేరారు. ఇక ట్రంప్ కన్నా ముందు అమెరికా చరిత్రలో మరో ముగ్గురు అధ్యక్షులు కూడా అభిశంసనకు గురయ్యారు. వారు బిల్ క్లింటన్, ఆండ్రూ జాన్సన్, రిచర్డ్ నిక్సన్. వీరిలో బిల్ క్లింటన్ని, ఆండ్రూ జాన్సన్ని సెనెట్ నిర్దోషులుగా తేల్చగా.. రిచర్డ్ నిక్సన్ ఓటింగ్కు ముదే రాజీనామా చేశారు. 1867లో ఆండ్రూ జాన్సన్పై తొలిసారిగా అభిశంసన తీర్మానం అమెరికా అధ్యక్షుడిగా ఉంటూ తొలిసారిగా అభిశంసన తీర్మానం ఎదుర్కొన్న వారిలో 17వ అధ్యక్షుడు ఆండ్రూ జాన్సన్ ఉన్నారు. 1865లో ఆయన అభిశంసన తీర్మానం ఎదుర్కొన్నారు. ఇక ఒక్క ఓటు తేడాతో ఆయన గట్టెక్కారు. అబ్రహాం లింకన్ హత్యకు గురైన తర్వాత అప్పటి వరకు వైస్ ప్రెసిడెంట్గా ఉన్న ఆండ్రూ జాన్సన్ అధ్యక్షుడయ్యారు. ఆయనపై 1867 పదవీకాల చట్టాన్ని ఉల్లంఘించిన ప్రాథమిక అభియోగంపై సభ 11 అభిశంసన పత్రాలను ఆమోదించింది. ఇక 1868లో ప్రతినిధుల సభలో రిపబ్లికన్లు అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఒక్క ఓటుతో ఆండ్రూ జాన్సన్ గట్టెక్కారు. (చదవండి: అభిశంసనకు గురైన డొనాల్డ్ ట్రంప్) 1999లో బిల్ క్లింటన్పై అభిశంసన తీర్మానం ఇక అభిశంసన తీర్మానం ఎదుర్కొన్న రెండవ అధ్యక్షుడిగా బిల్ క్లింటన్ నిలిచారు. మోనికా లెవెన్స్కీ స్కాండల్లో బిల్ క్లింటన్ అభిశంసన తీర్మానాన్ని ఎదుర్కొన్నారు. మోనికా లెవెన్స్కీతో అక్రమ సంబంధం ఉందని రుజువులతో సహా దొరికినప్పటికీ.. న్యాయస్థానం ముందు తనతో ఎలాంటి సంబంధం లేదని అబద్ధం చెప్పాలంటూ బిల్క్లింటన్ ఆమెపై ఒత్తిడి తీసుకురావడం జరిగింది. అభిశంసన తీర్మానానికి ముందు జరిగే ప్రక్రియలో 228 మందిలో 206 మంది క్లింటన్పై విచారణ జరిపాలంటూ కోరారు. 1999లో విచారణ తర్వాత సెనేట్లో బిల్ క్లింటన్పై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టగా... మూడింట రెండోవంతు మెజార్టీ రాలేదు. దాంతో క్లింటన్ అధ్యక్షుడిగా కొనసాగారు. (చదవండి: అందుకే మోనికాతో ఎఫైర్: బిల్ క్లింటన్) ఓటింగ్కు ముందే రాజీనామా చేసిన రిచర్డ్ నిక్సన్ రిచర్డ్ నిక్సన్ అమెరికాకు 37వ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1969 నుంచి 1974వరకు అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన హయాంలో వాటర్ గేట్ స్కాండల్ వెలుగుచూసింది. డెమొక్రాటిక్ నేషనల్ కమిటీ కార్యాలయంలో ఏకంగా సోదాలు జరిగాయి. దాంతో అధ్యక్షుడిగా ఉన్న రిచర్డ్ నిక్సన్కు చెడ్డపేరు వచ్చింది. ఇక పెద్ద ఎత్తున ఆయనపై ఆరోపణలు రావడంతో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలని డిసైడ్ అయ్యారు. ఇక విచారణలో భాగంగా టెలిఫోన్ టేపులను ఇవ్వాలని కోరగా.. నిక్సన్ నిరాకరించారు. 1974 జూలైలో రిచర్డ్ నిక్సన్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, న్యాయసూత్రాలకు విరుద్ధంగా వ్యవహరించారన్న ఆరోపణలపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమైంది. అయితే ఇంపీచ్మెంట్పై ఓటింగ్ జరగక ముందే నిక్సన్ తన అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. -
అభిశంసనకు గురైన డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిశంసనకు గురైయ్యారు. క్యాపిటల్ హిల్ ముట్టడిని ప్రోత్సహించారంటూ అమెరికా ప్రతినిధుల సభలో ట్రంప్పై పెట్టిన అభిశంసన తీర్మానానికి మెజారిటీ సభ్యులు ఆమోదం తెలిపారు. దీంతో అమెరికా చరిత్రలో రెండో సారి అభిశంసనకు గురైన మొదటి అధ్యక్షుడిగా ట్రంప్ చరిత్రలో నిలిచారు. చదవండి: ట్రంప్ అభిశంసన దిశగా..! అమెరికా సభలో ట్రంప్పై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టగా, మెజార్టీ సభ్యుల ఆమోదం తెలిపారు. క్యాపిటల్ హిల్ భవనంపై ట్రంప్ మద్దతుదారుల దాడితో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ అభిశంసన తీర్మానాన్ని సభ్యులు .. సెనెట్కు పంపనున్నారు. ఈనెల 20న అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ బాధ్యతలు చేపట్టనున్నారు. అనంతరం డొనాల్డ్ ట్రంప్పై విచారణ జరగనుంది. చదవండి: ట్రంప్ యూట్యూబ్ చానెల్ నిలిపివేత -
ట్రంప్ అభిశంసన దిశగా..!
వాషింగ్టన్: గడువుకు ముందే దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను పదవీచ్యుతుడిని చేసేందుకు అమెరికా సిద్ధమవుతోంది. దేశ ప్రజాస్వామ్య సౌధం క్యాపిటల్ భవనంపై దాడికి కారణమయ్యారన్న ఆరోపణలపై అధ్యక్షుడు ట్రంప్పై ప్రతినిధుల సభలో బుధవారం అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారు. జనవరి 6న క్యాపిటల్ భవనంపై దాడికి అనుచరులను రెచ్చగొట్టారన్న ప్రధాన ఆరోపణతో ఈ అభిశంసన తీర్మానాన్ని రూపొందించారు. డెమొక్రాట్లు మెజారిటీగా ఉన్న ప్రతినిధుల సభలో ఈ తీర్మానం ఆమోదం పొందితే.. వెంటనే దీనిని సెనెట్కు పంపిస్తారు. డెమొక్రాట్లతో పాటు పలువురు రిపబ్లికన్ సభ్యులు కూడా ఈ అభిశంసనకు అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరికొన్ని రోజుల్లో పదవి నుంచి దిగిపోనున్న ట్రంప్ను అభిశంసిస్తూ రూపొందించిన ఈ తీర్మానంపై ప్రతినిధుల సభలో బుధవారం అర్ధరాత్రి(భారత కాలమానం) దాటిన తరువాత కూడా చర్చ కొనసాగింది. అభిశంసన తీర్మానం అమోదం పొందుతుందన్న విశ్వాసాన్ని డెమొక్రాటిక్ సభ్యులు వ్యక్తం చేశారు. ‘అధ్యక్షుడిగా ట్రంప్ శ్వేత సౌధంలో ఉన్నంతకాలం మన దేశం, మన స్వేచ్ఛ ప్రమాదంలో ఉన్నట్లే. క్యాపిటల్ భవనంపై దాడికి బాధ్యత వహించాల్సింది ట్రంపే. ఆయనే ఈ దాడికి కుట్ర చేశారు.అనుచరులను రెచ్చగొట్టారు. అందువల్ల ట్రంప్ను అభిశంసించే ఈ తీర్మానానికి మద్దతు పలకవలసిందిగా సహచర సభ్యులను కోరుతున్నా’ అని ఈ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టిన డెమొక్రాట్ సభ్యడు జేమ్స్ మెక్ గవర్న్ సహచర ఎంపీలను కోరారు. క్యాపిటల్ భవనంపై దాడికి సంబంధించి ‘తిరుగుబాటు చేసేందుకు రెచ్చగొట్టారు’ అనే ప్రధాన ఆరోపణతో అభిశంసన తీర్మానాన్ని రూపొందించారు. ‘దాడితో ధ్వంసమైన ఈ భవనాన్ని మరమ్మత్తు చేయవచ్చు. కానీ ప్రజాస్వామ్య సౌధంపై జరిగిన ఆ దాడికి ట్రంప్ను బాధ్యుడిని చేయనట్లయితే, ఈ దేశానికి జరిగిన నష్టాన్ని పూడ్చలేం’ అని జేమ్స్ పేర్కొన్నారు. ‘దేశ ప్రజాస్వామ్య పునాదులను పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ‘అమెరికాలో ఇలాంటివి(క్యాపిటల్ భవనంపై దాడి) ఎట్టి పరిస్థితుల్లో కుదరవన్న గట్టి సందేశం ఇప్పుడు ఇవ్వనట్లయితే.. ఇవి మళ్లీ మళ్లీ జరిగే ప్రమాదముంది’ అని ఎంపీ చెల్లీ పింగ్రీ హెచ్చరించారు. ట్రంప్ పై అభిశంసన నిర్ణయం సరైంది కాదని రిపబ్లికన్ సభ్యుడు స్టీవ్ చాబొట్ అభిప్రాయపడ్డారు. ‘విభజిత దేశాన్ని కలిపే ప్రయత్నం చేయకుండా, మరింత విడదీసే ప్రయత్నం చేస్తున్నార’ని డెమొక్రాట్లపై విమర్శలు గుప్పించారు. రాజకీయ రచ్చను పక్కనబెట్టి, దేశం ఎదుర్కొంటున్న సమస్యలను కలసికట్టుగా పరిష్కరించాల్సిన సమయం ఇదని సూచించారు. అంతకుముందు, 25వ రాజ్యాంగ సవరణ ద్వారా లభించిన అధికారంతో అధ్యక్షుడిగా ట్రంప్ను పదవి నుంచి తొలగించాలని ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ను కోరుతూ ప్రతినిధుల సభ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఈ తీర్మానానికి అనుకూలంగా 223 ఓట్లు, వ్యతిరేకంగా 205 ఓట్లు వచ్చాయి. రిపబ్లికన్లలో ఒకరు తీర్మానానికి అనుకూలంగా ఓటేయగా, ఐదుగురు ఓటింగ్లో పాల్గొనలేదు. అయితే, 25వ రాజ్యాంగ సవరణ అధికారాన్ని వినియోగించుకుని ట్రంప్ను పదవి నుంచి దించాలన్న ఆలోచన తనకు లేదని స్పష్టం చేస్తూ ఈ ఓటింగ్ కన్నా ముందే ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీకి మైక్ పెన్స్ ఒక లేఖ రాశారు. అనుకూలంగా ఓటేస్తా అభిశంసన తీర్మానానికి అనుకూలంగా ఓటేస్తానని భారతీయ అమెరికన్ ఎంపీ డాక్టర్ అమీ బెరా స్పష్టం చేశారు. క్యాపిటల్ భవనంపై దాడికి కుట్ర పన్నినందుకు గానూ అమెరికా చరిత్రలో చెత్తకుండీలో చేరే స్థాయికి ట్రంప్ చేరారని మండిపడ్డారు. అమెరికా చరిత్రలోనే జనవరి 6 చీకటి రోజన్నారు. దేశ ప్రజాస్వామ్య సౌధంపై ఆ రోజు జరిగిన దాడికి కుట్రదారు, వ్యూహకర్త ట్రంపేనని విరుచుకుపడ్డారు. ఇందుకు ఆయన కొన్నాళ్లుగా ప్రణాళికలు వేశారన్నారు. ట్రంప్ దుశ్చర్యలను వివరించేందుకు మాటలు లేవన్నారు. ట్రంప్ని తొలగించలేం: పెన్స్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను రాజ్యాంగంలోని ఆర్టికల్ 25వ సవరణ ద్వారా గద్దె దింపేయాలని వస్తున్న డిమాండ్లను ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ తోసిపుచ్చారు. ఆర్టికల్ 25 ద్వారా ట్రంప్ని పదవీచ్యుతుడ్ని చేయలేమని ప్రతినిధుల స్పీకర్ నాన్సీ పెలోసికి లేఖ రాశారు. ‘‘మన రాజ్యాంగం ప్రకారం 25వ రాజ్యాంగ సవరణ అంటే అధ్యక్షుడికి శిక్ష విధించడం కాదు. అది ఎలాంటప్పుడు ఉపయోగించాలంటే భావి తరాలకు మార్గదర్శకంగా ఉండాలి. అధ్యక్షుడు అసమర్థుడైనప్పుడు, పని చేయలేని స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే ఈ ఆర్టికల్ని ప్రయోగించాలి’’అని మైక్ పెన్స్ ఆ లేఖలో పేర్కొన్నారు. క్యాపిటల్ భవనంపై దాడి తర్వాత ట్రంప్ని గద్దె దింపేయాలంటూ డిమాండ్లు అధికమయ్యాయి. స్పీకర్ నాన్సీ ఈ డిమాండ్ను తీవ్రంగా వినిపించడంతో ఉపాధ్యక్షుడు ఆమెకు లేఖలో ఈ వివరణ ఇచ్చారు. అప్రమత్తతలో భాగంగా క్యాపిటల్లో మొహరించిన నేషనల్ గార్డ్ బలగాలు విశ్రాంతి తీసుకుంటున్న దృశ్యం -
ట్రంప్పై అభిశంసన తీర్మానం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై అభిశంసన తీర్మానానికి సంబంధించిన చర్చ ప్రతినిధుల సభలో ప్రారంభమైంది. ప్రతినిధుల సభలో 25వ సవరణ ద్వారా ట్రంప్ను తొలగించేందుకు తీర్మానం చేశారు. అభిశంసన తీర్మానానికి 215 మందికిపైగా మద్దతు కావల్సి ఉంది. ఇక కేపిటల్ హిల్ భవనంపై దాడికి తన మద్దతుదారులను ట్రంప్ ఉసిగొలిపారంటూ అభియోగం ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రంప్ను తొలగించాలని డెమొక్రాట్లు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు హౌజ్లో డెమొక్రాట్లకు సంపూర్ణ మెజార్టీ ఉండగా, ప్రతినిధుల సభలో అభిశంసన తీర్మానం పాసైనా సెనేట్ ఆమోదం తప్పనిసరి. అయితే సెనేట్లో రిపబ్లికన్లకు స్వల్ప మెజార్టీ ఉండటం గమనార్హం. చదవండి: ట్రంప్కు షాక్ మీద షాక్ : యూట్యూబ్ కొరడా -
ట్రంప్ను తొలగించే తీర్మానాన్ని అడ్డుకున్న రిపబ్లికన్లు
వాషింగ్టన్: రాజ్యాంగబద్ధ అధికారాలను వినియోగించుకుని ట్రంప్ను అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించాలని ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ను కోరుతూ సోమవారం డెమొక్రాట్లు తీసుకువచ్చిన తీర్మానాన్ని ప్రతినిధుల సభలో రిపబ్లికన్ సభ్యులు అడ్డుకున్నారు. మద్దతుదారులను రెచ్చగొట్టి క్యాపిటల్ భవనంపై దాడికి ప్రోత్సహించారని, అధ్యక్షుడిగా అధికారంలో కొనసాగేందుకు ట్రంప్ అనర్హుడని పేర్కొంటూ డెమొక్రాట్లు ఈ తీర్మానాన్ని ప్రతిపాదించారు. 25వ రాజ్యాంగ సవరణ ద్వారా, కేబినెట్లోని మెజారిటీ సభ్యుల మద్దతుతో అధ్యక్షుడిని పదవి నుంచి తొలగించే అవకాశముంది. ట్రంప్ పదవీకాలం 20న ముగియనుంది. ఈ లోపే అభిశంసన ద్వారా ఆయనను పదవి నుంచి తొలగించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. -
చివరి రోజుల్లో.. అవమానభారంతో...
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గద్దె దిగిపోవడానికి కేవలం పది రోజులే గడువు ఉన్నప్పటికీ అంతకంటే ముందే ఆయనను సాగనంపాలని డెమొక్రాట్లు కృతనిశ్చయంతో ఉన్నారు. క్యాపిటల్ భవనంపై ట్రంప్ మద్దతుదారుల దాడితో ఇక ఆయన చేష్టలు భరించలేని స్థితికి సొంత పార్టీ రిపబ్లికన్లు కూడా వచ్చారు. దీంతో సోమవారం నాడు ట్రంప్పై ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టనున్న అభిశంసన తీర్మానానికి మద్దతు పెరుగుతోంది. ట్రంప్ చర్యల్ని రిపబ్లికన్ నేతలు కూడా బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ‘‘ట్రంప్ చేసిన నేరం చిన్నది కాదు. వెంటనే ఆయనను గద్దె నుంచి దింపేయాలి’’అని రిపబ్లికన్ ప్రతినిధి పాట్ టూమీ వ్యాఖ్యానించారు. డెమొక్రాట్లకి ఆధిక్యం ఉన్న ప్రతినిధుల సభలో ట్రంప్పై ప్రవేశపెట్టే అభిశంసన తీర్మానం నెగ్గడం లాంఛనమే. అయితే రిపబ్లికన్లు కూడా ట్రంప్ వైఖరితో విసిగి వేసారి ఉండడంతో వారి ఆధిక్యం ఎక్కువగా ఉన్న సెనేట్లో ఏమవుతుందా అన్న ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ ఉభయ సభల్లో 150 మందికిపైగా రిపబ్లికన్ సభ్యులు ట్రంప్పై తీసుకురానున్న అభిశంసనకు అనుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ట్రంప్ను ఎందుకు అభిశంసించాలని అనుకుంటున్నారో, దానికి సంబంధించిన ఆర్టికల్స్ రచించడం కూడా పూర్తయిందని డెమొక్రాట్ సభ్యుడు టెడ్ లూయీ చెప్పారు. ఈ ఆర్టికల్స్కి 180 మంది మద్దతు ఉందన్నారు. క్యాపిటల్ భవనంపై దాడికి తన మద్దతుదారుల్ని రెచ్చగొడుతూ ట్రంప్ చేసిన ట్వీట్లు, వీడియోలన్నీ ఇప్పటికే డెమొక్రాట్లు సేకరించి ఉంచారు. సోమవారం నాడు డెమొక్రాట్లు ప్రవేశపెట్టే అభిశంసన తీర్మానంపై బుధవారం ఓటింగ్ ఉంటుంది. అప్పటికి ట్రంప్ అధ్యక్ష పీఠం వీడడానికి వారం మాత్రమే గడువు ఉంటుంది. ప్రతినిధుల సభలో నెగ్గిన వెంటనే అభిశంసన తీర్మానం సెనేట్కి వెళుతుంది. రిపబ్లికన్లంతా ఏకమై ట్రంప్ను వ్యతిరేకిస్తే.. సెనేట్ కూడా అభిశంసనని ఆమోదిస్తే ఆయన గద్దె దిగాల్సిందే. అభిశంసన తీర్మానం ఉభయ సభల్లో నెగ్గితే ట్రంప్ అవమానభారంతో ఇంటి దారి పట్టడమే కాదు, మళ్లీ ఎన్నికల్లో పోటీ కూడా చేయలేకపోవచ్చు. అమెరికా చరిత్రలో రెండు సార్లు అభిశంసన ఎదుర్కొన్న వ్యక్తిగా కూడా ట్రంప్ నిలిచిపోతారు. ఏకాకి అవుతున్న ట్రంప్ ఎన్నికల్లో ఓటమిని హుందాగా అంగీకరించలేకపోవడం, ప్రజాస్వామ్యానికి గుండె కాయలాంటి చట్టసభల భవనంపై దాడికి అనుచరుల్ని ఉసిగొల్పడం వంటి చేష్టలతో ట్రంప్ ఏకాకిగా మారుతున్నారు. ఆయన మద్దతుదారుల సంఖ్య రోజు రోజుకి తగ్గిపోతోంది. ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్తో పాటు, ఆయన కేబినెట్లోని కొందరు మంత్రులు కూడా ట్రంప్కి వ్యతిరేకంగా మారారు. లిసా ముర్కోవ్స్కీ, ఆర్–ఆలస్కా అనే ఇద్దరు మహిళా మంత్రులు ట్రంప్ని వెంటనే గెంటేయాలంటూ పిలుపునిచ్చారు. ‘‘ట్రంప్ పదవిలో కొనసాగినన్నాళ్లూ దేశానికి, ప్రజాస్వామ్యానికే కాకుండా రిపబ్లికన్ పార్టీకి కూడా ప్రమాదమేనని కాంగ్రెస్ సభ్యుడు ఆడమ్ స్కిఫ్ అన్నారు. మరోవైపు అభిశంసన ప్రక్రియని ట్రంప్ ఎలా ఎదుర్కోబోతున్నారన్నది ఎవరికీ తెలియడం లేదు. సామాజిక మాధ్యమాల్లో ట్రంప్ని తొలగించడంతో ఆయన ప్రత్యామ్నాయ వేదికను ఎంపిక చేసుకునే పనుల్లో ఉన్నట్టు తెలుస్తోంది. -
ట్రంప్ విజయగర్వం
ముందే ఊహించినట్టు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్పై సెనేట్లో అభిశంసన తీర్మానం గురువారం వీగిపోయింది. మరో తొమ్మిది నెలల్లో అధ్యక్ష పదవికి జరగబోయే ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున రెండో దఫా పోటీ చేయబోతున్న ట్రంప్కు ఇది ముందస్తు విజయమని చెప్పాలి. దాదాపు రెండున్నర శతాబ్దాల అమెరికా చరిత్రలో ఇప్పటికి ముగ్గురు అధ్యక్షులు అభిశంసనను ఎదుర్కొనవలసి రాగా, ఆ ముగ్గురిలో ఎవరికీ రెండోసారి పోటీచేసే ఛాన్స్ రాలేదు. ఇప్పటికే ట్రంప్ అనుకూలురు, వ్యతిరేకులుగా నిట్టనిలువున చీలిపోయిన అమెరికా సమాజం వచ్చే నవంబర్లో జర గబోయే అధ్యక్ష ఎన్నికల సమయానికల్లా మరిన్ని వైపరీత్యాలు చవి చూడాల్సివస్తుందని తీర్మానం వీగిపోయాక ట్రంప్ చేసిన ప్రసంగం గమనిస్తే అర్థమవుతుంది. రిపబ్లికన్లను ఉద్దేశించి చేసిన ఆ ప్రసంగం ఆద్యంతమూ ప్రత్యర్థులను పరుష పదజాలంతో దూషించడం, సొంత పార్టీకి చెందిన మహిళా నేతలపై కూడా చవకబారు వ్యాఖ్యలు చేయడం కనబడుతుంది. డెమొక్రాట్ల ఆధిక్యత ఉన్న దిగువ సభ ట్రంప్ అభిశంసనను సమర్థించగా, రిపబ్లికన్లు సెనేట్లో తమకున్న ఆధిక్యతతో దాన్ని అడ్డుకోగలిగారు. కనుకనే అమెరికా మీడియా మొత్తం అధ్యక్ష ఎన్నికల ముందు డెమొక్రాట్లు ఇలాంటి వృధా ప్రయాసకు ఎందుకు దిగారని నిలదీసింది. కానీ సెనేట్ విజయాన్ని అత్యంత ఘనమైన విజ యంగా ట్రంప్ నమ్మమంటున్నారు. సభలో తమ పార్టీ వారెవరూ జారిపోకుండా ఆయన చూసు కోగలిగారు. ఆ ఒక్క విషయంలోనూ ట్రంప్ సమర్థతను మెచ్చుకోవాలి. ఇలాంటి సమస్య ఎదురైనప్పుడు పార్టీలకు అతీతంగా ఓటేయడం అమెరికాలో రివాజు. ఈసారి రిపబ్లికన్లలో మిట్ రోమ్నీ ఒక్కరే ఆ పని చేశారు. ఆయన గతంలో అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ అభ్యర్థిగా ఒబామాపై పోటీచేసి ఓడిపోయారు. ట్రంప్కు వ్యతిరేకంగా తీసుకొచ్చిన అభిశంసన తీర్మానంలో రెండు అంశాలున్నాయి. అందులో ఒకటి అధికార దుర్వినియోగానికి సంబంధించింది కాగా, రెండోది కాంగ్రెస్ అధికారాన్ని ట్రంప్ అడ్డగించారన్నది. రోమ్నీ మొదటి అంశంలో డెమొక్రాట్లతో ఏకీభవించి ట్రంప్కు వ్యతిరేకంగా ఓటేశారు. కానీ రెండో అంశంలో ట్రంప్కు అనుకూలంగానే వ్యవహరించారు. అయినా ఆయనను ట్రంప్ తీవ్రంగా విమర్శించారు. అధ్యక్ష ఎన్నికల చరిత్రలో ఆయనంత నాసిరకమైన ప్రచారాన్ని ఎవరూ నిర్వహించలేదన్నారు. ఈ విజయంతో ట్రంప్కు పట్టపగ్గాల్లేకుండా పోయాయని పార్టీలోని మహిళా ఎంపీలపై ఆయన చేసిన వ్యాఖ్యలు రుజువు చేశాయి. కనీసం వారంతా తన పార్టీవారని, తనకు అనుకూలంగా ఓటేసిన వారన్న ఇంగితజ్ఞానం కూడా ట్రంప్కు లేకపోయింది. అరిజోనా ప్రతినిధి డెబీ లెస్కోను పేరుతో మొదలుపెట్టి పలు అసందర్భ వ్యాఖ్యలు చేశారు. న్యూయార్క్ ప్రతినిధి ఎలైస్ స్టెఫానిక్ను ‘ఆమె అందంగా వుంటారని తెలుసు. కానీ నోరు తెరిచినప్పుడు కూడా అంతే అందంగా వుంటారని తెలియలేదు. నిజానికి ఆమె మాటలతో వారిని చంపేశారు’ అని నోరు పారేసుకున్నారు. మహిళలు మాత్రమే కాదు...నల్లజాతి ఎంపీలన్నా ఆయనకు చులకనే. జిమ్ జోర్డాన్ను ‘ఆయన తన శరీరాన్ని చూసుకుని పొంగిపోతారనుకుంటాను. ముఖ్యంగా తన చెవులు చూసుకుని...’ అంటూ అవ మానకరంగా మాట్లాడారు. ట్రంప్ వ్యక్తిగతంగా ఎలాంటివారో కొంత వెనక్కెళ్లి చూస్తే అర్ధ మవుతుంది. కొందరు మహిళలపై చేసిన లైంగిక దాడుల గురించి ఆయన గొప్పగా చెప్పుకుంటున్న టేప్ 2016 అధ్యక్ష ఎన్నికల ముందు ‘వాషింగ్టన్ పోస్ట్’ బయటపెట్టినప్పుడు ‘ఇది నా జీవితంలో చెడ్డరోజు. ఎందుకంటే అధ్యక్షుడిగా నా అవకాశాలను ఇది ఇబ్బందుల్లో పడేసింది’ అన్నారు. అంటే ఆయనకు చేసిన పనులపై పశ్చాత్తాపం లేదు. అది అధ్యక్ష పదవికి ఎసరు పెడుతుందన్న భయం ఒక్కటే ఉంది. అభిశంసన అంశాల్లో అధికార దుర్వినియోగం కూడా ఉందన్న సంగతిని కూడా మరిచి, ‘అప్పుడే అయిపోలేదు. ప్రతిభావంతులైన అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. డెమొక్రాటిక్ పార్టీ నాయకుడు జోయ్ బిడెన్కు మున్ముందు ఏం జరుగుతుందో చూడండి’ అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. తమ తీర్మానం వల్ల ట్రంప్ వైదొలగవలసి వస్తుందని డెమొక్రాట్లు కూడా అనుకోలేదు. అమెరికా ప్రజలు కూడా అనుకోలేదు. కానీ ఆయనలో పరివర్తన వస్తుందని, ఇకపై బాధ్యతతో, జవాబుదారీతనంతో వ్యవహరిస్తారని ఆశించారు. అయితే అది జరగకపోగా, అందుకు విరుద్ధంగా ఆయన మరింత రెచ్చిపోయే ప్రమాదం ఉన్నదని పార్టీలో సహ మహిళా సభ్యులపైనా, ఇతరులపైనా, ప్రత్యర్థులపైనా ఆయన చేసిన వ్యాఖ్యలు రుజువు చేస్తున్నాయి. గతంలో అభిశంసన తీర్మానాలను ఎదుర్కొన్న అధ్యక్షులు నిస్సహాయతలో పడేవారు. వారు సైతం చట్టాలకూ, రాజ్యాంగానికి లోబడి పనిచేయక తప్పదన్న అభిప్రాయం అమెరికా పౌరుల్లో కలిగేది. కానీ ట్రంప్ వాలకం చూస్తే దేశ పౌరులకు ఆయన సూపర్మాన్ అనిపిస్తుంది. తాను అన్నిటికీ అతీతుడినన్న భావన, ప్రత్యర్థులు తనను ఏం చేయలేరన్న భరోసా ఆయనలో కనిపిస్తుంది. ఇది ప్రమా దకరమైనది. ట్రంప్పై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన రికార్డుల్ని వైట్ హౌస్ విడుదల చేయాలా లేదా, అక్కడి సిబ్బంది సాక్ష్యాలను సేకరించవచ్చా లేదా అన్న అంశాలపై న్యాయస్థానాలు విచారించి నిర్ణయించేలోగానే డెమొక్రాట్లు అభిశంసనపై ఎక్కడ లేని తొందరా ప్రదర్శించారు. తీర్మానం ఓడినా, రాజకీయంగా ట్రంప్ను బట్టబయలు చేస్తుందని, వచ్చే ఎన్నికల్లో అది తమకు లాభిస్తుందని భావిం చారు. ఇది ట్రంప్ను కాపాడటానికి సంబంధించిన సమస్య కాదని, మొత్తంగా అధ్యక్ష పదవిలో ఉండేవారి పరిమితుల్ని, జవాబుదారీతనాన్ని నిర్ణయించేదని రిపబ్లికన్లు సైతం అనుకోలేదు. ట్రంప్ వ్యవహారశైలిపై అభ్యంతరం వ్యక్తం చేయలేని సెనేట్ నిస్సహాయస్థితి గమనించాక, ముందూము నుపూ వచ్చే డెమొక్రాటిక్ అధ్యక్షుడు సైతం అదే మాదిరి వ్యవహరించబోరన్న గ్యారెంటీ ఏమీ లేదు. ఇది అమెరికా నమ్ముకున్న ప్రజాస్వామ్య వ్యవస్థకు చేటు తెస్తుంది. -
మేం ముందే చెప్పాం కదా.. ట్రంప్ నిర్దోషి!
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు సెనేట్లో ఊరట లభించింది. అధ్యక్షుడిగా ట్రంప్ను అభిశంసిస్తూ దిగువ సభలో ఆమోదం పొందిన తీర్మానాన్ని సెనేట్ గురువారం తిరస్కరించింది. ఈ మేరకు అభిశంసన తీర్మానం సెనేట్లో వీగిపోయిందని శ్వేతసౌధం పత్రికా ప్రకటన విడుదల చేసింది. ‘‘డెమొక్రాట్లు ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానం నేటితో ముగిసింది. మేము గతంలో చెప్పినట్లుగా ట్రంప్ నిర్దోషిగా తేలారు. నిరాధారమైన అభిశంసన తీర్మానానికి వ్యతిరేకంగా సెనేట్ ఓటు వేసింది. అధ్యక్షుడి రాజకీయ ప్రత్యర్థులైన డెమొక్రాట్లు, అధ్యక్ష బరిలోని నిలవాలని ఆశించి భంగపడిన ఓ రిపబ్లికన్ మాత్రమే అనుకూలంగా ఓటు వేశారు’’ అని ప్రకటనలో పేర్కొంది. కాగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలతో అమెరికా ప్రతినిధుల సభ ట్రంప్ను అభింసించిన విషయం తెలిసిందే. 2020 అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ నాయకుడు జో బైడన్ నుంచి ట్రంప్కి గట్టి పోటీ నెలకొని ఉందన్న వార్తల నేపథ్యంలో... బైడన్ను రాజకీయంగా దెబ్బ తీయడానికి ట్రంప్ ఉక్రెయిన్ సహకారాన్ని తీసుకోవడానికి ట్రంప్ సిద్ధమైనట్టుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. అదే విధంగా ఆయనపై కాంగ్రెస్ను అడ్డుకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంతో ట్రంప్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ ప్రతిపక్ష డెమొక్రాట్లు అభింశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో ప్రతినిధుల సభలో సంఖ్యా బలం కలిగిన డెమొక్రాట్లు ఈ తీర్మానానికి ఆమోదం తెలపగా.. తదుపరి ఆ తీర్మానం సెనేట్కు చేరుకుంది. ఈ క్రమంలో సెనేట్లో మెజారిటీ కలిగిన రిపబ్లికన్లు... అభిశంసన తీర్మానాన్ని వ్యతిరేకించడంతో ట్రంప్ నిర్దోషిగా తేలారు. (ట్రంప్పై అభిశంసనకు ప్రతినిధుల సభ ఆమోదం) Office of the Press Secretary, White House: The Senate voted to reject the baseless articles of impeachment, and only the President’s political opponents – all Democrats, and one failed Republican presidential candidate – voted for the manufactured impeachment articles. https://t.co/HKZfU6IsSE — ANI (@ANI) February 5, 2020 -
సెనేట్ కొట్టేయాలి అంతే..
వాషింగ్టన్: తనపై మోపిన అభిశంసన తీర్మానాన్ని సెనేట్ కొట్టేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికా చరిత్రలో అభిశంసనకు గురవుతున్న మూడో అధ్యక్షుడిగా ట్రంప్ రికార్డు సృష్టించగా.. త్వరలోనే దీనిపై విచారణ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్కు వ్యతిరేకంగా విచారణ చేపట్టేలా ఉక్రెయిన్పై ఒత్తిడి తీసుకొచ్చి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, ఆ తరువాత విచారణ విషయంలో కాంగ్రెస్ను అడ్డుకున్నారని ట్రంప్పై అభియోగాలు ఉన్నాయి. అయితే అభిశంసన విచారణ సాక్షులకు తనదైన ఆలోచనలు పంచిన ట్రంప్ ఆదివారం మాత్రం విచారణ జరగడానికే వీల్లేదన్నారు. టంప్ను కలిసిన హర్షవర్ధన్ ష్రింగ్లా వాషింగ్టన్: అమెరికాలో భారత రాయబారి హర్షవర్థన్ ష్రింగ్లా (57), అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను కలిశారు. పదవీ కాలం ముగించుకొని తిరిగి స్వదేశానికి వెళ్లనున్న భారత రాయబారిని అమెరికా అధ్యక్షుడు కలవడం ఇదే మొదటిసారి. 2019 జనవరి 9 నుంచి అమెరికాలో భారత రాయబారిగా పని చేస్తున్న ష్రింగ్లా తన పదవీకాలాన్ని ముగించుకొని భారత్కు తిరిగి రానున్నారు. భారత్లో ఈ నెల 29న విదేశాంగ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ట్రంప్ను కలిసి తనకు సహకారం అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. -
రివైండ్ 2019: గ్లోబల్ వార్నింగ్స్
అంతర్జాతీయంగా 2019 ఎన్నెన్నో ప్రభావవంతమైన ఘటనలకు వేదికయింది. ఆ వివరాలు చూస్తే... అమెరికా – ఉత్తర కొరియా అణు సంక్షోభం ఉత్తర కొరియాను అణ్వస్త్ర రహిత దేశంగా మార్చాలని అగ్రరాజ్యం భావి స్తూ ఉంటే, దేశ అధ్యక్షుడు కిమ్ మరి న్ని అణు పరీక్షలు నిర్వహిస్తూ ఉద్రిక్త తల్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ ఉత్తర కొరియాలో జూన్ 30న అడుగు పెట్టడం ఈ ఏడాది అతి పెద్ద విశేషం గా చెప్పుకోవాలి. ఉత్తర కొరియాకు వెళ్లిన తొలి అమెరికా అధ్యక్షుడిగానూ ఆయన రికార్డు సృష్టించారు. ఉత్తర కొరియాలో జరిగిన సమావేశంలో ఇరు దేశాధినేతలు అణు చర్చలు జర పాలని నిర్ణయించారు. కానీ అక్టోబర్ 1 వరకు అది సాధ్యం కాలేదు. అయితే ఐక్యరాజ్య సమితి తీర్మానాన్ని ఉల్లం ఘించి మరీ ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణి పరీక్షలు నిర్వహించింది. దీంతో ఇరు దేశాల ప్రతినిధులు అక్టోబర్ 5న సంప్రదింపులు జరిపారు. అవి కూడా ముందుకు వెళ్లలేదు. అంతర్జాతీయంగా ఈ ఏడాది ఎన్నెన్నో ప్రభావవంతమైన ఘటనలకు వేదికయింది. ఆ వివరాలు చూస్తే... ట్రంప్ అభిశంసనకు ఓకే! అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిశంసనని ఎదుర్కొ న్నారు. డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి పోటీదారు అయిన జో బైడెన్పై ఉన్న అవినీతి ఆరోపణలకు తగు ఆధారాలు సంపాదించి, విచారణ జరపాలని... తనకు రాజకీయంగా సహకరించాలని ఉక్రెయిన్పై ట్రంప్ ఒత్తిడి తెచ్చినట్టు ఆరోపణలున్నాయి. ట్రంప్ తన అధికారాన్ని దుర్విని యోగం చేస్తున్నారని, కాంగ్రెస్ను నిర్లక్ష్యం చేస్తున్నారని పేర్కొంటూ ప్రతినిధుల సభలో విచారణ సాగింది. ప్రతినిధుల సభ అభిశంసనకి అనుకూలంగా ఓటు కూడా వేసింది. ఈ అభిశంసన తీర్మానం కొత్త ఏడాది జనవరిలో సెనేట్లో చర్చకు రానుంది. హాంగ్కాంగ్ భగ్గు హాంగ్కాంగ్లో భగ్గుమన్న నిరసనలు ఈ ఏడాది ప్రపంచ దేశాల్లో మరెన్నో పోరాటాలకి స్ఫూర్తిగా నిలిచాయి. చైనా చేసిన నేరస్తుల అప్పగింత బిల్లుపై హాంగ్కాంగ్లో అగ్గి రాజుకుంది. ఈ బిల్లు నిందితుల్ని చైనాలో విచారించడానికి వీలు కల్పిస్తుంది. చైనా ప్రభుత్వ విధానాలపై కొన్నేళ్లుగా పేరుకుపోయిన అసంతృప్తి అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. హాంగ్కాంగ్ ప్రత్యేక ప్రతిపత్తిని నిర్వీర్యం చేసేలా చైనా ప్రభుత్వం వ్యవహరిస్తోందని నిరసిస్తూ రోడ్డెక్కారు. ప్రభుత్వం కూడా పోలీసు బలగాలతో నిరసనలు అణచివేయాలని అనుకుంది కానీ అంతకంతకూ అవి తీవ్రమయ్యాయి. బ్రెగ్జిట్ గెలుపు.. బోరిస్ జాన్సన్ 2019 చివరలో బ్రిటన్ ఒక స్పష్టమైన వైఖరిని కనబరిచింది. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలిగే ప్రక్రియను (బ్రెగ్జిట్) 2020 మార్చి 29 నాటికి పూర్తి చేయాలని డెడ్లైన్ కూడా విధించుకుంది. దీనికి తగ్గట్టుగా దేశంలో రాజకీయంగా భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. బ్రిటన్ ప్రధానిగా మూడు సార్లు బ్రెగ్జిట్ ఒప్పందాన్ని ముందుకు తీసుకువెళ్లడంలో విఫలమైన థెరెస్సా మే... తన పదవికి రాజీనామా చేయగా అప్పటికే కన్జర్వేటివ్ పార్టీలోని బోరిస్ జాన్సన్ ఈయూతో ఏ ఒప్పందం లేకుండా బ్రిటన్ నుంచి వైదొలుగుతామని చెప్పారు. దీంతో పార్టీ ఆయన్ను ప్రధానిని చేసింది. అయితే సభలో బ్రెగ్జిట్ను వ్యతిరేకించే సంప్రదాయవాదులు కూడా ఉండడంతో జాన్సన్ సభను రద్దు చేసి ఎన్నికలకు వెళ్లారు. అఖండ మెజార్టీతో నెగ్గారు. జనవరి 31లోగా బ్రెగ్జిట్కు అనుసరించాల్సిన వ్యూహాన్ని రూపొందిస్తానని జాన్సన్ వెల్లడించారు. అమెజాన్ చిచ్చు పుడమికి ఊపిరితిత్తులుగా పేరొందిన బ్రెజిల్లోని అమెజాన్ అడవుల్లో ఏర్పడిన కార్చిచ్చు ప్రపంచవ్యాప్తంగా గుబులు పుట్టించింది. ఇక్కడ కార్చిచ్చులు సర్వ సాధారణమైనా 2019లో 80 వేల చోట్ల చెలరేగిన కార్చిచ్చులు రికార్డు సృష్టించాయి. -
గీత దాటితే వేటు ఎప్పుడు?
న్యూఢిల్లీ: మహారాష్ట్ర హైడ్రామాలో గీత దాటిన ఎన్సీపీ ఎమ్మెల్యేలకు ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తింపుపై న్యాయనిపుణులు పలు రకాలుగా విశ్లేషిస్తున్నారు. ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేసిన అనంతరమే ఆ చట్టం వర్తిస్తుందని కొందరు.. ప్రమాణస్వీకారంతో సంబంధం లేకుండా జంపింగ్లపై చర్యలు తీసుకోవచ్చని మరికొందరు పేర్కొంటున్నారు. సీనియర్ న్యాయవాది, రాజ్యాంగ న్యాయ కోవిదుడు రాకేష్ ద్వివేది మాట్లాడుతూ.. ‘కొత్త ప్రభుత్వ ఏర్పాటు సమయంలో ఈ చట్టం వర్తించదు. ఎమ్మెల్యేలు, ఎంపీలు చట్టసభల్లో ప్రమాణస్వీకారం చేయకముందే ప్రభుత్వాలు ఏర్పడతాయి. ప్రమాణస్వీకారం అనంతరం పార్టీ ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకోవాలని కోరతూ స్పీకర్కు ఫిర్యాదు చేయవచ్చు’ అని చెప్పారు. మరో సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ స్పందిస్తూ.. ‘ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేశారా? లేదా? అన్నది సమస్య కాదు. పార్టీ గీత దాటినవారికి ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తిస్తుంది’ అని అన్నారు. అజిత్ను సమర్థిస్తున్న ఎన్సీపీ ఎమ్మెల్యేల సంఖ్య మూడింట రెండొంతులుంటే అనర్హత సమస్యే ఉత్పన్నం కాదని మరో లాయర్ చెప్పారు. -
ట్రంప్పై మళ్లీ అభిశంసన
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను గద్దె దించడానికి డెమొక్రాట్లు మరోసారి అభిశంసన తీసుకువచ్చారు. 2020 అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ నాయకుడు జోయ్ బైడన్ నుంచి ట్రంప్కి గట్టి పోటీ నెలకొని ఉంది. బైడన్ను రాజకీయంగా దెబ్బ తీయడానికి ట్రంప్ ఉక్రెయిన్ సహకారాన్ని తీసుకోవడానికి సిద్ధమైనట్టుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. బైడన్ కుమారుడు హంటర్ బైడన్కు ఉక్రెయిన్లో భారీగా వ్యాపారాలున్నాయి. ఆ దేశానికి ఆర్థిక సాయాన్ని ప్రకటించిన ట్రంప్ దీనిని రాజకీయంగా వాడుకోవాలని చూశారని, బైడన్ ఆయన కుమారుడిపై అవినీతి కేసుల విచారణ వేగవంతం చేయాలంటూ ఒత్తిడి తీసుకువస్తున్నట్టు డెమొక్రాట్లు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడితో ట్రంప్ ఫోన్లో మాట్లాడినట్టు అమెరికా నిఘా వర్గాలకు సమాచారం అందింది. ట్రంప్ చర్యలన్నీ జాతీయ భద్రతకు భంగకరంగా ఉన్నాయని, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారంటూ డెమొక్రాట్లు వాదిస్తున్నారు. డెమొక్రాట్ ప్రజాప్రతినిధుల్ని కలుసుకొని చర్చించిన తర్వాత హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసి ట్రంప్పై అమెరికా ప్రతినిధుల సభలో అభిశంసన ప్రక్రియ మొదలైనట్టు ప్రకటించారు. చట్టానికి ఎవరూ అతీతులు కారు, అధ్యక్షుడైనా సరే ప్రజలకి జవాబుదారీగా ఉండాలి అని నాన్సీ అన్నారు. అభిశంసన ప్రక్రియపై ట్రంప్ స్పందించారు. తనని వెంటాడి వేధిస్తున్నారని మండిపడ్డారు. గతంలో ట్రంప్పై తీర్మానాన్ని ప్రవేశపెట్టినప్పటికీ బలం లేకపోవడంతో వీగిపోయింది. పదవి నుంచి ఎలా తొలగిస్తారు ? అమెరికా అధ్యక్షుడిని గద్దె దింపాలంటే సెనేట్ అత్యంత కీలకం. సెనేట్లో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి పర్యవేక్షణలో విచారణ కొనసాగుతుంది. ఆ సమయంలో అధ్యక్షుడికి తన వాదనల్ని వినిపించుకునే అవకాశం ఉంటుంది. సెనేట్లో మూడింట రెండు వంతుల మంది సభ్యులు (67 మంది) అధ్యక్షుడికి వ్యతిరేకంగా ఓటు వేస్తే ఆయన పదవిని కోల్పోవలసి వస్తుంది. గతంలో ఎదుర్కొన్నవారెవరు? అమెరికా అధ్యక్షులెవరూ ఇప్పటివరకు అభిశంసనకు గురి కాలేదు. 1868లో ఆండ్రూజాన్సన్, తిరిగి 1998లో బిల్ క్లింటన్లపై అభిశంసన ప్రవేశపెట్టినా సెనేట్లో వారిద్దరికీ ఊరట లభించింది. ఇక 1974లో రిచర్డ్ నిక్సన్ అభిశంసన తీర్మానంపై చర్చ జరగక ముందే అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఇప్పటివరకు సభలో 60సార్లకు పైగా అభిశంసన ప్రక్రియ జరిగింది. -
ట్రంప్పై మళ్లీ అభిశంసన ?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మెడ మీద అభిశంసన కత్తి వేళ్లాడుతోందా ? ట్రంప్ ఎదుర్కొంటున్న న్యాయ వివాదాలు ఆయన పదవికే ఎసరు పెడతాయా ? మరోసారి ట్రంప్ని అధ్యక్ష పదవి నుంచి తప్పించాలన్న చర్చ మొదలైంది. అసలు అమెరికా అధ్యక్షుడిని అభిశంసించే ప్రక్రియ ఎలా సాగుతుంది ? ట్రంప్ భవిష్యత్ ఏమిటి ? చిక్కుల్లో ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై సాగుతున్న విచారణలో భాగంగా ట్రంప్ మాజీ వ్యక్తిగత న్యాయవాది మైకేల్ కోహెన్ , ప్రచార మాజీ మేనేజర్ పాల్ మనాఫోర్ట్ లు కోర్టుల్లో దోషులుగా తేలడం ఒక్కసారిగా ట్రంప్ను చిక్కుల్లోకి నెట్టేసింది. అధ్యక్ష ఎన్నికలకు ముందు జరిగిన సెక్స్ స్కాండల్ ముడుపుల వ్యవహారం ఇప్పుడు వెలుగుచూడడంతో ట్రంప్ ఎన్నడూ లేనివిధంగా విషమ పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. ట్రంప్ మాజీ వ్యక్తిగత న్యాయవాది మైకేల్ కోహెన్ పన్నుల ఎగవేత, బ్యాంకుల్ని మోసగించడం, ప్రచార ఆర్థిక చట్టాల ఉల్లంఘన నేరాలను కోర్టు ఎదుట అంగీకరించడం ట్రంప్ను ఇబ్బందుల్లోకి నెట్టింది. అంతేకాదు ట్రంప్తో తమకు లైంగిక సంబంధాలున్నాయని చెప్పుకుంటున్న ప్లేబాయ్ మోడల్ కరెన్ మెక్ డౌగల్, పార్న్స్టార్ స్టార్మీ డేనియల్లు నోరు మూయించడానికి మూడో కంటికి తెలీకుండా ముడుపులు చెల్లించాలని ట్రంప్ తనకు చెప్పారంటూ కోహెన్ కోర్టుకు వెల్లడించారు. ఇవన్నీ ఇప్పుడు ట్రంప్ను గద్దె దింపుతారా అన్న చర్చకు దారి తీశాయి. ట్రంప్ సైతం తనను అభిశంసిస్తే మార్కెట్లు కుప్పకూలి అందరూ పేదవాళ్లయిపోతారని బెదిరించారంటే ఆయన కూడా ఆందోళనలో ఉన్నట్టు అర్థమవుతోంది. అధ్యక్షుడి అభిశంసన ఎలా ? అమెరికా అధ్యక్షుడిని అభిశంసించడం అంత సులభం కాదు. దీనికి సుదీర్ఘమైన ప్రక్రియ జరగాల్సి ఉంటుంది. అమెరికా రాజ్యాంగం ప్రకారం ప్రతినిధుల సభలో సభ్యులెవరైనా అధ్యక్షుడి తప్పుల్ని ఎత్తి చూపుతూ అభిశంసనకు ప్రతిపాదించవచ్చు. దేశద్రోహం, లంచాలు ఇవ్వడం, ఘోరమైన నేరానికి పాల్పడడం, దుష్ప్రవర్తన (అధికార దుర్వినియోగం, ప్రజావిశ్వాసాన్ని దెబ్బతీయడం దుష్ప్రవర్తన కిందకి వస్తాయి) వంటి కారణాలతో అభిశంసించే అవకాశం ఉంది. ప్రతినిధుల సభలో అధ్యక్షుడిపై నమోదైన అభియోగాలను సాక్ష్యాధారాలతో సహా హౌస్ జ్యుడీషియరీ కమిటీ ఎదుట విచారణకు వస్తుంది. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఆ కమిటీ విచారణలో ఆరోపణలు నిజమేనని తేలితే ఏయే ఆర్టికల్స్ కింద నేరారోపణలు చేశారనేది నిర్ధారిస్తారు. ఆ ఆర్టికల్స్పై మళ్లీ సభలో సమగ్రమైన చర్చ జరిగి ఓటింగ్ జరుగుతుంది. సాధారణ మెజారిటీతో అభిశంసన తీర్మానాన్ని సభ ఆమోదిస్తే, దానిని సెనేట్కు పంపుతారు. అక్కడ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి పర్యవేక్షణలో విచారణ కొనసాగుతుంది. ఆ సమయంలో అధ్యక్షుడికి తన వాదనల్ని వినిపించుకునే అవకాశం ఉంటుంది. సెనేట్లో మూడింట రెండు వంతుల మంది సభ్యులు (67 మంది) అధ్యక్షుడికి వ్యతిరేకంగా ఓటు వేస్తే ఆయన పదవిని కోల్పోవలసి వస్తుంది. ట్రంప్ను ఇప్పుడు ఎలా అభిశంసిస్తారు ? అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై ఎఫ్బిఐ ప్రత్యేక న్యాయవాది రాబర్ట్ ముల్లర్ చేస్తున్న విచారణలో వెల్లడవుతున్న నిజాలు, తాజా పరిణామాలు ట్రంప్ చుట్టూ ఉచ్చులా బిగుస్తున్నాయి. రాజకీయంగానూ ఆయనకు తీవ్ర నష్టం జరుగుతోంది. ప్రచార ఆర్థిక నేరాల్లో ట్రంప్ ఆంతరంగికులు ఒక్కొక్కరుగా న్యాయ స్థానాల్లో దోషులుగా తేలుతున్నారు. ముల్లర్ విచారణలో మాజీ జాతీయ భద్రతా సలహాదారు మైకేస్ ఫ్లిన్, ట్రంప్ అనుచరుడు జార్డ్ పపడోపోలస్లు ఇప్పటికే రష్యాతో ట్రంప్ శిబిరం సాన్నిహిత్యంపై తాము అబద్ధాలే చెప్పామని అంగీకరించారు. ఇప్పుడు కొహెన్, మనాఫోర్ట్ దోషులుగా తేలారు. మాజీ ప్రచార మేనేజర్ పాల్ మనాఫోర్ట్ మరిన్ని కొత్త విషయాలు వెల్లడించే అవకాశాలున్నాయి. చట్టవిరుద్ధ చర్యలతో అధ్యక్ష ఎన్నికల్లో నెగ్గడాన్ని నేరంగా పరిగణిస్తారు. అదే ట్రంప్పై అభిశంసనకు దారి తీసే అవకాశాలు కనిపిస్తున్నాయని అమెరికా ఎన్నికల ప్రచారంలో సలహాదారుడిగా పని చేసిన బ్రెయిన్ క్లాస్ అభిప్రాయపడ్డారు. నవంబర్ ఎన్నికలే అభిశంసనకు రెఫరెండం ఈ పరిణామాలన్నీ నవంబర్లో జరిగే ప్రతినిధుల సభ ఎన్నికల్లో డెమొక్రాట్లకు లాభిస్తాయనే అంచనాలున్నాయి. ఈ ఎన్నికలే ట్రంప్పై అభిశంసనకు ఒక రిఫరెండంలా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రతినిధుల సభలో ప్రస్తుతం రిపబ్లికన్లదే మెజార్టీ. డెమొక్రాట్లు రానున్న ఎన్నికల్లో విజయం సాధించి ప్రతినిధుల సభలో పట్టు పెంచుకుంటే ట్రంప్ను పదవి నుంచి తప్పించడానికి వ్యూహాలు పన్నే అవకాశాలు కనిపిస్తున్నాయి. ట్రంప్పై గత ఏడాది ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానం ప్రతినిధుల సభలో వీగిపోయింది. చాలా మంది డెమొక్రాట్లే ట్రంప్పై అభిశంసన తొందరపాటు చర్య అని అభిప్రాయపడ్డారు. అందుకే వచ్చే నవంబర్ ఎన్నికల వరకు డెమొక్రాట్లు ట్రంప్ను గద్దె దింపే సాహసం చేసే అవకాశం కనిపించడం లేదు. చరిత్రలోకి తొంగి చూస్తే ఇప్పటివరకు అమెరికా అధ్యక్షుడు ఎవరూ అభిశంసనకు గురి కాలేదు. 1868లో ఆండ్రూజాన్సన్, తిరిగి 1998లో బిల్ క్లింటన్లపై ప్రతినిధుల సభలో అభిశంసన తీర్మానం నెగ్గినప్పటికీ, సెనేట్లో వారిద్దరికీ ఊరట లభించింది. ఇక 1974లో వాటర్గేట్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొన్న రిచర్డ్ నిక్సన్ అభిశంసన తీర్మానంపై చర్చ జరగక ముందే అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. మార్కెట్లు కుప్పకూలుతాయా ? అధ్యక్ష పదవి నుంచి తనను తొలగిస్తే స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోతాయని , అమెరికా ప్రజలందరూ నిరుపేదలుగా మారుతారంటూ ట్రంప్ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కానీ అలాంటిదేమీ జరగదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అసలు ట్రంప్ను గద్దె దింపడమే సాధ్యం కాదని, అనూహ్యమైన పరిస్థితుల్లో అది జరిగినా మార్కెట్లకి వచ్చే నష్టమేమీ లేదని వారంటున్నారు. ఇప్పటికే ట్రంప్ తీసుకువచ్చిన పన్నుల సంస్కరణ, నిబంధనల సవరణ అమెరికా ఆర్థిక వ్యవస్థకు బలం చేకూరేలా ఉన్నాయని ఇన్వెస్కోలో చీఫ్ గ్లోబల్ మార్కెట్ వ్యూహకర్త క్రిస్టినా హూపర్ అభిప్రాయపడ్డారు. పైగా ఇప్పుడు ట్రంప్ కొత్తగా ప్రతిపాదిస్తున్న వాణిజ్య విధానాలు మార్కెట్కి అనుకూలంగా లేవని ఆమె చెప్పారు. మార్కెట్లపై ట్రంప్ అభిశంసన ప్రభావం ఉంటుందనితను అనుకోవడం లేదని ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ జిల్ పోల్సెన్ వ్యాఖ్యానించారు. అనుకోని విధంగా ట్రంప్ అభిశంసనకు గురైతే ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ అధ్యక్షుడు అవుతారు. ఆయన దాదాపు ట్రంప్ అనుసరించే విధానాలనే కొనసాగిస్తారని మెజారీటీ మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
ట్రంప్ అభిశంసనకు 42 శాతం మొగ్గు
అమెరికా రాజకీయ సంక్షోభానికి దారితీసిన 70వ దశకం వాటర్గేట్ కుంభకోణం ఫలితంగా నాటి అమెరికా అధ్యక్షడు రిచర్డ్ నిక్సన్ ఎదుర్కొన్న అభిశంసన పరిస్థితులే నేడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎదుర్కొంటున్నట్టు సీఎన్ఎన్, ఎస్ఎస్ఆర్ఎస్ తాజా పరిశోధన తేల్చి చెప్పింది. 1974 మార్చిలో వాటర్ గేట్ కుంభకోణం సందర్భంగా నాటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ పదవి నుంచి దిగిపోవాలని 43 శాతం మంది భావిస్తే, ఈ రోజు 42 శాతం మంది అమెరికన్లు ట్రంప్ అభిశంసనని కోరుకుంటున్నట్టు ఈ పరిశోధనలో వెల్లడయ్యింది. 1998లో బిల్క్లింటన్ అభిశంసనను కోరుకున్న 29 శాతం కంటే ఇది ఎక్కువ. అదేవిధంగా బరాక్ ఒబామా, జార్జ్ బుష్లు అధ్యక్షస్థానంలో ఉన్నప్పుడు వారిని పదవినుంచి దిగిపోవాలని దాదాపు 29 నుంచి 30 శాతం మంది కోరుకున్నారు. దానికంటే కూడా ఎక్కువమంది అమెరికన్లు ట్రంప్ అధ్యక్షపదవి నుంచి తొలగిపోవాలంటున్నారని తాజా నివేదిక వెల్లడించింది. వాటర్గేట్ కుంభకోణం లాంటి అతిపెద్ద స్కాం బయటపడే వరకూ కూడా రిచర్డ్ నిక్సన్ ని పదవినుంచి దిగిపోవాలని ఇంత భారీ సంఖ్యలో అమెరికన్లు కోరుకోకపోవడం గమనించాల్సిన విషయం. అంతిమంగా అభిశంసనపై ఓటింగ్కి ముందే అధ్యక్ష పదవికి నిక్సన్ రాజీనామా చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యాప్రమేయంపై రాబర్ట్ ముల్లర్ దర్యాప్తు చేస్తుండడం వల్ల ట్రంప్ అభిశంసన విషయాన్ని డెమొక్రాట్లు ప్రస్తుతానికి పక్కనపెట్టారు. అభిశంసన అంశంపై ఒక నిర్ణయానికి వస్తే నవంబర్ లో జరగబోయే ఎన్నికల్లో వ్యతిరేక ప్రభావం ఉంటుందన్న భయం కూడా డెమొక్రాట్లను వెంటాడుతోంది. అదే సందర్భంలో టామ్ స్టీవర్ వంటి డెమొక్రటిక్ పార్టీ కార్యకర్తలు మాత్రం అభిశంసన అంశాన్ని ఎజెండాలోకి తెచ్చే బా«ధ్యతను తమపై వేసుకున్నారు. ముల్లర్ నిర్వహిస్తోన్న దర్యాప్తు తీరుపై జనామోదం గతం కంటే తగ్గింది. 48 శాతం నుంచి ఇప్పుడు 41 శాతానికి తగ్గినట్టు సిఎన్ఎన్ తెలిపింది. ముల్లర్ విచారణకు హాజరుకమ్మని కోరితే, ట్రంప్ తప్పనిసరిగా అంగీకరించి విచారణను ఎదుర్కోవాలని దాదాపు 70 శాతం కోరుతున్నారు. చదవండి: ట్రంప్ వాదనలో నిజమెంత ? -
రాత్రికి రాత్రే మార్పులు; సుప్రీంకోర్టులో హైడ్రామా
సాక్షి, న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాపై అభిశంసన వ్యవహారం ఊహించని మలుపులు తిరుగుతోంది. రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు.. సీజేఐపై అభిశంసన తీర్మానం నోటీసులను తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ను కాంగ్రెస్ పార్టీ అనూహ్యరీతిలో ఉపసంహరించుకుంది. రాత్రికే రాత్రే ధర్మాసనాన్ని మార్చేయడం, ఆర్డర్ కాపీలు ఇచ్చేందుకు కోర్టు నిరాకరించడం, అసంతృప్తితో కాంగ్రెస్ వెనుకడుగు వేయడం తదితర పరిణామాలు సుప్రీంకోర్టు వద్ద హైడ్రామాను తలపించాయి. అసలేం జరిగింది?: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా అభిశంసన కోరుతూ రాజ్యసభ చైర్మన్కు ఇచ్చిన తీర్మానాన్ని తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ ఇద్దరు కాంగ్రెస్ ఎంపీలు(ప్రతాప్ సింగ్ బజ్వా, అమీ హర్షద్రాయ్ యాజ్ఞిక్లు) సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ విచారణార్హమా, కాదా అన్న విషయాన్ని నిర్ధారించేందుకు సోమవారమే ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటైంది. జస్టిస్ ఏకే సిక్రీ నేతృత్వంలోని జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఏకే గోయల్ల ధర్మాసనం.. రెండో నంబర్ కోర్టులో విచారణ జరుపుతుందని సుప్రీంకోర్టు రిజిష్ట్రార్ ప్రకటించారు. కానీ.. రాత్రికి రాత్రే మార్పులు: కాగా, సోమవారం నాటి రిజిస్ట్రార్ ప్రకటనకు విరుద్ధంగా.. మంగళవారం ఉదయం 6వ నంబర్ కోర్టులో, వేరొక ధర్మాసనం ఆధ్వర్యంలో కాంగ్రెస్ పిటిషన్పై విచారణను ప్రారంభించారు. దీంతో పిటిషనర్ తరఫు న్యాయవాదులు కపిల్ సిబాల్, ప్రశాంత్ భూషణ్లు ఆశ్చర్యానికి గురయ్యారు. ధర్మాసనం మార్పునకు సంబంధించిన ఆర్డర్ కాపీలను సిబల్ కోరగా, కోర్టు నిరాకరించింది. దీంతో అసహనానికి గురైన సిబల్.. సదరు ధర్మాసనం ముందు వాదించబోమని, పిటిషన్ను ఉపసంహరించుకునేందుకు అంగీకరించాలని చెప్పారు. ధర్మాసం అంగీకారం మేరకు కాంగ్రెస్ తన పిటిషన్ను వెనక్కి తీసుకుంది. ‘మాస్టర్ ఆఫ్ రోస్టర్’ సీజేఐనే కాబట్టి ఏ నిమిషంలోనైనా ధర్మాసనాలను మార్చే అధికారం చీఫ్ జస్టిస్కు ఉంటుందని తెలిసిందే. ఆశ్యర్యంగా ఉంది: ‘‘రాత్రికి రాత్రే ధర్మాసనాన్ని మార్చే అధికారం సీజేఐకి ఉంది. అయితే, సంబంధిత ఆదేశాల కాపీని ఇవ్వబోమని చెప్పడం మాత్రం ఆశ్యర్యం కలిగించింది. ‘ఆర్డర్ కాపీ లేకుండా, దాన్ని చదవకుండా మేం చాలెంజ్కు ఎలా వెళ్లగలం? అని సిబర్ అడిగారు. అప్పుడు కోర్టు.. ‘మెరిట్స్ ఆధారంగా ముందుకు వెళ్లండి’ అని సూచించింది. విచారణపై నమ్మకం సడలిన పరిస్థితిలో సిబాల్ కాంగ్రెస్ ఎంపీల పిటిషన్ను వెనక్కితీసుకున్నారు’’ అని ప్రశాంత్ భూషణ్ మీడియాకు చెప్పారు. -
‘అభిశంసన’పై రాజ్యాంగ ధర్మాసనం
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా అభిశంసన కోరుతూ రాజ్యసభ చైర్మన్కు ఇచ్చిన తీర్మానాన్ని తిరస్కరించడాన్ని కాంగ్రెస్ ఎంపీలు సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ఈ పిటిషన్ విచారణను ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం నేడు విచారించనుంది. జస్టిస్ ఏకే సిక్రీ నేతృత్వంలోని జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఏకే గోయల్ల ధర్మాసనం పిటిషన్ విచారిస్తుందని సుప్రీంకోర్టు కేసుల రిజిస్ట్రీలో పేర్కొన్నారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తుల సీనియారిటీ జాబితాలో ఏకే సిక్రీ ప్రస్తుతం ఆరోస్థానంలో కొనసాగుతున్నారు. రాజ్యసభ సభ్యులు ప్రతాప్ సింగ్ బజ్వా(పంజాబ్), అమీ హర్షద్రాయ్ యాజ్ఞిక్లు దాఖలు చేసిన ఈ పిటిషన్పై జస్టిస్ జే చలమేశ్వర్, జస్టిస్ ఎస్కే కౌల్ ధర్మాసనం ముందు సోమవారం ఉదయం కాంగ్రెస్ ఎంపీ, సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్, మరో సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్లు వాదనలు వినిపించారు. పిటిషన్ను వెంటనే విచారణకు స్వీకరించాలని వారు కోరగా.. అత్యవసర విచారణ కోసం ఈ విషయాన్ని ప్రధాన న్యాయమూర్తి ముందు ప్రస్తావించాలని ధర్మాసనం వారికి సూచించింది. ఈ సందర్భంగా మాస్టర్ ఆఫ్ రోస్టర్పై రాజ్యాంగ ధర్మాసనం తీర్పును జస్టిస్ చలమేశ్వర్ ప్రస్తావిస్తూ.. ‘మాస్టర్ ఆఫ్ రోస్టర్పై ఇప్పటికే రాజ్యాంగ ధర్మాసనం తీర్పునిచ్చింది. అందువల్ల ఈ అంశాన్ని ఒకటో నంబరు కోర్టులో ప్రధాన న్యాయమూర్తి ముందు ప్రస్తావిస్తే బాగుంటుంది’ అని సూచించారు. సీజేఐపై ప్రతిపక్ష ఎంపీలు ఇచ్చిన అభిశంసన తీర్మానంలో సీజేఐ దుష్ప్రవర్తనను నిరూపించే ఆధారాలు ఏవీ లేవని పేర్కొంటూ నోటీసును రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్య నాయుడు తిరస్కరించిన సంగతి తెలిసిందే. ‘సీజేఐ నిర్ణయం తీసుకోవడం సబబు కాదు’ అభిశంసన తీర్మానం సీజేఐకి సంబంధించింది కాబట్టి ఆయన నిర్ణయం తీసుకోవడం సరికాదని, రాజ్యాంగ ప్రాధాన్యమున్న అంశం కావడంతో సుప్రీంలో సీనియర్ మోస్ట్ న్యాయమూర్తిగా మీరే నిర్ణయం తీసుకోవాలని జస్టిస్ చలమేశ్వర్ను సిబల్ కోరారు. మాస్టర్ ఆఫ్ రోస్టర్పై రాజ్యాంగ ధర్మాసనం తీర్పు గురించి తనకు అవగాహన ఉందని, అయితే ఈ అంశంలో తక్షణ ఆదేశాలు కోరడం లేదని, వెంటనే విచారణకు స్వీకరించాలని మాత్రమే అడుగుతున్నానని ధర్మాసనానికి సిబల్ విజ్ఞప్తి చేశారు. 64 మంది ప్రస్తుత ఎంపీలు, ఏడుగురు మాజీ ఎంపీలతో కూడిన నోటీసును ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంటూ వెంటనే తిరస్కరించే అధికారం రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడుకు లేదని ఆయన వాదించారు. ‘దయచేసి పిటిషన్ స్వీకరణపై నిర్ణయం తీసుకోండి. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఉత్పన్నం కాలేదు. ఈ అంశాన్ని ఎవరు చేపట్టాలి.. ఎలా పరిష్కరించాలన్న దానిపై కోర్టు ఉత్తర్వులు జారీ చేయాలి’ అని సిబల్ కోరారు. ఈ సందర్భంగా జస్టిస్ చలమేశ్వర్ స్పందిస్తూ.. ‘నేను రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నాను’ అని గుర్తుచేశారు. పిటిషన్ను ఒకవేళ పరిగణనలోకి తీసుకున్నప్పటికీ.. ఈ అంశాన్ని సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం ముందు ప్రస్తావిస్తే సముచితంగా ఉంటుందని జస్టిస్ కౌల్ సూచించారు. న్యాయవాది ప్రశాంత్ భూషణ్ జోక్యం చేసుకుంటూ ‘ఈ అంశంలో ఎలాంటి ఆదేశాలు జారీ చేయడానికి సీజేఐకు అధికారాలు లేవు. సుప్రీంలోని సీనియర్ మోస్ట్ న్యాయమూర్తి మాత్రమే దీనిపై నిర్ణయం తీసుకోవాలి’ అని ధర్మాసనాన్ని కోరారు. -
సీజేఐ అభిశంసన.. కీలక పరిణామం
సాక్షి, న్యూఢిల్లీ: సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి అభిశంసన వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు.. సీజేఐపై అభిశంసన తీర్మానం నోటీసులను తిరస్కరించడాన్ని కాంగ్రెస్ పార్టీ సవాలు చేసింది. ఈ మేరకు కాంగ్రెస్ ఎంపీలు ప్రతాప్సింగ్ భజ్వా, అమీ హర్షడ్రే యాజ్నిక్లు సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. సీజేఐ అభిశంసన తీర్మానం కోరుతూ విపక్ష ఎంపీలు నోటీసులపై చేసిన సంతకాలను రాజ్యసభ చైర్మన్ పట్టించుకోలేదని, నిబంధనల ప్రకారం నోటీసులను తిరస్కరించే అధికారం ఆయనకు(వెంకయ్యకు) ఉన్నా, సీజేఐపై వచ్చిన ఆరోపణలపై కనీసం దర్యాప్తు కమిటీనైనా ఏర్పాటుచేయాల్సి ఉందని, ఈ మేరకు సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని పిటిషనర్లు కోరారు. కాగా, ఈ పిటిషన్ను కోర్టు విచారణకు స్వీకరిస్తుందా లేదా అన్నది ఇంకా తెలియాల్సిఉంది. ధర్మాసనాల ఏర్పాటు, కేసుల కేటాయింపులు, రోస్టర్ విధానం తదితర అంశాల్లో సీజేఐ దీపక్ మిశ్రా తీరును నిరసిస్తూ నలుగురు సీనియర్ జడ్జిలు మీడియా సమావేశం నిర్వహించడం, ఆపై ఈ వ్యవహారం రాజకీయ మలుపు తిరగడం తెలిసిందే. రాజ్యసభలో సీజేఐపై అభిశంసన తీర్మానం కోరుతూ ఏడు పార్టీలకు చెందిన దాదాపు 60 మంది ఎంపీలు నోటీసులపై సంతకాలు చేయడం, చైర్మన్ వెంకయ్య నాయుడు సదరు నోటీసులను తిరస్కరించడం విదితమే. -
అభిశంసనకు అడ్డుపుల్ల తగదు
మెజారిటీ పాలన అనేది ప్రజలెన్నుకున్న ప్రతినిధులు, లోక్సభలో మెజారిటీ ఉన్న ప్రభుత్వంచే వ్యక్తమవుతుంది. కానీ సమస్యలను లేవనెత్తి, తమ అభిప్రాయం చెప్పే ప్రతిపక్షం హక్కును క్రియాశీలక ప్రజాస్వామ్యంలో స్పీకర్ కానీ, చైర్మన్ కానీ అడ్డుకోకూడదు. వెంకయ్యనాయుడు, ఈ అంశంపై ప్రస్తుతం తీర్పు చెప్పాల్సిన న్యాయమూర్తులు కానీ మరొక సందర్భంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కేకే మాథ్యూ చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకుని, స్పందించాల్సి ఉంది. భారత ప్రధాన న్యాయమూర్తిని అభిశంసించడానికి ప్రతిపక్షాలు చేసిన ప్రయత్నాన్ని నిరాకరించడం ద్వారా రాజ్యసభ చైర్మన్ ఎం. వెంకయ్యనాయుడు రాజ్యాంగ సంక్షోభాన్ని తీవ్రతరం చేశారు. విపక్షాల ప్రయత్నాన్ని వమ్ము చేసే క్రమంలో రాజ్యసభ అధ్యక్షుడు రాజ్యాంగాన్నీ, అభిశంసన కోసం చట్టం నిర్దేశించిన విధానాన్నీ కూడా కించ పరిచారు. అంతేకాదు, ఈ అంశాన్ని స్వీకరించే క్రమంలో అనుసరించవలసిన విధి విధానాలను, వాస్తవాలను విస్మరించారు. రాజ్యాంగం, చట్టం చైర్మన్కు కట్టబెట్టని అధికారాలను సైతం ఆయన చలాయించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిని పదవి నుంచి తొలగించే విధానం గురించి రాజ్యాంగంలోని ఆర్టికల్ 124 (4)లో పొందుపరిచారు. అది ఈ విధంగా చెబుతున్నది: ‘పార్లమెంట్ ఉభయ సభలు మొదట చర్చించాలి. మొత్తం సభ్యులలో మెజారిటీ ఆమోదం కావాలి, అంటే మూడింట రెండువంతుల మెజారిటీతో ఆమోదం పొందాలి. ఆ పార్లమెంట్ సమావేశాలలోనే ఓటింగ్ నిర్వహించి దానిని రాష్ట్రపతికి వివరించాలి కూడా. ఆ తరువాత రాష్ట్రపతి ఉత్తరువులు ఇస్తే తప్ప సుప్రీంకోర్టు న్యాయమూర్తిని పదవి నుంచి తొలగించరాదు.’ న్యాయమూర్తుల చట్టం ఏం చెప్పింది? అభిశంసన ప్రవేశపెట్టే పద్ధతినీ, ఆర్టికల్ 124 (5) కోరిన మేరకు న్యాయమూర్తి అనుచిత ప్రవర్తన, అసమర్థతలకు సంబంధించిన రుజువులు చూపడాన్నీ, దర్యాప్తు క్రమాలను క్రమబద్ధం చేయడానికీS పార్లమెంట్ ‘న్యాయమూర్తుల (దర్యాప్తు) చట్టం 1968’ని ఆమోదించింది. రాజ్యసభ చైర్మన్ ఇచ్చిన ఉత్తరువు అభిశంసన నోటీసులో ప్రధాన న్యాయమూర్తి మీద పేర్కొన్న అభియోగాలలోని నిజానిజాలను పరిశీలించే అవకాశం కల్పిస్తుంది. ఆ చట్టంలోని సెక్షన్ 3(2) ప్రకారం ఆ అభియోగాలను చైర్మన్ ఏర్పాటు చేసిన ఒక సంఘం పరిశీలిస్తుంది. ఇందులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ఒక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఒక ప్రముఖ రాజ్యాంగ నిపుణుడు సభ్యులుగా ఉంటారు. వీరే ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యాయమూర్తి అనుచిత ప్రవర్తనపై వచ్చిన రుజువులలోని వాస్తవాలను పరిశీలిస్తారు. అనుచిత ప్రవర్తనకు సంబంధించి రాజ్యాంగంలోని 124(4) ఆర్టికల్ వివరించిన మేరకు న్యాయమూర్తి మీద రుజువులు లభిస్తేæ ఆ విషయాన్ని మళ్లీ పార్లమెంటుకు నివేదిస్తారు. ఆ అంకం అక్కడితో ముగుస్తుంది. రాజ్యాంగం ప్రకారం, చట్టం ప్రకారం ప్రస్తుత అభిశంసన ఉదంతం ౖచెర్మన్ ఇచ్చిన ఉత్తరువులోని నాల్గవ పేరాతో ముగియవలసి ఉంది. అందులో అభిశంసన కోరుతూ 64 మంది సభ్యులు సంతకాలు చేసిన సంగతిని ఆయన గమనించవలసి ఉంటుంది. నిజానికి 1968 చట్టంలోని 3(1)(బి) ప్రకారం 50 మంది సభ్యులు సంతకాలు చేస్తే సరిపోతుంది. అయితే వెంకయ్యనాయుడు, వాస్తవాలను సంపూర్ణంగా పరిశీలించిన తరువాత ఈ అభిశంసన చట్టబద్ధం కాదు, వాంఛించదగినదీ కాదు, వీటిలో ఏ ప్రాతిపదికనైనా కూడా అనుమతించదగినది కాదని నా కచ్చితమైన అభిప్రాయం అని చెప్పారు. ఇలాంటి పరిశీలన, సమీక్ష ఆయన పరిధికి మించినవి. ఇలాంటి పరిశీలన చేయడానికి గాని, ఇలాంటి ముగింపునకు రావడానికి గాని 1968 నాటి న్యాయమూర్తుల (దర్యాప్తు) చట్టం మేరకు నియమించిన సంఘానికి మాత్రమే అర్హత ఉంది. కృష్ణస్వామి వర్సెస్ భారత ప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మీద రాజ్యసభ చైర్మన్ ఆధారపడ్డారు. నిజానికి చైర్మన్ ఉటంకించిన భాగం జస్టిస్ కె. రామస్వామి ఇచ్చిన అసమ్మతి తీర్పులోనిది. ఈ విషయాన్ని చైర్మన్ గమనంలోకి తీసుకోలేదు. ఒక వ్యాజ్యంలో తీర్పును నిర్దేశించే కీలకాంశాన్ని రూఢి పరచడానికి వేసే మొదటి అడుగు న్యాయపాలన. దాని మీద ఆధారపడి తీసుకున్న నిర్ణయమే అసమ్మతి తీర్పుకు మినహాయింపును ఇస్తుందని రాజ్యాంగ నిపుణుడు హెచ్ ఎం సీర్వాయి అభిప్రాయం. కాబట్టి అసమ్మతి తీర్పులో ప్రకటించిన చట్టం 141వ ఆర్టికల్ కోసం సుప్రీంకోర్టు ప్రకటించిన చట్టంగా పరిగణనలోనికి రాదు. కాబట్టి అత్యున్నత న్యాయస్థానం నియమించే విస్తృత ధర్మాసనం ఆమోదం పొందేవరకు వేచి ఉండవలసిందే. దారితప్పిన ఉత్తరువు.. మరొక అంశం కూడా ఉంది. రాజ్యసభ చైర్మన్ ఇచ్చిన ఉత్తరువులో (పదకొండవ పేరా) ఇలా పేర్కొన్నారు. ఆర్టికల్ 124(4) మేరకు అనుచిత ప్రవర్తనకు వర్తింప చేయవలసిన ప్రామాణికత హేతుబద్ధమైన సందేహానికి అతీతమైన క్రిమినల్ చట్ట ప్రామాణికత అని ఆయన పేర్కొన్నారు. మెహర్ సింగ్ సయానీ (2010) గురించిన విశ్వాసం కూడా గాడి తప్పింది. అనుచిత ప్రవర్తన అన్న పదం దుష్ప్రవర్తన అనే పదానికి విస్తృతంగా అన్వయిస్తుందని ఆ కేసులో పేర్కొన్నారు. అలాంటి ప్రవర్తన అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి దగ్గర ఊహించలేనిది. ఆ స్థాయి పదవి మీద ప్రజలలో ఉన్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని అలాంటి ప్రవర్తన తుడిచి పెడుతుందని కూడా ఆ కేసులో పేర్కొన్నారు. అలాంటి ప్రవర్తన ఉన్న వ్యక్తి రాజ్యాంగపరమైన ఉన్నత పదవిలో ఉంటే ఆయన నుంచి న్యాయాన్ని ఆశించగలమా అన్నదే ప్రశ్న. ఆయన తుది నిర్ణయంలోని తార్కిక భ్రమ చెప్పేదేమిటంటే, అభిశంసించదలిచిన న్యాయమూర్తి మీద వచ్చిన ఆరోపణలు ఏమిటో వాటిని ఆయన మీద అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టిన రాజ్యసభ సభ్యులే నిరూపించుకోవాలి. ఇది ఎలా ఉన్నదంటే, బండికి ముందు గుర్రాన్ని ఉంచాలని రాజ్యాంగ పరిభాషలో చెప్పినట్టు ఉంది. ఇలాంటి తుది నిర్ణయానికి రావడం అవాంఛనీయం, చట్ట విరుద్ధమని సవినయంగా చెప్పాలి. రాజ్యాంగ నిపుణుడు సీర్వాయి భాషలో చెప్పాలంటే, ఇలాంటి నిర్ణయం‘శుద్ధ తప్పిదం, ప్రజలను దారుణంగా దగా చేయడం ద్వారా ఉద్భవించినది.’æ అధికార, విపక్ష సభ్యులతో ఉండే పార్లమెంట్లో భారత ప్రధాన న్యాయమూర్తి అభిశంసన అనేది సంఖ్యాపరంగా సాధ్యంకానిదిగా వెంకయ్యనాయుడు ప్రకటించడం అసలు పార్లమెంటు వ్యవస్థను కించపరచడమే. అందుకే ఆయన ఇచ్చిన ఆదేశం దిగ్భ్రాంతిని కలిగించింది. రాజ్యాంగం న్యాయపాలన కోసం రూపొందించినదే కానీ, మనుషుల కోసం కాదు అన్న సూత్రాన్ని పునరుత్థానం చేసే బాధ్యత ఇప్పుడు న్యాయ వ్యవస్థ మీదే ఉంది. ఇంకా చెప్పాలంటే తాను అధిరోహించిన రాజ్యాంగ ఉన్నత పదవిని లక్ష్యపెట్టని, తన చర్యల ద్వారా ఆ పదవిని వివాదాస్పదం చేసిన వ్యక్తి కోసం రాజ్యాంగం రూపొందలేదు. దురదృష్టం ఏమిటంటే, ఇటీవల కాలంలో ఇలాంటి ప్రవర్తన రాజ్యాంగ పదవులు చేపట్టిన అనేక మందిలో ఎక్కువగా కనిపిస్తున్నది కూడా. దీనితో సమాంతరమైనవి ఇటీవలనే జరిగాయి. అవి ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉన్నవే కూడా. ఆఖరికి రాజ్యాంగాన్ని కించ పరచడానికి ప్రభుత్వమే కుట్ర పన్నుతున్నది. ప్రస్తుత సంక్షోభానికి మూలమైనది ధర్మాసనాలకు కేసుల కేటాయింపులో ప్రధాన న్యాయమూర్తి అధికారం మీద తలెత్తిన వివాదం. దీనితో పాటు ప్రతిపక్షం గోడు వినకుండా ఆర్థిక బిల్లులను లోక్సభ స్పీకర్ అనుమతించడం, సుప్రీంకోర్టు పరిశీలనలోని ఆధార్ కేసు, ఆఖరికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని అభిశంసించాలని కోరుతూ ప్రతిపక్షం ఇచ్చిన తీర్మానాన్ని నిరాకరించడం ప్రస్తుత ప్రభుత్వ అహంకారానికి ఉదాహరణలు. కాబట్టి రాజ్యసభ చైర్మన్, లోక్సభ స్పీకర్లకు ఉన్న విచక్షణాధికారాలను పరిమితం చేయడం గురించి యోచించవలసిన సమయం కూడా వచ్చింది. ప్రజాస్వామ్యం మౌలిక సారం ఏమిటంటే మెజారిటీ పాలన. రాజ్యాంగ, న్యాయపరమైన హక్కులకు ఆ మౌలిక ప్రజాస్వామ్య సూత్రం లోబడి ఉంటుంది.వీటిలో మొదటిది పార్లమెంట్ పరిధికి చెందినది కాగా రెండోది రాజ్యాంగ న్యాయస్థానాలకు చెందిన అంశంగా ఉంటుంది. ప్రతిపక్షం హక్కును కాపాడాలి మెజారిటీ పాలన అనేది ప్రజలెన్నుకున్న ప్రతినిధులు, లోక్సభలో మెజారిటీ ఉన్న ప్రభుత్వంచే వ్యక్తమవుతుంది. కానీ సమస్యలను లేవనెత్తి, తమ అభిప్రాయం చెప్పే ప్రతిపక్షం హక్కును క్రియాశీలక ప్రజాస్వామ్యంలో స్పీకర్ కానీ, చైర్మన్ కానీ అడ్డుకోకూడదు. వెంకయ్యనాయుడు, ఈ అంశంపై ప్రస్తుతం తీర్పు చెప్పాల్సిన న్యాయమూర్తులు కానీ మరొక సందర్భంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కేకే మాథ్యూ చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకుని, స్పందించాల్సి ఉంది. ‘పౌరుడి వ్యక్తిగత స్వేచ్ఛను నిరోధించే విషయంలో రాజ్యాంగం కానీ, చట్టాలు కానీ విధివిధానాలను నిర్దేశించినప్పుడు, కొందరికి ఇవి కర్ణకఠోరంగా వినిపించినప్పటికీ ఆ విధానాన్ని పూర్తిగా పాటించవలసిన బాధ్యత మనదేనని తప్పక భావించాలి.’ వ్యక్తిగత స్వేచ్ఛకు వర్తించే అంశం ప్రజాస్వామ్యానికి కూడా వర్తిస్తుంది. గత జనవరిలో నలుగురు కొలీజియం న్యాయమూర్తులు (అ)ప్రతిష్టాత్మకమైన మీడియా సమావేశాన్ని నిర్వహించిన తర్వాత వివిధ రాజ్యాంగాధికారుల చర్యలు, ఈ దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందనే తమ అభిప్రాయాలను సమర్థించుకునేలా పరిణమించాయి. స్వేచ్ఛాయుతమైన స్వతంత్ర న్యాయవ్యవస్థ లేకుండా ప్రజాస్వామ్యం మనజాలదు. అలాగే ప్రభుత్వ యంత్రాంగాలు, వాటి అహంకార వైఖరికి అతీతంగా.. పార్లమెంటరీ నిబంధనల ద్వారా నడిచే క్రియాశీలక పార్లమెంటు లేకుండా కూడా ప్రజాస్వామ్యం మనలేదు. సుచీంద్రన్ బీయన్ వ్యాసకర్త సుప్రీంకోర్టు న్యాయవాది -
ఫుల్కోర్ట్ సమావేశం ఏర్పాటు చేయండి
న్యూఢిల్లీ: అత్యున్నత న్యాయవ్యవస్థను అప్రతిష్టపాలు చేస్తున్న వ్యవస్థాగత లోపాలపై చర్చించేందుకు ఫుల్కోర్ట్ (సుప్రీంకోర్టులోని అందరు న్యాయమూర్తులతో) సమావేశం ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయమూర్తులు జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ మదన్.బి.లోకూర్ సీజేఐ దీపక్ మిశ్రాకు లేఖ రాశారు. సీజేఐకి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఇచ్చిన అభిశంసన తీర్మానం నోటీసును రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు తిరస్కరించడానికి ముందు రోజు అంటే ఈ నెల 22న ఈ లేఖ రాశారు. రెండే రెండు వాక్యాలు మాత్రమే ఉన్న ఈ లేఖపై గొగోయ్, లోకూర్ సంతకాలు చేశారు. మార్చి 21న సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్, ఏప్రిల్ 9న మరో న్యాయమూర్తి జస్టిస్ కురియన్ జోసెఫ్ కూడా న్యాయ వ్యవస్థలోని లోపాలపై ఫుల్ కోర్టు ఏర్పాటు చేయాలని కోరడం గమనార్హం. సోమవారం ఉదయం టీ మీటింగ్కు న్యాయమూర్తులంతా హాజరైన సమయంలో ఈ లేఖ అంశం చర్చకు వచ్చినట్టు తెలిసింది. అయితే అప్పటికే అభిశంసన తీర్మానాన్ని రాజ్యసభ చైర్మన్ తిరస్కరించినట్టు ప్రకటించారు. దీంతో ఈ సమావేశానికి సంబంధించిన విషయాలను గురించి సీజేఐ ఎక్కడా మాట్లాడలేదని తెలిసింది. -
జడ్జీలను ఎలా అభిశంసిస్తారు?
సాక్షి, న్యూఢిల్లీ : భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా అభింశసన తీర్మానం చుట్టే గత వారం రోజులుగా కేంద్ర రాజకీయాలు తిరుగుతున్నాయి. మిశ్రాకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఏడు విపక్ష పార్టీలు సంయుక్తంగా అభిశంసన కోరుతూ 71 మంది ఎంపీల సంతకాలతో రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయకుడికి ఓ తీర్మానం సమర్పించడం, దాన్ని వెంకయ్య నాయకుడు నిర్ద్వంద్వంగా తిరస్కరించడం, ఇది అన్యాయమంటూ విపక్షాలు గోల చేయడం తదితర పరిణామాలన్నీ తెలిసినవే. ప్రస్తుతమున్న విధానం ప్రకారం ఓ సుప్రీం కోర్టు జడ్జీని అభిశంసించడం దాదాపు సాధ్యమయ్యేపని కాదు. న్యాయ వ్యవస్థ స్వతంత్రతను పరిరక్షించడం కోసమే అభిశంసన అంశంపై కఠిన నిబంధనలు ఉన్నాయి. న్యాయ వ్యవస్థలో కూడా అవినీతి, ఆశ్రిత పక్షపాతం పెరుగుతున్న నేటి పరిస్థితుల్లో జడ్జీలకు వ్యతిరేకంగా అభిశంసన ప్రక్రియ మరింత సులవుగా ఉండాలి. ప్రస్తుతం కఠినంగా ఉండడం వల్ల అది పాలకపక్షానికి మాత్రమే ఉపయోగపడేలా ఉంది. సానుకూలంగా తీర్పు చెప్పకపోతే అభిశంసనతో తొలగిస్తామంటూ పాలకపక్షం సుప్రీం జడ్జీలను లేదా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను పాలకపక్షం బెదిరించవచ్చు. అప్పుడు సదరు జడ్జీలు పాలకపక్షానికి సానుకూలంగా స్పందించవచ్చు. ‘జ్యుడీషియల్ స్టాండర్ట్స్ అండ్ అకౌంటబిలిటీ (న్యాయవ్యవస్థ ప్రమాణాలు, జవాబుదారితనం) బిల్’ను ఈ పాటికి ఆమోదించి ఉంటే నేడు ఈ పరిస్థితి ఉండేది కాదు. ఆ బిల్లు గత రెండేళ్లుకు పార్లమెంట్లో దుమ్ముకొట్టుకుపోతోంది. ప్రస్తుత సుప్రీం జడ్జీలను అభిశంసించాలంటే నిర్దిష్ట సంఖ్యలో ఎంపీలు సంతకాలు చేసిన లేఖను లోక్సభ స్పీకర్కుగానీ, రాజ్యసభ చైర్మన్కుగానీ అందజేయాలి. దానిపై ముగ్గురు సభ్యులతో ఓ విచారణ కమిటీ వేయాలి. ఆ విచారణ కమిటీ పార్లమెంట్కు నివేదిక సమర్పించాలి. ఆ నివేదికపై ఇరు సభల్లో చర్చ జరుగుతుంది. చర్చ అనంతరం ఓటింగ్. ఇరు సభలో మొత్తం సభ్యుల్లో మెజారిటీ సభ్యులు లేదా ఆ రోజు సభకు హాజరైన సభ్యుల్లో మూడింట రెండొంతుల మంది సభ్యలు అనుకూలంగా ఓటు వేస్తేనే అభిశంసన చెల్లుతుంది. గతంలో ఏం జరిగిందీ! దేశంలోనే మొట్టమొదటి సారిగా జస్టిస్ వీ. రామస్వామిపై అభిశంసన ప్రక్రియను చేపట్టారు. ఆయన పంజాబ్, హర్యాన ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు భారీగా ప్రభుత్వం సొమ్మును ఖర్చు పెట్టారని, అందులో ఆయన అవినీతికి పాల్పడ్డారంటూ కొంతమంది న్యాయవాదులు 1990లో అప్పటి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సవ్యసాచి ముఖర్జీకి ఫిర్యాదు చేశారు. అవినీతి ఆరోపణల నుంచి విముక్తి పొందేవరకు విధులు నిర్వర్తించరాదంటూ ఆ లేఖపై స్పందించిన ముఖర్జీ, రామస్వామిని ఆదేశించారు. 1991లో ఆయనపై లోక్సభ అభిశంసనకు అనుమతించింది. దానిపై త్రిసభ్య కమిటీని స్పీకర్ నియమించారు. కమిటీ నివేదిక సమర్పించింది. దానిపై సభ్యులు మాట్లాడారు. రామస్వామి తరఫున కపిల్ సిబాల్ వాదించారు. 1993, మే 10న అభిశంసన తీర్మానంపై ఓటింగ్ జరగాలి. అప్పుడు ప్రధానిగా పీవీ నరసింహారావు ఉన్నారు. పాలకపక్ష కాంగ్రెస్ తన సభ్యులందరికీ తప్పనిసరిగా హాజరుకావాలనీ, అయితే ఓటింగ్లో పాల్గొనరాదని విప్ జారీ చేసింది. ఓటింగ్లో జడ్జీని అభిశంసించాలంటూ 196 ఓట్లు వచ్చాయి. ఒక్కరు కూడా రామస్వామికి అనుకూలంగా ఓటు వేయలేదు. తీర్మానం వీగిపోయింది. కారణం సభకు హాజరైన సభ్యుల్లో మూడింట రెండొంతుల మంది ఓటు వేయకపోవడమే. ఓ జడ్జీని అభిశంసించడమంటే భారత దేశంలో ఎప్పుడూ ఓ రాజకీయమే. ఆ తర్వాత జస్టిస్ పీడీ దినకరణ్, జస్టిస్ సౌమిత్రా సేన్లకు వ్యతిరేకంగా కూడా అభిశంసనకు ప్రయత్నించారు. అయితే వారిరువురు కూడా పార్లమెంట్లో తీర్మానం పెట్టకముందే తమ పదవులకు రాజీనామా చేయడంతో వారిపై ఎలాంటి చర్యతీసుకోలేదు. రాజ్యసభ చేసినా వారిపై అభిశంసన కొనసాగాలే చట్టాన్ని మార్చాలంటూ అప్పుడు డిమాండ్ వచ్చింది. అభిశంసన తీర్మానం వీగిపోతుందని తెలిసి కూడా దీపక్ మిశ్రాకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నోటీసు ఇచ్చిందంటే కూడా రాజకీయమే. దీన్ని వెంకయ్య నాయుడు తిరస్కరించారంటే సుప్రీం కోర్టుకు వెళ్లడం ఒక్కటే కాంగ్రెస్ పార్టీకున్న మార్గం. దాన్ని ఎవరు విచారించాలన్నది కూడా దీపక్ మిశ్రానే నిర్ణయిస్తారు కనుక కాంగ్రెస్కు సానుకూల నిర్ణయం రాకపోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా కూడా జడ్జీని ఒక్క బంగ్లాదేశ్లో తప్ప జడ్జీని అభిశంసించడమన్నది పార్లమెంట్ చేతుల్లోనే ఉంది. తమ దేశ రాజ్యాంగంలో నుంచి జడ్జీల అభిశంసనను 16వ రాజ్యాంగ సవరణ ద్వారా బంగ్లా సుప్రీం కోర్టు గత ఆగస్టు నెలలోనే తొలగించింది. అభిశంసన ప్రక్రియ ద్వారా న్యాయ వ్యవస్థను పాలకపక్షం బెదిరిస్తుందని, తద్వారా తనకూలంగా తీర్పులు చెప్పించుకుంటుందన్న కారణంగానే అభిశంసన ప్రక్రియను బంగ్లా ఎత్తివేసింది. -
ఆలోచించే ఆ నిర్ణయం : వెంకయ్య
సాక్షి, న్యూఢిల్లీ : సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిపై విపక్షాల అభిశంసన తీర్మానాన్ని తిరస్కరిస్తూ తాను తీసుకున్న నిర్ణయాన్ని రాజ్యసభ ఛైర్మన్ ఎం.వెంకయ్య నాయుడు సమర్థించుకున్నారు. నెలరోజుల కసరత్తు అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నానని, ఇందులో తొందరపాటు లేదని ఆయన వివరణ ఇచ్చారు. రాజ్యాంగ నిబంధనలు, న్యాయమూర్తుల విచారణ చట్టం 1968కి లోబడి తాను తీసుకున్న నిర్ణయాన్ని కొందరు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు సైతం ప్రశంసించారని తనను కలిసిన న్యాయవాదులతో చెప్పుకొచ్చారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా అభిశంసన తీర్మానానికి విపక్ష ఎంపీలు ఇచ్చిన నోటీసును సోమవారం వెంకయ్య నాయుడు తిరస్కరించిన విషయం తెలిసిందే. ఈ నోటీసుపై పలు పార్టీలకు చెందిన 64 మంది ఎంపీలు సంతకాలు చేశారు. నోటీసులో ఎంపీలు ప్రస్తావించిన ఆరోపణలు పరిశీలనార్హమైనవి కానందున దీనిపై చర్యలు తీసుకోలేమని వెంకయ్య పేర్కొన్నారు. కాగా అభిశంసన తీర్మానానికి తామిచ్చిన నోటీసును రాజ్యసభ ఛైర్మన్ తోసిపుచ్చడంపై విపక్షాలు భగ్గుమన్నాయి. వెంకయ్య నిర్ణయం చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం, తొందరపాటుతో కూడుకున్నదని కాంగ్రెస్ నేత, మాజీ న్యాయ శాఖ మంత్రి కపిల్ సిబల్ అభివర్ణించారు. ఈ నిర్ణయాన్ని ఎంపీలు సుప్రీం కోర్టులో సవాల్ చేస్తారని చెప్పారు. -
అభిశంసన కుదరదు!
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాపై అభిశంసన కోసం కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాలు ఇచ్చిన నోటీసును రాజ్యసభ చైర్మన్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తిరస్కరించారు. పరిగణనలోకి తీసుకునేందుకు నోటీసుకు ఎలాంటి అర్హత లేదని, అందులోని ఆరోపణలు సమర్థనీయం, అంగీకారయోగ్యం కావన్నారు. శనివారం పలువురు న్యాయ నిపుణులు, రాజ్యాంగ కోవిదులతో విస్తృత చర్చల తర్వాత సోమవారం ఈ ఉత్తర్వులిచ్చారు. నోటీసులో పేర్కొన్న దుష్ప్రవర్తన, అసమర్థత అభియోగాల్ని నిరూపించేందుకు కచ్చితమైన సమాచారం లేనందుకే తిరస్కరిస్తున్నట్లు చెప్పారు ఈ కేసులో పేర్కొన్న ఆరోపణలు న్యాయవ్యవస్థ స్వతంత్రతకు తీవ్ర నష్టం కలిగించేలా ఉన్నాయని వెంకయ్య తప్పుపట్టారు. కాగా రాజ్యసభ చైర్మన్ తమ నోటీసుపై హడావుడిగా నిర్ణయం తీసుకున్నారని, ఇది అసాధారణమే కాక చట్ట విరుద్ధమని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేస్తామని కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ వెల్లడించారు. లోక్సభ మాజీ సెక్రటరీ జనరల్స్, మాజీ ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తులతో పాటు ప్రముఖ న్యాయ, రాజ్యాంగ నిపుణులతో చర్చించిన అనంతరం వెంకయ్య ఈ నిర్ణయం తీసుకున్నారని రాజ్యసభ వర్గాలు వెల్లడించాయి. భారతదేశ చరిత్రలో తొలిసారిగా సీజేఐపై ప్రతిపక్షాలు అభిశంసన నోటీసులివ్వడం తెల్సిందే. కాంగ్రెస్ నేతృత్వంలో 7 విపక్ష పార్టీలు జస్టిస్ మిశ్రాకు వ్యతిరేకంగా రాజ్యసభ చైర్మన్కు నోటీసులిచ్చారు. నోటీసులపై 64 మంది రాజ్యసభ సభ్యులు, ఏడుగురు మాజీ సభ్యులు సంతకాలు చేశారు. దుష్ప్రవర్తనతో పాటు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపణలు చేశారు.ప్రతిపక్షాల నోటీసుపై పలువురు న్యాయ నిపుణులు, రాజ్యాంగ నిష్ణాతుల అభిప్రాయం మేరకు నోటీసుల్ని తిరస్కరిస్తున్నట్లు వెంకయ్య ప్రకటించారు. ‘ప్రతిపక్షాల నోటీసులోని అంశాల్ని పూర్తిగా పరిశీలించాను. న్యాయ నిపుణులు, రాజ్యంగ కోవిదులతో సంప్రదింపుల అనంతరం వ్యక్తమైన అభిప్రాయాల్ని పరిగణనలోకి తీసుకున్నాక నోటీసుకు ఎలాంటి అర్హత లేదని అభిప్రాయానికి వచ్చాను. అందువల్ల నోటీసును తిరస్కరిస్తున్నాను’ అని ఉత్తర్వుల్లో వెంకయ్య పేర్కొన్నారు.నోటీసు ద్వారా వ్యక్తమైన అంశాలపై అన్ని కోణాల్లో వ్యక్తిగతంగా సంప్రదింపులు జరిపానని, ఒక్కో ఆరోపణను విడివిడిగానే కాకుండా, సమష్టిగా కూడా పరిగణనలోకి తీసుకున్నానని ఆయన తెలిపారు. ‘ఇది సుప్రీంకోర్టు స్వయంగా పరిష్కరించుకోవాల్సిన అంతర్గత అంశం. నోటీసులో పేర్కొన్న ఐదు ఆరోపణల్ని నిశితంగా పరిశీలించాక.. అవి సమర్ధనీయం కాదు, అలాగే అంగీకారయోగ్యం కావనే అభిప్రాయానికి వచ్చాను. ఈ కేసులోని ఆరోపణలు రాజ్యాంగ మౌలిక సూత్రాల్లో ఒకటైన న్యాయ వ్యవస్థ స్వతంత్రతను బలహీనపరిచేలా ఉంది. ఎంతో జాగ్రత్తగా అధ్యయనం చేశాక.. నోటీసులో నిరూపించదగ్గ ఆరోపణలు లేవని నిర్ధారణకు వచ్చాను. తీర్మానానికి సంబంధించి రాజ్యసభ నియమావళిని పరిశీలించడంతో పాటు విస్తృత సంప్రదింపులు, రాజ్యాంగ నిపుణుల అభిప్రాయాల్ని పరిశీలించాక నోటీసును పరిగణనలోకి తీసుకోవడం వాంఛనీయం కాదన్న అంశంతో సంతృప్తి చెందాను’ అని రాజ్యసభ చైర్మన్ తెలిపారు. న్యాయవ్యవస్థను భయపెట్టే ప్రయత్నం: బీజేపీ న్యాయవ్యవస్థను భయపెట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని బీజేపీ ఆరోపించింది. ఓట్లు, ప్రజల మద్దతు కోల్పోయిన కాంగ్రెస్ ఇప్పుడు న్యాయవ్యవస్థపై ఒత్తిడి తెచ్చేందుకు కుయుక్తులు పన్నుతోందని బీజేపీ అధికార ప్రతినిధి మీనాక్షి లేఖీ తప్పుపట్టారు. విపక్షాల పిటిషన్ను తిరస్కరించినందుకు ఉప రాష్ట్రపతికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. ప్రజల తిరస్కారానికి గురైన కాంగ్రెస్... అసత్యాలు, ఇతరుల ప్రోద్బలంతో కూడిన పిటిషన్ల ద్వారా కోర్టు ఆవరణల నుంచి దేశాన్ని నడిపించలేదని న్యాయ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ విమర్శించారు. నాలుగేళ్ల క్రితం గుండె నొప్పితో మరణించిన జడ్జి లోయా మృతిని కూడా కాంగ్రెస్ రాజకీయ అస్త్రంగా వాడుకుందని ఆయన తప్పుపట్టారు. 15 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన న్యాయమూర్తులు సోమవారం సుప్రీంకోర్టులో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. సీజేఐ దీపక్ మిశ్రాతో పాటు ఇతర సుప్రీంకోర్టు న్యాయమూర్తులు బెంచ్లపైకి 15 నిమిషాలు ఆలస్యంగా రావడంతో పలు ఊహాగానాలు విన్పించాయి. సీజేఐపై విపక్షాల అభిశంసన నోటీసు, తిరస్కరణ అంశంపై వారు చర్చించి ఉండవచ్చని పలువురు న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. ఉదయం 10.30 గంటలకు సుప్రీంలోని అన్ని బెంచ్లు పనిని ప్రారంభించాల్సి ఉండగా.. 10.45 వరకూ న్యాయమూర్తులు బెంచ్లపైకి రాలేదు. 15 నిమిషాలు ఆలస్యంగా బెంచ్కి వచ్చిన సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం వెంటనే కేసుల విచారణను ప్రారంభించింది. రాజ్యసభ చైర్మన్కుఆ అధికారం ఉంది: న్యాయ నిపుణులు సీజేఐపై అభిశంసన కోసం ఇచ్చిన నోటీసులో పరిగణనలోకి తీసుకునే అంశాలు లేవని, ఉప రాష్ట్రపతి సరైన నిర్ణయం తీసుకున్నారని ప్రముఖ న్యాయవాది ఫాలీ ఎస్ నారిమన్ అన్నారు. నోటీసుపై నిర్ణయం తీసుకునేందుకు చట్టబద్ధమైన అధికారం రాజ్యసభ చైర్మన్కు మాత్రమే ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఉప రాష్ట్రపతి నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు సుప్రీంకోర్టుకు వెళ్లినా విజయం సాధించే అవకాశాలు లేవని మరో ప్రముఖ న్యాయవాది సోలి సొరాబ్జీ చెప్పారు. ‘ఉప రాష్ట్రపతి తన బుద్ధి కుశలతను వినియోగించి న్యాయ నిపుణులతో సంప్రదించాక నిర్ణయానికి వచ్చారు’ అని ప్రశంసించారు. కాగా లోక్సభ మాజీ స్పీకర్ సోమనాథ్ చటర్జీ స్పందిస్తూ.. వెంకయ్య నాయుడు హడావుడిగా నిర్ణయం తీసుకున్నారని, ప్రజాస్వామ్యానికి ఇది మంచిది కాదు అని పేర్కొన్నారు. హడావుడిగా నిర్ణయం తీసుకున్నారు: కాంగ్రెస్ అభిశంసన తీర్మానాన్ని తిరస్కరిస్తూ వెంకయ్య తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ మండిపడింది. ఈ నిర్ణయం దేశ న్యాయ వ్యవస్థను ప్రమాదంలోకి నెట్టిందని, ప్రజల నమ్మకంపై నీళ్లు చల్లిందని విమర్శించింది. నోటీసులోని అంశాల్ని పూర్తి స్థాయిలో అధ్యయనం చేయకుండా హడావుడిగా నిర్ణయం తీసుకున్నారని కాంగ్రెస్ నేత, సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ఆరోపించారు. ‘ఇది అసాధారణ, చట్ట విరుద్ధమైన పొరపాటు నిర్ణయం. మేం తప్పకుండా ఈ ఉత్తర్వుల్ని సవాలు చేస్తూ సుప్రీంలో పిటిషన్ వేస్తాం’ అని చెప్పారు. అభిశంసన నోటీసుపై సంతకం చేసినందుకు సీజేఐ దీపక్ మిశ్రా న్యాయమూర్తిగా ఉన్న ధర్మాసనం ముందు తాను వాదించబోనన్నారు. ‘నేను సీజేఐ ముందు వాదించను. వృత్తి విలువలను పాటిస్తాను. అభిశంసన నోటీసుపై సంతకం చేసి ఎలా వాదిస్తాను? నైతికంగా అది అసంబద్ధం. వృత్తి ప్రమాణాలకు విరుద్ధం’అని సిబల్ అన్నారు. ఏఐసీసీ మీడియా ఇన్చార్జ్ రణ్దీప్ సూర్జేవాల మాట్లాడుతూ.. ఇది ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకిస్తున్న, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తున్న శక్తుల మధ్య పోరు అని అభివర్ణించారు. ఉద్దేశ్యపూర్వకంగానే అభిశంసన తీర్మానాన్ని తిరస్కరించారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ ట్వీటర్లో పేర్కొన్నారు. ఆధారాలు అవసరం: వెంకయ్య ఆలోచన, మాట, చర్య ద్వారా పరిపాలన మూలస్తంభాల్ని బలహీనపరిచేందుకు అనుమతించకూడదని ఉత్తర్వుల్లో వెంకయ్య సూచించారు. ‘పిటిషన్లో వాడిన వ్యాఖ్యలు అనుమానం, ఊహా లేదా అంచనాల్ని మాత్రమే వెల్లడిస్తున్నాయి. నోటీసులో పేర్కొన్న అంశాలకు సరైన ఆధారాలు చూపలేదు. ఆర్టికల్ 124(4) ప్రకారం దుష్ప్రవర్తనను నిరూపించాలంటే ఆధారాలు అవసరం’ అని అన్నారు. అభిశంసన నోటీసుపై ప్రతిపక్ష పార్టీల ప్రెస్ కాన్ఫరెన్స్ను ప్రస్తావిస్తూ.. రాజ్యసభ సభ్యుల నియమావళిలోని పేరా 2.2లో పేర్కొన్న పార్లమెంటరీ ఆచారాలు, సంప్రదాయాల్ని సభ్యులు విస్మరించారన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకున్నానని వెంకయ్య చెప్పారు. కాగా, జడ్జి అభిశంసనకు సంబంధించిన నోటీసును తిరస్కరించే చట్టబద్ధ అధికారం రాజ్యసభ చైర్మన్కు ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. ‘జడ్జిల విచారణ యాక్ట్’ ప్రకారం సంప్రదింపులు, నిబంధనల అధ్యయనం అనంతరం రాజ్యసభ చైర్మన్ లేదా లోక్సభ స్పీకర్ నోటీసును అనుమతించవచ్చు లేదా తిరస్కరించవచ్చని తెలిపాయి. గతంలోనూ ఈ తిరస్కరణలు జడ్జిలపై అవిశ్వాస నోటీసులు ఆదిలోనే తిరస్కరణకు గురవ్వడం ఇదే తొలిసారి కాదు. 1970లో నాటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జేసీ షా అభిశంసన కోసం నాటి లోక్సభ స్పీకర్ జీఎస్ ధిల్లాన్కు నోటీసులు అందాయి. అయితే అభిశంసనకు అవసరమైనంత తీవ్రమైన విషయాలు నోటీసులో లేవని పేర్కొంటూ తదుపరి చర్యలు చేపట్టేందుకు స్పీకర్ తిరస్కరించారు. అలాగే 2015లోనూ గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జేబీ పార్దివాలా రిజర్వేషన్లపై అనుచితంగా మాట్లాడారంటూ 58 మంది రాజ్యసభ సభ్యులు ఆయనపై అభిశంసనకు నాటి రాజ్యసభ అధ్యక్షుడు హమీద్ అన్సారీకి నోటీసులు అందజేశారు. అయితే అభిశంసనపై తదుపరి చర్యలు చేపట్టక ముందే రిజర్వేషన్లపై తన వ్యాఖ్యలను సర్దివాల తొలగించడంతో ఆ విషయం అక్కడితో ముగిసింది. -
వెంకయ్యా.. ఇదేందయ్యా..!
సాక్షి, న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తిపై అభిశంసన తీర్మాన నోటీసులపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నిర్ణయంపై ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సీజేఐ దీపక్ మిశ్రాపై అభిశంసన కోరుతూ 64 మంది ఎంపీలు సంతకాలు చేసిన నోటీసులు గత వారం ఉప రాష్ట్రపతి వద్దకు చేరగా.. సోమవారం వాటిని వెంకయ్య నాయుడు తిరస్కరించిన అనంతరం ప్రశాంత్ భూషణ్ స్పందించారు. ఉపరాష్ట్రపతికి నేతలు ఇచ్చిన అభిశంసన తీర్మానం నోటీసులు సరిగ్గా ఉన్నాయో లేదో చెప్పడం మాత్రమే వెంకయ్య పని అని, తిరస్కరించే అధికారం లేదని అభిప్రాయపడ్డారు. 'తన వద్దకు తీర్మానం నోటీసులలో 50 మంది కంటే ఎక్కువ ఎంపీలు సంతకాలు చేశారా లేదా అన్నది చూడాలి. అసలు ఏ విషయం ఆధారంగా తీర్మానాన్ని వెంకయ్య తిరస్కరించారు. ఆ నిర్ణయం తీసుకునే అధికారం ఉపరాష్ట్రపతికి ఉండదు. ముగ్గురు జడ్జీలతో కమిటీ నియమించాలని ఎంపీలు నోటీసులలో కోరారు. కానీ అభిశంసన తీర్మానాన్ని తీరస్కరించడం సరైన నిర్ణయం కాదని' ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ట్వీట్ ద్వారా అభిప్రాయపడ్డారు. ఉపరాష్ట్రపతి నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాగా, రాజ్యసభలో తీర్మానం కోరుతూ కాంగ్రెస్ సహా ఏడు విపక్ష పార్టీలకు చెందిన 64 మంది ఎంపీలు ఇచ్చిన నోటీసులను వెంకయ్య నాయుడు తిరస్కరించారు. సంతకం చేసిన ఎంపీలకు తమ కేసుపై వారికే కచ్చితత్వం లేదని, ఆరోపణలకు సంబంధించి జరిగి ఉండొచ్చు.. అవకాశముంది.. పాల్పడొచ్చు అనే పదాలను ఉపయోగించారని వెంకయ్య నాయుడు తెలిపారు. రాజ్యాంగ నిపుణులతో చర్చించిన తర్వాత నోటీసులను తిర్కరించినట్లు వివరించారు. What!! VP Naidu rejects impeachment motion against CJI signed by 64 RS MPs! On what grounds? He has no power to say that charges are not made out. That's for the inquiry committee of 3 judges. He only has to see if it's signed by >50 MPs & possibly if charges are of misbehaviour — Prashant Bhushan (@pbhushan1) 23 April 2018 -
అభిశంసన తీర్మానాన్ని తిరస్కరించిన వెంకయ్య
-
సీజేఐపై అభిశంసన; తిరస్కరించిన వెంకయ్య
సాక్షి, న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తిపై అభిశంసన విషయమై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజ్యసభలో తీర్మానం కోరుతూ కాంగ్రెస్ సహా ఏడు విపక్ష పార్టీలు ఇచ్చిన అభిశంసన నోటీసులను ఆయన తిరస్కరించారు. న్యాయనిపుణులతో చర్చల అనంతరం వెంకయ్య ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని సోమవారం ఉపరాష్ట్రపతి కార్యాలయం ఒక ప్రకటన విడుదలచేసింది. సుదీర్ఘ సంప్రదింపులు: సీజేఐ దీపక్ మిశ్రాపై అభిశంసన కోరుతూ 64 మంది ఎంపీలు సంతకాలు చేసిన నోటీసులు గత వారం ఉప రాష్ట్రపతి వద్దకు చేరాయి. సదరు నోటీసులను అంగీకరించాలా, వద్దా అనేదానిపై రాజ్యసభ చైర్మన్ వెంకయ్య సుదీర్ఘ సంప్రదింపులు జరిపారు. రాజ్యాంగ, న్యాయ నిపుణులు, అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్, మాజీ ఏజీ పరాశరణ్, లోక్సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ కశ్యప్, న్యాయశాఖ మాజీ కార్యదర్శి పీకే మల్హోత్రా తదితరులతో వెంకయ్య మాట్లాడారు. ఒక దశలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డిని కూడా సంప్రదించినట్లు సమాచారం. మూడు రోజుల తర్జనభర్జన తర్వాత చివరికి ‘నోటీసులు తిరస్కరిస్తున్నట్లు’ చెప్పారు. సుప్రీంకు వెళ్లే యోచనలో కాంగ్రెస్: అత్యున్నత న్యాయస్థానంలోని ప్రధాన న్యాయమూర్తి పదవిని అధికార బీజేపీ స్వార్థ ప్రయోజనాలకు వాడుకుంటోందని కాంగ్రెస్ ఆరోపిస్తున్నది. ఒకవేళ అభిశంసన తీర్మానం నోటీసులను ఉపరాష్ట్రపతి తిరస్కరిస్తే సుప్రీంకోర్టుకు వెళ్లాలని ఆ పార్టీ భావిస్తున్నది. -
విధులకు దూరంగా ఉండాలి
న్యూఢిల్లీ: ఏడు ప్రతిపక్ష పార్టీలు భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) దీపక్ మిశ్రాపై అభిశంసన నోటీసులు ఇచ్చినందున ఆయన న్యాయవిధులకు దూరంగా ఉండాలని కాంగ్రెస్ కోరింది. గతంలో అభిశంసనను ఎదుర్కొన్న న్యాయమూర్తులు వారిపై వచ్చిన ఆరోపణలు తొలగిపోయే వరకు విధులకు దూరంగా ఉన్నారనీ, జస్టిస్ దీపక్ మిశ్రా కూడా ఆ సంప్రదాయాన్ని పాటించాలని కాంగ్రెస్ పేర్కొంది. సీజేఐకి బీజేపీ మద్దతు తెలపడంపైనా కాంగ్రెస్ మండిపడింది. అత్యున్నత న్యాయస్థానంలోని ప్రధాన న్యాయమూర్తి పదవిని బీజేపీ స్వార్థ ప్రయోజనాలకు వాడుకుంటోందని ఆరోపించింది. ‘తన పదవిని రాజకీయాల కోసం వాడుకోవద్దని బీజేపీకి సీజేఐ చెప్పాలి’ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్దీప్ సుర్జేవాల అన్నారు. ‘సీజేఐ తనపై ఏ అనుమానాలూ రాకుండా చూసుకోవాలి. ప్రవర్తనపై అనుమానాలు వచ్చినప్పుడు విధుల నుంచి తప్పుకుని విచారణకు సహకరించి తన సచ్ఛీలతను నిరూపించుకోవాల్సిన నైతిక బాధ్యత లేదా?’ అని ప్రశ్నించారు. మరోవైపు అభిశంసన కోసం ఇచ్చిన నోటీసును రాజ్యసభ అధ్యక్షుడు వెంకయ్య నాయుడు తిరస్కరిస్తే సుప్రీంను ఆశ్రయించాలని కాంగ్రెస్, ఇతర పార్టీలు భావిస్తున్నాయి. రాజ్యాంగం ప్రకారం ఎలాంటి గడువూ లేకపోయిన రాజ్యసభ చైర్మన్ నోటీసును అట్టిపెట్టుకోకూడదని న్యాయ నిపుణుడొకరు వ్యాఖ్యానించారు. సంప్రదింపులు ప్రారంభించిన వెంకయ్య అభిశంసన నోటీసులపై సంప్రదింపుల ప్రక్రియను వెంకయ్య నాయుడు ప్రారంభించారు. రాజ్యాంగ, న్యాయ నిపుణులతో ఆదివారం చర్చలు జరిపారు. హైదరాబాద్ పర్యటనను అర్థాంతరంగా ముగించుకుని ఢిల్లీ చేరుకున్న ఆయన.. అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్, మాజీ ఏజీ పరాశరణ్, లోక్సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ కశ్యప్, న్యాయశాఖ మాజీ కార్యదర్శి పీకే మల్హోత్రా తదితరులతో మాట్లాడారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డిని కూడా సంప్రదిస్తారని సమాచారం. -
ముందస్తు ప్రచారం నిబంధనలకు విరుద్ధం
న్యూఢిల్లీ: రాజ్యసభాధ్యక్షుడికి అందజేసిన నోటీసులోని విషయాలకు ముందస్తు ప్రచారం ఇవ్వడం నిబంధనల ఉల్లంఘనే అవుతుందని పార్లమెంట్ అధికారులు తెలిపారు. ప్రతిపక్షాలు సీజేఐ జస్టిస్ మిశ్రాపై పలు ఆరోపణలు చేస్తూ అభిశంసన తీర్మానం నోటీసులను రాజ్యసభాధ్యక్షుడు వెంకయ్యకి అందజేయడం తెల్సిందే. ఈ నోటీసులోని వివరాలన్నీ శనివారం మీడియాలో రావటంపై అధికారులు స్పందించారు. సభలో ప్రస్తావించదలచిన నోటీసు చైర్మన్ అంగీకారం పొంది, దాని ప్రతులను సభ్యులకు పంపిణీ చేసేవరకు ఎవరూ దానిని వెల్లడి చేయరాదని పార్లమెంటరీ విధివిధానాలు చెబుతున్నాయన్నారు. -
అభిశంసన అంత సులభం కాదు
ప్రజానుకూల విధానాలు అనుసరించని పార్టీలు, కాంగ్రెస్తో సహా లేదా కాంగ్రెస్ మినహా పలు ప్రాంతీయ పార్టీలతో సీపీఐ, సీపీఎంలు ఏర్పాటు చేయాలనుకునేది ప్రజానుకూలమైన విధానాల ప్రాతిపదికగా రూపొందే కూటమి కాదు. ఒక సందర్భంలో ఇ.ఎం.ఎస్.నంబూద్రిపాద్ చెప్పిన ‘‘ప్రజలకు కావలసింది, ఒక ప్రత్యామ్నాయ విధానాల సమూహమే కానీ, ఒక ప్రత్యామ్నాయ తలకాయల గుంపు కాదు.’’ అన్నసూక్తిని గుర్తుకు తెచ్చుకోవాలి. జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయం ఏమిటి? అనే చర్చ ఇప్పుడు బలంగా సాగుతోంది. ఇందుకు 2019 ఎన్నికలు సమీపిస్తూండటం ఒక కారణం కాగా, బీజేపీ బలహీనపడుతూండటం కూడా మరొక కారణం. గత నాలుగేళ్ళుగా బీజేపీ, ఎన్నికల ప్రణాళికలో చేసిన వాగ్దానాలను అమలు జరపకపోగా, ప్రజా వ్యతిరేక పాలననే కొనసాగించింది. అంతేగాక, మేధావులపైనా, ప్రజాస్వామికవాదులపైనా, దళి తులు, మైనార్టీలపైనా హత్యలు, దాడులు బీజేపీ పాలనలో పెచ్చు పెరిగిపోయాయి. పాలకవర్గాల్లో అసహనం, ప్రజల్లో అభద్రత పెరిగాయి. కనుక రాజకీయ ప్రత్యామ్నాయం అవసరం మరింతగా పెరిగింది. అయితే, ఏది ప్రత్యామ్నాయం, అనేదే కీలకమైన ప్రశ్న. ఈ నేపథ్యంలో రెండు కమ్యూనిస్టు పార్టీల జాతీయస్థాయి మహాసభలకు ప్రాముఖ్యత ఏర్పడింది. రెండు పార్టీల ప్రధాన లక్ష్యం బీజేపీని ఓడించడం. కాంగ్రెస్తో సహా బీజేపీయేతర పార్టీలన్నిటితో కలిపి కూటమి ఏర్పడాలనే విధానం సీపీఐలో ఇప్పటికే స్పష్టంగానే వుంది. అంటే, కాంగ్రెస్ను కూడా కలుపుకోవాలనేది ఆ పార్టీ నిర్ణయ సారాంశం. అయితే సీపీఎం విధానం అంత సూటిగా లేదు. ఎందుకంటే, ఆ పార్టీ విధానం అటూ ఇటూ మారుతూ వస్తోంది. 1964 నాటి పార్టీ చీలికకు ఆనాటి సీపీఐ నాయకత్వం చేపట్టిన కాంగ్రెస్ అనుకూల పోకడే ప్రధాన కారణం అని సీపీయం నాయకత్వం ఆనాడు స్పష్టంగానే ప్రకటించింది. అయితే కాంగ్రెస్, టీడీపీల మధ్య ఏ ప్రజాస్వామిక, ఆర్థిక, సామాజిక విధానాలపరమైన వ్యత్యాసాల కారణంగా 2004, 2009 ఎన్నికల్లో ఒకసారి కాంగ్రెస్ను, మరోసారి టీడీపీని బలపరిచిందో, ఆ పార్టీ నాయకత్వమే చెప్పాలి. ప్రస్తుతం ప్రతిపాదిస్తోన్న బీజేపి వ్యతిరేక కూటమిలో కాంగ్రెస్ స్థానం ఏమిటి, అన్నది ముఖ్యమైన అంశంగా సీపీఎంలో చర్చ జరుగుతూండటం బహిరంగ రహస్యమే. వాస్తవానికి 1964 నాటి చీలిక ప్రకారం రెండు పార్టీలు, సీపీఐ, సీపీఎంలుగా కొనసాగాలంటే కాంగ్రెస్ అనుకూల, ప్రతికూల విధానాల ప్రాతిపదిక ఉండితీరాలి. ఆ ప్రాతిపదికే లేకపోతే అప్పుడు పార్టీని చీల్చడమే తప్పు; ఇప్పుడు రెండు పార్టీలుగా కొనసాగడం అంతకన్నా తప్పు. నేటి ఈ వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకుని ఉండబట్టేనేమో, సీపీఐ నాయకత్వం రెండు పార్టీల విలీనాన్ని పదేపదే బలంగా ప్రతిపాదిస్తూ వస్తోంది. ఆ ప్రతిపాదనను సీపీయం నాయకత్వం అదేపనిగా తిరస్కరిస్తూ వస్తోంది. ఈ తిరస్కరణకు సీపీఎం నాయకత్వం మనస్సులో ఏ కారణాలు పని చేస్తున్నాయో ప్రజలకైతే అర్థం కావడం లేదు. కాంగ్రెస్ పరిపాలన ఎంతటి జుగుప్సాకరంగా, అవినీతిమయంగా, ప్రజా వ్యతిరేకంగా సాగుతుందో చెప్పటానికి ప్రబలమైన ప్రత్యక్ష సాక్ష్యం, 2014 ఎన్నికల్లో ప్రజలు పచ్చి మతోన్మాద బీజేపీని ఎన్నుకుని అధికారంలో కూర్చోబెట్టటమే. గతంలో వాజ్పేయి నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడటం, పదేళ్ల కాంగ్రెస్ యుపిఎ పరిపాలన అనంతరం నాలుగేళ్ల కిందట తిరిగి బిజెపి బహు పెద్ద మెజారిటీతో అధికార పీఠానికి ఎగబాకడం చూసిన తరువాత కూడా, మళ్ళీ కాంగ్రెస్తో కలిసిన ప్రత్యామ్నాయాల గురించి సీపీఐ, సీపీఎంలు ఆలోచించటం ఎంతటి ఆత్మవంచన? ఎంతటి ఆత్మహత్యా సదృశ్యం? అసలు ప్రత్యామ్నాయం అంటే ఏమిటి? అది రాజకీయ విధాన ప్రత్యామ్నాయంగా వుండాలి. ఆ రాజకీయ విధానం అభివృద్ధికరమైన, మార్పు దిశగా నడిచే సామాజిక, ఆర్థిక, సాంస్కృతికపరమైన స్వభావంతో కూడుకుని ఉండాలి. కాంగ్రెస్ పార్టీ విధానాలుగానీ, సీపీఐ, సీపీఎంలు ప్రతిపాదిస్తోన్న కూటమిలోని భాగస్వామ్య ప్రాంతీయ రాజకీయ పార్టీలు అనుసరిస్తోన్న విధానాలు గానీ, ప్రజానుకూలంగా వున్నాయా? కనీసం ఆ సీపీఐ, సీపీఎంలు సమర్థించేవిగానైనా వున్నాయా? ప్రజానుకూల విధానాలు అనుసరిం చని పార్టీలు, కాంగ్రెస్తో సహా లేదా కాంగ్రెస్ను మినహాయించి పలు ప్రాంతీయ పార్టీలతో సీపీఐ, సీపీఎంలు ఏర్పాటు చేయాలనుకునేది ప్రజానుకూలమైన విధానాల ప్రాతిపదికగా రూపొందే కూటమి కాదు. ఒక సందర్భంలో ఇ.ఎం.ఎస్.నంబూద్రిపాద్ చెప్పిన ‘‘ప్రజలకు కావలసింది, ఒక ప్రత్యామ్నాయ విధానాల సమూహమే కానీ, ఒక ప్రత్యామ్నాయ తలకాయల గుంపు కాదు.’’ అన్నసూక్తిని గుర్తుకు తెచ్చుకోవాలి. బీజేపీ ఉగ్రవాద హిందుత్వ పార్టీకాగా, కాంగ్రెస్ తదితర పార్టీల్లో హెచ్చు భాగం ఉదారవాద హిందుత్వ పార్టీలే. తరతమ తేడాలేతప్ప స్వభావం మాత్రం ఒక్కటే. మరో ప్రత్యేకత ఏమిటంటే, దేశంలోని దాదాపు అన్ని ప్రాంతీయ రాజకీయ పార్టీలూ, ఏదో ఒక దశలో మతోన్మాద బీజేపీతో చెలిమి చేసినట్టివే. ఏవో తమ సొంత కారణాల వల్ల ఆ పార్టీకి ఈ పార్టీలు ప్రస్తుతం దూరంగా వుండవచ్చు. అంతమాత్రాన బీజేపీతో జతకట్టగలిగిన ఆ పార్టీల అలనాటి స్వభావం మారిందనుకోలేం. మారినట్లుగా దాఖలాలూ లేవు. ఇప్పుడు తాము ప్రతిపాదిస్తున్న బీజేపీ వ్యతిరేక కూటమిలో చేర్చదలచుకుంటోన్న ఒక్కొక్క పార్టీ గత చరిత్రను సీపీఐ., సీపీఎం.లు బహిరంగంగా ప్రకటించాలి. ఈ పార్టీలు బీజేపీ దగ్గరకు జరిగినా, లేక, దూరంగా వెళ్ళిపోయినా అవి తమ అప్పటి అవసరాల కోసం, అవకాశవాదంతో ఏర్పరచుకొన్న వైఖరే తప్ప, విధానపరమైన నిర్ణయాలు కావు. ఇలాంటి శక్తులతో కలసి నిజమైన బిజెపి వ్యతిరేక కూటమిని సీపీఐ, సీపీఎంలు నిర్మించడం సాధ్యమేనా? సామాజిక న్యాయం, కుల వివక్షలను గురించి మాటల్లో చెప్పడం కాదు. అది చేతల్లో కనపడాలి. ముఖ్యంగా కీలకమైన రాజకీయ రంగంలో స్పష్టంగా ప్రతిబింబించాలి. దినదినం క్షీణించిపోతున్న తమ ఉనికిని నిలబెట్టుకొని, బలపడి.. సామాజిక కులవర్గ దృక్పధంతో ప్రత్యామ్నాయాన్ని గురించి ఆలోచించి కమ్యూనిస్టు పార్టీల మçహాసభలు సరైన నిర్ణయాలు తీసుకోవాలి. కనుక, సరైన ప్రత్యామ్నాయాన్ని ఎంపిక చేసుకొనడంపైనే ఆ పార్టీల భవిష్యత్తు ఆధారపడి వుంటుంది. నిజమైన కమ్యూనిస్టులుగా, నిజమైన సామాజిక రాజకీయ శక్తులతో కలిసి, నిజమైన ప్రత్యామ్నాయ, రాజకీయ శిబిరాన్ని నిర్మించడమా? లేక, బూటకపు లౌకిక శక్తులు, బూటకపు ప్రజాతంత్ర శక్తులతో జతకట్టి, బూట కపు ప్రత్యామ్నాయాన్ని నిర్మించడమా? ఇవే, సీపీఐ, సీపీఎం మహాసభల ముందున్న నిజమైన ప్రత్యామ్నాయాలు. కొసమెరుపు : బీజేపీ వ్యతిరేక కూటమిలో భాగంగా కాంగ్రెస్తో ఫ్రంట్కు సీపీఎం అంగీకరించనున్నట్లు తాజా వార్తలు. - ఇంటర్వ్యూ : జీకేఎం రావు, సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ -
సీజేఐపై అభిశంసన నోటీసులు
న్యూఢిల్లీ: భారతదేశ చరిత్రలో తొలిసారిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)పై అభిశంసన నోటీసులు. ఇప్పటివరకు పలువురు హైకోర్టు న్యాయమూర్తులపై అభిశంసన తీర్మానాలు జారీ అయినప్పటికీ అసాధారణరీతిలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై నోటీసులు ఇవ్వటం ఇదే తొలిసారి. కాంగ్రెస్ నేతృత్వంలో 6 విపక్ష పార్టీలు సీజేఐ మిశ్రాకు వ్యతిరేకంగా ఈ నోటీసులను ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యకు శుక్రవారం అందజేశారు. ఈ అభిశంసన నోటీసులపై 64 మంది రాజ్యసభ సభ్యులు, ఏడుగురు మాజీ ఎంపీలు సంతకాలు చేశారు. సీజేఐ దుష్ప్రవర్తనతోపాటుగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని నోటీసులో విపక్ష నేతలు పేర్కొన్నారు. సీజేఐ తీరుపై 5 ఆరోపణలు చేశారు. భారమైన హృదయంతో..: సిబల్ జడ్జి బీహెచ్ లోయా మృతికేసుపై స్వతంత్ర విచారణ జరపాలన్న పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించిన మరుసటిరోజే ఈ అభిశంసన నోటీసులు ఇవ్వటం చర్చనీయాంశమైంది. ‘ఇలాంటి రోజు వస్తుందనుకోలేదు. కానీ న్యాయవ్యవస్థ స్వతంత్రత కాపాడేందుకు భారమైన హృదయంతో నోటీసులు ఇవ్వక తప్పడంలేదు’ అని కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ అన్నారు. సీజేఐపై వచ్చిన ఆరోపణలను విస్మరించలేమన్న సిబల్ ఒకవేళ అభిశంసన తీర్మానానికి ఆమోదం లభిస్తే సంప్రదాయం ప్రకారం ఆయన తక్షణమే తన విధులనుంచి తప్పుకోవాల్సి ఉంటుందన్నారు. ‘ ఈ విచారణలో నిజానిదే తుది విజయం. న్యాయవ్యవస్థ సుస్థిరంగా ఉన్నప్పుడే ప్రజ్వాస్వామ్యం వర్ధిల్లుతుంది’ అని సిబల్ తెలిపారు. ‘రాజ్యసభ చైర్మన్ సరైన నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నాము’ అని రాజ్యసభ విపక్ష నేత ఆజాద్ అన్నారు. వారం రోజుల క్రితమే రాజ్యసభ చైర్మన్ను కలిసేందుకు అనుమతి కోరామని.. అయితే, శుక్రవారం అపాయింట్మెంట్ దొరికిందని ఆయన తెలిపారు. ఈనోటీసులపై కాంగ్రెస్, ఎన్సీపీ, సీపీఎం, సీపీఐ, ఎస్పీ, బీఎస్పీ, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ నేతలు సంతకాలు చేశారు. కాంగ్రెస్లో విభేదాలు సీజేఐపై అభిశంసన నోటీసుల విషయంలో కాంగ్రెస్లో విభేదాలు నెలకొన్నాయి. ఈ నోటీసులపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సీనియర్ నేతలు, న్యాయవాదులైన పి. చిదంబరం, అభిషేక్ సింఘ్వీ తదితరులు సంతకాలు చేయలేదు. అయితే విభేదాలను కాంగ్రెస్ నేతలు తిరస్కరించారు. విపక్షాలన్నీ ఏకతాటిపైనే ఉన్నాయని.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ను ఉద్దేశపూర్వకంగానే భాగస్వామ్యం చేయలేదన్నారు. మిగిలిన నేతలు కూడా వివిధ కేసులకు సంబంధించిన విరుద్ధ ప్రయోజనాల కారణంగానే.. సంతకాలు చేయలేదన్నారు. మరో సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ ఈ నోటీసులపై చర్చకు వ్యతిరేకంగా ఉన్నారు. ‘అభిశంసన చాలా తీవ్రమైన విషయం. ఒక కేసు తీర్పుపై విభేదించినంత మాత్రాన ఈ నోటీసులు ఇవ్వటం సరికాదు. అందుకే ఉపరాష్ట్రపతిని కలిసే బృందంలో ఉండటం లేదు’ అని ఆయన బహిరంగంగానే వ్యాఖ్యానించారు. అటు, తృణమూల్ కాంగ్రెస్ కూడా ఈ నోటీసులకు మద్దతివ్వలేదు. ఆర్నెల్లలో పదవీ విరమణ పొందనున్న జస్టిస్ దీపక్ మిశ్రాపై ఇలాంటి నోటీసులు ఇవ్వటం న్యాయబద్ధంగా సరైంది కాదని ఆ పార్టీ భావిస్తోంది. ప్రతీకార పిటిషన్: జైట్లీ సీజేఐపై అభిశంసన నోటీసులను కాంగ్రెస్ పార్టీ రాజకీయ ఆయుధంగా వినియోగించుకుంటోందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ విమర్శించారు. జడ్జి లోయా కేసులో కాంగ్రెస్ పన్నిన కుట్రను సుప్రీంకోర్టు భగ్నం చేయటంతో ప్రతీకారంగానే అభిశంసన తీర్మానానికి నోటీసులు ఇచ్చిందన్నారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాకు సోహ్రాబుద్దీన్ కేసుతో ఎటువంటి సంబంధం లేదని.. రాష్ట్ర పోలీసుల సహకారంతో కేంద్ర బలగాలు ఈ ఎన్కౌంటర్ చేశాయన్నారు. కాంగ్రెస్, వారి మిత్రులంతా కలిసి రాజకీయ కుట్రకు పాల్పడుతున్నారన్నారు. అభిశంసన నోటీసుల గురించి ఆలోచించటమే చాలా ప్రమాదకరమన్న జైట్లీ.. అనవసర అంశాలపైనా ఎంపీల సంతకాలను సేకరించటం కష్టమేమీ కాదన్నారు. ఓ న్యాయమూర్తిని భయపెట్టడం.. తద్వారా మరికొందరు న్యాయమూర్తులను హెచ్చరించేందుకే కాంగ్రెస్ ఈ ప్రయత్నం చేసిందన్నారు. గత 25 ఏళ్లలో.. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు న్యాయమూర్తులపై అభిశంసన తీర్మానాలివ్వటం గత 25 ఏళ్లలో మూడుసార్లు జరిగింది. కానీ..సిట్టింగ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై అభిశంసన నోటీసులు ఇవ్వటం మాత్రం ఇదే తొలిసారి. 1993లో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.రామస్వామిపై అవినీతి ఆరోపణలు రావటంతో అభిశంసన తీర్మానం ప్రవేశ పెట్టారు. ఇది పార్లమెంటులో ఓటింగ్ వరకు చేరుకుంది. అయితే లోక్సభలో ఓటింగ్లో మూడింట రెండొంతుల మెజారిటీ రాకపోవటంతో తీర్మానం వీగిపోయింది. 2011లో కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి సౌమిత్ర సేన్పై ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఇది రాజ్యసభలో ఆమోదం పొంది.. లోక్సభకు ఓటింగ్ కోసం వచ్చింది. ఫలితాన్ని ముందుగానే ఊహించిన జస్టిస్ సౌమిత్ర సేన్ తన పదవికి రాజీనామా చేశారు. 2011లోనే సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ పీడీ దినకరన్పై అవినీతి ఆరోపణలొచ్చాయి. ప్రాథమిక విచారణలోనే అవి వాస్తవమేనని తేలింది. సెలవుపై వెళ్లాలని ఆదేశించినా వినకపోవటంతో కర్ణాటక హైకోర్టుకు ఆయన్ను బదిలీ చేశారు. అయితే అభిశంసన ప్రక్రియకు పావులు కదులుతుండగానే ఆయన రాజీనామా చేశారు. 2016లో.. తన అధికారాలను దుర్వినియోగంచేసి ఓ దళిత జూనియర్ సివిల్ జడ్జిని బెదిరింపులకు గురిచేశారన్న ఆరోపణలపై జస్టిస్ నాగార్జున్రెడ్డిపై అభిశంసన తీర్మానాన్ని పెట్టారు. అయితే దీన్ని బలపరిచిన వారిలో 19 మంది తమ సంతకాలను వెనక్కు తీసుకోవటంతో ఈ అభిశంసన వీగిపోయింది. సీజేఐపై ఐదు ఆరోపణలు 1. ప్రసాద్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ కేసు విషయంలో ముడుపులు తీసుకున్నారు. ఇదే కేసులో రిటైర్డు హైకోర్టు న్యాయమూర్తికి వ్యతిరేకంగా చర్యలు తీసుకునేందుకు అనుమతివ్వలేదు. 2. సుప్రీంకోర్టులో ప్రసాద్ ఎడ్యుకేషన్ ట్రస్ట్పై విచారణకు సంబంధించిన పిటిషన్ను ముందు తేదీకి మార్చటం (ఇది చాలా తీవ్రమైన నేరంగా పరిగణిస్తున్నామన్న కాంగ్రెస్) 3. రాజ్యాంగ ధర్మాసనానికి తనే నేతృత్వం వహిస్తున్నప్పటికీ ప్రసాద్ ఎడ్యుకేషన్ ట్రస్ట్కు సంబంధించిన విచారణను తన బెంచీకే కేటాయించటం సంప్రదాయానికి విరుద్ధం. 4. న్యాయమూర్తిగా ఉన్నప్పుడు జస్టిస్ దీపక్ మిశ్రా తప్పుడు అఫిడవిట్తో ఓ స్థలాన్ని కొనుగోలు చేశారు. 2012లో తను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందినపుడు దీన్ని సరెండర్ చేశారు. అయితే 1985లోనే ప్లాట్ కేటాయింపు నిబంధనలు రద్దుచేశారు. అప్పటినుంచి వీటిని సీజేఐ ఉల్లంఘించారు. 5. తనకున్న మాస్టర్ ఆఫ్ రోస్టర్ అధికారాలను దుర్వినియోగం చేస్తూ.. సున్నితమైన అంశాలను కొన్ని ప్రత్యేక ధర్మాసనాలకు కట్టబెట్టారు. ‘అభిశంసన సరికాదు’ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై అభిశంసన నోటీసులను రాజ్యాంగ నిపుణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది రాజకీయంగా పైచేయి సాధించేందుకు చేస్తున్న ప్రయత్నంగా అభివర్ణించారు. అసలు అభిశంసన ఇవ్వాల్సిన తీవ్ర ఆరోపణలేమీ లేవని.. కనుక ఇలాంటి తీర్మానాలు వీగిపోతాయని మాజీ అటార్నీ జనరల్ సోలీ సొరాబ్జీ, మాజీ హైకోర్టు న్యాయమూర్తులు ఎస్ఎన్ ధింగ్రా, అజిత్ కుమార్ సిన్హా, సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ వంటి న్యాయకోవిదులు పేర్కొన్నారు. ‘స్వతంత్ర భారత చరిత్రలో న్యాయవ్యవస్థపై జరిగిన అత్యంత దారుణమైన ఘటన ఇది’ అని సోలీ సొరాబ్జీ పేర్కొన్నారు. ఇది జడ్జి లోయా కేసు తీర్పుకు వ్యతిరేకంగానే కాంగ్రెస్ ఈ కుట్రకు పాల్పడుతోందని వికాస్ సింగ్, జస్టిస్ సిన్హాలు అభిప్రాయపడ్డారు. రాజకీయ స్వలాభం, ఉద్దేశపూర్వకంగానే ఈ నోటీసులు ఇచ్చారని మరికొందరు న్యాయనిపుణులు అభిప్రాయపడ్డారు. తీవ్రంగా కలచివేశాయి సీజేఐను తొలగించాలంటూ ఎంపీలు బహిరంగంగా ప్రకటించడం లాంటి పరిణామాలు తీవ్రంగా కలచివేశాయని సుప్రీంకోర్టు పేర్కొంది. సీజేఐపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టడానికి సన్నద్ధమయ్యే క్రమంలో మార్గదర్శకాలు పాటించే విధంగా ప్రజాప్రతినిధులను నియంత్రించాలని దాఖలైన పిటిషన్ను విచారించే క్రమంలో సుప్రీం కోర్టు ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ అశోక్ భూషణ్ల ధర్మాసనం మాట్లాడుతూ.. ‘ప్రజాప్రతినిధులు ఇలా వ్యవహరించడం దురదృష్టకరం. అభిశంసన గురించి సమాజంలో చర్చ జరగడం సరికాదు. తద్వారా న్యాయ వ్యవస్థపై నమ్మకం సన్నగిల్లే ప్రమాదం ఉంది’అని అభిప్రాయపడ్డారు. విచారణ సందర్భంగా సీనియర్ అడ్వకేట్ మీనాక్షి అరోరా వాదనలు వినిపిస్తూ.. పార్లమెంటులో ఎలాంటి తీర్మానం ప్రవేశపెట్టకుండానే న్యాయమూర్తి తొలగింపుపై రాజకీయ నాయకులు పలు బహిరంగ ప్రకటనలు చేస్తున్నారని అన్నారు. దీని ప్రభావం సదరు న్యాయమూర్తి విధి నిర్వహణపై పడుతుందన్నారు. ఆ ప్రకటనలు ప్రచురించకుండా, ప్రసారం చేయనీయకుండా మీడియాపై నిషేధం విధించాలని కోరగా ధర్మాసనం అందుకు నిరాకరించింది. విచారణను మే 7కి వాయిదా వేసింది. అనంతరం ఈ అంశంపై అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ సహకారం తీసుకోనున్నట్టు ధర్మాసనం తెలిపింది. అభిశంసన ప్రక్రియ ఇలా ► రాజ్యాంగంలోని ఆర్టికల్ 124(4) ప్రకారం సుప్రీంకోర్టు జడ్జీలు సహా ప్రధాన న్యాయమూర్తిని తొలగించవచ్చు. ► ఈ ప్రక్రియను పార్లమెంట్లోని ఏ సభలోనైనా ప్రారంభించొచ్చు. ► రాజ్యసభలో అయితే..ప్రతిపాదనపై 50 మంది సభ్యులు సంతకాలు చేయాలి ► లోక్సభలో అయితే.. 100 మంది సభ్యులు సంతకాలు చేయాలి ► స్పీకర్ లేదా చైర్మన్ ఆ తీర్మానాన్ని ఆమోదించొచ్చు లేదా తిరస్కరించొచ్చు ► ఒకవేళ తిరస్కరిస్తే ఆ ప్రతిపాదన వీగి పోయినట్లే ఆమోదం పొందితే.. ► సుప్రీం జడ్జీ, ఒక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఒక న్యాయ నిపుణుడితో కూడిన కమిటీ ఏర్పాటవుతుంది ► ఆ కమిటీయే అభియోగాలను నమోదు చేస్తుంది ► అభిశంసన ఎదుర్కొంటున్న జడ్జీకి ఆ కాపీ పంపుతారు ► తనను సమర్థించుకుంటూ జడ్జీ రాతపూర్వక వివరణ ఇవ్వాలి ► విచారణ తుది నివేదికను కమిటీ స్పీకర్ లేదా చైర్మన్కు సమర్పిస్తుంది ► పార్లమెంట్లో చర్చ జరుగుతుంది ► సాధారణ మెజారిటీతో లేదా అందుబాటులో ఉన్న సభ్యుల్లో మూడింట రెండొంతుల మెజారిటీతో ప్రతిపాదన ఆమోదం పొందాలి ► ఒక సభలో ఆమోదం పొందిన తరువాత మరో సభకు పంపుతారు ► రెండింట్లోనూ ఆమోదం పొందిన తరువాత రాష్ట్రపతికి చేరుతుంది ► సదరు జడ్జీని తొలగిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీచేస్తారు -
అది ప్రతీకార పిటిషన్..
సాక్షి, న్యూఢిల్లీ : భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా అభిశంసనకు విపక్షాలు ఇచ్చిన నోటీసుపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. కాంగ్రెస్ సహా విపక్షాలు అభిశంసనను రాజకీయ పరికరంగా వాడుకుంటున్నాయని ఆరోపిస్తూ అది ప్రతీకార పిటిషన్ అని అభివర్ణించారు. ఇది ప్రమాదకర ధోరణి అని హెచ్చరించారు. ఒక న్యాయమూర్తిని ఒత్తిడికి గురిచేసి ఇతర న్యాయమూర్తులకు ఎలాంటి సంకేతాలు పంపుతారని ప్రశ్నించారు. జస్టిస్ బీహెచ్ లోయా మరణంపై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్ను సుప్రీం కోర్టు తోసిపుచ్చిన వెనువెంటనే ఈ తీర్మానం ప్రవేశపెట్టడాన్ని గుర్తించాలని జైట్లీ అన్నారు. న్యాయమూర్తిని అభిశంసించాలన్న విపక్షాల వ్యూహం న్యాయవ్యవస్థ స్వతంత్రతకు పెనుముప్పని ఆందోళన వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టు సీజేఐ పనితీరుపై గతంలో న్యాయమూర్తులు బాహాటంగా అసంతృప్తి వ్యక్తం చేసిన క్రమంలోనే అభిశంసన తీర్మానం ముందుకొచ్చిందని కాంగ్రెస్ స్పష్టం చేసింది. న్యాయమూర్తుల మధ్య విభేదాలపైనా జైట్లీ స్పందిస్తూ న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ఇది పెనుసవాల్ విసురుతుందని వ్యాఖ్యానించారు. -
అభిశంసన అంటే ఏమిటీ?
సాక్షి, న్యూఢిల్లీ : సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాకు వ్యతిరేకంగా అభిశంసన తీర్మానాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన ఏడుగురు ప్రతిపక్ష పార్టీలు సంయుక్తంగా శుక్రవారం నాడు భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడిని కలుసుకొని ఓ లేఖను అందజేశాయి. ఆ లేఖపై కాంగ్రెస్ పార్టీతోపాటు సీపీఎం, సీపీఐ, ఎన్సీపీ, ఎస్పీ, బీఎస్పీ పార్టీలకు చెందిన 71 మంది పార్లమెంట్ సభ్యులు సంతకాలు చేశారు. ప్రతిపక్షానికి చెందిన డీఎంకే మాత్రం అభిశంసన తీర్మానానికి దూరంగా ఉంది. సీబీఐ ప్రత్యేక జడ్జీ బ్రిజ్మోహన్ హరికిషన్ లోయ అనుమానాస్పద మృతిపై స్వతంత్య్రంగా దర్యాప్తు జరిపించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని గురువారం నాడు దీపక్ మిశ్రా నాయకత్వంతోని సుప్రీం కోర్టు బెంచీ కొట్టివేసిన నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు అభిశంసన తీర్మానాన్ని ముందుకు తీసుకొచ్చారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి నియామకానికి వీలు కల్పిస్తున్న భారత రాజ్యాంగంలోని 124 సెక్షన్ కిందనే ఆయన్ని తొలగించవచ్చు. తప్పుడు ప్రవర్తన, అసమర్ధుడు అనే కారణంగా ఆయనపై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టవచ్చు. సుప్రీం కోర్టుకు చెందిన ఏ జడ్జీనైనా పదవీ విరమణకన్నా ముందే తొలగించాలంటే పార్లమెంట్లో అభిశంసన తీర్మానం నెగ్గితే రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా తొలగిస్తారు. అభిశంసన తీర్మానాన్ని ఇరు సభల్లో మెజారిటీ సభ్యులు ఆమోదించడంతోపాటు ఓటింగ్ రోజున ఇరు సభల్లో సభకు హాజరైన సభ్యుల్లో మూడింట రెండు వంతుల మంది అభిశంసనకు అనుకూలంగా ఓటు వేయాల్సి ఉంటుంది. జడ్జీల (ఇంక్వైరీ) యాక్ట్–1969, జడ్జీల (ఇంక్వైరీ) రూల్స్–1969 చట్టాల కింద జడ్జీలను తొలగించేందుకు రాజ్యాంగంలోని 124వ అధికరణ వీలు కల్పిస్తోంది. ఈ మొత్తం ప్రక్రియను అభిశంసనగా వ్యవహరిస్తారు. -
సీజేఐ అభిశంసనపై కాంగ్రెస్లో విభేదాలు..?
సాక్షి, న్యూఢిల్లీ : సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా అభిశంసనపై కాంగ్రెస్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జస్టిస్ మిశ్రా అభిశంసన కోరుతూ శుక్రవారం ఉపరాష్ట్రపతికి సమర్పించిన విపక్ష ఎంపీల సంతకాలతో కూడిన నోటీసులో తాను సంతకం చేయలేదని సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ చేసిన ప్రకటన ఇవే సంకేతాలను పంపుతోంది. సీజేఐ అభిశంసనను కోరుతూ ఏడు విపక్ష పార్టీలకు చెందిన 64 మంది ఎంపీలు ఉపరాష్ట్రపతికి నోటీసులు ఇచ్చారు. సీబీఐ జడ్జి జస్టిస్ బీహెచ్ లోయా మృతిపై విచారణ జరిపించాలన్న పిటిషన్ను సుప్రీం కోర్టు తోసిపుచ్చిన నేపథ్యంలో విపక్షాలు మిశ్రా అభిశంసనకు నోటీసు ఇవ్వడం గమనార్హం. తీర్పును కొందరు సమ్మతించడం లేదనే కారణంతో అభిశంసన చేపట్టడం తీవ్రమైన చర్యగా సల్మాన్ ఖుర్షీద్ స్పష్టం చేశారు. తాను ఈ నోటీసుపై సంతకం చేయలేదని ఆయన చెప్పారు. సంక్లిష్ట అంశాలను ఎదుర్కోవడంలో సుప్రీం కోర్టు సర్వసన్నద్ధంగా ఉందని సల్మాన్ ఖుర్షీద్ పేర్కొన్నారు. జస్టిస్ లోయా కేసులో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును అంగీకరించాలని, దాన్ని గౌరవించాలని వ్యాఖ్యానించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సైతం ఈ నోటీసుపై సంతకం చేయలేదు. కాంగ్రెస్ పార్టీ సహా ఏడు విపక్ష పార్టీలు ఈ నోటీసుపై సంతకాలు చేశాయని కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ వెల్లడించారు. -
భారత ప్రధాన న్యాయమూర్తి అభిశంసనకు విపక్షాల డిమాండ్
-
సీజేఐపై అభిశంసన; సంచలన పరిణామాలు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాపై అభిశంసన వ్యవహారంలో సంచలన పరిణామాలు చోటుచేసుకున్నాయి. దీనిపై గతంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన విపక్షాలు ఇప్పుడు ఒక్కతాటిపైకి వచ్చాయి. ఏడు పార్టీలకు చెందిన సుమారు 71 మంది ఎంపీలు అభిసంశన నోటీసులపై సంతకాలు చేశారు. సదరు తీర్మానాన్ని రాజ్యసభలో ప్రవేశపెట్టాలని కోరుతూ కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్ నేతృత్వంలోని బృందం శుక్రవారం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును కలిశారు. జస్టిస్ లోయా మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టేసిన మరుసటి రోజే ఈ పరిణామాలు చోటుచేసుకోవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నట్లైంది. పిటిషన్లను కొట్టేస్తూ సుప్రీం ఇచ్చిన తీర్పును కాంగ్రెస్ దుర్దినంగా అభివర్ణించిన సంగతి తెలిసిందే. సీజేఐ దీపక్ మిశ్రాపై నలుగురు సీనియర్ జడ్జిలు తిరుగుబావుటా ఎగరేసిన సందర్భంలోనే అభిశంసన అంశం తెరపైకి వచ్చినా, విపక్షాల్లో ఏకాభిప్రాయం కొరవడటంతో అది ముందుకు వెళ్లలేదు. ఇప్పుడు కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు, ఎస్పీ, బీఎస్పీ తదితర పార్టీలు ఒక్కతాటిపైకి రావడంతో తీర్మానానికి బలంపెరిగినట్లైంది. అభిశంసన వార్తలపై నిషేధం!: చీఫ్ జస్టిస్పై అభిశంసన తీర్మానం పెట్టేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్న సమయంలోనే సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అభిశంసన గురించి సమాజంలో చర్చ జరుగడం దురదృష్టకరమని, తద్వారా న్యాయవ్యవస్థపై ప్రజల్లో సదాభిప్రాయం సన్నగిల్లే ప్రమాదం ఉందని, కాబట్టి అభిశంసనకు సంబంధించిన అన్ని వార్తలను నిషేధించడమే ఉత్తమమని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ విషయంలో ప్రభుత్వ న్యాయాధికారుల అభిప్రాయాలను కూడా తీసుకోవాలని భావిస్తున్నది. అది జరిగేపని కాదు: కాగా, చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రాపై అభిశంసన జరిగేపని కాదని మాజీ అటార్నీ జనరల్ సొలి సొరబ్జీ అన్నారు. ‘చెప్పిన తీర్పుల ఆధారంగా ఒక న్యాయమూర్తిపై అభిశంసన పెట్టడం కుదరదు. ఆ జడ్జి అనుచితంగా ప్రవర్తించినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. అభిశంసన తీర్మానం పార్లమెంట్లో ఆమోదం పొందిన తర్వాత దానిపై రాష్ట్రపతి తుది నిర్ణయం తీసుకుంటారు’ అని సొరబ్జీ పేర్కొన్నారు. -
సీజేఐ దీపక్ మిశ్రాపై అభిశంసన..?
సాక్షి, న్యూఢిల్లీ : భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) దీపక్ మిశ్రాపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు భారత జాతీయ కాంగ్రెస్(ఐఎన్సీ) బుధవారం పేర్కొంది. ఇందుకోసం ప్రతిపక్ష పార్టీలు అన్నింటితో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించింది. ఈ ఏడాది జనవరిలో సుప్రీం కోర్టు రోస్టర్ (ఏ కేసును ఎవరు విచారించాలనే నిర్ణయం) కేటాయింపులు సమతూకంతో ఉండటం లేదని సీజేఐ దీపక్ మిశ్రాపై వ్యతిరేకతను నలుగురు సీనియర్ జడ్జిలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన ఆధారంగానే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాల మద్దతును కూడగట్టేందుకు యత్నిస్తోందని తెలిసింది. భారత ప్రధాన న్యాయమూర్తిపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలంటే లోక్సభలో కనీసం 100 మంది ఎంపీలు, 50 మంది రాజ్యసభ ఎంపీల మద్దతు అవసరం. ఇందుకోసం కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఎంపీల సంతకాలను సేకరించడం ప్రారంభించిందని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) నాయకుడు శరద్ పవార్ తెలిపారు. ఎన్సీపీకి చెందిన మరో ఎంపీ డీపీ త్రిపాఠి మాట్లాడుతూ.. అభిశంసన తీర్మాన పత్రంపై తాను ఇప్పటికే సంతకం చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం.. మూడు ప్రతిపక్ష పార్టీల నాయకులు ఇప్పటికే ఈ తీర్మానం సంతకం చేసినట్లు తెలిసింది. -
సీజేఐపై కాంగ్రెస్ అభిశంసన!
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాపై అభిశంసన తీర్మానాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు కాంగ్రెస్ కసరత్తు ప్రారంభించింది. అందుకోసం వివిధ ప్రతిపక్ష పార్టీల ఎంపీల నుంచి కాంగ్రెస్ పార్టీ సంతకాలు సేకరిస్తోందని ఎన్సీపీ నేతలు వెల్లడించారు. ఈ అంశంపై స్పందించేందుకు కాంగ్రెస్ పార్టీ నిరాకరించగా.. ఎన్సీపీ ఎంపీ మజీద్ మెమన్ మాట్లాడుతూ ‘భారతదేశ ప్రధాన న్యాయమూర్తిపై అభిశంసన కోసం ప్రక్రియను కాంగ్రెస్ మొదలుపెట్టింది. నోటీసుపై నేను సంతకం చేశాను. ఎంత మంది సంతకం చేశారన్న విషయాన్ని కాంగ్రెస్నే అడగండి’ అని సమాధానమిచ్చారు. మరో ఎన్సీపీ ఎంపీ డీపీ త్రిపాఠీ మాట్లాడుతూ.. ‘నోటీసుపై నాతో పాటు ఇతరులు కూడా సంతకాలు చేశారు. ప్రక్రియ కొనసాగుతోంది’ అని చెప్పారు. సంతకాలు చేసిన వారిలో ఎన్సీపీ, సీపీఎం, సీపీఐ, ఇతర పార్టీల ఎంపీలు ఉన్నారని, కొందరు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా సంతకం చేశారని తెలిపారు. సీజేఐకి వ్యతిరేకంగా పార్లమెంటులో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలంటే నోటీసుపై లోక్సభలో 100 మంది ఎంపీలు, రాజ్యసభలో 50 మంది సభ్యుల సంతకాలు అవసరం. రాజ్యసభ ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ కార్యాలయంలో వివిధ ప్రతిపక్ష పార్టీల నేతలు భేటీ అయ్యి అభిశంసన అంశంపై చర్చించినట్లు సమాచారం. అయితే దీనిపై స్పందించేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు నిరాకరించారు. -
‘సీజే అభిశంసనపై చర్చిస్తున్నాం’
సాక్షి, న్యూఢిల్లీ : భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ దీపక్ మిశ్రా అభిశంసనపై ఇతర పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నామని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చెప్పారు. రానున్న బడ్జెట్ సమావేశాల్లో సీజేఐపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టేందుకు వివిధ పార్టీలతో చర్చిస్తున్నామన్నారు. కేసుల కేటాయింపులో వివక్ష చూపుతున్నారంటూ సీజేఐపై నలుగురు సీనియర్ సుప్రీం న్యాయమూర్తులు ఆరోపించిన నేపథ్యంలో ఏచూరి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రెబెల్ జడ్జీలు లేవనెత్తిన అంశాలపై విచారణ చేపట్టాలని ఇప్పటికే కాంగ్రెస్, సీపీఎం డిమాండ్ చేశాయి. కాగా ఈనెల 29 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1న 2018-19 వార్షిక బడ్జెట్ను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంట్లో ప్రవేశపెడతారు. -
‘సుప్రీం’లో సంక్షోభానికి కారణాలివి!
నలుగురు సుప్రీంకోర్టు జడ్జీలు జాస్తి చలమేశ్వర్, రంజన్ గొగోయ్, మదన్ బీ లోకూర్, కురియన్ జోసెఫ్ శుక్రవారం విలేఖరుల సమావేశం ఏర్పాటు చేయడానికి కొన్ని కేసుల విచారణ, బెంచ్ల మార్పు వంటి విషయాల్లో ప్రధాన న్యాయమూర్తి(సీజే) దీపక్ మిశ్రా నిర్ణయాలు కారణమని చెబుతున్నారు. ఇందులో మొదటిది ఆర్.పీ. లూథ్రా వర్సెస్ భారత ప్రభుత్వ న్యాయశాఖ కేసులో కిందటేడాది అక్టోబర్ 27న ఇచ్చిన ఉత్తర్వు. రెండోది కిందటి నవంబర్లో సుప్రీంకోర్టు విచారణకు వచ్చిన జడ్జీల లంచాల కేసు. అత్యున్నత న్యాయస్థానాలకు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి సవరించిన మెమొరాండం ఆఫ్ ప్రొసీజర్(ఎంఓపీ) లేకుండా జరిపిన జడ్జీల నియామకాన్ని ఆర్పీ లూథ్రా అనే లాయర్ సవాలు చేశారు. ఈ కేసు విచారిస్తున్న ఆదర్శ్ కుమార్ గోయల్, ఉదయ్ ఉమేష్ లలిత్తో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ కిందటి అక్టోబర్ 27న కేంద్ర సర్కారుకు నోటీసు జారీ చేయడమేగాక కేసు విచారణ సందర్భంగా కోర్టుకు హాజరు కావాలని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ హాజరుకావాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. సవరించిన ఎంఓపీ(నియామకాలకు సంబంధించి అనుసరించాల్సిన పద్ధతి) లేకుండా జడ్జీల నియామకాన్ని లూథ్రా సవాలుచేయడాన్ని ఇద్దరు జడ్జీల బెంచ్ తోసిపుచ్చింది. అయితే, విస్తృత ప్రజాప్రయోజనాల దృష్ట్యా ఎంఓపీని ఖరారు చేయడంలో ఇంకే మాత్రం జాప్యం తగదని తేల్చిచెప్పింది. తప్పుచేసే జడ్జీలను అభిశంసించడం ఒక్కటే పరిష్కార మార్గంగా చూడకుండా జడ్జీల వ్యవహారంలో దిద్దుబాటు చర్యలకు ఓ వ్యవస్థను ఏర్పాటుచేయాలని కూడా వారు సూచించారు. కేసు మరుసటి విచారణను నవంబర్ 14కు వాయిదా వేసిన ఈ బెంచ్ కోర్టుకు ఈ కేసులో తోడ్పడడానికి సీనియర్ అడ్వకేట్ కేవీ విశ్వనాథన్ను నియమించింది. మరో బెంచీకి కేసు బదిలీ ఇద్దరు జడ్జీల బెంచి తదుపరి విచారణ ప్రారంభించక ముందే ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా ఈ కేసును జస్టిస్ మిశ్రా, ఏకే సిక్రీ, అమితావా రాయ్తో కూడిన ముగ్గురు జడ్జీల బెంచ్కు బదిలీచేశారు. ఈ కొత్త బెంచ్ కేసును నవంబర్ 8న విచారించింది. ఇద్దరు జడ్జీల బెంచ్ అక్టోబర్ 27న ఇచ్చిన ఆదేశంపై వ్యాఖ్యానిస్తూ, ‘‘ ఈ అంశాలు న్యాయవ్యవస్థ ఇలా పరిశీలించాల్సిన విషయాలు కావు’’ అని పేర్కొంది. ఇలాంటి ముఖ్యాంశాన్ని న్యాయవ్యవస్థ నిర్ణయించాల్సి వస్తే దానిపై రాజ్యాంగ ధర్మాసనమే విచారించాలన్నది నలుగురు సుప్రీం జడ్జీలు అభిప్రాయమని వారి లేఖ చదివితే అర్థమౌతోంది. చలమేశ్వర్ ఆదేశాన్ని పట్టించుకోని ప్రధాన న్యాయమూర్తి ఓ అవినీతి కేసులో సుప్రీంకోర్టు జడ్జీల పేర్లు చెప్పి అనుకూల తీర్పు వచ్చేలా చూస్తామని చెప్పి లంచాలు తీసుకున్నారని ఆరోపిస్తూ దాఖలైన కేసు కూడా జడ్జీలకు, సీజే దీపక్ మిశ్రాకు మధ్య దూరం పెరగడానికి దారితీసింది. ఈ కేసును ఐదుగురు సీనియర్ జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం విచారించాలని జాస్తి చలమేశ్వర్, ఎస్.అబ్దుల్ నజీర్తో కూడిన బెంచ్ నవంబర్ 9న ఆదేశించింది. అయితే, మరుసటి రోజే దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసు విచారిస్తూ, ‘‘ భారత ప్రధాన న్యాయమూర్తి కేసును కేటాయిస్తే తప్ప ఏ న్యాయమూర్తి తనంతట తాను ఏ విషయంపై విచారించజాలడు. ఎందుకంటే ఇలాంటి బాధ్యతల పంపిణీ వ్యవహారాల్లో ప్రధాన న్యాయమూర్తే సుప్రీం,’’ అని స్పష్టం చేసింది. బెంచ్లు ఏర్పాటు చేసే అధికారం ప్రధాన న్యాయమూర్తికే ఉందని బెంచ్ తేల్చి చెప్పింది. ‘‘ఈ రాజ్యాంగ ధర్మాసనం ఉత్తర్వుకు భిన్నంగా ఉన్న ఎలాంటి ఆదేశం ఇంతకు ముందు జారీ చేసినా దానికి విలువ ఉండదు. అది రద్దయిన ఉత్తర్వు కిందే లెక్క,’’ అని జస్టిస్ మిశ్రా అన్నారు. కేంపెయిన్ ఫర్ జుడీషియల్ అకౌంటబిలిటీ అనే ఎన్జీఓ తరఫున ఈ కేసులో వాదిస్తున్న ప్రముఖ లాయర్ ప్రశాంత్ భూషణ్ ఈ రాజ్యాంగ ధర్మాసనం వాదనను వ్యతిరేకిస్తూ మాట్లాడారు. దీంతో సీజే ఆయనను తీవ్రంగా మందలించారు. లక్నోకు చెందిన ప్రసాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనే వైద్యకళాశాలలో కొత్త విద్యార్థుల ప్రవేశంపై నిషేధానికి సంబంధించిన ఈ కేసులో ఒడిశా హైకోర్టు మాజీ జడ్జి ఇష్రత్ మస్రూర్ ఖుద్దూసీ నిందితుడు. సీబీఐ దర్యాప్తు చేసిన ఈ కేసులో ఈ సంస్థ చైర్మన్ బీపీ యాదవ్, ఆయన కొడుకు పలష్ యాదవ్ తదితరులతో పాటు ఖుద్దూసీ కూడా అరెస్టయ్యారు. సీబీఐ జడ్జి లోయా మృతి కేసు సంచలనం సృష్టించిన సొహ్రాబుద్దీన్ షేక్ ఎన్కౌంటర్ కేసు విచారించిన సీబీఐ కోర్టు స్పెషల్ జడ్జి బీహెచ్ లోయా మృతి(2014 డిసెంబర్లో) కేసు విచారణ కూడా పై నలుగురు సుప్రీం జడ్జీల అసంతృప్తికి కారణమైంది. ఈ జడ్జి లోయా మృతిపై దర్యాప్తు జరిపించాలని కోరుతూ గురువారం దాఖలైన పిటిషన్ను బొంబాయి హైకోర్టు విచారణకు స్వీకరించింది. అయితే మరుసటి రోజు శుక్రవారం లోయా మరణంపై సుప్రీంకోర్టు తన ముందుకొచ్చిన పిటిషన్పై వాదనలు వినడం ప్రారంభించింది. లాయర్లు అభ్యంతరాలు చెప్పినాగాని కేసును జడ్జీలు అరుణ్ మిశ్రా, ఎం.ఎం.శంతనగౌండర్తో కూడిన బెంచ్కి కేటాయించారు. ఓ పక్క బొంబాయి హైకోర్టు లోయా మృతిపై కేసు విచారిస్తుండగా సుప్రీంకోర్టు ఇలా వ్యవహరించడం, పైగా సీనియర్ జడ్జీల నిర్వహించే నాలుగు కోర్టులను కాదని పదో కోర్టుకు ఈ కేసు పంపడం కూడా నలుగురు జడ్జీల ఆగ్రహానికి కారణమైందని భావిస్తున్నారు. (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
జస్టిస్ చలమేశ్వర్ ఏం చెప్పారంటే..
-
సీజే తీరు బాగోలేదు.. జరగకూడనివి జరిగాయి
సాక్షి, న్యూఢిల్లీ : భారతదేశ న్యాయ చరిత్రలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాపై మిగతా సీనియర్ న్యాయమూర్తులు బహిరంగంగా తమ అసంతృప్తి వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టులో గత కొద్ది రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఊహించని విధంగా మీడియా సమావేశం నిర్వహించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్ తన నివాసంలో మరో ముగ్గురు న్యాయమూర్తులు (జస్టిస్ మదన్ లోకూర్, జస్టిస్ రంజన్ గోగోయ్, జస్టిస్ కురియన్ జోసెఫ్)తో కలిసి జరిగిన పరిణామాలను మీడియా ముందు వివరించారు. అయితే పూర్తి అంశాలను వెల్లడించకుండా మీడియాకు లేఖలు విడుదల చేశారు. జస్టిస్ చలమేశ్వర్ ఏం చెప్పారంటే... ‘‘దేశంలోనే కాదు.. ప్రపంచ న్యాయ చరిత్రలోనే బహుశా ఇలాంటి ఘట్టం చోటు చేసుకోలేదేమో. సుప్రీంకోర్టులో గత కొన్ని నెలలుగా పరిపాలన విధానం సరిగా లేదు. జరగకూడని పరిణమాలు చోటు చేసుకున్నాయి. మీడియాలో వస్తున్నట్లు ఇవేం రాజకీయ అంశాలు కావు. న్యాయ వ్యవస్థలో స్వేచ్ఛ లేకపోతే ప్రజాస్వామ్యం చచ్చిపోతుంది. సుప్రీంకోర్టు గౌరవాన్ని పరిరక్షించాలని.. ఓ పద్ధతి ప్రకారం ముందుకు వెళ్దామని ప్రధాన న్యాయమూర్తికి(లేఖ ద్వారా) విజ్ఞప్తి చేశాం. కానీ, ఆయన నుంచి సానుకూల స్పందన లభించలేదు. అందుకే లోపాలను సరిదిద్దాలని మేం నలుగురం భావించాం. న్యాయవ్యవస్థలో ఏం జరుగుతుందో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మాపై ఉంది. అందుకే వాటిని వివరించేందుకు మీడియా ముందుకు వచ్చాం. చీఫ్ జస్టిస్ ను అభిశంసించాలా లేదా అన్నది దేశ ప్రజలే తేల్చుకోవాలి' అని ఆయన చెప్పారు. కాగా ఇంతకు ఏ అంశంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో విభేదాలు వచ్చాయి? ఏ అంశాన్ని ఆయన నిరాకరించారు అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పలేదు. అన్ని వివరాలను లేఖ రూపంలో ఇస్తామని తొలుత చెప్పి అనంతరం వాటిని మీడియాకు అందజేశారు. తమ ముందు మరో అవకాశం లేకుండా పోవటంతోనే ప్రజల ముందుకు వచ్చామని మరో న్యాయమూర్తి లోకూర్ తెలిపారు. ఇక గత డిసెంబర్ లో ఓ కేసు విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా-జస్టిస్ చలమేశ్వర్ల మధ్య స్వల్ప వివాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఏకపక్షంగా చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నిర్ణయాలు తీసుకుంటున్నారని జస్టిస్ చలమేశ్వర్ ఆ సందర్భంలో వ్యాఖ్యానించారు. వరుస భేటీలు.. ఇక తాజా పరిణామాల నేపథ్యంలో ప్రధానితో న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ భేటీ అయ్యారు. నలుగురు న్యాయమూర్తులు లేవనెత్తిన అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. మరోవైపు విమర్శల నేపథ్యంలో అటార్నీ జనరల్తో ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా భేటీ కావటం విశేషం. -
ట్రంప్ అభిశంసన కోసం రంగంలోకి బిలినీయర్!
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిశంసన కోసం ఆ దేశ బిలియనీర్ ఒకరు పోరాటాన్ని ప్రారంభించారు. ట్రంప్ను వెంటనే అధ్యక్ష పదవి నుంచి దింపేయాలని అమెరికన్ కాంగ్రెస్ (చట్టసభ) సభ్యుల కోరుతూ టీవీల్లో, ఆన్లైన్లో ప్రచారాన్ని మొదలుపెట్టారు. మాజీ హెడ్జ్ ఫండ్ మేనేజర్, బిలియనీర్ అయిన టామ్ స్టేయర్ ఈమేరకు టీవీల్లో, ఆన్లైన్లో వాణిజ్య ప్రకటనలు ఇచ్చారు. ట్రంప్ను ఎందుకు అభిశంసించాలో కారణాలు ఈ వాణిజ్య ప్రకటనలో ఆయన వివరించారు. 'ఆయన అణ్వాయుధ యుద్ధం వచ్చే పరిస్థితి తీసుకొచ్చారు. ఎఫ్బీఐతో అన్యాయంగా ప్రవర్తించారు. విదేశీ ప్రభుత్వాల నుంచి డబ్బు తీసుకున్నారు. నిజాన్ని ప్రచురించినందుకు వార్తాసంస్థలను మూసివేస్తానని హెచ్చరించారు' అని స్టేయర్ తన వాణిజ్య ప్రకటనలో పేర్కొన్నారు. అణ్వాయుధాలు కలిగి.. మానసికంగా స్థిరచిత్తం లేని అధ్యక్షుడు దేశానికి ప్రమాదకరం అని తెలిసినా కాంగ్రెస్ చట్టసభ సభ్యులు ఏమీ పట్టపట్టనట్టు వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ వాణిజ్య ప్రకటన కోసం టామ్ స్టేయర్ 10 మిలియన్ డాలర్లు ఖర్చు పెట్టారు. ఈ ప్రకటన చూసిన ప్రజలు ఉమ్మడిగా తమ గళాన్ని వినిపించడం ద్వారా కాంగ్రెస్ సభ్యులపై ఒత్తిడి తేవాలని, ఇప్పటికైనా కాంగ్రెస్ సభ్యులు రాజకీయాలు మాని.. దేశం కోసం పనిచేసేలా చూడాలని సూచించారు. అంతేకాకుండా ఆయన 'నీడ్టుఇంపీచ్' పేరిట ఆన్లైన్లో సంతకాలు సేకరించేందుకు వెబ్సైట్ను ప్రారంభించారు. స్టేయర్ ప్రతిపక్ష డెమొక్రటిక్ పార్టీ కార్యకర్త. 2012లో ఒబామాకు ఫండ్రైజర్గా ఆయన కీలకంగా వ్యవహరించారు. -
ట్రంప్ కోసం పోర్న్ సంచిక ప్రకటన
సాక్షి : అమెరికా అడల్ట్ కథనాల సంచిక హస్ట్లర్ (లారీ ఫ్లైంట్) ఆదివారం ఓ బంపరాఫర్ ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను పదవీచిత్యుడిని చేసేందుకు అవసరమైన సాక్ష్యాలు తమకు ఇవ్వాలని ఓ ఆహ్వాన ప్రకటన వెలువరించింది. ఇందుకుగానూ 10 మిలియన్ డాలర్ల నజరాను అందజేస్తామని ది వాషింగ్టన్ పోస్ట్ సంచికలో ప్రకటన ఇచ్చింది. 74 ఏళ్ల లారీ క్లాక్స్టన్ ఫ్లైంట్ నేతృత్వంలో నడుస్తున్న ఈ అడల్ట్ సంచిక ఇంతకు ముందు కూడా ట్రంప్ పై ఇలాంటి ఆఫర్ నే ప్రకటించింది కూడా. గతేడాది అమెరికా ఎన్నికల ప్రచార సమయంలో ఆయనపై లైంగికపరమైన వివాదాలకు సంబంధించి సాక్ష్యాలను సమర్పించి 1 మిలియన్ డాలర్లు గెలుచుకోవచ్చని ప్రకటించగా.. 2005లో ట్రంప్ చేసిన నీచమైన వ్యాఖ్యలు వెలుగులోకి వచ్చాయి. ట్రంప్ పేరిట ఓ ఫిక్షన్ పోర్న్ పేరడీ స్టోరీని హస్ట్లర్ సంచిక కొంత కాలం ప్రచురించింది కూడా. ఇక తాజాగా వారు విడుదల చేసిన ప్రకటనపై స్పందించేందుకు వైట్హౌజ్ ప్రతినిధులు నిరాకరించారు. -
ట్రంప్ ఉంటాడా?.. ఊడతాడా?
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మహాభిశంసన తీర్మానం ద్వారా వైదొలుగుతారా? లేదా?. ఈ ప్రశ్నపై ఆన్లైన్లో అత్యధికంగా బెట్టింగ్లు జరగుతున్నాయి. ఆన్లైన్ పొలిటికల్ స్టాక్ మార్కెట్ ప్రెడిక్ట్ఇట్లో గత రెండు రోజులుగా ఈ ప్రశ్నపై ఎక్కువ మంది బెట్ చేస్తున్నారు. ఇప్పటివరకూ దాదాపు లక్షకు పైచిలుకు మంది ప్రెడిక్ట్ఇట్లో ట్రంప్ ప్రశ్నపై బెట్ చేశారు. గత వారంలో ట్రంప్ అభిశంసనకు గురవుతారని ప్రెడిక్ట్ఇట్లో 7గా ఉన్న ఓట్ల శాతం.. బుధవారం ఒక్కరోజే 33 శాతానికి వెళ్లింది. సాయంత్రానికి మళ్లీ తగ్గి 24 శాతానికి చేరింది. ప్రెడిక్ట్ఇట్ను వాషింగ్టన్ పొలిటికల్ కన్సల్టెన్సీ అరిస్టోటిల్, విక్టోరియా యూనివర్సిటీ-వెల్లింగ్టన్లు నిర్వహిస్తున్నాయి. ఇందులో రిజిస్టర్ అయినవారందరూ అమెరికన్లే. ఎక్కువ మంది బెట్టర్లు ట్రంప్ పూర్తి కాలం పదవిలో కొనసాగరని 5 వేల డాలర్లు బెట్ చేసినట్లు బుక్మేకర్ పాడీ పవర్ బెట్ఫెయిర్ చెప్పింది. -
ట్రంప్ అభిశంసనకు మార్గాలివీ..!
అమెరికా వర్సిటీ ప్రొఫెసర్ తాజా పుస్తకం డొనాల్డ్ గెలుస్తారని ముందే చెప్పిన ప్రొఫెసర్ అభిశంసన మీదా జోస్యం.. మార్గాల వివరణ ట్రంప్ అనుసరించాల్సిన వ్యూహంపై సూచన అలాన్లిచ్మన్.. అమెరికా యూనివర్సిటీలో చరిత్ర అధ్యాపకుడు. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలుస్తాడని ముందుగా జోస్యం చెప్పిన రాజకీయ విశ్లేషకుడు. ఆ ఎన్నికలే కాదు.. 1982 నుంచి అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేది ఖచ్చితంగా అంచనా వేసి చెప్పిన పండితుడు. తన గెలుపు ఖాయమని ముందుగానే చెప్పిన ఈ ప్రొఫెసర్కి.. ట్రంప్ స్వయంగా అభినందనలు కూడా తెలిపారు. అయితే.. ట్రంప్ అధ్యక్షుడిగా గెలిచాక అభిశంసనకు కూడా గురవుతారని అదే ప్రొఫెసర్ అప్పుడే చెప్పారు. ఇప్పుడు ట్రంప్ను అభిశంసించడానికి గల మార్గాలేమిటనేది వివరిస్తూ ఏకంగా ఒక పుస్తకమే రాసేశారు. ఆ పుస్తకాన్ని మంగళవారం ఆవిష్కరించనున్నారు. జవాబు చెప్పకుండా తప్పించుకోలేరు..: ‘‘ట్రంప్తన కెరీర్లో ఎన్నడూ జవాబుదారీగా లేరు. కానీ.. ఎవరైనా సరే ఒక అధ్యక్షుడిగా జవాబుదారీతనం నుంచి తప్పించుకోలేరు. దివాళాతీశానని ప్రకటించజాలరు. ఒప్పందాన్ని గాలికి వదిలేయజాలరు. చిట్టచివరికి జవాబు చెప్పాల్సింది అభిశంసనకే’’ అని ప్రొఫెసర్ అలాన్ ‘టైమ్’ మేగజైన్తో పేర్కొన్నారు. ‘‘ట్రంప్ను అభిశంససించడానికి చాలా ఆధారాలు ఉన్నాయి. ఆయన అనుసరిస్తున్న విధానాలు మన రాజ్యాంగ ఆదేశాలు, మన స్వాతంత్య్రాలు, మన స్వేచ్ఛలు, మన జాతీయ భద్రతకు మరింత ప్రమాదకరమైనవి. అమెరికా అధ్యక్షుడిగా తొలిసారి ఎన్నికైన అందరు అధ్యక్షుల్లోకెల్లా ట్రంప్ అభిశంసనకు గురయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి’’ అని అభిప్రాయపడ్డారు. ట్రంప్ అభిశంసనకు మార్గాలివీ..: అలాన్ ‘ద కేస్ ఫర్ ఇంపీచ్మెంట్’ అనే పేరుతో రాసిన తన పుస్తకంలో ట్రంప్ను అభిశంసించడానికి గల ఎనిమిది కారణాలను వివరించారు. దేశాధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలతో ఆయన వ్యాపార ప్రయోజనాల సంఘర్షణ, ట్రంప్ అనుయాయుల బృందానికి రష్యాతో ఉన్న సంబంధాలు, ట్రంప్ యూనివర్సిటీపై ఉన్న కేసుల వంటి గత న్యాయవివాదాలు.. అన్నిటికీ మించి వాతావరణ మార్పు విషయంలో చర్యలు చేపట్టడానికి నిరాకరించడం ద్వారా ‘మానవాళిపై నేరానికి పాల్పడ్డ’ ఆరోపణలతో ట్రంప్ను అభిశంసించవచ్చునని అలాన్ పేర్కొన్నారు. ‘రష్యాతో కుమ్మక్కు’పై అభశంసనకు అవకాశం..: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకునేందుకు వీలుగా ట్రంప్ బృందం రష్యా వారితో కుమ్మక్కయిందన్న అంశమే.. ట్రంప్ అభిశంసనకు ప్రధాన ఆధారం అయ్యే అవకాశం ఉందని తాను భావిస్తున్నట్లు అలాన్చెప్పారు. ‘‘ఈ విషయంలో చాలా పొగ వస్తోంది. ఈ పొగను పుట్టిస్తున్న నిప్పు ఏదో ఉండే ఉంటుందని నా అనుమానం. అది అభిశంసనకు కారణమయ్యేంత తీవ్రంగా ఉంటుందా అనేది మనకు ఇంకా తెలియదు’’ అని వ్యాఖ్యానించారు. ఆధారాలు ఉంటే వారూ అభిశంసిస్తారు..: అమెరికా అధ్యక్షుడి అభిశంసన చాలా కష్టతరమైన ప్రక్రియ. అధ్యక్షుడిని పదవి నుంచి తప్పించడం ఇంకా కష్టమైన పని. ప్రత్యేకించి అధ్యక్షుడి సొంత పార్టీయే కాంగ్రెస్లోనూ మెజారిటీలో ఉంటే మరింత కష్టమవుతుంది. ప్రస్తుతం ట్రంప్ సొంత పార్టీ అయిన రిపబ్లికన్ పార్టీకే కాంగ్రెస్లో మెజారిటీ ఉంది. కానీ.. ట్రంప్కు వ్యతిరేకంగా బలమైన ఆధారాలు బయటపడితే.. ట్రంప్ను అభిశంసించడానికి సరిపోయేంత మంది రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యులు మద్దతు ఇస్తారని అలాన్ విశ్వసిస్తున్నారు. అభిశంసనతో ట్రంప్ను తొలగించాలంటే..: ప్రస్తుత కాంగ్రెస్లోని ప్రతినిధుల సభలో అభిశంసన తీర్మానానికి అనుకూలంగా 193 మంది డెమొక్రాట్లతో పాటు 23 మంది రిపబ్లికన్ సభ్యులు కూడా ఓటు వేయాల్సి ఉంటుంది. అలాగే.. సెనేట్లో 46 మంది డెమొక్రాట్లకు తోడుగా 19 మంది రిపబ్లికన్సభ్యులు, ఇద్దరు స్వతంత్ర సభ్యులు కూడా అభిశంసనకు మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. ట్రంప్ అనుసరించాల్సిన వ్యూహమిదీ..: ట్రంప్ను అభిశంసించే మార్గాలే కాదు.. ఆ ప్రమాదం బారిన పడకుండా ఉండేందుకు ట్రంప్ అనుసరించాల్సిన వ్యూహాన్ని కూడా అలాన్వివరించారు. తన వ్యాపార ప్రయోజనాల నుంచి తప్పుకోవడం, పర్యావరణ మార్పును నిరోధించడానికి చేపట్టే చర్యలకు మద్దతు ఇవ్వడం, వాస్తవాలను తనిఖీ చేసే సంస్థను నియమించుకోవడం, ముఖ్య వ్యూహకర్త స్టీవ్బానన్ను తొలగించడం వంటి చర్యలు ఆ వ్యూహంలో ఉన్నాయి. (సాక్షి నాలెడ్జ్సెంటర్) -
ట్రంప్కు అభిశంసన, ఉద్వాసన తప్పదు!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎక్కువకాలం వైట్హౌస్లో కొనసాగబోరని, త్వరలోనే ఆయనకు అభిశంసన ఎదురుకావొచ్చునని డెమొక్రాట్ పార్టీకి చెందిన ఓ నాయకురాలు జోస్యం చెప్పింది. ’అభిశంసనకు సిద్దంగా ఉండు’ అంటూ కాలిఫోర్నియాకు చెందిన డెమొక్రాట్ నాయకురాలు మాక్జిన్ వాటర్స్ మంగళవారం ట్వీట్ చేసింది. ట్రంప్ గురించి నేరుగా ఆమె తన ట్వీట్లో ఏమీ పేర్కొనకపోయినా.. గతంలోనూ ఆమె పలుసార్లు ట్రంప్ అభిశంసన ప్రతిపాదనను పలుమార్లు తెరపైకి తేవడం గమనార్హం. రష్యాతో, పుతిన్తో ట్రంప్కు సంబంధాలున్నాయన్న ఆరోపణలను ఉటంకిస్తూ ఆమె గతంలో ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ట్రంప్ తాను పాల్పడుతున్న నేరాలకు, తప్పుడు చర్యలకు ఒకరోజు అభిశంసనకు గురికాక తప్పదని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఆమె మరోసారి అభిశంసనకు సిద్దంగా ఉండు అంటూ ట్రంప్ను హెచ్చరించడం గమనార్హం. -
మధ్యలోనే డంప్ చేస్తారా?!
- అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు ఏడాదిన్నరలోనే పదవీ గండం! - అయితే అభిశంసన.. లేదంటే 25వ రాజ్యాంగ సవరణ ప్రయోగం - ట్రంప్ను సాగనంపేందుకు సొంత రిపబ్లికన్ పార్టీలోనే వ్యూహరచన - 2018లో కాంగ్రెస్ ఎన్నికలకు ముందే ట్రంప్కు పదవీచ్యుతి? ‘అధ్యక్షుడిని వదిలించుకోవడం ఎలా?’ ఇప్పుడు అమెరికాలో అత్యధికులు పరిశోధిస్తున్న అంశమిది. అమెరికాలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా కూడా రాజకీయ నిపుణులు ఈ అంశంపై దృష్టి సారిస్తున్నారు. అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు వారాల పాలనతోనే.. అమెరికానే కాదు.. ప్రపంచమంతా గగ్గోలు పెడుతోంది. అధికారంలోకి వచ్చిన రెండు వారాల్లోనే ట్రంప్ ప్రజల్లో మెజారిటీ విశ్వాసం కోల్పోయారని.. దేశంలో మూడో వంతు మందికన్నా ఎక్కువ మందే అధ్యక్షుడిని అభిశంసించాలని కోరుకుంటున్నారని తాజా సర్వేలో వెల్లడైంది. ఈ పరిస్థితుల్లో డొనాల్డ్ ట్రంప్ ఎంతో కాలం అధ్యక్షుడిగా కొనసాగబోరని.. మధ్యలోనే సొంత రిపబ్లికన్ పార్టీయే ఆయనను బలవంతంగా సాగనంపాలని వ్యూహం రచిస్తోందని అంతర్గత విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ట్రంప్ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర లోపే అభిశంసనను ఎదుర్కొనే అవకాశాలు అధికంగా ఉన్నాయని.. లేదంటే 25వ రాజ్యాంగ సవరణను ప్రయోగించడం ద్వారా ట్రంప్ను గద్దె దింపి.. ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ కు అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారని రాజకీయ నిపుణులు జోస్యం చెప్తున్నారు. ఇప్పుడు అమెరికాలో ఇదే హాట్ టాపిక్గా మారింది. అభిశంసన, 25వ సవరణల ప్రయోగంపై విశ్లేషణలు జోరుగా సాగుతున్నాయి. ట్రంప్ను తొలగించగల మార్గాలపై ఆ విశ్లేషణల సారాంశం... అమెరికా అధ్యక్ష అనూహ్యంగా గెలిచిన డొనాల్డ్ ట్రంప్ ‘మా అధ్యక్షుడు కాదు’ అంటూ ఎన్నికల ఫలితాల తర్వాత దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఆయన ప్రమాణ స్వీకారం చేసే సమయంలోనూ దేశ రాజధాని సహా అన్ని ప్రముఖ నగరాల్లోనూ భారీ నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఇప్పుడు ‘ట్రంప్ను అభిశంసించాలి’ అనే ఉద్యమం అమెరికాలో బలపడుతోంది. ఇప్పటికే పలు సంస్థలు ఇందుకోసం సంతకాలు, విరాళాల సేకరణ ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ను అభిశంసించగల అంశాలేవి అన్నది ఆసక్తిగా మారింది. ‘అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను అభిశంసించదగ్గ అంశాలు ఇప్పటికే చాలా ఉన్నాయి. కానీ.. ఆయన తమకు భారమని రిపబ్లికన్లు ఎప్పుడు నిర్ణయించుకుంటారనేదే ప్రశ్న’ అని పలువురు రాజకీయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ట్రంప్ ఎన్నికల ప్రచారం సందర్భంగా వచ్చిన రష్యాతో సంబంధాలు మొదలుకొని.. అధ్యక్షుడిగా జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వుల్లోని అంశాల వరకూ చాలా విషయాల్లో ట్రంప్ను అభిశంసించదగ్గ కోణాలు ఉన్నాయని వారు చెప్తున్నారు. - కోర్టులతో ట్రంప్ పోరాటం కూడా అభిశంసన దిశగా దారితీయవచ్చు. అమెరికాలోకి శరణార్థులు, ఏడు దేశాల నుంచి వలసలను నిషేధిస్తూ ట్రంప్ ఇచ్చిన ఆదేశాలను కొట్టివేసిన న్యాయమూర్తి జేమ్స్ రాబర్ట్ ఉత్తర్వును సమర్థిస్తూ 9వ సర్క్యూట్ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు వేగంగా సమీక్షించవచ్చు. ట్రంప్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టినట్లయితే.. కోర్టును ధిక్కరించడానికి ఆయన ప్రయత్నిస్తారా? అలా చేయడం.. అభిశంసించగల మొదటి తరగతి నేరమవుతుంది. - ఇక రెండో రకం అభిసంసించగల నేరం.. ట్రంప్ వ్యక్తిగత ప్రయోజనాలు, అధ్యక్షుడిగా అధికారిక విధులు రాజీపడటం. ట్రంప్కు రష్యాలో విస్తృత వాణిజ్య ప్రయోజనాలు ఉన్న నేపథ్యంలో.. ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ఆయన ‘సత్సంబంధాలు’ ఈ కోవలోకి రావచ్చు. అలాగే.. పలు ముస్లిం దేశాల నుంచి వలసలను నిషేధిస్తూ ట్రంప్ ఇచ్చిన కార్యనిర్వాహక ఉత్తర్వులో పేర్కొన్న దేశాల విషయంలో ద్వంద్వ ప్రమాణాలు కూడా ఇందులోకి వస్తాయి. ట్రంప్ తనకు వ్యాపార ప్రయోజనాలు ఉన్న ముస్లిం దేశాలను ఈ ఉత్వర్వు నుంచి మినహాయించారు. అయితే.. ఆ దేశాల నుంచే ఉగ్రవాదులు వస్తుండటం గమనార్హం. ట్రంప్ ఉత్తర్వులో నిషేధించిన దేశాల నుంచి ఉగ్రవాదులు ఎవరూ రాలేదు. ఆ దేశాల్లో ట్రంప్ పెట్టుబడులూ లేవు. - మరోవైపు.. రష్యా అధ్యక్షుడితో ట్రంప్ విచిత్ర సన్నిహిత సంబంధాలపై సీఐఏ దర్యాప్తు కొనసాగుతోంది. పుతిన్కి అనుకూలంగా ప్రవర్తించడాన్ని ట్రంప్ కొనసాగిస్తే అభిశంసన ఇంకా ముందుకు జరగొచ్చు. గత ఆదివారం ట్రంప్ ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. పుతిన్ మీద మాట పడకుండా సమర్థించుకొచ్చారు. ‘పుతిన్ ఒక హంతకుడు’ అని టీవీ వ్యాఖ్యాత అభివర్ణిస్తే.. ‘మనకు చాలా మంది హంతకులు ఉన్నారు. మన దేశం చాలా అమాయకమైనదని మీరు అనుకుంటున్నారా?’ అని ట్రంప్ ఎదురు ప్రశ్నించారు. ఇలా దేశాధ్యక్షుడే తన దేశమైన అమెరికాను కించపరచడం చరిత్రలో ఎన్నడూ జరగలేదని వాల్ స్ట్రీట్ జర్నల్ సంపాదకుడు బ్రెట్ స్టీఫెన్స్ వ్యాఖ్యానించారు. మరికొందరు రిపబ్లికన్ సెనేటర్లు కూడా ట్రంప్ తీరును తప్పుబట్టారు. ఆ పనులయ్యాక వారే దింపేస్తారు! ట్రంప్ను అభిశంసించడానికి ప్రతిపక్ష డెమొక్రటిక్ పార్టీ కూడా తన వ్యూహానికి పదును పెడుతోంది. అయితే.. ప్రస్తుత కాంగ్రెస్లో బలాబలాలను బట్టి అధికార రిపబ్లికన్ పార్టీ సాయం లేకుండా ఇప్పట్లో ట్రంప్ అభిశంసన సాధ్యంకాదు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్లో తమ బలం పెరిగితే ఆ పార్టీ స్వయంగా అభిశంసన చేపట్టవచ్చు. మరోవైపు రిపబ్లికన్ పార్టీలో కూడా ట్రంప్ మీద ప్రేమ లేదు. నిజానికి ఆ పార్టీ అధినాయకత్వం మొదటి నుంచీ ట్రంప్ను వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 2018 ఎన్నికల సమయానికి ఆ పార్టీ స్వయంగా ట్రంప్ను సాగనంపాలని యోచిస్తున్నట్లు చెప్తున్నారు. ‘‘రిపబ్లికన్లు కొంత కాలం ట్రంప్ను సహిస్తారు. గ్యాస్, చమురు, వాల్ స్ట్రీట్లపై నియంత్రణల తొలగింపు, పన్నుల కోతలు, పాఠశాలల ప్రైవేటీకరణ, కార్మిక రక్షణ కుదింపు, సుప్రీంకోర్టులో కనీసం ఒక మితవాద న్యాయమూర్తి నియామకం వంటి పనులను పూర్తిచేసే వరకూ ట్రంప్ను భరిస్తారు. కొంత కాలానికి ట్రంప్ ఒక వైపరీత్యమని, పార్టీకి ప్రమాదకరమని, 2018 ఎన్నికలకు నష్టదాయకుడని రిపబ్లికన్ పార్టీ నాయకత్వం నిర్ధారణకు వస్తుంది. దీంతో ఆయనను వదిలించుకుని, ఉపాధ్యక్షుడు పెన్స్ ను అధ్యక్షుడిగా చేయాలని నిర్ణయిస్తారు. ఈ వ్యూహాన్ని రిపబ్లికన్ పార్టీలోని ఉన్నతస్థాయి వర్గాలు ఇప్పటికే చర్చిస్తున్నారు. రిపబ్లికన్లు సుదీర్ఘ ప్రక్రియ అయిన అభిశంసన ద్వారా ఈ పని చేయవచ్చు. ఇలాంటి చర్యలతో దెబ్బతిన్న ట్రంప్ మరింత క్రోధంతో ఇంకా ప్రతీకార చర్యలు చేపట్టవచ్చు. లేదంటే.. 25వ రాజ్యాంగ సవరణను అనుసరించి ట్రంప్ను అసమర్థుడిగా నిర్ధారించి మరింత వేగంగా తప్పించవచ్చు. తద్వారా ఒక అనిశ్చితుడైన, నిరంకుశుడు కాగల అధ్యక్షుడి నుంచి అమెరికాకు విముక్తి కలిగించిన ఖ్యాతి కూడా రిపబ్లికన్ పార్టీకి లభిస్తుందన్నది వారి ఆలోచన. 2018 ఎన్నికల నాటికి పెన్స్ నేతృత్వంలో వీరంతా మళ్లీ ఏకం కావచ్చు’’ అని బ్రాండీస్ యూనివర్సిటీలోని హెల్లెర్ స్కూల్ ప్రొఫెసర్, అమెరికన్ ప్రాస్పెక్ట్ పత్రిక సహ సంపాదకులు రాబర్ట్ కట్నర్ తాజాగా రాసిన ఒక వ్యాసంలో విశ్లేషించారు. కాంగ్రెస్లో అభిశంసన ఇలా... అమెరికా రాజ్యాంగంలో రెండో అధికరణలోని సెక్షన్ 4లో అధ్యక్షుడి అభిశంసన గురించి చెప్తుంది. దేశద్రోహం, లంచం తీసుకోవడం, అధికార దుర్వినియోగం, బెదిరింపులు, నిధుల దుర్వినియోగం, పర్యవేక్షణలో వైఫల్యం, విధులు నిర్వర్తించకపోవడం, తప్పుడు నడవడిక తదితర నేరాలకు పాల్పడినపుడు అభిశంసన ద్వారా అధ్యక్షుడిని పదవీచ్యుతిడిని చేయవచ్చు. కాంగ్రెస్లో ప్రతినిధుల సభ సాధారణ మెజారిటీతో అధ్యక్షుడిపై నేరాభియోగం మోపి అభిశంసించడానికి ఓటు వేయాలి. ఆ తర్వాత సెనేట్ విచారణ చేపట్టి అధ్యక్షుడి మూడింట రెండు వంతుల మెజారిటీతో అభిశంసనను ధృవీకరించాలి. నిజానికి కాంగ్రెస్లో అభిశంసన ప్రక్రియను ప్రారంభించడానికి.. దేశద్రోహం, హత్య వంటి నేరాలకు ఆధారాలు అవసరం లేదు. ఆచరణలో ఏ అంశాన్నైనా ఇతర నేరాలుగా పరిగణించవచ్చు. ఇంతకుముందు మోనికా లూయిన్స్కీ కేసులో బిల్ క్లింటన్ను, గతంలో వాటర్గేట్ కుంభకోణంలో రిచర్డ్ నిక్సన్పైన అభిశంసన చేపట్టారు. 25వ సవరణ ప్రయోగం ఇలా... అధ్యక్షుడు మరణించినపుడు, లేదా ఇతరత్రా కారణాల వల్ల అధికారాలు, విధులు నిర్వర్తించలేనపుడు ఉపాధ్యక్షుడు అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తారని వివరించే నిబంధనను.. అమెరికా రాజ్యాంగంలోని 25వ సవరణ వివరిస్తుంది. ఇందులోని నాలుగో సెక్షన్ ప్రకారం.. ‘అధ్యక్షుడు తన అధికారాలు, విధులు నిర్వర్తించలేకపోతున్నారు’ అని ఉపాధ్యక్షుడు, మెజారిటీ మంత్రులు రాతపూర్వకంగా కాంగ్రెస్ ఉభయసభల సభాపతులకు తెలియజేయాలి. అలా జరిగినపుడు ఉపాధ్యక్షుడు తక్షణం క్రియాశీల అధ్యక్షుడిగా అధికారాలు, బాధ్యతలు చేపడతారు. ఈ 25వ రాజ్యాంగ సవరణను కొద్ది మార్లే వినియోగించారు. జాన్ ఎఫ్. కెన్నడీ హత్యానంతరం ఒకసారి, రొనాల్డ్ రీగన్కు క్యాన్సర్ సర్జరీ చేసినపుడు మరోసారి, జార్జ్ డబ్ల్యు. బుష్ కొలనోస్కోపీలు చేయించుకున్నపుడు ఇంకోసారి ఉపాధ్యక్షుడు క్రియాశీల అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించేలా ఈ అధికరణను అమలుచేశారు. -(సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
'అభిశంసనతో ట్రంప్ గద్దె దిగుతారు'
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డోనాల్డ్ ట్రంప్ దోషారోపణతో గద్దె దిగుతారని వాషింగ్టన్ కు చెందిన ప్రొఫెసర్ అల్లాన్ లిట్చ్ మాన్ చెప్పారు. ఇదే ప్రొఫెసర్ ట్రంపే అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధిస్తారని చెప్పడం కూడా గమనార్హం. రిపబ్లికన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ట్రంప్ ను తప్పించి మైక్ పెన్స్ ను ఆ స్ధానంలో నిలబెడుతుందని పేర్కొన్నారు. ట్రంప్ అధ్యక్షపదవిని చేపట్టడం రిపబ్లికన్లకు ఇష్టం లేదని చెప్పారు. ట్రంప్ ను అదుపు చేయడం వారి వల్ల కాదని, ఆయనేప్పుడు ఎలా ప్రవర్తిస్తారో రిపబ్లికన్లు ఊహించలేకపోతున్నారని తెలిపారు. దీంతో మైక్ పెన్స్ ను అధ్యక్ష స్ధానంలో నిలబెట్టాలనే ఆలోచన వారిలో ఉందని చెప్పారు. పెన్స్ కు రిపబ్లికన్లలో మంచి పేరుంది. అధ్యక్ష పదవి చేపట్టిన ఏడాది కాలంలోపే దేశ శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా ప్రవర్తించి ట్రంప్ గద్దె దిగే అవకాశం ఉందని తెలిపారు. ట్రంప్ దోషారోపణతో గానీ లేదా రాజీనామా చేసి గానీ అధ్యక్షపదవి నుంచి వైదొలుగుతారని న్యూయార్క్ టైమ్స్ కు చెందిన డేవిడ్ బ్రూక్స్ కూడా పేర్కొన్నారు. లిట్చ్ మాన్ 1984 నుంచి ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఎన్నికయ్యే వారి పేర్లను కచ్చితంగా చెబుతూ వస్తున్నారు. అయితే 2000లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో లిట్చ్ మాన్ ఊహించినట్లు జరగలేదు. -
'అవినీతి అధ్యక్షురాలు మాకొద్దు'
సావ్ పౌలో(బ్రెజిల్): లాటిన్ అమెరికాలోనే అతిపెద్ద దేశంలో ఆందోళన మొదలైంది. ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా వేలమంది బ్రెజిలియన్లు వీధుల్లోకి వచ్చారు. అవినీతికంపులో కూరుకుపోయిన అధ్యక్షురాలు తమకు వద్దంటూ బ్రెజిల్ అధ్యక్షురాలు దిల్మా రుసెఫ్కు వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించారు. వెంటనే సభాసమావేశాలు నిర్వహించి ఆమెను వెంటనే తొలగించే కార్యక్రమాలు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. బ్రెజిల్లోనే అత్యధిక జనాబా ఉండే సావ్ పౌలో నగరంలో ఈ ఆందోళన ప్రారంభమైంది. ఆందోళనలకు నాయకత్వం వహిస్తున్న రోగరియో చెకర్ అనే వ్యక్తి మాట్లాడుతూ 'ఇప్పుడు మేం మా దేశంలో నిర్ణయం తీసుకునే పరిస్థితిలో ఉన్నాం. మార్పు తెచ్చుకునేందుకు ముందుకు వెళుతున్నాం. అధ్యక్షురాలు దిల్మా రుసెఫ్ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయారు. ఆమెపై వ్యతిరేకత నానాటికి పెరిగిపోయింది. వెంటనే ఆమె పదవి నుంచి దిగిపోవాలి' అని అతడు డిమాండ్ చేశాడు.