Injections
-
Pregnancy: సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా?
నాకు ప్రెగ్నెన్సీ కన్ఫమ్ అయింది. రెండు నెలలు. కొంచెం బ్లీడింగ్ అవుతోంది. హార్మోన్స్ ఇంజెక్షన్స్ ఏమైనా వాడాలా? వాటికి సైడ్ఎఫెక్ట్స్ ఉంటాయా? – పి. హారిక, గన్నవరంప్రెగ్నెన్సీ మొదటి మూడు నెలల్లో బ్లీడింగ్ అనేది సర్వసాధారణం. అయితే బ్లీడింగ్ అవటంతోటే గర్భస్రావం అవుతుందేమోననే భయం ఉంటుంది చాలామందిలో. ప్రతి ముప్పైమందిలో ఒకరికి మాత్రమే గర్భస్రావమయ్యే ప్రమాదం ఉంటుంది. అంతేకానీ ప్రతి గర్భిణికీ అలాగే అవుతుందేమోనని హైడోస్ హార్మోన్స్, సపోర్ట్ మెడిసిన్స్ ఇవ్వటం సరికాదు. కేస్ను బట్టే నిర్ణయించాలి. ప్రెగ్నెన్సీలో ప్రొజెస్టిరాన్ హార్మోన్ చాలా కీలకం. ఇది గర్భసంచి పొర పెరగటానికి తోడ్పడి, గర్భస్రావం కాకుండా ఉండటానికి సాయపడుతుంది. అయితే వజైనల్ బ్లీడింగ్ అవుతున్నవారికి ఈ హార్మోన్ సప్లిమెంటేషన్ వల్ల ఉపయోగం ఉంటుందని కొన్ని అధ్యయనాల్లో రుజువైంది. అలాగని అందరికీ ఇవ్వడం కరెక్ట్ కాదు. ఈ హార్మోన్.. టాబ్లెట్స్, పెసరీస్, ఇంజెక్షన్స్ రూపంలో అందుబాటులో ఉంటుంది. దీన్ని రోజుకి రెండుసార్లు, నాలుగవ నెల అంటే 16 వారాల వరకు ఇస్తే సరిపోతుంది. కొన్ని సైడ్ఎఫెక్ట్స్ ఉంటాయి. వాటిని నివారించడానికి భోజనం చేసిన వెంటనే వేసుకోవాలి. పొట్టలో నొప్పి, వాంతులు, బ్రెస్ట్ పెయిన్, నీరసం, మలబద్ధకం లాంటివి ఉండవచ్చు. ఎక్కువ ఇబ్బంది ఉన్న వారికి వజైనల్ లేదా రెక్టల్ రూట్లో యూజ్ చెయ్యమని సూచిస్తారు.నాకిప్పుడు మూడోనెల. తొలి చూలు. ఎలాంటి సమస్యలు రావద్దనుకుంటున్నాను. ఎమోషనల్గా బేబీకి దగ్గరవటానికి, ప్రెగ్నెన్సీ నుంచే కొన్ని చెయ్యాలంటుంటారు. అవేంటో సజెస్ట్ చేయగలరా? – సి. సత్య, కదిరితొలిసారి తల్లి కాబోతున్నప్పుడు చాలా సందేహాలు, ఇంకెన్నో భయాలుంటాయి. ఆన్లైన్ సౌకర్యం అందుబాటులోకి రావడంతో కొంత అవగాహన పెరిగింది. అయితే భయాలు కూడా పెరిగాయి. గర్భస్థ శిశువుకు భావోద్వేగాలు, చొరవ తీసుకునే సామర్థ్యాలు, తల్లిదండ్రుల ప్రేమ వంటివి అర్థమవుతాయని పరిశోధనల్లో రుజువైంది. హెల్దీ అటాచ్మెంట్ ఉంటే బయటి వాతావరణం సురక్షితంగా, భద్రంగా ఉందని గర్భస్థ శిశువు భావిస్తుంది. అయిదవ నెల నుంచి గర్భస్థ శిశువు శబ్దాలను వినే చాన్స్ ఉంది. అందుకే పొట్టలో బిడ్డతో తల్లి కమ్యూనికేట్ చేయొచ్చు. ఇది పుట్టిన తరువాత బిడ్డ మీ వాయిస్ని గుర్తుపట్టేందుకు సాయపడుతుంది. పాజిటివ్ థింకింగ్ అండ్ థాట్స్ ఉంటే లోపల బిడ్డ గ్రోత్ బాగుంటుంది. పొట్టలో బిడ్డ గురించి ఆలోచించటం, మాట్లాడటం 5వ నెల నుంచి మొదలు పెట్టవచ్చు. దీని వలన మంచి బాండింగ్ డెవలప్ అవుతుంది. 5 నుంచి 6వ నెల మధ్య బిడ్డ కదలికలు తెలుస్తుంటాయి. వాటిని జాగ్రత్తగా గమనిస్తూండాలి. ఈ కదలికల తీరు అందరికీ ఒకేలా ఉండదు. ఒక వారం గమనిస్తే ఎప్పుడు, ఎలా కదులుతోందనేది తెలుస్తుంది. అకస్మాత్తుగా కదలికలు నెమ్మదిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. మంచి బుక్స్ చదవటం, హెల్దీ డైట్ తీసుకోవటం చాలా అవసరం.నాకు ఏడాది కిందట అబార్షన్ అయింది. ఇప్పుడు మళ్లీ ప్రెగ్నెంట్ని. మూడోనెల. రొటీన్ బ్లడ్ టెస్ట్లో హెపటైటిస్ – బి పాజిటివ్ అని చెప్పారు డాక్టర్. దీని వలన నాకు, నావల్ల బేబీకి ఎలాంటి రిస్క్ ఉండొచ్చు?– రుక్మిణి, మహబూబ్నగర్హెపటైటిస్ – బి అనేది ఒక వైరల్ ఇన్ఫెక్షన్. ఇది చాలామందిలో ఏ సింప్టమ్స్ లేకుండా సైలెంట్గా ఉండొచ్చు. ప్రెగ్నెన్సీలో అందరికీ రొటీన్గా కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ని చెక్ చెస్తారు. ప్రెగ్నెన్సీ ప్లానింగ్కి ముందు వచ్చిన వారికి ముందే చెక్ చేసి, అవసరమైన వాళ్లకి ప్రివెంటివ్ వాక్సినేషన్ ఇస్తారు. ఈ వైరస్ ఇన్ఫెక్షన్లో ముఖ్యంగా లివర్కి వాపు ఉంటుంది. ఇది చాలావరకు కలుషిత ఇంజెక్షన్స్, రక్తం, వీర్యం, ఉమ్మి ద్వారా వ్యాపిస్తుంది. ఒకసారి మీ భర్త కూడా హెపటైటిస్–బి టెస్ట్ చేయించుకోవాలి. ఈ పరిస్థితుల్లో హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేర్ చూసే డాక్టర్ని సంప్రదించాలి. డెలివరీ తరువాత బేబీకి కూడా స్పెషలిస్ట్ కేర్, వాక్సినేషన్స్ అవసరం. ప్రెగ్నెన్సీలో మీకు లివర్ సమస్య ఎక్కువవకుండా కొన్ని మందులను సూచిస్తారు. వైరల్ లోడ్ తగ్గిందా లేదా అని తరచు బ్లడ్ టెస్ట్స్ చెయ్యవలసి ఉంటుంది. లివర్ స్కాన్ చెయ్యాలి. ఈ వైరల్ ఇన్ఫెక్షన్ ఉన్నా నార్మల్ డెలివరీ అవచ్చు. బ్రెస్ట్ ఫీడింగ్ కూడా చెయ్యవచ్చు. బేబీకి హెపటైటిస్–బి రాకుండా ప్రాపర్ టెస్ట్స్, వాక్సిన్స్ చేయించాలి. పుట్టిన వెంటనే నాలుగు వారాలకు, ఏడాదికి వాక్సిన్స్ ఇవ్వాలి. మీకు వైరల్ లోడ్ ఎక్కువుంటే, బేబీకి ఎక్స్ట్రా ఇంజెక్షన్స్ ఇవ్వాలి. అందరికీ ఇచ్చే రొటీన్ వాక్సిన్స్ కూడా ఇవ్వాలి. బేబీకి ఏడాది వయసు వచ్చే వరకు క్లోజ్గా ఫాలో అప్ చెయ్యాలి. డా‘‘ భావన కాసుగైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్హైదరాబాద్ -
చిన్న పాప.. పెద్ద జబ్బు... నయం కావాలంటే రూ. 16 కోట్లు కావాలి
మైసూరు: చిత్రంలో కనిపించే చిన్నారికి పెద్ద జబ్బే సోకింది. ఆ జబ్బు నయం కావాలంటే రూ. 16 కోట్లు ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో కన్నవారు హడలిపోయారు. తమ బిడ్డను కాపాడేందుకు దాతలు సహాయం చేయాలని వేడుకుంటున్నారు. వివరాలు.. మైసూరులో దేవరాజు మొహల్లాలో నివసించే హెచ్.నాగశ్రీ, ఎన్.కిశోర్ దంపతులకు 22 నెలల కీర్తన అనే కూతురు ఉంది. కానీ చిన్నారికి స్పైనల్ మస్కులర్ అట్రోఫీ (ఎస్ఎంఏ) అనే అరుదైన జబ్బు సోకిందని ఆదివారం విలేకరుల సమావేశంలో తెలిపారు. దీనివల్ల పాప ఎప్పుడూ నీరసంగా ఉంటుంది, కండరాలు బలహీనంగా ఉంటాయి, కనీసం ఆహారం నమలడం కూడా చేత కాదు. ఇక ఆడుకోవడం అనేదే ఉండదు. ఈ జబ్బు రెండవ దశలోకి వచ్చిందని, పాప మరింత బలహీనమైందని వాపోయారు. జన్యు చికిత్స, అరుదైన ఇంజెక్షన్లతో వైద్యం చేయిస్తే నయమవుతుందని వైద్యులు తెలిపారు, కానీ అందుకు రూ. 16 కోట్లు ఖర్చు అవుతుందని తెలిపారు. నిత్యం ఒక టానిక్ తాగాల్సి ఉంటుంది, ఒక్క బాటిల్ ధర రూ. 6 లక్షలని చెప్పారు. పేదవాళ్లయిన తమకు అంత స్తోమత లేదని, దాతలే ఆదుకోవాలని అభ్యర్థించారు. వివరాలకు చిన్నారి తండ్రి కిశోర్ని 9901262206 నంబర్లో సంప్రదించాలని కోరారు. -
కండల కోసం కంగారు పడితే.. గుండెకు ముప్పు, ప్రాణాలే పోతాయ్!
మనసులో అనుకోగానే బరువు తగ్గిపోవాలి. చిటికె వేయగానే కండలు తిరిగిన బాడీ సొంతం కావాలి. ప్రతీదీ షార్ట్ కట్లో అయి పోవాలి. ప్రస్తుతం యువత మనుసుల్లోమెదులుతున్న ట్రెండ్ ఇదే. ఈ క్రేజ్నే కొంతమంది కేడీగాళ్లు సొంతం చేసుకుంటున్నారు. అక్రమాలకు పాల్పడుతూ యువత ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు. వారి ప్రాణాలమీదికి తీసుకొస్తున్నారు. దీనికి సంబంధించి షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా అక్రమంగా మెఫాటర్మైన్ సల్ఫేట్ ఇంజక్షన్లు విక్రయిస్తున్న గ్యాంగ్ను టాస్క్ఫోర్క్ అదుపులోకి తీసుకుంది. ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి, నిందితుల నుండి 75 ఇంజక్షన్లను సీజ్ చేశామని టాస్క్ ఫోర్స్ డీసీపీ రేష్మి పెరుమాళ్ ప్రకటించారు. కండరాల పెరుగుదలకు ఇంజక్షన్లు దోహదపడతాయని నమ్మబలుకుతారు. వాటిని అక్రమంగా విక్రయిస్తున్నారు. దీన్ని నమ్మిన బాడీ బిల్డర్లు డాక్టర్ట సిఫారసు, ప్రికాషన్స్ లేకుండానే ఈ ఇంజక్షన్లను ఎడా పెడా వాడేస్తున్నారు. దీంతో కండలు పెరగడం సంగతి మాట అటుంచి గుండెకు తీరని ముప్పని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి నకిలి ఇంజెక్షన్లను అమ్ముతున్నగ్యాంగ్కు సంబంధించి ప్రధాన నిందితుడు నితేష్ సింగ్ ఆసిఫ్ నగర్లో పల్స్ ఫిట్నెస్ పేరిట జిమ్ నడిపిస్తున్నాడు. ఇతనికి సయ్యద్ జాఫర్ అలీ, రాహుల్ సింగ్ రిసెప్షనిస్ట్ లుగా వర్క్ చేస్తున్నారు డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండానే ఇంజక్షన్లను అక్రమంగా విక్రయించడమే వీరి దందా. ఈ ఇంజక్షన్లు తీసుకుంటే షార్ట్ టైంలో కండరాలు పెరుగుతాయని జిమ్కు వచ్చేవారిని నమ్మిస్తారు. ముంబై నుండి ఈ ఇంజక్షన్లను కొరియర్ ద్వారా నగరానికి తెప్పిస్తారు. బహిరంగ మార్కెట్లో 500 పలికే ఇంజక్షన్లను అక్రమంగా 2000 వరకు విక్రయిస్తారు. ఇంజక్షన్స్ అతిగా తీసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలు, స్ట్రోకులు, సడన్ కార్డియాక్ అరెస్ట్ దారి తీయవచ్చుని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
'16 ఏళ్లకే హార్మోన్ ఇంజెక్షన్స్.. నా గుండె పగిలిందన్న స్టార్ హీరోయిన్'
టాలీవుడ్లో దేశముదురు మూవీతో ఫేమ్ తెచ్చుకున్న హీరోయిన్ హన్సిక మోత్వానీ. ఆ తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. గతేడాది వివాహాబంధంలోకి అడుగుపెట్టిన ఇటీవలే 'మై నేమ్ ఈజ్ శృతి' అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. శ్రీనివాస్ ఓంకార్ దర్శకత్వంలో బురుగు రమ్య ప్రభాకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. స్కిన్ మాఫియా కాన్సెప్ట్తో తీసిన ఈ మూవీ నవంబర్ 17న థియేటర్లలో రిలీజై మంచి విజయాన్ని అందుకుంది. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషా చిత్రాల్లో నటించింది. దాదాపు స్టార్ హీరోలందరితో సినిమాలు చేసిన హన్సిక ఇటీవలే తన మొదటి వివాహా వార్షికోత్సవాన్ని జరుపుకుంది. తన భర్త సోహెల్ కతురియాలో వేడుకలను సెలబ్రేట్ చేసుకుంది. అయితే హన్సిక సినీ కెరీర్ కంటే ఎక్కువగా వ్యక్తిగతంగానే ఎక్కువగా వార్తల్లో నిలిచింది. అయితే గతంలో హన్సిక 16 ఏళ్ల వయసులోనే హార్మోన్ల ఇంజెక్షన్లు తీసుకుందని పెద్దఎత్తున వార్తలొచ్చాయి. ఈ వివాదంలో ఇప్పటి వరకు ఏదో ఓ సందర్భంలో చర్చ జరుగుతూనే ఉంది. హన్సిక తల్లి మోనా మోత్వానీ వృత్తిరీత్యా స్కిన్ స్పెషలిస్ట్ కావడంతో హన్సిక మరింత యంగ్గా కనిపించేందుకు ఆమెకు హార్మోన్ల ఇంజెక్షన్లు ఇచ్చిందని రూమర్స్ వచ్చాయి. అయితే ఈ విషయంపై హన్సిక చాలాసార్లు వివరణ ఇచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన హన్సిక మరోసారి ఈ వివాదంపై నోరు విప్పింది. అయితే హన్సికకు హార్మోన్ల ఇంజెక్షన్లు ఇచ్చానన్న వార్తలను ఆమె తల్లి మోనా మోత్వానీ కొట్టిపారేశారు. హన్సిక మాట్లాడుతూ.. 'ఇలాంటి వార్తలు మా అమ్మను బాధపెట్టినంతగా నన్ను బాధించలేదు. ఎందుకంటే ఈ వార్తలు పూర్తిగా తప్పు ప్రచారమే. నాపై వచ్చినవన్నీ రూమర్స్. దానికి మా అమ్మ చాలా బాధపడింది. అమ్మ పరిస్థితిని చూసి మేమే ఏడ్చాం. ఇలాంటివి వార్తలు మా కుటుంబ సభ్యులు ఎప్పుడు వినలేదు. ఇలాంటి పుకార్లు నా హృదయాన్ని విచ్ఛిన్నం చేశాయి. సోషల్ మీడియాలో ఎవరికైనా ఏదైనా చెప్పే స్వేచ్ఛ ఉంది. కానీ ఒకరి వ్యక్తిగత జీవితం ఎలా పడితే అలా రాయమని చెప్పలేదు కదా.' అని అన్నారు. కాగా.. డిసెంబర్ 2, 2022న ప్రియుడు సోహైల్ కతురియాను హన్సిక వివాహం చేసుకుంది. జైపూర్లోని జరిగిన వీరి పెళ్లికి కుటుంబసభ్యులు, సన్నిహితులు హాజరయ్యారు. -
ఆపరేషన్ బ్యూటీ! అందం కోసం తీసుకునే ఇంజక్షన్లు మంచివేనా!
పెళ్లి సంబంధం కుదరగానే వారి వారి స్థోమత మేరకు పెళ్లి ఎంత గ్రాండ్గా చేయాలనే ఆలోచన చేస్తుంటారు పెద్దవాళ్లు. పెళ్లిలో కాబోయే అత్తగారి డిమాండ్ మేరకు వధువు అమ్మానాన్నలు నడుచుకుంటూ ఉంటారు. ఇందులో భాగంగా ఇటీవల మరో కొత్త డిమాండ్ కూడా వచ్చి చేరింది.కాబోయే పెళ్లికూతురు వివాహ వేడుకలో దేదీప్యమానంగా వెలిగిపోవాలి. అందరూ ‘అందమైన కోడలిని సెలెక్ట్ చేసుకున్నారు అనే కితాబులు అందుకోవాలి. అందుకు, చికిత్స చేయించుకున్నా సరే!’ అంటున్నారు. మరి, కాబోయే వధువులు వేడుకకు సిద్ధం కావడానికి ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలో అందం పట్ల తీసుకుంటున్న చికిత్సలు.. వికటిస్తున్న పరిమాణాలు ఏమిటి? భేష్ అనదగిన విధానాలేమిటి? అనే విషయాలపై తప్పనిసరిగా దృష్టి పెట్టాలి. ‘‘ఓ మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తున్న సుష్మ పెళ్లి వచ్చే డిసెంబర్లో జరగనుంది. పెళ్లి ఫిక్స్ అయ్యాక అత్తగారు నవ్వుతూ – ‘అమ్మాయీ, నీ వంటి రంగు బ్రైట్ చేయించుకో. ఫెయిర్ నెస్ కోసం ఇంజెక్షన్లు మార్కెట్లో దొరుకుతాయని విన్నాను. వాటిని ట్రై చేయి. ఏ ట్రీట్మెంట్ అయినా తీసుకో. కానీ, పెళ్లి టైమ్కి అందంగా తయారవ్వాలి’ అని ఆర్డర్ వేసింది. ఆమె తన కోడలు పందిట్లో చందమామలా కనిపించాలని, కోడలు మొహం చూసి బంధుమిత్రులంతా నిశ్చేష్టులవ్వాలని కోరుకుంటుంది. ‘అత్తగారి డిమాండ్ ఇప్పుడు నాకు ఆందోళన కలిగిస్తోంది’ అంటోంది సుష్మ. ఇందుకోసం బ్యూటీ ట్రీట్మెంట్స్తో పాటు చర్మ ఛాయలో కూడా తేడా వచ్చేలా మార్పులు చేసుకోవడానికి తెగ కష్టపడుతోంది. ‘పెళ్లి అంటేనే ఎంతో ఉత్సాహం. ఫొటోల్లో, వీడియోల్లో బాగా కనిపించాలని, అందరిలో ప్రత్యేకంగా వెలిగిపోవాలని నాకూ ఉంటుంది. ఇందుకు బ్యూటీ పార్లర్స్కి వెళ్లడం, మేకప్ చేయించుకోవడం సాధారణంగా జరుగుతుంటుంది. కానీ, ఇప్పుడు ప్రత్యేకంగా ట్రీట్మెంట్స్ కూడా చేయించుకోవాల్సి వస్తోంది. పెళ్లి ఖర్చులే కాకుండా ఈ కొత్త తరహా ఖరీదైన ఖర్చు తలనొప్పిగా మారింది అంటున్నారు అమ్మనాన్నలు’ అని బాధపడుతోంది సుష్మ. కాబోయే అత్తగారు కోరడంతో రూప (పేరు మార్చడమైంది) తన కంటి కింది భాగం లోతుగా ఉండటం వల్ల ‘అండర్ ఐ ఫిల్లర్’ ఇంజక్షన్ చేయించుకుంది. దీంతో కంటి కింది భాగంలో రక్తం గడ్డకట్టి, వాపు వచ్చి, బయటకు రాలేని పరిస్థితి. త్వరలో పెళ్లి. ఆ క్లాట్ అంత తొందరగా తగ్గదు. దిక్కుతోచని పరిస్థితి. శిల్ప అందం కోసం బొటాక్స్ ట్రీట్మెంట్ చేయించుకుంది. డోస్ ఎక్కువ మోతాదులో ఇవ్వడం వల్ల ముఖంలో ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడానికి వీలు లేకుండా మారిపోయింది. అందం పెంచుకునే విషయంలో ఒకరో ఇద్దరు కాదు అమ్మాయిలు ఎప్పుడూ తమ ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఇక పెళ్లి అంటే చెప్పనక్కర్లేదు. ప్రీ వెడ్డింగ్ షూట్ నుంచి ప్రతి సంబరాన్నీ పదిలపరుచుకోవడానికి ఎన్నో పాట్లు పడతారు. దీంట్లో భాగంగా బ్యూటీ కాన్షియస్ అమ్మాయిల్లోనూ, అబ్బాయిల్లోనూ పెరిగింది. ఈ విషయంలో ఎలాంటి చికిత్స, జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవడం మంచిది అంటున్నారు డెర్మటాలజిస్ట్ డాక్టర్ స్వప్న ప్రియ. వాటిలో... ఇంట్లో ప్రయోగాలు.. చాలా మంది అందానికి ఇంటి చిట్కాలు పాటిస్తుంటారు. సహజంగా లభించే వాటితో బ్యూటీప్యాక్లు వేసుకుంటూ ఉంటారు. వాటి ద్వారా ఎంత సమయంలో ఎంత ప్రయోజనం ఉంటుందో కూడా చూడాలి. ఎందుకంటే, కొంతమందికి స్కార్స్, పింపుల్స్, యాక్నె, డల్ స్కిన్, కలర్ ఛేంజ్, చుండ్రు... ఇలా చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. వాటికి చికిత్సనే సరైన మార్గం. ఆహారానికి సంబంధించినవి తప్పనిసరిగా పెళ్లికి రెండు నుంచి మూడు నెలల ముందు మార్పులు చేసుకోవాలి. సహజంగా చర్మంలో మార్పులు రావాలంటే పోషకాహారం మంచి ఎంపిక. అప్పుడే మంచి ఫలితం ఉంటుంది. బ్యూటీ స్పాలో చికిత్స మంచిదేనా? స్కిన్ టైటనింగ్, రింకిల్స్, స్కిన్ హైడ్రేషన్.. వంటి ట్రీట్మెంట్స్ బ్యూటీ స్పాలలో చేయించుకుంటారు. దీనికి కూడా ముందు సరైన కౌన్సెలింగ్ అవసరం. ఒక్కో వ్యక్తి చర్మ తత్త్వం ఒక్కో విధంగా ఉంటుంది. ఈ విధానంలో చర్మం రికవరీ అవడానికి కూడా సమయం పడుతుంది. ఇంజక్షన్లు సరైనవేనా... కృత్రిమంగా కొలాజన్, స్కిన్ బూస్టర్స్.. అని తీసుకుంటున్నారు. ఎవరో చెప్పారని కొంతమంది నర్సులను ఇంటికి పిలిపించుకొని ఇంజక్షన్లు చేయించుకుంటారు. మంచి లుక్ కోసం ట్రై చేయచ్చు. కానీ, వాటి డోసుల్లో తేడాలొస్తే మొత్తం తిరగబడుతుంది. ఆన్లైన్లో చూసి ... సోషల్ మీడియా ప్రభావం వల్ల ఆన్లైన్లో బ్యూటీ ఉత్పత్తులు తెప్పించుకొని, అప్లై చేసుకోవడం చూస్తుంటాం. వాటి వల్ల ఇబ్బందుల పాలైన వారు చాలా మంది ఉంటారు. ఎందుకంటే, అవి వారికి ఎంత వరకు నప్పుతాయో తెలియదు. కెమికల్ పీలింగ్ కెమికల్ పీల్లో బయటి నుంచి చర్మంలోకి ఎలాంటి రసాయనాలు చొప్పించరు. మృతకణాలను తొలగిస్తారు, చర్మం పై పొర నుండి టానింగ్, పిగ్మెంటేషన్ తగ్గి కొత్త పొర కనిపిస్తుంది. అయితే, దీని ద్వారా చర్మంపై కొత్త సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. నిపుణుల సలహా అవసరం. ఇంకొన్ని పీఆర్పీ చికిత్సలు చర్మ నిగారింపును తీసుకువస్తాయి. అయితే, వధువులు కాబోయే అమ్మాయిలు పెళ్లికి 3 నుండి 6 నెలల ముందు ఈ కాస్మెటిక్ విధానాలను ప్రారంభించాలి. ఎందుకంటే వారి సిట్టింగ్లలో కనీసం 3 వారాల గ్యాప్ ఉండాలి. లైటర్ టోన్లకు డిమాండ్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయిలు తమ ప్రీ–బ్రైడల్ విధానంలో రంగు ఫెయిర్గా మారడం పట్ల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. నిజానికి, సూర్యకిరణాల నుండి మన చర్మాన్ని మనం రక్షించుకోనప్పుడు, చర్మంలో పాచెస్ ఏర్పడతాయి. కొన్నిసార్లు సూర్యకాంతి కుడి వైపున, మరి కొన్నిసార్లు ఎడమ వైపున ఎక్కువగా పడుతుంది. సూర్యుని అతినీలలోహిత కిరణాలు చర్మ కణాలను దెబ్బతీస్తాయి. పిగ్మెంటేషన్ను ప్రేరేపిస్తాయి. దీంతో అంతటా ’చర్మపు రంగు’ ఒకే విధంగా ఉండదు. అంటే ముఖం మీద చాలా చోట్ల టాన్ ఉంటుంది. ఈవెన్ టో ని కలిగి ఉండాలంటే ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు ముఖంపై సన్ స్క్రీన్ని అప్లై చేయడం చాలా ముఖ్యం. కాస్మొటిక్ ఫిల్లర్స్... నిఖిత పెదవులు చాలా సన్నగా ఉంటాయి. రంగు చాలా తక్కువ. ఒకరోజు ఆమె కాబోయే అత్తగారు ఫోన్ చేసి ‘నీ ముఖంలో పెదవులు కనిపించడం లేదు. ఏదైనా చికిత్స తీసుకో’ అంది. దీంతో నిఖిత నర్సులను కాస్మెటిక్ ఫేషియల్ ఫిల్లర్లను ఆశ్రయించింది. దీనిని లిప్ ఫిల్లర్ అని కూడా అంటారు. దీర్ఘకాలిక ఫలితాల కోసం, ప్రతి 6 నుండి 8 నెలలకు ఇంజెక్షన్లు చేయాలి. కాస్మెటిక్ ఫేషియల్ ఫిల్లర్లే కాకుండా, హైలురానిక్ యాసిడ్ ఫిల్లర్ ఇంజక్షన్లు కూడా ఈ రోజుల్లో బాగా ప్రాచుర్యం పొందాయి. ఈ డెర్మా ఫిల్లర్లతో పెదవులు హైడ్రేటెడ్గా ఉంటాయి. పగుళ్లు రావు, పూర్తి పరిమాణంలో కనిపిస్తాయి. అలాగే, కొందరు అమ్మాయిలు అత్తింటి వారు బరువు తగ్గమన్నారు కదా అని లైపోసక్షన్ వంటి చికిత్సలు చేయించుకుంటారు. దీని వల్ల చర్మంపై చారలు ఏర్పడతాయి. అవి అంత త్వరగా పోవు. ముక్కు, పెదాలు, బ్రెస్ట్ సరిచేసుకోవడానికి కాస్మొటిక్ సర్జరీలు కూడా చేయించుకుంటారు. ఏ చికిత్స అయినా కనీసం ఆరు నెలల ముందు చేయించుకుంటే వచ్చే సైడ్ఎఫెక్ట్నూ నివారించవచ్చు. సహజమైన మెరుపే మేలు పెళ్లి 10–15 రోజులు ఉందనగా ఏ బ్యూటీ ట్రీట్మెంట్ చేయించుకోకూడదనే విషయం ముందు గ్రహించాలి. కనీసం ఆరు లేదా మూడు నెలల ముందు బ్యూటీ చికిత్సలు చేయించుకోవచ్చు. దీని ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే నివారించుకునే అవకాశం ఉంటుంది. కృత్రిమ అందాన్ని ఎవరూ ఇష్టపడరు. ఎప్పుడైనా సహజమైన మెరుపును ఇచ్చే బ్యూటీ ట్రీట్మెంట్ మాత్రమే మంచిదని గమనించాలి. అయినా తప్పదు అనుకునేవారు స్కిన్ బూస్టర్స్, ఇతర ట్రీట్మెంట్ వైపుగా వెళ్లచ్చు. ఇందుకు నిపుణుల పర్యవేక్షణ అవసరం. డాక్టర్ స్వప్నప్రియ, డర్నటాలజిస్ట్ (చదవండి: అలసిన కళ్లకు రిలీఫే ఈ ఐ మసాజర్!) -
కొవ్వు ఇంజక్షన్లు: శరీరం కుళ్లిపోయి..వికృతంగా.. చావే మేలు అనుకున్నా.!
శరీరంలో కొవ్వును కరిగించుకునే ప్రక్రియలో అనేకమంది చాలా చేదు అనుభవాలున్నాయి. కొంతమంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. తాజాగా కొవ్వును కరిగించే ఇంజెక్షన్లు తీసుకొని ఇన్ఫ్లుయెన్సర్గా ఉండాలన్న ఒక మహిళ కల పీడకలగా మిగిలిపోయింది. స్వయంగా శరీరాన్ని తినేసే అరుదైన బాక్టీరియాతో జీవన్మరణ పోరాటం చేస్తున్న మాజీ స్విమ్సూట్ మోడల్, ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ గాథ ఒకటి వైరల్ అవుతోంది. ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ బీట్రిజ్ అమ్మ ఫాట్ను కరిగించుకునే క్రమంలో లాస్ ఏంజెల్స్ లోని ఒక లగ్జరీ స్పాను సంప్రదించింది. విటమిన్ ఇంజెక్షన్లు భారీ తీసుకునేది. విటమిన్ బీ1, సీ మిశ్రమంగా "వేగంగా కరిగిపోయే" డియోక్సికోలిక్ యాసిడ్తో కలిపి 60 ఇంజక్షన్లు తీసుకుంది. చేతులు, పిరుదులు, కడుపులోకి వీటిని తీసుకుంది. దాదాపు 66వేల కంటే ఎక్కువే ఖర్చుపెట్టింది. కొవ్వు కరగడం సంగతి ఏమోగానీ ఇపుడు అరుదైన మైకోబాక్టీరియం అబ్సెసస్ అనే బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సోకి నరక యాతన అనుభవిస్తోంది. ఇంజెక్షన్ తీసుకున్న ప్రతీ చోట భయంకరమైన పుండ్లతో భరించలేని భాధ పడుతోంది. దాదాపు మంకీ పాక్స్ లాంటి గాయాలతో ఆ బాక్టీరియా శరీరం మొత్తాన్ని తినేస్తోంది. (‘‘క్లిక్ చేసి వాట్సాప్ ఛానెల్ ఫాలో అవ్వండి’’) డియోక్సికోలిక్ యాసిడ్ సరిగ్గా ఇంజెక్ట్ చేయకపోవడం వల్లే ఇది జరిగిందని వైద్యులు నిర్ధారించారు. దీంతో బాక్టీరియా బారిన పడి కుళ్ళిపోయిన చర్మాన్ని తొలగించేందుకు పలు శస్త్రచికిత్సలు చేయించుకోవాల్సి వచ్చింది. ఇప్పటికీ ప్రతీ రోజూ ఆరు గంటల ఇంట్రావీనస్ యాంటీ బయాటిక్స్ను భరిస్తోంది. (హెలికాప్టర్ నుంచి కరెన్సీ నోట్ల వర్షం.. ఎగబడ్డ జనం) మంచానికే పరిమితమై ప్రాణం నిలుపుకునేందుకు ఆరాటపడుతోంది. ఒకరి సాయం లేకుండా రెస్ట్రూమ్కి వెళ్లలేక..కనీసం లేచి నిలబలేక ఇలా అన్నింటికి మరొకరి మీద ఆధారపడి బతుకేదాన్ని..శరీరం మంచం మీదే కుళ్ళిపోతోంది అంటూ తన అనుభవాన్ని పంచుకుంది బీట్రిజ్. అద్దంలో చూసుకున్న ప్రతిసారీ, జీవితంలో సాధించాలని కలగన్నదో, ఇపుడు ఏమి కోల్పోయిందో గుర్తు చేసుకుని బోరున విలపించింది. అటు వైద్యులు కూడా ఇన్ఫ్లుయెన్సర్గా ఉండాలనే కలను వదులుకోండి ఇది జీవితాంతం మిమ్మల్ని వదలదని తెగేసి చెప్పారు. అంతేకాదు ఇతరులను భయపెట్టకుండా బహిరంగ ప్రదేశాల్లో బికినీలు ధరించ వద్దని కూడా సలహా ఇచ్చారు. కానీ ఇక్కడే బీట్రీజ్ మాత్రం భిన్నంగా ఆలోచించింది. ఇక నా శరీరం పోరాడలేదు ఓడిపోయింది..ఇక చనిపోతాను అనుకున్న క్షణంలో ధైర్యాన్ని కూడ దీసుకుంది. మాంసాన్ని తినేసే వికృతమైన, భయంకరమైన ఈ బాక్టీరియా గురించి అవగాహన పెంచేందుకు తన శాయశక్తులా కృషి చేస్తోంది. ఈ క్రమంలోనే బాడీ పాజిటివిటీ మూవ్మెంట్ను మొదలు పెట్టింది. మన శరీరంలో ఎన్ని వైరుధ్యాలు, ప్రతికూలతలు, మచ్చలున్నా భయపడకుండా, ఆత్మన్యూనతతో దాచు కోకుండా శరీర ఆకృతితో సంబంధం లేకుండా అంతర్గతంగా, బాహ్యంగా అందంగా ఉండాలని పిలుపు నిస్తోంది. -
కండల పిచ్చి.. సూదిగుచ్చి..
నగర యువతలో పెరుగుతున్న కండల పిచ్చి వారిని పెడదారి పట్టిస్తోంది. వేగంగా ఆరు పలకల శరీరాకృతిని సొంతం చేసుకొనేందుకు ప్రమాదకర సూదిమందులను తీసుకుంటుండటం అందరినీ కలవరపెడుతోంది. మైలార్దేవ్పల్లిలోని ఓ జిమ్లో 400 మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజక్షన్లను సోమవారం డ్రగ్ కంట్రోల్ విభాగం అధికారులు, పోలీసులతో కలిసి సీజ్ చేయడం, జిమ్ ట్రైనర్ నితీశ్, అతని స్నేహితులు సొహైల్, రాహుల్లను అరెస్ట్ చేయడం యువతలో మజిల్ మేనియాకు.. ఈ ఇంజక్షన్ల విచ్చలవిడి విక్రయాలకు అద్దం పడుతోంది. – సాక్షి, హైదరాబాద్ కండల కోసం తహతహలాడే వారే టార్గెట్... సాధారణంగా పోటీలలో పాల్గొనే బాడీ బిల్డర్లు ఇంజక్షన్లను ఎంచుకుంటారు. గంటల తరబడి మజిల్ బిల్డింగ్ వర్కవుట్స్ చేయడానికి, పోటీల సమయానికి మజిల్స్ బాగా కనిపించేందుకు వాటిని వినియోగిస్తారు. అయితే అసాధారణ మార్గాల ద్వారా శరీరాన్ని బిల్డప్ చేయాలనే తపన ఉన్న యువకులకు కొన్ని జిమ్లలోని కోచ్లు ఈ ఇంజెక్షన్లు సిఫారసు చేస్తున్నారు. తక్కువ సమయంలోనే మంచి శరీరాకృతిని పొందుతారని చెబుతూ జిమ్ల యజమానులు ఇంజక్షన్లను అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఒక్కోటి సుమారు రూ. 300 పలికే ఇంజక్షన్ను కనీసం రూ. 1,500 నుంచి రూ. 2,000 వరకూ పెంచి అమ్ముతున్నారని సమాచారం. ఇంజక్షన్లను అక్రమంగా విక్రయిస్తున్న వారిలో జిమ్ ట్రైనర్ల నుంచి ఫార్మా, మెడికల్ రిప్రజెంటేటివ్స్ దాకా ఉన్నారు. డిమాండ్నుబట్టి పుణే, ఢిల్లీ వంటి నగరాల నుంచి కూడా ఇంజక్షన్లను వారు దిగుమతి చేసుకుంటున్నారు. వినియోగం... ప్రాణాంతకం ఈ ఇంజక్షన్లు యాంటిహైపోటెన్సివ్స్ అనే మందుల శ్రేణిలో భాగంగా వైద్యులు చెబుతున్నారు. వాటిని సాధారణంగా లోబీపీ చికిత్సలో భాగంగా వినియోగిస్తామని... రోగి రక్తపోటును సాధారణ స్థితికి చేర్చడానికి ఆపరేషన్ థియేటర్లలో సర్జరీల సమయంలో వినియోగిస్తామని వైద్యులు అంటున్నారు. ఇది ఒక వ్యక్తి గుండె స్పందనను ఆకస్మికంగా పెంచేందుకు కూడా కారణమవడంతో అది కఠినమైన వర్కవుట్స్ చేసేందుకు ఉ్రత్పేరకంగా పనిచేస్తుందని వివరించారు. అయితే పర్యవేక్షణ లేని మెఫెంటెర్మైన్ ఇంజక్షన్ల వినియోగం వల్ల యువకుల్లో సైకోసిస్ లక్షణాలు పెరిగిపోతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వాటిని దీర్ఘకాలం వాడితే అలవాటుగా మారి చర్మంపై దద్దుర్లు, రక్తపోటులో హెచ్చుతగ్గులు, శ్వాస ఆడకపోవడం, నిద్రలేమి, వికారం, వాంతులు, దృష్టి లోపాలు, భ్రాంతులు.. చివరకు గుండెపోటుకు కూడా సంభవించొచ్చని స్పష్టం చేస్తున్నారు. -
పెళ్లైన 5 నెలలకే ఘోరం.. నర్సుతో లవ్ ఎఫైర్.. భార్యకు ఇంజెక్షన్లు ఇచ్చి..
ముంబై: ఆ జంటకు పెళ్లై అయిదు నెలలు. భవిష్యత్తుపై ఎన్నో ఊహలు, ఆశలతో వైవాహిక బంధంలోకి అడ్డుగుపెట్టిన ఆ ఇల్లాలి సంతోషం ఎంతో కాలం నిలవలేదు. పెళ్లై ఏడాది గడవకముందే భర్త పరాయి స్త్రీ మోజులో పడ్డాడు. జీవితంలో తోడూ నీడై తనకు అండగా ఉండాల్సిన వ్యక్తే ఆమె పాలిట యముడయ్యాడు. వాహేతర సంబంధానికి అడ్డొస్తుందనే కారణంతో కట్టుకున్న భార్యనే కడతేర్చాడు. ఆపై ఆమె ఆత్మహత్య చేసుకుందని చిత్రీకరించేందుకు ఓ పెద్ద కథను కూడా అల్లాడు. కానీ అదికాస్తా బెడిసి కొట్టడంతో చివరకు తప్పను ఒప్పుకున్నాడు. ఈ ఘటన మహారాష్ట్రలో వెలుగు చూసింది. స్వప్నిల్ సావంత్(23) అనే యువకుడు పుణెలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తున్నాడు. అయిదు నెలల క్రితం ప్రింయాంక క్షేత్రేని వివాహం చేసుకొని అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. కొంతకాలంగా అక్కడే నర్సుగా చేస్తున్న సహోద్యోగితో సావంత్ ఎఫైర్ నడుపుతున్నాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. దీంతో పెళ్లికి తన భార్య అడ్డుగా ఉందని భావించి ఆమెను అంతమొందించాలనుకున్నాడు. నవంబర్ 14న భార్యకు ప్రాణాంతక ఇంజెక్షన్లు ఇచ్చి చనిపోయేలా చేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న వివాహితను ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు ప్రకటించారు. భార్య హత్యను ఆత్మహత్యగా నమ్మించేందుకు కుట్ర పన్నాడు. ప్రియాంక రాసినట్లు ఓ సుసైడ్ లేఖ కూడా రాశాడు. అయితే పోలీసులకు భర్త ప్రవర్తనపై అనుమానం రావడంతో అతన్ని అదుపులోకి తీసుకొని విచారించారు. దర్యాప్తులో చేసిన నేరాన్ని అంగీకరించాడు. పనిచేస్తున్న ఆసుపత్రి నుంచి వెకురోనియం బ్రోమైడ్, నైట్రోగ్లిజరిన్ ఇంజెక్షన్లు,లోక్స్ 2% సహా కొన్ని మందులు ఇంజెక్షన్లను దొంగిలించాడని తేలింది. వాటిని భార్యకు ఇచ్చి హత్య చేసిన్టలు ఒప్పుకున్నాడు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకొని.. పూర్తి దర్యాప్తు జరుగుతోందని ఇన్స్పెక్టర్ మనోజ్ యాదవ్ వెల్లడించారు. చదవండి: కోవిడ్లోనూ రెచ్చిపోయిన నాగేంద్ర బాబు.. వలలో ఎందరో సినీ ప్రముఖులు -
పాపం చిట్టితల్లి.. రూ.16 కోట్ల విలువైన ఇంజక్షన్ వస్తేనే వైద్యం
సాక్షి,దుమ్ముగూడెం(ఖమ్మం): బోసినవ్వులతో ఇంట్లో ఆడుకోవాల్సిన పసిపాప అరుదైన వ్యాధి బారిన పడి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. వేలల్లో ఒకరికి వచ్చే జన్యుసంబంధిత వ్యాధితో 14 నెలల ఎల్లెన్ వైద్యశాలలో చికిత్స పొందుతుండడం హృదయాలను కలిచివేస్తోంది. చికిత్సకు రూ.16కోట్లు అవసరమని వైద్యులు చెప్పగా.. అంత స్థోమత లేని పాప తల్లిదండ్రులు బరువెక్కిన హృదయాలతో బోరున విలపిస్తున్నారు. సహృదయం కలిగిన దాతలు ముందుకొస్తే తప్ప తమ పాపను దక్కదని వేడుకుంటున్నారు. సత్వర వైద్యం అందకపోతే.. దుమ్ముగూడెం మండలంలోని రేగుబల్లి గ్రామానికి చెందిన రాయపూడి ప్రవీణ్ – స్టెల్లా దంపతులు నిరుపేద కుటుంబానికి చెందిన వారు. ప్రవీణ్ ప్రైవేట్ మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. వీరికి 2018లో వివాహం కాగా 14నెలల ఎల్లెన్ పాప ఉంది. పాప నాలుగో నెల నుంచి మెడ భాగం పటిష్టంగా లేకపోవడం, కిందకు వాలిపోతుండడాన్ని తల్లిదండ్రులు గమనించారు. నెలలు గడుస్తున్నా శరీర భాగాల్లో కదలికలు కనిపించకపోవడంతో ఆందోళన చెందిన వారు విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా ప్రాథమిక పరీక్షలు నిర్వహించారు. అయినా ఏమీ తెలియకపోవడంతో జన్యుసంబంధిత సమస్యగా అనుమానిస్తూ మరో రెండు పరీక్షలు నిర్వహించారు. అయినా చిన్నారి సమస్య బహిర్గతం కాలేదు. రోజురోజుకూ చిన్నారి కదల్లేని పరిస్థితికి చేరుతుండడంతో తల్లిదండ్రులు చెన్నైలోని వేలూరు క్రిస్టియన్ మెడికల్ కాలేజీకి తీసుకెళ్లారు. తమ స్థోమతకు మించి అప్పులు చేసి గత ఏడాది డిసెంబర్ 7న జెనెటిక్ పరీక్షలు చేయిస్తే ఈ నెల 10న రిపోర్టులు వచ్చాయి. ఈ నివేదిక ఆధారంగా ఎల్లెన్ జన్యుసంబందిత వ్యాధితో బాధపడుతోందని.. నరాలు, కండరాలు బలహీనంగా అయ్యాయని వైద్యులు వెల్లడించారు. సత్వర వైద్యం అందకపోతే భవిష్యత్ ప్రశ్నార్థకమేనని చెప్పడం... రానురాను చిన్నారి శరీర భాగాల్లో కదలికలు తగ్గుతుండడంతో తల్లిదండ్రులు దిగాలు చెందుతున్నారు. ప్రస్తుతం రోజుకు చిన్నారి మందులు, చికిత్స కోసం రూ.25వేల వరకు ఖర్చు అవుతుండగా ఆ తల్లిదండ్రులు పడుతున్న బాధ వర్ణనాతీతం. రూ.కోట్లల్లో ఖర్చు... చిన్నారి ఎల్లెన్కు నిర్వహించిన పరీక్షలలో జన్యుసంబంధిత వ్యాధిగా నిర్ధారించారు. అయితే, ఈ వ్యాధికి చికిత్స చేయించాలంటే రూ.16 కోట్ల విలువైన ఇంజక్షన్ (జోల్జెన్స్మా)ను అమెరికా నుంచి తెప్పించాల్సి ఉంటుందని వైద్యులు చెప్పారని ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని ఆ కుటుంబ పరిస్థితిల్లో ఇంత ఖర్చు అంటే సాధారణ విషయం కాదు. ప్రస్తుతం చేస్తున్న వైద్యం అంతా తాత్కాలికమేనని వైద్యులు సూచించారు. ఈ మేరకు ప్రభుత్వం, దాతలు ముందుకు వచ్చి చిన్నారి ఎల్లెన్కు ప్రాణభిక్ష పెట్టాలని ఆమె తల్లిదండ్రులు ప్రవీణ్ – స్టెల్లా కోరుతున్నారు. కాగా, ఎల్లెన్కు ప్రస్తుతం విజయవాడలోని రెయిన్బో ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు. ఆమె చికిత్స కోసం సాయం చేయాలనుకునే దాతలు 99085 89604 నంబర్లో సంప్రదించాలని ప్రవీణ్ కోరారు. చదవండి: అంగన్వాడీల్లో గుడ్డు వెరీబ్యాడ్ -
బిడ్డ వేదనను చూడ లేక.. విషపు ఇంజెక్షన్ ఇచ్చి..
సాక్షి, చెన్నై: కేన్సర్తో తన కుమారుడు అనుభవిస్తున్న నరకయాతనను చూడలేక ఓ తండ్రి కారుణ్య హత్యకు పాల్పడ్డాడు. బంధువు సాయంతో తన కుమారుడికి విషం ఇంజెక్షన్ ఇచ్చి హతమార్చాడు. సేలంలో సోమవారం ఈ ఘటన వెలుగు చూసింది. సేలం జిల్లా ఎడపాడి సమీపంలోని కొంగనాపురం కరుసవల్లి గ్రామానికి చెందిన పెరియ స్వామి లారీ డ్రైవర్. ఆయనకు వన్నతమిళ్(14) కుమారుడు ఉన్నాడు. గత ఏడాది వన్న తమిళ్ కూడి వైపు కాలిలో ఓ కణితి బయట పడింది. వైద్యులు దీన్ని కేన్సర్ గడ్డగా తేల్చారు. దీనికి కోయంబత్తూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కొద్ది రోజుల పాటు చికిత్స అందించారు. ఆ తదుపరి తరచూ చికిత్సకు తీసుకెళ్తూ వస్తున్నారు. వైద్య ఖర్చులు భారం కావడమే కాకుండా, కేన్సర్ క్రమంగా శరీరం అంతా వ్యాపించడం, ఆ కణితి భాగం చీము పట్టడంతో వన్నతమిళ్ పడుతున్న నరకాన్ని చూసి ఆ తండ్రి తట్టుకోలేక పోయాడు. ఆ వేదన నుంచి కుమారుడికి విముక్తి కల్గించేందుకు నిర్ణయించారు. ఓ ల్యాబ్లో పనిచేస్తున్న సమీప బంధువు ప్రభు సాయం తీసుకున్నాడు. విషం ఇంజెక్షన్ ద్వారా కారుణ్య హత్యకు సిద్ధం అయ్యారు. ముందుగా నిర్ణయించుకున్న మేరకు ఆదివారం రాత్రి ఆ టీకాను ఆ బాలుడికి వేశారు. నిద్రలోనే ఆ బాలుడు మరణించాడు. సోమవారం ఉదయాన్నే కేన్సర్ కారణంగా మరణించినట్టు ఇరుగు పొరుగు వారిని నమ్మించారు. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేపట్టారు. అయితే, పోలీసులకు ఆ బాలుడిని కారుణ హత్య చేసినట్టుగా గుర్తు తెలియని వ్యక్తులు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు బాలుడి మృత దేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఆ బాలుడి తండ్రి, బంధువును అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. -
తల్లి, సోదరిని చంపి తానూ చావాలనుకుంది..
సూరత్: తల్లి, సోదరికి ఇంజెక్షన్లు ఇచ్చి చంపేసి తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలని గుజరాత్కు చెందిన ఓ మహిళా డాక్టర్ ప్రయత్నించారు. గుజరాత్లోని కాటగ్రామ్లో జరిగిన ఈ ఘటనలో తల్లి, సోదరి మరణించగా ఆత్మహత్యాయత్నం చేసిన డాక్టర్ దర్శన ప్రజాపతి (30) మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం ఆమె ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారని స్థానిక ఏసీపీ డీజే చద్వా ఆదివారం తెలిపారు. శనివారం రాత్రి డాక్టర్ దర్శన తన తల్లి మంజులాబెన్ (59), సోదరి ఫాల్గుని (28)లకు డ్రగ్స్ను ఇంజెక్షన్ రూపంలో ఇచ్చారు. అనంతరం ఆమె కూడా నిద్రమాత్రలు మింగారు. ఆదివారం ఉదయానికి తల్లీ, సోదరి మరణించగా ఆమె మాత్రం ప్రాణాలతో మిగిలారు. తనకు జీవితంపై విరక్తి కలిగిందనీ, తల్లి్ల, సోదరి తనపైనే ఆధారపడి ఉండటంతో వారిని కూడా అంతం చేయాలని భావించినట్లు దర్శన పోలీసులకు వెల్లడించారు. -
బ్లాక్ ఫంగస్ చికిత్సకు రూ.22 లక్షలు తీసుకున్నారు!
లబ్బీపేట (విజయవాడ తూర్పు): బ్లాక్ ఫంగస్ చికిత్స కోసం ప్రభుత్వాస్పత్రిలో చేరితే, ఇంజక్షన్ల కొరత ఉందంటూ ఓ డ్యూటీ వైద్యురాలు తమ వద్ద నుంచి రూ.22 లక్షలు వసూలు చేసిందని ఓ వ్యక్తి వైద్యాధికారులకు ఫిర్యాదు చేశారు. తాము చెల్లింపులన్నీ డ్యూటీ డాక్టర్ వ్యక్తిగత బ్యాంక్ ఖాతాకు జమ చేసినట్లు ఆధారాలతో సహా ఫిర్యాదుకు జత చేయడంతో దీనిపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన పొట్టెం విజయలక్ష్మి శరన్ ఈ ఏడాది మే 28న బ్లాక్ ఫంగస్ చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చేరారు. ఆ సమయంలో ఆ వార్డులో డ్యూటీ డాక్టర్గా ఉన్న (కోవిడ్ నియామకం) తోట వాణి సుప్రియ లయోఫిలైజుడ్ యాంఫోటెరిసిన్ బి అనే యాంటి ఫంగల్ ఇంజెక్షన్స్ కొరత ఉందని, డిమాండ్ కూడా ఎక్కువగా ఉందని, ముడుపులు చెల్లిస్తే కానీ ఇంజెక్షన్లు సమకూర్చలేమని చెప్పినట్లు విజయలక్ష్మి భర్త రఘుకులేశ శరన్ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో విడతల వారీగా తాము రూ.22 లక్షలు డ్యూటీ డాక్టర్ వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలో జమ చేసినట్లు తెలిపారు. అందుకు సంబంధించిన ఆధారాలను కూడా ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్కు ఇచ్చిన ఫిర్యాదుతో జత చేసినట్లు తెలిసింది. ప్రభుత్వం ఉచితంగా యాంటీ ఫంగల్ మందులను ఇస్తుంటే, ఇలా బ్లాక్ మార్కెట్లో అమ్ముకుని సొమ్ము చేసుకోవడం దారుణమని, తమని మోసం చేసిన డ్యూటీ డాక్టర్పై చర్యలు తీసుకుని, ఆమె వెనుక ఉన్న సూత్రధారులపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. జేసీ సీరియస్.. బ్లాక్ ఫంగస్ రోగి నుంచి రూ.22 లక్షలు వసూలు చేసినట్లు వచ్చిన ఆరోపణలపై జిల్లా జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) ఎల్.శివశంకర్ సీరియస్ అయినట్లు తెలిసింది. ఈ మేరకు ఆస్పత్రి అధికారులను తమ కార్యాలయానికి పిలిపించుకుని బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో పాటు, ఇతర వివరాలను సేకరించారు. కాగా ఈ విషయమై బాధితులు వారం కిందటే జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారికి ఫిర్యాదు చేసినా, దానిని ఆస్పత్రి అధికారులకు పంపకుండా వారి వద్దే ఉంచుకున్నట్లు తెలిసింది. ఇప్పుడు ఘటన వెలుగులోకి రావడంతో హడావుడిగా తమకు వచ్చిన ఫిర్యాదును ఆస్పత్రి అధికారులకు పంపారు. విచారణ జరుగుతోంది రోగి నుంచి రూ.22 లక్షలు తీసుకున్నట్లు వచ్చిన ఫిర్యాదుపై జేసీ నేతృత్వంలో విచారణ జరుపుతున్నాం. తమకు ఇచ్చిన ఫిర్యాదు వివరాలు మొత్తం జేసీకి ఇచ్చాము. రోగి ప్రభుత్వాస్పత్రి నుంచి వెళ్లిన తర్వాత ఇంటి వద్ద కూడా ఈ వైద్యురాలు చికిత్స చేసినట్లు తెలిసింది. అన్ని విషయాలు విచారణలో తేలుతాయి. – డాక్టర్ ఎం జగన్మోహనరావు, సూపరింటెండెంట్ -
Corona Vaccine: సూది గుచ్చడంలో తేడాతో రక్తంలో గడ్డలు!
మ్యూనిచ్: సూది మందు గుచ్చేతీరులో తేడాల వల్ల రక్తంలో గడ్డలు కట్టే ప్రమాదం ఉందని, అందువల్లే కోవిడ్ టీకా తీసుకున్న కొంతమందిలో బ్లడ్ క్లాట్స్ కనిపించాయని నూతన అధ్యయనం వెల్లడించింది. తప్పుగా ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు కండరంలోకి ఎక్కించాల్సిన మందు పొరపాటున రక్తనాళాల్లోకి ఇంజెక్ట్ అవుతుందని, అందువల్ల తేడా చేస్తుందని మ్యూనిచ్ యూనివర్సిటీ పరిశోధనలో తేలింది. ఆస్ట్రాజెనెకా, స్పుత్నిక్ సహా పలు టీకాల విషయంలో ఈ రక్తంలో గడ్డల(పోస్ట్ వ్యాక్సినేషన్ థ్రోంబాటిక్ థ్రోంబోసైటోపెనిక్ సిండ్రోమ్– టీటీఎస్ లేదా వ్యాక్సిన్ ఇండ్యూస్డ్ ఇమ్యూన్ థ్రోంబాటిక్ థ్రోంబోసైటోపీనియా– వీఐటీటీ) ఫిర్యాదులు వినిపించాయి. అయితే ఇది టీకాలో సమస్య కాదని, టీకా ఎక్కించడంలో సమస్యని తాజా నివేదిక తెలిపింది. ‘‘ఇంజక్షన్ నీడిల్ను కండరంలోకి చేరేంత లోతుగా పంపించకుండా పైపైన గుచ్చినప్పుడు టీకామందు కండరంలోకి బదులు రక్తంలోకి నేరుగా వెళ్తుంది. సూది మందు ఇచ్చే సమయంలో చేతిపై చర్మాన్ని వత్తి పట్టుకోకూడదు. ఇంట్రామస్కులార్ ఇంజెక్షన్లు(కండరాల్లోకి పంపే సూదిమందు) ఇచ్చేటప్పుడు ఏమాత్రం చర్మాన్ని పించప్(వత్తి పట్టుకోవడం) చేయకుండా సాఫీగా ఉన్న చర్మంపై టీకానివ్వాలి. లేదంటే సూది మొన కేవలం చర్మాంతర్గత కణజాలం వరకే చేరుతుంది. దీంతో టీకా మందు కణజాలంలోకి పీల్చుకోవడం జరగదు. పైగా కొన్నిమార్లు ఇలా చేయడం వల్ల సూదిమొన రక్తనాళాల్లోకి వెళ్తుంది. అప్పుడు టీకా మందు రక్తంలోకి ప్రవేశించి క్లాట్స్ కలిగించే ప్రమాదం ఉంది’’అని కరోనా వైరస్ టాస్క్ఫోర్స్ సభ్యుడు రాజీవ్ జయదేవన్ వివరించారు. టీకా ఇచ్చేముందు సూది గుచ్చిన అనంతరం పిస్టన్ను వెనక్కు లాగి చెక్ చేసుకోవడం ద్వారా సూది మొన రక్తనాళంలోకి చేరలేదని నిర్ధారించుకోవాలన్నారు. -
కరోనా టీకా కోసం వెళ్తే.. కుక్క కాటు వ్యాక్సిన్ వేశారు
కట్టంగూర్: చదువురాని మహిళ.. కరోనా వ్యాక్సిన్ కోసమని ఆస్పత్రికి వెళ్లింది. కోవిడ్ వ్యాక్సిన్ వేయాలంటూ ఆమె పనిచేస్తున్న బడి హెడ్మాస్టర్ రాసిచ్చిన లేఖనూ తీసుకెళ్లి చూపించింది. కానీ ఆస్పత్రి సిబ్బంది ఆమెకు కుక్కకాటు టీకా వేయడంతో భయాందోళనకు లోనైంది. నల్లగొండ జిల్లా కట్టంగూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ)లో మంగళవారం ఈ ఘటన జరిగింది. బాధితురాలి కథనం మేరకు.. కట్టంగూర్ మండలం బొల్లేపల్లి ప్రాథమిక పాఠశాలలో పి.ప్రమీల స్కావెంజర్గా పనిచేస్తోంది. ఆమెకు కోవిడ్ వ్యాక్సిన్ వేయాలని వైద్యాధికారిని కోరుతూ పాఠశాల హెచ్ఎం లెటర్ రాసి ఇచ్చారు. ప్రమీల ఆ లేఖ తీసుకుని మంగళవారం ఉదయం 11 గంటలకు కట్టంగూర్ పీహెచ్సీకి వచ్చింది. చదువురాని ఆమె కరోనా వ్యాక్సిన్ క్యూ ఏదో తెలియక.. సాధారణ టీకాలు వేసే లైన్లో నిలబడింది. ఆమె ముందు అయిటిపాముల గ్రామానికి చెందిన ఓ మహిళ ఉంది. నర్సు ఆ మహిళకు యాంటీ రేబిస్ వ్యాక్సిన్ (ఏఆర్వీ) ఇచ్చింది. తర్వాత ప్రమీల వంతురాగా.. కరోనా వ్యాక్సిన్ వేయాలంటూ హెచ్ఎం ఇచ్చిన లెటర్ను నర్సుకు ఇచ్చింది. కానీ నర్సు ఆ లెటర్ను చదవకుండానే.. అదే సిరంజితో ప్రమీలకు ఏఆర్వీ వ్యాక్సిన్ వేసింది. ఒకే సిరంజితో ఇద్దరికి వ్యాక్సిన్ ఎలా ఇస్తారని ప్రమీల నిలదీయగా.. నర్సు అక్కడి నుంచి వెళ్లిపోయింది. అదే సమయంలో పక్కన ఉన్నవారు లెటర్ చదివి.. ఇది కరోనా లైన్ కాదని, తనకు వేసింది కుక్కకాటు వ్యాక్సిన్ అని చెప్పడంతో ప్రమీల భయాందోళనకు గురైంది. ఒకే సిరంజితో ఇద్దరికి ఏఆర్వీ వ్యాక్సిన్ను వేయడం ఏమిటని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమెకు ఏఆర్వీ వేయలేదు: వైద్యాధికారి ప్రమీల కరోనా వ్యాక్సిన్ క్యూలో కాకుండా సాధారణ ఏఆర్వీ, టీటీ వ్యాక్సిన్ లైన్లో నిలబడిందని.. దాంతో నర్సు ఆమె కుక్కకాటు టీకా కోసం వచ్చినట్టు భావించి టీటీ ఇంజక్షన్ వేశారని వైద్యాధికారి కల్పన వివరణ ఇచ్చారు. వేర్వేరు సిరంజిలతో అయిటిపాముల మహిళకు ఏఆర్వీ, ప్రమీలకు టీటీ ఇచ్చినట్టు తెలిపారు. టీటీతో ఎలాంటి ప్రమాదం ఉండదన్నారు. చదవండి: -
రూ.7444 ఇంజెక్షన్ @రూ.35 వేలు!
సాక్షి, హైదరాబాద్: బ్లాక్ ఫంగస్ చికిత్సకు వినియోగించే ఔషధాలను అనధికారికంగా సేకరించి, నల్లబజారుకు తరలించి అధిక ధరలకు విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను మధ్య మండల టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వీరిలో ఇద్దరు మెడికల్ షాపు నిర్వాహకులు ఉన్నట్లు నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. టాస్్కఫోర్స్ ఓఎస్డీ పి.రాధాకిషన్రావుతో కలిసి సోమవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కూకట్పల్లి ప్రాంతానికి చెందిన కె.క్రాంతి కుమార్ వీవీ నగర్లో మెడిక్స్ ఫార్మసీ పేరుతో, వివేకానంద నగర్కు చెందిన ఎన్.వెంకట దినేష్ స్థానికంగా శంకరి పార్మసీ పేరుతో మందుల దుకాణాలు నిర్వహిస్తున్నారు. ఆల్విన్ కాలనీకి చెందిన బాలాజీ మెడిసిన్ వరల్డ్ యజమాని శ్రీనివాస్తో కలిసి వారు బ్లాక్ ఫంగస్ చికిత్సకు వాడే ఎంపోటెరిసరిన్–బి సంబంధిత ఇంజెక్షన్లను సేకరించారు. కొందరు రోగుల వద్ద మిగిలిన వాటిని దళారుల ద్వారా ఖరీదు చేయడంతో పాటు నకిలీ పత్రాలతో రోగుల బంధువుల మాదిరిగా సమీకరించిన వారి నుంచి వీరు కొనుగోలు చేసేవారు. అనంతరం రూ.7444 ఖరీదైన ఫంగ్లిప్ ఇంజెక్షన్ను రూ.35 వేలకు, రూ.8500 ఎంఆర్పీ కలిగిన పోసాకొంజోలీ ఇంజెక్షన్ను రూ.50 వేల చొప్పున విక్రయించేందుకు పథకం వేశారు. వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి కుటుంబీకులు, బంధువుల్ని టార్గెట్గా చేసుకుని ఈ దందాకు దిగారు. దీనిపై సమాచారం అందుకున్న మధ్య మండల టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ మహ్మద్ అబ్దుల జావేద్ నేతృత్వంలో ఎస్సైలు టి.శ్రీధర్, కె.శ్రీనివాసులు, మహ్మద్ షానవాజ్ షపీ వలపన్నారు. సోమవారం ముగ్గురు నిందితులను అరెస్టు చేసి వీరి నుంచి 35 ఇంజెక్షన్లు స్వా«దీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం రామ్గోపాల్పేట్ పోలీసులకు అప్పగించారు. టాస్్కఫోర్స్ పోలీసులు కోవిడ్, బ్లాక్ ఫంగస్ మందుల అక్రమ దందాపై నిఘా పెంచారని సీపీ తెలిపారు. సెకండ్ వేవ్ మొదలైనప్పటి నుంచి 56 కేసులు నమోదు చేసి 136 మందిని అరెస్టు చేశామని, వీరి నుంచి 450 ఇంజెక్షన్లు స్వా«దీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు. -
బ్లాక్ఫంగస్ ఇంజెక్షన్లను బ్లాక్లో విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు
సాక్షి, హైదరాబాద్: బ్లాక్ఫంగస్ ఇంజెక్షన్లను బ్లాక్మార్కెట్లో విక్రయిస్తున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. 9 మందిని అరెస్ట్ చేసి, 28 అంఫోటెరిసిన్-బి ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకున్నారు. సీపీ అంజనీ కుమార్ వివరాలను మీడియాకు వెల్లడించారు. ఎస్ఆర్ నగర్, బంజారాహిల్స్లో ఇంజెక్షన్లను విక్రయిస్తున్న ఈ ముఠా.. ఒక్కో ఇంజెక్షన్ను రూ.35 వేల నుంచి రూ.50 వేల చొప్పున అమ్ముతున్నారు. మొదటి గ్యాంగ్లో ఐదుగురిని, రెండో గ్యాంగ్లో నలుగురిని అరెస్ట్ చేశామని.. మొత్తం తొమ్మిది మంది అరెస్ట్ చేశామని సీపీ తెలిపారు. బ్లాక్మార్కెట్లో ఇంజెక్షన్లు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పువని సీపీ అంజనీకుమార్ హెచ్చరించారు. చదవండి: ఏమిటి జోకర్ యాప్స్.. బహుపరాక్ ఖైరతాబాద్: తిమింగలం వాంతి పేరుతో మోసం.. -
రిమ్స్లో దారుణం: కాలం చెల్లిన ఇంజక్షన్లతో చికిత్స..
సాక్షి, ఆదిలాబాద్: రిమ్స్లో రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. రోగం నయం చేసుకునేందుకు ఆస్పత్రికి వస్తున్న వారికి కాలం చెల్లిన ఇంజక్షన్ ఇస్తూ వారి ప్రాణాలకు ముప్పు తెస్తున్నారు. పట్టించుకోవాల్సి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. రిమ్స్ ఆస్పత్రిలోని మూడో అంతస్తు మేల్ జనరల్ వార్డులో దాదాపు 30 మంది రోగులు వివిధ రోగాలతో చికిత్స పొందుతున్నారు. ఆదివారం రాత్రి ఆ వార్డులోని నర్సు ఐదుగురు రోగులకు ఇంజక్షన్లు ఇచ్చింది. వ్యాక్సిన్ బాటిళ్లను రోగుల బెడ్లపై ఉంచడంతో అదే వార్డులో చికిత్స పొందుతున్న ఓ ఆర్ఎంపీ వైద్యుడి కుమారుడు గమనించి ఇంజక్షన్కు కాలం చెల్లిందని వైద్యసిబ్బందికి చెప్పడంతో వెంటనే చెత్తబుట్టలో పారేశారు. బంధువుల ఆందోళన.. రోగుల బంధువులు ఆదివారం రాత్రి ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్, బీ జేపీ నాయకులు అక్కడికి చేరుకుని వైద్య సిబ్బందిని నిలదీశారు. రిమ్స్ డైరెక్టర్ను ఫోన్లో సంప్రదించగా స్పందించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగులకు ఇచ్చిన యాంటి బయోటిక్ ఇంజక్షన్ 2019లో తయారుకాగా 2021 జనవరితో గడువు ముగిసింది. ఈ విషయమై ఏఐసీసీ సభ్యురాలు గండ్రత్ సుజాత, బీజేపీ నాయకులు పాయల్ శరత్ సోమవారం జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. రిమ్స్ సిబ్బంది, డైరెక్టర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై రిమ్స్ డైరెక్టర్ బలరాం రాథోడ్ను వివరణ కోరగా కమిటీని ఏర్పాటు చేసి విచారణ జరిపిన అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. సిబ్బందిపై కేసు నమోదు రిమ్స్లో చికిత్స పొందుతున్న గాంధీచౌక్కు చెందిన గౌరీశంకర్శర్మ కుమారుడు కైలాస్శర్మ ఆస్పత్రి సిబ్బందిపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ సీఐ వివరించారు. చదవండి: ల్యాబ్ నుంచి వైరస్ లీక్ కాలేదు : చైనా వైరాలజిస్ట్ -
బ్లాక్ ఫంగస్ పనిపట్టే ఔషధాలు ఇవే
దేశవ్యాప్తంగా బ్లాక్ఫంగస్ ఇంజక్షన్లకు కొరత ఏర్పడటంతో సమస్యలు తలెత్తుతున్నాయి. బ్లాక్ ఫంగస్ బాధితుల చికిత్స కోసం వినియోగించే యాంఫోటెరిసిన్ బి, పొసకొనజోల్ ఇంజక్షన్ల ఉత్పత్తి తగినంతగా లేకపోవడం, ఒక్కో పేషెంటుకు ఎక్కువ ఇంజక్షన్లు వాడాల్సి రావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 10 శాతం మంది పేషెంట్లకు కూడా యాంఫోటెరిసిన్ ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రత్యామ్నాయాలపై కృషి జరుగుతోంది. ఈ క్రమంలో ఆయుర్వేద మందులకు ప్రాధాన్యం పెరుగుతోంది. గతంలో ఎన్నో రకాల ఫంగస్లను నియంత్రించిన చరిత్ర ఆయుర్వేద ఔషధాలకు ఉందని వైద్యులు చెబుతున్నారు. ఆహార నియమాలు పాటిస్తూ, వ్యాయామాలు చేస్తూ ఆయుర్వేద మందులు వాడితే బ్లాక్ ఫంగస్ బారిన పడకుండా కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు. సాక్షి, అమరావతి: కేంద్ర ఆయుష్ శాఖ మూడు రకాల ఆయుర్వేద మందులను బ్లాక్ఫంగస్ నిరోధక ఔషధాలుగా ప్రకటించింది. శంషమన వటి 500 మిల్లీగ్రాములు, నిషామలకి వటి 500 మిల్లీ గ్రాములు, సుదర్శన ఘణవటి 500 మిల్లీ గ్రాముల మోతాదులో మాత్రలను ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వాడితే మ్యూకార్ మైకోసిస్ బారిన పడకుండా కాపాడుకోవచ్చని మార్గదర్శకాలు జారీచేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది మంచి ప్రత్యామ్నాయమని ఆయుష్ శాఖ పేర్కొంది. దీంతోపాటు ఆయుష్ – 64 అనే మందునూ వాడుకోవచ్చని అధికారికంగా ప్రకటించారు. నిపుణుల పర్యవేక్షణలో వీటిని తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు కనిపించే అవకాశం ఉంది. అల్లోపతి మందులు వాడుకుంటూనే ఆయుర్వేద మందులూ తీసుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ఆహారంలో ఇవి తీసుకోవాలి.. ఆహారంలో ప్రధానంగా ఔషధ గుణాలున్నవి ఉండేలా చూసుకోవాలని ఆయుర్వేద వైద్యులు పేర్కొంటున్నారు పసుపు, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి తప్పకుండా ఉండాలి. తులసి, దాలి్చన చెక్క, నల్లమిరియాలు కూడా మంచివి. నల్లద్రాక్ష, వేరుశనగ పప్పు, పిస్తా, మల్బరీస్, స్ట్రాబెర్రీ లాంటివి రోగ నిరోధక శక్తి పెరిగేలా దోహదం చేస్తాయి. జామకాయ, బత్తాయి, కమలా, నిమ్మ, కాప్సికం లాంటి వాటితోపాటు, మునగాకుతో వండిన కూరలతో మంచి ఉపయోగం ఉంటుంది. చికిత్స, నివారణ.. రెండిటికీ ‘‘ఆయుర్వేద మందులకు ఉన్న గొప్ప గుణం ఏమిటంటే చాలా రకాల వ్యాధులు వచి్చన తర్వాత వాటిని తగ్గించేందుకు, రాకుండా కాపాడేందుకూ ఉపయోగపడతాయి. ఈ ఔషధాలను వైద్యుడి పర్యవేక్షణలోనే తీసుకోవాలి. బ్లాక్ఫంగస్ ప్రధానంగా ఇమ్యూనిటీ తగ్గినప్పుడే వస్తుంది. రోగ నిరోధక శక్తి పెంచే గుణాలు ఆయుర్వేద మందుల్లో ఉన్నాయి. క్రమం తప్పకుండా సూచించిన మేరకు వాడితే మంచి ఫలితాలు వస్తాయి. శతాబ్దాల క్రితమే చరక సంహితలో ఈ వ్యాధులకు సంబంధించి సూచనలు చేశారు’’ –డా.కె.విజయభాస్కర్రెడ్డి, ప్రొఫెసర్, శల్య విభాగం, ఎస్వీ ఆయుర్వేద కాలేజీ, తిరుపతి నియంత్రించే నేత్ర బిందువులు.. ‘‘నిషామలకి, మహాలక్ష్మీ విలాస రస్ మందులతో పాటు ఎలనీర్ కుజాంబు అనే నేత్ర బిందువులు వేసుకుంటే బ్లాక్ ఫంగస్ నియంత్రణకు బాగా ఉపయోగపడతాయి. కబాసురా కుడినీర్ అనే మందు ఉదయం పూట, ఆయుష్ క్వాత అనే మందు రాత్రిపూట తీసుకుంటే ఫంగస్ నియంత్రణకు ఎంతో ఉపకరిస్తాయి. క్రమం తప్పని వ్యాయామం శరీర పటుత్వాన్ని పెంచుతుంది’’ –డా.కేదార్నాథ్, ఆయుర్వేద వైద్యుడు బ్లాక్ ఫంగస్ చికిత్స, నివారణకు ఆయుర్వేద ఔషధాలు ఇలా ► పంచ వల్కల కషాయంతో వ్యాధి సోకిన ప్రాంతాన్ని శుభ్రపరచి ఆరిన తర్వాత మహాతిక్త ఘృతం పూయాలి. ► పథ్యాది కాడ మూడు పూటలా 15 ఎంఎల్ మోతా దు మించకుండా వాడాలి ► నింబామృతాది ఏరండ తైలం 10 ఎంఎల్ పడుకునే ముందు 3 రోజుల పాటు వాడాలి ► సంశమనవటి/గిలోయి ఘణవటి మూడు పూటలా వాడాలి ► గంధక రసాయనం 500 ఎంజీ మోతాదుతో మూడు పూటలా వాడాలి ► నిషామలకి 500ఎంజీ ఉదయం, సాయంత్రం వాడాలి ► సుదర్శన ఘణవటి 500 ఎంజీ మూడు పూటలా వాడాలి ► బృహత్వాత చింతామణి ఉదయం, సాయంత్రం వాడాలి ► క్రమేవృద్ధి లక్ష్మీ విలాస రస్ ఉదయం, సాయంత్రం వాడాలి. చదవండి: రాష్ట్రంలో 1,551 బ్లాక్ఫంగస్ కేసులు -
ఇంజెక్షన్లతో కామవాంఛ.. 8 ఏళ్లుగా యువతిపై
ముంబై: కామవాంఛతో కొందరు వ్యక్తులు దారుణానికి పాల్పడ్డారు. యువతికి కోరికలు రేకెత్తేలా ఇంజెక్షన్లు.. మందుబిల్లలు ఇస్తూ 8 సంవత్సరాలుగా ఆమెపై అత్యాచారానికి పాల్పడుతున్నారు. ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితులు పోలీసులకు చిక్కారు. వీరిలో ఇద్దరు భార్యాభర్తలు కూడా ఉన్నారు. భర్తకు భార్యనే ప్రోత్సహించడం గమనార్హం. మైనర్గా ఉన్నప్పుడు కిడ్నాప్ చేయగా ఇప్పుడు ఆ బాలిక యువతిగా మారింది. ఎట్టకేలకు నిందితుల చెర నుంచి ఆ యువతి బయటపడింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మహారాష్ట్ర రాజధాని ముంబైలోని అంధేరి ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారి కుమార్తె ఇంటర్ చదువుతుండేది. 16 ఏళ్లు ఉన్న ఆ బాలికను ఎనిమిదేళ్ల కిందట కొందరు కిడ్నాప్ చేశారు. అప్పటి నుంచి ఆమెపై అత్యాచారం చేస్తున్నారు. బాలికకు కామ కోరికలు కలిగేలా ఇంజెక్షన్లు, ట్యాబ్లెట్లు ఇచ్చేవారు. ఆమెపై ఇష్టమొచ్చినప్పుడల్లా అఘాయిత్యానికి పాల్పడుతున్నారు. ఆమెకు స్పృహ వచ్చినప్పుడు తప్పించుకునేందుకు ప్రయత్నించగా ఆమెను బెదిరింపులకు పాల్పడేవారు. ఆమెకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో పెడతామని హెచ్చరించి ఆమెను నిర్బంధించారు. ఇలా 8 ఏళ్లుగా ముగ్గురు అత్యాచారానికి పాల్పడుతున్నారు. దీనికి నిందితుడి భార్య కూడా సహకరించేది. చివరకు వారి చెర నుంచి బయటకు వచ్చిన యువతి అంబోలి పోలీసులను సంప్రదించింది. 27 పేజీలతో ఆమె ఫిర్యాదు చేసింది. అయితే నిందితుల్లో ఓ వ్యక్తి తన కుమారుడికి పెళ్లి చేసేందుకు తనను ఉత్తరప్రదేశ్కు కూడా తీసుకెళ్లాడని ఫిర్యాదులో యువతి పేర్కొంది. కేసు నమోదు అనంతరం పోలీసులు నిందితులు నలుగురిని అరెస్ట్ చేశారు. పట్టుబడ్డ వారిలో నిందితుడి భార్య కూడా ఉంది. ఆమె తన భర్తకు సహకరించింది. నిందితులందరూ ఒకే కుటుంబానికి చెందినవారుగా తెలుస్తోంది. బాలిక తప్పిపోయినప్పుడు ఆమె తల్లిదండ్రులు మిస్సింగ్ కేసు నమోదు చేయించారు. 8 ఏళ్ల తర్వాత తమ కూతురి ఆచూకీ లభించడంతో ఆమెను తల్లిదండ్రులు తీసుకెళ్లారు. నిందితులు బాధిత యువతి కుటుంబానికి తెలిసిన వారిగా పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించిన వివరాలు మరిన్ని తెలియాల్సి ఉంది. -
పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వండి
సాక్షి, అమరావతి: బ్లాక్ ఫంగస్ ఇంజక్షన్ల విషయంలో పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని హైకోర్టు సోమవారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్రాల వారీగా బ్లాక్ఫంగస్ కేసులెన్ని.. ఇంజక్షన్లను ఎలా సమకూర్చుకుంటున్నారు.. రాష్ట్రాలకు వాటిని ఎలా కేటాయిస్తున్నారు.. ప్రస్తుతం ఉన్న ఇంజక్షన్ల నిల్వలు తదితర వివరాలతో నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. అలాగే కోవిడ్ థర్డ్వేవ్ను ఎదుర్కొనేందుకు ఏ విధంగా సన్నద్ధం అవుతున్నారో వివరిస్తూ నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. చిన్నపిల్లల్లో వచ్చే మల్టీసిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ (ఎంఐఎస్)ను ఆరోగ్యశ్రీలో చేర్చే విషయాన్ని పరిశీలించాలని సూచించింది. తదుపరి విచారణను ఈ నెల 10వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ కొంగర విజ యలక్ష్మి, జస్టిస్ దొనడి రమేశ్ ఉత్తర్వులు జారీచేశారు. కరోనా విషయంలో హైకోర్టులో పలు ప్ర జాప్రయోజన వ్యాజ్యాలు దాఖలైన విషయం తెలి సిందే. ఈ వ్యాజ్యాలను కొద్ది వారాలుగా విచారిస్తున్న హైకోర్టు ధర్మాసనం సోమవారం మరోసారి విచారించింది. బ్లాక్ఫంగస్ ఇంజక్షన్ల విషయంలో ధర్మాసనం గత విచారణ సమయంలో ఇచ్చిన ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం ఓ మెమోను కోర్టు ముందుంచింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) ఎన్.హరినాథ్ వాదనలు వినిపిస్తూ.. ఏపీకి గతంలో కేటాయించిన 13,830 ఇంజక్షన్లు కాక, ఈ నెల 5న మరో 7,770 వయల్స్ కేటాయించా మన్నారు. మే నెలాఖరుకు కేంద్రం వద్ద బ్లాక్ఫంగస్ ఇంజక్షన్లు 4.38 లక్షలున్నాయని, వాటిలో 2.02 లక్షలు దేశీయంగా ఉత్పత్తి చేసినవి, 2,33,971 ఇంజక్షన్లు విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నవని వివరించారు. రాష్ట్రాలకు సరఫరా చేయగా ప్రస్తుతం కేంద్రం వద్ద 80 వేల ఇంజక్షన్లు ఉన్నాయని తెలిపారు. కేంద్రం కేటాయింపులు ఏ మాత్రం సరిపోవు ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్జీపీ) చింతల సుమన్ స్పందిస్తూ.. రాష్ట్రంలో గత నెలాఖరు నాటికి 1,400 ఉన్న బ్లాక్ఫంగస్ కేసులు ప్రస్తుతం 1,770కి పెరి గాయని తెలిపారు. బాధితుల చికిత్సకు కేంద్రం కేటాయించిన 7,770 వయల్స్ ఎంతమాత్రం సరిపోవన్నారు. కేటాయింపులను పెంచకపోతే రోగుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని చెప్పారు. అనంతరం ధర్మాసనం కరోనా థర్డ్వేవ్ను ఎదుర్కొనేందుకు ఎలాంటి సన్నద్ధ చర్యలు తీసుకుంటున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనికి సుమన్ స్పందిస్తూ.. థర్డ్వేవ్ను ఎదుర్కొనేందుకు సర్వం సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన పీడియాట్రిక్ టాస్క్ఫోర్స్ ముఖ్యమంత్రికి ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలుంటాయని చెప్పారు. డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్ సిబ్బందితోసహా దాదాపు 38 వేల మంది అదనపు సిబ్బందిని నియమించామని, ఈ విషయంలో ఇప్పటికే కోర్టు ముందు మెమో కూడా దాఖలు చేశామని సుమన్ చెప్పారు. ధర్మాసనం స్పందిస్తూ డాక్టర్లు, నర్సుల నియామకాలు చేపట్టాలని, పారామెడికల్ సిబ్బంది భర్తీకి చర్యలు తీసుకో వాలని ఆదేశించింది. ఈ విషయంలో తీసుకున్న చర్యలను వివరిస్తూ మెమో దాఖలు చేయాలంది. ఎంబీబీఎస్, నర్సింగ్, పారామెడికల్ కోర్సులు పూర్తిచేసి పీజీ ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారి సేవల్ని కూడా ఈ విపత్కర పరిస్థితుల్లో ఉపయోగించుకోవాలని పేర్కొంది. -
తగినన్ని ఇంజక్షన్లు కేటాయించండి
సాక్షి, అమరావతి: బ్లాక్ ఫంగస్ కేసులు అధికంగా ఉన్న చోట.. అందుకు అనుగుణంగా యాంఫోటెరిసిన్ ఇంజక్షన్లు కూడా కేటాయించాలని కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. ఏపీలో నమోదైన 1,400 బ్లాక్ ఫంగస్ కేసులను దృష్టిలో పెట్టుకుని.. ఇంజక్షన్లు కూడా తగినన్ని కేటాయించాలని సూచించింది. ఈ విషయంలో తమ వైఖరి ఏమిటో చెప్పాలని కేంద్రాన్ని ఆదేశించింది. అలాగే వివిధ రాష్ట్రాలకు చేసిన యాంఫోటెరిసిన్ ఇంజక్షన్ల కేటాయింపు వివరాలను కూడా తమ ముందుంచాలని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ కొంగర విజయలక్ష్మి, జస్టిస్ దొనడి రమేశ్లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో పలువురు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై గత కొన్ని వారాలుగా విచారణ జరుపుతూ వస్తున్న ధర్మాసనం.. శుక్రవారం వాటిని మరోసారి విచారించింది. ఈ సందర్భంగా బ్లాక్ ఫంగస్ ఇంజక్షన్ల లభ్యత, కేటాయింపుల వివరాలను కేంద్ర ప్రభుత్వం మెమో రూపంలో ధర్మాసనం ముందుంచింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది చింతల సుమన్ స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వం ఏపీకి చేసే కేటాయింపుల గురించి మెమోలో ప్రస్తావించలేదన్నారు. బ్లాక్ ఫంగస్ బాధితులకు 21 రోజుల కోర్సు ఇవ్వాల్సి ఉంటుందని.. తగినన్ని యాంఫోటెరిసిన్ ఇంజెక్షన్లు లేకపోవడంతో ప్రత్యామ్నాయ మందులు వాడాల్సి వస్తోందని వివరించారు. కేంద్రం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ఎన్.హరినాథ్ స్పందిస్తూ.. 9.5 లక్షల ఇంజక్షన్ల దిగుమతి కోసం అమెరికాకు ఆర్డర్లు ఇచ్చినట్లు చెప్పారు. ఒక్కసారిగా డిమాండ్ పెరగడంతో.. కొరత ఏర్పడిందన్నారు. అనంతరం విచారణను ధర్మాసనం 7వ తేదీకి వాయిదా వేసింది. -
డిమాండ్ కొండంత.. ఉత్పత్తి గోరంత..
సాక్షి, అమరావతి: కరోనాను జయించి బయటపడిన వారిలో కొందరిపై బ్లాక్ ఫంగస్ పంజా విసురుతోంది. మధుమేహవ్యాధి నియంత్రణ లేని, అతిగా యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్ వినియోగించిన వారిలో విస్తరిస్తోంది. ఇప్పటికే దేశంలో 11,717 మంది బ్లాక్ ఫంగస్ బారిన పడ్డారు. చికిత్సలో ఒక్కొక్కరికి 100 చొప్పున యాంఫోటెరిసిన్–బి ఇంజక్షన్లు అవసరం. అంటే.. ఇప్పుడు వ్యాధిబారిన పడినవారికే 11.71 లక్షల ఇంజక్షన్లు కావాలి. ప్రస్తుతం దేశంలో 5 సంస్థలు నెలకు 1,63,747 ఇంజక్షన్లను మాత్రమే ఉత్పత్తి చేస్తున్నాయి. మరో 5 సంస్థలకు వాటిని ఉత్పత్తి చేసేందుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చింది. ఈ 10 సంస్థలు జూన్ నాటికి నెలకు 2,55,114 వయల్స్ మాత్రమే ఉత్పత్తి చేయగలవు. విదేశాల నుంచి తొమ్మిది లక్షల ఇంజక్షన్లను దిగుమతి చేసుకోవడానికి కేంద్రం సిద్ధమైంది. ఇందులో జూన్కు 3.15 లక్షల వయల్స్ వస్తాయని చెబుతోంది. ఈ లెక్కన జూన్ నాటికి నెలకు 5.70 లక్షల వయల్స్ మాత్రమే అందుబాటులోకి వస్తాయి. ఇప్పటికే బ్లాక్ ఫంగస్ వ్యాధి బారినపడిన వారి చికిత్సకే ఇవి చాలవని స్పష్టమవుతోంది. నానాటికీ బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతుండటంతో.. ఆ వ్యాధి చికిత్సలో వాడే కీలకమైన యాంఫోటెరిసిన్–బి ఇంజెక్షన్ల కొరత తీవ్రంగా మారుతుందని వైద్యనిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఇదే అదునుగా దోపిడీదారులు.. ఈ ఇంజెక్షన్లను దారిమళ్లించి బ్లాక్ మార్కెట్లో 6 నుంచి 10 రెట్లు అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 18 రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగస్ కేసులు దేశవ్యాప్తంగా బుధవారం నాటికి 18 రాష్ట్రాల్లో 11,717 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి. ఇందులో గుజరాత్లో అత్యధికంగా 2,859 కేసులు నమోదవగా.. కర్ణాటకలో 2,770 కేసులు బయటపడ్డాయి. కర్ణాటక, ఢిల్లీ, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగస్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ వ్యాధికి చికిత్సలో ప్రధానంగా యాంపోటెరిసిన్–బి ఇంజక్షన్లు ఇస్తారు. వ్యాధి తీవ్రతను బట్టి రోగికి రోజుకు 3, 4 డోసుల చొప్పున కొన్ని వారాలపాటు ఇవ్వాల్సి ఉంటుంది. వివిధ ఫంగస్ వ్యాధుల చికిత్సలోను రెండు దశాబ్దాలుగా ఈ ఇంజక్షన్ను ఉపయోగిస్తున్నారు. దేశంలో భారత్ సీరమ్స్ అండ్ వ్యాక్సిన్స్, బీడీఆర్ ఫార్మాస్యూటికల్స్, సన్ ఫార్మా, సిప్లా, లైఫ్ కేర్ ఇన్నొవేషన్స్ సంస్థలు మాత్రమే ఈ ఇంజక్షన్లను ఉత్పత్తి చేస్తున్నాయి. గతంలో వీటి తయారీలో ఏడాదికి 100 నుంచి 150 కిలోల లిపిడ్లు (ముడిపదార్థం) వరకు అవసరమయ్యేవి. ఈ ఫంగస్ కేసులు కనిష్ఠస్థాయిలో నమోదవడం వల్ల ఆ ఇంజెక్షన్లకు కొరత ఉండేది కాదు. కానీ.. 2 నెలలుగా బ్లాక్ ఫంగస్ కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో ఈ ఇంజక్షన్లకు డిమాండ్ పెరిగింది. దీంతో ఉత్పత్తి పెంచారు. ప్రస్తుత డిమాండ్ మేరకు ఇంజక్షన్ల ఉత్పత్తికి ఏడాదికి 1,000 కిలోల లిపిడ్లు అవసరం. కానీ.. ప్రపంచంలో లిపిడ్ల ఉత్పత్తి సామర్థ్యం తక్కువగా ఉండటం వల్ల వాటిని దిగుమతి చేసుకోవడం కష్టంగా మారింది. వైద్యనిపుణుల్లోను ఆందోళన బ్లాక్ ఫంగస్ చికిత్స కోసం కేంద్రం 9 లక్షల యాంపోటెరిసిన్–బి ఇంజక్షన్లను దిగుమతి చేసుకుంటోంది. ఇందులో 50 వేల వయల్స్ను దిగుమతి చేసుకుని.. మే 21 నుంచి 24 మధ్యన 43 వేల వయల్స్ను రాష్ట్రాలకు అందజేసింది. ఓ వైపు దిగుమతి చేసుకుంటూనే ఉత్పత్తి సామర్థ్యం పెంచడం ద్వారా డిమాండ్ మేరకు ఇంజక్షన్లను అందుబాటులోకి ఉంచడానికి చర్యలు చేపట్టామని కేంద్రం చెబుతోంది. ఈ క్రమంలో నాట్కో ఫార్మాస్యూటికల్స్, ఆలెంబిక్ ఫార్మాస్యూటికల్స్, గుపిక్ బయోసైన్సెస్, ఎమెక్యూర్ ఫార్మాస్యూటికల్స్, లిక్య సంస్థలకు ఆ ఇంజక్షన్ల ఉత్పత్తికి అనుమతి ఇచ్చింది. ఈ 10 సంస్థల ద్వారా దేశీయంగా జూన్ నాటికి 2,55,114 వయల్స్ అందుబాటులోకి వస్తాయి. జూన్లో మిలాన్ ల్యాబ్స్ ద్వారా 3.15 లక్షల వయల్స్ దిగుమతి చేసుకుంటామని కేంద్రం చెబుతోంది. వీటితో కలిపి జూన్ నాటికి 5,70,114 ఇంజక్షన్లు అందుబాటులోకి వస్తాయని కేంద్రం ప్రకటించింది. కానీ.. ఈ ఇంజక్షన్లు ఇప్పటికే బ్లాక్ ఫంగస్ బారిన పడినవారికే సరిపోవని.. ఇకపై నమోదయ్యే కేసుల మాటేమిటని వైద్యనిపుణులు ఆందోళన చెందుతున్నారు. సకాలంలో బ్లాక్ ఫంగస్ వ్యాధిని గుర్తించి.. యాంపోటెరిసిన్–బి ఇంజక్షన్లను వేయకపోతే మరణాల సంఖ్య భారీగా పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
రెమ్డెసివిర్ మాఫియా ముఠా గుట్టు రట్టు
ఏలూరు టౌన్: కోవిడ్ బాధితుల అత్యవసర వైద్యానికి వినియోగిస్తున్న రెమ్డెసివిర్ ఇంజెక్షన్లను పక్కదారి పట్టిస్తున్న మరో ముఠాను ఏలూరు పోలీసులు పట్టుకున్నారు. ఇప్పటికే నాలుగు ముఠాలను అరెస్టు చేయగా తాజాగా ఏలూరులోని ఆశ్రం కోవిడ్ ఆస్పత్రికి చెందిన 10 మంది సిబ్బందిని బుధవారం అరెస్టు చేశారు. ఏలూరు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఎస్పీ కె.నారాయణనాయక్ బుధవారం వివరాలు వెల్లడించారు. ఏలూరు ఆశ్రం కోవిడ్ హాస్పిటల్లో ముగ్గురు స్టాఫ్ నర్సులు, నలుగురు టెక్నీషియన్లు, ముగ్గురు సిబ్బంది ముఠాగా ఏర్పడి రెమ్డెసివిర్ ఇంజెక్షన్లను దారి మళ్లిస్తున్నారు. బయట మార్కెట్లో ఒక్కో ఇంజెక్షన్ను రూ.15 వేలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ కేసులో ఏలూరు కొత్తపేట నూకాలమ్మ గుడి ప్రాంతానికి చెందిన స్టాఫ్నర్స్ వేల్పూరి రేఖాదేవి, పెదవేగికి చెందిన స్టాఫ్నర్స్ గారపాటి సులోచన, దెందులూరుకు చెందిన స్టాఫ్నర్స్ చిగురుపల్లి అరుణ, ఏలూరు వెంకటాపురం చెంచుకాలనీకి చెందిన వార్డ్బాయ్ నకినాల రమేష్, ఏలూరు తంగెళ్లమూడి బీడీ కాలనీకి చెందిన డయాలసిస్ టెక్నీషియన్ గూడపాటి రాజేష్, ఏలూరు వెంకటాపురం రామానగర్ కాలనీకి చెందిన డయాలసిస్ టెక్నీషియన్ కెల్లా పూర్ణచంద్రరావు, ఏలూరు జాలిపూడికి చెందిన డయాలసిస్ టెక్నీషియన్ డొల్ల సుధాకర్, ఏలూరు తంగెళ్లమూడికి చెందిన కార్డియాలజీ టెక్నీషియన్ గూడపాటి సురేష్, ఏలూరు కంకణాలవారి వీధికి చెందిన సెక్యూరిటీ గార్డ్ కడగాల అనురాధ, ఏలూరు పవర్పేట గంగానమ్మగుడి ప్రాంతానికి చెందిన శీలవలస రమణను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 27 రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు, రెమ్డెసివిర్ ఖాళీ వయల్స్ 15, రూ.1.45 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
ఏలూరులో ‘రెమ్డెసివిర్’ ముఠా గుట్టురట్టు
ఏలూరు టౌన్: ప్రభుత్వాస్పత్రి నుంచి రెమ్డెసివిర్ ఇంజక్షన్లు దొంగిలించి.. బయట అధిక ధరలకు విక్రయిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఏలూరులోని జిల్లా ప్రభుత్వాస్పత్రిలో స్టాఫ్ నర్సులుగా పనిచేస్తున్న లావణ్య, రాయల వెంకటలక్ష్మితో పాటు మరో 8 మందిని అరెస్టు చేశారు. వారి నుంచి 13 రెమ్డెసివిర్ ఇంజక్షన్లు, రూ.40 వేల నగదు, మూడు బైక్లను స్వాధీనం చేసుకున్నారు. ఏలూరును కేంద్రంగా చేసుకున్న మూడు ముఠాలు.. కరోనా బాధితులకు అవసరమైన రెమ్డెసివిర్ ఇంజక్షన్లను భారీ ధరలకు విక్రయిస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో డీఎస్పీ దిలీప్కిరణ్ నేతృత్వంలో టూటౌన్ సీఐ ఆదిప్రసాద్ బృందం రంగంలోకి దిగింది. పక్కా ఆధారాలతో ఏలూరు జీజీహెచ్లో పనిచేసే స్టాఫ్ నర్సులు లావణ్య, రాయల వెంకటలక్ష్మి, ఎంఎన్వో బొమ్మకంటి రవి బ్రహ్మయ్య, గోగులమూడి అశోక్తో పాటు ఏలూరు కొత్తపేటకు చెందిన విష్ణుసాయికుమార్, కృష్ణా జిల్లా కపిలేశ్వరపురానికి చెందిన రేడియాలజిస్ట్ ఏకాంబరేశ్వర అలియాస్ బాబి, విజయవాడ సన్రైజ్ ఆస్పత్రిలోని కార్డియాలజీ టెక్నీషియన్ గుమ్మల సాయిబాబు, ఏలూరు సత్రంపాడుకు చెందిన గండేపల్లి సుబ్బారావు, గ్లోబల్ మెడికల్స్లో పనిచేసే నారాయణ సాయి మోహన్, సూర్య మెడికల్స్లో పనిచేసే ముక్కాల సుధీర్కుమార్లను పోలీసులు అరెస్టు చేశారు. మరో ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. -
‘రెమ్డెసివిర్’ల బ్లాక్మార్కెట్పై నిఘా
సాక్షి, అమరావతి: రెమ్డెసివిర్ ఇంజెక్షన్ల బ్లాక్ మార్కెట్పై రాష్ట్ర ప్రభుత్వం మరింత నిఘా పెంచింది. తమకు వస్తున్న ఫిర్యాదులపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, ఔషధ నియంత్రణ శాఖ, వైద్య ఆరోగ్య శాఖలు ఎప్పటికప్పుడు దాడులు నిర్వహిస్తూ అక్రమాలకు అడ్డుకట్ట వేస్తున్నాయి. ఈ తనిఖీల్లో పలు విషయాలు బయటపడ్డాయని అధికారులు పేర్కొన్నారు. పలుచోట్ల ప్రభుత్వాస్పత్రుల్లో పనిచేస్తున్న కొందరు కిందిస్థాయి సిబ్బందే రెమ్డెసివిర్లు ఎత్తుకెళ్లి.. ప్రైవేటు మెడికల్ షాపులకు అమ్ముతున్నట్టు తేలిందన్నారు. అనంతపురం జిల్లాలో 16 రెమ్డెసివిర్ ఇంజెక్షన్లను పెద్దాసుపత్రిలోని ఇద్దరు సిబ్బంది తీసుకెళ్లి.. రెండు మెడికల్ షాపులకు విక్రయించగా అధికారులు పట్టుకున్నారు. గుంటూరులోనూ ఆస్పత్రి సిబ్బంది బయట అమ్ముతుండగా అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాస్పత్రుల్లోని అన్ని వార్డుల్లో నిఘా పెంచినట్టు ఔషధ నియంత్రణ శాఖ పేర్కొంది. కొందరు ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు సిబ్బంది ఈ చర్యలకు పాల్పడుతున్నట్టు అధికారుల ద్వారా తెలిసింది. ఖాళీ బాటిళ్లు సేకరించి సెలైన్ నింపి.. మార్కెట్లోకి నకిలీ రెమ్డెసివిర్లు కూడా వచ్చినట్టు ఔషధ నియంత్రణ శాఖకు సమాచారం అందింది. దీనిపై అధికారులు విచారణ జరుపుతున్నారు. ప్రభుత్వ లేదా ప్రైవేటు ఆస్పత్రుల్లో వాడిన ఒరిజినల్ రెమ్డెసివిర్ ఇంజెక్షన్ల ఖాళీ బాటిళ్లను సేకరించి.. మూతను గమ్తో అతికించి తిరిగి విక్రయిస్తున్నట్లు తెలిసింది. ఇందులో సెలైన్ లేదా డిస్టిల్డ్ వాటర్ నింపుతున్నట్టు సమాచారం. వీటిని స్టాఫ్ నర్సులు గానీ, డాక్టర్లు గానీ కొద్దిగా పరిశీలిస్తే.. నకిలీవో, ఒరిజినల్వో తెలుసుకోవచ్చని ఔషధ నియంత్రణ శాఖ తెలిపింది. ఒరిజినల్ ఇంజెక్షన్కు అయితే అల్యూమినియంతో మెషిన్లో చేసిన క్లోజ్డ్ ప్యాకింగ్ ఉంటుందని, నకిలీకైతే గమ్తో అతికించినట్టు కనిపిస్తుందని చెప్పారు. ఇంజెక్షన్లు వేసే నర్సులు, వైద్యులు వీటిపై అప్రమత్తంగా ఉండాలని డ్రగ్ కంట్రోల్ విభాగం అధికారులు సూచించారు. ప్రతి ఆస్పత్రిపైనా నిఘాపెట్టాం ప్రతి ఆస్పత్రిపైనా, మెడికల్ షాపుపైనా నిఘా పెట్టాం. రెమ్డెసివిర్లను బ్లాక్మార్కెట్కు తరలించినా.. అడ్డదారిలో వాటిని షాపులు కొన్నట్లు వెల్లడైనా తక్షణమే లైసెన్సులు రద్దు చేస్తాం. నిందితులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటాం. 104కు ఫిర్యాదు చేసినా లేదా డ్రగ్ కంట్రోల్ విభాగానికి ఫిర్యాదు చేసినా తక్షణమే చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. – రవిశంకర్ నారాయణ్, డైరెక్టర్ జనరల్, ఔషధ నియంత్రణ శాఖ -
రెమ్డెసివిర్ తయారీకి రెడ్డీస్ ల్యాబ్కు అనుమతి
అగనంపూడి (గాజువాక): దువ్వాడ వీఎస్ఈజెడ్ ఆవరణంలోని రెడ్డీస్ ల్యాబ్లో రెమ్డెసివిర్ ఇంజక్షన్ల తయారీ యూనిట్ ఏర్పాటుకు అనుమతులు మం జూరయ్యాయి. ఈ మేరకు దువ్వాడ వీఎస్ఈజెడ్ పరిపాలనా భవనంలో నిర్వహించిన యూనిట్ అప్రూవల్ కమిటీ (యూఏసీ) సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. యూఏసీ చైర్మన్, వీఎస్ఈజెడ్ జోనల్ డెవలప్మెంట్ కమిషనర్ ఆవుల రామ్మోహన్రెడ్డి మాట్లాడుతూ రెడ్డీస్ ల్యాబ్తోపాటు మరో సంస్థ ఫ్ట్రాక్సీ దరఖాస్తు చేశాయని, ముందుగా రెడ్డీస్ ల్యాబ్కు అనుమతిచ్చామని తెలిపారు. రెడ్డీస్ ల్యాబ్ జూన్ నాటికి ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేస్తుందన్నారు. నెలకు వంద మిల్లీ లీటర్ల సామర్థ్యంతో 3.5 లక్షల బాటిళ్లు, 5 వందల మిల్లీలీటర్ల సామర్థ్యంతో 7 లక్షల ఇంజక్షన్లు తయారు చేసేలా యూనిట్ను సిద్ధం చేస్తున్నట్టు రెడ్డీస్ ల్యాబ్ హెడ్ మీనన్ చెప్పారని తెలిపారు. ఇప్పటికే నక్కపల్లి సెజ్లోని హెట్రో డ్రగ్ ద్వారా రెమ్డెసివిర్ ఇంజక్షన్లు తయారు చేస్తున్నారని, అలాగే ఏపీసెజ్లోని లారస్ కంపెనీ 38.3 మిలియన్ హెచ్సీక్యూ టాబ్లెట్లను అమెరికా, దక్షిణాఫ్రికా, సింగపూర్, కెనడా, బెల్జియమ్, మయన్మార్ దేశాలకు ఎగుమతి చేస్తున్నాయన్నారు. కోవిడ్ ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా నక్కపల్లిలోని ఆనర్ ల్యాబ్కు వంద కేజీల మాల్నూపిరవీర్ మందుల తయారీకి అనుమతులిచ్చినట్లు ఆయన తెలిపారు. -
రెమ్డెసివిర్ విక్రయ ముఠాల అరెస్టు
తెనాలి రూరల్/నరసరావు పేట రూరల్/మంగళగిరి: కరోనా చికిత్స కోసం ఉపయోగించే రెమ్డెసివిర్ ఇంజక్షన్లను అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్న మూడు ముఠాలను గుంటూరు రూరల్ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. నరసరావుపేట, తెనాలి, గుంటూరు పోలీసులు మొత్తం 11మంది నిందితులను శనివారం అదుపులోకి తీసుకున్నారు. గుంటూరులోని రూరల్ ఎస్పీ కార్యాలయంలో విలేకరులకు అదనపు ఎస్పీ(క్రైమ్స్) ఎన్వీఎస్ మూర్తి వివరాలు వెల్లడించారు. రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ ఆదేశాల మేరకు తెనాలి, నరసరావుపేట, గుంటూరు పోలీసులు డెకాయ్ ఆపరేషన్ నిర్వహించారు. నరసరావుపేట డీఎస్పీ విజయభాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహించిన డెకాయ్ ఆపరేషన్లో.. ఒక్కో ఇంజక్షన్ రూ.40 వేల చొప్పున విక్రయిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకోగా, మరో నిందితుడు, 108లో పనిచేసే శివ పరారీలో ఉన్నాడు. అలాగే తెనాలి డీఎస్పీ డాక్టర్ కె.స్రవంతిరాయ్ నేతృత్వంలో నిర్వహించిన డెకాయ్లో ఆరు ఇంజక్షన్లను రూ.2.40 లక్షలకు విక్రయిస్తూ ఆరుగురు నిందితులు పట్టుబడ్డారు. అదేవిధంగా గుంటూరు జిల్లా మంగళగిరి ఎన్ఆర్ఐ ఆస్పత్రిలోని మెడికల్ షాపులో పనిచేస్తున్న ఓ యువకుడు, స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఎదుట మెడికల్ షాపు నడుపుతున్న మరోవ్యక్తితో కలిసి బ్లాక్లో రెమ్డెసివిర్ ఇంజక్షన్లను విక్రయిస్తున్నాడు. గుంటూరు పోలీసులు ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. -
ప్రైవేటు ఆస్పత్రుల కొత్త ఎత్తుగడ
సాక్షి, అమరావతి: ప్రభుత్వం తీసుకుంటున్న నియంత్రణ చర్యలతో రెమ్డెసివిర్ ఇంజక్షన్లపై కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు కొత్త ఎత్తుగడ వేశాయి. ఇంజక్షన్ల కొరత సృష్టించేందుకు, ఆ నెపాన్ని ప్రభుత్వంపై వేయడానికి ప్రయత్నిస్తున్నాయి. దీనిలో భాగంగా మందుల డిపోల వద్ద ఇంజక్షన్లు కొనడం మానేశాయి. మందుల డిపోల వద్ద గత రెండు రోజుల కొనుగోళ్లలో 30 శాతం తగ్గుదల చూస్తే ఇది స్పష్టమవుతోంది. కాగా, ఇన్నాళ్లూ మందుల డిపోల వద్దకు వెళ్లి ప్రైవేట్ ఆస్పత్రులు ఆ ఇంజక్షన్లు తెచ్చుకునేవి. బ్లాక్మార్కెట్ నియంత్రణకు రంగంలోకి దిగిన ఔషధ నియంత్రణ శాఖ.. నిబంధనలు కఠినం చేసింది. అలాగే ఆస్పత్రులు కొని తెచ్చుకున్న ఇంజక్షన్లు సరిపోకపోతే.. లోటు ఉన్న ఇంజక్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీంతో రెమ్డెసివిర్ కొరత నియంత్రణలోకి వచ్చింది. అయితే ప్రభుత్వం లోటును భర్తీ చేస్తుంటే.. కొన్ని ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు డిపోల నుంచి వారికి కావాల్సినవి కూడా కొనడం మానేశాయి. ఇలా చేసి కొరత చూపుతున్నాయని, బ్లాక్మార్కెట్కు అవకాశం ఉంటే డిపోల దగ్గర కొనేవారు అనే విమర్శలు వస్తున్నాయి. ఇది సరైన పద్ధతి కాదు ప్రైవేటు ఆస్పత్రులకు కొంత సాయం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం భాగస్వామ్యం అందిస్తోంది. బ్లాక్మార్కెట్ను నిలువరించేసరికి డిపోల దగ్గర కొనడం మానేశారు. ఇది సరైన పద్ధతి కాదు. బాగా నియంత్రణలోకి వచ్చిన పరిస్థితుల్లో ఇలాంటి ధోరణి వల్ల ప్రజలకు నష్టం జరుగుతుంది. –రవిశంకర్ నారాయణ్, డైరెక్టర్ జనరల్, ఔషధ నియంత్రణశాఖ -
రెమ్డెసివిర్ ఇంజక్షన్లు విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్
భవానీపురం (విజయవాడ పశ్చిమ): బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు రెమ్డెసివిర్ ఇంజక్షన్లను విక్రయిస్తున్న వ్యక్తిని విజయవాడ భవానీపురం పోలీసులు గురువారం అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. పశ్చిమ ఏసీపీ కార్యాలయం వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా బరుసుపాడు మండలం ఎర్రబాలెంకు చెందిన బట్టు వెంకట సుబ్బారావు (33) కుటుంబం జీవనోపాధి నిమిత్తం విజయవాడలో స్థిరపడింది. తండ్రి ఆంజనేయులు ముఠా పనిచేస్తుండగా సుబ్బారావు ప్రస్తుతం ప్రైవేట్గా లా చేస్తున్నాడు. సుబ్బారావుకి ఆర్థిక ఇబ్బందులు ఉండటంతో ‘పీఎస్ టు ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్’ అనే నకిలీ ఐడీ కార్డ్ తయారు చేసి ప్రజలను మోసం చేయడం మొదలుపెట్టాడు. ఇందులో భాగంగా నాలుగు సిమ్లు తీసుకుని.. ట్రూకాలర్ యాప్లో బీవీఎస్ రావు, సీఎంవో ఆఫీస్, బీవీఎస్ రావు సీఎం ఆఫీస్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్, పీఎస్ టు ప్రిన్సిపల్ సెక్రటరీ టు సీఎం, పీఎస్ టు కలెక్టర్ పేర్లతో నమోదు చేశాడు. ఆయా ఫోన్ నంబర్లతో మండల స్థాయి అధికారులతో మాట్లాడి ప్రజలకు కావాల్సిన పనులు చేయించి.. వారి వద్ద పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేసేవాడు. అలాగే జర్నలిస్ట్ సంఘాలు, ఉన్నతాధికారులు ప్రచురించిన డైరీల్లోని ఫోన్ నంబర్లకు కూడా ఐయామ్ పీఎస్ టు ప్రిన్సిపల్ సెక్రటరీ టు సీఎం అనే సందేశాలను పంపి వారితో పనులు చేయించుకుని డబ్బు గడించేవాడు. 20 రోజుల నుంచి చాలామంది సుబ్బారావుకు ఫోన్ చేసి రెమ్డెసివిర్ ఇంజక్షన్ కావాలని, డబ్బు ఎంతైనా ఇస్తామని చెప్పడంతో జిల్లాలో ఉన్న డ్రగ్ ఇన్స్పెక్టర్లు, డ్రగ్ కంట్రోలర్స్కు ఫోన్చేసి ఇంజక్షన్లు కావాలని చెప్పాడు. ఇలా అందిన ఇంజక్షన్లను కోవిడ్ పేషెంట్లకు అధిక ధరలకు అమ్మి లక్షల్లో డబ్బు వసూలు చేశాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఇంజక్షన్ కావాలని ఫోన్చేసి అతడిని వలపన్ని పట్టుకున్నారు. అతడి వద్ద నాలుగు రెమ్డెసివిర్ ఇంజక్షన్లు, రూ.70వేల నగదు, మోటార్ సైకిల్, మూడు సెల్ఫోన్లు, నకిలీ ఐడీ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. -
ఇంజక్షన్లు విక్రయిస్తున్న నలుగురి అరెస్ట్
విజయవాడ స్పోర్ట్స్: కరోనా చికిత్సకు ఉపయోగించే రెమ్డెసివిర్ ఇంజక్షన్లను అమ్ముతున్న ఇద్దరిని, నకిలీ రెమ్డిసివిర్ను విక్రయిస్తున్న ఇద్దరిని విజయవాడ టాస్క్ఫోర్స్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన వివరాలను నగర పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు వెల్లడించారు. సూర్యారావుపేటలోని యూనియన్ ఆస్పత్రి కోవిడ్ వార్డులో టెక్నీషియన్ షేక్ నజీర్బాషా, స్టాఫ్ నర్స్ పుష్పలత ఆస్పత్రిలో మిగిలిన రెమ్డెసివిర్ ఇంజక్షన్లను చిట్టినగర్ మిల్క్ ప్రాజెక్ట్ వద్ద విక్రయిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. వీరు పనిచేస్తున్న ఆస్పత్రిలో తెనాలికి చెందిన వ్యక్తి కోవిడ్ చికిత్స పొందుతూ మృతిచెందాడని, అతడి చికిత్సకు తీసుకురాగా మిగిలిన మూడు ఇంజక్షన్లను అక్రమమార్గంలో రూ.1.10 లక్షలకు అమ్ముతుండగా పట్టుకున్నట్లు చెప్పారు. వీరిని విచారణ కోసం టూ టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించినట్లు తెలిపారు. నిందితుడు షేక్ నజీర్బాషా అజిత్సింగ్నగర్లో ఆర్ఎంపీ వైద్యుడుగా పనిచేస్తున్నట్లు చెప్పారు. నకిలీ ఇంజక్షన్లు కొని అమ్ముతున్న వైద్యుడు రెమ్డెసివిర్ను పోలిన ఇంజక్షన్ను సితార సెంటర్ వద్ద విక్రయిస్తున్న డాక్టర్ ఆత్మకూరి భానుప్రతాప్, పసుపులేటి వీరబాబులను అరెస్టు చేసినట్లు సీపీ తెలిపారు. ఈ కేసులో మరో నిందితుడు పవన్ను అరెస్ట్ చేయాల్సి ఉందన్నారు. హైదరాబాద్లో ఉండే పవన్ నుంచి మంగళగిరి ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో డ్యూటీ డాక్టర్ భానుప్రతాప్ నాలుగు నకిలీ రెమ్డెసివిర్ ఇంజక్షన్లను రూ.52 వేలకు కొనుగోలు చేసి, విద్యాధరపురానికి చెందిన మెడికల్ రిప్రజెంటేటివ్ వీరబాబుకు రూ.1.08 లక్షలకు విక్రయించాడని చెప్పారు. వీరబాబు ఈ మందులను సితార సెంటర్ వద్ద రూ.1.44 లక్షలకు విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. నిందితులను భవానీపురం పీఎస్కు తరలించినట్లు చెప్పారు. నిందితులను అరెస్ట్ చేసిన టాస్క్ఫోర్స్ ఏడీసీపీ కె.శ్రీనివాసరావు, ఏసీపీలు జి.వి.రమణమూర్తి, వి.ఎస్.ఎన్.వర్మ, సీఐ కృష్ణమోహన్లను సీపీ అభినందించారు. -
బ్లాక్లో రెమిడెసివర్ ఇంజక్షన్లు: ఏడుగురి అరెస్ట్
సాక్షి, విజయవాడ: కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కొవిడ్ రోగులకు చికిత్సలో భాగంగా ఇచ్చే రెమ్డెసివిర్ ఇంజక్షన్లకు డిమాండ్ పెరగడంతో కొంతమంది అక్రమార్కులు ఇదే అదునుగా క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. ఇంజక్షన్లు బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. విజయవాడలో రెమిడెసివర్ను బ్లాక్లో విక్రయిస్తున్న ముఠాను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. కాలం చెల్లిన ఇంజక్షన్లను విక్రయిస్తున్న ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.2.10 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చదవండి: ఉత్పత్తికి ఊపిరి: రెండు ఆక్సిజన్ ప్లాంట్లకు జవసత్వాలు అంతా మా ఇష్టం: అక్కడ అన్నీ ‘వెలగపూడి’ ఫుడ్కోర్టులే.. -
లక్షల్లో అడిగితే వేలల్లో ఇస్తారా? కేంద్రంపై ఈటల ఫైర్
సాక్షి, హైదరాబాద్: కరోనా వ్యాక్సిన్లు, మెడికల్ ఆక్సిజన్, యాంటీ వైరల్ రెమిడెసివిర్ ఇంజెక్షన్ల పంపిణీలో రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆరోపించారు. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత ఏర్పడితే అందుకు పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యతని దుయ్యబట్టారు. తెలంగాణలో కరోనా రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో 4 లక్షల రెమిడెసివిర్ ఇంజెక్షన్లు కావాలని కోరితే కేంద్రం కేవలం 21,551 ఇంజెక్షన్లు మాత్రమే ఇచ్చిందని విమర్శించారు. దీనిపై తాము నిరసన తెలుపుతున్నామన్నారు. టీకాల పంపిణీ తరహాలో రెమిడెసివిర్ ఇంజెక్షన్ల పంపిణీని కేంద్రం తన నియంత్రణలో పెట్టుకో వడం బాధాకరమన్నారు. గురువారం హైదరాబాద్లో మంత్రి ఈటల మీడియాతో మాట్లా డుతూ మహారాష్ట్ర, ఏపీ, ఛత్తీస్గఢ్లకు చెందిన రోగులు హైదరాబాద్ ఆస్పత్రుల్లో ఎక్కువగా చేరుతున్నందున ఆక్సిజన్, రెమిడెసివిర్ ఇంజెక్షన్లు ఎక్కువగా పంపాలని కేంద్ర మంత్రి హర్షవర్ధన్కు చెప్పినా స్పందించలేదన్నారు. విపత్కర సమయంలో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయంతో ముందుకు పోవాల్సింది పోయి ఇలా చేయడం బాధ కలిగిస్తోందన్నారు. రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే రెమిడెసివర్ ఇంజక్షన్లను తమకే కేటాయించాలని కోరారు. కేంద్రం రాజకీయాలను పక్కనపెట్టి రాష్ట్రానికి రెమిడెసివర్ ఇంజక్షన్లు కేటాయించాలని కేంద్ర మంత్రికి లేఖ రాస్తున్నట్లు చెప్పారు. ఆక్సిజన్ సరఫరా అంత దూరం నుంచా? తెలంగాణకు బళ్లారి, విశాఖ, ఇతర రాష్ట్రాల నుంచి ఆక్సిజన్ సరఫరా అవుతోందని, దగ్గర ఉన్న ప్లాంట్ల నుంచి కాకుండా 1,300 కి.మీ. దూరంలో ఉన్న ఒరిస్సా నుంచి కేంద్రం ఆక్సిజన్ కేటాయించిందని ఈటల విమర్శించారు. అలాగే చెన్నై నుంచి 20 టన్నులు, పెరంబదూర్ నుంచి 35 టన్నుల ఆక్సిజన్ను కేంద్రం కేటాయించినా తమిళనాడు ప్రభుత్వం ఆ మేరకు కోటా ఇవ్వడం లేదన్నారు. తమిళనాడు తరహాలో తాము కూడా వ్యవహరిస్తే ఎలా ఉంటుందని ఈటల ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆక్సిజన్ సిలిండర్లకు కొంత కొరత ఉందన్న ఈటల... ప్రభుత్వ ఆస్పత్రుల్లో మాత్రం ఆక్సిజన్ కొరత లేదని చెప్పారు. రాష్ట్రానికి నిత్యం 384 టన్నుల ఆక్సిజన్ అవసరంకాగా ప్రస్తుతం 270 టన్నుల మేర ఆక్సిజన్ అందుతోందన్నారు. గాంధీలో 600 మంది రోగులు ఐసీయూలో... గాంధీ ఆస్పత్రిలో ప్రస్తుతం 600 మంది కరోనా రోగులు వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారని మంత్రి ఈటల చెప్పారు. ప్రైవేటు ఆస్పత్రులు కరోనా రోగుల పరిస్థితి విషమించాక ప్రభుత్వ ఆస్పత్రులకు పంపడం మానుకోవాలన్నారు. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఏపీ, కర్ణాటకలో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని, కాబట్టి పెద్ద ఎత్తున సమాయత్తం కావాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని వివరించారు. రాష్ట్రంలో రోజుకు 2 లక్షల కోవిడ్ పరీక్షలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఈటల వెల్లడించారు. తెలంగాణలోని 104 కేంద్రాల్లో రోజుకు 30 వేల ఆర్టీ–పీసీఆర్ పరీక్షలు చేస్తుండగా మిగతా కేంద్రాల్లో ర్యాపిడ్ టెస్టులు చేస్తున్నట్లు వివరించారు. ర్యాపిడ్ టెస్టులో పాజిటివ్ వచ్చి లక్షణాలు లేకుంటే హోం ఐసోలేషన్లో ఉండాలని ఆయన సూచించారు. లక్షణాల తీవ్రతను బట్టి ఆస్పత్రుల్లో చేరాలన్నారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనా చికిత్స కోసం ఏర్పాట్లు చేశామన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో 1,120 ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్సకు అనుమతిచ్చామని, ఆక్సిజన్ను బ్లాక్లో అమ్ముతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అలాంటి ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సీఎస్ ఆధ్వర్యంలోని 10 మంది ఐఏఎస్ అధికారుల బృందం నిత్యం ఆక్సిజన్ సరఫరా, రెమిడెసివర్ ఇంజక్షన్ల పంపిణీ, వ్యాక్సినేషన్ ప్రక్రియను పర్యవేక్షిస్తోందన్నారు. చదవండి: భర్తకు కరోనా.. భయంతో ఉరేసుకున్న భార్య చదవండి: కరోనా విజృంభణ ప్రధాని మోదీ కీలక నిర్ణయం -
విజిలెన్స్ దాడి: భారీ ఎత్తున రెమిడిసివర్ ఇంజక్షన్లు..
నెల్లూరు: నెల్లూరు జిల్లా పరిధిలోని పొగతోటలో రెమిడిసివర్ ఇంజక్షన్లను బ్లాక్లో అమ్ముతున్న ముఠాను విజిలెన్స్ అధికారులు దాడిచేసి పట్టుకున్నారు. ఒక హాస్పిటల్కు అనుబంధంగా ఉన్న ల్యాబ్ కేంద్రంగా ఈ దందా సాగుతున్నట్లు గుర్తించారు. వీరిని ఎలాగైనా పట్టుకోవాలని భావించిన అధికారులు సోషల్ మీడియా వేదికగా ఇంజక్షన్ కావాలని అడ్వర్టెజ్ మెంట్ ఇచ్చారు. అయితే దీనికి సదరు ముఠా స్పందించింది. ఆ ముఠా సదరు వ్యక్తికి, ఒక్కొక్క ఇంజక్షన్ను రూ. 25 వేల చోప్పున.. మూడు బాక్సులకు నాలుగున్నర లక్షలకు అమ్మేలా డీల్ కుదుర్చుకుంది. అయితే, అప్పటికే ఈ విషయం తెలిసి మాటువేసి ఉన్న విజిలెన్స్ అధికారులు వారిపై దాడిచేసి పట్టుకున్నారు. ఈ దాడిలో భారీ మొత్తంలో రెమిడిసివర్ ఇంజక్షన్ను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
రెమ్డెసివిర్ బ్లాక్మార్కెట్పై నిఘా
సాక్షి, అమరావతి/గుంటూరు మెడికల్: రాష్ట్రంలో కోవిడ్ బాధితులకు ఇచ్చే రెమ్డెసివిర్ ఇంజక్షన్ల బ్లాక్మార్కెటింగ్పై అధికారులు నిఘా పెంచారు. ఈ ఇంజక్షన్లను అక్రమంగా విక్రయిస్తున్న నలుగురిని డ్రగ్ ఇన్స్పెక్టర్లు పట్టుకున్నారు. ఈ ఇంజక్షన్ను కొందరు రూ.12 వేల నుంచి రూ.15 వేల వరకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. దీనిపై ఔషధ నియంత్రణశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా సీ అండ్ ఎఫ్, హోల్సేల్ షాపులతో పాటు, ప్రైవేటు ఆస్పత్రులపైనా నిఘా పెట్టారు. గుంటూరులో బుధవారం ఓ వ్యక్తి 6 ఇంజక్షన్లు తీసుకెళుతుండగా పట్టుకున్నారు. వాటిని సీజ్ చేసి పట్టుకున్న వ్యక్తిని విచారిస్తున్నారు. అదేరోజు గుంటూరు జిల్లా నరసరావుపేటలోని ఒక ఆస్పత్రి ఐసీయూలో రోగులకు ఇవ్వాల్సిన ఇంజక్షన్లను బయటకు తీసుకొచ్చి విక్రయిస్తున్న ముగ్గురు మేల్ నర్సింగ్ సిబ్బందిని పట్టుకున్నారు. 7 డోసుల ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసులు నమోదుచేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ రెండు ఘటనల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా డ్రగ్ ఇన్స్పెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు నిఘా పెంచారు. రెమ్డెసివిర్ ఇంజక్షన్లు కేవలం కోవిడ్ అనుమతి ఉన్న ఆస్పత్రులకు మాత్రమే పంపిణీ జరగాలని, ప్రైవేటుగా ఎవరైనా అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హోల్సేలర్లు, రిటెయిలర్లు కూడా ఇంజక్షన్ల లెక్క చెప్పాలని ఆదేశించారు. గుంటూరులో బ్లాక్ మార్కెట్లో ఇంజక్షన్ల విక్రయాల్లో వైద్యుల ప్రమేయం ఉన్నట్టు నగరంలోని వైద్యుల సంఘంలో గురువారం విస్తృతంగా చర్చ జరిగింది. ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదు ఇంజక్షన్లు బ్లాక్మార్కెట్లో అమ్మితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు. ఇవి కోవిడ్ అనుమతి ఉన్న ఆస్పత్రుల్లో మాత్రమే అమ్మాలి. కొంతమంది ఇంజక్షన్లను సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. – రవిశంకర్నారాయణ్, డైరెక్టర్ జనరల్, ఔషధ నియంత్రణశాఖ చదవండి: టీడీపీ మాజీ మంత్రి ఉమకు సీఐడీ నోటీసు ఆరోగ్యశ్రీలో ఉచితంగా గుండెమార్పిడి -
కరోనా ఇంజెక్షన్ల కలకలం
భువనేశ్వర్ : రాష్ట్రంలో కరోనా ఇంజెక్షన్ల తయారీ కలకలం రేపింది. బర్గడ్ జిల్లా భెడేన్ సమితిలోని రుసుడా గ్రామంలో కరోనా మందులు తయారు చేస్తున్నట్లు అందిన సమాచారం మేరకు ఆ మందుల తయారీ శిబిరంపై సంబల్పూర్ డ్రగ్ ఇన్స్పెక్టర్, పోలీసులు ఉమ్మడిగా దాడులు ఆకస్మికంగా చేపట్టారు. ఈ శిబిరంలో మందుల తయారీకి వినియోగిస్తున్న సామగ్రిని జప్తు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రపంచ ప్రజానీకాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి చికిత్సకు ఇంజక్షన్ ఆవిష్కరించినట్లు రుసుడా గ్రామానికి చెదిన ప్రహ్లాద్ బిసి (32) అధికారులకు తెలపడంతో ఆయన వివరణ కోరుతూ అధికారులు నోటీసులు జారీ చేశారు. (చదవండి : ఉమా భారతికి కరోనా పాజిటివ్) రెండు రకాలుగా ఇంజెక్షన్లు ఈ వ్యవహారంపట్ల ప్రహ్లాద్ బిసి స్పందించి కరోనా మహమ్మారి ప్రాణాల్ని బలిగొంటున్న తరుణంలో తాను ఈ ఇంజెక్షన్లు ఆవిష్కరించానని, ఇవి 2 రకాలుగా ఉంటాయని తెలిపాడు. ఒకటి ఎరుపు, రెండోది నీలం రంగులో ఉంటుందని చెప్పాడు. కోవిడ్–19 పాజిటివ్ ఖరారైతే ఒక ఇంజెక్షన్, మరో 2 గంటల తర్వాత మరో రంగు ఇంజెక్షన్ ఇస్తానని, ఇలా ఇచ్చిన 8 గంటల తర్వాత రోగి పూర్తిగా కోలుకుంటాడని తెలిపాడు. ఇతరులకు కరోనా సంక్రమించకుండా ఈ ఇంజెక్షన్లు దోహదపడతాయని వివరించాడు. ఈ ఇంజెక్షన్ల ఆవిష్కరణ, ప్రయోగం, వినియోగానికి సంబంధించి స్థానిక డ్రగ్ ఇన్స్పెక్టరు, రాష్ట్ర ప్రభుత్వాన్ని లిఖితపూర్వకంగా అభ్యర్థించినట్లు ప్రహ్లాద్ బిసి తెలిపాడు. కరోనా చికిత్సకు ఈ మందు చక్కగా పని చేస్తుంది. ఈ ఇంజెక్షన్ 100 శాతం విజయవంతమైన ఔషధంగా పేర్కొన్నాడు. దీని ప్రయోగం కోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని వ్యక్తిగతంగా అభ్యర్థించడంతో ఆయన అభ్యర్థన పట్ల స్పందించిన డ్రగ్ ఇన్స్పెక్టర్, మరో ఇద్దరు ప్రభుత్వ అధికారులు గ్రామానికి వచ్చి మందుల తయారీని పర్యవేక్షించారు. భువనేశ్వర్ ప్రయోగ శాలకు పరీక్షల కోసం నమూనాల్ని సిఫారసు చేశారు. ఏ శిక్షకైనా సిద్ధం ఈ మందు నకిలీ కాదు. కరోనా రోగుల ప్రాణాల్ని రక్షిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజానీకాన్ని కలవరపరుస్తున్న కరోనా రోగులకు ఉన్నత చికిత్స అందజేస్తుందని ప్రహ్లాద్ బిసి తెలిపాడు. మందు నకిలీ లేదా హానికరం అని తేలితే ఎటువంటి శిక్షనైనా అనుభవించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. ఈ వ్యవహారంలో పోలీసులు తనను అరెస్టు చేయనట్లు ప్రహ్లాద్ బిసి స్పష్టం చేశాడు. -
తూచ్... తూచ్: ట్రంప్
వాషింగ్టన్: కోవిడ్ –19 రోగులకు వ్యాధి నయం కావాలంటే క్రిమిసంహారక మందులు శరీరంలోకి ఎక్కించడమే మెరుగైన వైద్యమంటూ అసంబద్ధ వ్యాఖ్యలు చేసి, విమర్శలపాలైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, తన వ్యాఖ్యలు వ్యంగ్యోక్తులు మాత్రమేనంటూ కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. కరోనా వైరస్ను నాశనం చేయడానికి క్రిమిసంహారక రసాయనాలు రోగుల శరీరంలోకి ఎక్కించాలనీ, అలాగే అతినీలలోహిత కిరణాలను సైతం రోగుల్లోకి చొప్పించాలని వైద్యులకు సూచిస్తూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపాయి. ట్రంప్ సొంత పార్టీనుంచి సైతం తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తాయి. -
చెట్లను చంపేశాడు
కర్ణాటక ,బనశంకరి: పచ్చని చెట్లను ఓ దుండగుడు పొట్టనబెట్టుకున్నాడు. ఐదు చెట్లకు విషపూరిత ఇంజెక్షన్ వేయడంతో చెట్లు ఎండిపోయేలా చేశాడు. రాజరాజేశ్వరినగరలోని పంచశీలనగర నివాసి నరేంద్ర అనే వ్యక్తి తన ఇంటి ముందున్న ఐదు చెట్లకు విషపూరిత సూదులు వేశాడు. అతని భవనానికి ఎదురుగా ఐదు చెట్లు ఇంటి అందానికి అడ్డుగా ఉన్నాయని వాటిని నరికివేయించడానికి యత్నించాడు. స్థానికులు దీనిని వ్యతిరేకించారు. దీంతో ఎలాగైనా చెట్లను తొలగించాలని రాత్రికి రాత్రి విషపు ఇంజెక్షన్ అందించి చెట్లు ఎండిపోయేలా చేశాడని స్థానిక నివాసుల సంఘం నాయకులు బీబీఎంపీ అటవీ విభాగానికి ఫిర్యాదు చేశారు. అధికారులు వచ్చి చెట్లను పరిశీలించగా విషపూరిత మందును ఎక్కించాడని ధ్రువీకరించారు. కట్టడం ముందుభాగంలో ఉన్న చెట్లతో తమకు అలర్జీ వస్తుందని నరేంద్ర కట్టుకథలు చెబుతున్నాడని సంఘం నాయకులు ఆరోపించారు. స్వచ్ఛమైన గాలిని అందించే చెట్ల వల్ల ఎలాంటి అలర్జీ ఏర్పడదన్నారు. చెట్లుకు విషం పెట్టిన నరేంద్ర తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
ఒక్క ఇంజెక్షన్తో రక్త కేన్సర్కు చికిత్స?
ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు ఓ అద్భుతాన్ని ఆవిష్కరించారు. కేవలం ఒకే ఒక్క ఇంజెక్షన్తో రక్త కేన్సర్కు పూర్తిస్థాయి చికిత్స అందించేందుకు డాక్టర్ కెన్ మైక్లెథ్వెయిట్ రంగం సిద్ధం చేస్తున్నారు. కార్–టీ అని పిలిచే ఒక రకమైన రోగ నిరోధక కణాలను ఆధునీకరించి శరీరంలోకి ఇంజెక్షన్ రూపంలో ఎక్కించడం ద్వారా 70 – 80 శాతం కేన్సర్ కణాలను నాశనం చేయవచ్చునని డాక్టర్ కెన్ అంటన్నారు. కేన్సర్ కణాలు శరీర రోగ నిరోధక వ్యవస్థ కళ్లుగప్పి విస్తరిస్తుందని మనకు తెలుసు. ఈ సమస్యను అధిగమించేందుకు కార్–టీ రోగనిరోధక కణాల్లో కొన్నిమార్పులు చేస్తారు. ఫలితంగా ఈ కణాలు కేన్సర్ కణాలను గుర్తిండచమే కాకుండా నాశనం కూడా చేయగలవు. నిజానికి ఈ రకమైన చికిత్స అమెరికాలో ఇప్పటికే అందుబాటులో ఉంది. కాకపోతే ఖర్చు కోట్లల్లోనే. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా శాస్త్రవేత్త కెన్ కొత్త పద్ధతి ద్వారా కార్ –టీ కణాలను ఉపయోగించారు. రక్త కేన్సర్తోపాటు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ ఉన్న టాడ్ ఓ షియా అనే 19 ఏళ్ల యువకుడిపై జరిపిన ప్రయోగంలో అద్భుతమైన ఫలితాలు వచ్చాయి. కీమోథెరపీ, ఎముక మజ్జ మార్పిడి వంటి ప్రయత్నాలు కూడా విఫలమైన తరువాత కెన్ తన చికిత్స ప్రారంభించారు. రోగి శరీరం నుంచి సేకరించిన కార్ –టీ కణాలను పరిశోధన శాలలో మార్పులు చేసి.. కేన్సర్ కణాలను గుర్తించేలా చేశారు. కేవలం రూ.ఏడు లక్షల ఖర్చుతో చేసిన ఓ ఇంజెక్షన్ నెలరోజుల్లోనే ఫలితాలు చూపడం మొదలైంది. ప్రస్తుతానికి ఇది రక్త సంబంధిత కేన్సర్లకు మాత్రమే చికిత్స అందిస్తున్నప్పటికీ భవిష్యత్తులో ఇతర కేన్సర్లకు విస్తరించే అవకాశం లేకపోలేదని అంటున్నారు డాక్టర్ కెన్. -
మత్తు ఇంజక్షన్లు విక్రయించే ముఠా గుట్టు రట్టు
విజయవాడ: విజయవాడలో గుట్టుగా సాగుతున్న మత్తు ఇంజక్షన్లు విక్రయించే ముఠాను టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఆదివారం నగరంలో పలు ప్రాంతాలకు చెందిన ఐదుగురిని అరెస్టు చేశారు. వారి నుంచి 30 ఎం.జి. పోర్ట్విన్ (మత్తు) ఇంజక్షన్లు 75, నగదు రూ.7,480, నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ఫోర్స్ పోలీసుల కథనం ప్రకారం.. బిహార్కు చెందిన విశ్వరూప్ బారిక్ (36) 13 ఏళ్ల క్రితం విజయవాడ వచ్చి, అరండల్పేటలో నివాసం ఉంటున్నాడు. తనకు పరిచయం ఉన్న అరండల్పేటకు చెందిన తంగిళ్ల హరికృష్ణతో కలిసి మత్తు ఇంజక్షన్లు ఇతర ప్రాంతాల్లో కొనుగోలు చేసి నగరంలో విక్రయాలు చేస్తున్నాడు. వారిద్దరు కాల్వగట్టుపై నివాసం ఉంటున్న కందుకుట్ల నాగమణి అనే మహిళకు ఇంజక్షన్లు విక్రయిస్తున్నారు. పోర్ట్విన్ ఇంజక్షన్ అసలు ధర రూ.5.30 కాగా నాగమణికి దీన్ని రూ.100కు విక్రయిస్తున్నారు. అదే ఇంజక్షన్ నాగమణి మారుబేరానికి రూ.200కు విక్రయిస్తోంది. నాగమణి వద్ద చిట్టినగర్కు చెందిన పిళ్లా మహేష్కుమార్, పాతరాజరాజేశ్వరీపేటకు చెందిన పైడి దీపక్ ఇంజక్షన్లు కొనుగోలు చేసి మరికొంత మంది వ్యక్తులను తీసుకువచ్చి వారితో కూడా ఇంజక్షన్లు కొనుగోలు చేయిస్తున్నారు. పోర్ట్విన్ ఇంజక్షన్ సాధారణంగా శస్త్ర చికిత్సలు చేసే సమయంలో మానసిక రోగులకు వైద్యుని పర్యవేక్షణలో వినియోగించాల్సి ఉంది. వైద్యుల అనుమతి లేకుండా మత్తు ఇంజక్షన్లు విక్రయించడం, కొనుగోలు చేయడం చట్టరీత్యా నేరం. గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న మత్తు ఇంజక్షన్ల విక్రయాలపై విజయవాడ టాస్క్ఫోర్స్ పోలీసులకు అందిన సమాచారం మేరకు నిఘా వేసి ముఠాను పట్టుకున్నారు. టాస్క్ఫోర్స్ ఏసీపీ రాజీవ్కుమార్, సీఐ ఆర్.సురేష్రెడ్డి, సిబ్బంది ఇంజక్షన్ల ముఠాను అరెస్టు చేసి సూర్యారావుపేట పోలీసులకు అప్పగించారు. -
ఇంజెక్షన్తో సైడ్ ఎఫెక్ట్సా?
నా వయసు ఇరవై రెండు సంవత్సరాలు. పిల్లలు ఇప్పుడే వద్దని అనుకుంటున్నాం. గర్భం రాకుండా ఉండడానికి కాంట్రాసెప్టివ్ ఇంజెక్షన్ అందుబాటులోకి వచ్చిందని విన్నాను. ఈ ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? – కేఆర్, నెల్లిమర్ల పిల్లలు ఇప్పుడే వద్దనుకున్నప్పుడు, కండోమ్స్, గర్భనిరోధక మాత్రలు, హార్మోన్ ఇంజెక్షన్, కాపర్–టి లేదా లూప్ వంటి సాధనాలు ఎన్నో ఉన్నాయి. హార్మోన్ ఇంజెక్షన్లో మెడ్రోక్సీప్రొజెస్టెరాన్ అసిటేట్ అనే హార్మోన్ ఉంటుంది. ఇది అండాశయం నుంచి అండం విడుదల కాకుండా చేస్తుంది. వీర్యకణాలు గర్భాశయంలోకి వెళ్లకుండా గర్భాశయ ముఖద్వారం దగ్గర మ్యూకస్ ద్రవాలను చిక్కగా చేస్తుంది. ఈ ఇంజెక్షన్ ప్రతి మూడు నెలలకొకసారి తీసుకోవలసి ఉంటుంది. ఈ ఇంజెక్షన్ తీసుకున్నప్పుడు పీరియడ్స్ క్రమం తప్పి, బ్లీడింగ్ మధ్యమధ్యలో కనిపించవచ్చు. మూడు నాలుగు ఇంజెక్షన్ల తర్వాత, పీరియడ్స్ చాలా నెలల వరకు రాకపోవచ్చు. ఇవి ఆపిన తర్వాత మరలా ప్రెగ్నెన్సీ రావటానికి చాలా నెలలు పట్టవచ్చు. ఎందుకంటే మరలా అండం విడుదల కావడానికి కొందరిలో 10 నెలల సమయం పట్టవచ్చు. కొందరిలో ఈ ఇంజెక్షన్లు ఎక్కువ డోస్ తీసుకోవటం వల్ల ఎముకల్లో క్యాల్షియం తగ్గి ఎముకలు పెళుసుగా తయారుకావచ్చు. కొందరు బరువు పెరుగుతారు. మరికొందరిలో ఈ ఇంజెక్షన్ వల్ల తలనొప్పి, వికారం, కళ్లు తిరగడం, డిప్రెషన్, నీరసం వంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీకు ఈ ఇంజెక్షన్ సరికాదనేది సూచన. డాక్టర్ని సంప్రదించి వారి సలహా మేరకు వేరే పద్ధతులని అనుసరించవచ్చు. నేను ప్రస్తుతం ప్రెగ్నెంట్. ఈ మధ్య నా దంతాలు వదులైనట్లనిపిస్తున్నాయి. అంతేకాదు... పొద్దుట బ్రష్ చేస్తున్నప్పుడు రక్తం వస్తోంది. ముక్కులో నుంచి కూడా కొద్దిగా రక్తం వస్తోంది. గర్భిణిగా ఉన్నప్పుడు ఇది సహజమేనని, ఆందోళన పడాల్సిన అవసరం లేదంటున్నారు మా అత్తయ్య. దీని గురించి వివరంగా తెలియజేయగలరు.– బి.రేఖ, హైదరాబాద్ గర్భిణీ సమయంలో హార్మోన్లలలో మార్పుల వల్ల రక్త ప్రసరణ పెరిగి శరీరంలోని రక్తనాళాలు వ్యాకోచిస్తాయి. దానివల్ల అవయవాలకు రక్తప్రసరణ పెరుగుతుంది. కాబట్టి రక్తనాళాలు ఉబ్బినట్లు ఉండి, ఎక్కువ తుమ్మినా, ముక్కు సలపడం, ముక్కులో చెత్తను వేళ్లతో తియ్యడం వంటి పనులు చేసినప్పుడు కొందరిలో రక్తనాళాలు చిట్లి, ముక్కు నుంచి కొద్దిగా బ్లీడింగ్ అవ్వవచ్చు. అలాగే దంతాలకు కూడా రక్తప్రసరణ పెరిగి, కొందరిలో హార్మోన్ల మార్పుల వల్ల దంతాల చిగురులు వాచినట్లు ఉండి, అక్కడ బ్యాక్టీరియా పెరిగి కూడా బ్లీడింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దంతాలను రోజుకు రెండుసార్లు మెత్తటి బ్రష్తో శుభ్రం చేసుకోవాలి. అలాగే కొద్దిగా ఉప్పునీటితో పుక్కిలించి ఊసి, మళ్లీ గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవడం మంచిది. మరీ బ్లీడింగ్ ఎక్కువగా ఉంటే డాక్టర్ని సంప్రదించి, రక్తం గడ్డకట్టే గుణంలో ఏమైనా సమస్య ఉందా..? లేదా ఇంకేమైనా ఇతర సమస్యలు ఉన్నాయా? వంటివి తెలుసుకోవడం మంచిది. నేను ప్రెగ్నెన్సీ ప్లానింగ్లో ఉన్నాను. అయితే గర్భిణులకు పిగ్మెంటేషన్ సమస్య ఎదురవుతుందని విన్నాను. ఇది ఎందుకు వస్తుంది? ప్రసవం తరువాత పోతుందా? ఇది రాకుండా ముందస్తు జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా? – జి.పార్వతి, చీపురుపల్లి, విజయనగరం హార్మోన్లలో మార్పుల వల్ల గర్భిణీలలో మెలనిన్ పిగ్మెంట్ ఎక్కువ తయారై ముఖంపై నల్లటి మచ్చలు, మెడ చుట్టూ నల్లగా అవ్వడం, శరీరంలో రక్తప్రసరణ పెరిగి, సన్న రక్తనాళాలు బయటకు ఎర్రగా కనిపించడం, పొట్టపైన నల్లటి గీతలు, చర్మం సాగే కొద్ది స్ట్రెచ్ మార్క్స్ ఒక్కొక్కరికి ఒక్కోలాగా ఏర్పడుతుంటాయి. చర్మం మీద పిగ్మెంటేషన్ మార్పులు ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి, హార్మోన్లను బట్టి, ఒక్కొక్కరిలో ఒక్కోలాగా ఏర్పడుతుంటాయి. ఈ మార్పులు అసలు రాకుండా ఉండటానికి ఎవరూ ఏం చెయ్యలేరు. కొన్ని పిగ్మెంటేషన్ మచ్చలు చాలా వరకు కాన్పు తర్వాత మెల్లగా తగ్గుతాయి. గర్భిణీ సమయంలో ఎక్కువ ఎండలో తిరగకుండా ఉండటమే మంచిది. ఎండ తగలడం వల్ల పిగ్మెంటేషన్ ఇంకా పెరిగే అవకాశాలు ఉంటాయి. బయటకు వెళ్లేటప్పుడు సన్స్క్రీన్ లోషన్ రాసుకోవచ్చు. రోజు మొత్తంలో ముఖం రెండు మూడు సార్లు శుభ్రం చేసుకోవటం మంచిది. మంచినీళ్లు కనీసం మూడు లీటర్లు తాగడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. డా‘‘ వేనాటి శోభ బర్త్రైట్ బై రెయిన్బో హైదర్నగర్ హైదరాబాద్ -
వైద్యానికి వస్తే.. ప్రాణం పోయింది
కోల్సిటీ(రామగుండం): జ్వరం వచ్చిందని ఓ మహిళ ఆస్పత్రికి వస్తే... ప్రాణమే పోయింది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో శుక్రవారం చోటు చేసుకుంది. వైద్యులు వేసిన ఇంజక్షన్లు వికటించడంతోనే మృతి చెందిందని కుటుంబసభ్యులు, బంధువులు ఆస్పత్రి ఎదుట బైఠాయించి ఆందోళన చేశారు. ఆగ్రహంతో ఆస్పత్రిలోని ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. మృతురాలి కుటుంబ సభ్యుల వివరాల మేరకు... పెద్దపల్లి మండలంలోని అందుగులపల్లి గ్రామానికి చెందిన నిరుపేద పిల్లి వేణుగోపాల్, సంధ్య(25) దంపతులు. వీరికి ఐదు సంవత్సరాల కూతురు ఉంది. సంధ్యకు వారం రోజులుగా జ్వరం వస్తుండడంతో, ఈనెల 10న రామగుండం వీక్లీ మార్కెట్ సమీపంలోని తన పుట్టింటికి వచ్చింది. స్థానికంగా ఆర్ఎంపీల దగ్గర వైద్యం చేయించినప్పటకీ తగ్గకపోవడం, వాంతులు అవుతుండడంతో, గురువారం గోదావరిఖని లక్ష్మీనగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. శుక్రవారం కూడా జ్వరం తగ్గకపోవడంతో ఆస్పత్రి డాక్టర్ సూచనల మేరకు సిబ్బంది వరుసగా నాలుగైదు ఇంజక్షన్లు వేశారు. కాసేటికి ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని చెప్పిన ఆస్పత్రి డాక్టర్, స్థానికంగానే మరో ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడి వైద్యులు కూడా పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో కరీంనగర్లోని మరో కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. ఐసీయూలోకి తరలించి వైద్యం అందించే ప్రయత్నం చేసిన వైద్యులు అప్పటికే మృతి చెందిందని వెల్లడించారు. సంధ్య మృతి చెందడానికి గోదావరిఖనిలో తొలత చేర్పించిన ప్రైవేట్ ఆస్పత్రి డాక్టర్ ఇచ్చిన ఇంజక్షన్లు వికటించడంతోనేనని ఆరోపించారు. మృతదేహంతో ఆస్పత్రి ఎదుట ఆందోళన చేశా రు. మృతిరాలి కటుంబానికి న్యాయం చెయ్యాలని, ఆస్పత్రిని మూసివేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆగ్రహంతో ఆస్పత్రి ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. వన్టౌన్ సీఐ వాసుదేవరావు, ఎస్సై ఉపేందర్రావు ఆందోళనకారులను అడ్డుకున్నారు. ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని, దాడులకు పాల్పడడం సరికాదని హెచ్చరించారు. చివరికి కొందరు పెద్దలు జోక్యం చేసుకొని ఆస్పత్రి వైద్యులు, మృతురాలి బంధువులతో చర్చలు జరుపుతున్నారు. -
వారు మా పిల్లలే..
మధ్యాహ్న భోజనం చేసి ఇంట్లో నుంచి బయటకు వచ్చిన ఇందు కనిపించకుండాపోయింది. బయటకు వెళ్లిన కూతురు కనిపించడం లేదని తల్లి తండ్రికి ఫోన్ చేసింది. ఆరోజు నుంచి కూతురు ఆచూకీ కోసం వెతుకుతూనే ఉన్నారు. ఈసీఐఎల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. హాస్టల్లో మధ్యాహ్న భోజనం చేసిన చిన్ని స్కూల్కు వెళ్తూ కనిపించకుండాపోయింది. సాయంత్రం హాస్టల్కు తిరిగి రాకపోవడంతో హాస్టల్ సిబ్బంది, తోటి విద్యార్థులు రాత్రి వరకు వెతికారు. కనిపించకుండాపోయిన చిన్ని విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేశారు. మార్కాపురం పోలీసులను ఆశ్రయించారు. సాక్షి యాదాద్రి: ఇప్పుడు ఆ పిల్లలు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని వ్యభిచార గృహాల నిర్వాహకుల చెరనుంచి విముక్తి పొందిన వారిలో ఉన్నారని తెలుసుకున్న తల్లిదండ్రులు హుటాహుటిన గుట్టకు చేరుకున్నారు. ‘సారూ..మా పిల్లలను అప్పగించండి’అంటూ బోరున విలపిస్తున్నారు. ఎప్పుడెప్పుడు తమ పిల్లలను చూస్తామా అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. యాదగిరిగుట్టలో 15 మంది బాలికలను పోలీసులు వ్యభిచార కూపం నుంచి రక్షించారని మూడు రోజులుగా సాక్షి దినపత్రిక, టీవీల్లో వస్తున్న వార్తా కథనాల ఆధారంగా పలువురు తల్లిదండ్రులు శుక్రవారం యాదగిరిగుట్టకు వచ్చారు. పిల్లలకు సంబంధించి ఫొటోలు, ఇతర ఆధారాలు చూపించి, తమ పిల్లలను ఇవ్వాలని పోలీసులను కోరారు. కాగా, నిబంధనల ప్రకారం డీఎన్ఏ పరీక్ష నిర్వహించి తగిన నిర్ధారణకు వచ్చాక అప్పగిస్తామని పోలీసులు వారికి హామీ ఇచ్చారు. ఏపీ నుంచి .. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా పెద్దరావీడు మండలం గొబ్బూరుకు చెందిన మాకం చిన్న దిబ్బయ్య, విశ్రాంతమ్మలకు నలుగురు కూతుళ్లు. వీరు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరి చిన్న కూతురు మాకం చిన్ని ప్రకాశం జిల్లా మార్కాపురం సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో 7వ తరగతి చదువుతోంది. 2017 అక్టోబర్ 10న వసతి గృహం నుంచి పాఠశాలకు వెళ్లిన చిన్ని, మధ్యాహ్న భోజనం సమయం తర్వాత కనిపించకుండా పోయింది. ఆరోజు రాత్రి వరకు చిన్ని వసతి గృహానికి రాకపోవడంతో కంగారుపడ్డ హాస్టల్ వార్డెన్, చిన్ని తల్లితండ్రులకు ఫోన్ చేసి వారి కూతురు కనిపించడం లేదని చెప్పింది. వెంటనే మార్కాపురం వెళ్లిన చిన్ని తల్లిదండ్రులు చుట్టుపక్కల చోట్ల వెతికారు. ఎంత వెతికినా బిడ్డ ఆచూకీ లభించకపోవడంతో అక్టోబర్ 17వ తేదీన మార్కాపురం పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి పాప కోసం వెతుకుతున్న వారు, గురువారం యాదగిరిగుట్టలో చిన్నారులకు సంబంధించిన వార్త చూసి శుక్రవారం యాదగిరిగుట్ట పోలీస్స్టేషన్కు వచ్చి తమ పాపకు సంబంధించిన గుర్తింపు పత్రాలు, రేషన్కార్డు తదితర ఆధారాలు చూపించారు. ఈసీఐఎల్లో మరో చిన్నారి.. హైదరాబాద్ ఈసీఐఎల్లోని ప్రకాశ్నగర్కు చెందిన మర్రిపల్లి అనురాధ, కృష్ణ దంపతులకు నలుగురు ఆడపిల్లలు. నలుగురు ఆడపిల్లల్లో ఇద్దరు కవలలు ఉన్నారు. ఇందులో రెండో పాప అయిన ఇందు ఈసీఐఎల్లోని ఎంఎస్ గ్రామర్ హైస్కూల్లో ఎల్కేజీ చదువుతోంది. 2014 సెప్టెంబర్ 3న మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో ఇంటికి వచ్చి భోజనం చేసింది. ఒంటి గంట సమయంలో ఆరు బయటకు వెళ్లింది. తరువాత 2 గంటల సమయంలో తల్లి అనురాధ పాప కోసం వెతకగా ఎక్కడా కనిపించడం లేదు. అదేరోజు సాయంత్రం కుషాయిగూడ పోలీస్స్టేషన్కు వెళ్లి తమ పాప కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశారు. బిడ్డలకోసం తల్లిదండ్రుల ఆరాటం యాదగిరిగుట్ట వ్యభిచార గృహాల నుంచి రక్షించిన బాలికలను మహబూబ్నగర్ జిల్లా ఆమనగల్లులోని ప్రజ్వల హోంకు తరలించారని తెలుసుకున్న తల్లిదండ్రులు గురువారం అక్కడికి వెళ్లి బాలికను చూసే ప్రయత్నం చేశారు. కానీ అక్కడి అధికారులు బాలికను చూపించడం నిబంధనల ప్రకారం కుదరదని, పోలీసు అధికారులు, చైల్డ్ వెల్ఫేర్ అధికారుల అనుమతి ఉంటేనే చూపిస్తామన్నారు. దీంతో వారు శుక్రవారం యాదగిరిగుట్ట పోలీస్స్టేషన్కు వచ్చి తమ పిల్లలకు సంబంధించిన ఫొటోలను పోలీసులకు చూపించారు. ఈ నేపథ్యంలో ఇద్దరు బాలికలకు సంబంధించిన వివరాలను వారు తల్లిదండ్రులనుంచి సేకరించారు. ఈ బాలికలకు డీఎన్ఏ పరీక్ష చేసి తల్లిదండ్రుల డీఎన్ఏతో సరిపోతే అప్పగిస్తామని చెప్పారు. అనురాధ నర్సింగ్ హోం సీజ్ నిబంధనలకు విరుద్ధంగా పిల్లలకు హార్మోన్ ఇంజక్షన్లు ఇస్తున్నందుకు శుక్రవారం యాదాద్రి జిల్లా డీఎంహెచ్ఓ డాక్టర్ సాంబశివరావు అనురాధ నర్సింగ్హోంను సీజ్ చేశారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఈస్ట్రోజన్ ఇంజక్షన్లు నర్సింగ్హోంలో బాలికలకు ఇస్తున్నారని డాక్టర్ నర్సింహపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి ఆసుపత్రిని తనిఖీ చేసి సీజ్ చేసి ఆసుపత్రి లైసెన్స్ను రద్దు చేశారు. -
అసలు సూత్రధారులు ఎవరు?
-
మైనర్లకు ‘ఇంజెక్షన్’ ఇస్తున్నదెవరు?
సాక్షి, యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పరిసర ప్రాంతాల్లో వ్యభిచార వృత్తి నివారణకు రాచకొండ పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. బలవంతంగా.., బతుకుదెరువు కోసం.. ఇలా పలు రకాల్లో జరుగుతున్న వ్యభిచార వృత్తికి అడ్డుకట్ట వేయడానికి చేస్తున్న ప్రయత్నాలు నీరుగారిపోతున్నాయి. ఈ వృత్తి కోసం బాలికల అక్రమ రవాణాను ఎంచుకున్నారన్న విషయం బయటపడటంతో పోలీసు యంత్రాంగం కంగుతింది. ప్రస్తుతం అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠాను పట్టుకోవడంపై పోలీసులు దృష్టిపెట్టారు. కాగా, యాదగిరిగుట్టలో తరచూ పోలీసులు కార్డన్ సెర్చ్, ఇతరత్రా తనిఖీలు చేస్తున్నా ఇలాంటి అమానుష సంఘటన వెలుగు చూడటం నిఘా సంస్థల వైఫల్యమేనని విమర్శలు వస్తున్నాయి. మూడేళ్ల క్రితం పట్టుబడిన వ్యక్తి ద్వారా బాలికల అక్రమ రవాణా విషయం వెలుగు చూసినప్పటికీ దానిపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టకపోవడం వల్లే అది కొనసాగిందన్న ఆరోపణలు ఉన్నాయి. యాదగిరిగుట్ట పట్టణంలో జరుగుతున్న దందాను అరికట్టడానికి ఇప్పటికే పలువురిపై పీడీయాక్ట్ నమోదు చేశారు. అయినా అది నిరంతరాయంగా కొనసాగుతూనే ఉండటం వెనుక గల వైఫల్యాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఆ డాక్టర్ ఎవరు? పలు ప్రాంతాల నుంచి సుమారు 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలను యాదగిరిగుట్ట పట్టణానికి తీసుకువస్తున్నారు. వీరిని త్వరగా వ్యభిచార వృత్తిలో దింపడానికోసం నిర్వాహకులు అడ్డదారులు తొక్కుతున్నారు. ముందుగా ఇతరులకు అనుమానం రాకుండా స్థానికంగా బాలికలను చదివించి, వారికి 12 సంవత్సరాలు రాగానే శరీర పెరుగుదలకు ఇంజెక్షన్లు ఇస్తున్న విషయాన్ని రాచకొండ సీపీ మహేష్భగవత్ వెల్లడించారు. కాగా, వ్యభిచార గృహాలతో సంబంధం పెట్టుకున్న ఓ ఆర్ఎంపీ వైద్యుడు రూ.20 వేల నుంచి రూ.50 వేలు తీసుకుని 12 సంవత్సరాల వయసు వచ్చిన పిల్లలకు ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఇంజెక్షన్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఇంజెక్షన్ ఇవ్వడంవల్ల చిన్న వయసులో ఉన్న పిల్లలు యుక్తవయసు ఉన్న అమ్మాయిల్లా కనిపించడంతో పాటు వారి శరీర ఎదుగుదలలో కూడా భారీ మార్పులు వస్తాయి. అసలు ఈ ఇంజెక్షన్ ఇస్తున్న వైద్యుడు యాదగిరిగుట్టకు చెందిన వ్యక్తా లేక ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇస్తున్నాడా అనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆ వైద్యుడిని పట్టుకుని విచారిస్తే ఇప్పటి వరకు ఎంత మందికి ఇంజెక్షన్లు ఇచ్చారనేది తేలుతుందని అంటున్నారు. అసలు సూత్రధారులు ఎవరు? చిన్నారులను అక్రమంగా తరలిస్తున్నది ఎవరు? అనే అంశం పోలీసులను వెంటాడుతోంది. ఈ ప్రాంతంలో దశాబ్దాలుగా జరుగుతున్న వ్యభిచార నిర్మూలన ఒక్కరోజుతో అంతమయ్యేది కానప్పటికీ నివారణ కోసం చేస్తున్న ప్రయత్నాలు పూర్తిస్థాయిలో ఫలించడంలేదు. యాదగిరిగుట్ట పట్టణానికి చెందిన శంకర్ అనే వ్యక్తికి చిన్నారుల అక్రమ రవాణాతో సంబంధం ఉన్నట్లు 2015లో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో కేసు నమోదైంది. శంకర్తో పాటు కంసాని యాదగిరి అనే వ్యక్తి పేరు కూడా ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తోంది. యాదగిరి, యాదగిరిగుట్ట మండలం రామాజీపేట శివారులో వివిధ ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకువచ్చి వ్యభిచారం చేయిస్తుంటాడు. ఇప్పటివరకు ఇక్కడి ప్రజలకు ఈ విషయం మాత్రమే తెలుసు. కానీ శంకర్తో పాటు యాదగిరి సైతం చిన్నారుల అక్రమ రవాణాలో ప్రధాన వ్యక్తి అని తాజా విచారణలో తెలిసింది. ఇదిలా ఉండగా శంకర్ గత ఏడాది క్రితమే మరణించగా ఇటీవలనే పీడీ యాక్టు కింద యాదగిరి జైలులో ఉన్నాడు. చిన్నారుల అక్రమ రవాణా గుట్టు తెలియాలంటే యాదగిరిని విచారించాలని పలువురు అంటున్నారు. అంతేకాకుండా చిన్నారిని ఇబ్బందులకు గురిచేసిన కంసాని కల్యాణికి సంబంధించిన ఓ వ్యక్తికి సైతం అక్రమ రవాణాలో ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. మూడున్నర ఏళ్ల క్రితమే చర్యలు తీసుకుని ఉంటే.. మూడున్నర ఏళ్ల క్రితమే సికింద్రాబాద్లో నమోదైన కేసు నేపథ్యంలో అక్రమ రవాణా ముఠాపై కఠిన చర్యలు తీసుకుని ఉంటే ఇప్పుడు ఇంత దారుణాలు జరిగేవి కాదని వివిధ స్వచ్ఛంద సంస్థలు అంటున్నాయి. యాదగిరిగుట్ట కేంద్రంగా సాగుతున్న చిన్నారుల అక్రమ రవాణా వ్యాపారానికి చెక్ పెట్టాలంటే వ్యభిచార గృహాల నిర్వాహకులకు సంబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ విచారించాలని ఆ సంస్థల ప్రతినిధులు కోరుతున్నారు. పోలీసుల అదుపులో ఆర్ఎంపీ డాక్టర్? వ్యభిచారం నిర్వహిస్తున్న లాడ్జీల నిర్వాహకులపై రౌడీషీట్ సాక్షి, యాదాద్రి: బాలికలు త్వరగా యుక్త వయసులోకి రావడానికి ఈస్ట్రోజన్ ఇంజక్షన్లు ఇచ్చాడనే అనుమానంతో యాదగిరిగుట్టకు చెందిన ఓ ఆర్ఎంపీ వైద్యుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. బాలికలను కొనుగోలు చేసి వ్యభిచార వృత్తిలోకి దించుతున్న నిర్వాహకులను పోలీసులు మంగళవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా 11మంది బాలికలను కాపాడిన నేపథ్యంలో వారికి ఈస్ట్రోజన్ ఇంజక్షన్లు ఇప్పిస్తున్నారన్న విషయం వెలుగులోకి వచ్చింది. కొన్నేళ్లుగా ఈ వ్యవహారం నడుస్తోందని ప్రచారం జరుగుతోంది. దీంతో వ్యభిచారం నిర్వహిస్తున్నవారితో సంబంధాలు కలిగి ఉన్న ఆర్ఎంపీ వైద్యుడిని అదుపులోకి తీసుకుని నిజానిజాలు తెలుసుకోవడానికి అతడిని విచారిస్తున్నట్లు తెలిసింది. ఎంత మంది పిల్లలకు ఇంజక్షన్లు ఇచ్చారు, ఈ దారుణం వెనుక ఎవరెవరి హస్తం ఉంది, ఏ మేరకు డబ్బులు చేతులు మారుతాయి.. వంటి పలు అంశాలపై విచారణ జరుగుతున్నట్లు సమాచారం. దర్యాప్తులో భాగంగా పోలీసులు మరిన్ని దాడులకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. లాడ్జీలపై నిఘా తీవ్రతరం యాదగిరిగుట్ట, వడాయిగూడెం, భువనగిరి, బీబీనగర్ ప్రాంతాల్లో గల లాడ్జీలు, రిసార్ట్స్లపై దాడులు చేయడానికి పోలీసులు సిద్ధమవుతున్నారు. వ్యభిచారం జరుగుతున్నట్లు గుర్తించిన కొన్ని లాడ్జీలను సీజ్ చేయడంతోపాటు నిర్వాహకులపై ఇప్పటికే పీడీయాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. రెండు కంటే ఎక్కువసార్లు కేసులు నమోదైన వారిపై రౌడీషీట్ ఓపెన్ చేయాలని సీపీ ఆదేశాలు జారీ చేశారు. కాగా, ఇళ్ల మధ్య గుట్టుగా వ్యభిచారం నిర్వహిస్తున్న వారిని కూడా గుర్తించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు -
డ్రగ్స్ ముఠా అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : ప్రమాదకర ఆక్సిటోసిన్ లిక్విడ్ను అక్రమంగా తయారు చేస్తున్న ముఠా సభ్యులను టాస్క్ ఫోర్స్ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వం నిషేదించిన ఆక్సిటోషన్ను మల్లెపల్లికి చెందిన సురేశ్కుమార్ బన్సాల్ అనే వ్యక్తి అక్రమంగా తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ముఠా నగరంలోని డైరీలకు ఆక్సిటోసిన్ ఇంజెక్షన్స్ను అమ్ముతుంటారు. ఈ ఇంజెక్షన్ను గెదలకు ఇవ్వడం వల్ల పాల శాతం పెరుగుతుందని రైతులు వీటిని కొనుగోలు చేస్తున్నారు. ఇంజెక్షన్ చేసిన గెద పాలు తాగడం వల్ల చిన్న పిల్లల్లో హార్మోన్ ఎఫెక్ట్, మహిళలకు క్యాన్సర్ సోకడంతో పాటు గెదల జీవిత కాలం తగ్గిపోతుంది. ఈ ముఠా నుంచి 1500 ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ బాటిల్స్, మనుషులకు వాడే మూడు ఇంజక్షన్స్, మూడు సీలింగ్ మిసైన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 90వేల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. సురేష్ కుమార్, షైక్ అబ్దుల్ ఖలీద్లపై పీడీ యాక్ట్ నమోదు చేయనున్నట్లు టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకృష్ణారావు ప్రకటించారు. -
అనుమానం
‘‘బై రియో! నేను వెళ్తున్నా. మళ్లీ నేనొచ్చే వరకు ఏడ్వద్దు. వచ్చేప్పుడు నీకిష్టమైన స్ట్రాబెర్రీ చాక్లెట్లు తీసుకొస్తాను,’’ అని ప్రేమగా కూతుర్ని ముద్దు పెట్టుకుంది సుచిత్ర. ఆమె ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్గా పని చేస్తోంది. తాను వెళ్లే సమయానికి కూతుర్ని స్కూల్లో దింపి, వచ్చేటప్పుడు తీసుకొస్తుంది. రియో స్మైల్ కిడ్స్ స్కూల్లో రెండో తరగతి చదువుతోంది. అమ్మకు బై చెప్పిన రియో అక్కడే ఉన్న వ్యాన్డ్రైవర్ సంతోష్ని చూసి ఒక్కసారిగా భయపడింది. సంతోష్ రియోను దగ్గరకు తీసుకోవాలని ప్రయత్నించినా.. వదిలించుకొని క్లాస్ రూంలోకి పరుగుపెట్టింది. సంతోష్ పెరిగిన జుట్టు, గడ్డంతో ఉండటం వల్లనేమో పిల్లలు అతని దగ్గరకు వెళ్లడానికి భయపడతారు.కిడ్స్ స్కూల్ కావడంతో దాదాపుగా టీచర్లంతా మహిళలే. ప్రిన్సిపల్ ఉమాదేవి వీరందరినీ కోఆర్డినేట్ చేస్తుంది. స్కూల్ వ్యవ హారాలు మొత్తం ఉమాదేవి భర్త కరస్పాండెంట్ సురేందర్ చూసుకుంటాడు. సురేందర్ పిల్లల తల్లిదండ్రులందరికీ తెలుసు. పిల్లల విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటారని పిల్లల తల్లి దండ్రులకు ఆ స్కూల్ అంటే మంచి నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే ప్రారంభంలో ఇరవై మంది ఉన్న పిల్లల సంఖ్య 150కి చేరింది. ఒకసారి పిల్లలు ఏడుస్తున్నారని టీచర్ చేయి చేసుకోగా, ఆమెను ఉద్యోగం నుంచే తొలగించాడు. అది పిల్లల తల్లిదండ్రుల ముందే జరగడంతో స్కూల్పై నమ్మకం ఇంకా పెరిగింది. సాయంత్రం రియోను తీసుకెళ్లడానికి సుచిత్ర రానే వచ్చింది. ఫీజు విషయమై ప్రిన్సిపల్ ఉమాదేవితో ఏదో మాట్లాడుతుండగా రియో తల్లి చుట్టూ తిరుగుతూ చీర కొంగుతో ఆడుకుంటోంది. అమ్మ తీసుకెళ్లడానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్న రియో డ్రైవర్ సంతోష్ను చూడగానే తెలియని భయానికి లోనైంది. తల్లిని గట్టిగా పట్టుకుంది. రియో ఫీజు గురించి మాట్లాడి తన కారులో రియోను తీసుకెళ్లింది సుచిత్ర. ‘‘రియో! హోమ్వర్క్ చేస్కో. టీవీ చూడటం ఆపేయ్’’ అని వంటింట్లో నుంచి గద్దించింది సుచిత్ర. రియో పోగో చానల్లో కార్టూన్లను చూస్తూ అల్లరి చేస్తోంది. ‘‘డాడీ వస్తారు. వచ్చే వరకు నువ్వు ఇలాగే టీవీ చూస్తుండు. నిన్ను కొడతాడు’’ అంది బెదిరింపుగా. రియో ఆ విషయాన్ని వినీ విననట్లుగా, భయం లేనట్టుగా టీవీకి అంకితమైంది. రియో అల్లరిని ఆపడానికి సుచిత్ర డ్రైవర్ సంతోష్కి చెప్తా తీసుకెళ్తాడు అంది. అంతే ఆ ముక్క విన్నదో లేదో రియో ‘మమ్మీ!’ అంటూ భయంగా పరుగెత్తుకొచ్చింది. ఎన్నడూ భయపడని విధంగా విచిత్రంగా రియో భయ పడటాన్ని సుచిత్ర గమనించింది. ‘‘లేదు.. లేదు.. ఊరికే అన్న. ఏం లేదు’’ అని ఊరడించింది. తెల్లారాక రియో సాధారణంగా కనిపించడం చూసి సుచిత్ర మనసు కుదుట పడింది. ‘డాడీ ఈ బాల్ పట్టుకో’ అంటూ డాడీతో ఆడుకుంటూ సాధారణంగా ఉంది రియో. ‘‘స్కూల్ టైమౌతోంది. త్వరగా రా.. రెడీ అవ్వాలి’’ అని సుచిత్ర పిలిచింది. కొద్దిసేపటి తర్వాత సుచిత్ర రియోను రెడీ చేసి తానూ రెడీ అయింది. ఇద్దరూ కార్లో బయల్దేరారు. దారిలో సిగ్నల్ దగ్గర తన స్కూల్ బస్సు పక్కనే వాళ్ల కారు ఆగడంతో అటువైపు తనను పిలుస్తున్న ఫ్రెండ్స్ కనిపించారు. వారికి హాయ్ అని చేతులూపింది. అదే సందర్భంలో వ్యాన్ డ్రైవర్ సంతోష్ను చూసి చటుక్కున మొహాన్ని తిప్పేసింది రియో.సుచిత్ర రియోను స్కూల్లో దింపి ఆస్పత్రికి వెళ్లింది. ఫస్ట్ అవర్ క్లాస్ అయిపోయింది. ఇంటర్వల్ పీరియడ్లో రియో తన ఫ్రెండ్స్తో ఆడుకుంటోంది. ఇంతలో ఒక టీచర్ వారి దగ్గరకొచ్చి ‘’చిల్డ్రన్ గోటూ యువర్ క్లాస్ రూమ్స్’’ అని అంది. పిల్లలంతా గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మూడు ఫ్లోర్లున్న బిల్డింగ్లో తమ తమ క్లాస్ రూమ్స్లోకి వెళ్తున్నారు. రియో క్లాస్ రూమ్ రెండో ఫ్లోర్లో ఉంది. మూడో ఫ్లోర్లో మొత్తం ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. రియో తన క్లాస్రూమ్కి వెళ్తూ.. తన క్లాస్మేట్ చిన్నూ ఏడుస్తుండగా, ఆయా తనని బలవంతంగా మూడో ఫ్లోర్కి తీసుకెళ్లడం చూసింది. ‘‘ఏయ్ చిన్నూ..! ఎక్కడికి?’’ అంటూ ఆమె వెనుకే మూడో ఫ్లోర్కి వెళ్లింది. రియో రావడం గమనించని ఆయా చిన్నూని బరబరా గుంజుకెళ్లి హాల్లో ఉన్న పీఈటీ టీచర్ ముందు ఉంచింది. ‘‘ఈ పిల్ల అస్సలు కుదురుగా ఉండట్లేదు. పైగా బాగా ఏడుస్తోంది’’ అని ఆయా ఆ టీచర్తో అంది. ‘‘అవునా! ఏడుస్తున్నావా? ఎందుకు ఏడుస్తున్నావ్’’ అని పాలుగారే ఆ చెంపలపై చెళ్లున చరిచింది. చిన్నూ ఇంకా ఏడుపు ఎక్కువ చేసింది. దాంతో టీచర్ కోపం ఇంకా పెరిగింది. చిన్నూని పట్టుకోమని ఆయాతో చెప్పి, గదిలోకెళ్లి ఏదో ఇంజెక్షన్ తెచ్చింది. చేతులను గట్టిగా పట్టుకోమని, నోరు మూయమని ఆయాతో చెప్పి చిన్నూకి ఆ ఇంజెక్షన్ చేసింది. అంతే, అప్పటి వరకూ బిగ్గరగా ఏడ్చిన చిన్నూ ఒక్కసారిగా కూలబడిపోయింది. చిన్నూ రెక్కల్ని పట్టుకుని ఈడ్చుకుంటూ అదే ఫ్లోర్లోని ఒక గదిలోకి తీసుకెళ్లింది టీచర్. ఈ తతంగాన్నంతా దూరం నుంచి బిక్కుబిక్కుమంటూ గమనించిన రియో మెల్లిగా మెట్లు దిగి రెండో ఫ్లోర్లోని తన క్లాస్రూమ్కి వెళ్లింది. ఉమాదేవి రియో ఇదంతా చూడటాన్ని గమనించింది.సాయంత్రం సుచిత్ర వచ్చింది. స్కూల్ వదిలాక పిల్లలంతా తాము ఎక్కాల్సిన వ్యాను దగ్గరకు వెళ్తున్నారు. మిగతా పిల్లలు తమ తల్లిదండ్రుల దగ్గరకు వెళ్తున్నారు. రియో కోసం సుచిత్ర ఆత్రంగా చూస్తోంది. చివరగా రియో దిగాలుగా వస్తుండటాన్ని సుచిత్ర చూసింది. ప్రిన్సిపల్ ఉమాదేవి వేరే పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడుతూనే, రియో సుచిత్రకు ఏం చెబుతుందోనని టెన్షన్ పడుతోంది. సుచిత్ర దగ్గరకు వచ్చిన రియో ‘‘మమ్మీ! మరేమో చిన్నూ.. చిన్నూ...’’ అని ఏదో చెప్పబోయేసరికి ఉమాదేవి సుచిత్ర దగ్గరికొచ్చి నవంబర్ పద్నాలుగున జరగబోయే చిల్డ్రన్స్ డే గురించి మాట్లాడుతూ సుచిత్ర దృష్టిని రియో చెప్పే మాటలపైకి వెళ్లకుండా అడ్డుపడింది. కొద్దిసేపు మాట్లాడాక సుచిత్ర రియోతో ఇంటికి బయల్దేరింది. ఇంటికెళ్లాక రియో విషయాన్ని భర్త సురేందర్కి చెప్పింది ఉమాదేవి. ‘‘ఏవో మాయమాటలు చెప్పి ఆ పిల్లని మరిపించలేకపోయావా? ఈ విషయం సుచిత్రకు తెలిస్తే ఏమైనా ఉందా? పదేళ్లుగా కష్టపడుతున్న దానికి ఫలితం ఉండదు. స్కూల్ రెప్యుటేషన్ పోతుంది. అందరికీ తెలిస్తే కొత్తగా పిల్లలను ఎవరూ చేర్పించరు’’ అంటూ ఉమాదేవితో సురేందర్ తన మనసులోని అనుమానాల్ని బయటికి తీసుకొస్తున్నాడు. ‘‘అలా ఏం జరుగదు లేండి. రియో చిన్నపిల్ల. వెంటనే మర్చిపోతుంది’’ అని భర్తతో అంది ఉమాదేవి. ఈ మాటలు ఏ మాత్రం పట్టించుకోకుండా తన ఆలోచనల్లో మునిగిపోయాడు సురేందర్.ఇంటికెళ్లిన రియో.. చిన్నూ విషయం మర్చిపోయి ఆడుకుంటోంది. నానమ్మ పిలి చినట్టుగా వినిపిస్తే రియో వెళ్లింది. అప్పుడే భోజనం చేసిన నానమ్మ రియోతో టీవీ పక్కనున్ను ట్యాబ్లెట్స్ను తీసుకురమ్మంది. టీవీ పక్కన ట్యాబ్లెట్ల కవర్లో ఇంజెక్షన్లు చూసింది. అంతే, పరుగున వంట గదిలో ఉన్న తల్లి దగ్గరకు వచ్చి.. ‘‘మమ్మీ.. చిన్నూకి స్కూల్లో ఇంజెక్షన్ చేశారు’’ అని చెప్పింది. ‘‘అవునా ఎక్కడ.. ఇక్కడా.. ఇక్కడా’’ అని చెక్కిలిగింతలు పెట్టి, ఆ విషయాన్ని అంతగా పట్టించుకోలేదు సుచిత్ర. ‘‘త్వరగా హ్యాండ్వాష్ చేసుకుని రా.. డిన్నర్ చేద్దాం’’ అని పిలిచింది. తర్వాత అందరూ కలిసి డిన్నర్ చేసి పడుకున్నారు. నిద్రలో రియో ‘మమ్మీ..! డ్రైవర్.. డ్రైవర్..’ అంటూ భయంగా కేకలు వేసింది. దిగ్గున లేచిన సుచిత్ర ‘‘రియో.. రియో.. ఏమైంది’’ అంటూ.. తన చేతులతో రియోని నెమ్మదిగా తడుతూ పడుకోబెట్టింది.తెల్లారి ఉదయం రియోని స్కూల్లో దింపడానికి సుచిత్ర వెళ్లింది. వెళ్లేసరికి ఎవరో పేరెంట్స్ డ్రైవర్ సతీష్ని కొడుతుండటాన్ని చూసింది. అక్కడే సురేందర్, ఉమాదేవి.. కొందరు టీచర్లు ఉన్నారు. వేరే వ్యాన్లో వెళ్లే పాపను ఇతని వ్యాన్లో తీసుకెళ్లాడని, చీకటి పడ్డాక పాప తల్లిదండ్రులు ఆ విషయాన్ని కనిపెట్టారని, ఇప్పుడొచ్చి సతీష్ని కొడుతూ సురేందర్ని వివరణ అడుగుతున్నారని అక్కడి వారిలో ఒకరు సుచిత్రకు చెప్పారు. రియోని దింపి సుచిత్ర ఆస్పత్రికి వెళ్లింది. సురేందర్ ఆ పాప పేరెంట్స్తో పొరపాటు జరిగిందని చెప్పి తక్షణమే సతీష్ని ఉద్యోగం నుంచి తీసేశాడు. ఇదంతా తనకు పట్టనట్లు రియో క్లాస్కి వెళ్లింది. బ్రేక్ సమయంలో పిల్లలంతా ఆడుకుంటుండగా రియో దిగాలుగా కూర్చుంది. ఈ విషయాన్ని టీచర్ అశ్విని గమనించింది. రియోకి కూడా అశ్విని టీచర్తో చనువు ఉంది. కాబట్టి టీచర్ అడక్కుండానే చిన్నూకి ఇంజెక్షన్ ఇచ్చారని చెప్పింది. ‘‘ఇంజెక్షన్ ఏంటి రియో?’’ అని నవ్వింది ఆ టీచర్. ఈ విషయాన్ని గమనించిన ప్రిన్సిపల్ ఉమాదేవి భర్త సురేందర్కి చెప్పింది. ఆ రోజు రియోని తీసుకెళ్లడానికి సుచిత్ర లేట్గా వచ్చింది. పిల్లలంతా వెళ్లిపోయారు. రియో ఎక్కడని అక్కడున్న టీచర్ని అడిగింది. ప్రిన్సిపాల్ని కలవమని చెప్పగా కలిసింది. ప్రిన్సిపాల్ ఉమాదేవి ‘‘మీరొచ్చి తీసుకెళ్లా రనుకున్నాం. మీరు తీసుకెళ్లలేదా?’’ అని ఎదురు ప్రశ్నించింది.‘‘ఏం మాట్లాడుతున్నారు? నేనొచ్చిందే ఇప్పుడు’’ అంటూ రియో ఎక్కడని నిలదీసింది. దాంతో భయపడ్డ ఉమాదేవి, భర్త సురేందర్కి ఫోన్ చేయగా స్కూల్కి వచ్చాడు. ‘‘డ్రైవర్ సతీష్ వచ్చాడా?’’ అని అడిగాడు. ‘‘ఆ వచ్చాడు సర్. మిమ్మల్ని కలవాలని చెప్పి ఇంతకు ముందే వెళ్లాడు’’ అని మరో డ్రైవర్ చెప్పాడు. ‘‘రియోను సతీష్ తీసుకెళ్లాడా?’’ అనుమానంగా అన్నాడు సురేందర్. అనుమానం వచ్చి సుచిత్ర, ప్రిన్సిపాల్తో కలిసి పోలీస్ స్టేషన్లో కంప్లెయింట్ చేసింది. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు చీకటి పడటంతో రేపు ఉదయం స్కూల్కి వస్తామని చెప్పారు.రోజూ రియో ఆటలతో సందడిగా ఉండే ఇల్లు ఒక్కసారిగా మూగబోయినట్లైంది. మర్నాడు ఉదయమే స్కూల్ని పరిశీ లించడానకి వచ్చాడు ఎస్సై రమణ. రియో స్కూల్ వ్యాన్ డ్రైవర్లు, టీచర్ల గురించి ఆరా తీశాడు. అంతా డ్రైవర్ సతీష్ ప్రవర్తన గురించి చెప్పారు. సురేందర్ కూడా సతీష్ను ఎందుకు తీసేయాల్సి వచ్చిందో ఎస్సైకి వివరించాడు. ఈ క్రమంలో పిల్లలు బ్రేక్ టైమ్లో బయటకొచ్చారు. కొందరు అక్కడ పడి ఉన్న ఇంజెక్షన్ నీడిల్తో ఆడుకోవడం ఎస్సై గమనించాడు. స్కూల్ మొత్తాన్నీ చూడాలని చెప్పాడు ఎస్సై. మూడో ఫ్లోర్లో 304 గది ఏంటి తాళం వేసి ఉందని అడిగాడు. ‘‘సార్! లోపల సీలింగ్ చేయలేదు. అందుకే దాన్ని స్టోర్రూమ్గా వాడుతున్నాం’’ సమాధానమిచ్చాడు సురేందర్. సుచిత్రను సాయంత్రం స్టేషన్కి రావాలని ఎస్సై కబురు పంపాడు. సాయంత్రం సుచిత్ర, భర్త రఘుతో కలిసి స్టేషన్కి వెళ్లింది. గంటన్నరసేపు వారితో విడివిడిగా మాట్లాడిన ఎస్సై... కేసు నమోదు చేశామని, ఎంక్వైరీ జరుగుతోందని, ఏదైనా ప్రోగ్రెస్ ఉంటే చెబుతామని వాళ్లను పంపించేశాడు.మర్నాడు ఉదయం రఘు ఇంటికెళ్లాడు ఎస్సై రమణ. కాలింగ్ బెల్ కొట్టేసరికి రఘు వచ్చి డోర్ తీశాడు. మీరొకసారి స్టేషన్కు రావాలన్నాడు. పాప విషయం ఏమైందని రఘు అడిగేసరికి స్టేషన్లో చెబుతానని సుచిత్ర, రఘులను తీసుకెళ్లాడు.సుచిత్రను ఇంటరాగేషన్ రూమ్లోకి తీసుకెళ్లి ‘‘నేనడిగే ప్రశ్నలకి ఎస్ ఆర్ నో అనే సమాధానమే చెప్పాలి’’ అని బెదిరించాడు. దాంతో కంగుతిన్న సుచిత్ర అలాగే ఉండిపోయింది.‘‘రియో మీకు పుట్టిన బిడ్డ కాదు. ఎస్ ఆర్ నో’’ అని అడగ్గా.. ‘‘నో’’ అని చెప్పింది సుచిత్ర. ‘‘రఘుకు నువ్వు రెండో భార్యవి. అవునా?’’ అనే ప్రశ్నకు ‘‘అవును’’ అని భయంగా చెప్పింది. ‘‘ఇప్పుడు చెప్పు రియోను ఎందుకు చంపావు?’’ అని అడగ్గా బిత్తరపోయిన సుచిత్ర, ‘‘నేను చంపడం ఏంటీ?’’ అని ఎదురు ప్రశ్నించింది. పోలీసులు తమ స్టైల్లో అడిగేసరికి నిజాన్ని ఒప్పుకుంది. చిన్న పాపను చంపడానికి మనసెలా వచ్చిందని ఎస్సై కోపంగా అడిగేసరికి... ‘‘రఘు మొదటి భార్య అర్చన రోడ్డు ప్రమాదంలో మరణించగా.. రఘు ఇంట్లో వాళ్ల ఒత్తిడితో ఏడాది క్రితం నన్ను పెళ్లి చేసుకున్నాడు. అర్చన కూతురు రియోనే తన సర్వస్వం అన్నాడు. ఇంకా పిల్లలొద్దు అన్నాడు. దాంతో నా ప్రాణం ఆగినంత పనైంది. రియో ఉండబట్టేగా రఘు ఇలా అన్నాడని తట్టుకో లేకపోయాను. అందుకే రియోని కిడ్నాప్ చేయించి హత్య చేయించాను. చిన్నూకి ఇంజెక్షన్ చేశారని రియో చెప్పినప్పుడు కావాలనే పట్టించుకోలేదు. హత్య చేయడానికి ఇదే సరైన సమయమని అనుకున్నాను. ఇప్పుడు అనుమానం మొత్తం కరెస్పాండెంట్ సురేందర్ పైకి వెళ్తుందని పథకం చేసి అమలు చేశాను’’ అంది. ‘‘రియో మిస్సింగ్ తర్వాత అందర్నీ విచారించాం. డ్రైవర్ సతీష్ తల్లి అనారోగ్యంగా ఉండటంతో అలా డిప్రెషన్లో ఉన్నాడని తేలింది. అలాగే స్కూల్ కరస్పాండెంట్ సురేందర్ని కూడా ఇంటరాగేట్ చేశాం. చిన్నపిల్లలపై డ్రగ్స్ ప్రయోగిస్తున్నాడన్న ఆధారాలు దొరకడంతో కరెస్పాండెంట్ సురేందర్ దంపతులను అదుపులోకి తీసుకున్నాం. అయితే రియో విషయంలో వాళ్లకేమీ సంబంధం లేదని తేలింది. దాంతో వాళ్లందరి మీదా అనుమానాలు తీరిపోయాయి. దాంతో మీ ఇద్దరినీ విడివిడిగా ఇంటరాగేట్ చేశాం. నువ్వు రియోకి కన్నతల్లివి కాదని తెలియడంతో, అనుమానం నీవైపు తిరిగింది. చివరికి మా అనుమానమే నిజమైంది’’ అన్నాడు ఎస్సై రమణ. -ఉమేశ్ కోమటి -
ఎప్పుడూ అదే గొడవ
నాకు రెండేళ్ల క్రితం పెళ్లయ్యింది. మావారు తాగుతారు. తాగినప్పుడల్లా సెక్స్ కావాలని గొడవ చేస్తారు. అయితే మద్యం తాగి ఉన్నప్పుడు సెక్స్లో పాల్గొంటే... ఆ సమయంలో విడుదలైన అండం ఆరోగ్యంగా ఉండదని, తద్వారా పిల్లలు రకరకాల వ్యాధులతో పుడతారని ఎవరో అనగా విన్నాను. అందుకే తాగి వున్నప్పుడు ఆయనకు దగ్గర కావాలంటే భయంగా ఉంటోంది. నన్నేం చేయమంటారు? – సునీత, గుడివాడ మద్యం తాగడం అన్నది పుట్టబోయే పిల్లలకే కాదు... మీ భర్తకు కూడా మంచిది కాదు. ఆ అలవాటు వల్ల సంతానోత్పత్తి తగ్గిపోతుంది. వృషణాలు దెబ్బ తింటాయి. వీర్యకణాల ఉత్పత్తి తగ్గిపోతుంది. వాటి కదలికలో, నాణ్యతలో తేడా వస్తుంది. మెల్లగా కోరికలు తగ్గిపోవడం, అంగస్తంభన లేకపోవడం వంటి సమస్యలు కూడా వస్తాయి. వీర్యకణాల నాణ్యత తగ్గడం వల్ల పిండం సరిగ్గా తయారవదు. అలాంటప్పుడు ఒక్కోసారి అబార్షన్ అవుతుంది. లేదంటే పిండం ఎదుగుదలలో లోపాలు తలెత్తుతాయి. అవయవ లోపాలు, జన్యు లోపాలు ఏర్పడే అవకాశమూ ఉంది. కొందరు పిల్లలకు పుట్టిన తర్వాత ఐదేళ్లలోపు మతిమరుపు, బుద్ధిమాంద్యం, ఇతరత్రా మానసిక సమస్యలు కూడా కలుగుతాయి. ఈ విషయాలన్నీ మీవారికి వివరించండి. మంచి భవిష్యత్తు కోసమైనా తాగుడు మానేయమని చెప్పండి. వినకపోతే మంచి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇప్పించండి. నాకు మూడేళ్ల బాబు ఉన్నాడు. పిల్లల మధ్య ఎడం కోసమని నేను డాక్టర్ సలహా మేరకు రెండేళ్లుగా హార్మోన్ ఇంజెక్షన్లు వాడుతున్నాను. అయితే అప్పట్నుంచీ పీరియడ్స్ సరిగ్గా రావడం లేదు. డాక్టర్ని సంప్రదిస్తే హార్మోన్ ఇంజెక్షన్లు వాడే చాలామందికి అలా అవుతుందని చెప్పారు. ఇక రెండో బిడ్డ కోసం ప్రయత్నం చేద్దామని ఆరు నెలల క్రితం ఇంజెక్షన్లు ఆపేశాను. అయినా పీరియడ్స్ రాకపోవడంతో డాక్టర్ని కలిస్తే ట్యాబ్లెట్లు ఇచ్చారు. ఆ తర్వాత నెలసరి వచ్చింది. కానీ ఇప్పుడు మళ్లీ రావడం లేదు. నాకు మరో బిడ్డ కావాలంటే ఏం చేయాలి? – ఎన్.ప్రీతి, కర్నూలు గర్భం త్వరగా రాకుండా ఉండటానికి depo provera అనే ప్రొజెస్టరాన్ హార్మోన్ ఇంజెక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇది మూడు నెలలకు ఒకటి చొప్పున మూడు నాలుగు కంటే ఎక్కువసార్లు తీసుకోకూడదు. అంతకుమించి తీసుకోవడం వల్ల ఒక్కోసారి గర్భాశయ లోపలి పొర బాగా పల్చబడిపోయి, చాలా నెలలు లేదా సంవత్సరాలు పీరియడ్స్ రాకుండా పోతాయి. లేదంటే కొందరిలో ఎక్కువసార్లు వచ్చేయడం, ఎక్కువగా బ్లీడింగ్ కావడం, లేదంటే బ్లీడింగ్ మధ్యమధ్యలో కనబడటం వంటివి కూడా జరుగుతాయి. మీరు ఇప్పటికే రెండేళ్లు వాడేశారు కాబట్టి వాటిని ఆపి ఆరు నెలలు అయినా కూడా మీ శరీరంలో ఆ ఇంజెక్షన్ ఎఫెక్ట్ ఇంకా ఉంది. అది పూర్తిగా పోయేవరకు ఆగాల్సి ఉంటుంది. అలాగే డాక్టర్ పర్యవేక్షణలో కొన్ని రోజుల పాటు ఈస్ట్రోజన్ హార్మోన్లు వాడాల్సి ఉంటుంది. అలా అని కంగారు పడాల్సినదేమీ లేదు. మీరు మెల్లగా ప్లాన్ చేసుకుని, తప్పకుండా మరో బిడ్డను కనవచ్చు. ‘మూత్రనాళ ఇన్ఫెక్షన్’ అనేది ఎందుకు వస్తుంది? మన శరీరతీరువల్ల వస్తుందా? తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే వస్తుందా? ఈ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలంటే రోజువారీ జీవితంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బిగుతైన దుస్తులు ధరించడం వల్ల ఈ సమస్య వచ్చే అవకాశం ఉందా? మూత్రం రంగును బట్టి ఈ ఇన్ఫెక్షన్ను గుర్తించవచ్చా? తెలియజేయగలరు.– కె.సుబ్బలక్ష్మి, తిరుపతి మూత్రనాళ ఇన్ఫెక్షన్ అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. ఆడవారిలో మూత్రం బయటకు వచ్చే రంధ్రం (యురెత్రా), కిందకే, యోని రంధ్రం, దాని కిందనే, మలద్వారం ఉంటాయి. చాలావరకు మలద్వారం నుండి బ్యాక్టీరియా, క్రిములు, పైకి పాకే అవకాశాలు చాలా ఉంటాయి. ఇవి యోనిలోకి కాని, మూత్ర ద్వారంలోకి పాకి, ఇన్ఫెక్షన్లను కలిగించే ప్రయత్నాలు చేస్తాయి. వ్యక్తిగత శుభ్రత పాటించకపోవడం, రక్తహీనత, వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉండటం... వంటి కొన్ని సందర్భాలలో ఈ క్రిములు పెరిగి ఇన్ఫెక్షన్ రావటానికి కారణం అవుతాయి. సాధారణంగా ఆరోగ్యంగా ఉన్నవారిలో, అంటే రోగ నిరోధక శక్తి బాగా ఉన్నవారిలో, ఈ క్రిములు పెరగకుండా రోగ నిరోధక శక్తి ఆపుతుంది. నీళ్లు బాగా తాగుతూ ఉంటే మూత్రంలో క్రిములు కొట్టుకుపోతాయి. లేకపోతే ఈ క్రిములు మెల్లగా పెరుగుతూ మూత్రం సంచి (యూరినరీ బ్లాడర్) నుంచి పైకి అంటే మూత్రం పైపులకు (యూరేటర్స్) తద్వారా కిడ్నీలకు పాకి, ఇన్ఫెక్షన్ బాగా వృద్ధి చెంది కిడ్నీలను దెబ్బతీసే స్థాయికి, తద్వారా ప్రాణహాని వరకు చేరే అవకాశాలు ఉంటాయి. మూత్రంలో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు, మూత్రంలో మంట, మూత్రం ఎక్కువసార్లు వెళ్లాలనిపించడం, మూత్రం బాగా పసుపుపచ్చగా రావడం, పొత్తికడుపులో నొప్పి, నడుం నొప్పి, జ్వరం వంటి అనేక లక్షణాలు, ఇన్ఫెక్షన్ తీవ్రతను బట్టి ఉంటాయి. బిగుతుగా వుండే జీన్స్ ఎక్కువసేపు గంటల తరబడి వేసుకోవడం వల్ల కూడా, గాలి చొరబడక, ఇన్ఫెక్షన్ కలిగించే క్రిములు పైకి పాకి ఇబ్బంది కలిగించవచ్చు. మంచినీళ్లు రోజుకు కనీసం రెండు లీటర్లు తీసుకోవాలి. మల విసర్జన తర్వాత ముందు నుంచి వెనక్కి కడుక్కోవాలి. దాని ద్వారా మలద్వారంలోని క్రిములు ముందుకి పాకకుండా ఉంటాయి. మూత్రం వచ్చినప్పుడు వెళ్లిపోవాలి కాని, ఎక్కువసేపు మూత్రాన్ని ఆపి పెట్టడం వల్ల కూడా కొంతమందిలో యూరినరీ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. డా‘‘ వేనాటి శోభ రెయిన్బో హైదర్నగర్ హైదరాబాద్ -
బాబుకు ఛాతీలో నెమ్ము... ఏం చేయాలి?
పీడియాట్రిక్ కౌన్సెలింగ్ మా బాబు వయసు 14 నెలలు. రొమ్ములో నెమ్ము ఉందని డాక్టర్లు చెప్పారు. యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ చేశారు. బాబు ఆరోగ్యం పట్ల చాలా ఆందోళనగా ఉంది. ఇలా ఛెస్ట్లో నెమ్ము ఎందుకు వస్తుంది? అది రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఒకవేళ వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరంగా చెప్పండి. – ఎల్. ప్రవీణ, నెల్లూరు మీ బాబుకు ఉన్న కండిషన్ను వైద్య పరిభాషలో నిమోనియా అంటారు. పిల్లల్లో అత్యంత ప్రమాదకరంగా మారేందుకు కారణమయ్యే వ్యాధుల్లో నిమోనియా ఒకటి. నిమోనియాకు వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు అత్యంత ప్రధాన కారణాలు. కొన్నిసార్లు శరీర నిర్మాణపరమైన లోపాల (అనటామికల్ ప్రాబ్లమ్స్) వల్ల, రోగనిరోధక శక్తి లోపాల (ఇమ్యునిటీ ప్రాబ్లమ్స్) వల్ల కూడా నిమోనియా రావచ్చు. ఒక ఏడాదిలో వ్యవధిలోనే రెండు మూడు సార్లు నిమోనియా వస్తే అలాంటి పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగని మొదటిసారి వచ్చినప్పుడు నిర్లక్ష్యం వహించడం సరికాదు. నిమోనియా వచ్చినప్పుడు వారం నుంచి పది రోజుల పాటు యాంటీబయాటిక్స్తో పిల్లలకు సరైన వైద్య చికిత్స అందించడం చాలా ముఖ్యం. జాగ్రత్తలివే... ∙ఇలాంటి పిల్లలను మిగతా సాధారణ పిల్లల్లాగానే పరిగణించవచ్చు. అయితే గుంపుగా జనం ఉన్నప్రాంతాలకు పిల్లలను పంపకూడదు. ∙తీవ్రమైన ఇన్ఫెక్షన్లతో బాధపడేవారి నుంచి దూరంగా ఉంచాలి. పిల్లలందరికీ టీకాలు వేయించడం (ఇమ్యూనైజేషన్) చాలా ప్రధానం. హెచ్ఐబీ, నిమోకోకల్ వ్యాక్సిన్లు, ఫ్లూ వైరస్ వ్యాక్సిన్లతో నిమోనియాను చాలా వరకు నివారించవచ్చు. మీ బాబుకు ఈ వ్యాక్సిన్లు వేయించడం తప్పనిసరి. నిమోనియా వచ్చిన పిల్లలకు యాంటీబయాటిక్స్తో పాటు వాళ్లలో కనిపించే లక్షణాలకు చికిత్స చేయడం (సపోర్టివ్ కేర్) కూడా అవసరం. బాబుకు మూత్రంలో ఎరుపు... ఎందుకిలా? మా బాబుకి ఎనిమిదేళ్లు. రెండు నెలల క్రితం బాబుకి మూత్రంలో రక్తం పడింది. అన్ని రకాల పరీక్షలు చేశారు. రిపోర్ట్స్ అన్నీ నార్మలే. మూత్రంలో ఇన్ఫెక్షన్ అని చెప్పి యాంటిబయటిక్స్ రాశారు. అయితే మూత్రం పోసేటప్పుడు పొత్తికడుపులో నొప్పిగా ఉందంటూ బాబు బాధ పడుతున్నాడు. వారం క్రితం కూడా మూత్రంలో రక్తం పడింది. మళ్లీ డాక్టర్ దగ్గరకెళితే పరీక్షలు చే శారు. ఆ రిపోర్ట్స్ కూడా నార్మల్గానే ఉన్నాయి. అసలు మా బాబుకి ఏమై ఉంటుంది, ఎందుకిలా రక్తం పడుతోంది? – సువర్ణ, కందుకూరు మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీ అబ్బాయికి ఉన్న కండిషన్ను హిమెచ్యూరియా అంటారు. ఇది చాలా సాధరణమైన సమస్య. స్కూల్కి వెళ్లే 2–5 శాతం మంది పిల్లల మూత్రంలో రోజూ రక్తం కనబడుతుంటుంది. ఈ లక్షణం చూడటానికి భయపెట్టేదిగా అనిపించినా చాలా వరకు ఎలాంటి ప్రమాదమూ ఉండదు. కొంతమందిలో మాత్రమే ఈ లక్షణం సీరియస్ సమస్య ఉండటానికి సూచనగా ఉంటుంది. పిల్లల యూరిన్లో రక్తం కనబడానికి కొన్ని కారణాలు: మూత్రనాళంలో రాళ్లు, రక్తానికి సంబంధించిన సికిల్ సెల్ డిసీజ్, కోయాగ్యులోపతి వంటి హెమటలాజికల్ సమస్యలు. వైరల్ / బ్యాక్టీరియల్, మూత్రనాళంలో ఇన్ఫెక్షన్స్, మూత్రనాళంలో ఏవైనా అడ్డంకులు, కొల్లాజెన్ వ్యాస్క్యులార్ డిసీజ్, వ్యాస్క్యులైటిస్, పీసీజీఎన్, ఐజీఏ నెఫ్రోపతి వంటి ఇమ్యున్లాజికల్ సమస్యలు, పుట్టుకతోనే మూత్రపిండాల్లో లోపాలు ఉండటం వల్ల పిల్లలు మూత్రవిసర్జన చేసే సమయంలో రక్తం కనిపించవచ్చు. ఇక పిల్లల్లో అన్నిసార్లూ కంటికి కనబడేంత రక్తం రాకపోవచ్చు. అందుకే దీన్ని తెలుసుకోవాలంటే మైక్రోస్కోపిక్, కెమికల్ పరీక్షలు అవసరమవుతాయి. మీ అబ్బాయికి చేసిన అన్ని పరీక్షల్లో నార్మల్ అనే రిపోర్టు వచ్చిందంటున్నారు కాబట్టి యూరినరీ ఇన్ఫెక్షన్, హైపర్ క్యాల్సీ యూరియా అంటే మూత్రంలో అధికంగా క్యాల్షియం ఉండటం లేదా రక్తానికి సంబంధించిన సమస్యలతో పాటు థిన్ బేస్మెంట్ మెంబ్రేన్ డిసీజ్, ఐజీఏ నెఫ్రోపతి వంటి సమస్యలు ఉన్నాయేమో తెలుసుకోవడం ముఖ్యం. కొన్ని సందర్భాల్లో ఇటువంటి సమస్యలు కొన్ని జన్యుపరంగా వస్తుంటాయి. మీ అబ్బాయికి మూడు నుంచి ఆరు నెలలకోసారి సాధారణ మూత్రపరీక్షలతో పాటు యూరిన్లో ప్రొటీన్ల శాతం, రక్త కణాల మార్ఫాలజీ, క్రియాటినిన్ లెవెల్స్ వంటి పరీక్షలు తరచూ చేయిస్తుండాలి. బాబుకి పొత్తికడుపులో నొప్పి వస్తుందంటున్నారు కాబట్టి ఇది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వల్ల అయి ఉండే అవకాశమే ఎక్కువగా ఉంది. అలాంటప్పుడు యాంటీబయాటిక్స్తో చికిత్స అవసరం. అయితే ఈ సమస్య కిడ్నీ వల్లగాని, జన్యుపరంగా గాని ఉత్పన్నమవుతున్నట్టు అనిపిస్తే బయాప్సీ చేయడం కూడా చాలా ముఖ్యం. మీ అబ్బాయికి రొటీన్ పరీక్షలు నార్మల్గా ఉన్నాయని చెప్పారు కాబట్టి, పైన చెప్పిన విషయాలను పరిగణనలోకి తీసుకొని మీరు మరోసారి మీ డాక్టర్తో చర్చించి, తగిన సలహా, చికిత్స తీసుకోండి. డా. రమేశ్బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్, రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ, హైదరాబాద్ -
బాబుకు ఛాతీలో నెమ్ము, ఏం చేయాలి?
పీడియాట్రిక్ కౌన్సెలింగ్స్ మా బాబు వయసు 14 నెలలు. ఛాతీలో నెమ్ము ఉందని డాక్టర్లు చెప్పారు. యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ చేశారు. మాకు చాలా ఆందోళనగా ఉంది. ఇలా నెమ్ము ఎందుకు వస్తుంది? దాని విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరంగా చెప్పండి. – ఎమ్. సుప్రియ, రాజమండ్రి మీ బాబుకు ఉన్న కండిషన్ను వైద్య పరిభాషలో నిమోనియా అంటారు. పిల్లల్లో ప్రమాదకరంగా మారేందుకు కారణమయ్యే వ్యాధుల్లో నిమోనియా ఒకటి. డయేరియా తర్వాత పిల్లల్లో ప్రమాదకరంగా పరిణమించే వ్యాధుల్లో ఇది రెండోదని చెప్పవచ్చు. వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు నిమోనియాకు అత్యంత ప్రధాన కారణాలు. కొన్ని సందర్భాల్లో కొన్ని శరీర నిర్మాణపరమైన లోపాల (అనటామికల్ ప్రాబ్లమ్స్) వల్ల, రోగనిరోధక శక్తి లోపాల (ఇమ్యునిటీ ప్రాబ్లమ్స్) వల్ల కూడా పదే పదే నిమోనియా కనిపించవచ్చు. ఒక ఏడాదిలో వ్యవధిలోనే రెండు మూడు సార్లు నిమోనియా వస్తే అలాంటి పిల్లల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. అలాగని మొదటిసారి వచ్చినప్పుడు నిర్లక్ష్యం వహించడం సరికాదు. నిమోనియా వచ్చినప్పుడు వారం నుంచి పది రోజుల పాటు యాంటీబయాటిక్స్తో పిల్లలకు సరైన వైద్య చికిత్స అందించడం ఎంతైనా ముఖ్యం. తీసుకోవాల్సిన జాగ్రత్తలు... ∙ఇలాంటి పిల్లలను మిగతా సాధారణ పిల్లల్లాగానే పరిగణించవచ్చు. అయితే సమూహాలుగా జనం ఉన్న ప్రాంతాలకు పిల్లలను పంపకూడదు. చాలా తీవ్రమైన ఇన్ఫెక్షన్లతో బాధపడేవారి నుంచి పిల్లలను దూరంగా ఉంచాలి. ∙పిల్లలందరికీ టీకాలు వేయించడం (ఇమ్యూనైజేషన్) చాలా ప్రధానం. హెచ్ఐబీ, నిమోకోకల్ వ్యాక్సిన్లు, ఫ్లూ వైరస్ వ్యాక్సిన్లతో నిమోనియాను చాలా వరకు నివారించవచ్చు. మీ బాబుకు ఈ వ్యాక్సిన్లు వేయించడం తప్పనిసరి. నిమోనియా వచ్చిన పిల్లలకు యాంటీబయాటిక్స్తో పాటు వాళ్లలో కనిపించే లక్షణాలకూ చికిత్స చేయడం (సపోర్టివ్ కేర్) అవసరం. పాపకు మళ్లీ చెవి నొప్పి... తగ్గేదెలా? మా పాప వయస్సు ఆరేళ్లు. రెండు నెలల క్రితం మా పాపకు జలుబు వస్తే ఈఎన్టీ స్పెషలిస్ట్ దగ్గరకు తీసుకెళ్లాం. ఆయన ముక్కు నుంచి చెవికి ఉండే ఎడినాయిడ్ గ్రంథి బ్లాక్ అయిందన్నారు. తగ్గిపోయాక ఇప్పుడు మళ్లీ మరో పక్క చెవి నొప్పిగా ఉందని అంటోంది. మళ్లీ ఇలా వచ్చే అవకాశం ఉందా? – శాంతిశ్రీ, మధిర మీరు చెబుతున్న అంశాలను బట్టి మీ పాపకు ఉన్న కండిషన్ను ‘అడినాయిడైటిస్ విత్ యూస్టేషియన్ కెటార్’ అని చెప్పవచ్చు. ఎడినాయిడ్స్ అనే గ్రంధులు ముక్కు వెనకాల, టాన్సిల్ పైన ఉంటాయి. ఈ గ్రంథులకు టాన్సిల్స్ తరహాలో ఇన్ఫెక్షన్ రావచ్చు. ఇది కొన్ని వారాలు, నెలలు ఉండవచ్చు. చిన్న పిల్లల్లో ఈ కండిషన్ను తరచూ చూస్తుంటాం. ఇలాంటిది జరిగినప్పుడు మధ్య చెవి నుంచి ముక్కు వెనుక భాగంలో ఉండే యూస్టేషియన్ ట్యూబులో కొన్ని మార్పులు జరగవచ్చు. ఎడినాయిడ్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు సైనుసైటిస్, ముక్కు రంధ్రాలు మూసుకుపోవడం (బ్లాక్ కావడం), నోటితో గాలి పీల్చడం, నిద్రపట్టడంలో ఇబ్బంది (రెస్ట్లెస్ స్లీప్) వంటి ఇతర లక్షణాలూ కనిపించవచ్చు. ఇలాంటి పిల్లలకు యాంటీహిస్టమిన్, యాంటీబయాటిక్ కోర్సులతో చికిత్స చేయాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో నొప్పి ఉంటే పెయిన్ మెడికేషన్ కూడా అవసరం కావచ్చు. ఇలాంటి లక్షణాలు చాలా దీర్ఘకాలం కొనసాగితూ ఉంటే కొందరిలో చాలా అరుదుగా ఎడినాయిడ్స్ను తొలగించాల్సి రావచ్చు. మీరు మీ పీడియాట్రీషియన్ లేదా ఈఎన్టీ సర్జన్ను కలిసి తగిన చికిత్స తీసుకోండి. ఈ వయసులోనే పాపాయికి కాళ్లనొప్పులా... ఎందుకిలా? మా పాపకు ఏడేళ్లు. తరచూ కాళ్లనొప్పులంటూ ఏడుస్తోంది. ఇటీవల మరీ ఎక్కువగా ఉన్నట్లు గమనించాం. కొన్నిసార్లు నిద్రనుంచి లేవడం, కాసేపు కాళ్లు నొక్కాక అవి తగ్గడం, ఆ తర్వాత పడుకోవడం చేస్తోంది. మా డాక్టర్గారిని సంప్రదిస్తే ఆందోళన అక్కర్లేదని చెప్పారు. మా దగ్గరి బంధువుల్లో ఒక పెద్దావిడకు కూడా ఇలాగే కాళ్లనొప్పులు వస్తుంటే వారు డాక్టర్ను సంప్రదించారు. ఆమెకు రుమటాయిడ్ సమస్య అని చెప్పారు. మా పాపకు కూడా రుమటాయిడ్ సమస్య వచ్చి ఉంటుందంటారా? ఇవి దాని తాలూకు లక్షణాలా? మాకు తగిన సలహా ఇవ్వండి. – నీరజ, నెల్లూరు పిల్లల్లో కండరాల నొప్పులు కనిపిస్తున్నాయనేది చాలా సాధారణంగా వినిపించే ఫిర్యాదు. దాదాపు 10 శాతం నుంచి 30 శాతం మంది పిల్లల్లో రకరకాల స్థాయుల్లో కండరాల నొప్పులు (మస్క్యులో స్కెలెటల్ పెయిన్స్) కనిపిస్తుంటాయి. అయితే వీటిల్లో ఎక్కువగా కనిపించేవన్నీ చాలావరకు హానికరం కాని బినైన్ తరహావే. పిల్లల్లో ఇలా నొప్పి అని చెప్పేవాటిల్లో చాలావరకు ప్రమాదవశాత్తు దెబ్బతగలడం (ట్రామా), ఎక్కువగా ఆడటం (ఓవర్ యూజ్), పెరుగుదల సమయంలో మన ఎముకల్లో (స్కెలెటల్ గ్రోత్) కనిపించే హెచ్చుతగ్గుల వంటి చాలా సాధారణ సమస్యల వల్లనే కనిపిస్తుంటాయి. ఇక పిల్లల్లో కనిపించే నొప్పుల్లో ఏది ఏది ప్రమాదకరం కానిది లేదా ప్రమాదకరమైనది అని నిర్ణయించేందుకు ఈ సూచనలను గమనించండి. ప్రమాదకరం కానివి 1. ఏదైనా పనిచేయగానే పెరిగేవి, విశ్రాంతి తీసుకున్న తర్వాత తగ్గేవి 2. సాయంత్రంపూట, రాత్రి పూట కనిపించేవి 3. కీళ్ల దగ్గర వాపు లేకపోవడం, ముట్టుకుంటే నొప్పి/మంట (టెండర్నెస్) లేకపోవడం. 4. పిల్లల్లో పెరుగుదల మామూలుగానే ఉండటం 5. ల్యాబ్ పరీక్షలు / ఎక్స్–రే పరీక్షలు నార్మల్గా ఉండటం. 6. జ్వరం వంటి లక్షణాలేమీ లేకుండా ఉండటం. ప్రమాదకరమైనవి 1. ఏదైనా పనిచేయగానే కాస్తంత ఉపశమనం అనిపించేవి, విశ్రాంతి తీసుకున్నా తగ్గనివి 2. ఉదయం వేళల్లోనూ, చాలా రాత్రి గడిచాక కనిపించేవి 3. కీళ్ల దగ్గర వాపు కనిపించేవి, ముట్టుకుంటే నొప్పి/మంట (టెండర్నెస్) ఉండటం. కీళ్లు బిగుసుకుపోయి, కదలికలు తక్కువగా ఉండటం. 4. పిల్లల్లో పెరుగుదల తక్కువగా ఉండటం. 5. ల్యాబ్ పరీక్షలు / ఎక్స్–రేలో మార్పులు ఉండటం. 6. జ్వరం వంటి లక్షణాలు కనిపించడం. మీరు మీ లేఖలో మీ పాపకు పైన పేర్కొన్న తీవ్రమైన / ప్రమాదకరమైన లక్షణాలేమీ ఉన్నట్లు చెప్పలేదు. కాబట్టి అవి అంత తీవ్రమైనవి కావనీ, హానికరం కానివేనని భావించవచ్చు. పిల్లలు పెరిగే సమయంలో కనిపించే సాధారణమైన నొప్పులుగా (అంటే నాక్చర్నల్ పెయిన్స్ ఆఫ్ ఛైల్డ్హుడ్గా) వీటిని పరిగణించవచ్చు. పెరుగుతున్నప్పుడు 20 శాతం మంది పిల్లల్లో ఇలా నొప్పులు కనిపించడం చూస్తుంటాం. పెరిగే పిల్లల్లో కీళ్లనొప్పులు, తొడ, పిక్కల్లో ఇవి కనిపిస్తూ తరచూ వచ్చిపోతుంటాయి. మసాజ్ చేయగానే లేదా కొద్దిపాటి పెయిన్కిల్లర్స్తో ఇవి తగ్గిపోతుంటాయి. మర్నాడు ఉదయానికి ఈ నొప్పులు ఉండవు. వయసు పెరుగుతున్నకొద్దీ ఈ నొప్పులు క్రమేపీ తగ్గిపోతాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కొందరిలో నొప్పి భరించే శక్తి (పెయిన్ థ్రెషోల్డ్) తక్కువగా ఉంటుంది. ఇలాంటి పిల్లల్లో ఈ కండరాల నొప్పులతో పాటు పొట్టనొప్పి, తలనొప్పి వంటివి కూడా కనిపిస్తూ ఉండటం చూడవచ్చు. ఇక మీ పాప విషయానికి వస్తే మీరు ఎలాంటి ఆందోళన చెందకుండా ఆమెకు అవసరమైనప్పుడు కొద్దిపాటి నొప్పి నివారణ మందుతో పాటు ధైర్యం చెప్పడం, ఆరోగ్యకరంగా నిద్రపుచ్చడం వంటివి చేస్తూ ఉంటే ఇవి క్రమేపీ తగ్గిపోతాయి. ఇక మీరు మీ బంధువుల్లో పెద్దలెవరికో రుమాటాయిడ్ సమస్యను ప్రస్తావిస్తూ ఒక ప్రశ్న అడిగారు. మీ సందేహానికి జవాబు ఏమిటంటే... పిల్లల్లోనూ రుమటాయిడ్ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. దీన్నే జువెనైల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు. కానీ మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీ పాపకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నట్లుగా ఏమాత్రమూ అనిపించడం లేదు. కాబట్టి మీరు ఆందోళన చెందకండి. పైన పేర్కొన్న విషయాలను ఒకసారి మీ పీడియాట్రీషియన్ లేదా రుమటాలజిస్ట్తో చర్చించి, వారు పాపకు ఏవైనా పరీక్షలు సూచిస్తే వాటిని చేయించి, నిశ్చింతగా ఉండండి. డా. రమేశ్బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్, రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ, హైదరాబాద్ -
‘అంతర’ం అవసరమా?
సాక్షి, హైదరాబాద్: కుటుంబ నియంత్రణలో కొత్త పద్ధతులు వివాదాస్పదమవుతున్నాయి. అవసరాలకు తగినట్లుగా కాకుండా అన్ని రాష్ట్రాలకూ ఒకే విధానం అమలు చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గర్భ నివారణ కోసం ఇప్పటివరకు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స, పిల్స్ (మాత్రలు), గర్భాశయ పరికరం (ఐయూడీ), కండోమ్ విధానాలు ఉన్నాయి. అయితే తెలంగాణ ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ తాజాగా కుటుంబ నియంత్రణలో మహిళల కోసం ‘అంతర’పేరిట మెడ్రాక్సిప్రొజెస్టరోన్ ఇంజెక్షన్ను తీసుకొచ్చింది. 2017 డిసెంబర్ 24న హైదరాబాద్లో 25 మంది మహిళలకు దీన్ని ఇప్పించింది. రూ.1,500 విలువైన ఇంజెక్షన్ను ఉచితంగానే అందిస్తోంది. తొలి దశ కోటా కింద రాష్ట్రానికి 17 వేల వ్యాక్సిన్ డోసులు వచ్చాయి. గర్భం రాకుండా ఉండేందుకు మూడు నెలలకోసారి అంతర (మెడ్రాక్సిప్రొజెస్టరోన్) ఇంజెక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇంజెక్షన్ను ఆపేసిన మూడు నెలల తర్వాత తిరిగి గర్భం దాల్చేందుకు అవకాశం ఉంటుంది. అయితే జనాభా నియంత్రణ ఉన్న మన రాష్ట్రంలో ఇలాంటి విధానాల అమలు వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఉంటాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. టీఎఫ్ఆర్ తక్కువగా ఉన్నా... దేశ సగటు టీఎఫ్ఆర్ (టోటల్ ఫర్టిలిటీ రేట్) ప్రస్తుతం 2.23 (ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ)గా ఉంది. 2024 నాటికి ప్రపంచంలోనే ఎక్కువ జనాభాగల దేశంగా భారత్ నిలుస్తుందనే అంచనాలున్న నేపథ్యంలో జనాభా నియంత్రణ కోసం కొత్త విధానాలను అమలు చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. దీంతో టీఎఫ్ఆర్ను 2.0కు తగ్గించాలనే లక్ష్యంతో వైద్య, ఆరోగ్యశాఖ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ‘అంతర’ను తీసుకొచ్చింది. జనాభా నియంత్రణ విషయంలో టీఎఫ్ఆర్ను ప్రామాణికంగా తీసుకోవాలని అంతర్జాతీయ వైద్య ప్రమాణాలు చెబుతున్నాయి. బిహార్, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, జార్ఖండ్ వంటి 18 రాష్ట్రాల్లో టీఎఫ్ఆర్ రెండు కంటే ఎక్కువగా ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, పంజాబ్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో మాత్రం టీఎఫ్ఆర్ రెండు కంటే తక్కువగా ఉంది. కానీ కేంద్రం మాత్రం అన్ని రాష్ట్రాల్లోనూ ఒకేలా జనాభా నియంత్రణను అమలు చేయాలనుకుంటుండటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టీఎఫ్ఆర్ రెండు కంటే తక్కువ ఉన్న రాష్ట్రాలలో కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు సహా అన్నింటిలోనూ సమతూకం ఉండేలా చర్యలు తీసుకోవాలని వైద్య ప్రమాణాలు చెబుతున్నాయి. మన రాష్ట్రంలో టీఎఫ్ఆర్ 1.8 ఉంది. ఇంకా తగ్గితే భవిష్యత్తులో జనాభాలో సమతూకం ఉండదనే ఆందోళన ఉంది. టీఎఫ్ఆర్ 1.57 ఉన్న చైనాలో దీన్ని పెంచేందుకు ప్రభుత్వం తాజాగా చర్యలు చేపట్టింది. ఇద్దరు పిల్లలను కనాలనే దిశగా అక్కడ ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో టీఎఫ్ఆర్ 2.0 కంటే తక్కువగా ఉన్న తెలంగాణలోనూ గర్భ నిరోధక సూదిమందు వినియోగంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఉత్తరాదిలో వాడకంపై వివాదం! ఉత్తరాది రాష్ట్రాలలో అంతర ఇంజెక్షన్ వాడకంపై వివాదం నెలకొంది. మిషన్ పరివారం వికాస్ కార్యక్రమం పేరుతో టీఎఫ్ఆర్ మూడు కంటే ఎక్కువగా ఉన్న ఏడు రాష్ట్రాల్లోని 145 జిల్లాల్లో ఈ ఇంజెక్షన్ను కచ్చితంగా అమలు చేయాలని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయించింది. అయితే ఇంజెక్షన్ వాడిన మహిళల్లో బోలు ఎముకల వ్యాధి, రొమ్ము కేన్సర్ వస్తున్నాయని పలు స్వచ్ఛంద సంస్థలు ఆరోపిస్తుండగా అధికార వర్గాలు మాత్రం దీన్ని ఖండిస్తున్నాయి. ప్రైవేటు వైద్య రంగంలో ఇప్పటికే గర్భనిరోధక ఇంజెక్షన్ అందుబాటులో ఉందని, దీని వాడకం వల్ల ఎవరికీ ఎలాంటి దుష్పరిణామాలు రాలేదని చెబుతున్నాయి. -
నొప్పి లేని ఇంజెక్షన్కు కొత్త దారి!
సూదిమందంటే మీకు భయమా? అయితే మీ ఇబ్బంది ఇక తీరినట్లే. ఎలాంటి నొప్పి, బాధ లేకుండా శరీరంలోకి జబ్బుల్ని నయం చేసే మందులను పంపించేందుకు మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) శాస్త్రవేత్తలు ఓ వినూత్నమైన పరికరాన్ని అభివృద్ధి చేయడం దీనికి కారణం. సూదిమందుకు ప్రత్యామ్నాయంగా బుల్లిబుల్లి సూదులతో కూడిన బ్యాండ్ ఎయిడ్లు, లేజర్ ఆధారిత పరికరాలు వంటివి గతంలో బోలెడన్ని వచ్చినా.. అవేవీ పూర్తిస్థాయిలో విజయం సాధించలేదు. కానీ ఎంఐటీ శాస్త్రవేత్తల కొత్త పరికరం మాత్రం దీనికి భిన్నంగా త్వరలోనే మార్కెట్లోకి రానుంది. ‘ప్రైమ్’ అని పిలుస్తున్న ఈ యంత్రాన్ని జపనీస్ ఫార్మా కంపెనీ ‘తకేడా’ మార్కెట్లోకి తేనుంది. మామూలు ఇంజెక్షన్ల మాదిరిగానే ప్రైమ్లోనూ ద్రవరూపంలో ఉండే మందులనే వాడతారు. కాకపోతే సూదితో లోపలికి పంపించకుండా, మందును వాయురూపంలోకి మార్చి, పీడనానికి గురిచేసి చర్మ రంధ్రాల ద్వారా లోపలకు పంపుతారు. ఇదెంత వేగంగా జరుగుతుందంటే... శరీరంలోకి వెళ్లేటప్పుడు మందు ప్రయాణించే వేగం సెకనుకు 656 అడుగులు. వెంట్రుక పరిమాణం కంటె సన్నటి గొట్టం ద్వారా ఇది చర్మం ద్వారా కణజాలంలోకి చేరిపోతుంది. వేగాన్ని నియంత్రించేందుకూ దీంట్లో ఏర్పాట్లు ఉన్న కారణంగా మందును శరీరంలో ఎంత లోతుకు కావాలంటే అంత లోతుకు చేర్చవచ్చు. వాడేసిన తరువాత మందు ఉన్న చిన్న పెట్టెను యంత్రం నుంచి బయటకు తీసి చెత్తబుట్టలో పడేస్తారు. మధుమేహానికి వాడే ఇన్సులిన్ మొదలుకొని వ్యాక్సిన్లు, హార్మోన్లను కూడా ఈ యంత్రం ద్వారా వాడవచ్చునని తకేడా అంటోంది. సూదితో పోలిస్తే తమ యంత్రం ద్వారా మందులు తీసుకోవడం ఎంతో సురక్షితమని, వాడి పడేసిన మందుల పెట్టెలతోనూ ఎలాంటి ఇబ్బంది లేదని తెలుస్తోంది. -
కాలం చెల్లిన మందులు
260 రకాల మందులు, ఇంజక్షన్లు, సర్జికల్స్కు ముగిసిన గడువు ఉపయోగపడనివి కొనుగోలు టీఎస్ఎంఐడీసీ నిర్వాకం సిటీబ్యూరో: తెలంగాణ వైద్య మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్ఎంఐడీసీ) అధికారుల అవినీతి, అనాలోచిత నిర్ణయాలతో ధర్మాసుపత్రులు దగా పడుతున్నాయి. రోగులకు అవసరం లేని... గడువు సమీపించిన నాసిరకం మందులు ఇష్టం వచ్చినట్లు కొనుగోలు చేయడం... తీరా వాటి కాల పరిమితి దాటాక గుట్టుచప్పుడు కాకుండా తిప్పి పంపడం పరిపాటిగా మారింది. ఒక్క హైదరాబాద్లోని సెంట్రల్ డ్రగ్ స్టోర్లోనే రూ.4 కోట్ల విలువైన మందులు మురిగిపోయినట్లు తెలిసింది. వీటిలో డెక్స్స్ట్రోస్ ఐవీ ఇంజక్షన్లు, ట్రాకియోస్లోమీ ట్య్రూబ్స్, సెఫ్టాజిడిమ్ ఇంజక్షన్లు, క్లోరాంఫెనికాల్ ఆప్లీక్యాప్సుల్స్, మైకోనాజోల్ ఆయింట్మెంట్, మిైథైల్ కొబొలమిన్ టాబ్లెట్స్, జెంటామైసిన్, డిస్పోజబుల్ కస్కో స్పెక్యూలిమ్, లిగ్నోకైన్, విటమిన్ ఎ,డి క్యాప్స్ ఐపీ సహా మొత్తం 210 రకాల మందులు, డిస్పోజల్స్, 50 రకాల ఇంజక్షన్లు ఎక్స్పైర్ అయినట్లు తెలిసింది. వీటిలో ఇప్పటికే కొన్నిటిని సంబంధిత కంపెనీలకు తిప్పి పంపగా... మరికొన్ని స్టోర్లో మగ్గుతుండటం విశేషం. ఇదిలా ఉంటే... స్టోర్స్లో నిల్వ ఉన్న మందులు తీసుకెళ్లాలని... లేదంటే వచ్చే బడ్జెట్లో కోత పడుతుందని ఆస్పత్రుల్లోని ఫార్మసిస్టులకు బెదిరింపులకు దిగుతున్నారు. అధికారుల బెదిరింపులకు భయపడి అవసరం లేకపోయినా మందులు తీసుకెళ్లి స్టోర్స్లో నిల్వ చేస్తున్నారు. గడువు ముగిసిన మందులను కాల్చివేయాలన్నా...పూడ్చిపెట్టాలన్నా ...పీసీబీ అనుమతి తప్పనిసరి. దీంతో వీటిని ఎలా వదిలించుకోవాలో తెలియక ఫార్మసిస్టులు తలలు పట్టుకుంటున్నారు. సరఫరా అస్తవ్యస్థం ఉస్మానియా, గాంధీ వంటి బోధనాసుపత్రుల్లోనే కాదు... శివారులోని ఏరియా ఆస్పత్రులు... బస్తీల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ మందుల సరఫరా అస్తవ్యస్థంగా ఉంది. ఖరీదైన మందుల సంగతేమో గానీ... బీపీ, షుగర్, బి కాంప్లెక్స్, ఐరన్, ఫోలిక్ యాసిడ్ వంటి సాధారణ మాత్రలు కూడా దొరకడం లేదు. ఫలితంగా వైద్యుడు రాసిన చీటీ పట్టుకుని ప్రైవేటు పార్మసీలను ఆశ్రర ుుంచాల్సి వస్తోంది. ఒక్కో ఏరియా ఆస్పత్రికి మందుల కోసం ప్రతి మూడు నెలలకోసారి రూ.3.5 లక్షల చొప్పున ప్రభుత్వం మంజూరు చేస్తుంది. 145 రకాల మందులు సరఫరా చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటిస్తున్నా.. ఆస్పత్రుల్లో 30-35 రకాలకు మించి దొరకడం లేదు. ఒక్కో గర్భిణికి 100 బి కాంప్లెక్స్ టాబ్లెట్స్ ఇవ్వాలి. కానీ రోగుల నిష్పత్తికి తగినన్ని మందులు లేకపోవడంతో పది రాస్తే..ఐదు మాత్రలు ఇచ్చి పంపుతున్నారు. ఒకచోట మందుల కొరత ఉంటే... సమీప ఆస్పత్రిలోని నిల్వలను సర్ది పెట్టాలి. అధికారులు ఇవేవీ పట్టించుకోవడం లేదు. ఇష్టం వచ్చినట్లు ఇండెంట్లు పంపి మందులు కొనుగోలు చేస్తున్నారు. నాణ్యత ప్రశ్నార్థకం దగ్గు, జలుబుతో బాధ పడుతున్న చిన్నారుల కోసం కొనుగోలు చేసిన సిరప్లలో ఫంగస్ ఉన్నట్లు ఇటీవల ఓ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు గుర్తించారు. రాజేంద్రనగర్లోని సెంట్రల్ డ్రగ్ స్టోర్స్కు వాటిని తిప్పి పంపడాన్ని బట్టి మందుల సరఫరా తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవ చ్చు. మందులు, సర్జికల్స్ నాణ్యతను క్వాలిటీ కంట్రోల్ అధికారులు పట్టించుకోవడం లేదు. టెండర్లో ఖచ్చితమైన నిబంధనలు ఉన్నా పాటించడం లేదు. చాలా మందు సీసాలకు మూతలు ఉండటం లేదు. సర్జికల్స్, బాటిళ్లు పగిలిపోతున్నాయి. రెండు, మూడు నెలల్లో గడువు ముగిస్తే మందులు సరఫరా అవుతున్నాయి. ఇదిలా ఉంటే ఇటీవల జాతీయ పల్స్పోలియె ూ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ జిల్లాలో అవసరానికి మించి వ్యాక్సిన్ కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. మిగిలిన వ్యాక్సిన్ను వదిలించుకునేందుకు మరోసారి వ్యాక్సినేషన్ చేపట్టాలని అధికారులు ఒత్తిడి తెస్తుండగా... కొంతమంది వైద్యులు నిరాకరిస్తుండటం గమనార్హం. -
లైన్లో పడాలంటే.. సెలైన్ ఉండాల్సిందే
జ్వరం వచ్చినపుడు డాక్టర్ ఇంజెక్షన్ వేస్తాడంటే చాలు తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. చిన్న పిల్లలైతే మరీనూ.. అయితే కంబోడియా ప్రజలు మాత్రం దీనికి పూర్తి విరుద్ధంగా ఉంటారు. ఇంజెక్షన్లు, సెలైన్లు ఎక్కించుకోవడం అంటే వారికి మహా ఇష్టం. ఎంతగా అంటే బైక్పై వెళ్తూకూడా ఓ సెలైన్ బాటిల్ వారి వెంట ఉంచుకుంటారు. రోడ్లపై నడుచుకుంటూ వెళ్లే వారు కూడా ఓ సెలైన్ బాటిల్ పట్టుకు తిరుగుతారు. దీనికి కారణం సరిగా తెలియదు కానీ సెలైన్ల వల్ల వారిలో ఏదో తెలియని శక్తి వస్తుందని వారి నమ్మకం. -
నెలకు రెండు ఇంజెక్షన్లతో హెచ్ఐవీకి చెక్!
హెచ్ఐవీ వ్యాధి నియంత్రణ దిశగా కీలక అడుగు పడింది. సుదీర్ఘకాలం క్రియాశీలంగా ఉండే రెండు ఇంజెక్ట్బుల్ ఔషధాలను నెలకోసారి లేదా రెండు నెలలకోసారి రోగికి ఇవ్వడం వల్ల హెచ్ఐవీకి నిరవధికంగా చెక్ పెట్టవచ్చునని ప్రాథమిక పరిశోధనల్లో వెల్లడైంది. హెచ్ఐవీ నిరోధానికి జాన్సన్ అండ్ జాన్సన్, దాని భాగస్వామ్య సంస్థ వీఐఐవీ కలిసి చేపడుతున్న ప్రాథమిక పరీక్షా ఫలితాల్లో ఈ విషయం వెల్లడైంది. ఆ కంపెనీలు చేపడుతున్న మొత్తం 96 వారాల అధ్యయనంలో భాగంగా మొదటి 32 వారాల అధ్యయన ఫలితాలను మంగళవారం ప్రకటించాయి. ఈ రెండు కంపెనీలు చేరో ఔషధంతో హెచ్ఐవీ నిరోధానికి ఈ పరిశోధన నిర్వహిస్తున్నాయి. హెచ్ఐవీ వ్యాధి నిరోధక ఔషధాలు అందించడంలో వీఐఐవీ పేరెన్నికగన్న సంస్థ. ఈ ప్రయోగానికి సంబంధించి కీలకమైన అదనపు పరీక్షలు ఇంకా జరుగాల్సింది. అయితే, ఈ ఔషధ కలయిక చికిత్సకు ఆమోదం లభిస్తే.. ప్రపంచవ్యాప్తంగా గడగడలాడిస్తున్న ఎయిడ్స్ వ్యాధి నిరోధంలో గణనీయమైన ముందడుగు పడినట్టే. పరిశోధనలో భాగంగా 309 హెచ్ఐవీ మంది రోగులపై పరీక్షలు నిర్వహించారు. రక్తంలో హెఐవీ వైరస్ను నిరోధించేందుకు రోజువారీ ఔషధ మాత్రలను వీరు గతంలో తీసుకునేవారు. వీరికి ప్రయోగదశలో ఉన్న ఇంజెక్షన్లు ఇవ్వగా.. దాదాపు 95శాతం మంది రక్తంలోని హెచ్ఐవీ వైరస్ను 32 వారాలపాటు నియంత్రించింది. ఔషధమాత్రలు తీసుకునేవారు 91శాతం మందిలో మాత్రమే హెచ్ఐవీ నియంత్రణ సాధ్యపడింది. మాత్రలు, ఇంజెక్షన్లు తీసుకునే రెండు గ్రూపుల రోగులకు చికిత్స కొనసాగిస్తూ.. కాలనుగుణంగా వారి రక్తాన్ని పరీక్షిస్తున్నారు. ఈ అధ్యయన నివేదికలను పరిశీలిస్తే.. రానున్నకాలంలో కొత్త విధానమే ఆచరణసాధ్యంగా కనిపిస్తున్నదని హార్వర్డ్ మెడికల్ స్కూలుకు చెందిన ఎయిడ్స్ చికిత్స నిపుణుడు డాక్టర్ డానియెల్ కురిట్జ్కెస్ తెలిపారు. -
కలవరపరుస్తున్న సైకో..ఇంజెక్షన్తో దాడి
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలో ఐదు రోజులుగా మహిళలు, యువతులకు ఇంజెక్షన్లతో పొడుస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్న సైకో బాధితుల సంఖ్య పెరుగుతోంది. జిల్లాలోని డెల్టా ప్రాంతంలో శనివారం నుంచి బుధవారం వరకు 13 మంది మహిళలు, విద్యార్థినులపై మత్తు ఇంజెక్షన్లతో సైకో దాడి చేశాడు. ఈనెల 22న యండగండి గ్రామంలో ఇద్దరు విద్యార్థినులపై దాడిచేసి గాయపర్చిన సైకో మంగళవారం మరో ఆరుగురు మహిళలపై దాడి చేశాడు. బుధవారం పెనుగొండ సమీపంలోని చెరుకువాడలో ఉదయం 6 గంటల వేళ వాకిలి ఊడ్చుతున్న గృహిణి కొమ్మిరెడ్డి హేమలత (27)కు ఇంజెక్షన్ పొడిచి పరారయ్యాడు. అదే మండలంలోని సిద్ధాంతంలో 6.30 గంటలకు కృష్ణకుమారి (16) అనే బాలికపై ఇంజెక్షన్తో దాడికి పాల్పడ్డాడు. 7.30కు పోడూరు మండలం కవిటం లో సైకిల్పై కళాశాలకు వెళ్తున్న విద్యార్థిని కొవ్వూరి తేజశ్రీ (17)కి వెనుకవైపుగా వచ్చి ఇంజెక్షన్ చేసి పరారయ్యాడు. వీరవాసరం మండలం కొణితివాడలో విద్యార్థిని కేతా విజయ(17)పై కూడా ఇదే విధంగా దాడిచేశాడు. మధ్యాహ్నం 12.30 గంటలకు నలజర్లలోని గంటా చంటి (21) అనే మహిళపై సిరంజి గుచ్చి పరారయ్యాడు. బాధితులు స్థానిక ప్రభుత్వాసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా, సైకో వినియోగిస్తున్నది ఇంజెక్షన్లు కాదని, అది స్టిచ్చింగ్ నీడిల్ మాత్రమేనని నార్త్ కోస్టల్ ఐజీ కుమార విశ్వజిత్ తెలిపారు. బాధితుల రక్తం ల్యాబ్లకు పంపగా, ఎటువంటి రసాయనాలు, మత్తుమందులు లేవని తేలిందని తెలిపారు. -
హెచ్ఐవీ, హెపటైటిస్లు హోమియోతో హద్దుల్లో...
రక్తమార్పిడి. ఇంజక్షన్లు, సంభోగం, ముద్దుల ద్వారా లైంగిక వ్యాధులు వ్యాపిస్తాయి. ఒక్కోసారి ఇవి ప్రాణాంతకమూ కావచ్చు. హెర్పిస్, గనేరియా, సిఫిలిస్, హెచ్పీవీ లాంటి వ్యాధులను ముందే గుర్తించి హోమియో చికిత్స తీసుకుంటే పూర్తిగా నయమవుతాయనీ, హెచ్ఐవి లాంటివి నియంత్రణలో ఉండి, రోగనిరోధకశక్తి పెరుగుతుందని అంటున్నారు ప్రముఖ హోమియో వైద్యనిపుణులు డాక్టర్ రవికిరణ్. ఎయిడ్స్ లేదా హెచ్ఐవి: హ్యూమన్ ఇమ్యునో డెఫిషియన్సీ వైరస్ వ్యాధి నిరోధకశక్తిని నాశనం చేసి, టీబీ, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, నిమోనియా, విరేచనాలు, చర్మరోగాలకు తేలిగ్గా గురయ్యేలా చేస్తుంది. లక్షణాలు: అరక్షిత సంభోగం అనంతరం రెండు నుంచి నాలుగు వారాల తర్వాత జ్వరం, గొంతునొప్పి, కురుపులు, ఒళ్ళు నొప్పులు, నీరసం, నోటిపూత, తలనొప్పి, వికారం, వాంతులు, బరువు తగ్గడం, నోటిలో అల్సర్లు, రాత్రిపూట చెమటలు, కీళ్ళ నొప్పులు, గవద బిళ్ళల వాపు, కాలేయం, ప్లీహం వాపు. హెచ్ఐవీని గుర్తుపట్టేదెలా? ప్రాథమికంగా ట్రైడాట్ టెస్ట్; ఎలీసా; కచ్చితత్వానికి వెస్ట్రన్బ్లాట్ టెక్నిక్. హోమియో చికిత్స... హెచ్ఐవీ వ్యాధి బాధపడేవారిలో ముఖ్యమైన సమస్య రోగనిరోధకశక్తి తగ్గడం. రోగనిరోధకశక్తిని తగ్గకుండా ఆపగలిగితే రోగికి హెచ్ఐవీ కాంప్లికేషన్స్ రాకుండా మరికొంత సమయం ఆపవచ్చు. రోగికి హోమియో వైద్యం ద్వారా ఆరోగ్యవంతమైన జీవనాన్ని అందించవచ్చు. హెపటైటిస్ బి, సి వ్యాధులు : కొన్ని వైరస్లు శరీరంలో ప్రవేశించి నిద్రాణంగా ఉండిపోతాయి. ఆ సమయంలో ఎలాంటి లక్షణాలూ కనిపించవు. లక్షణాలేమీ లేవు కదా అని నిర్లక్ష్యంగా ఉండిపోతే ఒక్కోసారి ప్రాణాపాయం ఏర్పడవచ్చు. అలాంటి వాటిలో ముఖ్యమైనవి హెపటైటిస్ బి, సి, హెర్పిస్ సింప్లెక్స్ వైరస్లు. హెపటైటిస్ బి, సి కూడా లైంగిక కారణాల వల్ల సంక్రమిస్తాయి. ఇందుకు హెపటైటిస్ బి, సి వైరస్లే కారణం. ఈ వైరస్ తన ప్రత్యుత్పత్తికి కాలేయాన్ని ఎంచుకోవడంతో కాలేయానికి సంబంధించిన సమస్యలు ఉత్పన్నమవుతుంటాయి. లక్షణాలు: అలసట, ఆకలి లేకపోవటం, వాంతులు, ఒళ్ళు నొప్పులు, జ్వరం ఉంటుంది. జ్వరం ఉన్నా బయటకు కనిపించదు. కళ్లు, శరీరం పచ్చగా మారటం, చర్మం మీద పొక్కులు, కీళ్లనొప్పులు, వాంతి వచ్చినట్టుగా అనిపించడం (వికారం), మూత్రం పచ్చగా రావడం; తరువాత నెమ్మదిగా కామెర్లు మొదలవుతాయి. చర్మంపై దద్దుర్లు కనిపిస్తాయి. చివరన కాలేయం పనితీరు తగ్గి మరణం సంభవిస్తుంది. హెచ్బీఎస్ ఏజీ అనే పరీక్ష ద్వారా హెపటైటిస్ బి వ్యాధిని గుర్తించవచ్చు. పీసీఆర్, డీఎన్ఏ క్వాలిటేటివ్ టెస్ట్ ద్వారా ఈ వ్యాధిని నిర్ధారించవచ్చు. హోమియో చికిత్స: హెపటైటిస్ బి, సి వైరస్లు కాలేయంలో పెరుగుతాయి. హోమియోలో క్లాసికల్ విధానం ద్వారానే ఈ వ్యాధిని ఎదుర్కోగలం. లైకోపోడియం, హెపర్ సల్ఫ్, మెర్క్సాల్, బ్రయోనియా, ఫాస్ఫరస్ వంటి మందులు వ్యాధిని తగ్గించడంలో బాగా ఉపయోగపడతాయి. హెర్పిస్ సింప్లెక్స్: ఒక గుండుసూది గుండు మీద కోటి వైరస్ల దాకా ఇమిడిపోయేంత సూక్ష్మమైన ఈ వైరస్ జీవితాంతం బాధిస్తుంది. హెర్పిస్ సింప్లెక్స్-2: ఈ వ్యాధి కూడా లైంగిక చర్యలతోనే వ్యాపిస్తుంది. తొలిదశలో జననాంగాల్లో మంట, నొప్పి, మూత్రంలో దురద, జ్వరం, ఒళ్ళు నొప్పులు, గజ్జలు, చంకల్లో గడ్డలు ఏర్పడటం దీని లక్షణాలు. వ్యాధి ముదిరాక జననాంగాలపై పొక్కులు ఏర్పడి, పగిలి పుండ్లలా మారతాయి. పరీక్షలు: హెచ్ఎస్వీ 1, 2 పరీక్షలు, ఐజీఏ, ఐజీఎం పరీక్షల ద్వారా. నిర్ధారణ: ఈ వ్యాధిలో వైరస్ నిర్ధారణ చాలా ముఖ్యం. లైంగిక సంపర్కం తరువాత వారం రోజులలో నీటి పొక్కులలాగా వచ్చి పుండ్లు కనిపిస్తాయి. హోమియో చికిత్స: హెర్పిస్ సింప్లెక్స్ వంటి లైంగిక వ్యాధుల నివారణకు హోమియో చికిత్స అద్భుతంగా పనిచేస్తుంది. ఈ చికిత్స మూలకారణాన్ని గుర్తించి దాన్ని తొలగిస్తుంది. దీనివల్ల సత్ఫలితాలు పొందవచ్చు. డాక్టర్ రవికిరణ్, గోల్డ్ మెడల్ ఫర్ ఎక్సలెన్సీ ఇన్ మెడిసిన్, ప్రముఖ హోమియో వైద్యనిపుణులు, మాస్టర్స్ హోమియోపతి, అమీర్పేట్, కూకట్పల్లి, దిల్సుఖ్నగర్, హైదరాబాద్, కరీంనగర్,విజయవాడ, ఫోన్: 7842 108 108 / 7569 108 108 -
అన్ని జబ్బులకూ ఒకటే మందు
జిల్లాలోని ప్రభుత్వాస్పత్రులను మందుల కొరత పీడిస్తోంది. అనేకచోట్ల మాత్రలు, సిరప్లు, సిరంజ్ల స్టాక్ నామమాత్రంగా కూడా లేదు. పలు ఆస్పత్రుల్లో ఫ్రిజ్లు పనిచేయకపోవడంతో పాము, కుక్కకాటు నివారణ మందులు పాడయ్యాయి. కొన్ని చోట్ల అన్ని జబ్బులకూ పారాసిటమాల్ మాత్రలే ఇస్తున్నారు. విధిలేని పరిస్థితుల్లో రోగులే బయట డబ్బులు పెట్టి మందులు కొనుగోలు చేస్తున్నారు. ఆర్థిక స్థోమత లేని వారి పరిస్థితి దయనీయంగా ఉంటోంది. విద్యుత్ సదుపాయం లేకపోవడంతో మదనపల్లె అర్బన్ పీహెచ్సీల్లో చీకట్లోనే వైద్యం చేస్తున్నారు. సాక్షి, చిత్తూరు: చిత్తూరు జిల్లాలో 94 పీహెచ్సీలు, 7 సీహెచ్సీలు, 15 ఏపీవీపీ ఆస్పత్రులు పని చేస్తున్నాయి. వీటిల్లో ఎక్కువచోట్ల పాము, కుక్కకాటు నివారణ మందులు ఉన్నాయి. అయితే విద్యుత్ సదుపాయం లేకపోవడం, ఫ్రిజ్లు పనిచేయకపోవడంతో మందులన్నీ పాడైపోయాయి. కొన్ని పీహెచ్సీల్లో అన్ని జబ్బులకూ పారాసిటమాల్ మాత్రలే ఇస్తున్నారు. కొన్నిచోట్ల దగ్గు, అల్సర్కు సంబంధించిన సిరప్లు అందుబాటులో లేవు. తంబళ్లపల్లె నియోజకవర్గంలో చాలా పీహెచ్సీల్లో సిరంజ్ తదితరాలు లే కపోవడంతో బయట తెచ్చుకోమని చీటీలు రాయిస్తున్నారు. ఈ క్రమంలో పేదలు ఇబ్బంది పడుతున్నారు. పీహెచ్సీల దుస్థితిపై ఈ నెల 18న సాక్షిలో కథనం ప్రచురితమైన తర్వాత చాలాచోట్ల మార్పు వచ్చింది. పలమనేరు నియోజకవర్గంలో వైద్యాధికారులు స్పందించి కొరత ఉన్న మందులను తిరుపతి నుంచి తెప్పించారు. అనేక చోట్ల వైద్యులు విధులకు సకాలంలో హాజరవుతున్నారు. సత్యవేడులాంటి పెద్ద ఆస్పత్రుల్లో స్త్రీ వైద్య నిపుణుల కొరత నెలకొంది. ఆపరేషన్ సంబంధిత పరికరాలు, అనస్తీషియా ఇంజక్షన్ల కొరత ఉంది. మదనపల్లె అర్బన్ పీహెచ్సీల్లో ఇంజక్షన్లు లేవు. అన్నింటికీ పారాసిట్మాల్ మాత్రలే దిక్కవుతున్నాయి. పాము, కుక్కకాటు నివారణ మందులు లేవు. సీటీఎం, బొమ్మనపల్లె పీహెచ్సీల్లో సీజన్ల్ వ్యాధులకు మందులు తక్కువగా ఉన్నాయి. వైద్యులు పది మాత్రలు రాస్తే రెండు మాత్రమే ఇస్తున్నారు. జీడీనెల్లూరు నియోజకవర్గంలో పీహెచ్సీల్లో పాము, కుక్కకాటు నివారణ మందులు ఉన్నాయి. విద్యుత్ సదుపాయం లేకపోవడంతో కార్వేటినగరం, ఎస్.ఆర్.పురంలో ఫ్రిజ్లు సరిగా పనిచేయడం లేదు. దీంతో మందులు పాడవుతున్నాయి. తంబళ్లపల్లె నియోజకవర్గంలోని పీహెచ్సీల్లో సిరంజ్లూ లేవు. డ్లైకోపినాక్, పారాసిట్మాల్లాంటి మాత్రలు లేవు. కురబలకోట పీహెచ్సీలో కుక్క, పాముకాటు నివారణ మందులు లేవు. సిరంజ్లు బయట నుంచి తెచ్చుకోమని చీటీలు రాసిస్తున్నారు. పలమనేరు నియోజకవర్గంలో 8 పీహెచ్సీలు ఉన్నాయి. అవసరమైన మందులు ఉన్నాయి. ఈ నెల 18న సాక్షిలో కథనం ప్రచురితం కావడంతో వైద్యవిధాన పరిషత్ అధికారులు స్పందించారు. తిరుపతి నుంచి చాలా మందులు తెప్పించారు. పెద్దపంజాణి మండలంలో డైక్లోపినాక్ మాత్రల కొరత ఉంది. నగరి నియోజకవర్గంలో ఒక ఏరియా ఆస్పత్రి, నాలుగు పీహెచ్సీలు, ఒక సీహెచ్సీ ఉన్నాయి. అన్నిచోట్లా మందు లు ఉన్నాయి. సత్యవేడు ప్రభుత్వాస్పత్రిలో పారాసిట్మాల్ మాత్రలు, అనస్తీషియా ఇంజక్షన్లు లేవు. పీలేరు నియోజకవర్గంలోని పీహెచ్సీలు, ఏరియా ఆస్పత్రుల్లో అవసరమైన మందులు ఉన్నాయి. నియోజకవర్గంలో ఆరు పీహెచ్సీలు ఉన్నా యి. పాము, కుక్కకాటు నివారణ మందులు లేవు.