jobmela
-
నిరుద్యోగులకు వరం.. జాబ్మేళా
యాదగిరిగుట్ట (ఆలేరు) : నిరుద్యోగ సమస్యను అధిగమించే దిశగా ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు అడుగులు వేస్తున్నారు. ఉన్నత చదువులు చదువుకొని వ్యవసాయం, ఇతర పనులు చేస్తూ, ఇంట్లోనే ఖాళీగా గడుపుతున్న నిరుద్యోగుల కోసం ఉపాధి కల్పించే విధంగా ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే ఆయా జిల్లాలో వివిధ పరిశ్రమలతో జిల్లా స్థాయి ఉన్నతాధికారులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు చర్చలు జరిపి, నిరుద్యోగులకు ఆయా పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా కృషిచేస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ప్రభుత్వ విప్ గొంగిడి సునితామహేందర్రెడ్డి ఆలేరులో జాబ్మేళా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక తిప్పలుండవ్.. ఆలేరు, యాదగిరిగుట్ట, రాజపేట, మోటకొండూర్, తుర్కపల్లి, ఆత్మకూర్(ఎం), బొమ్మలరామారం మండలాల్లో ఉన్నత చదువులు అభ్యసించిన నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రతి రోజు హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్, సిద్దిపేట ప్రాంతాలకు వెళ్తుంటారు. ఆయా ప్రాంతాల్లో ఉద్యోగ వేట చేసి ఎలాంటి అవకాశాలు లేకపోవడంతో నిరుత్సాహంగా వెనుదిరుగుతున్నారు. దీంతో ఇంటి వద్దనే ఉంటూ వ్యవసాయం, ఉపాధి కూలీ, తదితర పనులు చేసుకుంటున్నారు. గమనించిన ప్రభుత్వ విప్ గొంగిడి సునితామహేందర్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం, హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి సహకారంతో డైరెక్టర్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ అధికారులతో కలిసి ఆలేరు నియోజకవర్గ కేంద్రంలో జాబ్మేళ నిర్వహించడానికి సిద్దమయ్యారు. ఈనెల 25న జాబ్ మేళా... నిరుద్యోగ యువతీ, యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 25వ తేదీన ఆలేరు పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఉదయం 9.30గంటల నుంచి మెగా జాబ్మేళా నిర్వహిస్తున్నారు. సుమారు 30 ప్రైవేట్ పరిశ్రమలతో అగ్రిమెంట్ చేసుకొని, 3వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చే విధంగా ఈ జాబ్మేళా చేపడుతున్నారు. ఈ మెగా జాబ్మేళాకు రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రారంభించనున్నారు. విద్యార్హత ఇదే.. 8, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్, ఎంబీఏ, పీజీ, నర్సింగ్, ఐటిఐ తదితర అర్హతలతో కూడిన నిరుద్యోగులు జాబ్మేళాలో పాల్గొనేందుకు అర్హులు. www. employment.telangana.gov.in వెబ్సైట్లో అభ్యర్థులు తమ వివరాలు నమోదు చేసుకోవాలి. జాబ్మేళాకు వచ్చే వారు 3 సెట్లు విద్యార్హత జిరాక్స్ పత్రులు, సర్టిఫికెట్లు తీసుకురావాలి. సద్వినియోగం చేసుకోవాలి ఈనెల25వ తేదీన ఆలేరు పట్టణంలో నిర్వహించే మెగా జాబ్మేళాను నిరుద్యోగ యువతీ, యువకులు సద్వినియోగం చేసుకోవాలి. నియోజకవర్గంలోని నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకొని 30 ప్రైవేట్ పరిశ్రమల యాజమాన్యాలతో మాట్లాడి, 3వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా అడుగులు వేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం, హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, డైరెక్టర్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ జాబ్మేళాకు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తున్నారు. -గొంగిడి సునితామహేందర్రెడ్డి, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే ఉద్యోగం సంపాదిస్తా ఈ జాబ్మేళాను సద్వినియోగం చేసుకొని, ఉద్యోగం సంపాదిస్తాను. అంతే కాకుండా ఇతర నిరుద్యోగులను సైతం ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా కృషి చేస్తాను. -శ్రీకాంత్, నిరుద్యోగి, యాదగిరిగుట్ట -
భళా..'రో జా'బ్ మేళా
పుట్టిన రోజూ పండగే అందరికీ.. మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికి..అన్నాడో సినీకవి..నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా బర్త్డే వేడుకలు జరుపుకున్న తీరును గమనించిన వారెవరికైనా ఈ పాట ఇట్టే స్ఫురిస్తుంది. తన నియోజకవర్గంలో నిరుద్యోగ యువత ఉపాధి కల్పనకోసం శుక్రవారం జన్మదినం సందర్భంగా జాబ్ మేళా నిర్వహించి శెభాష్ అనిపించుకున్నారీమె.. జాబ్మేళాకు తరలివస్తున్న యువతను ఈ చిత్రంలో రోజా వెంట చూడవచ్చు. పుత్తూరు: ఎమ్మెల్యే రోజా జన్మదిన వేడుకలు.. ఎస్ఆర్ఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్మేళాకు హాజరైన నిరుద్యోగులతో శుక్రవారం పుత్తూరు కిక్కిరిసిపోయింది. ఉదయం స్థానిక డిగ్రీ కళాశాలలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్రెడ్డి ఎమ్మెల్యే రోజాకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పుష్పగుచ్ఛం అందించారు. కేక్ కట్ చేసి ఆమె జన్మదిన వేడుకలను ప్రారంభించారు. రోజా మాట్లాడుతూ ఇటీవల వైఎస్సార్ కుటుంబంలో పర్యటిస్తుంటే ప్రతి గ్రామం నుంచి నిరుద్యోగులు గోడు వెళ్లబోసుకున్న వైనాన్ని ప్రస్తావించారు. జన్మదినోత్సవం రోజున ఇతర సామాజిక కార్యక్రమాలను నిర్వహించడం కంటే ఉద్యోగ అవకాశాలను కల్పించాలని నిర్ణయిం చుకున్నానన్నారు. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ తదితర పట్టణాల్లో కంపెనీల ప్రతినిధులను సంప్రదించి జాబ్మేళా నిర్వహణకు కసరత్తు చేసినట్లు వివరించారు. జాబ్మేళాకు హాజరై నిరుద్యోగుల నుంచి వివరాల నమోదు ప్రక్రియను ఆమె ప్రారంభిం చారు. నగరి రోడ్డులో కస్తూరి కల్యాణమండపంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకలకు ఆమె హాజరయ్యారు. గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు పార్లమెంట్ జిల్లా అ«ధ్యక్షుడు జంగాలపల్లి శ్రీనివాసులు, సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త కోనేటి ఆదిమూలం ఎమ్మెల్యే రోజా దంపతులను సన్మానించారు. -
ఖమ్మంలో మెగా జాబ్మేళా
ఖమ్మం: ఉపాధి, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ చేపడుతున్న మెగా జామ్మేళాను రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రారంభించారు. ఖమ్మంలో శనివారం నిర్వహిస్తున్న జాబ్మేళాకు వేల సంఖ్యలో అభ్యర్థులు తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి, కలెక్టర్ లోకేష్ కుమార్, ఎమ్మెల్యే పువ్వాడ అజయ్, ఎమ్మెల్సీ బాలసాని, కార్పొరేషన్ చైర్మన్లు పిడమర్తి తదితరులు పాల్గొన్నారు. -
రేపు జాబ్మేళా
అనంతపురం ఎడ్యుకేషన్ : బెంగళూరుకు చెందిన ఫెడరల్ ముఘల్ కంపెనీలో ట్రైనీ/ఆపరేటర్ల ఉద్యోగాలకు ఈనెల 7న జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎ. కళ్యాణి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఐటీఐ ఉత్తీర్ణులై 18–24 ఏళ్ల వయసులోపు అభ్యర్థులు అర్హులన్నారు. మొత్తం ఖాళీలు 100 ఉన్నాయన్నారు. ఉద్యోగానికి ఎంపికైన వారు బెంగళూరులోనే పని చేయాల్సి ఉంటుందన్నారు. వేతనం నెలకు రూ. 8500 నుంచి రూ.13000 దాకా ఉంటుందన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు బయోడేటా, విద్యార్హత సర్టిఫికెట్లతో ఈనెల7న ఉదయం 10.30 గంటలకు అనంతపురంలోని ఉపాధి కల్పనాధికారి కార్యాలయానికి చేరుకోవాలన్నారు. -
20న జాతీయ స్థాయి జాబ్మేళా
కల్లూరు : నగర శివారు దూపాడులోని డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఈనెల 20న జాతీయ స్థాయి మెగా జాబ్మేళా నిర్వహించనున్నట్లు కళాశాలల చైర్మన్ డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. డిగ్రీ, డిప్లొమో, బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ తదితర అర్హతలు కలిగిన అభ్యర్థులు రూ.99 రుసుం చెల్లించి నేరుగా జాబ్మేళాలో పాల్గొనవచ్చని తెలిపారు. జాబ్మేళాకు 20కి పైగా పెద్ద పెద్ద కంపెనీలు హాజరుకానున్నాయని, అర్హతలను బట్టి వేతనం, ఉద్యోగం కల్పిస్తామని పేర్కొన్నారు. కేవీ సుబ్బారెడ్డి విద్యా సంస్థల విద్యార్థులతోపాటు ఇతరులు పాల్గొనవచ్చని సూచించారు. వివరాలకు 76800 76632/02/03, 76600 03345, 78429 19899, 81252 58415 నంబర్లలో సంప్రదించవచ్చని పేర్కొన్నారు. -
మైనార్టీ నిరుద్యోగ మహిళలకు జాబ్మేళా
అనంతపురం సప్తగిరిసర్కిల్ : మైనార్టీ నిరుద్యోగ మహిళలకు జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు ఏపీ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈడీ బాబా తాజుద్దీన్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. రైజింగ్ స్టార్స్ మొబైల్ ఇండియా ప్రైవేట్ కంపెనీలో ఉపాధి అవకాశాలు కల్పనకు కర్నూలు, ఒంగోలులో రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. అభ్యర్థులు 18 నుంచి 33 ఏళ్లు నిండిన వారు అర్హులన్నారు. అభ్యర్థులు పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలన్నారు. అభ్యర్థులు ఈ నెల 15 లోపు ఠీఠీఠీ.్చpటఝజఛి.ఛిౌఝ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు 08554–246615లో సంప్రదించాలన్నారు. -
రేపు ఉపాధి కార్యాలయంలో ఉద్యోగ మేళా
కర్నూలు(హాస్పిటల్): జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈ నెల 12వ తేదీన ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి ప్రతాపరెడ్డి బుధవారం ప్రకటనలో తెలిపారు. ఎన్ఎస్ఎల్ మైనింగ్ రిసోర్సెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో ఆపరేటర్ ట్రైనీ ఉద్యోగాల కోసం ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జాబ్మేళా నిర్వహిస్తామన్నారు. ఈ పోస్టులకు 20 నుంచి 25 సంవత్సరాలలోపు వయస్సుగల వారు, ఐటీఐ(ఫిట్టర్ట్రేడ్) చదివిన వారు అర్హులన్నారు. ఎంపికైన వారు బేతంచర్ల మండలం వీరయపల్లి గ్రామంలో పనిచేయాల్సి ఉంటుందన్నారు. వీరికి రూ.8,700 నుంచి రూ.9వేల వరకు జీతం ఇస్తామన్నారు. -
20న మెగా జాబ్ మేళా
–డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి విద్యాసంస్థల చైర్మన్ కె. అశోక్వర్దన్ రెడ్డి కల్లూరు: నగర శివారు దూపాడులోని డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల, ఎంబీఏ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 20వ తేదీన జాతీయ స్థాయి మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని ఆ కళాశాల చైర్మన్ కె. అశోక్వర్దన్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు బుధవారం స్థానిక కళాశాల ఆవరణలో జాతీయ స్థాయి మెగా జాబ్ ఫెయిర్ ‘లెట్స్ హైర్’ 2కే17 వాల్ పోస్టర్లను చైర్మన్ కె అశోక్వర్దన్రెడ్డి, డైరెక్టర్ హరీష్ కృష్ణ విడుదల చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ జాబ్ ఫెయిర్లో 2015, 2016, 2017 విద్యా సంవత్సరాల్లో డిగ్రీ, డిప్లొమా, ఎంకామ్, ఎంఏ, ఎంఎస్సీ, ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్, బీటెక్ తదితర కోర్సుల్లో ఉత్తీర్ణులైన విద్యార్థినీ విద్యార్థులు ఈ మేళాను సద్వినియోగం చేసుకోవాలన్నారు. జాబ్మేళాకు బహుళ జాతి సంస్థల ప్రతినిధులు హాజరై విద్యార్థులను మెరిట్ ఆధారంగా ఎంపిక చేసుకుంటారని తెలిపారు. మరిన్ని వివరాలకు కళాశాలలోని టీ అండ్ పీ విభాగంలో లేదా సెల్: 76800 76632, 78428 19899, 81252 58415, 76800 76603 సెల్ నంబర్లను సంప్రదించాలని సూచించారు. -
రేపు జాబ్మేళా
– డీవీఈవో సుబ్రమ్మణేశ్వరరావు వెల్లడి కర్నూలు (ఓల్డ్సిటీ): ఇంటర్ ఒకేషనల్ కోర్సులు పూర్తి చేసిన వారికి సోమవారం జాబ్మేళా నిర్వహించనున్నట్లు జిల్లా వృత్తివిద్యాధికారి (డీవీఈఓ) టి.వి.సుబ్రమణ్యేశ్వరరావు తెలిపారు. ఇదే అంశంపై శనివారం స్థానిక ప్రభుత్వ వృత్తి విద్య జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ కె.గాంధీ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి 2014 నాటికి ఇంటర్ ఒకేషనల్ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు మాత్రమే ఈ జాబ్మేళాకు అర్హులన్నారు. వివిధ కంపెనీలు పాల్గొంటున్నందున అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు ఒక సెట్ జిరాక్స్ కాపీలు, ఆధార్కార్డు జిరాక్స్, 2 ఫొటోలు తెచ్చుకోవాలని కోరారు. ఇంజనీరింగ్, పారా మెడికల్, బిజినెస్ మేనేజ్మెంట్ విభాగాల్లో కోర్సులు పూర్తి చేసిన వారికి ఇది మంచి అవకాశమన్నారు. బీక్యాంప్లోని ప్రభుత్వ ఒకేషనల్ వృత్తి విద్య కళాశాలలో ఉదయం 10.00 గంటలకు ఇంటర్వ్యూలు ప్రారంభమవుతాయని, అభ్యర్థులు ముందుగానే పేర్లు నమోదు చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమానికి డిప్యూటీ డీవీఈఓ కె.వెంకట్రావ్, వృత్తి విద్య కోర్సుల ప్లేస్మెంట్ అధికారి బి.వి.మాధవరావు కూడా హాజరయ్యారు. -
28న డీఆర్డీఏ మెగా జాబ్మేళా
కర్నూలు(హాస్పిటల్): జిల్లాలోని నిరుద్యోగ యువతీయువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు గాను ఈ నెల 28వ తేదీన ఉదయం 10గంటలకు బి.తాండ్రపాడు టీటీడీసీలో జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు డీఆర్డీఏ పీడీ రామకృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పలు ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాల కోసం ఎస్ఎస్సీ, ఇంటర్, డిగ్రీ, ఎంబీఏ,ఐటీఐ, బీటెక్ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. 19 నుంచి 30 ఏళ్లలోపు వయసు కల్గిన అభ్యర్థులు సర్టిఫికెట్లు, ఆధార్ కార్డులతో హాజరు కావాలన్నారు. ఇతర వివరాలకు కలెక్టరేట్లోని డీఆర్డీఏ-ఈజీఎం కార్యాలయంలో ప్రత్యక్షంగా కానీ, ఫోన్(8099855969, 9177016174) ద్వారా కానీ సంప్రదించాలన్నారు. -
21న నిరుద్యోగులకు జాబ్మేళా
కర్నూలు(హాస్పిటల్): జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఈ నెల 21న జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి ప్రతాపరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటలకు మాన్యుఫ్యాక్చరింగ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అభ్యర్థుల ఎంపిక కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఎంపికైన వారికి హైదరాబాద్లోని స్వర్ణభారత్ ట్రస్ట్లో మూడు నెలల పాటు ఉచిత శిక్షణ, భోజన వసతి కల్పిస్తారన్నారు. అభ్యర్థులు 18 నుంచి 21 ఏళ్లలోపు వయస్సు కలిగి, ఇంటర్(బైపీసీ/ఎంపీసీ) లేదా డిగ్రీ ఫెయిల్, డిస్కంటిన్యూ చేసి ఉండాలన్నారు. ఎంపికైన వారు హైదరాబాద్, విశాఖపట్టణంలో పనిచేయాల్సి ఉంటుందన్నారు. -
మెగా జాబ్మేళాకు విశేష స్పందన
– 29 కంపెనీల ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు – 1500 మంది హాజరు.. 300 మందికి ఉద్యోగాలు – ఉద్యోగాలకు ఎంపికైన వారిని అభినందించిన చైర్మన్ కేవీ సుబ్బారెడ్డి కల్లూరు : నగర శివారు దూపాడులోని డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో మంగళవారం నిర్వహించిన మెగా జాబ్మేళాకు విశేష స్పందన లభించింది. రాయలసీమ జిల్లాలతోపాటు తెలంగాణ, జార్ఖండ్ తదితర రాష్ట్రాల నుంచి సుమారు 1500 మంది అభ్యర్థులు హాజరయ్యారు. మేళాలో 29 కంపెనీల ప్రతినిధులు అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. వీరిలో సుమారు 300 మందికి ఉద్యోగాలు లభించాయి. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ జిల్లా చరిత్రలో మెగాజాబ్ మేళా నూతన అధ్యాయాన్ని సృష్టించిందన్నారు. సీమ నిరుద్యోగలతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ అర్హత కలిగిన వారు పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఆంప్లస్, ఇన్ఫోసిస్ గ్రూపు ఆఫ్ ఇంజనీర్స్ సర్వీస్, హెచ్ఐఈఈ, కాన్రాడ్ లైటింగ్ సొల్యూషన్స్, యాక్సిస్ బ్యాంకు, విప్రో, ద రైజ్ సొల్యూషన్స్, డాక్టర్ రెడ్డీస్, స్వాగతం రీసోర్స్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, జీమూంబా ప్రైవేట్ లిమిటెడ్, ధనుష్ ఇంజనీరింగ్ సర్వీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తదితర 29 కంపెనీలు ఉద్యోగ అవకాశాలు కల్పించడం ఆనందంగా ఉందన్నారు. నియామక ఉత్తర్వులు పొందిన వారు వెంటనే ఉద్యోగాల్లో చేరాలని, ఒక్కొక్కరికి కంపెనీని బట్టి సుమారు రూ.38 వేల వరకు నెలసరి వేతనం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ ఎల్ తిమ్మయ్య, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
రేపు నిరుద్యోగులకు జాబ్మేళా
కర్నూలు(హాస్పిటల్): నిరుద్యోగుల కోసం ఈ నెల 27వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు జాబ్మేళా నిర్వహించనున్నట్లు ఫస్ట్స్టెప్ శిక్షణ, ఉపాధి కేంద్రం చైర్మన్ ఎస్. రాజశేఖర్ శనివారం ప్రకటనలో తెలిపారు. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ, సత్యసుమ మార్కెటర్స్ కంపెనీల్లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, టీం లీడర్ల కోసం నిర్వహించే ఈ మేళాలో ఎంపికైన వారికి నెలకు రూ.7వేల జీతం, ఇన్సెంటీవ్ ఇస్తామన్నారు. ఆసక్తిగల నిరుద్యోగ యువకులకు స్థానిక భాగ్యనగర్లోని ఫస్ట్స్టెప్ సంస్థ కార్యాలయానికి చేరుకోవాలని, వివరాలకు 9393930109, 8099932144 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. -
మైనారిటీ యువతకు గుంటూరులో జాబ్మేళా
కర్నూలు (ఓల్డ్సిటీ): ఈనెల 25, 26 తేదీల్లో గుంటూరులో మైనారిటీ యువతకు జాబ్మేళా నిర్వహించనున్నట్లు రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ వైస్చైర్మన్ ఎస్.కె.బషీర్అహ్మద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మైనారిటీస్ కార్పొరేషన్ (విజయవాడ) ప్రధాన కార్యాలయం ఆధ్వర్యంలో జాబ్మేళా నిర్వహించనున్నామన్నారు. ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, బీఫార్మసీ, పీజీ ఉత్తీర్ణులైన మైనారిటీ అభ్యర్థులు (ముస్లిం, సిక్కు, క్రిస్టియన్, జైన్స్, బుద్దీస్, పార్సీస్) ఈనెల 23లోపు దరఖాస్తులను www.apsmfc.com వెబ్సైట్లో పంపాలన్నారు. అర్హతకు సంబంధించిన సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలను సిద్ధం చేసుకుని జాబ్మేళాకు హాజరు కావాలన్నారు. పూర్తి వివరాల కోసం 98499 01149, 98853 77707 నంబర్లకు సంప్రదించాలన్నారు. -
క్యాంపస్ ఇంటర్వ్యూల్లో 30 మందికి ఉద్యోగాలు
జేఎన్టీయూ : ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ,అనంతపురంలో మైరేత్ ఎనర్జీ లిమిటెడ్ కంపెనీ శనివారం నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూల్లో 30 మంది విద్యార్థులకు ఉద్యోగాలు దక్కినట్లు ప్రిన్సిపాల్ ఆష్రప్ అలీ తెలిపారు. 6,7 తేదీల్లో ఎల్ అండ్ టీ కంపెనీ, 9న చెన్నైకి చెందిన టీవీఎస్ కంపెనీ, 10న బెంగళూరుకు చెందిన జేఎంసీ కంపెనీలు ప్రాంగణ నియామకాలు చేపట్టనున్నట్లు చెప్పారు. -
నైపుణ్యానికే కొలువు
- ఇంజినీరింగ్ విద్యార్థులకు ఉజ్వల భవిత - జేఎన్టీయూ ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి - ఎస్వీఐటీలో జాతీయస్థాయి మెగా జాబ్మేళా - ఇంటర్వ్యూలకు 3 వేలమంది విద్యార్థుల హాజరు - వెయ్యి మందికి నేడు ఉద్యోగ నియామకపత్రాల జారీ రాప్తాడు : ప్రస్తుత పోటీ ప్రపంచంలో నైపుణ్యం, విషయ పరిజ్ఞానం, భావ వ్యక్తీకరణ ఉన్న వారికే ఎక్కువగా ఉద్యోగావకాశాలు లభిస్తాయని జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూ) ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి పేర్కొన్నారు. శనివారం హంపాపురం సమీపంలోని శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎస్వీఐటీ) ఇంజినీరింగ్ కళాశాలలో చైర్మన్ సి.సోమశేఖర్రెడ్డి, వైస్ చైర్మన్ సి.చక్రధర్రెడ్డి ఆధ్వర్యంలో బెంగళూరకు చెందిన జైన్ యూనివర్సిటీ సహకారంతో దేశంలోని 25 ప్రముఖ కంపెనీలతో జాతీయస్థాయి మెగా జాబ్మేళా నిర్వహించారు. ‘అనంత’తోపాటు ఇతర జిల్లాల నుంచి విద్యార్థులు జాబ్మేళాకు హాజరయ్యారు. ముఖ్య అతిథి ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ విద్యార్థలు తరగతి గదికే పరిమితం కాకుండా సమాజంలో జరుగుతున్న అంశాలపై కూడా అవగాహన పెంచుకోవాలన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా నైపుణ్యం మెరుగు పర్చుకోవాలన్నారు. ప్రస్తుతం ఇంజినీరింగ్ విద్యకు ఉజ్వల భవిష్యత్తు ఉందని అన్నారు. చైర్మన్ సోమశేఖర్రెడ్డి మాట్లాడుతూ రాయలసీమలో రతనాల్లాంటి విద్యార్థులు ఉన్నారన్నారు. ఆ రతనాలకు మెరిపించేందుకే జాబ్మేళా నిర్వహించామన్నారు. అన్ని ప్రాంతాల విద్యార్థులకూ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని జాబ్మేళాలో ఎటువంటి రిజిస్ట్రేషన్ రుసుం విధించలేదన్నారు. వైస్ చైర్మన్ సి.చక్రధర్రెడ్డి మాట్లాడుతూ కళాశాలలో 25 కంపెనీల ప్రతినిధులతో ఇంటర్వ్యూలు జరపడం ఇదే మొదటిసారని, అనూహ్య స్పందన లభించిందని పేర్కొన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో హైదరాబాద్, బెంగళూరు వంటి పెద్ద పెద్ద నగరాల్లో కోచింగ్లకు వెళ్లి వేలాది రూపాయలు ఖర్చుపెట్టి చదివినా ఉద్యోగాలు వచ్చేది నమ్మకం లేదన్నారు. విద్యార్థులు కష్టపడకుండా ఉద్యోగాలు సాధించేందుకు తమ కళాశాలలో ఉద్యోగా మేళా నిర్వహిస్తున్నామన్నారు. ఉద్యోగాలకు వెయ్యి మంది ఎంపిక.. జాతీయస్థాయి జాబ్మేళా విజయవంతం అయ్యింది. డిగ్రీ, పాలిటెక్నిక్, డిప్లొమో, ఫార్మసీ, 2015, 16లో ఎంబీఏ పూర్తి చేసిన వారు, 2017లో ఫైనలియర్ చదువుతున్న విద్యార్థులు దాదాపుగా 3 వేల మంది హాజరయ్యారు. ఉదయం ఎనిమిది గంటల నుంచే విద్యార్థులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ఆయా విభాగాలకు సంబంధించి అభ్యర్థులకు వివిధ గదులు కేటాయించారు. కంపెనీ ప్రతినిధులు అభ్యర్థులకు రాత పరీక్షలు, గ్రూప్ డిస్కషన్స్, ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా సాగిన జాబ్మేళాలో దాదాపు 1000 మంది విద్యార్థులను ఎంపిక చేశామని, వారికి ఆదివారం ఉద్యోగ నియామక పత్రాలు అందజేస్తామని ఎస్వీఐటీ యాజమన్యం తెలిపింది. కార్యక్రమంలో బెంగళూరుకు చెందిన జైన్ యూనివర్సిటీ మార్కెటింగ్ మేనెజర్ అశ్విన్, ఫ్లేస్మెంట్ అసిస్టెంట్ మేనేజర్లు చందీల్, గణేష్, ప్రిన్సిపల్ టి.సూర్యశేఖర్రెడ్డి, కళాశాల ట్రెజరర్ రామసుబ్బమ్మ, వైస్ ప్రిన్సిపల్ సత్యశ్రీ, ప్లేస్మెంట్ ఆఫీసర్ కిరణ్కుమార్, పీడీ శ్రీనివాసులునాయక్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
4న ఎస్వీఐటీలో మెగా జాబ్మేళా
రాప్తాడు : హంపాపురంలోని ఎస్వీఐటీ కళాశాలలో ఈ నెల 4న జాతీయ స్థాయి మెగా జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల చైర్మన్ సి.సోమశేఖర్రెడ్డి, వైస్ చైర్మన్ సి.చక్రధర్రెడ్డి, ప్రిన్సిపాల్ టి.సూర్యశేఖర్రెడ్డి తెలిపారు. గురువారం వారు కళాశాలలో విలేకరులతో మాట్లాడుతూ జాబ్మేళాకు దేశంలోని 25 ప్రముఖ కంపెనీల ప్రతినిధులు హాజరై 2 వేల పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు చేపడతారని తెలిపారు. బెంగళూరుకు చెందిన జైన్ యూనివర్సిటీ సహకారంతో నిర్వహిస్తున్న ఈ మెగా జాబ్మేళాకు ఇంజినీరింగ్, ఏదైనా డిగ్రీ , పాలిటెక్నిక్, 2015-16లో ఎంబీఏ పూర్తి చేసిన వారు, 2017లో ఫైనలియర్ డిప్లొమో, ఫార్మసీ చదువుతున్న వారు హాజరుకావచ్చన్నారు. మేళాకు వచ్చేవారికోసం ఆరోజు ఉదయం 8 గంటలకు అనంతపురంలోని ఎస్వీ డిగ్రీ కళాశాల నుంచి ఉచిత బస్సు సౌకర్యం కల్పించినట్లు చెప్పారు. -
సిద్ధిపేటలో మెగా జాబ్ మేళా
సిద్ధిపేట: జిల్లా కేంద్రమైన సిద్దిపేటలోని కొండ భూలక్ష్మి గార్డెన్లో మెగా జాబ్ మేళాను రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామ రెడ్డిలు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీష్రావు మాట్లాడుతూ ఆత్మ విశ్వాసం, పట్టుదలతో కృషి చేస్తే విజయం సాధించొచ్చని నిరుద్యోగ అభ్యర్థులకు సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని లబ్ధిపొందాలన్నారు. ఈ జాబ్ మేళాలో 51 కంపెనీలు పాల్గొన్నాయి. యువతకు 4,391 ఉద్యోగాలు లభించాయి. -
రేపు మెగా జాబ్మేళా
హిందూపురం రూరల్ : స్థానిక ఎంజీఎం పాఠశాలలో శుక్రవారం దివ్యాంగుల మెగా జాబ్మేళా నిర్వహిస్తున్నట్టు డీఆర్డీఏ జాబ్ కోఆర్డినేటర్ లక్ష్మిదేవి తెలిపారు. మేళాను దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. పదోతరగతి ఉత్తీర్ణులైన, ఆపైన చదివిన వారు అర్హులన్నారు. అదేవిధంగా 18 నుంచి 32 ఏళ్ల లోపు వయసు ఉండాలి. శారీరక వికలాంగులు (ఆర్థోపెడిక్), బధిరులు (డెఫ్ అండ్ డంబ్), పార్షిక అంధులందరికీ ఈ జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు ఉచితంగా బ్యుటీషియన్, కాల్సెంటర్, ట్యాలీ, కంప్యూటర్ ఆపరేటర్, రీటైల్, హోటల్ మేనేజ్మెంట్, మొబైల్ సర్వీసింగ్తో పాటు స్పోకెన్ ఇంగ్లిషు, పర్సనాలిటీ డెవలప్మెంట్లో శిక్షణ కల్పిస్తామన్నారు. జాబ్మేళాకు హాజరయ్యే దివ్యాంగులు విద్యార్హత సర్టిఫికెట్లు, వికలాంగుల ధ్రువీకరణ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, రెండు పాస్పోర్టు సైజు ఫొటోలు వెంట తీసుకురావాలన్నారు. -
13న ఉస్మానియా కళాశాలలో జాబ్మేళా
కర్నూలు (వైఎస్ఆర్ సర్కిల్): స్థానిక ఉస్మానియా కళాశాలలో ఈనెల 13న జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు ప్లేస్మెంట్ అధికారి డా. నిస్సార్ అహ్మద్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. డా. రెడ్డీస్ ఎస్ఎంటీ(హైదరాబాద్) ఆధ్వర్యంలో ఉద్యోగులను ఎంపిక చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. 18–19 ఏళ్లలోపు యువకులు హాజరుకావాలని ఆయన కోరారు. ఇంటర్ ఎంపీసీ/బైపీసీ(2016)లో 60 శాతం మార్కులు ఉన్నవారు అర్హులని తెలిపారు. ఎస్ఎస్సీ, ఇంటర్ సర్టిఫికెట్లతో పాటు రెండు పాస్పోర్టు సైజు ఫొటో, ఆధార్కార్డుతో ఉదయం 9.30 గంటలకు హాజరు కావాలని పేర్కొన్నారు. ఇంటర్వ్యూలలో అర్హత సాధించిన వారికి రెండేళ్లపాటు అన్ని సదుపాయాలతో ఏడాదికి రూ.1.45 లక్షల వేతనంతో ఉపాధి కల్పిస్తారని తెలిపారు. వివరాలకు 9700382288 నంబరులో సంప్రదించాలని ఆయన సూచించారు. -
9న జాబ్మేళా
అనంతపురం ఎడ్యుకేషన్ : బెంగళూరుకు చెందిన జోలోస్టేస్ ప్రాపర్టీస్ కంపెనీలో ప్రాపర్టీ మేనేజర్ పోస్టుల భర్తీకి ఈనెల 9న జిల్లా ఉపాధి కల్పన అధికారి కార్యాలయంలో జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు ఉపాధి కల్పనాధికారి ఎ. కల్యాణి ఓ ప్రకటనలో తెలపారు. ఇంటర్, డిగ్రీ చేసి, 18–30 ఏళ్ల వయసు ఉన్న పురుషులు మాత్రమే అర్హులన్నారు. 25 ఖాళీలున్నాయని, జీతం నెలకు రూ. 10 వేలు ఉచిత భోజనం, వసతి ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు 9న ఉదయం 10.30 గంటలకు హాజరుకావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 08554–245547 నంబరులో సంప్రదించాలని కోరారు. -
‘ఇక ప్రతినెలా జాబ్ మేళా’
సికింద్రాబాద్: సికింద్రాబాద్ నగరంలో ఇక ప్రతినెలా ఉద్యోగ మేళాను నిర్వహించనున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. సికింద్రాబాద్లోని కిట్స్ పాఠశాలలో రెండో రోజు జరిగిన ఉద్యోగ మేళాకు ఆయన హాజరై ఉద్యోగాలకు ఎంపికైన పలువురు అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు. ఈ జాబ్ మేళాలో నాలుగువేల మంది ఉద్యోగాలు పొందారు. ప్రతినెలా నిర్వహించనున్న ఉద్యోగమేళా అవకాశాన్ని నిరుద్యోగ యువతీయువకులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. -
20న టీటీడీసీలో జాబ్మేళా
అనంతపురం అగ్రికల్చర్ : బెంగళూరు ఐసీఐసీఐ బ్యాంకు, అనంతపురం ఫ్లిప్కార్టు సంస్థలో డెలివరీ విభాగంలో పనిచేసేందుకు ఆసక్తి కలిగిన నిరుద్యోగులకు ఈనెల 20న ఉదయం 10 గంటలకు స్థానిక టీటీడీసీ కేంద్రంలో జాబ్మేళా ఏర్పాటు చేసినట్లు డీఆర్డీఏ– వెలుగు పీడీ ఎం.వెంకటేశ్వర్లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నెలకు రూ.10 వేలు వేతనం కలిగిన ఐసీఐసీఐ బ్యాంకుకు సంబంధించి 20 నుంచి 28 సంవత్సరాల వయస్సు, ఇంటర్, డిగ్రీ విద్యార్హత ఉండాలన్నారు. నెలకు రూ.8 వేలు, అదనంగా టీఏ కలిగిన ఫ్లిప్కార్డుకు సంబంధించి 20 నుంచి 28 సంవత్సరాల వయస్సు, ఇంటర్ లేదా డిగ్రీ విద్యార్హత ఉండాలని తెలిపారు. బయోడేటా, రేషన్కార్డు, ఆధార్కార్డు జెరాక్స్తో స్థానిక పంగల్రోడ్డు సమీపంలో ఉన్న టీటీడీసీ కేంద్రంలో హాజరు కావాలని సూచించారు. -
జాబ్మేళాను సద్వినియోగం చేసుకోండి
కర్నూలు(అర్బన్): కర్నూలు ఎంపీ బుట్టా రేణుక ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీన నిర్వహించనున్న జాబ్మేళాకు జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాని ఏపీ బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు పి. విజయకుమార్ అన్నారు. శనివారం స్థానిక బీసీ భవన్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నిరుద్యోగ సమస్యను కొంతమేరకైనా రూపుమాపేందుకు ఎంపీ చూపుతున్న చొరవను గుర్తించాలన్నారు. ఎంజీఆర్ఎస్ టెక్నాలజీస్ సహకారంతో చేపడుతున్న ఈ మేళాలో 25 కంపెనీలు పాల్గొంటున్నాయన్నారు. పదో తరగతి నుంచి పీజీ వరకు చదువుకున్న నిరుద్యోగులందరూ ఈ మేళాలో పాల్గొనాలని కోరారు. సమావేశంలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు రంగముని నాయుడు, జగదీష్, ఖాజా, రమణ, బాషా తదితరులు పాల్గొన్నారు. -
రేపు జాబ్ మేళా
కర్నూలు సిటీ: డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ రి గ్రో ప్రాజెక్టు ఆధ్వర్యంలో సోమవారం జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఏరియా హెడ్ ఇబ్రహీం శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 18 నుంచి 28 సంవత్సరాల వయస్సు ఉండి, డిగ్రీ, ఇంటర్ పాస్/ఫెయిల్ అయిన వారు అర్హులు. ఐసీఐసీఐ, కోటక్ బ్యాంకులో సెల్స్ ఆఫీసర్గా పని చేయుటకు ఆసక్తి ఉన్న నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ మేళా భూపాల్ కాంప్లెక్స్లోని 4వ అంతస్తులో నిర్వహిస్తారని చెప్పారు. నేడు .. నగరంలోని ఆక్సా హోటల్ మేనేజ్మెంట్ సంస్థ ఆదివారం జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఆ సంస్థ ప్రతినిధి నాజ్నిక్ తెలిపారు. హైదరాబాద్, తిరుపతి, బెంగళూరు తదితర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసేందుకు పదోతరగతి, ఆ పై చదువులు చదివిన వారు మేళాకు హాజరుకావాలని కోరారు. పార్క్ రోడ్డులో ఉన్న ఆక్సా కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి జాబ్ మేళా జరుగుతుందన్నారు. పూర్తి వివరాలకు 8519868994, 9030486715 నంబర్లను సంప్రదించాలన్నారు. -
రెడ్డీస్ ల్యాబ్ ఆధ్వర్యంలో జాబ్మేళా
అనంతపురం సప్తగిరి సర్కిల్ : జిల్లాలోని ముస్లిం మైనార్టీ నిరుద్యోగ యువతీ యువకులకు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ఆధ్వర్యంలో జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈడీ జమీర్ అహమ్మద్ తెలిపారు. ఇంటర్మీడియట్ ఎంపీసీ, బైపీసీ 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన వారు మాత్రమే అర్హులన్నారు. ఈ జాబ్మేళా గుంటూరు, కర్నూలులో నిర్వహిస్తున్నామన్నారు. గుంటూరులో ఈ నెల 16, 17న రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఉంటుందన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈనెల 15లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. కర్నూలులో ఈ నెల 22, 23న రాత పరీక్ష, ఇంటర్వ్యూ జరుగుతుందన్నారు. ఆసక్తి కలిగిన వారు ఈనెల 21లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ఠీఠీఠీ.్చpటఝజఛి.ఛిౌఝ, వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు 08554–246615లో సంప్రదించాలన్నారు. -
11న ‘సాక్షి’ ఉద్యోగ మేళా
అనంతపురం సప్తగిరి సర్కిల్ : ప్రముఖ దినపత్రిక సాక్షిలో సేల్స్ ప్రమోటర్స్ ఉద్యోగాల కోసం ఈ నెల 11న శుక్రవారం ఉద్యోగమేళా నిర్వహిస్తున్నట్లు డీఆర్డీఏ వెలుగు పీడీ బుధవారం వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ మేళా గుత్తి వెలుగు కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి 2 గంటల వరకు ఉంటుందన్నారు. 10వ తరగతి అర్హత కలిగి 18 నుంచి 30 ఏళ్ల లోపు వయసు కలిగిన వారు అర్హులన్నారు. జీతం రూ.10 వేల నుంచి రూ.13,280 వరకు చెల్లిస్తారని, వసతి సౌకర్యం కల్పిస్తారని తెలిపారు. గుత్తి, గుంతకల్లు, రాయదుర్గం, కళ్యాణదుర్గం, తాడిపత్రి, బళ్లారి ప్రాంతాల వారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఇంటర్వూ్యకు హాజరయ్యేవారు బయోడేటా ఫారంతోపాటు రేష¯ŒSకార్డు, ఆధార్ కార్డు జిరాక్స్, 3 పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు తీసుకురావాలన్నారు. ఇతర వివరాలకు 77021 00237 నెంబరులో సంప్రదించాలన్నారు. -
24న కర్నూలులో జాబ్ మేళా
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : బీక్యాంపు ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలో ఈ నెల 24వ తేదీన మెగా జాబ్మేళాను నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ అయేషాఖాతూన్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఐసీఐసీఐ బ్యాంకు సేల్స్ ఆఫీసర్ల కోసం డిగ్రీ పాసై 26 ఏళ్లలోపు వారు అర్హులని, ఆసక్తి కలిగిన అభ్యర్థులు బయోడేటా, ఆధార్కార్డుతో ఉదయం 9 గంటలకు హాజరు కావాలని ఆమె సూచించారు. మరిన్ని వివరాల కోసం 9866078677ను సంప్రదించాలని ఆమె కోరారు. -
జాబ్మేళా సందర్శన
జూపూడి (ఇబ్రహీంపట్నం) : నోవా ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్న జాబ్మేళాను డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ గురువారం పరిశీలించారు. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేయించుకునే బ్లాక్ను సందర్శించి ఆన్లైన్ విధానం, కౌన్సెలింగ్, అడ్మిట్ కార్డులు పొందే ప్రక్రియను వలంటీర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర కాపు కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాబ్మేళాకు విశేష స్పందన ఉందని చెప్పారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఆయన వెంట కాపు కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ చలమలశెట్టి రామానుజయ, కళాశాల డైరెక్టర్ జె.శ్రీనివాసరావు, ప్రిన్సిపాల్ శ్రీనాథ్ తదితరులు ఉన్నారు. -
రేపు టీటీడీసీలో జాబ్మేళా
అనంతపురం అగ్రికల్చర్ : జిల్లాలో ఉన్న ప్రముఖ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేయడానికి ఆసక్తి ఉన్న నిరుద్యోగులకు శనివారం పంగల్ రోడ్డు సమీపంలో ఉన్న టీటీడీసీలో జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు డీఆర్డీఏ పీడీ ఎం.వెంకటేశ్వర్లు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైన అభ్యర్థులు అనంతపురం, తాడిపత్రి, ధర్మవరం, గుత్తి, గుంతకల్లులో పనిచేయాల్సి ఉంటుందన్నారు. నెలకు రూ.10 వేలకు పైగా వేతనం ఉంటుందని తెలిపారు. ఇంటర్, డిప్లొమా, డిగ్రీ విద్యార్హత కలిగి 19 నుంచి 25 సంవత్సరాల వయస్సున్న వారు బయోడేటా, రేషన్కార్డు, ఆధార్కార్డు ప్రతులతో శనివారం ఉదయం 10 గంటలకు టీటీడీసీలో హాజరు కావాలని సూచించారు. -
23న జాబ్మేళా
హిందూపురం టౌన్ : అంబికా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 23న స్థానిక సప్తగిరి కళాశాలలో జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు ఫౌండేషన్ అధ్యక్షుడు అంబికా లక్ష్మినారాయణ బుధవారం తెలిపారు. ఐసీఐసీఐ, కొటక్ మహీంద్ర బ్యాంకులో సేల్స్ ఆఫీసర్, అక్విజేషన్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామన్నారు. ఏదైనా డిగ్రీ, ఎంబీఏ ఉత్తీర్ణులైన వారు అర్హులు అన్నారు. 23వ తేదీన ఉదయం 10 గంటలకు తమ ఒరిజినల్æసర్టిఫికెట్లు తీసుకుని ఇంటర్వూ్యకు హాజరు కావాలన్నారు. వివరాలకు 96520 36524 నంబరులో సంప్రదించాలని కోరారు. -
నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు
జూపూడి (ఇబ్రహీంపట్నం) : నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలతో పాటు రుణాలు మంజూరు చేయించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని రాష్ట్ర హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. రాష్ట్ర కాపు కార్పొరేషన్ ఆధ్వర్యంలో జూపూడి నోవా ఇంజినీరింగ్ కళాశాలలో మూడు రోజుల పాటు నిర్వహించే జాబ్మేళాను బుధవారం ఆయన ప్రారంభించారు. విద్యార్థులను ఉద్ధేశించి మాట్లాడుతూ ఉద్యోగ, వ్యాపార రంగాల్లో రాణించేందుకు గ్రామీణ విద్యార్థులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ గతంలో బీసీ, ఎస్సీ యువతకు జాబ్మేళా నిర్వహించినట్లు ఇప్పుడు కాపు జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ కాపుల్ని బీసీల్లో చేర్చేందుకు సీఎం చంద్రబాబు మంజునాథ కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. హోంమంత్రి చినరాజప్పకు పరాభవం చినరాజప్ప జాబ్మేళాకు హాజరు కాకముందే మంత్రులు ఉమా, రవీంద్ర కార్యక్రమాన్ని ప్రారంభించి వేదికపై ప్రసంగం మొదలు పెట్టారు. ఈ సమయంలో రాజప్ప రావటంతో ఆయనకు స్వాగతం పలికారు. చినరాజప్ప మాట్లాడగానే మిగిలిన మంత్రులు జెడ్పీ సమావేశం ఉందని వెళ్లిపోయారు. దీంతో వేదికపై చినరాజప్ప అసహనానికి గురైనట్లు కనిపించింది. జాబ్మేళాకు తొలిరోజు నిరుద్యోగుల నుంచి స్పందన కరువైంది. కార్యక్రమంలో పర్చూరు ఎమ్మెల్యే సాంబశివరావు, కార్పొరేషన్ డైరెక్టర్ అమరేంద్ర, నోవా కళాశాల డైరెక్టర్ జె.శ్రీనివాసరావు, ప్రిన్సిపాల్ శ్రీనాథ్, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
19న తాడిపత్రిలో ఉద్యోగ మేళా
అనంతపురం టౌన్ : ఆంధ్రప్రదేశ్ నైపుణ్య అభివద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్డీసీ) ఆధ్వర్యంలో ఈనెల 19న తాడిపత్రిలోని సీవీ రామన్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు సంస్థ అసోసియేట్ మేనేజర్ విన్సెంట్ తెలిపారు. డిగ్రీ, పీజీ పూర్తి చేసిన అభ్యర్థులు హాజరుకావచ్చన్నారు. ఇతర వివరాలకు 8008998616, 9154791399, 8790250737 నంబర్లలో సంప్రదించాలన్నారు. -
9న రెడ్డి విద్యార్థులకు జాబ్మేళా
హిందూపురం అర్బన్ : అనంతపురంలో సాయికష్ణా ఫంక్షన్ హాల్లో ఈనెల 9న రెడ్డి కులస్తుల విద్యార్థులకు జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు రెడ్డి సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి వెంకటేష్రెడ్డి గురువారం పేర్కొన్నారు. డిగ్రీ, ఇంజినీరింగ్, ఐటీఐ, yì ప్లొమా పూర్తి చేసుకున్న నిరుద్యోగులకు వివిధ కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని తెలిపారు. అవకాశాన్ని రెడ్డి కుల నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. -
8న మెగా జాబ్మేళా
మచిలీపట్నం : కృష్ణా యూనివర్సిటీ, ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 8వ తేదీన గుడివాడలోని కేటీఆర్ ఉమెన్స్ కాలేజ్లో మెగా జాబ్మేళాను నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ వీసీ సుంకరి రామకృష్ణారావు తెలిపారు. ఈ జాబ్మేళాలలో 20 బహుళ జాతీయ కంపెనీలు పాల్గొంటాయన్నారు. విద్యార్థుల అర్హతను బట్టి ఎంపిక జరుగుతుందన్నారు. విద్యార్థులు డిగ్రీ, డిప్లమో, ఇంటర్, బీ–ఫార్మసీ, పీజీ కోర్సులు పూర్తిచేసిన వారు ఇంటర్వ్యూలు హాజరుకావచ్చునని సూచించారు. -
‘అనురాగ్’లో జాబ్మేళా
ఘట్కేసర్: విద్యతోపాటు ఉద్యోగావకాశాలు కల్పించడానికి ఎంతగానో కృషి చేస్తున్నామని మండలంలోని వెంకటాపూర్ అనురాగ్ విద్యా సంస్థల ప్రిన్సిపాల్ ముత్తారెడ్డి అన్నారు. కళాశాలలో గురువారం నిర్వహించిన జాబ్మేళా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులపై ఎప్పటికప్పుడు అవగాహన కలిగి ఉండాలని విద్యార్థులకు సూచించారు. పరిశ్రమలకు అవసరయ్యే సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొదించుకోవాలన్నారు. ఆస్మోమిసిస్ సాఫ్ట్వేర్ సంస్థ వారు జాబ్మేళాకు హాజరయ్యారు. 430 మంది విద్యార్థులు దీనిలో పాల్గొన్నారు. గ్రూప్ డిస్కషన్, ఆన్లైన్, టెట్నికల్ పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూల్లో ప్రతిభ కనబర్చిన వారిని ఎంపిక చేసుకున్నారు. కళాశాల ప్లేస్మెంట్ అధికారి మమత, సాఫ్ట్వేర్ కంపెనీ హెచ్ఆర్ ప్రతినిధులు శ్రీనివాస్, సుబావుద్దీన్, అనురాగ్ విద్యాసంస్థల ఏఓ ప్రదీప్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రేపు జాబ్మేళా
కర్నూలు(హాస్పిటల్): స్టార్స్ ఆఫ్ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్లో మార్కెటింగ్ టీమ్ ఉద్యోగాల కోసం ఈ నెల 9వ తేదీ ఉదయం 10.30 నుంచి జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్మేళా నిర్వహిస్తామని జిల్లా ఉపాధి అధికారి పి. ప్రతాపరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిప్యూటీ జనరల్ మేనేజర్స్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్స్, సీనియర్ మార్కెటింగ్ మేనేజర్స్, మార్కెటింగ్ మేనేజర్స్, సేల్స్ ఆఫీసర్స్ ఉద్యోగాలకు 18 ఏళ్లు పైబడ్డ యువకులు అర్హులన్నారు. ఎంపికైన వారికి రూ.8వేలకుపైగా జీతం చెల్లిస్తారని, కర్నూలు జిల్లాలోనే పనిచేయాల్సి ఉంటుందని తెలిపారు. -
రేపు జాబ్ మేళా
అనంతపురం: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ–వెలుగు, ఈజీఎం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1న ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్లు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. నగర శివారులోని రాప్తాడు రోడ్డులో ఉన్న టీటీడీసీలో ఎంపిక ప్రక్రియ జరుగుతుందని, అర్హులు బయోడేటా, రేషన్కార్డు, ఆధార్కార్డు జిరాక్స్ ప్రతులతో హాజరుకావాలని పేర్కొన్నారు. అనంతపురంలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో పని చేయడానికి ఏఎన్ఎం, జీఎన్ఎంలకు ఇంటర్ విద్యార్హత ఉండాలన్నారు. యువతులను మాత్రమే ఎంపిక చేస్తామన్నారు. చిత్తూరులోని మొబైల్ కంపెనీలో ఉద్యోగాల కోసం 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉన్న యువతులు అర్హులన్నారు. అభ్యర్థులు టెన్త్, ఇంటర్, డిగ్రీ చదివి ఉండాలన్నారు. ఇదే జిల్లాలో వినూత్న ఫర్టిలైజర్స్ సేల్స్మన్ కోసం ఇంటర్, డిగ్రీ చదివిన వారు అర్హులన్నారు. బెంగళూరులోని మెడ్ప్లస్ కంపెనీలో పనిచేయడానికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయసు గల పురుషులు అర్హులన్నారు. అభ్యర్థులు టెన్త్, ఇంటర్, డిగ్రీ విద్యార్హత ఉండాలన్నారు. ఉదయం 10 గంటలకు మేళా ప్రారంభమవుతుందన్నారు. -
30న శ్రీరామ్ చిట్స్ జాబ్ మేళా
వికారాబాద్ రూరల్ : శ్రీరామ్ చిట్స్లో 20 ఖాళీల భర్తీ కోసం ఈ నెల 30న పట్టణంలోని సబ్ ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో జాబ్మేఠా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. బిజినెస్ డెవలప్మెంట్ ఎక్సిక్యూటివ్స్ యూనిట్ మేనేజర్స్ కోసం ఏదైనా డిగ్రీ చదివి ఉండాలన్నారు. వయస్సు 25 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల వరకు ఉండాలని జీతం రూ. 10 వేల నుంచి 14.500 వరకు ఉంటుందన్నారు. ఇందు కోసం బయోడేటా, రేషన్కార్డు, మూడు ఫోటోలు ఒరిజినల్ సర్టిఫికేట్లు మరియు జిరాక్స్ కాపీలతో హాజరు కావాలన్నారు. మరిన్ని వివరాల కోసం 9951723428 నెంబర్లను సంప్రదించాలన్నారు. -
20న జాబ్మేళా
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): డీఆర్డీఏ ఆధ్వర్యంలో ఈనెల 20వ తేదీన కలెక్టరేట్ ఆవరణలో ఉన్న ఈజీఎంఎం కౌన్సెలింగ్ సెంటర్లో జాబ్ మేళ నిర్వహించనున్నట్లు డీఆర్డీఏ పీడీ మధుసూదన్నాయక్ గురువారం ప్రకటనలో తెలిపారు. దివ్యశ్రీ రియల్టార్స్ కంపనీలో సేల్స్ ఎగ్జిక్యూటీవ్స్, టీం లీడర్స్ ఉద్యోగాల కోసం మేళ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పూర్తివివరాల కోసం 9533856394 నంబర్కు సంప్రదించాలని కోరారు. -
19, 20 తేదీల్లో జాబ్మేళా
అనంతపురం ఎడ్యుకేషన్ : సుజ్లాన్ విండ్ ఫవర్ ఎనర్జీ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్, సివిల్ ఇంజినీర్, ల్యాండ్ అక్విటేషన్ మేనేజర్ ఉద్యోగాలకు ఈనెల 19, 20 తేదీల్లో స్థానిక ప్రభుత్వ బాలికల ఐటీఐలో జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎ.కళ్యాణి ఓ ప్రకటనలో తెలిపారు. డిప్లొమా/బీటెక్, సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ చేసిన వారు అర్హులని పేర్కొన్నారు. జీతం ఏడాదికి రూ. 2.50 లక్షలు ఉంటుందన్నారు. మొత్తం 100 దాకా పోస్టులను భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. ఈపీసీ, విండ్ ప్రాజెక్టుల్లో కనీసం 4–10 ఏళ్లు పని చేసిన అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఎంపికైన వారు ఉత్తర భారతదేశం (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక)లో పని చేయాల్సి ఉంటుందని వివరించారు. మరిన్ని వివరాలకు 08554–278944 నంబర్లో సంప్రదించాలని కోరారు. -
రేపు డీఆర్డీఏ జాబ్మేళా
కర్నూలు(హాస్పిటల్): నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు గాను డీఆర్డీఏ–ఈజీఎం జాబ్స్ ఆధ్వర్యంలో ఈ నెల 5వ తేదీన జాబ్మేళా నిర్వహించనున్నట్లు డీఆర్డీఏ పీడీ రామకష్ణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు స్థానిక బి.తాండ్రపాడులోని టీటీడీసీలో జాబ్మేళా ప్రారంభమవుతుందన్నారు. అభ్యర్థులు ఎస్ఎస్సీ నుంచి పీజీ వరకు చదివి ఉండి, 19 నుంచి 30 ఏళ్లలోపు వయస్సు కలిగి ఉండాలన్నారు. వివిధ కంపెనీలు, సంస్థల్లో వివిధ కేడర్లలో ఉద్యోగాలు కల్పిస్తాయన్నారు. అభ్యర్థులు వారి విద్యార్హత సర్టిఫికెట్, జిరాక్స్ కాపీలు, ఆధార్కార్డులతో ఇంటర్వ్యూకు హాజరుకావాలన్నారు. వివరాలకు కలెక్టరేట్ కాంప్లెక్స్లోని డీఆర్డీఏ–ఈజీఎం కార్యాలయంలో సంప్రదించాలని, లేదా 08518–277499, 9014296452, 9705171923 నెంబర్లకు ఫోన్ చేయాలన్నారు. -
2న జాబ్మేళా
మర్రిపాలెం : జిల్లా ఉపాధి కార్యాలయంలో వచ్చే నెల 2న జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి (టెక్నికల్) సీహెచ్. సుబ్బిరెడ్డి తెలియజేశారు. నగరంలోని రిలయెన్స్ నిప్పన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో లైఫ్ ప్లానింగ్ ఆఫీసర్ ఉద్యోగానికి అభ్యర్థులను ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. ఏదైనా డిగ్రీ విద్యార్హత, 30 ఏళ్లు నిండిన గహిణులు జాబ్మేళాకు అర్హులన్నారు. 15 ఖాళీలు ఉన్నాయన్నారు. ప్రారంభ జీతం నెలకు రూ.12 వేలు. అలెవెన్సులు అదనం. నెలన్నర రోజులు శిక్షణ కాలంలో నెలకు రూ.12 వేలు కంపెనీ చెల్లిస్తుందని వివరించారు. ఆసక్తిగల గహిణులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పాత ఐటీఐ జంక్షన్ ప్రాంతంలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో మంగళవారం ఉదయం 10 గంటలకు నేరుగా హాజరుకావాలన్నారు. -
28న ఏఆర్ ఇన్ఫోటెక్లో జాబ్మేళా
మహబూబ్నగర్ అర్బన్ : జిల్లా కేంద్రంలోని న్యూటౌన్ చౌరస్తాలో గల ఏఆర్ ఇన్ఫోటెక్ కార్యాలయంలో ఈ నెల 28న జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు స్పెక్ట్రం సేవా సంస్థ కార్యదర్శి ఎంఏ రహీమ్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. బెంగుళూరు, హైదరాబాద్కు చెందిన ప్రసిద్ధ సాఫ్ట్వేర్ కంపెనీల్లో 50 మంది ఐటీ కన్సల్టెంట్లు,ట్రైనీ ఐటీ రిక్రూట్మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ కోసం ఈ జాబ్ మేళా ఏర్పాటు చేసిన ట్లు ఆయన పేర్కొన్నారు. కంప్యూటర్, ఇంటర్నెట్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తారని, ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హతల సర్టిఫికెట్లుతో ఏఆర్ ఇన్ఫోటెక్ కార్యాలయంలో హాజరు కావాలని కోరారు. వివరాలకు 9985432090 నెంబర్కు ఫోన్ చేయాలని కోరారు. -
ఉద్యోగం ఓకే.. వేతనమే తక్కువ
మహానగరంలో బతకడం కష్టమే * మెరుగైన వేతనాలు ఇస్తేనే ఉపయోగం * జాబ్ మేళాలో ఉద్యోగాలు తిరస్కరించిన పలువురు * మూడు ఏరియూల్లో 1734 మందికి అవకాశం * నేడు, రేపు మరో మూడు ఏరియూల్లో మేళా నిర్వహణ యైటింక్లయిన్ కాలనీ/మందమర్రి/ ఇల్లెందు అర్బన్ : సింగరేణి యూజమాన్యం ప్రత్యేకంగా చొరవ తీసుకుని జాబ్ మేళా ద్వారా ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగ అవకాశం కల్పించడం వరకు బాగానే ఉన్నా.. చాలా సంస్థలు అరొకర వేతనంతో సరిపెట్టారు. ఇంత తక్కువ ఆదాయంతో హైదరాబాద్ వంటి మహానగరంలో బతకడం కష్టమేనని పలువురు నిరుద్యోగులు అంటున్నారు. అలాగే కొన్ని సంస్థలు డిపాజిట్ చేస్తేనే అవకాశం కల్పిస్తామని చెప్పడంపైనా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. డబ్బు డిపాజిట్ చేసే స్థితే ఉంటే ఉద్యోగం కోసం ఎందుకు వస్తామంటూ ప్రశ్నిస్తున్నారు. మెరుగైన వేతనా లు కల్పిస్తే ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొంటున్నారు. మరికొందరు ఉద్యోగం చేసుకుంటూ చదువుకోవడానికి తోడ్పడుతుం దని అభిప్రాయం వ్యక్తం చేశారు. సింగరేణి పరిధిలోని ఇల్లెందు, మందమ ర్రి, ఆర్జీ-2 ఏరియూల్లో శుక్రవారం దరఖాస్తు చేసుకున్న వారికి శనివారం జాబ్ మేళా ఇంట ర్వ్యూలు నిర్వహించి 1734 మందికి ఉద్యోగ అవకాశం కల్పించారు. ఇందులో ఇల్లెందు 416, ఆర్జీ-2లో 525, మందమర్రిలో 793 మంది ఉన్నారు. చాలా మందికి వెంటనే ఆర్డర్లు అదజేశారు. ఇంటర్వ్యూలను ఆయా ఏరియాల జీఎంలు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పలువురు అభ్యర్థులు ‘సాక్షి’తో తమ మనోగతాన్ని పంచుకున్నారు. డిపాజిట్ చేయనంటే ఉద్యోగమివ్వలేదు నేను ఐటీఐ ఫిట్టర్ పూర్తి చేశాను. జాబ్ మేళాకు వెళ్తే ఇన్ఫోసాఫ్ట్ హెచ్ఆర్ కంపెనీలో ఉద్యోగానికి ఎంపిక చేశారు. కాకపోతే రూ.5వేలు డిపాజిట్ చేయమంటున్నారు. డిపాజిట్ చెల్లించే స్తోమత ఉంటే ఈ జాబ్ మేళాకు ఎందుకు వస్తాను. చెల్లించనందుకే జాబ్ ఇవ్వడానికి నిరాకరించారు. డిపాజిట్ చేయమనడం సరికాదు. - మణికంఠ, ఇల్లెందు హాస్టల్ వార్డెన్గా పనిచేశాను మా నాన్న రామస్వామి ఓసీపీ-3 సీహెచ్పీలో పనిచేస్తున్నాడు. ఇన్నాళ్లు ఏ ఉద్యో గం లేక హాస్టల్ వార్డెన్గా నేలకు రూ.4 వేల వేతనానికి పనిచేస్తున్నాను. సింగరేణి నిర్వహించిన మెగా జాబ్మేళాల్లో జీ4 ఎస్ కంపెనీలో ఉద్యోగం ఇచ్చారు. నెల లకు రూ.10వేల వేతనమని చెప్పారు. చాలా సంతోషంగా ఉంది. - ఈదునూరి గణేష్, యైటింక్లయిన్కాలనీ, కరీంనగర్ సద్వినియోగం చేసుకుంటా.. జాబ్ మేళాలో అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను. మా నా న్న జీడీకే-10ఏ గనిలో చైన్మెన్గా పనిచేస్తున్నాడు. మేళా లో యూరేకఫోర్బ్స్లో ఉద్యోగం ఇచ్చా రు. నెలకు రూ.6వేలు. వేతనం తక్కువే. అరుునా ఉద్యోగం చేస్తూనే ఉన్నతచదువులతో మరింత ముందుకు వెళ్తా. - సీహెచ్.శ్వేత, కార్మికుడి కుమార్తె, యైటింక్లయిన్ కాలనీ, కరీంనగర్ గ్రూప్స్కు ప్రిపేర్ అవుతా.. నాన్న సింగరేణిలో ఉద్యోగం చేస్తున్నాడు. నేను బీటెక్ చేసి ఖాళీగా ఉంటున్నాను. మేళాకు హాజరయ్యూను. నెలకు రూ. 7వేలు ఇస్తూ కార్వీసొలూషన్లో ఉద్యో గం ఇస్తామన్నారు. ఈ జీతంతో హైదరాబాద్లో ఉండడం కష్టమే. ఉద్యోగం చేసుకుంటూనే డిగ్రీ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతా. - ఎన్.వెంకటేశ్, యైటింక్లయిన్ కాలనీ, కరీంనగర్ ఇక్కడే అవకాశం.. ఆనందంగా ఉంది నేను డిగ్రీ చేశాను. ఇన్ని రోజులు మంథనిలోని ఫెస్టిసైడ్ షాప్లో రూ.5వేలకు ఉద్యోగం చేశాను. ఇప్పుడు నెలకు రూ.10వేల జీతం ఇస్తామని శ్రీరాం ఇన్సూరెన్స్లో జాయిన్ చేసుకున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇదే ప్రాంతంలో అవకాశం లభించడం ఆనందంగా ఉంది. - కె.రమేష్, సూరయ్యపల్లి, మంథని చదువుకుందామనే ఆశతో.. నేను బీటెక్ చేశాను. తల్లిదండ్రులు కూలీ పనిచేస్తున్నారు. వారిపై ఆధారపడకుండా ఉద్యోగం చేస్తూ ఉన్నత చదువులు చదవాలనే ఆశతో ఇక్కడకి వచ్చాను. మంచి అవకాశం లభించింది. కార్వీకంపెనీలో రూ.7వేల వేతనంతో ఉద్యోగం ఇచ్చారు. సద్వినియోగం చేసుకుంటూ ఇంజినీరింగ్ చదువు పూర్తిచేస్తా. సంస్థను ఎల్లప్పుడూ మర్చిపోలేను. - రవళిశ్రీ, బీటెక్, కేకేనగర్, వెంకట్రావ్పల్లి(కరీంనగర్) -
జూలై 11, 12 తేదీల్లో తెలంగాణలో జాబ్మేళా
కరీంనగర్: ‘తెలంగాణ ఆన్ మిషన్-2020’ పేరిట నిరుద్యోగ యువతకు ఉపాధిక ల్పనే లక్ష్యంగా జాబ్మేళాలను నిర్వహించనున్నట్లు తెలంగాణ డెవలప్మెంట్ ఫౌండేషన్ అధ్యక్షుడు కృష్ణ కౌసుల తెలిపారు. ఇందులో భాగంగా మొట్టమొదట జూలై 11, 12వ తేదీల్లో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సహజ ఇంజినీరింగ్ మహిళా కళాశాలలో జాబ్మేళాను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. పూర్తిగా ఉచితంగా నిర్వహించే ఈ మేళాలను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.