Jai Bhim Movie
-
పోలీసుల కర్కశం.. యాక్సిడెంట్ జరిగిన ప్రాంతం మాది కాదయ్యా..
భోపాల్ : మానవత్వం చూపించాల్సిన పోలీసులు దారుణంగా ప్రవర్తించారు. రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు చనిపోతే.. బాధితుడి భౌతిక కాయాన్ని స్వాధీనం చేసుకుని తదుపరి కార్యక్రమాలు నిర్వహించాల్సింది పోయి కర్కశాన్ని ప్రదర్శించారు. అచ్చం ‘జై భీమ్’(jai bhim) సినిమాలో పోలీస్ స్టేషన్లో తాము చేసిన దాడిలో గిరిజనుల చనిపోతే.. కేసు నుంచి తప్పించుకునేందుకు పోలీసులు బాధితుల మృతదేహాల్ని జిల్లాల సరిహద్దుల్ని ఎలా మార్చారో.. అలాగే ఈ విషాదంలో బాధితుడికి ప్రమాదం జరిగిన ప్రాంతం తమ పరిధిలోకి రాదంటూ రెండు రాష్ట్రాల పోలీసులు తప్పించుకున్నారు. డెడ్ బాడీని రోడ్డుమీద వదిలేశారు. చివరికి.. మధ్యప్రదేశ్కు చెందిన రాహుల్ అహిర్వార్ (27) దినసరి కూలి. మధ్యప్రదేశ్ (madhya pradesh) నుంచి ఢిల్లీకి వచ్చి అక్కడే దొరికిన పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే ఈ క్రమంలో రాహుల్ మధ్యప్రదేశ్ నుంచి ఢిల్లీకి వెళ్లాడు. అక్కడ ఓ ప్రాంతంలో రోడ్డు దాటుతుండగా నిన్న సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో మరణించాడు. రాహుల్ మరణంపై సమాచారం అందుకున్న రాహుల్ సన్నిహితులు మధ్యప్రదేశ్లోని హర్పాల్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సన్నిహితుల ఫిర్యాదుతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. ప్రమాదం జరిగిన ప్రాంతం ఉత్తరప్రదేశ్(uttarpradesh)లోని మహోబా జిల్లాలోని మహోబ్కాంత్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందని చెప్పారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు.చేసేది లేక రాహుల్ భౌతిక కాయాన్ని అక్కడే ఉంచి ఉత్తర ప్రదేశ్ మహోబ్కాంత్ పీఎస్కు సమాచారం అందించారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకున్న పోలీసులు.. శవ పరీక్ష చేయించేందుకు నిరాకరించారు. ఇది తమ ప్రాంతం పరిధిలోకి రాదంటూ బుకాయించారు.దీంతో పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు రోడ్డును దిగ్బంధించారు. ప్రమాదం జరిగిన నాలుగు గంటల తర్వాత మధ్యప్రదేశ్ పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్షకు పంపించారు. ఆ తర్వాతే గ్రామస్తులు రోడ్డును క్లియర్ చేసి ట్రాఫిక్ను పునరుద్ధరించారు.రాహుల్ మరణంతో అతడి కుటుంబ సభ్యులు రోడ్డుపై మృతదేహం పక్కనే రోదిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ సందర్భంగా యువకుడి బంధువు మాట్లాడుతూ...‘ మా కుటుంబ సభ్యుడు రాహుల్ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఈ ప్రాంతం మధ్యప్రదేశ్ పరిధిలోకి వస్తుంది. కానీ పోలీసులు కేసు నమోదు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. మృత దేహం గంటల తరబడి రోడ్డుపైనే ఉంది. మేం చేసిన ఫిర్యాదుతో ఘటనా స్థలానికి వచ్చిన మధ్యప్రదేశ్ పోలీసులు.. ఈ ప్రదేశం మా ప్రాంతంలోకి రాదని మమ్మల్ని తిట్టారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి, నిందితులను గుర్తించాలని కోరారు.పోలీసుల తీరుతో రాత్రి 7 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగితే..రాత్రి 11 గంటల సమయంలో మృతదేహాన్ని రోడ్డుపై నుంచి బయటకు తీశారు’అని కన్నీరు మున్నీరయ్యారు. -
జై భీమ్తో గుర్తింపు.. తెలుగులో ఈ సినిమాతో ట్రెండింగ్ అయ్యారు
కోలీవుడ్ టాప్ హీరో సూర్య నటించిన జై భీమ్ చిత్రం బ్లాక్ బస్టర్ అందుకుంది. ఆ సినిమాలో 'చినతల్లి' పాత్రలో లిజోమోల్ జోసీ నటించగా ఆమె భర్త 'రాజ కన్ను' పాత్రలో మణికంఠన్ మెప్పించారు. ఈ చిత్రంలో వీరిద్దరూ కూడా ఆదివాసీ దంపతులుగా నటించారు. ‘జై భీమ్’ సినిమాతో వీరిద్దరూ కూడా ఓవర్నైట్ స్టార్స్గా మారిపోయారు. ముఖ్యంగా కేరళకు చెందిన లిజో చినతల్లి పాత్రలో తన నటనతో అందరినీ ఏడిపించేసింది. అదే విధంగా మణికంఠన్ కూడా అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. ఇప్పుడు వీరిద్దరూ కూడా తెలుగు సినిమాకు దగ్గరయ్యారు. మణికంఠన్ నటించిన గుడ్ నైట్ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. ఎప్పుడూ ఆయన గురక పెడుతూ ఇతరులను ఇబ్బంది పెట్టే సీన్స్లలో మెప్పించాడు. ఈ చిత్రంలో మోటార్ మోహన్గా ప్రేక్షకులను నవ్వించడమే కాకుండా ఏమోషనల్ సీన్స్తో ఏడిపించాడు. తాజాగా ఆయన నటించిన ‘ట్రూ లవర్’ చిత్రాన్ని బేబీ నిర్మాత ఎస్కేఎన్ తెలుగులో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో మణికంఠన్ మరోసారి ట్రెండింగ్ అవుతున్నాడు. ప్రస్తుతం మణికంఠన్ తెలుగులో మినిమమ్ హీరోగా ఎదగడం ఖాయం అని చెప్పవచ్చు. టాలీవుడ్లో ఆయన సినిమాలకు మార్కెట్ కూడా ఉండే అవకాశం ఉంది. లిజోమోల్ జోసీ కూడా తెలుగులో 'ఒరేయ్ బామ్మర్ది' సినిమాలో నటించిన విషయం తెలిసిందే.. ప్రస్తుతం ఆమె కోలీవుడ్లో మరో బిగ్ ఆఫర్ అందుకుంది. తమిళ్లో ప్రముఖ హీరో అయిన శశికుమార్కు జోడీగా ఒక సినిమా చేయనుంది. ఫ్రీడమ్ అనే మూవీతో ఆమె తెలుగులోకి మరోసారి రానుంది. స్వతంత్ర పోరాటం నేపథ్యంలో సాగే పిరియాడికల్ కథా చిత్రంగా తెరకెక్కనుంది. పాన్ ఇండియా రేంజ్లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. శశికుమార్ నటుడే కాదు.. మంచి దర్శకుడు, నిర్మాత కూడా.. గతంలో ఆయన కోలీవుడ్లో సుబ్రమణిపురం, నాడోడిగళ్, సుందర పాండియన్ వంటి చిత్రాలతో భారీ విజయాన్ని అందుకున్నాడు. -
అవార్డ్ రాకపోవడంపై నాని అసంతృప్తి.. ఏ సినిమాకో తెలుసా?
నేచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దసరాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన నాని మరోసారి తనదైన నటనతో అభిమానులను అలరించాడు. అయితే ఇటీవల తన మిత్రుడు దుల్కర్ సల్మాన్ నటించిన కింగ్ ఆఫ్ కొత్త మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆసక్తికర కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి నాని వార్తల్లో నిలిచాడు. గురువారం ప్రకటించిన జాతీయ చలనచిత్ర అవార్డులపై తనదైన శైలిలో స్పందించారు. (ఇది చదవండి: బ్రహ్మానందం ఇంటికెళ్లిన బన్నీ.. కారణం అదేనా?) 2021 ఏడాది అవార్డులకు గానూ తెలుగు చిత్రాలకే ఎక్కువ అవార్డులు వచ్చాయి. బెస్ట్ యాక్టర్ అవార్డ్ అల్లు అర్జున్ను వరించగా.. ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఏకంగా ఆరు, ఉప్పెన చిత్రానికి అవార్డులు దక్కాయి. ఈ సందర్బంగా నాని కంగ్రాట్స్ తెలిపారు. ఈ మేరకు తన ఇన్స్టాలో షేర్ చేశారు. అయితే తమిళ స్టార్ హీరో సూర్య నటించిన జై భీమ్ చిత్రానికి అవార్డ్ రాకపోవడంపై నాని అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇన్స్టాలో స్టోరీస్లో జై భీమ్ అంటూ లవ్ బ్రేకప్ అయిన సింబల్ను జోడించారు. అయితే 69వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్లో ఉత్తమ నటుడి విభాగంలో సూపర్స్టార్ సూర్య, ఉత్తమ చిత్రం విభాగంలో జై భీమ్ చిత్రానికి వస్తుందని ఆయన అభిమానులు భావించారు. జై భీమ్ పట్ల నాని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాగా.. టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన జై భీమ్.. అట్టడుగు వర్గాలపై పోలీసుల దౌర్జన్యాలను చూపించారు. ఈ కథ ముగ్గురు గిరిజనుల చుట్టే తిరుగుతుంది. ఈ చిత్రంలో మణికందన్, లిజిమోల్ జోస్, ప్రకాష్ రాజ్, రజిషా విజయన్, గురు సోమసుందరం, రావు రమేష్, జయప్రకాష్, ఇళవరసు, ఎలాంగో కుమారవేల్ ప్రధాన పాత్రల్లో నటించారు. (ఇది చదవండి: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు మృతి!) #Nani's feel sad that #Suriya's #JaiBheem did not win a single #NationalFilmAwards2023 Shares Via Instagram Story.#FilmyBowl @SatishKTweets pic.twitter.com/rVk5xzskVF — Filmy Bowl (@FilmyBowl) August 25, 2023 -
'జై భీమ్'కి జాతీయ అవార్డ్ అందుకే మిస్ అయిందా?
69వ జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమా సత్తా చాటింది. తమిళ, మలయాళ, కన్నడ సినిమాలు కూడా మెరిశాయి. అయితే సూర్య 'జై భీమ్' చిత్రానికి అవార్డ్ రాకపోవడం మాత్రం చాలామందిని ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచింది. కనీసం ఒక్కటైనా వచ్చుంటే బాగుండేదని వాళ్లు అభిప్రాయపడ్డారు. మరి 'జై భీమ్'కి అవార్డ్ ఎందుకు మిస్ అయింది? కారణాలు ఏంటి? (ఇదీ చదవండి: జాతీయ అవార్డుల్లో 'ఆర్ఆర్ఆర్' హవా.. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్) సామాజిక రుగ్మతలు, అణగారిన వర్గాలపై జరుగుతున్న అన్యాయాన్ని.. నిజ జీవితంలో జరిగిన ఓ సంఘటనని స్పూర్తిగా తీసిన సినిమా 'జై భీమ్'. టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నేరుగా ఓటీటీలో రిలీజైనప్పటికీ ప్రతి ఒక్కరి నుంచి ప్రశంసలు అందుకుంది. ఓ సాధారణ లాయర్ పాత్రలో సూర్య అదరగొట్టేశాడు. కానీ ఈ సినిమాకి ఇప్పుడు ఏ విభాగంలోనూ అవార్డ్ రాలేదు. జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ అవార్డు గెలవడం ఎవరికీ ఎలాంటి సందేహాలు లేవు. దానికి అతడి పూర్తి అర్హుడు. దీనికి సూర్య కూడా పోటీదారుడే కానీ కొద్దిలో మిస్ అయింది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే.. 2020లో సూరరై పోట్రు (ఆకాశమే హద్దురా) సినిమాకుగానూ ఉత్తమ నటుడిగా సూర్య.. జాతీయ అవార్డు అందుకున్నాడు. (ఇదీ చదవండి: 'పుష్ప'కి జాతీయ అవార్డులు.. ఆ అంశాలే కలిసొచ్చాయా?) 'జై భీమ్' కూడా అదే సంస్థ నుంచి వచ్చింది. ఇన్నేళ్ల జాతీయ అవార్డుల చరిత్రలో.. ఏ హీరోకి వరసగా రెండుసార్లు పురస్కారం వరించలేదు. అలానే 'పుష్ప' మూవీకి దేశవ్యాప్తంగా వచ్చినంత పాపులారిటీ 'జై భీమ్'కి రాలేదనేది మీకు తెలుసు! ఇలా అనుకుంటేపోతే.. గతంలోనూ చాలావరకు మంచి మంచి సినిమాలకు కొద్దిలో జాతీయ అవార్డులు మిస్ అయ్యాయి. అంతమాత్రన వాటిని తక్కువ చేసినట్లు కాదు. అవార్డుల వచ్చింది లేనిది కొన్నిరోజుల్లో మర్చిపోతారేమో గానీ ఓ మంచి సినిమాని ఎప్పటికీ గుండెల్లో పెట్టుకుంటారు. 'జై భీమ్' ఈ లిస్టులో కచ్చితంగా ఉంటుంది. ఎంటర్టైన్ చేసే విషయంలో 'పుష్ప', మెసేజ్ ఇవ్వడంతోపాటు ఎమోషనల్ చేసే విషయంలో 'జై భీమ్'.. ఎప్పటికీ అలా నిలిచిపోతాయి అంతే! (ఇదీ చదవండి: ప్రేమ పేరుతో మోసం.. జబర్దస్త్ కమెడియన్ అరెస్ట్) -
రజనీ కొత్త సినిమా.. స్టార్ట్ అప్పుడే
‘జైలర్’ సినిమా సక్సెస్ జోష్లో ఉన్నారు హీరో రజనీకాంత్. అయితే ఈ సినిమా రిలీజ్కి ముందే తన ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా హిమాలయాల్లో కొంత సమయం గడిపారు రజనీ. అలాగే దేశంలోని మరికొన్ని ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శిస్తున్నారాయన. అయితే రజనీకాంత్ ఆధ్యాత్మిక యాత్ర ఈ నెలాఖరుకల్లా పూర్తవుతుందట. దీంతో ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో తాను హీరోగా నటించాల్సిన సినిమాపై ఆయన పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరిస్తారని, సెప్టెంబరు రెండోవారంలో ఈ సినిమా షూటింగ్లో జాయిన్ అవుతారని కోలీవుడ్ టాక్. రజనీకాంత్ కెరీర్లో 170వ సినిమాగా తెరకెక్కనున్న ఈ మూవీలో ఓ కీలక పాత్రలో అమితాబ్ బచ్చన్, ప్రతినాయకుడి ఛాయలు ఉండే మరో కీలక పాత్రలో శర్వానంద్ నటిస్తారనే ప్రచారం సాగుతోంది. లైకా ప్రొడక్షన్స్పై సుభాస్కరన్ నిర్మించనున్న ఈ సినిమా 2024లో విడుదల కానుంది. -
'జై భీమ్' డైరెక్టర్తో రజనీకాంత్ సినిమా.. షూటింగ్ అప్పుడే
హీరో రజనీకాంత్ మే మొదటి వారంలో పోలీస్ ఆఫీసర్గా ఛార్జ్ తీసుకోనున్నారుట. 'జై భీమ్' ఫేమ్ టీజే ఙ్ఞానవేల్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా లైకా ప్రొడక్షన్స్పై సుభాస్కరన్ ఓ సినిమాను నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ మే మొదటివారంలో ప్రారంభం కానుందని, ఇందుకు తగ్గట్లుగా ఙ్ఞానవేల్ ప్రీ పొడక్షన్ పనుల్ని వేగవంతం చేశారని కోలీవుడ్ టాక్. కొన్ని వాస్తవ సంఘటనలతో రూపొందనున్న ఈ సినిమాలో ఓ ముస్లిం పోలీస్ అధికారి పాత్రలో రజనీకాంత్ నటించనున్నారని సమాచారం. ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ సినిమాలో నటిస్తున్నారు రజనీకాంత్. అలాగే లాల్సలామ్ చిత్రంలో ఆయన ఓ అతిథి పాత్ర చేస్తున్నారు. -
మరో సంచలనమైన కొత్త కేసుతో జై భీమ్-2 ..!
-
Jai Bhim 2: సూర్య జై భీమ్ సీక్వెల్ ఉంటుందా? నిర్మాత ఏమన్నారంటే..
తమిళసినిమా: నటుడు సూర్యకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చిన చిత్రం జై భీమ్. ఆయన తన 2డీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మించి కథానాయకుడిగా నటించిన చిత్రమిది. 1993 ప్రాంతంలో విల్లుపురం సమీపంలోని గిరిజనుల జీవన విధానాన్ని, వారి కష్టాలను ఈ చిత్రంలో చూపించారు. జ్ఞానవేల్ దర్శకత్వం వహించారు. జ్ఞానవేల్ దర్శకత్వం వహింన ఇందులో గిరిజనుల రక్షణ కోసం పోరాడిన న్యాయమూర్తి చంద్రు పాత్రలో సూర్య నటించారు. గిరిజనుల కోసం సర్య చేసిన న్యాయపోరాటమే జై భీమ్ చిత్రం. ఈ చిత్రం గత ఏడాది దీపావళి సందర్భంగా ఓటీటీలో విడుదలై విశేష ఆదరణ పొందడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. అంతేకాదు జై భీమ్ చిత్రం అకాడమీ అవార్డును గెలుచుకోవడంతో పాటు పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడి సూర్యను ప్రపంచానికి పరిచయం చేసింది. ఇటీవల గోవాలో జరిగిన అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ఈ చిత్రం ప్రదర్శింపబడింది. ఈ చిత్రోత్సవంలో పాల్గొన్న దర్శకుడు జ్ఞానవేల్ జై భీమ్ చిత్రానికి సీక్వెల్ ఉంటుందా? అన్న మీడియా ప్రశ్నకు న్యాయమూర్తి చంద్రు వాదించిన అనేక కేసులు ఉన్నాయన్నారు. వాటిలో ఏదో ఒక అంశంతో జై భీమ్కు సీక్వెల్ను కచ్చితంగా చేస్తామని అందులోనూ సూర్య నటిస్తారని బదులిచ్చారు. ఇదే విషయాన్ని నిర్మాత రాజశేఖర్ సైతం ద్రువీకరించారు. దీంతో కాస్త ఆలస్యంగానైనా జై భీమ్కు సీక్వెల్ను ఎదురు చూడవచ్చన్నమాట. -
జై భీమ్ కాంబినేషన్ రిపీట్.. మరో యథార్థ సంఘటన ఆధారంగా సినిమా
సాక్షి, చెన్నై: సూర్య సినీ కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచిపోయిన చిత్రం జై భీమ్. జ్యోతిక, సూర్య కలిసి 2డీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి రాజశేఖర్, కర్పూర సుందరపాండియన్ సహ నిర్మాతలుగా వ్యవహరించారు. జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గిరిజన వాసుల జీవన విధానాన్ని, వారి సమస్యలను ఆవిష్కరించే యథార్ధ కథాంశంతో రూపొందింది. ఇందులో నటుడు సూర్య ప్రముఖ న్యాయవాది చంద్రు పాత్రలో నటించి గిరిజనుల తరఫున న్యాయం కోసం పోరాడిన విషయం తెలిసిందే. చదవండి: ఓటీటీకి వచ్చేసిన బ్రహ్మాస్త్ర మూవీ, అక్కడ అర్థరాత్రి నుంచి స్ట్రీమింగ్ ఈ చిత్రం గత ఏడాది నవంబర్ 4వ తేదీన తమిళం, తెలుగు భాషల్లో అమెజాన్ ప్రైమ్ టైం ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదలై సంచలన విజయాన్ని సాధించింది. పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శనకు నోచుకుని, పలు అవార్డులను గెలుచుకుంది. కాగా ఆ చిత్ర కాంబినేషన్ ఇప్పుడు రిపీట్ కానుందన్నది తాజా సమాచారం. నటుడు సూర్య కథానాయకుడిగా దర్శకుడు జ్ఞానవేల్ మరోసారి జై భీమ్ చిత్రం తరహాలో ఒక యథార్థ సంఘటనను ఇతివృత్తంగా తీసుకుని చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీన్ని సూర్య, జ్యోతికల నిర్మాణ సంస్థ 2 డి ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించనుందని సమాచారం. చదవండి: బరువు పెరగడం ఓ సవాల్గా అనిపించింది: హీరోయిన్ ఈ చిత్రానికి సంబంధించిన ఫ్రీ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు గురువారం మొదలైనట్లు తెలిసింది. ఈ చిత్ర షూటింగ్ను వచ్చే ఏడాది మార్చిలో ప్రారంభించినట్లు సమాచారం. కాగా అంతకుముందు దర్శకుడు జ్ఞానవేల్ అమెజాన్ ప్రైమ్ టైం కోసం ఒక చిత్రాన్ని చేయడానికి సిద్ధమ వుతున్నారు. ఇది శరవణ భవన్ హోటల్ అధినేత దివంగత రాజగోపాల్ జీవితంలో జరిగిన సంచలన సంఘటనల ఇతివృత్తంతో ఉంటుందని ఇప్పటికే ప్రచారంలో ఉంది. దీనికి దోసె కింగ్ అనే టైటిల్ను కూడా నిర్ధారించినట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. -
జై భీమ్ చిత్రానికి మరో అరుదైన గౌరవం
తమిళసినిమా: నటుడు సర్య కథానాయకుడిగా నటించి నిర్మించిన సూరరై పోట్రు, జై భీమ్ చిత్రాలు ప్రేక్షకుల ఆదరణను, విమర్శకుల ప్రశంసలను అందుకోవడంతో పాటు జాతీయ, అంతర్జాతీయ అవార్డులను కొల్లగొట్టిన విషయం తెలిసిందే. సూరరై పోట్రు చిత్రం సూర్యకు తొలిసారిగా జాతీయ ఉత్తమ నటుడు అవార్డును తెచ్చిపెట్టింది. ఇక జై భీమ్ 94వ అకాడమీ అవార్డుతో పాటు పలు అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుంది. తాజాగా మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకుందీ చిత్రం. ఈ సినిమాను సౌత్ ఇండియన్ అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శించనున్నారు. దీనికి సంబంధించిన వివరాలను కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రి వెల్లడించారు. నవంబర్ 20 నుం 28 వరకు గోవాలో ఈ చిత్రోత్సవాలు జరగనున్నట్లు పేర్కొన్నారు. ఈ చిత్రోత్సవాల్లో మొత్తం 45 చిత్రాలను ప్రదర్శించనున్నారు. అందులో 20 లఘు చిత్రాలు, 25 కమర్షియల్ చిత్రాలకు చోటు లభించాయి. అందులో సూర్య కథానాయకుడిగా నటించిన జై భీమ్ ఒకటి. ఈ చిత్రాన్ని నటుడు సూర్య, జ్యోతిక తమ 2డీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మించారు. ఇందులో సూర్య న్యాయమూర్తి కే.చంద్రు పాత్రలో నటించారు. గత ఏడాది నవంబర్ నెలలో అమేజాన్ ప్రైమ్ టైమ్లో విడుదలై విశేష ఆదరణను పొందింది. -
జైభీమ్ వివాదం: హైకోర్డులో సూర్య దంపతులకు ఊరట
హీరో సూర్యకు మద్రాస్ హైకోర్టులో ఊరట లభిచింది. జై భీమ్ చిత్రంలోని పలు సన్నివేశాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టు పటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. గురువారం(ఆగస్ట్ 11) ఈ కేసుపై విచారించిన మద్రాస్ న్యాయస్థానం ఈ పటిషన్ను రద్దు చేసింది. న్యాయమూర్తి జస్టిస్ ఎన్ సతీష్ కుమార్ ఈ కేసును కొట్టివేస్తున్నట్లు ఈ రోజు ఉత్తర్వులు ఇచ్చారు. కాగా గతేడాది సూర్య నటించిన చిత్రం జై భీమ్. టూడీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై జ్యోతిక, సూర్య కలిసి నిర్మించిన ఈ చిత్రానికి జ్ఞానవేల్ దర్శకత్వం వహించారు. ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం విశేష ప్రేక్షకాదరణతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. చదవండి: 3,4 రోజుల వసూళ్లకే సంబరాలు చేసుకోవద్దు: తమ్మారెడ్డి భరద్వాజ అయితే కొన్ని సామాజిక వర్గాల మాత్రం ఈసినిమాను వ్యతిరేకించాయి. ముఖ్యంగా హిందూ వన్నియార్ల సామాజికవర్గానికి చెందిన సంతోష్ అనే వ్యక్తి తమ మనోభావాలు దెబ్బతిసే విధంగా జై భీమ్ చిత్రంలో సన్నివేశాలు ఉన్నాయంటూ సైదాపేట కోర్టులో మొదట పిటిషన్ దాఖలు చేశాడు. అయితే ఈ పిటిషన్ను రద్దు చేయాలని కోరుతూ జైభీమ్ మేకర్స్ చెన్నై హైకోర్టును కోరిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఇది రిటైర్డ్ అడ్వకేట్ చందు నిజ జీవితం ఆధారం తీసిన సినిమా అని, ఓ కేసులో ఆయన ఎలా పోరాడో ఉన్నది ఉన్నట్లు చూపించాలనే ఉద్దేశంతోనే ఈ సినిమాను తెరకెక్కించామన్నారు. అంతేకాని ఎవరి మనోభవాలను దెబ్బతీయాలనేది తమ ఉద్ధేశం కాదంటూ సూర్య కోర్టుకు వివరణ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో నేడు ఈ పటిషన్పై విచారించిన చెన్నై హైకోర్టు ఈ కేసును రద్దు చేసింది. -
జై భీమ్ వివాదం.. సూర్యపై హైకోర్టు కీలక ఆదేశం
సూర్యపై ఎలాంటి కఠిన చర్యలు చేపట్టరాదని చెన్నై హైకోర్టు సోమవారం పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. వివరాలు.. నటుడు సూర్య కథానాయకుడు నటించిన చిత్రం జై భీమ్. టూడీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై జ్యోతిక, సూర్య కలిసి నిర్మించిన ఈ చిత్రానికి జ్ఞానవేల్ దర్శకుడు. ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం విశేష ప్రేక్షకాదరణతోపాటు విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. అయితే కొన్ని సామాజిక వర్గాల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంది. ముఖ్యంగా హిందూ వన్నియార్ల సామాజిక వర్గం తమ మనోభావాలు దెబ్బతినే విధంగా జై భీమ్ చిత్రంలో సన్నివేశాలు చోటు చేసుకున్నాయంటూ సంతోష్ అనే వ్యక్తి స్థానిక సైదాపేట కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చదవండి: మహేష్బాబు సినిమానే చివరగా చూశా: కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి కథానాయకుడు సూర్య, నిర్మాతల్లో ఒకరైన జ్యోతిక, దర్శకుడు జ్ఞానవేల్పై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం సూర్య తదితరులపై కేసు నమోదు చేయాల్సిందిగా పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో వెలచ్ఛేరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా ఈ పిటిషన్ను రద్దు చేయాలని కోరుతూ జైభీమ్ చిత్రం సూర్య తరపున చెన్నై హైకోర్టును కోరారు. ఈ కేసు సోమవారం విచారణకు రాగా.. న్యాయమూర్తి సతీష్ కుమార్ ఈనెల 21వ తేదీకి వాయిదా వేశారు. అప్పటి వరకు సూర్యపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని పోలీసులను ఆదేశించారు. -
సూర్యను మరోసారి డైరెక్ట్ చేయనున్న ‘జై భీమ్’ డైరెక్టర్ !
చెన్నై సినిమా: జై భీమ్ కాంబో రిపీట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నటుడు సూర్య కథానా యకుడిగా నటించి తన 2డీ ఎంటర్ టైన్మెంట్ పతాకంపై నిర్మించిన జై భీమ్ చిత్రం గత ఏడాది ఓటీటీలో విడుదలై సంచలన విజయం సాధించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న విష యం తెలిసిందే. ఈ సినిమాకు టీజే. జ్ఞానవేల్ దర్శకత్వం వహించారు. కాగా ఈయన సూర్యను మరోసారి డైరెక్ట్ చేయడానికి సిద్ధమవుతున్నారు. తన కోసమే ప్రత్యేకంగా రూపొందించిన కథ సూర్యకు నచ్చేయడంతో నటించడానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. కాగా ప్రస్తుతం సూర్య బాలా దర్శకత్వంలో ఓ చిత్రం, వెట్రిమారన్ దర్శకత్వంలో 'వాడివాసల్' చిత్రాలను చేస్తున్నారు. ఈ రెండు చిత్రాలను పూర్తి చేసిన తరువాత జ్ఞానవేల్ దర్శకత్వంలో నటించే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. చదవండి: 👉🏾 'జై భీమ్' చిత్రానికి మరో రెండు అవార్డులు.. -
జై భీమ్ వివాదం, హీరో సూర్య, జ్యోతికలపై ఎఫ్ఐఆర్
FIR Filed On Hero Suriya Wife Jyothika And Jai Bhim Director: తమిళ స్టార్ హీరో సూర్యపై ఎఫ్ఐఆర్ నమోదైంది. జైభీమ్ మూవీ వివాదం నేపథ్యంలో హీరో సూర్య ఆయన భార్య జ్యోతిక, దర్శకుడు జ్ఞానవేల్పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి కోర్టుకు సమర్ఫించాలని సైదాపేట మెజీస్ట్రేట్ ఆదేశించింది. కోర్డు ఆదేశాల మేరకు వేలచ్చేరి పోలీసులు హీరో సూర్య, జ్యోతిక, దర్శకుడు జ్ఞానవేల్పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అలాగే సూర్యపై వన్నియర్ సంఘం రూ. 5 కోట్ల పరువు నష్టం దాఖలు చేసింది. చదవండి: 'సర్కారు వారి పాట' విజయంపై మహేశ్ బాబు స్పందన.. అయితే సూర్య బేషరుతుగా క్షమాపణ కోరితే.. పరువు నష్టం ఉపసంహరించుకుంటామని వారు తెలిపారు. కాగా జైభీమ్లోని కొన్ని సన్నివేశాలు తమ సామాజిక వర్గాన్ని కించపరిచేలా ఉన్నాయని రుద్ర వన్నియర్ సేన వ్యవస్థాపకుడు సంతోష్ గతంలో వేలచ్చేరి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై పోలీసులు స్పందించకోవడంతో ఆయన సైదాపేట మెజీస్ట్రేట్ను ఆశ్రయించాడు. జైభీమ్ హీరో సూర్య, నిర్మాత జ్యోతికతో పాటు దర్శకుడు జ్ఞానవేల్పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి కోర్టలో సమర్పించాల్సిందిగా పోలీసులకు ఆదేశాలివ్వాలని కోరుతూ ఆయన పిటిషన్ దాఖలు చేశాడు. చదవండి: కంగనా చిత్రాలన్ని ఫ్లాప్ అవ్వాలని కోరుకుంటున్నా: నటి పాయల్ అయితే పలుమార్లు ఈ పిటిషన్పై విచారణ జరిగినా సూర్య, జ్యోతిక, జ్ఞానవేల్ ఎవరూ కోర్టుకు హాజరు కాలేదన్న విషయాన్ని ప్రస్తావించింది. అంతేకాకుండా ఈ కేసుపై వివరణ ఇవ్వాల్సిందిగా ఆ ముగ్గురిని కోరింది. కాగా జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందింది. నేరుగా అమెజాన్ ప్రైమ్లో విడుదలైన ఈ సినిమా సూపర్హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే. -
'జై భీమ్' చిత్రానికి మరో రెండు అవార్డులు..
Suriya Jai Bhim Movie Got Indie Spirit Awards At Boston International Film Festival: కరోనా సమయంలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలై అశేష ప్రేక్షకాదరణ పొందిన చిత్రం 'జై భీమ్'. సూర్య హీరోగా టీజే. జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఇటీవల 'దాదా సాహేబ్ పాల్కే ఫిలీం ఫెస్టివల్'లో రెండు అవార్డులను గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకలో 'ఉత్తమ చిత్రం'గా నిలవగా, మూవీలో నటించిన మణికందన్కు 'బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్' అవార్డు వచ్చంది. తాజాగా 'జై భీమ్' సినిమా మరో రెండు అవార్డులను సాధించింది. ఏప్రిల్ 14 నుంచి 20 వరకు జరిగిన 'బోస్టన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్'లో జై భీమ్ చిత్రాన్ని ప్రదర్శించారు. ఇందులో నటి లియోమోల్ జోస్కు 'ఇండీ స్పిరిట్ బెస్ట్ యాక్ట్రెస్' అవార్డు వరించగా, 'ఇండీ స్పిరిట్ బెస్ట్ సినిమాటోగ్రఫీ' అవార్డును మూవీ కెమెరామెన్ ఎస్.ఆర్. కదీర్ సొంతం చేసుకున్నారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ '2డీ ఎంటర్టైన్మెంట్' సంస్థ పేర్కొంది. సూర్య, జ్యోతిక కలిసి '2డీ ఎంటర్టైన్మెంట్' పతాకంపై 'జై భీమ్' చిత్రాన్ని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో నిర్మించారు. చదవండి: దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్లో సూర్య, అల్లరి నరేశ్ చిత్రాలకు అవార్డులు The Director of #JaiBhim, @tjgnan Sir handed over #BostonInternationalFilmFestival's Award for the Indie Spirit Best Cinematography to @srkathiir Sir 🥳@Suriya_offl #Jyotika @rajsekarpandian @BostonInterFF pic.twitter.com/M4l6z0jDUT — 2D Entertainment (@2D_ENTPVTLTD) May 6, 2022 #JaiBhim bags the Awards for Indie Spirit Best Actress & Indie Spirit Best Cinematography at the #BostonInternationalFilmFestival Congratulations @jose_lijomol & @srkathiir Sir on the Awards! Thank You @BostonInterFF for the honour@Suriya_offl #Jyotika @tjgnan @rajsekarpandian pic.twitter.com/zyfjdo7Sn2 — 2D Entertainment (@2D_ENTPVTLTD) May 5, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4261450729.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
హీరో సూర్య, జ్యోతికలపై ఎఫ్ఐఆర్కు కోర్టు ఆదేశం
తమిళ స్టార్ హీరో సూర్య మరోసారి చిక్కుల్లో పడ్డారు. ఆయన నటించిన 'జై భీమ్' చిత్రంపై చెలరేగిన వివాదం మరోసారి చర్చనీయాంశమైంది. జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందిన సంగతి తెలిసిందే. నేరుగా అమెజాన్ ప్రైమ్లో విడుదలైన ఈ సినిమా సూపర్హిట్గా నిలిచింది. అయితే ఈ చిత్రంలో తమ కులాన్ని కించపరిచారని వన్నియార్ సామాజిక వర్గానికి చెందిన కొందరు 2021 నవంబర్లో కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. జై భీమ్లోని కొన్ని సన్నివేశాలు తమ ప్రతిష్ఠను మసకబార్చేలా ఉన్నాయని పిటిషన్లో పేర్కొన్నారు. తాజాగా ఈ పిటిషన్ను విచారించిన చెన్నై కోర్టు హీరో సూర్య, అతని భార్య జ్యోతిక(జై భీమ్ నిర్మాత) దర్శకుడు జ్ఞానవేల్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. గతంలో పలుమార్లు ఈ పిటిషన్పై విచారణ జరిగినా సూర్య, జ్యోతిక, జ్ఞానవేల్ ఎవరూ కోర్టుకు హాజరు కాలేదన్న విషయాన్ని ప్రస్తావించింది. అంతేకాకుండా ఈ కేసుపై వివరణ ఇవ్వాల్సిందిగా ఆ ముగ్గురును కోరింది. తదుపరి విచారణను ఈనెల 20కి వాయిదా వేసింది. -
దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్లో సూర్య, అల్లరి నరేశ్ చిత్రాలకు అవార్డులు
Suriya, Naresh Movies Won DadaSaheb Phalke Film festival Award: తమిళ స్టార్ హీరో సూర్య ‘జై భీమ్’, అల్లరి నరేశ్ ‘నాంది’ సినిమాలకు మరోసారి ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకున్నాయి. ప్రతి ఏడాది జరిగే దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఈ సంవత్సరం కూడా ఘనంగా జరిగింది. 12వ దాదా సాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్ ప్రస్తుతం 2022లో జరగగా ఈ సారి జై భీమ్, నాంది సినిమాలకు కూడా అవార్డులు వచ్చాయి. సూర్య నటించిన జై భీమ్ సినిమా ఇప్పటికే చాలా అవార్డులని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. Suriya’s ‘Jai Bhim’ bags two awards at the Dadasaheb Phalke International Film Festival 2022 "The film won the award for the Best Film and actor Manikandan won the Best Supporting Actor awards at the film festival reportedly on May 3." - TOI #JaiBhim pic.twitter.com/DZ5iL493i6 — ♂️ ᴿᵃᵗᵉᵈ®️ˢᵘᵖᵉʳ ˢᵗᵃʳ🌟 ᵀʰᵃˡᵃᵖᵃᵗʰʸ🥇MSD7️⃣⚓ (@VIIJAYism) May 4, 2022 చదవండి: వైరల్: ఎయిర్పోర్ట్లో పరుగెత్తుతూ కనిపించిన ఆలియా.. తాజాగా దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్లో ఉత్తమ సినిమాగా జై భీమ్ నిలిచింది. అంతే కాక ఈ సినిమాలో నటించిన మణికందన్ కి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డు కూడా వరించింది. దీనిపై చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేశారు. ఇక అల్లరి నరేశ్ నటించిన నాంది సినిమాని డైరెక్టర్ విజయ్ కనకమేడల తెరకెక్కించారు. ఈ సినిమాకి కాను బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ అవార్డును విజయ్ అందుకున్నారు. దీంతో నాంది చిత్ర యూనిట్, పలువురు టాలీవుడ్ ప్రముఖులు విజయ్కి అభినందనలు తెలుపుతున్నారు. This is the proud moment for me and my Naandhi team about my Darling @vijaykkrishna receiving the Dadasaheb Phalke Film Festival 2022 Award as the best Debut Director. In this joy, the responsibility of all our friends is further increased more.. @allarinaresh @varusarath5 pic.twitter.com/zd7rxxEKoq — Brahma Kadali (@brahmakadali) May 1, 2022 చదవండి: విశ్వక్ సేన్ అసలు హీరోనే కాదు: ఎమ్మెల్యే దానం నాగేందర్ ఫైర్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1541342029.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
Oscar 2022: ఆస్కార్స్ నుంచి జై భీం ఔట్!
-
ఆస్కార్కు నామినేట్ అయిన జై భీమ్, మరక్కార్ చిత్రాలు
Suriya Jai Bhim And Mohanlal Marakkar Nominated For Oscars 2022: ప్రతిష్టాత్మకమైన 94వ ఆస్కార్ అవార్డుల రేసులో రెండు భారతీయ చిత్రాలు నామినేట్ అయ్యాయి. అందులో ఒకటి సూర్య నటించిన 'జై భీమ్' చిత్రం కాగా, మరోకటి మోహన్ లాల్ నటించిన 'మరక్కార్' చిత్రం. ఆస్కార్ రేసులో మొత్తం 276 సినిమాలు షార్ట్ లిస్ట్ అవగా అందులో రెండు ఇండియన్ సినిమాలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ఈ రెండూ సౌత్ ఇండస్ట్రీకి చెందినవే కావడం విశేషం. గతేడాది అమెజాన్ ప్రైమ్లో విడుదలైన జై భీమ్ 'జై భీమ్' చిత్రానికి విమర్శకుల ప్రశంసలు దక్కాయి. జస్టిస్ చంద్రు జీవిత కథతో పాటు వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందిన ఈ చిత్రానికి టి.జి.జ్ఞానవేల్ దర్శకత్వం వహించారు. ఇక మలయాళ స్టార్ మోహన్లాల్ నటించిన మరక్కార్ చిత్రానికి ప్రియదర్శన్ దర్శకత్వం వహించారు. చారిత్రక కథాంశంతో ఈ చిత్రం రూపొందింది.ఇక ఆయా కేటగిరీలకు చెందిన ఫైనల్ నామినేషన్లను ఆస్కార్ కమిటీ ఫిబ్రవరి 8న ప్రకటించనుంది. అవార్డుల వేడుక మార్చి27న అమెరికాలో జరగనుంది. -
జైభీమ్ చిత్రానికి మరో అరుదైన గౌరవం.. 'ఆస్కార్' ఛానెల్లో
Suriya Jai Bhim Features On The Oscars Official Youtube Channel: మాస్ పాత్రల్లోనే కాకుండా, క్లాస్, వైవిధ్యమైన రోల్స్లో అదరగొడుతుంటాడు తమిళ స్టార్ హీరో సూర్య. ఇటీవల సూర్య నటించిన చిత్రం 'జైభీమ్'. సినిమా అంటే మూడు ఫైట్లు, నాలుగు పాటలు, హీరోయిన్తో ప్రేమాయణం, ఐటెం సాంగ్లు కాదని నిరూపించి, సూపర్ డూపర్ హిట్ కొట్టిన చిత్రం జైభీమ్. సినిమాకు సామాజిక బాధ్యతకు ఉన్న అవినాభావ సంబంధాన్ని మరోసారి తట్టిలేపింది. ఒక ఆడబిడ్డ నిజజీవిత గాథను, పోరాటాన్ని ప్రయోగాత్మకంగా తెరకెక్కించి సత్తా చాటింది. టీజే జ్ఞానవేల్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను సూర్య నిర్మించారు. గతేడాది నవంబరులో ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కించుకుంది. అంతేకాకుండా ఐఎండీబీ రేటింగ్స్లో హాలీవుడ్ క్లాసిక్ హిట్ 'ది షాషాంక్ రిడంప్షన్' చిత్రాన్ని అధిగమించి 73 వేలకుపైగా ఓట్లతో 9.6 రేటింగ్ సాధించింది. ఇప్పటివరకూ ఏ సౌత్ సినిమాకు ఇలాంటి రేటింగ్ రాలేదు. అలాగే గోల్డెన్ గ్లోబ్ 2022 పురస్కారానికి కూడా నామినేట్ అయిన సంగతి తెలిసిందే. వాస్తవ సంఘటనల ఆధారంగా కోర్టు డ్రామా కథాశంతో తెరకెక్కిన 'జైభీమ్' చిత్రానికి మరో అరుదైన గౌరవం దక్కింది. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ (ఆస్కార్) అధికారిక యూట్యూబ్ ఛానెల్లో 'సీన్ ఎట్ ది అకాడమీ' పేరుతో ఈ సినిమాలోని ఓ వీడియోను ఉంచారు. అకాడమీ యూట్యూబ్ వేదికగా ఒక తమిళ చిత్రానికి సంబంధించిన వీడియో క్లిప్ను ఉంచటం ఇదే మొదటిసారి. కాగా అకాడమీ యూట్యూబ్ ఛానెల్లో జైభీమ్ సినిమా వీడియో ఉండటంపై చిత్రబృందంతోపాటు అభిమానులు సంతోషపడుతున్నారు. 'జైభీమ్' ఇండియన్ సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించిందని పండుగ చేసుకుంటున్నారు. ఈ చిత్రాన్ని 'జస్టిస్ చంద్రు' జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: సూర్య ‘జై భీమ్’ మూవీ ఎలా ఉందంటే..? #Suriya's #JaiBhim scenes uploaded to #Oscars Official YouTube channel.👍👏@Suriya_offl ➡️ https://t.co/AXQwY2av72 pic.twitter.com/QmgFrz827n — Suresh Kondi (@SureshKondi_) January 18, 2022 • #JaiBhim is now the only Tamil Movie to be shown in The Academy #Oscars YouTube channel 🔥💯 Ever Proudful @Suriya_offl na 😇❤️ pic.twitter.com/3JhxVZhX1q — CHENTHUR (@ck__tweetz) January 18, 2022 #JaiBhim getting bigger and bigger 🔥 First Tamil movie scenes to shown in #Oscars utube ❤@Suriya_offl #EtharkkumThunindhavan#VaadiVaasal pic.twitter.com/qJcs0TsIQd — Mass Syed 💥 (@SuriyaFanstren4) January 18, 2022 -
Rewind 2021: కలిసొచ్చిన కరోనా.. ఓటీటీల బిజినెస్ 8000 కోట్లు!
మనదేశంలో ‘ఓవర్ ది టాప్ (ఓటీటీ)’ ప్రసారాలను మొదటగా 2008లో రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ప్రారంభించింది ‘బిగ్ ఫ్లిక్స్’ పేరుతో. అయితే ఈ ఓటీటీ మార్కెట్ అనూహ్యంగా పెరిగింది మాత్రం కరోనా వల్ల వచ్చిన లాక్డౌన్ పుణ్యంతోనే. 2020తో పాటు 2021 సంవత్సరాన్నీ ‘ఓటీటీ నామ సంవత్సరం’గా పేర్కొన్నా ఆశ్చర్యపోనవసరం లేదు. ప్రస్తుతం నలభైకి పైగా ఓటీటీ ప్రొవైడర్స్ ఇంటర్నెట్ ఆధారంగా తమ ప్రసారాలను అందిస్తున్నాయి. వాటిలో నెట్ఫ్లిక్స్ (2016, జనవరిలో మన దేశంలో మొదలైంది), అమెజాన్ ప్రైమ్, హాట్స్టార్, సోనీలివ్, వూట్, మాక్స్ ప్లేయర్, హోయ్ చోయ్ (ప్రాంతీయ భాషల్లో తొలి ఓటీటీ) వంటివెన్నో ఉన్నాయి. వీటిలో ‘ఇరోస్ నౌ’ ఓటీటీ దాదాపు పన్నెండు వేలకు పైగా సినిమాల కంటెంట్తో అత్యధిక సినిమా సాఫ్ట్వేర్ ఉన్నసంస్థగా రికార్డ్ సృష్టించింది. తెలుగులో2020, ఫిబ్రవరిలో ‘ఆహా’ ప్రారంభమై తెలుగు ప్రేక్షకులలో అత్యంత ప్రజాదరణ పొందుతున్న వేదికగా నిలిచిందిప్పుడు. మనదేశంలో ఈ ఓటీటీ వ్యాపారం 2018లో 2150 కోట్ల రూపాయలు ఉండగా, 2019 నాటికి 3,500 కోట్ల రూపాయలకు పెరిగింది. 2020 నాటికి 6,500 కోట్ల రూపాయలకు, ఈ ఏడు అంటే 2021కి దాదాపు ఎనిమిదివేల కోట్ల రూపాయలకు చేరుకుంది. అలాగే 2021లో ఓటీటీలో ప్రసారమైన సినిమాల్లో దేశం మెత్తం మీద అత్యంత ప్రజాదరణ పొందిన సినిమాగా తమిళంలో సూర్య, జ్యోతిక నిర్మించిన ‘జై భీమ్’ సినిమా నిలిచింది. ఇంటర్నెట్ మూవీ డేటా బేస్ (ఐఎమ్డీబీ) నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడై, 2021లో ప్రజలపై ఓటీటీ వేదిక చూపించన ప్రభావానికి తెర ఎత్తు ఉదాహరణగా మిగిలింది. ఈ వేదికపై ప్రసారం అవుతున్న సినిమాలు, ఇతర కార్యక్రమాల విషయంలో ఎన్నో అభ్యంతరాలు వ్యక్తం అయిన నేపథ్యంలో భారత ప్రభుత్వం 2021లో సెన్సార్షిప్ ప్రమాణాలను ప్రకటించింది. ఈ వేదిక ద్వారా ప్రసారం అవుతున్న కంటెంట్ను అయిదు కేటగరీలుగా నిర్ధారించింది. -
జైభీమ్ సినిమాలో కోర్టు సీను డైలాగులు నేనే రాశా
(ఎ. అమరయ్య, సాక్షి ప్రత్యేక ప్రతినిధి, అమరావతి): ‘సత్వర న్యాయం కోసం పోరు కొనసాగాలి. దేశంలో కోర్టుల ద్వారా ప్రతి పౌరునికీ సత్వర న్యాయం అందాలి. జైళ్లలో మగ్గుతున్న వారిలో అత్యధికులు ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలే. వారికి న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత పౌరహక్కుల సంఘాలు, న్యాయవాదులపై ఉంది’ అని మద్రాసు హైకోర్టు మాజీ న్యాయమూర్తి, జై భీమ్ సినిమా స్ఫూర్తిప్రదాత జస్టిస్ కె.చంద్రు అభిప్రాయపడ్డారు. పీడిత వర్గాలకు న్యాయం అందించాలన్న దిశగా వచ్చిందే జైభీమ్ సినిమా అని చెప్పారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా బడుగులకు సత్వర న్యాయం అందుబాటులోకి రాలేదని ఆవేదన వ్యక్తంచేశారు. విజయవాడలో పలు కార్యక్రమాలలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన ‘సాక్షి’ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. చట్టాలను ప్రజలు అర్థం చేసుకోవాలి ప్రజలు చట్టాలను బాగా చదివి, అర్థం చేసుకుని అన్వయ, ఆచరణలకు పూనుకోవాలి. అప్పుడే గాలి, నీరు లభించినంత సహజంగా న్యాయాన్నీ అందుకోగలం. హక్కుల కోసం పోరాడినప్పుడు, అసమానతలను నిలదీసినప్పుడు చట్టం తనని తాను లోతుగా శోధించుకునేలా చేయాలి. ఇది కేసులు వేసిన వారికి మాత్రమే దక్కే విజయం కాదు. ప్రజలు చైతన్యం కావడానికి ఉపయోగపడుతుంది. ప్రజాభిప్రాయం చట్టాలను, కోర్టులను ప్రభావితం చేస్తుంది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు ఉద్యమం విజయం సాధించిన తీరు ఇదే చెబుతోంది. అణగారిన వర్గాలకు సత్వర న్యాయం కోసం అయినా పోరు కొనసాగాలి. అప్పుడే న్యాయమూర్తుల మైండ్సెట్ కూడా మారుతుంది. న్యాయవాదులు ఎంత తెలివిగా ప్రశ్నిస్తే తీర్పులు అంత ప్రభావవంతంగా వస్తాయి. 1999లో కోర్టు ధిక్కార చట్టానికి సవరణ జరిగింది. దాని ప్రకారం.. చేసిన వ్యాఖ్య నిజమైతే అది కోర్టు ధిక్కారం కిందకు రాదు. నేను జడ్జిగా ఉన్న ఆరేళ్లలో ఒక్క కోర్టు ధిక్కార కేసులో శిక్ష వేయలేదు. కులానికి వ్యతిరేకంగా పోరాటం జరగాలి. కుల వివక్ష, క్రూరత్వాలను అరికట్టడానికి కోర్టులు చట్టాలను విస్తృతంగా వినియోగంలోకి తేవాలి. జైభీమ్ సినిమా చెప్పిందదే ఇదో 28 ఏళ్ల నాటి ఘటన. నేను బాధితుల తరఫు లాయర్ని. తీర్పు ఇచ్చింది జస్టిస్ పీఎస్ మిశ్రా. అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో తెగువ చూపిన మనుషుల కథ అది. వాళ్లు తమ జీవితాలను మెరుగుపరుచుకోవడమే కాదు.. సమాజంలో అందరి జీవితాలు మెరుగుపడటానికి తోడ్పడ్డారు. ఇలాంటి కేసుల్లో వాదోపవాదాలకు లాయర్లకు దొరికే అవకాశం తక్కువ. పాయింట్ సూటిగా, జడ్జిని తాకేలా క్లుప్తంగా ఉండాలి. అటువంటి అవకాశం నాకొచ్చింది. ఆ సినిమాలో హీరో కోర్టులో చెప్పే డైలాగులు తక్కువ. వేరే వాళ్లు రాస్తే పెడర్ధాలు వచ్చే అవకాశం ఉంటుందని నన్నే రాయమన్నారు. మానవ హక్కుల కోసం పోరాడిన మహావ్యక్తి జస్టిస్ కృష్ణయ్యర్ బొమ్మ కోర్టు సీన్లో పెట్టించింది కూడా నేనే. జై భీమ్ ఈవేళ ఓ నినాదమైంది. కార్మికవర్గాన్నీ, మేధావి వర్గాన్నీ ఒకే వేదిక మీదకు తెచ్చింది. ఈ సినిమా చూసిన వారందరి నుంచి రెండు ప్రశ్నలు వచ్చాయి. ఒకటి.. ప్రస్తుత సమాజంలోనూ ఇంత దుర్భరంగా జీవించే జాతులున్నాయా? ఇందుకు సిగ్గుపడాలి. రెండు.. పోలీసులు ఇంత క్రూరంగా ఉంటారా? అని. గిరిజన జీవితాలపై తీసిన సినిమాను ఓటీటీ ప్లాట్పారాల మీద విడుదల చేస్తారా? పేదలు చూసే అవకాశం లేదా? అని అడుగుతున్నారు. అందుకే మార్చిలో థియేటర్లలో విడుదల చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ సినిమాలో నటించకపోయినా చాలా మంది నన్నే హీరో అన్నట్టుగా ప్రశంసిస్తున్నారు. రెండేళ్ల కిందట విజయవాడలో ఓ సెమినార్కి వస్తే పెద్దగా ఎవ్వరూ పట్టించుకోలేదు. ఈవేళ పరిస్థితి భిన్నంగా ఉంది. సెల్ఫీ ప్లీజ్ అంటున్నారు. ఢిల్లీ నుంచి చెన్నై వెళ్లేందుకు విమానం ఎక్కితే.. జై భీమ్ స్ఫూర్తిప్రదాత జస్టిస్ చంద్రు మన మధ్య ఉన్నారని ఎయిర్హోస్టెస్లు మైకుల్లో చెబుతున్నారు. ప్రస్తుతం నేనో సెలబ్రిటీని అయ్యా (నవ్వు). ఉత్తమ తీర్పులతోనే కోర్టుల ఔన్నత్యం ఉత్తమ తీర్పులతో కోర్టుల ఔన్నత్యం పెరుగుతుంది. కోర్టులేమన్నా శిలాశాసనాలా, రాజ్యంగమేమన్నా అంతిమ గ్రంథమా, అదో కాగితపు పులి, బంగాళాఖాతంలో విసిరి వేయండని 1975 దాకా చాలా మంది వాదించారు. జస్టిస్ చిన్నపరెడ్డి మీసా చట్టంపై ఇచ్చిన తీర్పు ఈ అభిప్రాయాన్ని తల్లకిందులు చేసింది. ఇప్పుడు మళ్లీ 1975 నాటికన్నా ఘోరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. అందుకు నిదర్శనం అయోధ్య తీర్పు. రాజ్యాంగం పరిష్కారం కాదన్న వారే ఈవేళ తొలినాటి రాజ్యాంగ రాతప్రతుల్ని (సెక్యులరిజం, సోషలిజం పదాలు లేని ప్రతి. 42వ సవరణ ద్వారా అవి రాజ్యాంగంలో చేరాయి) పంచిపెడుతున్నారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే పదాలను అంబేడ్కర్ ఫ్రెంచ్ విప్లవం నుంచి తీసుకున్నారని ఆరోపించిన వాళ్లే ఈవేళ ఆయన్ను కీర్తిస్తున్నారు. వాస్తవానికి ఆ పదాలను బుద్ధిజం నుంచి తీసుకున్నట్టు అంబేడ్కర్ 1954లో ఆకాశవాణి ప్రసంగంలో చెప్పారు. పర్యావరణాన్ని కాపాడుతోంది గిరిజనులే... పర్యావరణాన్ని నిజంగా కాపాడుతోంది గిరిజనులే. అటువంటి వారిపై అటవీ చట్టాల కింద కేసులు పెట్టి వేధిస్తున్నారు. నిజానికి ఎస్టీలలో సామాజిక మండళ్లు ఉంటాయి. సొంత ప్రవర్తనా నియమావళి ఉంది. దాని ప్రకారం నడుచుకుంటారు. కానీ ఇప్పటికీ డీనోటిఫైడ్ జాతుల పేరిట గిరిజనుల బతుకుల్ని బుగ్గి పాల్జేస్తున్నారు. అపరిష్కృత కేసుల్లో తిరిగి వాళ్లనే అరెస్ట్ చేస్తున్నారు. -
న్యాయవ్యవస్థకూ పరిమితులున్నాయి
సాక్షి, అమరావతి/విజయవాడ లీగల్: మిగతా వ్యవస్థల మాదిరిగానే న్యాయ వ్యవస్థ క్కూడా పరిమితులున్నాయని మద్రాసు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి, జైభీమ్ సినిమా ఫేం జస్టిస్ కె.చంద్రు తెలిపారు. తనకున్న పరిమితులను న్యాయమూర్తులు గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం సమాజానికి మంచి న్యాయమూర్తులు, ప్రజల హక్కులను కాపాడే న్యాయమూర్తులు కావాలన్నారు. ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా శుక్రవారం విజయవాడలో ఏపీ సివిల్ లిబర్టీస్ అసోసియేషన్ (ఏపీసీఎల్ఏ)–కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి (కేవీపీఎస్) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జస్టిస్ కె.చంద్రు ఈ వ్యాఖ్యలు చేశారు. మానవ హక్కులతో పాటు తన అనుభవాలను కొన్నిటిని వివరించారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు తప్పని న్యాయమూర్తులు బహిరంగ వేదికలపై క్షమాపణలు చెప్పిన సందర్భాలున్నాయని, మరింత మంది జడ్జీలు ఇలా తప్పు ఒప్పుకునే పరిస్థితి వస్తుందని వ్యాఖ్యానించారు. ఇటీవల తాను ‘ది హిందూ’ పత్రికలో రాసిన వ్యాసాన్ని ఆయన ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కొందరు న్యాయమూర్తులు పరిధి దాటుతున్నారంటూ కొన్ని సందర్భాలను దాన్లో ప్రస్తావించానని తెలియజేశారు. రాష్ట్ర హైకోర్టుకు సంబంధించి కొన్ని సునిశితమైన విమర్శలు చేశారు. రాష్ట్రంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థులతో కాకుండా న్యాయవ్యవస్థతో పోరాడాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు. హెబియస్ కార్పస్ పిటిషన్లలో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకుంటే జరిమానా విధించవచ్చునని ఈ సందర్భంగా చెప్పారాయన. అంతకు మించి ఉత్తర్వులివ్వటం సరికాదన్నారు. సామాజిక మాధ్యమాల్లో వ్యాఖ్యలకు సంబంధించి సీబీఐ దర్యాప్తునకు అప్పగించటం, నిందితులను పట్టుకోవటానికి విదేశాలకు దర్యాప్తు అధికారులను పంపటం వంటి చర్యలను తప్పుబట్టారు. కోర్టులు తమ పరిధులను తెలుసుకోవాలని జస్టిస్ చంద్రు అభిప్రాయపడ్డారు. ‘‘నేను కోరుకునేది ఒక్కటే. మానవ హక్కుల పరిరక్షణ. అది ఏ వ్యక్తికి సంబంధించినదైనా కావొచ్చు’’ అన్నారాయన. అంతకు ముందు ఏపీసీఎల్ఏ ప్రధాన కార్యదర్శి పొత్తూరి సురేశ్ కుమార్ మాట్లాడుతూ, న్యాయస్థానాల్లో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేస్తే తప్ప ఈ ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. కోర్టు ఆదేశాలతోనే పనులు అవుతున్నాయన్నారు. లాయర్లు హక్కుల కోసం పనిచేయాలి... అనంతరం విజయవాడ సివిల్ కోర్టుల ప్రాంగణంలోని బెజవాడ బార్ అసోసియేషన్ (బీబీఏ)లో ‘మానవ హక్కులు– న్యాయవాదుల పాత్ర’ అంశంపై జరిగిన సదస్సులో జస్టిస్ చంద్రు ముఖ్య అతిథిగా ప్రసంగించారు. న్యాయవాదులకు రాజ్యాంగమే ఆయుధమని, వారు డబ్బు కోసం కాకుండా హక్కుల కోసం పని చేయాలని జస్టిస్ చంద్రు చెప్పారు. బాధితుడికి న్యాయం చేస్తే ప్రశాంతంగా నిద్ర పోవచ్చన్నారు. డబ్బులు ముఖ్యం కాదని, సేవ చేయాలనే దృక్పథంతో వృత్తిని కొనసాగించాలని పిలుపునిచ్చారు. మరో అతిథి హైకోర్టు డిజిగ్నేటడ్ సీనియర్ అడ్వకేట్ వేములపాటి పట్టాభి మాట్లాడుతూ ఎన్నో కేసులలో తీర్పులతో పాటు గతంలో వాదించిన ఎన్నో కేసులతో ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన జస్టిస్ చంద్రూని రోల్ మోడల్గా తీసుకుని యువ న్యాయవాదులు వృత్తిలో రాణించాలని సూచించారు. విశ్రాంత అదనపు జిల్లా జడ్జి ఎ.పార్థసారథి, ఏపీ ఏజీ ఎస్.శ్రీరామ్, బీబీఏ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డి.పి.రామకృష్ణ, బి.రవి మాట్లాడారు. -
నల్లగొండలో జైభీమ్ తరహా ఘటన.. వీడియో వైరల్
సాక్షి, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో జై భీమ్ సినిమా తరహా సన్నివేశం చోటు చేసుకుంది. కేసు నిమిత్తం ఓ దళిత యువకుడిని స్టేషన్కు పిలిచి.. అతడిని చితకబాదారు ఎస్సై, కానిస్టేబుల్. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ సంఘటనపై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఆ వివరాలు.. (చదవండి: మీ అబ్బాయి బాలికతో.. కేసు మాఫీ చేయాలంటే రూ.లక్ష ఇవ్వు) నల్లగొండ టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. భూ వివాదానికి సంబంధించన కేసులో ఓ దళిత యువకుడిని స్టేషన్కు పిలిపించాడు ఎస్సై నర్సింహులు. అనంతరం అతడిని చితకొట్టారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తాయి. విషయం కాస్త పెద్దది కావడంతో ఈ ఘటనకు బాధ్యులైన ఎస్సై నర్సింహులు, కానిస్టేబుల్ నాగుల్ మీరాను సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. చదవండి: సఖ్యతకు అడ్డొస్తున్నాడని.. ప్రియుడితో కలిసి భర్త హత్య.. ఏమీ ఎరగనట్టు.. -
‘జై భీమ్’ సినిమాలో చూపింది సత్యమేనా?
జైభీమ్ సినిమా కలిగించిన సంచలనం సరే.. కానీ ఒక నిర్మాతగా తనకున్న స్వేచ్చని హీరో సూర్య దుర్వినియోగ పరచారు. డీఎంకే పార్టీ మద్దతు దారుడు, జైభీమ్ నిర్మాత, హీరో సూర్య అగ్ని(వన్ని) కులక్షత్రియుల భుజంపై గన్ పెట్టి, హిందూ మతంపై ఎక్కుపెట్టిన, మతపర వ్యాపారాత్మకమైన మూలకాన్ని నింపిన తూటాను పేల్చాడు. విలన్ పాత్రధారుడైన పోలీస్ అధికారి ఇంట్లో ఒక సన్నివేశంలో అగ్ని(వన్ని)కులక్షత్రియుల లోగో ఉన్న క్యాలండర్ను ప్రత్యేకించి కనిపించేటట్లు పెట్టడం సదుద్దేశం ఎలా అవుతుంది? (చదవండి: వివక్షకు విరుగుడు ప్రశ్నించడమే!) తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలలో వహ్నికుల క్షత్రియులుగానూ, ఆంద్ర, తెలంగాణా రాష్ట్రాలలో అగ్నికుల క్షత్రియులుగానూ జీవో నంబర్ 297/తేదీ.13–06–1921 అనుసరించి అధికారికంగా ధ్రువీకరించబడుతున్న అగ్ని, వన్ని కులక్షత్రియులు, పవిత్రమైనదిగా ఆరాధించే తమ జాతి లోగోను ప్రతినాయకుడి ఇంట్లో పెట్టడం ద్వారా జాతి వివక్షదారులు వన్నియర్స్ అన్న అవాస్తవాన్ని చిత్రీకరించారు. ఈ అగ్ని, వన్ని కులక్షత్రియుల అగ్నికుండం లోగో ఉన్న క్యాలండర్ ప్రతినాయకుడి ఇంట్లోకి గాల్లో కొట్టుకు వచ్చి రాలేదు అన్నది వాస్తవం. ఇది తప్పు అని గొడవ చేస్తే, ఆ సన్నివేశంలో అగ్ని(వన్ని) కులక్షత్రియుల లోగో ఉన్న క్యాలండర్ను తొలగించి, జై భీమ్ సినిమాలో నిజ జీవితంలో గిరిజన రాజన్నను కొట్టి చంపిన పోలీస్ అధికారి పేరు వాస్తవానికి ఆంథోనిరాజు. కానీ, జై భీమ్ సినిమాలో రాజన్నను కొట్టి చంపిన పోలీస్ అధికారి పేరుని గురుమూర్తిగా మార్చారు. (చదవండి: జైభీమ్.. నాటి పోరాటం గుర్తొచ్చింది!) యధార్థ చరిత్ర అని చెప్పిన జై భీమ్ సినిమాలో హీరో తదితర కొన్ని ముఖ్యమైన పాత్రలకు నిజ జీవితంలోని పేర్లే పెట్టారు. కానీ, విలన్ పాత్రధారి పేరుని మాత్రం హిందూ పేరుగా మార్చి పెట్టారు. సినిమా కలెక్షన్స్ పెంచుకోవడానికి, పూర్తి వ్యాపారాత్మక కోణంలో ఆలోచించి సినిమా టైటిల్ను జైభీమ్ అని పెట్టిన చిత్ర నిర్మాణ బృందం, అదే వ్యాపారాత్మక కోణంలో ప్రతి నాయకుడిని హిందువుగా చూపించాలన్న అనైతిక చర్యకు పాల్పడింది. ఒక పవర్ఫుల్ సందేశాన్ని అందించే అవకాశాన్ని చిత్ర నిర్మాణ బృందం ముఖ్యంగా నిర్మాత, హీరో సూర్య స్వార్థానికి వాడుకోవడం సమర్థనీయం కాదు. (చదవండి: ప్రజాభీష్టంతోనే మూడు రాజధానులు...) – చింతా శ్రీకృష్ణ బాబు వ్యవస్థాపక అధ్యక్షులు దక్షిణ భారత అగ్నికుల క్షత్రియ ప్రాచీన వారసత్వ పరిశోధనా సంస్థ -
వివక్షకు విరుగుడు ప్రశ్నించడమే!
ఎన్నిసార్లు మాట్లాడినా ఎంతోకొంత మిగిలిపోయే అంశం – కుల వివక్ష. అది దేశమంతా వేళ్లూనుకుని ఉన్న జాడ్యం. దాన్ని తెగ నరకాలంటే ఆధిపత్య కులాలు తమ ధోరణిని పరిశీలించుకోవాలి. అణిచివేతకు గురయ్యే వాళ్లు ప్రశ్ననే అస్త్రంగా మలుచుకోవాలి. అలా ఎక్కుపెట్టిన ఒక ప్రశ్నారూపమే ‘జై భీమ్’. అయితే విమర్శకులనూ, ప్రేక్షకులనూ ఏకరీతిలో స్పందింపజేసిన ఈ సినిమా తమిళనాడులోని ఒక వర్గాన్ని మాత్రం ఆగ్రహానికి గురిచేసింది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తీసిన ఈ చిత్రం మీద రాజకీయంగా శక్తిమంతులైన వణ్ణియర్ల కుల సంఘం లేవనెత్తిన అభ్యంతరాల వల్ల... ఆదివాసీ ఇరుళ తెగ, ఇంకా అలాంటి సామాజిక వెలివేతకు గురవుతున్నవారి జీవితం గురించి చేయాల్సిన ఆలోచన పక్కదారి పడుతోంది. అది కీరపాక్కం గ్రామం. తమిళనాడులోని చెంగల్పట్ జిల్లాలోని ఒక పల్లెటూరు. ఆ ఊరికి దగ్గర ఒక గుడిసెల సముదాయం. గుడిసెలపై కప్పి ఉన్న పాలిథీన్ కవర్లు, ప్లాస్టిక్ పేపర్లు వాళ్ళ కటిక దారిద్య్రాన్ని విప్పి చెబుతున్నాయి. ఆ ఇళ్ళల్లోని ఒక ఇంట్లో నాగమ్మ అనే యాభై ఐదేళ్ళ మహిళ ఉంటున్నది. ఆ గూడెం ఊరిలో భాగం కాదు. అక్కడికి వెళ్ళ డానికి రోడ్డు పెద్ద మాట, ఎటువంటి దారీ తెన్నూ లేని వారి జీవితంలానే ఉంటుంది తొవ్వ. ఒక రోజు కొందరు వ్యక్తులు ఏడుపులు, పెడబొబ్బలతో ఒక మనిషిని మోసుకొచ్చారు. ఆ వ్యక్తి చావుకు దగ్గరవుతున్నట్టు వాళ్ళ ఏడుపులని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఆ గుంపు నాగమ్మ గుడిసె ముందు ఆగింది. నాగమ్మకు వెంటనే విషయం అర్థమైంది. మోసు కొచ్చిన వ్యక్తిని పట్టుకొని చూసింది. పాము కాటు వేసినట్టు గమనించింది. దగ్గర్లో ఉన్న పొదల్లోకి వెళ్ళి ఆకులను తీసుకొచ్చింది. తన వద్ద ఉన్న కొన్ని వేళ్ళు, బెరడులు, ఆకుల్ని కలిపి నూరింది. పసరు పాము కాటు వేసిన చోట పిండింది. నూరిన ముద్దను గాయంపైన కట్టింది. అట్లా రెండు మూడుసార్లు చేసిన తర్వాత ఆ వ్యక్తి కళ్ళు తెరిచాడు. ఈ వైద్యం చేసింది తమిళనాడులోని ఇరుళ ఆదివాసీ తెగకు చెందిన మహిళ. తమిళనాడులో ఉన్న ప్రాచీన ఆదివాసీ తెగలలో ఇది ఒకటి. తమిళనాడులో ముఖ్యంగా యాక్షన్ సినిమాల్లో రాణిస్తున్న సూర్య తీసిన ‘జై భీం’ చిత్రం ఇటీవల ఒక సంచలనాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. మానవత్వం ఉన్న ప్రతి మనిషీ ఈ సినిమాను ఇష్టపడ్డారు. ఆ సినిమాలో ఒక ఆదివాసీ వ్యక్తిపై, దొంగతనం నేరం మోపి, పోలీ సులు చిత్రహింసలు పెట్టి చంపేశారు. అయితే ఇది కథ కాదు. నిజంగా జరిగింది. ఆ వ్యక్తి పేరు రాజాకన్నన్. ఆయన ఇరుళ తెగకు చెందిన వాడు. జై భీం చిత్రం కొందరికి కొరకరాని కొయ్యగా కూడా తయారయ్యింది. కోడిగుడ్డుపైన ఈకలు పీకినట్టు ఏదో చేయాలని ప్రయత్నం చేశారు. కొన్ని సన్నివేశాలు, పేర్లు తమ ప్రతిష్టను దెబ్బతీశాయనీ, ఐదు కోట్ల పరువునష్టం చెల్లించాలనీ కోర్టును ఆశ్ర యించారు. వాళ్ళే వణ్ణియర్ కుల సంఘం పెద్దలు. ఆ కుల సంఘానికి మరో పేరు పీఎంకే. పాట్టాళి మక్కళ్ కట్చి. దాని నాయకుడు ఎస్. రామదాసు. ఆయన కూడా ఈ చిత్రంపైన విరుచుకుపడ్డారు. వణ్ణియర్ కుల ప్రతిష్టకూ ఈ చిత్రానికీ ఉన్న సంబంధం ఏమిటి? నిజానికి దీనిని ఎవ్వరూ అంతగా గమనించలేదు. సినిమాలో ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు. ఆయన పేరు సినిమాలో గురుమూర్తి. ఆ పేరు పెట్టడమే వాళ్ళ తొలి అభ్యంతరం. గురుమూర్తి అనే పేరు వాళ్ల ఒక నాయకుడిని గుర్తు చేస్తుందన్నది వాళ్ళ వాదన. అయితే వాళ్ళ నాయకుడి పేరు జె.గురు. ఆ ఇన్స్పెక్టర్ క్రూరంగా ప్రవర్తిస్తాడు. అందువల్ల తమ నాయకుడి జ్ఞాపకాలు వస్తాయని ఆ సంఘం ఆరోపణ. జె. గురు అనే నాయకుడు రెండుసార్లు శాసనసభ్యుడు. అరియాబారు జిల్లా, జయకొండు నియోజకవర్గం నుంచి పీఏంకే నుంచి ఎన్నికయ్యారు. ఆయనది వణ్ణియర్ సంఘంలో కీలక భూమిక. వీళ్లు ఉత్తర తమిళనాడులో అత్యధిక సంఖ్యలో ఉన్న బీసీ సామాజిక వర్గం. జె.గురు అనే వ్యక్తి పదుల కొద్దీ దాడుల్లో పాల్గొన్నాడనడానికి ఆయన మీద నమోదైన కేసులే సాక్ష్యం. ఈ చిత్రంపై వణ్ణియర్ సంఘం చేసిన రెండో ఆరోపణ... సిని మాలో పోలీస్ ఇన్స్పెక్టర్ గురుమూర్తి మాట్లాడుతున్నప్పుడు ఆయన వెనుక ఒక క్యాలెండర్ ఉందనీ, అందులో తమ కుల చిహ్నమైన కలశం ఉన్నదనీ (దీన్ని ఇటీవల సినిమా నుంచి తొలగించారు). నిజా నికి ఈ రెండు విషయాలను ప్రేక్షకులను గమనించనే లేదు. కానీ ఈ సంఘం ఈ చిత్రాన్ని ఎందుకు టార్గెట్ చేసింది అంటే అందుకు తమిళనాడు కుల చరిత్రను తడిమి చూడాల్సిందే. తమిళనాడులో జరుగుతున్న కుల ఘర్షణలు, దళితుల, ఆదివాసులపైన దాడులు చాలా కిరాతకంగా ఉంటున్నాయి. ఉత్తర తమిళనాడులో వణ్ణియర్లు సామాజిక, రాజకీయ ఆధిపత్యాన్ని కలిగివున్నారు. వణ్ణియర్లు అధికంగా ఉన్నచోటే ఇరుళ ఆదివాసీ తెగ కూడా ఉంది. ఇరులు అత్యంత వెనుకబడిన ఆదివాసీ తెగ. ఈ తెగ దేశానికీ, సమాజానికీ ఎంతో మేలు చేసిన విషయం ఎవరికీ తెలియదు. పాము కాటుకు విరుగుడు ఇంజెక్షన్ తయారు చేయడానికి ప్రాథమికమైన ముడిపదార్థం పాము విషం. పామును పట్టుకొని, ప్రాణాలకు తెగించి పాము కోరల నుంచి పాము విషాన్ని తీసి ఇస్తే, దానిని వివిధ పద్ధతుల ద్వారా ప్రాసెస్ చేసి, విషం విరుగుడు ఇంజక్షన్ తయారు చేస్తారు. అంతేకాకుండా, ఈ తెగ గొప్ప వైద్య సాంప్రదాయాన్ని ప్రకృతి నుంచి పుణికి పుచ్చుకుంది. దాదాపు 300 రకాల మందులను తయారు చేసే జ్ఞానం వీరి సొంతం. అయితే ఇప్పటికీ వీరు గ్రామాల్లో నివాసముండరు. నూటికి తొంభై మందికి చదువులేదు. సరైన జీతాలు లేని పద్ధతుల్లో, ఇటుక బట్టీల్లో, రైస్ మిల్లుల్లో పని చేస్తున్నారు. ఇవన్నీ పోను గ్రామాల్లో ఎక్కడ దొంగతనమైనా ముందు ఇరుళ సామాజిక వర్గం వారిని పట్టుకొచ్చి, హింసించడం తమిళనాడులో పాతుకు పోయిన కులాధిపత్యానికి తార్కాణం. ప్రతి సంవత్సరం కొన్ని వందల కేసులు వీళ్ళ మీద నమోదవుతుంటాయి. మగ వాళ్ళ కోసం వచ్చిన పోలీసులు మహిళలను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి అత్యా చారాలు జరిపిన ఘటనలు కూడా ఉన్నాయి. ఇది జై భీం సినిమాలో కూడా చూశాం. ఇరుళ ఆదివాసీ హక్కుల సంఘాలు ఈ విషయాలను ఎన్నోసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయి. ఒకవైపు పోలీసులు, రెండో వైపు పల్లెల్లోని ఆధిపత్య కులాలు ఇరుళ తెగ ప్రజలను పెడుతున్న హింస చెప్పనలవి కానిది. వణ్ణియర్ సంఘం నాయకులు ఎటువంటి భయ సంకోచాలు లేకుండా, చట్టాలను, రాజ్యాంగాన్ని బహిరంగంగానే విమర్శిస్తున్నారు. పదేళ్ళ క్రితమే పీఏంకే అధ్యక్షుడు రామదాసు ‘కులాంతర వివాహాలను జరగనివ్వం. ఎవరైనా వణ్ణియర్ కులం పిల్లలతో సంబంధాలు పెట్టుకుంటే తగిన శిక్ష అనుభవిస్తారు’ అని ప్రకటించారు. ఈ సంవత్సరం, సెప్టెంబర్ పదవ తేదీన ఇరుళ తెగకు చెందిన రమేష్, వణ్ణియర్ కులానికి చెందిన మోహన ప్రేమ వివాహం చేసుకున్నారు. ధర్మపురి జిల్లాలోని ఒక గ్రామంలో ఈ సంఘటన జరిగింది. అయితే అమ్మాయి తల్లిదండ్రులకు ఈ విషయం తెలిసి, అబ్బాయి తల్లిదండ్రులను పట్టుకొని ఊరికి తీసుకొచ్చి, అబ్బాయి తండ్రిమీద ఆ ఊరిలోని ఆ కులపోళ్ళు బహిరంగంగా మూత్రం పోసిన దారుణ ఘటన సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేస్తోంది. ధర్మపురి పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. అంటే జై భీం చిత్రంలో మనం చూసింది ఒక్క ఘటన మాత్రమే. ఈ చిత్రం వల్ల తాము చేసిన ఎన్నో దురంతాలు ప్రజల మెదళ్లలోకి వెళతాయని భయపడిన కులోన్మాదులు ఈ చిత్రాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారు. నిజానికి తమిళనాడులో పంటలను దెబ్బతీస్తున్న ఎలుకలను, గ్రామాల్లో ప్రజల ప్రాణాలకు హానికరంగా మారిన పాములను పట్టుకొని తరతరాలుగా రైతులకు మిత్రులుగా ఉన్న ఇరుళ తెగ మీద జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు వెలుగులోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే వాళ్ళు కుల మతోన్మాదాన్ని తుదముట్టించాలి. మానవీయతకు ప్రాణం పోయాలని తపిస్తున్న వాళ్లంతా మరొక్కసారి దళితులు, ఆదివాసీలు ఈ దేశానికీ, సమాజానికీ చేసిన నిస్వార్థమైన సేవలను, అని తరసాధ్యమైన త్యాగాలను గుర్తించాలి. - మల్లెపల్లి లక్ష్మయ్య సామాజిక విశ్లేషకులు -
జై భీమ్ కోసం ఎలుకను తిన్నాను: హీరోయిన్
Jai Bhim Movie: Lijomol Jose Training in Catching Rats and Taste Rat Meatఫ లిజోమోల్ జోస్ అంటే గుర్తుపడతారో లేదో కానీ 'జై భీమ్' లో సినతల్లి అంటే మాత్రం ఇట్టే గుర్తుపడతారు. అంతలా పాత్రలో జీవించేసిందీ నటి. అంతకు ముందు మలయాళ, తమిళ సినిమాల్లో నటించిన లిజొమోల్కు తెలుగులో డబ్ అయిన ఒరేయ్ బామ్మర్ది సినిమాతో మరింత గుర్తింపు వచ్చింది. ఒకరకంగా చెప్పాలంటే ఈ చిత్రంలో ఆమె నటనే చూసే దర్శకుడు జ్ఞానవేల్ 'జై భీమ్' సినిమా ఛాన్స్ ఇచ్చాడు. ఇందులో ఆమె గిరిజన మహిళగా, గర్భవతిగా అందరితో కన్నీళ్లు పెట్టించే సినతల్లిగా పవర్ఫుల్ పాత్రలో నటించింది. ఈ సినిమా కోసం ఎంతో హార్డ్ వర్క్ చేశానంటోంది లిజోమోల్. ప్రతిరోజూ గిరిజనుల గుడిసెలకు వెళ్లేదాన్నని, అక్కడ వాళ్లు చేసే పని నేర్చుకుని వాళ్లతో కలిసి పని చేసేదాన్నని చెప్పుకొచ్చింది. వాళ్లు చెప్పులు వేసుకోరని, పగలూరాత్రి తేడా లేకుండా వేటకు వెళ్తారని, అవన్నీ తాను కూడా చేశానంటోంది. సినిమాలో పాము కాటుకు మందులు ఇస్తుంటానని, అది నిజంగానే నేర్చుకున్నానని తెలిపింది. 'వాళ్లు ఎలుకలను వేటాడి వండుకుని తింటారు. ఏవి పడితే అవి కాకుండా పొలాల్లో దొరికేవే తింటారు, నేను వాళ్లలా ఉండాలంటే వాళ్లు చేసినవన్నీ చేయాలనుకున్నాను. అందుకే ఎలుక కూర తిన్నాను' అని చెప్పుకొచ్చింది. తనకైతే అది చికెన్లా అనిపించిందని పేర్కొంది. ఈ విషయం ఇంట్లో తెలిసి నువ్వు ఎలుక కూర తిన్నావా? అని అడిగారని అయితే ఆ కూర తినడం తప్పేం కాదని, వాళ్లు తింటున్నప్పుడు మనమెందుకు తినకూడదు అని సర్ది చెప్పానంది. అప్పటినుంచి ఎవరూ దాని గురించి మళ్లీ ప్రస్తావించలేదని తన అనుభవాలను చెప్పుకొచ్చింది లిజోమోల్. -
యువత ఆలోచనల్లో మార్పు తెస్తున్న ‘జై భీమ్’..
ఈ సినిమా చూసిన చాలామంది యువత న్యాయవృత్తిని చేపడతామని బాధితులకి న్యాయం చేకూరేలా తమ వంతు కృషి చేస్తామంటూ ముందుకు వస్తున్నారు. చెన్నైకి చెందిన శ్రవణ్ అనే కామర్స్ విద్యార్థి ఈ సినిమా చూసిన తర్వాత తాను న్యాయశాస్త్రం చదవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. అంతేకాదు తనకు న్యాయ రంగం నచ్చిందని, పైగా ఈ చిత్రంలో సూర్య తీసుకున్న తుది నిర్ణయం తనకు బాధితులకు న్యాయం చేయడానికి ఉపకరించేలా ఉందని అన్నాడు. (చదవండి: హే! ఇది నా హెయిర్ స్టైయిల్... ఎంత క్యూట్గా ఉందో ఈ ఏనుగు!!) అయితే శ్రవణ్ లైంగిక వేధింపుల బాధితులు తమ తప్పు లేకుండానే వారు శిక్షించబడుతున్నారని వారికి న్యాయం చేయాలనుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు. అంతేకాదు ఎంబీఏ చేస్తున్న శ్రవణ్ సత్యనారాయణ అనే మరో విద్యార్థి ఈ సినిమా అట్టడుగు వర్గాలకు సహాయం చేయడానికి, సాధికారత కోసం ఏదైనా చేయాలనే సందేశాన్ని ఇస్తోందని అందువల్ల తాను వారికి ఉద్యోగాలు పొందేలా సాయం చేయాలనుకున్నట్లు చెప్పాడు. అయితే టీ జే జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ఈ లీగల్ సినిమా 1993లో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా రూపొందించారన్న సంగతి తెలిసిందే. పైగా ఈ సినిమాలో జస్టిస్ కే. చంద్రు పోరాడిన కేసు తాలుకా ఇరులర్ తెగకు చెందిన ఒక జంట జీవితాల చుట్టూ తిరుగుతుంది. తమిళనాడు నేపథ్యంలో సాగే ఈ చిత్రం సమాజంలోని అసమానతలు అణగారిన వర్గాల అణచివేతకు సంబంధించిన ఇతి వృత్తాలను స్పృశిస్తూనే, న్యాయవాది శక్తితో మానవ హక్కులను కాపాడేలా వారి బాధ్యత గురించి తెలియజేస్తుంది. ఈ మేరకు రిటైర్డ్ జడ్జి జస్టిస్ కె. చంద్రు ఈ చిత్రాన్ని "అర్ధవంతమైన సినిమా"గా అభివర్ణించారు. అంతేకాదు దిద్దుబాటు యంత్రాంగాలు అందుబాటులో ఉన్నాయనే అంశాన్ని గుర్తు చేస్తోందన్నారు. ఒక న్యాయవాది సునిశితమైన న్యాయవ్యవస్థ సాయంతో బాధితులకు కచ్చితంగా న్యాయం జరిగేలా చేయడంలో సహాయపడగలరంటూ కె. చంద్రు విశ్వాసం వ్యక్తం చేశారు. (చదవండి: ప్రపంచంలోనే అత్యంత సంపన్న కుక్క.. వందల కోట్ల వారసత్వ ఆస్తి!) -
సూర్య తర్వాతి చిత్రం విడుదల ఎప్పుడో తెలుసా ?
Suriya Etharkkum Thunindhavan Movie Release Date Out: తమిళ స్టార్ హీరో సూర్యకు పిచ్చి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ మధ్య ఆయన సినిమాల వేగాన్ని పెంచేశారు. ఇటీవల ఓటీటీలో విడుదలైన 'జై భీమ్' తో మంచి విజయాన్ని అందుకున్నారు. మరో మూడు నెలల్లో తన తదుపరి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 'ఎతర్కుమ్ తునింధవన్' సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 4, 2022న థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ విషయాన్ని ట్విటర్లో ఓ వీడియోని పోస్ట్ చేసింది చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్. చదవండి: సూర్య మంచి మనసు.. ఆ చిత్ర యూనిట్కు బంగారు నాణేలు ఈ వీడియోలో సూర్య మాస్ లుక్లో మాస్ బీట్కు అదిరిపోయే స్టెప్పులేస్తూ కనిపించారు. ఈ చిత్రానికి పాండిరాజ్ దర్శకత్వం వహించగా, సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్లో సాగనుంది. వినయ్ రాయ్, ప్రియాంక అరుల్ మోహన్, శరణ్య, ఎం.ఎస్ భాస్కర్ కీలక పాత్రలు పోషించారు. సినిమాకు ఆర్. రత్నవేలు సినిమాటోగ్రఫీ అందించగా, డి. ఇమ్మాన్ స్వరాలు సమకూర్చారు. తమిళ హీరో శివ కార్తికేయన్, నిర్మాత, దర్శకుడు విఘ్నేశ్ శివన్ సాహిత్యమందించారు. కొవిడ్ కారణంగా సూర్య నటించిన 'ఆకాశమే నీ హద్దురా', 'జై భీమ్' రెండు చిత్రాలు ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు పరిస్థితులు అనుకూలించడంతో 'ఎతర్కుమ్ తునింధవన్'ను థియేటర్లలో విడుదలవనుంది. సుమారు రెండేళ్ల తర్వాత సూర్య వెండితెరపై కనిపించనున్నారు. #EtharkkumThunindhavan is releasing on Feb 4th, 2022!@Suriya_offl @pandiraj_dir #Sathyaraj @immancomposer @RathnaveluDop #SaranyaPonvannan #MSBhaskar @priyankaamohan #Vinay @sooriofficial @AntonyLRuben @VijaytvpugazhO #ETOnFeb4th pic.twitter.com/hwuwEkX3Bm — Sun Pictures (@sunpictures) November 19, 2021 చదవండి: ఇంత ప్రేమ ఇంతకుముందెన్నడూ చూడలేదు :హీరో -
జైభీమ్ మూవీపై సీతక్క ట్వీట్.. థ్యాంక్యూ మేడమ్ అంటూ హీరో సూర్య రిప్లై
సాక్షి, హైదరాబాద్: తమిళ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం జైభీమ్. సినిమా అంటే ఫైట్లు, ఫీట్లు, ఐటెం సాంగ్లు కాదని నిరూపించిన మూవీ జై భీమ్. సినిమాకు సామాజిక బాధ్యతకు ఉన్న అవినావ సంబంధాన్ని మరోసారి తట్టిలేపింది. ఒక ఆడబిడ్డ నిజజీవిత గాథను, పోరాటాన్ని ప్రయోగాత్మకంగా తెరకెక్కించిన వైనం శభాష్ అనిపించుకుంది. ఈ మూవీ బ్లాక్ బ్లస్టర్హిట్ అవ్వడమే కాదు అనేక రికార్డులతో దూసుకుపోతోంది. అయితే జై భీమ్ చిత్రం విమర్శకుల ప్రశంసలను దక్కించుకుంది. ఇప్పటికే పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఈ చిత్రాన్ని వీక్షించి.. హీరో సూర్య, చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. అయితే తాజాగా ఈ చిత్రాన్ని చూసిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ధనసరి అనసూయ(సీతక్క) హీరో సూర్యకు ట్విటర్ వేదికగా అభినందనలు తెలియజేశారు. ‘జై భీమ్ చిత్రం ఆస్కార్ బరిలో నిలిచి అవార్డు సాధిస్తుందని ఆశిస్తున్నా. చిత్రం బృందానికి ముందస్తుగా నా అభినందనలు’ అని ఆమె ట్వీట్ చేశారు. అయితే ఆమె చేసిన ట్వీట్కు హీరో సూర్య స్పందించారు. ‘కృతజ్ఞతలు మేడం.. మా చిత్రం బృందం తరఫున మీకు కృతజ్ఞతలు’ అని సూర్య రిప్లై ఇచ్చారు. I hope this movie gets Oscar award @Suriya_offl garu 🙏 🔸My Congratulations in advance to entire Jai Bhim movie team 💐@RahulGandhi @priyankagandhi @TribalArmy @HansrajMeena @manickamtagore @JitendraSAlwar @AlankarSawai @vidyarthee @revanth_anumula @MahilaCongress https://t.co/DsjsuZNVXA — Danasari Anasuya (Seethakka) (@seethakkaMLA) November 17, 2021 -
ఇంత ప్రేమ ఇంతకుముందెన్నడూ చూడలేదు: హీరో సూర్య
సాక్షి, హైదరాబాద్: తమిళ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో తెరకెక్కిన జైభీమ్ వివాదం, ఈ నేపథ్యంలో తనకు లభిస్తున్న స్పందనపై సూర్య సంతోషాన్ని వ్యక్తం చేశారు. తమకు అండగా నిలిచిన వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు సూర్య బుధవారం ట్వీట్ చేశారు. (Jai Bhim: మరో ఘనత, హాలీవుడ్ క్లాసిక్ హిట్ను దాటేసింది ) జైభీమ్ మూవీని ఆదరిస్తున్న తీరు, ప్రేమ అపారమైనది. ఇంతకు ముందెప్పుడూ ఇలాంటి ప్రేమ చూడలేదంటూ సూర్య తన ఆనందాన్ని ప్రకటించారు. ఈ సమయంలో తమకు అందించిన విశ్వాసం, భరోసాకు ఎంత కృతజ్ఞతతో ఉన్నానో మాటల్లో చెప్పలేనంటూ ట్వీట్ చేశారు. జైభీమ్ సినిమా వివాదం నేపథ్యంలో హీరో సూర్యకు సోషల్ మీడియాలో భారీ మద్దతు లభించింది. స్టాండ్ విత్ సూర్య అంటూ నెటిజనులు సూర్య అండ్ టీంకు అండగా నిలబడు తున్నారు. కాగా ఈ మూవీలో ప్రకాష్ రాజ్ చెంపదెబ్బ సీన్పై వివాదం సమసిపోకముందే ఈ సినిమాలోని పలు అంశాలు ఓ వర్గం వారికి కించపరిచేలా ఉన్నాయని పీఎంకే ఎంపీ అన్బుమణి రాందాస్ ఆరోపించిన సంగతి తెలిసిందే. చిత్ర దర్శకుడు, నిర్మాతపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పీఎంకే మైలాడుతురై జిల్లా కార్యదర్శి పన్నీర్ సెల్వం అక్కడి పోలీస్ సూపరింటెండెంట్కు లేఖ రాశారు. ఈ ఆరోపణలను హీరో సూర్య ఖండించారు. మరోవైపు హీరో సూర్యని కొట్టిన వారికి ఏకంగా లక్ష రూపాయలు బహుమతిగా ఇస్తామని పీఎంకే పార్టీ నేతలు సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే జైభీమ్ సినిమా వివాదంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయ వద్దని, ఆవేశకావేశాలకు లోను కావద్దని తన ఫ్యాన్స్కు పిలుపు నిచ్చారు. అన్ని వర్గాలు, కులాల వారిని సమంగానే చూడాలని ఎవరినీ కించపరచొద్దంటూ ఒకలేఖ రాశారు. అటు నిజజీవిత కథ ఆధారంగా తెరకెక్కిన జైభీమ్ సినిమా ఓటీటీలో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఐఎండీబీ రేటింగ్లో టాప్ ప్లేస్లో దూసుకు పోతోంది. Dear all, this love for #Jaibhim is overwhelming. I’ve never witnessed this before! Can’t express in words how thankful I am for the trust & reassurance you all have given us. Heartfelt thanks for standing by us ✊🏼 — Suriya Sivakumar (@Suriya_offl) November 17, 2021 -
Suriya: హీరో సూర్య ఇంటి వద్ద హై సెక్యూరిటీ
Jai Bhim Controversy: Suriya Gets Police Protection: హీరో సూర్య నటించిన జై భీమ్ సినిమా ఓటీవలె ఓటీటీలో విడుదలై సూపర్ హిట్టయ్యింది. ఓవైపు విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న ఈ సినిమాపై అదే స్థాయిలో విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. వన్నియర్ సంఘం తమ ప్రతిష్టను దిగజార్చారంటూ ఇప్పటికే చిత్ర యూనిట్కు లీగల్ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. దీని తర్వాత కూడా సూర్యకు అనేక బెదిరింపులు వస్తుండటంతో పోలీసులు ఆయనకు భద్రత కల్పించారు. చెన్నైలోని సూర్య నివాసం వద్ద పోలీసులు భద్రత కల్పించారు. మరోవైపు సూర్యకు పలువురు ప్రముఖులు సహా అభిమానులు అండగా నిలుస్తున్నారు. ట్విట్టర్లో # WeStandwithSuriya అనే హ్యాష్ట్యాగ్ని ట్రెండ్ చేస్తున్నారు. సూర్యకు మద్ధతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. -
రాజాకన్ను సతీమణికి లారెన్స్ ఆర్థికసాయం
సాక్షి, చెన్నై(తమిళనాడు): రాజాకన్ను భార్య పార్వతమ్మకు నృత్య దర్శకుడు, నటుడు రాఘవలారెన్స్ ఆర్థిక సాయం చేశారు. సూర్య కథానాయకుడిగా నటించి నిర్మించిన చిత్రం జై భీమ్. పోలీసుల దాష్టీకానికి బలైపోయిన రాజాకన్ను సతీమణి పార్వతమ్మ ఇప్పటికీ జీవించే ఉన్నారు. ఆమె కడు పేదరికంలో జీవిస్తున్న విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న రాఘవ లారెన్స్ ఆమెకు ఇల్లు కట్టిస్తానని ఇటీవల ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. సోమవారం పార్వతమ్మను కలిసి ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సాయం చేశారు. ఈ సందర్భంగా ఆయన పార్వతమ్మతో మాట్లాడుతూ.. తన బామ్మ మాదిరిగానే ఉన్నావని, ఆమె ఇప్పుడు లేదు కనుక తన రూపాన్ని మీలో చూసుకుంటున్నానంటూ పార్వతమ్మ కాళ్లకు నమస్కారం చేసి ఆశీస్సులు అందుకున్నారు. కాగా రాఘవ లారెన్స్ పార్వతమ్మని కలిసిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. -
జైభీమ్: మరో ఘనత, హాలీవుడ్ క్లాసిక్ హిట్ను దాటేసింది
సాక్షి, హైదరాబాద్: సినిమా అంటే ఫైట్లు, ఫీట్లు, ఐటెం సాంగ్లు కాదని నిరూపించిన మూవీ జై భీమ్. సినిమాకు సామాజిక బాధ్యతకు ఉన్న అవినావ సంబంధాన్ని మరోసారి తట్టిలేపిన మూవీ. అంతేకాదు సింపుల్ బడ్జెట్తో ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా సగటు ప్రేక్షకుడిలో ఆలోచన రేకెత్తించిన సినిమాగా ప్రశంసలు దక్కించుకుంది. ఒక ఆడబిడ్డ నిజజీవిత గాథను, పోరాటాన్ని ప్రయోత్మకంగా తెరకెక్కించిన వైనం శభాష్ అనిపించుకుంది. ఈ మూవీ బ్లాక్ బ్లస్టర్హిట్ అవ్వడమే కాదు అనేక రికార్డులతో దూసుకుపోతోంది. తాజాగా ఐఎండీబీలో రేటింగ్స్లో హాలీవుడ్ క్లాసిక్ హిట్ ‘ది షాషాంక్ రిడంప్షన్’ అధిగమించి ప్రపంచవ్యాప్తంగా విమర్శకులను ఆకట్టుకుంటోంది. 1994లో విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు ఐఎండీబీ సినిమాల జాబితాలో టాప్ ఉంది. ప్రస్తుతం 2.5 మిలియన్ల ఓట్లతో 9.3 రేటింగ్తో ఉండగా, జై భీమ్ 73 వేలకు పైగా ఓట్లతో 9.6 రేటింగ్ సాధించింది తమిళ హీరో సూర్య, నటి జ్యోతిక దంపతులకు వారి మూవీలు, ఫ్యాన్స్లో వారికున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కంటెంట్ ప్రాధాన్యమున్న సినిమాలతో, అనేక ప్రయోగాలకు శ్రీకారం చుట్టడమే కాదు కమర్షియల్గా సూపర్ సక్సెస్ అవుతున్నారు.. ఈ మూవీ ఓటీటీలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఐఎండీబీలో అత్యధిక రేటింగ్ పొందిన టాప్ మూవీగా జైభీమ్ నిలిచింది. అరుదైన చిత్రాల జాబితా లిస్టులో చోటు సంపాదించుకుని 9.6 రేటింగ్తో తన ప్రత్యేకతను చాటుకుంటోంది. -
Jai Bhim IMDB Rating: మరో ఘనత, హాలీవుడ్ క్లాసిక్ హిట్ను దాటేసింది
-
Jai Bhim: సూర్యపై దాడి చేస్తే లక్ష రూపాయల బహుమతి!
PMK Announces Rs 1 Lakh Reward for Attacking Hero Surya: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన తాజా చిత్రం జై భీమ్ పలు వివాదాలకు దారితీస్తుంది. భారీ అంచనాల మధ్య ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ దూసుకెళ్తుంటే.. మరోవైపు అదే స్థాయిలో వివాదాలు కూడా తలెత్తుతున్నాయి. ఇటీవల సినిమాలో మతపరమైన చిహ్నాన్ని కలిగి ఉన్న సన్నివేశంపై ప్రేక్షకులలో ఒక వర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది. తాజాగా జై భీమ్ చిత్ర నిర్మాత దర్శకుడి పై చర్యలు తీసుకోవాలని కోరుతూ పీఎంకె మైలాడుతురై జిల్లా కార్యదర్శి పన్నీర్ సెల్వం అక్కడి పోలీసు సూపరింటెండెంట్కు వినతిపత్రం ఇచ్చారు. (చదవండి: పార్వతి అమ్మాళ్కు సూర్య రూ. 10 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్) అంతేకాదు వన్నియార్ కమ్యూనిటీని కించపరిచిన నటుడు సూర్య ని కొట్టిన వారికీ ఏకంగా లక్ష రూపాయిలు బహుమానాన్ని పీఎంకే నేతలు ప్రకటించి సంచలనం సృష్టించారు. ఈ నేపథ్యంలో ఆదివారం మైలాడుతురైలో నటుడు సూర్య సినిమా ప్రదర్శనను నిరసిస్తూ బామాక ప్రజలు నిరసనకు దిగారు. రూ. 5 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని జై భీమ్ నిర్మాత సూర్యకు వన్నియార్ సంఘం నోటీసు జారీ చేసింది. ఇదే వివాదంపై కేంద్ర మాజీ మంత్రి, పీఎంకే నేత అన్బుమణి ఓ లేఖను కూడా రాశారు. ఈ లేఖపై సూర్య స్పందిస్తూ.. తమకు దళితులపై జరుగుతున్న ఘటనలకు న్యాయం జరగాలనే ఉద్దేశం మాత్రమే ఉందని.. అంతేకాని తమ సినిమా ద్వారా ఏ వర్గాన్ని కించపరచడం తమ ఉద్దేశం లేదని.. వివరణ ఇచ్చారు. మరోపైపు పలువురు ప్రముఖులు సూర్యకు మద్దతుగా నిలుస్తున్నారు. #WeStandWithSuriya అనే హ్యాష్ట్యాగ్ ట్విటర్లో ట్రెండ్ అవుతోంది. ఫ్యాన్స్ మాత్రమే కాదు సినీ అభిమానులు కూడా సూర్యకు మద్దతు ప్రకటిస్తున్నారు. -
రియల్ సినతల్లికి రూ. 10 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్
తమిళ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తమిళ హీరో అయినప్పటికీ ఆయనకు తెలుగులోనూ ఎంతో క్రేజ్ ఉంది. ఒక పక్క కమర్షియల్ సినిమాలతో పాటు నటనకి ప్రాధాన్యం, కథ బలం ఉన్న సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. తాజాగా సూర్య జస్టిస్ చంద్రు అనే అడ్వకేట్ బయోపిక్తో అద్భుతమైన విజయం సాధించాడు. నిజ జీవితంలో అన్యాయంగా జైలుపాలైన భర్తను కాపాడుకునేందుకు ఓ గిరిజన మహిళ చేసిన పోరాటంలో.. చంద్రూ అనే అడ్వకేట్ నిస్వార్థంగా ఆమెకు సాయం చేసి తన తరపున కోర్టులో వాదించి గెలిచిన ఓ కేసును స్ఫూర్తిగా తీసుకుని ‘జై భీమ్’ సినిమాను చేశాడు సూర్య. చదవండి: షణ్ముఖ్, సిరిలపై షాకింగ్ కామెంట్స్ చేసిన జెస్సీ.. అరియాన షాక్ ఈ సినిమాతో ఇందులోని రియల్ పాత్రలు కూడా ప్రపంచానికి పరిచయమయ్యాయి . సినిమాలో సినతల్లి పాత్రకి నిజ జీవితంలో పార్వతి అమ్మాళ్ అనే మహిళ స్ఫూర్తి. ప్రస్తుతం ఆమె ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది. పిల్లలు పోషించలేక, వృద్ధాప్యంతో చాలా కష్టాల్లో ఉంది. ఈ సినిమాతో తన గురించి బయటి ప్రపంచానికి తెలియడంతో హీరో, కొరియోగ్రఫర్ రాఘవ లారెన్స్ ఆమెకు సొంత ఇల్లు కటిస్తానని మాట ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా హీరో సూర్య సైతం పార్వతి అమ్మాళ్కు అండగా నిలిచాడు. తన కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి.. మొత్తంపై నెల నెలా వచ్చే వడ్డీ పార్వతి అమ్మాళ్కు చేరేలా చేశాడు. చదవండి: అందంతో కట్టిపడేస్తోన్న అవికా, ఫొటోలు వైరల్ అంతేగాక తన తదనంతరం ఆమె పిల్లలకు ఈ వడ్డీ అందజేస్తామని సూర్య తెలిపారు. ఇప్పటికే అగరం ఫౌండేషన్ ద్వారా ఎంతో మందికి సేవలు చేస్తున్నాడు. ఎంతో మంది పిల్లల్ని చదివిస్తున్నాడు. ఎన్నో సేవా కార్యక్రమాల్ని చేపడుతున్నాడు. ఇవి మాత్రమే కాక తరచూ విరాళలు ప్రకటిస్తూ తన దాతృత్వాన్ని చాటుకుంటాడు. కరోనా సమయంలో కూడా తనవంతుగా కోటీ రూపాయలు ప్రకటించి తమిళ నాడు ప్రభుత్వానికి అండగా నిలిచాడు. అంతేగాక జై భీమ్ చిత్రం స్ఫూర్తితో గిరిజనుల సంక్షేమం కోసం కూడా సూర్య కోటీ రూపాయల విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇలా సూర్య రీల్ హీరోగా మాత్రమే కాకుండా రియల్ హీరో అనిపించుకుంటున్నాడు. చదవండి: కేబీఆర్ పార్క్ వద్ద నటిపై దాడి.. ముఖంపై పిడిగుద్దులు, హత్యాయత్నం -
పోలీసుల దాష్టీకం: గోడ కుర్చీ వేయించి.. మూత్రం తాగించి..
సూర్యాపేట/ఆత్మకూర్(ఎస్): శీలం రంగయ్య, మరియమ్మ లాకప్డెత్ ఘటనలు తీవ్ర సంచలనం రేపాయి. క్షేత్రస్థాయిలోని కొందరు పోలీసుల కర్కశత్వానికి నిలువెత్తు సాక్ష్యాలుగా ఈ ఘటనలు నిలిచాయి. మరియమ్మను గుండె ఆగిపోయేలా కొడతారా అంటూ పోలీసులపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మరుసటి రోజే మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. చేయని తప్పు ఒప్పుకోవాలంటూ ఓ గిరిజన యువకుడిని పోలీసులు తీవ్రంగా చితకబాదిన ఘటన సూర్యాపేట జిల్లాలో బుధవారం జరిగింది. ఆ యువకుడిని గోడ కుర్చీ వేయించారు.. ఆ యువకుడి మూత్రాన్ని అతడితోనే తాగించి రాక్షసానందం పొందారు. అత్యంత అమానుషంగా ప్రవర్తించిన ఆత్మకూరు(ఎస్) ఠాణా పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గిరిజన యువకుడిపై జరిగిన ఈ దాడి ఇటీవల విడుదలైన జైభీమ్ సినిమాను గుర్తుచేస్తోంది. దొంగతనం చేశాడంటూ.. గతేడాదిగా ఆత్మకూరు(ఎస్) మండలంలో ఎస్సారెస్పీ కాలువపై రైతులు ఏర్పాటు చేసుకున్న విద్యుత్ మోటార్లు, వ్యవసాయ పనిముట్లు చోరీకి గురవుతున్నాయి. రామోజీతండా ప్రాథమిక పాఠశాలలోనూ పలుసార్లు దొంగతనాలు జరగగా, పోలీసుల విచారణలో నిందితుల ఆచూకీ తెలియలేదు. ఇటీవల ఏపూరులోని బెల్టుషాపులో చోరీ జరిగింది. సీసీ పుటేజీ ఆధారంగా రామోజీతండాకు చెందిన బానోతు నవీన్ను గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఈ చోరీల్లో తనతో పాటు మరికొందరు ఉన్నట్లు విచారణలో నవీన్ వెల్లడించాడు. అతడు ఇచ్చిన సమాచారం ఆధారంగా రామోజీతండాకు చెందిన గుగులోతు వీరశేఖర్ను బుధవారం మధ్యాహ్నం 11 గంటల ప్రాంతంలో అదుపులోకి తీసుకుని మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్కు తీసుకెళ్లి విచారించారు. రాత్రి 12 గంటల సమయంలో పోలీసులు తండా సర్పంచ్కు ఫోన్ చేసి వీరశేఖర్ను తీసుకెళ్లాలని చెప్పారు. దీంతో వీరశేఖర్ సోదరుడు వీరన్న పోలీస్స్టేషన్కు వెళ్లి సొంతపూచికత్తుపై వీరశేఖర్ను తీసుకెళ్లాడు. ఎస్సై తీసుకురమ్మన్నాడు.. బాధితుడు వీరశేఖర్ గురువారం తెల్లవారుజామున పెద్దగా కేకలు వేశాడు. ఆ తర్వాత నోటి మాట రాకపోవడంతో కుటుంబసభ్యులు స్థానిక ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లారు. గురువారం ఉదయం 7 గంటల సమయంలో ఇద్దరు కానిస్టేబుళ్లు వీరశేఖర్ను పోలీస్స్టేషన్కు తీసుకెళ్లేందుకు వచ్చారు. ఇంట్లోకి వెళ్లి బాధితుడి పరిస్థితి గమనించిన కానిస్టేబుళ్లు అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించరు. దీంతో అప్పటికే గుమిగూడి ఉన్న తండావాసులు వారిని చుట్టుముట్టారు. తమకు ఎలాంటి సంబంధం లేదని, ఎస్సై తీసుకురావాలని చెప్పడంతోనే వచ్చామంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. వెంటనే తండావాసులు వీరశేఖర్ను పోలీస్స్టేషన్కు తీసుకెళ్లి ఆందోళన చేశారు. పోలీస్ స్టేషన్ ముట్టడికి యత్నం.. వీరశేఖర్ బంధువులు ఆగ్రహంతో గురువారం ఆత్మకూర్.ఎస్ పోలీస్ స్టేషన్ ముట్టడికి యత్నించారు. నడవలేని స్థితిలో ఉన్న వీరశేఖర్ను ట్రాక్టర్పై తీసుకొచ్చి ఆందోళన చేశారు. దొంగతనంతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పినా వినకుండా, వీరశేఖర్ను రోజంతా గోడకుర్చీ వేయించి కొట్టారని, బాధ్యులైన ఎస్సై, సిబ్బందిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కాగా, దొంగతనం కేసులో వీరశేఖర్ను పిలిపించి విచారించామని, అతడిని కొట్టలేదని ఎస్సై లింగం చెప్పాడు. వీరశేఖర్కు చికిత్స చేయిస్తానంటూ సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే గ్రామస్తులు ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు వెళ్తుండగా, బాధితుడికి మెరుగైన చికిత్స అందించడంతో పాటు ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని సూర్యాపేట రూరల్ సీఐ విఠల్రెడ్డి సర్దిచెప్పడంతో వారు శాంతించారు. మూత్రం తాగించి.. నవ్వుకున్నారు: గుగులోతు వీరశేఖర్, బాధితుడు మిర్చి తోటకు నీళ్లు పెట్టేందుకు వెళ్లా.. కానిస్టేబుళ్లు వచ్చి తీసుకుపోయారు. ఎస్సై లింగంతో పాటు మరో ఇద్దరు కానిస్టేబుళ్లు నన్ను చితకబాదారు. ఆ సమయంలో నా పాయింట్లో మూత్రం పడగా.. ఆ మూత్రాన్ని తాగాలని ఎస్సై, కానిస్టేబుళ్లు కాళ్లతో తన్నుతూ చెప్పారు. మూత్రం తాగిస్తూ ఎస్సై, కానిస్టేబుళ్లు నవ్వుకున్నారు. చేయని దొంగతనాన్ని ఒప్పుకొంటే.. వారం పాటు జైలులో ఉండి వెంటనే ఇంటికి వెళ్లిపోవచ్చని కొడుతూ చెప్పారు. బతిమిలాడినా పంపలేదు: వీరన్న, బాధితుడి సోదరుడు ‘నేను, తమ్ముడు కలసి మిర్చి తోటకు నీళ్లు కడుతున్నం. ముగ్గురు కానిస్టేబుళ్లు వచ్చి మా వాడిని తీసుకెళ్లారు. స్థానిక ఎంపీటీసీ సభ్యుడితో కలసి నేను, మా బావ పోలీసు స్టేషన్కు వెళ్లి పోలీసులను బతిమిలాడినా మా తమ్ముడిని ఇంటికి పంపియ్యలేదు. అర్ధరాత్రి 12 గంటలకు ఫోన్ చేసి మా తమ్ముడిని తీసుకుపొమ్మని చెప్పారు. మేం వెళ్లే సరికి మా తమ్ముడు స్పృహలో లేడు. నా గుండె పగిలింది: గుగులోతు కీరా, బాధితుడి తల్లి ఎలాంటి తప్పు చేయని నా కొడుకును పోలీసులు చంపేందుకు యత్నించడం బాధగా ఉంది. వీరశేఖర్ను కొట్టి గాయపరచడమే కాకుండా మూత్రం తాగించారని చెప్పగానే నా గుండె పగిలిపోయింది. కనికరం లేని పోలీసుల నుంచి నా కొడుకును కాపాడాలి. నా కొడుకును కొట్టిన పోలీసులను వదిలిపెట్టొద్దు. ఉన్నతాధికారులకు నివేదిస్తాం: ఎస్.మోహన్కుమార్, డీఎస్పీ, సూర్యాపేట గిరిజన యువకుడు గుగులోతు వీరశేఖర్ను ఆత్మకూర్.ఎస్ పోలీస్స్టేషన్లో హింసించారన్న ఘటనపై లోతుగా విచారణ చేస్తున్నాం. ఒకటి రెండు రోజుల్లో పూర్తి స్థాయి నివేదికను జిల్లా ఎస్పీకి అందజేస్తాం. -
ఈసారి థియేటర్లలో సూర్య కొత్త సినిమా విడుదల
-
జైభీమ్: నాటి పోరాటం గుర్తొచ్చింది!
‘జైభీమ్’ సినిమా చూశాను... నిత్యం జరిగే దుర్మార్గాలలో ఒక అంశాన్ని చాలా బలంగా అందరి కండ్లకు కట్టినట్టు చూపించిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. సినిమా చూసినట్టు నాకు కనబడలేదు. అశ్లీలత, ఫైటింగ్లు లేవు. యువ లాయర్ల బాధ్యతను, సందేశాత్మక సంకేతాలను ‘జై భీమ్’ సినిమా సమాజానికి పంపింది. సినిమాలో సినతల్లి పెట్టిన కేసును ఉపసంహరించు కోవాలన్న పోలీసు బాస్... నీ భర్త ఎటు రాడు... కనీసం పరిహారం తీసుకొని కోర్టు కేసు వెనక్కు తీసుకో అన్న సందర్భంలో సినతల్లి ఇచ్చిన సమాధానం వ్యవస్థలకు చెంపపెట్టులా ఉంటుంది. నేను చిత్తూరు జిల్లా సీపీఐ కార్యదర్శిగా ఉన్నప్పుడు 37 ఏళ్ల క్రితం తిరుపతిలో జరిగిన ఒక వాస్తవ సంఘటన గుర్తుకు వచ్చింది. నగరంలో కోతిని ఆడించుకొంటూ పొట్టపోసుకునే లక్ష్మి అనే మహిళ ఇల్లులేక ప్లాట్ఫారంపై పడుకునే అభాగ్యురాలు. ఒక రోజు రాత్రి బీట్ కానిస్టేబుల్స్ తమ లాఠీలతో దబాయించుకుంటూ వస్తున్నారు. బిక్షగాళ్ళంతా భయపడి పరుగెత్తారు. లక్ష్మి పరుగెత్తుతుండగా పోలీసులు కాలితో తన్నడంతో ఆమె తల పక్కనే ఉన్న రాయికి బలంగా తాకి అక్కడికక్కడే మృతి చెందింది. ఆ మృతదేహం పక్కన ఆమెకు జీవితం అయిన కోతి మాత్రమే ఉండిపోయింది. విషయం తెలియగానే మేమంతా ఘటనా స్థలానికి చేరుకున్నాం. తెల్లవారు జామున మృతదేహాన్ని తోపుడుబండిపై పడుకోబెట్టి నిరసన ప్రదర్శన ప్రారంభించాం. నిరసన 25 మందితోనే మొదలైనా, క్రమంగా వందలమంది జతకలిశారు. లక్ష్మికి జరిగిన అన్యాయాన్ని ఖండిస్తూ మరునాడు బంద్కు పిలుపునిచ్చాము. మేము బంద్ పిలుపు ఇచ్చిన రోజునే నాటి సీఎం ఎన్టీఆర్ తిరుమల పర్యటన ఉంది. ముందురోజు నడి రాత్రి కొందరు పోలీ సులు వచ్చి నన్ను తిరుపతి ఎస్పీ క్యాంప్ కార్యాలయానికి తీసుకెళ్ళారు. అక్కడ ఆనాటి కలెక్టర్ సుబ్బారావు, ఎస్పీ ఆల్ఫ్రెడ్ నాతో మాట్లాడుతూ రేపటిబంద్ పిలుపును ఉపసంహరించుకోండి నగరంలో సీఎం పర్యటన ఉందన్నారు. నిర్ద్వంద్వంగా తిరస్కరించాను. (చదవండి: వారి నిర్బంధంలో న్యాయముందా?) ఆ సమయంలో అధికారులు ఇద్దరూ నాతో.... చనిపోయిన లక్ష్మిది ఈ ప్రాంతం కాదు, ఆమె కోసం మీరు పోరాటం చేస్తే మీకూ, మీపార్టీకి వచ్చే లాభం ఏమిటి, మీపై కేసులు పడటం తప్ప అని వ్యాఖ్యానించారు. ‘మా ఉద్యమం వలన సామాన్యులు కూడా చైతన్యంతో, ధైర్యంగా నివసించగలరు. అధికారులు బాధ్యతగా ప్రవర్తించేందుకు ఈ ఉద్యమం అవసరం’ అనేశాను. మరునాడు బంద్ జరిగింది. మాపై కేసులు కూడా పడ్డాయి. చిత్తూరు సబ్ జైలులో వారంపాటు నిర్బంధించారు.. కానీ మా ఉద్యమ సందేశం ఆనాడు నగరంలో హాకర్స్, రిక్షా తదితర అసంఘటిత కార్మిక సంఘాలు బలపడటానికి ఊతం ఇచ్చింది. ‘జై భీమ్’ సినిమా చూస్తుంటే 37 ఏళ్ల క్రితం పోలీసుల అకృత్యాలకు బలైన లక్ష్మి, నాటి పోరాటం సినిమా రీళ్లలాగా నాకళ్ల ముందు కదులుతున్నాయి. (చదవండి: ఓట్ల డబ్బు పంపిణీలో సమానత్వం) - డాక్టర్ కె. నారాయణ వ్యాసకర్త సీపీఐ జాతీయ కార్యదర్శి -
జై భీమ్: రాసాకన్ను సతీమణికి ఇల్లు కట్టిస్తా: రాఘవ లారెన్స్
తమిళ సినిమా : రాసాకన్ను సతీమణి పార్వతికి ఇల్లు కట్టిస్తానని నృత్య దర్శకుడు రాఘవ లారెన్స్ తెలిపారు. కొండ ప్రాంతానికి చెందిన ఈ దంపతుల యదార్థ ఘటనల ఆధారంగా చేసుకుని నిర్మించిన చిత్రం జై భీమ్. ఇటీవల ఓటీటీలో విడుదలై ప్రశంసలు అందుకుంటోంది. రాసాకన్ను భార్య పార్వతి ఉండడానికి సరైన ఇల్లు కూడా లేక కడు పేదరికాన్ని అనుభవిస్తోంది. చేయని నేరానికి రాసాకన్ను హత్యకు గురికావడం.. ఆయన సతీమణి పార్వతి దీన పరిస్థితి గురించి సామాజిక మాధ్యమాల్లో తెలుసుకున్న రాఘవ లారెన్స్ చలించిపోయారు. ఆమెకు తన సొంత డబ్బుతో ఇల్లు కట్టిస్తానని సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 28 ఏళ్ల క్రితం జరిగిన ఘోరమైన సంఘటనలను ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చించుకునేలా చేసిన జై భీమ్ చిత్ర యూనిట్కు, ఆ చిత్రాన్ని సంచలనంగా మార్చిన నటుడు సూర్య, జ్యోతిక, దర్శకుడు టీజే.జ్ఞానవేల్కు హృదయపూర్వక అభినందనలు అని పేర్కొన్నారు. -
‘జై భీమ్’ సినిమా సీన్ను రీపిట్ చేసిన తమిళనాడు యువతి..!
దేశంలోని చాలా అట్టడుగు వర్గాల గిరిజనుల నుంచి ఆడపిల్లలు ‘నీట్’ రాసి క్వాలిఫై కావడం గురించి విన్నామా? కాని తమిళనాడులో సంగవి చరిత్ర సృష్టించింది. కేవలం 10 వేల మంది ఉండే గిరిజన తెగ ‘మలసార్’ నుంచి మొదటిసారిగా నీట్ రాసి 202 మార్కులు తెచ్చుకుంది. ఆమె రేపో మాపో డాక్టర్ కోర్సులో చేరనుంది. అది ఒక్కటే కాదు... ఆమె తన ‘ఎస్.టి సర్టిఫికెట్’ కోసం ప్రభుత్వం కదిలే స్థాయిలో పోరాడింది. ఆమె చదువు గురించిన పట్టుదల ఇప్పుడు మొత్తం ఆ తెగకు మేలు చేసేలా కదలిక తీసుకువచ్చింది. ఆఫ్రికాను ఒకప్పుడు చీకటి ఖండం అనేవారుగాని మన దేశంలో నేటికీ అలాంటి చీకటి ఖండాల వంటి ప్రాంతాలు ఉన్నాయి. ఉదాహరణకు కోయంబత్తూరుకు ఆనుకునే ఉన్న ఎం.నంజప్పనూర్ గురించి ఎవరికీ ఏమీ తెలియదు. ప్రభుత్వానికి తెలియదు. నగర వాసులకూ తెలియదు. ఎందుకంటే అక్కడ తరాలుగా జీవిస్తున్నది మలసార్ అనే తెగకు చెందిన గిరిజనులు కాబట్టి. కేరళ, తమిళనాడులో మాత్రమే కనిపించే ఈ తెగ మొత్తం కలిపి 10 వేల మంది ఉండరు. వీళ్లది లిపి లేని భాష. నాలుగు ఆకులు, ప్లాస్టిక్ పట్టలు కట్టి పైకప్పుగా వేసుకుని జీవించే వీరి గురించి ప్రభుత్వం ఇప్పుడు తెలుసుకోవాల్సి వచ్చింది. అందుకు కారణం ఆ తెగలో ఇంటర్ పాసైన సంగవి అనే అమ్మాయి. ‘నీట్ – 2021’లో ఆ అమ్మాయి 202 మార్కులు సంపాదించింది. ఎస్.టి కేటగిరిలో అర్హత మార్కులు 108– 121 కాగా వాటిని దాటి 202 మార్కులు తెచ్చుకోవడం విశేషమే. ఇలా మలసార్ తెగ నుంచి ఈ ఎగ్జామ్ రాసి ఈ స్థాయిలో క్వాలిఫై అయిన మొదటి అమ్మాయి సంగవే. అందుకే ఇప్పుడు తమిళనాడు గిరిజన శాఖ మంత్రితో మొదలు అధికారులు ఆమెను కలిసి అభినందిస్తున్నారు. సర్టిఫికెట్ కోసం పోరాటం ఇప్పుడు ఓ.టి.టిలో ప్లే అవుతున్న ‘జైభీమ్’ సినిమాలో ఒక సీన్ ఉంటుంది. అందులో పాములు పట్టుకుని బతికే గిరిజన తెగ వాసులు తమకు ఎస్.టి సర్టిఫికెట్ ఇమ్మని, చదువుకుంటామని అధికారి దగ్గరకు వస్తారు. దానికి అధికారి ‘మీరు ఎక్కడ ఉంటారు.. మీ అమ్మా నాన్నలకు అలాంటి సర్టిఫికెట్ ఉందా... మీ కులం పేరుతో మీకు పట్టాలు ఉన్నాయా.. రేషన్ కార్డులు ఉన్నాయా.. అవి లేకుండా కుల ధృవీకరణ సర్టిఫికెట్ ఇవ్వము’ అంటాడు. ఇప్పుడు సంగవి గురించి అధికారులు అదే అన్నారు. టెన్త్ వరకూ ఏ కుల సర్టిఫికెట్ లేకుండానే చదువుకున్న సంగవి ఇంటర్ కూడా అలాగే చదివి 2018లో నీట్ రాసి క్వాలిఫై కాలేదు. దాంతో పాలిటెక్నిక్లో చేరింది. ఎస్టి కోటాలో సీట్ ఇచ్చి సర్టిఫికెట్ ప్రొడ్యూస్ చేయడానికి 10 రోజులు టైమ్ ఇచ్చారు సంగవికి. 10 రోజుల్లో ఆ సర్టిఫికెట్ను ఇవ్వడానికి అధికారులు అంగీకరించకపోవడంతో సంగవి చదువు మానేయాల్సి వచ్చింది. ఆ తర్వాత దాదాపు సంవత్సరం పాటు సంగవి తన కేస్ట్ సర్టిఫికెట్ కోసం పోరాటం చేసింది. చివరకు 2020 కరోనా సమయంలో కొందరు ఎన్జివో కార్యకర్తలు వారి బస్తీకి వెళ్లినప్పుడు సంగవి గురించి విని ఆమె పోరాటాన్ని పత్రికలకు తెలియచేశారు. దాంతో ఏకంగా మంత్రే ఆమెను కలిసి సర్టిఫికెట్ అందజేశాడు. ఆ తర్వాత ఆమెకు నీట్ రాయాలని ఉందని తెలుసుకున్న ఆ ఎన్జివో కార్యకర్తలు కోచింగ్ ఏర్పాటు చేశారు. దాని ఫలితమే ఇప్పుడు ఈ మార్కులు. తండ్రి కోరిక మలసార్ తెగలో తరతరాలుగా ఎవరూ చదువుకోలేదు. పది వరకు చదవడం గొప్ప. కాని సంగవి తండ్రి మునియప్ప ‘నువ్వు డాక్టర్వి కావాలమ్మా’ అని అనేవాడు. సంగవి ఇంటర్ చదువు ముగిశాక గత సంవత్సరం అతడు మరణించాడు. తల్లి వసంతమణికి చూపు సరిగా కనిపించదు. వాళ్లు ఉంటున్న ఇల్లు వానకు ఏ మాత్రం పనికి రాదు. అలాంటి ఇంట్లో ఉంటూ తండ్రి కోరిక మేరకు డాక్టర్ కావాలని పంతం పట్టింది సంగవి. ‘నా కోరిక విని నన్ను కోచింగ్లో చేర్చారు ఎన్జివో వాళ్లు. కోచింగ్ సెంటర్ వాళ్లు మెటీరియల్ ఇస్తే నేను దానిని ప్లాస్టిక్ కవర్లలో దాచి కాపాడుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే వాన పడితే నా పుస్తకాలు తడిచిపోవడం ఆనవాయితీ’ అంది సంగవి. ఎస్టి సర్టిఫికెట్ కోసం సంగవి చేసిన పోరాటం వల్ల తమిళనాడులోని సంచార గిరిజనులకు ఒకటి రెండు రోజుల్లోనే సర్టిఫికెట్లు ఇచ్చేలా అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. ఇప్పుడు సంగవికి మార్కులు రావడం వల్ల వారి పేటను సందర్శిస్తున్న అధికారులు ఆ పేటకు ఇళ్ల పట్టాలు ఇస్తామని రోడ్లు వేస్తామని హామీ ఇచ్చి వెళుతున్నారు. తీరని కష్టాలు నీట్లో సంగవికి వచ్చిన మార్కులకు ఎస్.టి కోటా వల్ల కాని తమిళనాడు ప్రభుత్వం ఆయా వర్గాలకు కేటాయించిన ప్రత్యేక రిజర్వేషన్ల వల్లగాని తప్పక సీట్ వస్తుందని భావిస్తున్నారు. ‘అయితే ఆ చదువు నేను చదవాలి. దానికి కొంత ఖర్చు అవుతుంది కదా. స్టాలిన్ సార్ నన్ను ఆదుకుంటారని భావిస్తున్నా’ అని సంగవి అంది. చదువు ఇంకా అందని వర్గాలు చదువే గెలుపు అని తెలుసుకున్నారు. ముఖ్యంగా అమ్మాయిలు ఈ విషయం గ్రహించారు. వారి చదువే వారిని గెలిపిస్తుంది. అలాంటి చదువు వల్లే అట్టడుగు వర్గాలు తప్పక వికాసంలోకి వస్తాయి. ‘మావాళ్లంతా ఇప్పుడు నన్ను చూసి చదువుకోవాలనుకుంటున్నారు’ అంటున్న సంగవి మాట ఆ ఆశనే కల్పిస్తోంది. -
సినిమా చూడాల్సిన సమాజం
‘సామాజిక సందేశం ఇవ్వాలనుకుంటే ఆ ముక్క టెలిగ్రామ్ ఇచ్చి చెప్పు. అంతే తప్ప లక్షలు ఖర్చు పెట్టి సినిమా తీయకు’...ఈ జోక్ లాంటి సూక్తిని తెలుగు పరిశ్రమ కొన్ని దశాబ్దాలుగా ప్రచారంలో పెట్టి ఉంది. సినిమా వినోద ప్రధాన మాధ్యమం అని, భారీ పెట్టుబడితో ముడిపడిన అంశమని, కనుక ఫార్ములా ప్రకారం తీయాలని తెలుగు సినిమా పండితులు సిద్ధాంతాలను చెప్పడమూ, ఉదాహరణలు చూపడమూ కద్దు. కాని ఏ కళ అయినా విజయవంతం అవడం వల్ల ఆర్థికంగా లాభం, సంఘపరమైన కీర్తి సంపాదించవచ్చు గాని అది నిజమైన గౌరవం పొందాలంటే సామాజిక సందర్భాలకు తగినట్టుగా స్పందించాల్సి ఉంటుంది. సమాజ గతిని పట్టించుకోవాల్సి ఉంటుంది. బాధిత దొంతరలకు అండగా నిలవాల్సి ఉంటుంది. తెలుగు సినిమా నడక మొదలెట్టినప్పుడు ఈ మాధ్యమానికి సామాజిక బాధ్యత ఉందనుకున్న పెద్దలు ఉన్నారు. దాని నుంచి ఏదో ఒక మేర మార్పు సాధించాలని ఆశించినవారు ఉన్నారు. ‘వందేమాతరం’, ‘మాలపిల్ల’, ‘పెద్ద మనుషులు’, ‘కన్యాశుల్కం’... వంటి సినిమాలు అటువంటి భావనలతోనే నిర్మించబడ్డాయి. అయితే ఈ కళ కొత్తది. ప్రేక్షకులకు ఈ కళలో ప్రవేశమూ కొత్తది. వారికి వినోదం ఇస్తూనే వారి అభిరుచి స్థాయిని పెంచుకుంటూ వెళ్లడంలో తెలుగు సినిమా తగిన సహనం చూపించ లేదు. నాగిరెడ్డి–చక్రపాణి తమ తొలి సినిమా ‘షావుకారు’ను ఆదర్శనీయమైన కథతో తీసి, వచ్చిన ఫలితాలకు నిరాశ చెందారు. ఆ వెంటనే వారు ‘పాతాళభైరవి’ తీశారు. అది ఘన విజయం సాధించడంతో ఆ తర్వాత వారి సినిమాలన్నీ ఫక్తు వినోదానికి పరిమితమయ్యాయి. మరోవైపు ఎన్.టి.రామారావు ‘తోడు దొంగలు’ తీసి చేయి కాల్చుకుని వెంటనే కత్తి పట్టుకుని ‘జయసింహ’ అన్నారు. అక్కినేని, ఆదుర్తితో కలిసి ‘సుడి గుండాలు’, ‘మరో ప్రపంచం’ ప్రయోగాలు చేసి ఆశాభంగం చెందారు. ఇవన్నీ మంచి సినిమాలు అయినా ప్రేక్షకుడి సన్నద్ధ లోపమూ లేదా వాటిని చెప్పిన పద్ధతిలో ఆకర్షణ లేకపోవడమూ సరైన ఫలితాలు రాకపోవడానికి కారణం. దురదృష్టవశాత్తు ఇవన్నీ తర్వాతి కాలంలో ‘మంచి సినిమా’ తీయడానికి ‘చెడు ఉదాహరణ’లుగా నిలిచాయి. పేద, దిగువ మధ్యతరగతి అంచెలతో నిండిన నాటి తెలుగు సమాజంలో సగటు ప్రేక్షకుడు తన కష్టాలు మర్చిపోవడానికి సినిమాకు వచ్చిన మాట వాస్తవమే అయినా అతడి గుండెకు తాకే విధంగా గట్టి అంశాలు చెప్పినప్పుడు ఏనాడూ బాక్సాఫీసును నిరాశ పర్చలేదు. అక్కినేని ‘రోజులు మారాయి’ నుంచి శారద ‘మనుషులు మారాలి’ వరకు అటువంటి కథలను సూపర్హిట్ చేశారు. కె.బి.తిలక్ ‘ఎం.ఎల్.ఏ’... ఈరంకి శర్మ ‘నాలాగ ఎందరో’ వంటి సినిమాలు తీయడానికి ఈ ప్రేక్షకులు ఉన్నారన్నదే ధైర్యం. ఆ తర్వాత దాసరి రంగ ప్రవేశం చేసి ‘తాత–మనవడు’తో సోషల్ మెసేజ్ను డ్రామాతో పండించవచ్చని నిరూపించారు. కె.విశ్వనాథ్ ‘శంకరాభరణం’, ‘సప్తపది’ తీసి కళకు, ఆలోచనకు తెలుగు ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారని ఖరారు చేశారు. అయితే అదే సమయంలో కె.రాఘవేంద్రరావు దర్శకేంద్రుడిగా మారి ఫార్ములా సినిమాను కొనసాగిస్తూ దాని వల్ల వచ్చే స్టార్డమ్ను హీరోలకు చూపుతూ ఆ ఎరీనాకు కట్టి పడేశారు. అయితే ఎర్రదండు వచ్చింది. ధవళ సత్యం, వేజెళ్ల సత్యనారాయణ, మాదాల రంగారావు, టి.కృష్ణ, ముత్యాల సుబ్బయ్య, ఆర్.నారాయణమూర్తి... వీరంతా సగటు ప్రేక్షకుడి భాషలో సమాజంలోని దోపిడీని చర్చించారు. బి.నరసింగరావు ఇదే పని సటిల్గా చేశారు. ఇన్ని జరిగినా ఇంత ప్రయాస జరుగుతున్నా అంతిమంగా తెలుగు సినిమా ప్రతి శుక్రవారం విడుదలయ్యే స్టార్ హీరోల కొత్త ఆటపాటలు, ఫైట్ల కొరకే ఉద్దేశించబడింది. బాక్సాఫీస్ కలెక్షన్లే దాని ఔన్నత్యానికి సూచి. దాని కథాంశానికి ఏ విలువా లేదు. అది రిలీజైన సమాజానికీ, దానికీ ఎటువంటి సంబంధమూ లేదు. ఉద్యమాల్లో పని చేసే వ్యక్తిని పోలీసులు మాయం చేస్తే ఆ వ్యక్తి ఏమయ్యాడని న్యాయవ్యవస్థను నిలదీస్తుంది ఒక స్త్రీ సి.ఉమామహేశ్వర రావు తీసిన 1992 నాటి ‘అంకురం’ సినిమాలో. ఇన్నేళ్ల తర్వాత తాజాగా విడుదలైన ‘జై భీమ్’ సినిమాలో తన భర్తను పోలీసులు ఏం చేశారని ఉన్నత న్యాయస్థానాన్ని నిలదీస్తుంది ఒక గిరిజన స్త్రీ. సూర్య వంటి స్టార్ ‘జై భీమ్’ వంటి సామాజిక చైతన్యం కలిగించే టైటిల్ పెట్టిన సినిమాను తీయడం, దొంగలుగా ముద్రపడిన సంచార జాతులపై 1995 కాలంలో తమిళనాడులో ఎలాంటి దాష్టీకాలు జరిగాయో ఈ సినిమా చూపడం, అలాంటి పరిస్థితులు దేశమంతా అక్కడక్కడా ఉండటం వల్ల ఈ సినిమా ఎన్నో ప్రశంసలను అందుకుంటోంది. సినిమా వ్యాపార కళే అయినా కమర్షియల్ సినిమా తప్పని సరే అయినా ఇతర భాషల సినిమాతో పోల్చినప్పుడు మన కెమెరా కన్ను ఈ సమాజ సమస్యలపై కూడా పడాలని ప్రేక్షకులు కోరుకోవడంలో తప్పులేదు. సమాజానికి ప్రతిస్పందనే కళ. ‘మీ కోసం మేమూ ఆలోచిస్తాము’ అని తెలుగు సినిమా చెప్పాల్సిన రోజు వచ్చేసింది. తెలుగు సినిమా స్వయంభువు కాదు. అది తెలుగు జాతి వ్యక్తిత్వం, చైతన్యం, కళాభిరుచి, వ్యక్తీకరణల ప్రతినిధి. ఇతర భాషల సినిమా ఎదుట తెలుగువారి సామాజిక ప్రతిస్పందనను చిన్నబుచ్చే హక్కు దానికి లేదు. కమర్షియల్ సినిమాతోపాటు అర్థవంతమైన సినిమా వెలుగులోకి అది కళ్లు తెరవాలని కోరుకుందాం. -
జైభీమ్ ‘సినతల్లి’ లిజోమోల్ జోసీ బ్యూటీఫుల్ ఫోటోలు
-
Jai Bhim :‘చెంప దెబ్బ’ సీన్ వివాదంపై స్పందించిన ప్రకాశ్ రాజ్
తమిళ స్టార్ సూర్య ప్రధాన పాత్రలో నటించిన తాజాగా చిత్రం ‘జైభీమ్’. ఇటీవల అమెజాన్ ప్రైమ్లో విడుదలైన ఈ చిత్రం.. విమర్శకుల ప్రశంసలు సొంతం చేసుకుంది. సినీ ఇండస్ట్రీకీ చెందిన సెలెబ్రిటీలందరూ ఈ సినిమాని మెచ్చుకుంటూ సోషల్ మీడియాలో తమ స్పందనను తెలుపుతున్నారు. మూడు దశాబ్దాల క్రితం పోలీసులు కొన్ని కులాలకి చెందిన నిరుపేద ప్రజలని ఎలా టార్గెట్ చేసి హింసించేవారనేది ఈ సినిమా ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించాడంటూ దర్శకుడు జ్ఞానవేల్పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఇదే సమయంలో ఈ సినిమాలో వచ్చిన ఓ చెంపదెబ్బ సీన్ వివాదంగా మారింది. (చదవండి: Jai Bhim: ఎవరీ జస్టిస్ చంద్రు? జై భీమ్ మూవీతో ఆయనకేం సంబంధం?) ఓ సీన్లో హిందీ మాట్లాడుతున్న వ్యక్తిని ప్రకాష్రాజ్ చెంపదెబ్బ కొడతాడు. విచారణలో భాగంగా పోలీసు అధికారిగా నటించిన ప్రకాశ్ రాజ్ అలా కొడతాడు. అయితే 'ఇది హిందీ భాషని అవమానించడమే' అంటూ కొందరు విమర్శిస్తున్నారు. తాజాగా ఈ వివాదంపై ప్రకాశ్ రాజ్స్పందించాడు. ‘జై భీమ్ సినిమాలో అణగారిన వర్గాల బాధని, వాళ్లు పడే కష్టాన్ని చూపించాం. కానీ కొంతమంది అసలు విషయాన్ని మరిచి.. చెంపదెబ్బ సన్నివేశంపైనే దృష్టి పెట్టారంటే వాళ్ల అజెండా ఏమిటో అర్థం చేసుకోవచ్చు’అని ప్రకాశ్ రాజ్ ట్విట్ చేశాడు. నేను నటించాననే కారణంతో ఈ సినిమాను వివాదంలోకి లాగుతున్నారు. ఇలాంటి వివాదాలపై స్పందించడం అర్థం లేదు’అని ఆయన తెలిపారు. -
జై బోలో భీమ్
-
Jai Bhim: ఎవరీ జస్టిస్ చంద్రు? జై భీమ్ మూవీతో ఆయనకేం సంబంధం?
Jai Bhim Chandru Real Life Story In Telugu: కొన్ని సినిమాలు డబ్బు కోసమే తీస్తారు. మరికొన్ని చిత్రాలు సమాజం మార్పు కోసం తీస్తారు. వీటికి డబ్బులు వస్తాయో రావో తెలియదు కానీ.. జనాలకు మాత్రం మంచి సందేశం అందుతుంది. అయితే ఇటీవల కాలంలో డబ్బుల కోసం తీసే చిత్రాలే ఎక్కువగా ఉంటున్నాయి. నాలుగు పాటలు, మూడు ఫైట్ సీన్స్ పెట్టి సినిమాను ముగిస్తున్నారు. ప్రేక్షకులు కూడా వాటినే ఎక్కువగా ఆదరిస్తున్నారు. అయినప్పటికీ.. తాను మాత్రం సందేశాత్మక చిత్రాలే తీస్తానంటున్నాడు తమిళ హీరో సూర్య. ఆయన ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘జై భీమ్’. ఇటీవల అమెజాన్ ప్రైమ్లో విడుదలైన ఈ చిత్రం.. విమర్శకుల ప్రశంసలు సొంతం చేసుకుంది. సినీ ఇండస్ట్రీకీ చెందిన సెలెబ్రిటీలందరూ ఈ సినిమాని మెచ్చుకుంటూ సోషల్ మీడియాలో తమ స్పందనను తెలుపుతున్నారు. చివరకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా ఈ చిత్రాన్ని చూసి హీరో సూర్యకు లేఖ కూడా రాశారు. (చదవండి: ‘జై భీమ్’ మూవీ రివ్యూ) ఇంతకీ జైభీమ్ కథేంటి? పోలీసులు అన్యాయంగా అరెస్టు చేసిన తన భర్తను విడిపించుకునేందుకు ఓ గిరిజన మహిళ చేసిన పోరాటమే ‘జై భీమ్’.మూడు దశాబ్దాల క్రితం పోలీసులు కొన్ని కులాలకి చెందిన నిరుపేద ప్రజలని ఎలా టార్గెట్ చేసి హింసించేవారనేది ఈ సినిమా ద్వారా కళ్లకుకట్టినట్లు చూపించాడు దర్శకుడు జ్ఞానవేల్. కులవివక్ష ఎప్పుడో వందలేళ్ల క్రితం ఉండేది తప్ప మేం పుట్టాక ఎప్పుడూ చూడలేదు అని చెప్పే కొందరు జనానికి ఇది కనువిప్పు కలిగించే చిత్రం.. ఇందులో సూర్య లాయర్ చంద్రుగా నటించాడు. ఇది రియల్ స్టోరి. జస్టిస్ చంద్రు నిజజీవిత కథే ‘జైభీమ్’. ఈ సినిమా చూశాక ప్రతి ఒక్కరు జస్టిస్ చంద్రు ఆరా తీయడం మొదలుపెట్టారు. ఆయన గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. (చదవండి: జై భీమ్లో సినతల్లిగా మెప్పించిన నటి ఎవరో తెలుసా!) ఎవరీ జస్టిస్ చంద్రు? జస్టిస్ చంద్రు...చెన్నై హైకోర్టులో చాలాకాలం జడ్జిగా పనిచేసి పదవీ విరమణ చేశారు. ఆ సమయంలో ఆయన ఇచ్చిన తీర్పు ఎంతో మంది నిరుపేదల జీవితాను మార్చివేశాయి. ముఖ్యంగా అనగారిన వర్గాల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం మరువలేనిది. మానవహక్కుల కోసం డబ్బులు తీసుకోకుండా వాదించి ఎంతో మంది పీడిత వర్గాలకు న్యాయం చేసిన గొప్ప వ్యక్తి ఆయన. 2009లో ఆయన చెన్నై హైకోర్టుకు న్యాయమూర్తిగా నియమితులైయ్యారు. సాధారణంగా ప్రతి న్యాయమూర్తి తన కెరీర్లో 10-20 వేల కేసులను మాత్రమే పరిశీలించి తీర్పులు ఇస్తారు. కానీ జస్టిస్ చంద్రు మాత్రం తన కెరీర్లో అత్యధికంగా 96 వేలకు పైగా తీర్పులు ఇచ్చి రికార్డు సృష్టించారు. ఆలయాల్లో మహిళా పూజారుల నియామకం, కులం, మతంతో సంబంధం లేకుండా సామూహిక శ్మశానాలు వంటివి ఆయన ఇచ్చిన తీర్పుల్లో కీలకమైనవి. హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నప్పటికీ.. హంగులు, ఆర్భాటాలకు మాత్రం దూరంగా ఉండేవాడు. తాను ప్రయాణించే కారుకు ఎర్రబుగ్గని తొలగించి నలుగురికి ఆదర్శంగా నిలిచారు. అలాగే వ్యక్తిగత భద్రతను కూడా వదులుకున్నారు. 2013లో ఆయన రిటైర్డ్ అయ్యారు. వాస్తవానికి ఎవరైనా న్యాయమూర్తి రిటైర్ అయితే ఆయనకు ఓ స్టార్ హోటల్లో విందును ఇచ్చి ఘనంగా వీడ్కోలు పలుకుతారు. కానీ జస్టిస్ చంద్రు మాత్రం కోర్టు అవరణలోనే విడ్కోలు చెప్పి, ప్రభుత్వం ఇచ్చిన కారును అక్కడే వదిలేసి లోకల్ ట్రైన్లో ఇంటికి వెళ్లారు. అంత సింపుల్సిటీ చంద్రు సొంతం. లాయర్గా, న్యాయమూర్తిగా తన జీవితంలో ఎదుర్కొన్న అనుభవాలతో ‘లిజన్ టు మై కేస్’ అనే పుస్తకాన్ని రచించారు జస్టిస్ చంద్రు. ఆ పుస్తకంలోని ఓ కథతోనే ప్రస్తుతం జై భీమ్ సినిమా తెరకెక్కింది. -
‘జై భీమ్’లో సినతల్లిగా కనిపించిన నటి ఎవరూ, ఆమె అసలు పేరేంటో తెలుసా!
తమిళ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో తమిళనాడు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ కె చంద్రు నిజజీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘జై భీమ్’. దీపావళి సందర్భంగా ఓటీటీ సంస్థ ఆమెజాన్ ప్రైంలో విడుదలైన ఈ మూవీ హిట్టాక్తో దూసుకుపోతోంది. ఓ కేసులో అరెస్టు అయిన తన భర్త కనిపించకపోవడంతో అతడిని కనిపెట్టేందుకు, అతడి మరణానికి కారణం తెలుసుకునేందుకు ఓ గర్భిణీ మహిళ చేసిన పోరాటమే ఈ సినిమా కథాంశం. చదవండి: మహేశ్ బాబుకు దీపావళి బహుమతులు పంపిన పవన్ దంపతులు ఇది తమిళనాడుకు చెందిన గిరిజన మహిళ నిజ జీవిత కథ కూడా. ఈ చిత్రంలో భర్త కోసం పోరాటం చేసిన గిరిజన మహిళ పాత్ర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ పాత్రలో కనిపించిన నటి ‘సినతల్లి’గా అందరి మన్ననలు అందుకుంది. దీంతో గిరిజన మహిళగా కనిపించిన ఆ నటి ఎవరా అందరూ సెర్చ్ చేయడం ప్రారంభించారు. ఇంతకి ఆమె ఎవరూ, తన అసలు పేరు ఏంటీ.. సినిమాల్లోకి ఎలా వచ్చిందో చూద్దాం. (చదవండి: Jai Bhim: ఎవరీ జస్టిస్ చంద్రు? జై భీమ్ మూవీతో ఆయనకేం సంబంధం?) జై భీమ్లో ‘సినతల్లి’గా లీడ్రోల్ పోషించిన ఈ మలయాళ నటి పేరు లిజోమోల్ జోస్. ఆమె కేరళకు చెందిన ఉన్నత మధ్య తరగతి కుటుంబంలో జన్మించింది. ఆమె సినిమాల్లోకి రాకముందు అమెరికన్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో డిగ్రీ చేసింది. ఆ తర్వాత కొన్నేళ్ల పాటు ఓ చానల్లో పని చేసింది. పాండిచ్చేరి యూనివర్శిటీ ఇన్ఫర్మేషన్ అండ్ లైబ్రరీ సైన్స్లో లిజో మాస్టర్స్ చదివింది. ఈ క్రమంలో తన స్నేహితురాలి సూచన మేరకు సినిమా ఆడిషన్స్కు ఫొటోలు పంపించింది. చదవండి: జై భీమ్ హిట్ టాక్: ఆ సీన్పై దుమారం ఆడిషన్స్లో మూడు రౌండ్ల అనంతరం ఫహద్ ఫాజిల్ నటించిన ‘మహాశింబే ప్రతీకారం’ మూవీతో తమిళ పరిశ్రమకు ఎన్నికైంది. ఈ మూవీతోనే లిజో వెండితెరకు పరిచమైంది. 2016లో వచ్చిన ‘రిత్విక్ రోషన్’ చిత్రంతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘హనీ బీ 2.5’ సినిమాతో మలయాళ స్టార్ నటిగా ఎదిగింది. ఈ నేపథ్యంలో ఇటీవల హీరో సిద్దార్థ్ నటించిన తమిళ చిత్రం ‘సివప్పు మంజల్ పచ్చాయ్’ (ఒరేయ్ బామ్మర్ది) మూవీతో హీరోయిన్గా నటించింది. ఇందులో సిద్ధార్థ్కు జోడిగా నటించి మంచి మార్కులు కొట్టేసింది. ఈ సినిమాల్లో ఆమె నటనను చూసి జ్ఞానవేల్ ‘జై భీమ్’లో అవకాశం ఇచ్చారు. ఈ సినిమా కోసం లీజో తనని తాను మేకోవర్ చేసుకని డీ గ్లామర్గా రోల్ నటించి విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. భర్త రాజన్న మరణానికి సంబంధించిన సీన్లు, పోలీసులు చిత్రహింసలు పెట్టే సీన్లలో లిజో అసలు గ్లీజరిన్ లేకుండా ఏడుపు సన్నివేశాలు చేసినట్లు ఇటీవల ఓ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లిజో చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే తన బంధువు, స్నేహితుడైన అరుణ్ అంటోనీని అక్టోబర్ 5న ఆమె క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకుంది. చదవండి: దీపావళి సర్ప్రైజ్: తనయులతో జూ. ఎన్టీఆర్, ఫొటో వైరల్ View this post on Instagram A post shared by Lijomol Jose (@lijomol) -
జై భీమ్ హిట్ టాక్: ఆ సీన్పై దుమారం
సాక్షి, హైదరాబాద్: అమాయకులపై కొందరు పోలీసులు, ముఖ్యంగా దొంగలుగా దళితులపై ముద్ర వేస్తూ పోలీసులు అక్రమ కేసులు, వేధింపుల నేపథ్యంలో తెరకెక్కిన జై భీమ్ ఓటీటీలో హిట్ టాక్తో దూసుకుపోతోంది. తమిళనాడులోని రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ కె చంద్రు నిజజీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీలో సూర్య చంద్రు పాత్రలో జీవించారు. అయితే విలక్షణ నటుడు ప్రకాష్రాజ్ ప్రత్యేక పాత్ర పోషించిన ఈ మూవీలోని ఒక సీన్పై వివాదం నడుస్తోంది. హిందీలో మాట్లాడే వ్యక్తిని ప్రకాశ్ రాజ్ 'చెంపదెబ్బ' సన్నివేశం చర్చకు దారి తీసింది. హిందీలో మాట్లాడినందుకే అలా అతగాడి చెంప చెళ్లుమనిపించాడని సోషల్మీడియాలో కొంతమంది విమర్శలకు దిగారు. అయితే నిర్దిష్ట పాత్ర (రైస్ మిల్లు యజమాని) జరిగిన నేరంలోని నిజాల్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఈ వ్యూహం తెలిసి హిందీలో మాట్లాడుతున్న ఆ పాత్రను అలా కొట్టాడు తప్ప, హిందీ మాట్లాడే ఇండియన్స్కు వ్యతిరేకంగా కాదు, తమిళ చిత్ర నిర్మాతలు హిందీ భాషకు వ్యతిరేకం కాదని కొంతమంది స్పందిస్తున్నారు. హిందీలో మాట్లాడినందుకు చెప్పుతో కొట్టడానికి దీనికి సంబంధం లేదని స్పష్టం చేస్తున్నారు. కాగా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ అద్భుతమైన నటనతో ప్రేక్షకుల్లో తమకంటూ ప్రత్యేకస్థానాన్ని ఏర్పరచుకున్నారు సూర్య, జ్యోతిక దంపతులు. నవంబరు 2, మంగళవారం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ విడుదలైన సంగతి తెలిసిందే. பணம் சம்பாதிக்க எல்லா மொழியிலும் படம் எடுப்பாணாம் இங்க இருக்குற குழந்தைகள் மட்டும் வேற மொழி படிக்க கூடாதாம் 😠#ஜெய்பீம் தமிழ் பதிப்பு ~என்னை ஏன் அடிக்கிறாய்? ~தமிழில் பேசுங்கள் #ஜெய்பீம் ஹிந்தி பதிப்பு ~என்னை ஏன் அறைந்தாய்? ~இப்போது உண்மையைச் சொல்.. #FraudsOfSurya pic.twitter.com/FXD2ve7dCW — Karthikeyan S 🚩🇮🇳ௐ🕉️🌷 (@karthikbjpkarur) November 2, 2021 He uses Hindi to obfuscate the truth about his involvement in a crime. He collaborates with Tamil criminals. This has nothing to do with being slapped for speaking in Hindi. https://t.co/vp5zPNAuGU — Udhav Naig (@udhavn) November 2, 2021 Hi, the scene is not against Hindi-speaking Indians. The particular character tries to get away by speaking in Hindi (so that Prakash Raj wouldn't understand) and knowing this strategy, he slaps and asks him to speak in Tamil.Tamil filmmakers are not against the language Hindi1/2 — Rajasekar (@sekartweets) November 2, 2021 -
‘జై భీమ్’ మూవీ చూసి కమల్ హాసన్ ఏమన్నారంటే..
సాక్షి, చెన్నై: జై భీమ్ చిత్రంలో సూర్య నటనకు పలువురు సినీ ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. జ్యోతిక, సూర్య తమ 2డీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రాన్ని టి.జె. జ్ఞానవేల్ తెరకెక్కించారు. పోలీసులు, రాజకీయ నాయకుల అరాచకాలకు గురవుతున్న కొండ జాతి ప్రజలకు అండగా నిలిచే న్యాయవాది పాత్రలో సూర్య నటించారు. ఈ చిత్రం మంగళవారం నుంచి అమెజాన్ ప్రైమ్ టైంలో స్ట్రీమింగ్ అవుతోంది. చిత్రం చూసిన ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ కొండజాతి ప్రజల జీవన విధానాన్ని, కష్టాలను కళ్లకు కట్టినట్టు ఆవిష్కరించారని కొనియాడారు. చదవండి: Jai Bhim Review: సూర్య ‘జై భీమ్’ మూవీ ఎలా ఉందంటే..? నిజాయితీపరులైన పోలీసులు, న్యాయవాదులు న్యాయాన్ని, ధర్మాన్ని గెలిపించగలరని జై భీమ్ చిత్రంలో చూపించారంటూ చిత్ర యూనిట్ను, ముఖ్యంగా నటుడు సూర్యను ప్రశంసించారు. అదే విధంగా నటుడు, మకల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల హాసన్ జై భీమ్ చిత్రాన్ని ప్రత్యేకంగా తిలకించారు. ఈ సినిమా చూసి తన కళ్లు చమర్చాయని ట్విట్టర్లో పోస్టు చేశారు. పళంగుడి ప్రజల కష్టాలను తెరపై ఆవిష్కరించిన దర్శకుడి తీరు ప్రశంసనీయం అన్నారు. సూర్య, జ్యోతికలను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు. -
జై భీమ్ మూవీ రివ్యూ
టైటిల్ : జై భీమ్ నటీనటులు : సూర్య, ప్రకాశ్ రాజ్, రావు రమేశ్, రాజిష విజయన్, లిజోమోల్ జోసీ, మణికంఠన్ తదితరులు నిర్మాతలు : సూర్య, జ్యోతిక దర్శకత్వం : టి.జె.జ్ణానవేల్ సంగీతం : షాన్ రొనాల్డ్ ఎడిటింగ్ : ఫిలోమిన్ రాజ్ సినిమాటోగ్రఫీ : ఎస్.ఆర్.కాదిర్ విడుదల తేది : నవంబర్ 02, 2021(అమెజాన్ ప్రెమ్ వీడియో సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా ప్రయోగాలకే పెద్ద పీట వేస్తుంటాడు తమిళ స్టార్ హీరో సూర్య. విభిన్నమైన కథలతో తెరకేక్కే సినిమాలలో నటించడానికి ఆసక్తి చూపుతాడు. కొత్త కొత్త గెటప్ లలో దర్శనం ఇస్తూ సినీ ప్రియులను ఆశ్చర్యానికి గురి చేస్తాడు. సూర్య కెరీర్లో అత్యధిక విజయాలు ప్రయోగాల ద్వారా వచ్చినవే. తాజాగా ఈ స్టార్ హీరో చేసిన మరో ప్రయోగమే ‘జై భీమ్’.కోర్టు రూమ్ డ్రామాగా రూపొందించిన ఈ సినిమా నవంబర్ 2న అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదలైంది. దళితులపై అగ్ర కులాల ఆకృత్యాల నేపధ్యంలో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం. (Jai Bhim: దుమారం రేపుతున్న ‘చెంపదెబ్బ’ సీన్) కథేటంటే.. రాజన్న(మణికందన్), సినతల్లి(లిజోమోల్ జోస్) దళిత దంపతులు. పాములు పట్టుకుంటూ జీవనం సాగిస్తారు. ఒక రోజు ఆ ఊరి ప్రెసిడెంట్ ఇంట్లోకి పాము రావడంతో దాన్ని పట్టుకునేందుకు రాజన్న వెళ్తాడు. ఆ తర్వాత ప్రెసిడెంట్ ఇంట్లో దొంగతనం జరుగుతుంది. ఈ కేసులో రాజన్నను అరెస్ట్ చేస్తారు పోలీసులు. పాములు పట్టే క్రమంలో అన్ని గమనించే రాజన్న ఈ చోరీకి పాల్పడ్డాడని కేసు ఫైల్ చేస్తారు. నేరం ఒప్పుకోమని రాజన్నతో పాటు అతని కుటుంబ సభ్యులను సైతం వేధిస్తారు. అయితే చేయని తప్పుని ఒప్పుకోనని మొండికేస్తాడు రాజన్. కట్ చేస్తే.. జైలు నుంచి రాజన్న తప్పించుకుపోయాడని భార్య సినతల్లికి చెబుతారు పోలీసులు. దీంతో తన భర్త ఏమయ్యాడో తెలియక ఆమె బాధపడుతుంటుంది. తన భర్త ఆచూకి కోసం లాయర్ చంద్రు(సూర్య)ను కలుస్తుంది సినతల్లి. ఆమె దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఈ కేసును టేకాప్ చేస్తాడు చంద్రు. ఈ క్రమంలో చంద్రుకు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? రాజన్న కోసం చంద్రు వేసిన పిటిషన్ కారణంగా ఎలాంటి నిజాలు బయటకు వచ్చాయి?ఇంతకీ రాజన్న ఏమయ్యాడు? అనేదే ‘జైభీమ్’కథ ఎవరెలా చేశారంటే..? లాయర్ చంద్రు పాత్రలో సూర్య ఎప్పటి మాదిరే అద్భుతంగా నటించాడు. కోర్టు సీన్స్లో ఆయన పలికించిన హావభావాలు మనసును తాకుతాయి. ‘ఆకాశం నీ హద్దురా’లాంటి అద్భుతమైన చిత్రం తర్వాత.. అదే స్థాయి డెప్త్ ఉన్న రోల్ తనది. చంద్రు పాత్రలో సూర్య తప్ప మరొకరని ఊహించుకోలేం. ఇక గిరిజన దంపతులుగా మణికందన్, లిజో మోల్ జోసేలు అద్భుత నటనను కనబరిచారు. ముఖ్యంగా సినతల్లిగా నటించిన లిజోమోల్ జోస్ గురించి చెప్పాలి. సమాజంలోని దాష్టీకాన్ని ఎదిరించే దళిత మహిళగా ఆమె నటన అభినందనీయం. డీజీపీ దగ్గర ఆమె చెప్పే డైలాగ్స్ అద్భుతంగా ఉంటాయి. సిన్సియర్ పోలీస్ గా ప్రకాష్ రాజ్, పంతులమ్మగా రజిషా విజయన్, రావు రమేశ్ తమదైన నటనతో మెప్పించారు. జై భీమ్ ఎలా ఉందంటే..? పోలీసులు అన్యాయంగా అరెస్టు చేసిన తన భర్తను విడిపించుకునేందుకు ఓ గిరిజన మహిళ చేసిన పోరాటమే ‘జై భీమ్’. తమిళనాడులోని కడలూరులో జరిగిన ఓ నిజ ఘటనను ఆధారంగా చేసుకుని ఈ మూవీని రూపొందించాడు దర్శకుడు జ్ణానవేల్. ఇటీవల తెలుగులో వచ్చిన వకీల్ సాబ్, నాంది, తిమ్మరుసు సినిమాల మాదిరే ‘జైభీమ్’ కూడా కోర్టు రూమ్ డ్రామాగా తెరకెక్కింది. ఓ అమాయకుడు చేయని తప్పుకు జైలుపాలవ్వడం.. ఆ కేసును హీరో టేకప్ చేసి, ప్రత్యర్థుల ఎత్తుగడలను తిప్పికొడుతూ.. చివరకు న్యాయం జరిపించడం. దాదాపు కోర్టు డ్రామా నేపథ్యంలో వచ్చే సినిమాలన్ని ఇలానే సాగుతాయి. దర్శకుడు జ్ఞాన్వేల్ అలాంటి పాయింట్నే ఎంచుకుని ఉత్కంఠ భరితంగా ‘జై భీమ్’ను తెరకెక్కించాడు. తాను ఎంచుకున్న పాయింట్ని తెరపై చూపించడంలో వందశాతం సఫలమయ్యాడు. అమాయకులపై కొందరు పోలీసులు అక్రమ కేసులు పెట్టి, వారు నేరం ఒప్పుకునేందుకు ఎలాంటి చర్యలకు పాల్పడతారనే విషయాలను కళ్లకు కట్టినట్లుగా చూపించాడు. లాయర్ చంద్రుగా సూర్య ఎంట్రీ అయినప్పటి సినిమాపై ఆసక్తి పెరుగుతంది. అరెస్ట్ అయిన రాజన్న జైలులో కనిపించకపోవడం, అతను ఏమయ్యాడే విషయాన్ని చివరి వరకు చెప్పకపోవడంతో సినిమాపై ఉత్కంఠ పెరుతుంది. పోలీసులు అతడిని ఏం చేశారు? అసలు బతికే ఉన్నాడా? అన్న ప్రశ్నలు ప్రేక్షకుడి మదిలో మొదలవుతాయి. చివరకు అసలు విషయం తెలిసి భావోద్వేగానికి లోనవుతారు. ఇక క్లైమాక్స్ అయితే అదుర్స్ అనే చెప్పాలి. దర్శకుడు ఎంచుకున్న కథ పాతదే అయినా.. కట్టిపడేసేలా కథనాన్ని నడిపించాడు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. షాన్ రొనాల్డ్ సంగీతం చాలా బాగుంది. తనదైన బీజీఎంతో కొన్ని సీన్లకి ప్రాణం పోశాడు.ఎస్.ఆర్. కాదిర్ సినిమాటోగ్రఫీ బాగుంది. కోర్టు సన్నివేశాలను తెరపై అద్భుతంగా చూపించాడు. . ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి.