Jogulamba District
-
'గజేంద్ర మోక్షం' ఆధారంగా ఆలయం!
పురాతన ఆలయం, చెక్కు చెదరని శిల్పకళా సౌందర్యం, ఆహ్లాదకరమైన తుంగభద్ర (Tungabhadra) నదీతీరం.. వెరసి ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లే రాజోలి (Rajoli) వైకుంఠ నారాయణస్వామి నిలయం. జోగులాంబ గద్వాల జిల్లా రాజోలిలో ఈ ఆలయాన్ని 12వ శతాబ్దంలో కల్యాణి చాళుక్య రాజు త్రిభువన మల్ల సోమేశ్వరుడు నిర్మించారని ఆధారాలు చెబుతున్నాయి. వైకుంఠ నారాయణస్వామి ఆలయం ముందు భాగంలో గరుత్మంతుని గుడి ఉంది. గుడికి ఎడమ భాగాన ధ్వజపీఠం, ఆ వెనుక బలిపీఠాలు ఉన్నాయి. వైకుంఠంలో వెలసిన శ్రీమన్నారాయణుడే రాజోలిలో కొలువైనట్లు భక్తుల విశ్వాసం. ఇక్కడున్న శ్రీమన్నారాయణుడు చతుర్భుజుడు. మూడున్నర అడుగుల దివ్య మంగళుడు. అన్నిచోట్లా దర్శనమిస్తున్నట్టు కాకుండా.. ఇక్కడ చక్ర హస్తంలో గధ, గధ హస్తంలో చక్రం ధరించి ఉంటాడు. ఇలాంటి స్వామివారి దర్శనం ఎక్కడా ప్రాచుర్యంలో లేదు. నారాయణుడికి ఇరువైపులా శ్రీదేవి, భూదేవి ఉన్నారు. స్వామి నెలకొన్న పీఠం రెండు అడుగుల ఎత్తు, అడుగున్నర వెడల్పు ఉంది. ఒకటిన్నర ఎత్తు ఉన్న అమ్మవారి విగ్రహాలు అందంగా, కళాత్మకంగా ఉన్నాయి. పక్కగుడిలోని అమ్మవారు కూర్చున్న పీఠం అడుగు కాగా, ఆమె మూర్తి ఒకటిన్నర అడుగుల ఎత్తు ఉంది. దేవాలయం బయట పురాణ, మాయణ, గవత, వైష్ణవ పురాణగాథలు, జలభూభాగాల్లోని జంతు జాలాలను అద్భుత శిల్ప కళానైపుణ్యం ఉట్టి పడేలా మలిచారు. ఈ శిల్ప కళను చూడాలంటే రెండు కళ్లు చాలవు.ఇప్పటి రాజోలి.. ఒకప్పుడు అడవి గజేంద్ర మోక్షం(Gajendra Moksham) ఆధారంగా ఆలయ నిర్మాణం జరిగిందని ఇక్కడి ప్రజల విశ్వాసం. ప్రస్తుతం రాజోలి గ్రామం ఉన్న ప్రదేశమంతా అడవి. దీనికి కొద్ది దూరంలో రాంపాడు అనే గ్రామం ఉండేది. ఈ అడవిలో ఏనుగులు విపరీతంగా సంచరిస్తుండేవి. వేసవి కాలంలో ఏనుగులు తాగునీటికి చాలా ఇబ్బంది ఉండేవి. అక్కడికి కొద్దిదూరంలో అంటే.. ప్రస్తుతం తూర్పు గార్లపాడు గ్రామం దగ్గర దేవమ్మ మడుగు ఉండేది. ఏనుగులు అక్కడికి వెళ్లి దాహం తీర్చుకునేవి. ఒకరోజు ఏనుగులు దాహం తీర్చుకోవడానికి వెళ్లగా ఆ మందకు పెద్దదిక్కైన ఒక ఏనుగును మడుగులో ఉన్న మొసలి పట్టుకుంది. ఎంతకూ అది వదలకపోవడంతో ఆ ఏనుగు నారాయణుడిని ప్రార్థించిందని.. ఆ మొర విన్న స్వామి వైకుంఠం నుంచి ఏనుగును కాపాడేందుకు వచ్చారని భక్తుల నమ్మకం. శరణు వేడుకున్న వారిని కాపాడాలనే తొందరలో శంఖు, చక్ర, గధ, పద్మధరుడైన మహా విష్ణువు, చక్ర హస్తంలో గధ, గధ హస్తంలో చక్రం ధరించి వచ్చారంటారు. ఆ విషయం అమ్మవార్లు చెప్పాక స్వామివారు గమనించారని.. శరణు కోరిన ఏనుగును చక్రంతో కాపాడారని.. దాని ఆధారంగా ఇక్కడ గుడి నిర్మాణం జరిగిందని స్థానికులు చెబుతారు.తిరుమల వెంకన్నను దర్శించినంత ఫలితం అప్పట్లో కొన్నేళ్ల క్రితం ఈ ప్రాంతీయులు, వేంకటేశ్వరస్వామి దర్శనానికి తిరుమలకు వెళ్లారు. వారిని అక్కడివారు ఎక్కడినుంచి వచ్చారని పలకరించగా.. తాము తుంగభద్ర నదీతీరంలోని రాజోలి ప్రాంతం వారిమని సమాధానమిచ్చారు. అందుకు వారు ఆశ్చర్యానికి లోనై.. సాక్షాత్తు వైకుంఠ నారాయణస్వామి కొలువైన ఆ దేవాలయాన్ని వదిలి ఇంత దూరం వచ్చారా? ఇక్కడి శ్రీనివాసుడే అక్కడి వైకుంఠ నారాయణుడని, అది సాక్షాత్తు వేంకటేశ్వరస్వామి సన్నిధిని.. కలియుగ వైకుంఠమని స్పష్టం చేసినట్టు ఒక కథనం ప్రాచుర్యంలో ఉంది. ఈ ఆలయానికి సమీపంలోనే తుంగభద్ర నదిలో రాంపాటి ఈశ్వరాలయం ఉంది.శ్రీమదలం పురీక్షేత్ర మహత్మ్యమ్ (స్థల పురాణం)లో ఒక శ్లోకం ఉంది. అందులో ‘తుంగా నారాయణస్సాక్షాత్ భద్రాదేవోమహేశ్వరః ఉభయోసంగమే యత్ర ముక్తిస్త్రత నసంశయః’.. అంటే తుంగ, భద్ర అనే రెండు నదులు పశ్చిమ కనుమల్లో వేర్వేరు చోట్ల ద్వారా ఒకచోట రెండు కలుస్తాయి. ఉంగానది సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు కాగా భద్రా నది పరమేశ్వరుడిగా చెబుతారు. ఈ నదులు ఎక్కడ ప్రవహిస్తాయో.. అక్కడ స్నానం చేస్తే మోక్షం సిద్ధిస్తుంది. అంతటి పవిత్రమైన వైష్ణవ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది రాజోలి. ఇక్కడ వైకుంఠనారాయణ ఆలయంతో పాటు ఎడమవైపు శ్రీలక్ష్మి ఆలయం, వాయవ్య దిశలో అంజనేయ స్వామి, వేణుగోపాలస్వామి ఆలయం, నవగ్రహాలయం, ఈశ్వరాలయం, భువనేంద్రస్వామి ఆలయం ఉన్నాయి. ప్రతి ఆలయానికి ఒక ప్రత్యేక చరిత్ర ఉంది.ఇలా ఎంతో చరిత్ర కలిగిన ఈ వైకుంఠ నారాయణస్వామి ఆలయం నిరాదరణకు గురవుతోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేవాదాయ శాఖలో విలీనమైనా.. ఆలయానికి మాన్యాలున్నా అభివృద్ధి జరగలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆలయాన్ని వెలుగులోకి తెస్తే ముక్కోటి ఏకాదశి రోజు ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి తిరుపతి దాకా వెళ్లనవసరం లేదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఆలయం ఒక్క రాజోలికే కాక తెలంగాణకు, దేశానికే తలమానికమని వారు స్పష్టం చేస్తున్నారు. చదవండి: ఆ గుడిలో దేవుడు లేడు.. అయినా జనాల క్యూ!ఉమ్మడి రాష్ట్రంలో పట్టించుకోకపోయినా.. ప్రత్యేక రాష్ట్రంలోనైనా ఆలయాన్ని అభివృద్ధిలోకి తెచ్చి చరిత్రను కాపాడాలని కోరుతున్నారు. ఇప్పటికే ముక్కోటి ఏకాదశికి జిల్లా నలుమూలలతో పాటు, కర్నూల్ జిల్లా నుంచి భక్తులు వస్తుంటారు. అమావాస్య రోజు, వైకుంఠ ఏకాదశి రోజు స్థానికులు దాతల సహాయంతో వేలాది మంది భక్తులకు అన్నదానం, అల్పాహారం, తీర్థప్రసాదాలు అందజేస్తున్నారు. పుష్కరాల సమయాల్లో తుంగభద్ర నదీ పరీవాహక గ్రామాల్లో ఈ ఆలయం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెడితే ఆలయం మరింత అభివృద్ధిలోకి నోచుకుంటుందని భక్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక దృష్టి పెట్టాలి రాజోలిలోని వైకుంఠ నారాయణస్వామి ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది. ప్రభుత్వం ఈ ఆలయంపై శ్రద్ధ పెట్టాలి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. ఇది చాలా మందికి తెలియక ఎన్నో వ్యయ ప్రయాసలతో దూరాన ఉన్న క్షేత్రాలకు వెళ్తున్నారు. ఈ ఆలయం విశిష్టత తెలిసినట్లయితే భక్తులు ఎక్కువగా దర్శించుకుని, ఆలయాభివృద్ధి జరిగే అవకాశముంది. – సురేశ్, శాంతినగర్ చరిత్ర కలిగిన ఆలయం గజేంద్ర మోక్షం ఆధారంగా నిర్మించిన వైకుంఠ నారాయణస్వామి ఆలయంలో ప్రతి ముక్కోటి ఏకాదశికి ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. చరిత్ర కలిగిన ఈ ఆలయం వివక్షకు గురవుతోంది. ప్రత్యేక రాష్ట్రంలోనైనా ఆలయం ప్రాచుర్యంలోకి తీసుకురావాలని స్థానికంగా ఎంతో కృషి చేస్తున్నాం. ప్రతి అమావాస్యకు అన్నదాన కార్యక్రమాలు, భజనలు చేస్తూ ఆధ్యాత్మికత భావనను పెంచుతున్నాం. ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి ఆలయాన్ని అభివృద్ధి చేయాలి. – అంజి, రాజోలి -
5 జిల్లాల్లో 43 డిగ్రీల పైనే..
సాక్షి ప్రతినిధి, నల్లగొండ/ సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. శుక్రవారం నల్లగొండ జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నల్లగొండ జిల్లాలో 43.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, జోగుళాంబ గద్వాల, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో 43.3 డిగ్రీల సెల్సియస్, సంగారెడ్డిలో 43.2 డిగ్రీలు, ఆదిలాబాద్లో 43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నల్లగొండ జిల్లాలోని 18 మండలాలకు చెందిన 20 గ్రామాల్లో 43 డిగ్రీలు దాటిపోయింది. ఈ జిల్లాలోని మాడుగులపల్లి మండల కేంద్రంతోపాటు మునుగోడు మండలం గూడాపూర్లో 43.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దామరచర్ల మండల కేంద్రం, అనుముల మండలం ఇబ్రహీంపేట, కనగల్ మండల కేంద్రం, మిర్యాలగూడ మండలం తడకమళ్ల గ్రామాల్లో 43.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు ఎండలు తీవ్రం కావడంతో వడదెబ్బ కారణంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నలుగురు మృతిచెందారు. జనగామ జిల్లా చిల్పూరు మండలం వెంకటాద్రిపేట గ్రామానికి చెందిన గాదె జయపాల్రెడ్డి (55) గురువారం వడదెబ్బకు గురికాగా హనుమకొండలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతిచెందాడు. మహబూబాబాద్ జిల్లాలో సికింద్రాబాద్ తండా గ్రామానికి చెందిన ధరావత్ మంచ్యా (55) వడదెబ్బకు గురై శుక్రవారం మృతిచెందాడు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని జీఎన్ఆర్ కాలనీకి చెందిన స్వర్ణలత (45) రెండ్రోజుల క్రితం నిజామాబాద్లో పెళ్లికి హాజరైంది. ఎండల తీవ్రతతో అస్వస్థతకు గురైంది. నిర్మల్కు వచి్చన తర్వాత గురువారం రాత్రి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందింది. అలాగే నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండలం శ్రీరంగాపూర్ గ్రామానికి చెందిన రైతు మర్రిపల్లి ఈరయ్య (70) పొలం పనులకు వెళ్లి ఎండ దెబ్బతగలడంతో గురువారం మృతి చెందాడు. -
Gadwal BRS Meeting: ధరణిపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, జోగులాంబ గద్వాల: ముఖ్యమంత్రి కేసీఆర్ జోగులాంబ గద్వాల జిల్లా పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో పార్టీ కార్యాలయాన్ని.. అలాగే, జిల్లాలో కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలను సీఎం కేసీఆర్ పప్రారంభించారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా, గద్వాల సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. గద్వాలలో అభివృద్ధిని ప్రజలు చూస్తున్నారు. పాత గద్వాలకు.. నేటి గద్వాలకు ఎంతో తేడా ఉంది. జిల్లా ప్రజలకు జోగులాంబ దీవెనలు ఉండాలి. గద్వాలకు త్వరలో మెడికల్ కాలేజీ రాబోతోంది. ఒక్క మెడికల్ కాలేజీ లేని జిల్లాలో ఐదు మెడికల్ కాలేజీలు వచ్చాయి. దేశంలోనే అనేక రంగాల్లో తెలంగాణ నెంబర్ వన్గా ఉంది. తెలంగాణ అద్భుత ప్రగతి సాధించాం. మరో 5-10 ఏళ్లు ఇలాగే కష్టపడితే మనకు ఎదురుండదు. మానవీయ కోణంలో అడుగులు ముందుకేస్తున్నాం. ప్రగతిలో మనకన్నా ఎత్తుగా ఉన్న అనే స్టేట్స్ను అధిగమించాం. గతంలో మనం వలస పోయాం. ఇప్పుడు వేరే వాళ్లు ఇక్కడికి వలస వస్తున్నారు. గత పాలకులెవరూ ప్రజలను పట్టించుకోలేదు. రైతుబంధుతో అన్నదాతలకు అండగా నిలిచాం. దేశంలో ఎక్కడా లేని విధంగా కంటివెలుగు పథకాన్ని తీసుకొచ్చాం. ధరణి తీసేస్తామంటూ కొందరు మాట్లాడుతున్నారు. ధరణిని బంగాళాఖాతంలో కలిసేస్తామంటున్నారు. మూడేళ్లు కష్టపడి ధరణిని తీసుకొచ్చాం. ధరణితోనే రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతోంది. ధరణితో దళారీ వ్యవస్థకు చెక్ పెట్టాం. ధరణి ఉండాలా.. తీసేయాలా.. మీరే చెప్పండి అని ప్రజలను ప్రశ్నించారు. ధరణిని తీసేస్తామంటున్న వారికి ప్రజలే బుద్ధి చెప్పాలి. తెలంగాణ వస్తే చీకటి అయిపోతుందన్నారు. తెలంగాణలో ఇప్పుడు 24 గంటల విద్యుత్ ఉంది అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: నిధులు అడిగే దమ్ము లేదు.. అలాంటోడు మంత్రిగా ఉండడం నల్లగొండ దురదృష్టం -
ఈతకు వెళ్లి నలుగురు మృత్యువాత
మానవపాడు/కర్నూలు: కృష్ణానదిలో సరదాగా ఈత కోసం వెళ్లిన వారు.. ప్రమాదవశాత్తు మునిగిపోయి మృత్యువాత పడ్డారు. ఒకరిని కాపాడబోయి మరొకరు చివరికి నలుగురు మృతిచెందిన విషాదకర సంఘటన తెలంగాణ రాష్ట్రం జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం పల్లెపాడు శివారు మంగంపేటలో చోటుచేసుకుంది. కోదండాపురం ఎస్ఐ వెంకటస్వామి, స్థానికుల కథనం ప్రకారం.. ఇటిక్యాల మండలంలోని వల్లూరుకు చెందిన అన్నదమ్ములు ఇస్మాయిల్, ఇబ్రహింలు బతుకుదెరువు కోసం 20 ఏళ్ల క్రితం ఏపీలోని కర్నూలు నగరంలోని వీకర్సెక్షన్ కాలనీకి వెళ్లి స్థిరపడ్డారు. వేసవిసెలవుల కావడంతో కుటుంబసభ్యులతో కలిసి మానవపాడు మండలంలోని బోరవెల్లిలో బంధువుల ఇంటికి నాలుగు రోజుల క్రితం వచ్చారు. ఈ క్రమంలో సోమవారం ఈత కోసం మేనత్త కుమారుడైన ఇమాంతో కలిసి ఇస్మాయిల్ కుమారులు సమీర్(18), రియాన్(14), ఇబ్రహిం కూతుళ్లు ఆఫ్రిన్(17), నవసీన్ (13)తో పాటు మరో ఐదుగురు కలిసి ఆటోలో మంగంపేట శివారులో కృష్ణానదికి వెళ్లారు. ఈ క్రమంలో నదిలో లోతు గమనించకుండా ముందుకు వెళ్లడంతో రియాన్ మునిగిపోగా.. ఆఫ్రిన్, నవసీన్ కాపాడటానికి వెళ్లగా.. ముగ్గురికీ ఈత రాకపోవడంతో గల్లంతయ్యారు. వెంటనే వీరిని కాపాడేందుకు వెళ్లిన సమీర్ సైతం నీటిలో మునిగిపోయాడు. నలుగురు గల్లంతవడంతో ఇమాం కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మత్స్యకారుల సహాయంతో మృతదేహాలను వెలికితీసి.. పోస్టుమార్టం నిమిత్తం గద్వాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఈ ఘటనతో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది. విగతా జీవులుగా పడి ఉన్న పిల్లలను చూసి కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. -
ప్రసవం మధ్యలో వెళ్లిపోయిన వైద్యురాలు.. పసికందు మృతి
సాక్షి, గద్వాల: ప్రసవం కోసం వచ్చిన గర్భిణికి సకాలంలో వైద్యం అందించడంలో వైద్యురాలు నిర్లక్ష్యం కనబరచడంతో పురిటిలోనే శిశువు మృతిచెందింది. ఈ సంఘటన ఆదివారం జోగుళాంబ గద్వాల జిల్లా ఆస్పత్రిలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబీకుల కథనం ప్రకారం.. జిల్లాలోని రాజోళి మండలం పచ్చర్ల గ్రామానికి చెందిన ఖలీఫా తొలి ప్రసవం కోసం ఈ నెల 16న జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చింది. సాధారణ కాన్పు అయ్యేలా చూస్తామని వైద్యులు చెప్పారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం పురిటి నొప్పులు రావడంతో వైద్యురాలు నర్మద, సిబ్బంది ప్రసవం చేసేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో వైద్యురాలు నిర్లక్ష్యంగా వ్యవహరించి.. కాన్పు కాకముందే వెళ్లిపోవడం వల్లే పసికందు మృతిచెందిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ విషయమై వైద్యురాలు నర్మద స్పందిస్తూ పాప ఉమ్మనీరు తాగి పరిస్థితి విషమంగా మారడంతో ఆపరేషన్ చేయాలని చెప్పినా కుటుంబ సభ్యులు వినిపించుకోలేదన్నారు. కాన్పు కాకముందే వెళ్లిపోయానన్న ఆరోపణలు అవాస్తవం అన్నారు. తన డ్యూటీ సమయం అయిపోయినప్పటికీ విధులు నిర్వహించానని పేర్కొన్నారు. పసికందు మృతిపై విచారణకు ఆదేశించామని కలెక్టర్ వల్లూరి క్రాంతి ‘సాక్షి’కి తెలిపారు. విచారణలో వైద్యుల తప్పిదం ఉందని తేలితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. గతంలోనూ సస్పెండ్ డాక్టర్ నర్మద గతంలో ఓసారి ఇలాంటి సంఘటనలో సస్పెండ్ అయినట్లు తెలిసింది. ధరూర్ మండలం జాంపల్లికి చెందిన దీపిక అనే గర్భిణి కాన్పు సమయంలో ఆమె నిర్లక్ష్యం వల్ల శిశువు మృతి చెందాడు. దీంతో అప్పటి కలెక్టర్ ఆమెను సస్పెండ్ చేసినట్లు సమాచారం. -
కంటిలో నుంచి బియ్యపు గింజలు.. బాలిక నరకయాతన..
-
పేదలపై మరో గుదిబండ.. గోలి.. జేబు ఖాళీ!
సామాన్యులు, మధ్య తరగతి వారిపై మరో పిడుగు పడనుంది. ఇప్పటికే నిత్యావసరాలు, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో సతమతమవుతున్న వారు.. ఇకపై జ్వరం గోలికి సైతం అదనంగా చెల్లించాల్సి వస్తోంది. వివిధ రకాల కారణాలతో ఔషధ కంపెనీలు 10.7 శాతం మేర ధరలు పెంచుకునేందుకు ఎన్పీపీఏ అనుమతిచ్చింది. గత నెల నుంచే కొన్నిరకాల మందుల ధరలు పెరగగా.. తాజాగా మిగతా వాటి పెంపునకు చర్యలు చేపడుతున్నారు. ఫలితంగా మందు గోలీల రూపంలో పేదలపై మరో గుదిబండ పడనుంది. అయిజ రూరల్ (జోగులాంబ గద్వాల): నేషనల్ ఫార్మాసూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్పీపీఏ) తీసుకుంటున్న నిర్ణయంతో ఔషధ మందులు కొనుగోలు చేసేవారి జేబులు ఖాళీ కానున్నాయి. ఈ నిర్ణయం వల్ల ఇప్పటికే మార్కెట్లో ఉన్న మందుల ధరలకు అదనంగా మరో 10.7 శాతం పెరగనున్నాయి. గత నెలలోనే ఆయా కంపెనీలకు ధరలను పెంచుకునే అవకాశం కల్పించడం వల్ల ఇప్పటికే మార్కెట్లో లభించే కొన్ని మందుల ధరలు పెరిగాయి. ఎన్పీపీఏ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల మార్కెట్లో లభించే మందుల్లో దాదాపు 800 రకాల ధరలు పెగనున్నాయి. జ్వరం, గుండె వ్యాధులు, అధిక రక్తపోటు, చర్మవ్యాధులు, అనీమియా వంటి వ్యాధులకు మందులు కొనాలంటే ఇక నుంచి కొనుగోలు దారుడికి భారంగా మారనుంది. సాధారణంగా వాడే మందుల్లో పారాషిటమాల్, ఫెనోబార్బిటోన్, ఫెనిటోయిన్ సోడియం, అజిత్రోమైసిన్, సిప్రోఫ్లో క్యాసిన్ హైడ్రోక్లోరైడ్, మెట్రోనీడజోల్ లాంటి మందులు పెరుగుతున్న వాటి జాబితాలో ప్రధానంగా చెప్పుకోవచ్చు. సామాన్యులపైనే.. ఫార్మాసూటికల్ కంపెనీలు పెంచుతున్న ధరలు సామాన్యుడికి గుదిబండగా మారనున్నాయి. జోగుళాంబ గద్వాల జిల్లాలో వివిధ రకాల వ్యాధుల బారిన పడినవారు కాకుండా, ప్రధానంగా బీపీ, షుగర్ వ్యాధులు ఉన్న వారు రూ.6 వేలకు పైచిలుకు ఉంటారని వైద్యాధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో కూడా సామాన్య, మధ్య తరగతి కుటుంబాలకు చెందినవారే అధికంగా ఉంటారని చెబుతున్నారు. ఈ రెండు వ్యాధుల బారిన పడిన వారిలో దాదాపు 15 శాతం మంది మాత్రమే ప్రభుత్వం ద్వారా అందే మందులను వాడుతుండగా, మిగిలిన 85 శాతం వ్యాధిగ్రస్తులు ప్రైవేటు దుకాణాల్లో మందులు కొనుగోలు చేసి వాడుతున్నారు. ప్రైవేటు దుకాణాల్లో మందులు వాడుతున్న వారికి నెలకు రూ.2,500 వరకు ఖర్చు అవుతుంది. ఈ రూపేణా చూసుకున్న ఇప్పుడు పెరిగిన మందుల ధరల ప్రకారం వారికి ఏడాదికి రూ.3,210 అదనంగా చెల్లించాల్సి వస్తుంది. అసలే పెరిగిన నిత్యావసర ధరలతో ఇబ్బందులు పడుతున్న సామాన్యులకు మరోవైపు పెరిగిన మందుల ధరలు గుదిబండగా మారనున్నాయి. పెరుగుదల ఎందుకు..? కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ గణాంకాల ఆధారంగా 2020 సంవత్సరంతో పోలిస్తే 2021కి గాను మందుల టోకు ధరల సూచి ఇప్పటికే 10.7 శాతానికి పెరిగినట్లు ఎన్పీపీఏ ప్రకటించింది. ఈ నిర్ణయం మేరకు 2019లో మాత్రం ఔషధ కంపెనీలు మందుల ధరలను 2 శాతానికి పెంచుకోగా, అదే 2020 సంవత్సరంలో మాత్రం 0.5 శాతమే పెంచుకునే అవకాశం ఔషధ కంపెనీలకు కల్పించింది. కోవిడ్ అనంతరం మాత్రం మందుల తయారీ కోసం ఉపయోగించే ముడి పదార్థాల ధరలు పెరగడం, ప్యాకింగ్, రవాణా ఖర్చులు పెరిగిపోవడం వల్ల ఔషధ కంపెనీలకు ధరలు పెంచక తప్పడం లేదనే వాదనలు ఉన్నాయి. పేదలు ఎలా కొనాలి.. మందులు ధరలు ఇలా పెరిగితే సామాన్యులు ఎలా కొనాలి. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు అధికంగా పెరిగి పేదవాడు అనేక ఇబ్బందులు పడుతున్నాడు. ఇప్పుడు మందుల ధరలు పెరిగితే అదే పేదవాడు ఎలా కొని వ్యాధిని నయం చేసుకోవాలి. జ్వరం గోలి కూడా ధర పెరుగుతుంది అంటున్నారు. ఇలా అయితే చాలా కష్టం. – ఆంజనేయులుగౌడ్, గట్టు దశల వారీగా పెంపు.. మందుల తయారికి ఉపయోగించే ముడిసరుకుల ధరలు పెరగడం వల్ల ఔషధ మందుల ధరలు కూడా పెరగనున్నాయి. ఇప్పటికే కొన్ని మందుల ధరలు నిబంధనల మేరకు పెరిగాయి. ఇంకా మరికొన్ని ధరలు పెరిగే అవకాశం ఉంది. అయితే దశల వారీగా పెరుగుతాయి. – శ్రీకాంత్, డ్రగ్ ఇన్స్పెక్టర్, గద్వాల -
నడిగడ్డ.. నకిలీ లిక్కర్ అడ్డా
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఇప్పటికే నకిలీ పత్తివిత్తనాలు, నకిలీకల్లు, రేషన్ రీసైక్లింగ్తో అక్రమాలకు అడ్డాగా మారిన నడిగడ్డలో మరో నకిలీ వ్యవహారం బయటపడింది. జోగుళాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలం పాతపాలెంలో నకిలీ లిక్కర్ తయారీ దందా బయటపడటం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. నకిలీ మద్యాన్ని గోవా, కర్ణాటక లిక్కర్ పేరిట చుట్టుపక్కల ప్రాంతాల్లోని బెల్ట్షాపులకు సరఫరా చేయడంతోపాటు బ్రాండెడ్ లేబుళ్లతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా రవాణా చేస్తున్నట్లు వెల్లడైంది. ముఠా పట్టుబడిందిలా.. రెండురోజుల క్రితం కర్ణాటక నుంచి స్పిరిట్ (100శాతం ప్యూర్ ఆల్కహాల్) లోడ్తో కారు వస్తున్నట్టు సమాచారం అందుకున్న ఎక్సైజ్ పోలీసులు.. గద్వాల జిల్లా పాతపాలెం వద్ద కాపు కాసి పట్టుకున్నారు. 70 లీటర్ల (2 క్యాన్లు) స్పిరిట్ను, వాహనాన్ని నడుపుతున్న పాతపాలెం నివాసి వీరేశ్ను అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించగా.. నకిలీ మద్యం తయారీ కేంద్రం గుట్టు తెలిసింది. దీనితో ఎక్సైజ్ అధికారులు, పోలీసులు ఆదివారం పాతపాలెంలో నకిలీ మద్యం తయారు చేస్తున్న గోపి అనే వ్యక్తి ఇంటిపై దాడులు చేశారు. నకిలీ మద్యం తయారుచేసే యంత్రం, బ్రాండెడ్ మద్యానికి సంబంధించిన నకిలీ లేబుళ్లు, ఫ్లేవర్, 35 లీటర్ల స్పిరిట్ డబ్బా, 50 ఇంపీరియల్ బ్లూ మద్యం సీసాల కాటన్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ దందాతో సంబంధమున్న అలంపూర్ మండలం బొంగూరుకు చెందిన లోకేశ్గౌడ్, కల్లుకుంట్లకు చెందిన నాగరాజుగౌడ్, సింగవరానికి చెందిన బాబుగౌడ్, మల్దకల్ మండలం మద్దెలబండకు చెందిన ఈరన్నగౌడ్ ఇళ్లలోనూ సోదాలు చేశారు. బాబుగౌడ్ ఇంట్లో 140 లీటర్ల స్పిరిట్ను స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా ఈ ముఠా కర్ణాటక నుంచి స్పిరిట్ తీసుకొచ్చి నకిలీ మద్యం తయారుచేసి, గద్వాల జిల్లా, పరిసర ప్రాంతాలతోపాటు ఏపీలోని కర్నూల్ జిల్లాలోని బెల్టుషాపులకు విక్రయిస్తున్నట్టు విచారణలో గుర్తించారు. కర్నూల్కు చెందిన నారాయణగౌడ్, రాయచూర్కు చెందిన శ్రీనివాస్గౌడ్లకు దందాలో భాగస్వామ్యం ఉన్నట్టు తేల్చారు. 8 మంది అరెస్టు.. నకిలీ మద్యం ముఠా, దాడుల వివరాలను ఎక్సైజ్ ఉప కమిషనర్ దత్తురాజుగౌడ్ సోమవారం వెల్లడించారు. మొత్తం 9 మందిపై కేసు నమోదు చేసి, ఎనిమిది మందిని అరెస్టు చేశామని, రాయచూర్కు చెందిన శ్రీనివాస్గౌడ్ పరారీలో ఉన్నాడని తెలిపారు. మొత్తంగా రూ.15 లక్షల విలువైన 210 లీటర్ల స్పిరిట్ను స్వాధీనం చేసుకున్నామన్నారు. కీలక ప్రజాప్రతినిధి అండతో..! నకిలీ మద్యం దందాలో.. పాతపాలెంకు చెందిన ఒక ప్రభుత్వ ఉద్యోగి, మరో ప్రభుత్వ ఉద్యోగి సోదరుడు భాగస్వాములుగా ఉన్నారని, ఇన్నాళ్లుగా అక్రమార్కులకు జిల్లాకు చెందిన ఓ కీలక ప్రజాప్రతినిధి అండదండలు ఉన్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల గ్రామదేవతల ఉత్సవాల నేపథ్యంలో సదరు కీలక ప్రజాప్రతినిధితో వ్యవహారం బెడిసికొట్టిందని.. ఈ క్రమంలోనే నకిలీ మద్యం తయారీ కేంద్రంపై దాడులు జరిగాయని అంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగి ఒకరు ఆ ముఖ్య ప్రజాప్రతినిధి వద్ద గతంలో పనిచేయగా.. అతడి సోదరుడు మద్యం దందాలో పెట్టుబడి పెట్టినట్టు సమాచారం. ఈ క్రమంలోనే వారిని ఈ కేసు నుంచి తప్పించినట్టు ప్రచారం జరుగుతోంది. కర్ణాటక నుంచి స్పిరిట్.. గుట్టుగా బెల్టుషాపులకు.. గద్వాల నియోజకవర్గంలో కేటీదొడ్డికి కర్ణాటకలోని రాయచూర్ జిల్లా సరిహద్దుగా ఉంది. అక్కడి నుంచి స్పిరిట్ (100శాతం ప్యూర్ ఆల్కాహాల్) గద్వాల జిల్లాకు సరఫరా అవుతోంది. రాయచూర్కు చెందిన శ్రీనివాస్గౌడ్ ఈ స్పిరిట్ కొనుగోలు, అమ్మకం, రవాణాలో కీలకమని సమాచారం. ఇక గోపి, వీరేశ్, వీరేశ్గౌడ్, లోకేశ్ గౌడ్, నాగరాజుగౌడ్ తదితరులు ఆ స్పిరిట్ను ఉపయోగించి నకిలీ మద్యాన్ని తయారు చేస్తూ.. స్థానికంగా బెల్టుషాపులకు సరఫరా చేస్తుంటారని తెలిసింది. మరోవైపు ఆలంపూర్ నియోజకవర్గానికి ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా సరిహద్దుగా ఉండటంతో.. ఆ జిల్లా మీదుగా ఏపీలోకి రవాణా చేస్తున్నారు. కర్నూల్కు చెందిన నారాయణగౌడ్ స్థానికంగా, గద్వాల జిల్లాలోని రెండు నియోజకవర్గాల పరిధిలో బెల్ట్షాపులకు నకిలీ మద్యం సరఫరాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు తెలిసింది. వీరంతా కొన్నేళ్లుగా చైన్ పద్ధతిలో మద్యం తయారీ, అమ్మకాలు చేస్తున్నట్టు స్థానికులు చెప్తున్నారు. అంతేకాదు.. ఈ ముఠాలో ఐదుగురికి బినామీ పేర్లతో వైన్స్షాపుల భాగస్వామ్యం ఉందని, అయినా డబ్బుల కోసం నకిలీ మద్యం దందాకు దిగారని అంటున్నారు. నకిలీ మద్యం తయారీ ఇలా.. కర్ణాటక నుంచి వచ్చిన స్పిరిట్ను ఉపయోగించి నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. బ్రాండెడ్ మద్యం వాసన, రంగు వచ్చేలా ఫ్లేవర్లు, నీళ్లు కలుపుతున్నట్టు తేల్చారు. అనుమానం రాకుండా చీప్ లిక్కర్ బాటిళ్లలో నింపి, లేబుళ్లు కూడా అతికించి బెల్ట్ షాపులకు సరఫరా చేస్తున్నారు. -
జోగులాంబ గద్వాల్లో ఎస్సై వీరంగం.. వీడియో వైరల్
సాక్షి, రాజోళి (జోగులాంబ గద్వాల్): జిల్లాలోని రాజోళిలో ఓ ఎస్సై అత్యుత్సాహం ప్రదర్శించాడు. కర్నూలుకు చెందిన ఇద్దరు వ్యక్తులపై తోటి సిబ్బందితో కలిసి విచక్షణా రహితంగా దాడి చేయించాడు. లక్ష్మణ్ అనే వ్యక్తి మరో యువకుడితో కలిసి రాజోళిలోని నిర్మానుష్య ప్రదేశంలో పార్టీ చేసుకుంటుండగా ఎస్సై లెనిన్ వారితో దుర్భాషలాడాడు. అంతటితో ఆగకుండా యువకుడి తలను ఇన్నోవా కారు అద్దానికేసి బలంగా కొట్టాడు. ఆ తరువాత ఇద్దరు యువకులే మద్యం సేవించి కారు అద్దాలు పగలగొట్టినట్లు ప్రచారం చేయించారు. ఈ ఘటనపై ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ రంగస్వామి, శాంతినగర్ సీఐ వెంకటేశ్వర్లు సోమవారం రాజోళి లో విచారణ చేపట్టారు. ఎల్లమ్మ గుడి వద్ద జరిగిన సంఘటన, లక్ష్మణ్పై పోలీసులు దాడి చేసేందుకు గల కారణాలను అక్కడి రైతులతో అడిగి తెలుకున్నారు. మద్యం తాగుతున్న సమయంలో తమతో లక్ష్మణ్ గొడవ పెట్టుకున్నాడని వారు పేర్కొన్నారు. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా అక్కడికి వచ్చిన వారితోనూ అతను వాగ్వాదానికి దిగాడన్నారు. ప్రతిఘటించే సమయంలో ఎస్ఐ లెనిన్ దాడి చేశారని తమ విచారణలో తేలిందని డీఎస్పీ తెలిపారు. వీడియో వైరల్.. ఆదివారం జరిగిన దానికి పోలీసులు చెప్పిన దానికి అంతా సరిపోయిందనుకునేలో గానే సోమవారం సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయింది. అందులో లక్ష్మణ్ కిందపడగా ఎస్ఐ లెనిన్ బూటు కాలుతో దాడి చేస్తుండగా.. మరో కానిస్టేబుల్ సహకరించాడు. దీని ఆధారంగా లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం సభ్యులు బాధితుడు లక్ష్మణ్ తరఫున బీసీ కమిషన్, హెచ్ఆర్సీలను ఆశ్రయించారు. కంగుతిన్న పోలీసులు తమపై దాడికి యత్నించినందుకే కర్నూలుకు చెందిన లక్ష్మణ్పై కేసు నమోదు చేశామని, ఈ క్రమంలో వాహనం అద్దాలు ధ్వంసమయ్యాయని ఆదివారం చెప్పిన పోలీసులు, సోమవారం సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోతో కంగుతిన్నారు. -
జోగులాంబ గద్వాల్ జిల్లా రాజోళిలో ఓ ఎస్సై అరాచకం
-
Petrol Price: ఎంతకాలం పెంచుతారంటూ కొత్త బైక్ను తగులబెట్టాడు
ధరూరు: పెరిగిన పెట్రోల్ ధరలను నిరసిస్తూ తన కొత్త బైక్ను తగలబెట్టాడు ఓ యువకుడు. జోగుళాంబ గద్వాల జిల్లా ధరూర్ మండల కేంద్రానికి చెందిన రైతు కుర్వ ఆంజనేయులు మూడు నెలల క్రితం కొత్త బైక్ను కొనుగోలు చేశాడు. బుధవారం సాయంత్రం గ్రామంలోని ఓ పెట్రోల్ బంక్ వద్దకు వెళ్లి వాహనంలో పెట్రోల్ పోయించుకున్నాడు. లీటర్ ఎంత అని బంకులో పనిచేస్తున్న వ్యక్తిని అడగ్గా, రూ.107 అని చెప్పడంతో.. ‘అడిగేవారు లేరా.. ఇంకా ఎన్ని రోజులు పెట్రోలు ధరలు పెంచుకుంటూ పోతారు’అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెట్రోల్ను బైక్పై పోసి నిప్పంటించి అక్కడే కూర్చున్నాడు. దీంతో చుట్టుపక్కల ఉన్నవారు వచ్చి వెంటనే మంటలు ఆర్పేశారు. విషయం తెలుసుకున్న రేవులపల్లి పోలీసులు ఆంజనేయులును, కాలిపోయిన బైక్ను తీసుకెళ్లి కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
సొరంగం అనుకుంటే పొరపాటే..
జోగుళాంబ : చారిత్రక నేపథ్యం కలిగిన జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్లో మంగళవారం భూగర్భంలో 12 అడుగుల లోతుతో ధాన్యం భద్రపరుచుకునే గది బయటపడింది. పట్టణంలో ఉబేద్ అనే వ్యక్తి పాడుబడిన ఓ దుకాణం గదిలో గిర్ని మిషన్ ఏర్పాటు చేసుకునేందుకు మేస్త్రీతో గొయ్యి తీయించగా బండ కనిపించింది. మూత తరహాలో ఉన్న ఆ బండను తెరిచి చూడగా.. దాదాపు 5 అడుగుల వెడల్పు, 12 అడుగుల లోతుతో సొరంగంలా కనిపించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అయితే అది సొరంగం కాదని, పూర్వం రోజుల్లో ధాన్యాన్ని భద్రపరిచేందుకు ఏర్పాటు చేసుకున్న గది అని ఎస్ఐ మధుసూదన్రెడ్డి చెప్పారు. -
ఉత్తుత్తిగా నకిలీ విత్తనాల కేసులు నమోదు
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: నకిలీ పత్తి విత్తనాలకు కేంద్ర బిందువుగా ఉన్న జోగుళాంబ గద్వాల జిల్లాలో పోలీస్, వ్యవసాయశాఖల ఆధ్వర్యంలో 15 రోజులుగా దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 10,230 కిలోల నకిలీ విత్తనాలు స్వాధీనం చేసుకోగా.. 18 మందిపై 15 కేసులు నమోదయ్యాయి. అయితే పట్టుబడుతున్న వారిపై తూతూమంత్రంగా చీటింగ్ కేసులు నమోదు చేస్తున్నారు. ఇందుకు గద్వాల రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకున్న ఘటనే నిదర్శనం. వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల 3న గద్వాల శివారులోని రమ్య ఇండస్ట్రీస్లో టాస్క్ఫోర్స్ నిర్వహించిన తనిఖీల్లో 72 బ్యాగుల (3434.5 కిలోల) నకిలీ పత్తి విత్తనాలు పట్టుబడ్డాయి. దీనిపై ఎం.విజయభాస్కర్రెడ్డిపై కేసు నమోదైంది. అసలు మిల్లు యజమానిని వదిలేసి, ఎవరో వ్యక్తిపై కేసు నమోదు కావడంపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలొచ్చాయి. ఆ మిల్లును లీజుకిచ్చినట్లు పేపర్లు సృష్టించారనే చర్చ జరిగింది. దీంతో గద్వాల రూరల్ పోలీసులు సోమవారం మిల్లు యజమాని, సీడ్ ఆర్గనైజర్, సీడ్మెన్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ భీంనగర్కు చెందిన బండ్ల రాజశేఖర్రెడ్డి (ఏ–1) ధరూర్ మండలం, బురెడ్డిపల్లికి చెందిన ఎం.విజయభాస్కర్రెడ్డి (ఏ–2)పై కేసు నమోదుచేసి అడిషనల్ జూనియర్ సివిల్ జడ్డి ఎదుట హాజరుపరిచారు. ఆపై రిమాండ్కు తరలించారు. అయితే పోలీసులు వారిపై చీటింగ్ కేసు, విత్తన యాక్ట్ కిందే కేసు పెట్టడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కల్తీ విత్తన తయారీదారులను పీడీ యాక్టు కింద అరెస్ట్ చేయాలని సీఎం ఆదేశించినా గద్వాల పోలీసులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘సాక్షి’ నాడే చెప్పింది.. రాష్ట్రంలో కొనసాగుతోన్న నకిలీ విత్తనాల దందాపై ‘సాక్షి’ ప్రధాన సంచికలో కొద్ది రోజుల క్రితం ‘కల్తీ విత్తులతో కొల్లగొడతారు’ శీర్షికతో కథనం ప్రచురితమైంది. ఎక్కడెక్కడ నకిలీ విత్తనాల దందా జరుగుతోంది?, మాఫియా ఆగడాలు, వారికి అండగా నిలుస్తున్నదెవరు?, నామమాత్రంగా కేసుల నమోదుపై ప్రచురితమైన ఈ కథనం సంచలనం సృష్టించింది. నాటి నుంచి సర్కారు ఆదేశాలతో వ్యవసాయ, పోలీస్శాఖల ఆధ్వర్యంలో జిల్లాల్లోని విత్తన దుకాణాలు, గోదాంలు, మిల్లులపై దాడులు నిర్వహిస్తున్నారు. క్వింటాళ్ల కొద్దీ నకిలీ విత్తనాలు పట్టుబడగా, వందల మందిపై కేసులు నమోదయ్యాయి. ‘సాక్షి’ కథనం తర్వాత సీడ్మెన్ అసోసియేషన్ సమావేశమైంది. ఇందులో ప్రస్తుతం కేసు నమోదైన బండ్ల రాజశేఖర్రెడ్డి మాట్లాడుతూ ‘నాణ్యమైన సీడ్ను పండిస్తూ దేశవ్యాప్తంగా నడిగడ్డకు మంచిపేరును తీసుకొస్తామని.. కొందరు వ్యక్తులు గద్వాల సీడ్కు ఉన్న బ్రాండ్ను వినియోగించుకుని నకిలీవి ఉత్పత్తి చేస్తున్నారని, వాటితో తమకు సంబంధం లేదని’ తెలిపారు. అయితే ప్రస్తుతం ఆయన మిల్లులోనే నకిలీ విత్తనాలు పట్టుబడ్డాయి. చదవండి: కల్తీ విత్తులతో కొల్లగొడతారు -
ఎమ్మార్వో ఆఫీసులో అధికారుల తిట్ల పురాణం
సాక్షి, గద్వాల: ప్రభుత్వ ఖజానా నుంచి జీతం తీసుకుంటూ ప్రజలకు సేవ చేయాల్సిన అధికారులు కర్తవ్యం మరిచారు. ఒకరికొకరు సమన్వయంతో పనిచేయాల్సిందిపోయి సోయి మరచి వాగ్వాదానికి దిగారు. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలంలోని తహసిల్దార్ (ఎమ్మార్వో) కార్యాలయంలో వెలుగు చూసింది. సర్వేయర్ బ్రహ్మయ్య, సీనియర్ అసిస్టెంట్ ఉదయ్ పరస్పరం బండ బూతులతో రచ్చకెక్కారు. అధికారుల తిట్ల పురాణాన్ని పనుల నిమిత్తం వచ్చిన కొందరు వ్యక్తులు వీడియో తీసి బయటపెట్టడంతో.. అది కాస్తా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ప్రజలకు సేవ చేయాల్సిన ఉద్యోగులు ఇలా గొడవపడటంపై జనం మండిపడుతున్నారు. పైఅధికారులు వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
ఏసీబీ వలలో డీఎంహెచ్ఓ
గద్వాల న్యూటౌన్: ప్రభుత్వ వైద్యురాలికి పీజీలో సీటులో వచ్చింది. రిలీవ్ చేయమని ఇన్చార్జ్ డీఎంహెచ్ఓను అడిగింది. సాటి ఉద్యోగికి పీజీలో సీటు వచ్చింది కదా అని సంతోషించి రిలీవ్ చేయాల్సింది పోయి ఏకంగా పైసల్ డిమాండ్ చేశారు. వైద్యురాలు మరోసారి వెళ్లి అడిగినా అదే డిమాండ్ను ఆమె ముందు ఉంచారు. దీంతో చేసేదిలేక వైద్యురాలు, భర్త సాయంతో ఏసీబీని ఆశ్రయించింది. నెలరోజులుగా ఏసీబీ అధికారులు ఆయనపై దృష్టి సారించారు. బుద్ధిపోనిచ్చుకోని ఆ జిల్లా అధికారి ఎట్టకేలకు గురువారం మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో రూ.7వేలు లంచం తీసుకొని రిలీవింగ్ ఆర్డర్ చేతికి ఇస్తుండగా ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ కృష్ణగౌడ్ తెలిపిన వివరాల ఇలా ఉన్నాయి. కరీంనగర్కు చెందిన మంజుల అనే పీహెచ్సీ వైద్యురాలు గత నెల 17న జిల్లాలోని వడ్డేపల్లి పీహెచ్సీకి బదిలీపై వచ్చింది. విధుల్లో చేరిన మరుసటి రోజే ఆమెకు కాకతీయ మెడికల్ కళాశాలలో పీజీలో సీటు వచ్చింది. పీజీలో జాయిన్ అయ్యేందుకు నిబంధనల ప్రకారం తనను రిలీవ్ చేయమని జోగుళాంబ గద్వాల జిల్లా ఇన్చార్జ్ డీఎంహెచ్ఓ భీమ్నాయక్ను కోరింది. ఆయన డబ్బు డిమాండ్ చేశాడు. ఈ విషయాన్ని ఆమె భర్త అశోక్ తెలిపింది. జూన్ 22న ఆయన మహబూబ్నగర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. అప్పటినుంచి వారు ఈ కేసుపై దృష్టి సారించి నాలుగుసార్లు గద్వాలకు వచ్చి వెళ్లారు. గురువారం మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో జిల్లా వైద్య,ఆరోగ్యశాఖ కార్యాల యంలో ఇన్చార్జ్ డీఎంహెచ్ఓ చాంబర్లో వైద్యురాలు మంజుల నుంచి రూ.7వేలు తీసుకొని రిలీవింగ్ ఆర్డర్ ఇచ్చాడు. తీసుకున్న డబ్బును తన ప్యాంట్ జేబులో పెట్టుకున్నాడు. అదే సమయంలో డీఎస్పీ కృష్ణగౌడ్, మహబూబ్నగర్, నల్గొండ ఏసీబీ అధికారులు ప్రవీణ్కుమార్, లింగస్వా మి, ఎస్ఐలు రమేష్బాబు, వెంకట్రావ్లు మరో 10మంది సిబ్బందితో కలిసి రైడ్ చేశారు. కార్యాలయంలో ఉన్న అధికారులందరినీ ఎక్కడివారిని అక్కడే కూర్చోబెట్టారు. నేరుగా డీఎంహెచ్ఓ చాంబర్కు వెళ్లి డీఎంహెచ్ఓను తనిఖీ చేశారు. ఆయన ప్యాంట్ జేబులో రూ.7వేలు లభించాయి. ఆ నోట్లను పరిశీలించి లంచం తీసుకున్నట్లు నిర్ధారించారు. లంచం అడిగితే సమాచారం ఇవ్వండి.. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ కృష్ణగౌడ్ మీడియాతో మాట్లాడారు. ఏదేని ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులు లంచం అడిగితే ఏసీబీ 1064కు కాల్ చేయాలన్నారు. పూర్తి వివరాలతో ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. వచ్చిన కొద్దిరోజులకే.. ఇబ్రహీంపట్నంలో డిప్యూటీ డీఎంహెచ్ఓగా ఉన్న భీమ్నాయక్ జూన్ 3న ఇన్చార్జ్ డీఎంహెచ్ఓగా జిల్లాకు బదిలీపై వచ్చాడు. వచ్చిన కొద్దిరోజులకే ఆయనపై పలు ఫిర్యాదులొచ్చాయి. వివిధ విభాగాల్లో ఉన్న ముగ్గురు ఉద్యోగులను డిప్యూటేషన్పై వారు కోరిన పీహెచ్సీలకు ఉద్దేశపూర్వకంగా మార్చాడని ఆశాఖ అధికారులే తెలిపారు. అయిజలో రెండు ప్రైవేట్ ఆసుపత్రులను సందర్శించి, డబ్బులు డిమాండ్ చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. తనకు నచ్చిన నలుగురు ఉద్యోగులతో ఓ మాదిరి, మిగిలిన ఉద్యోగులతో మరో మాదిరిగా వ్యవహరించేవారని వైద్యులు తెలిపారు. సదరు నలుగురు ఉద్యోగులే పలు వ్యవహారాలు చక్కబెట్టావారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. -
ఏ చర్యలు తీసుకుంటారో తేల్చుకోండి: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన గర్భిణి జెనీలా (20) పురుటినొప్పులతో బాధపడుతున్నా కరోనా వైరస్కు భయపడి వైద్యం అందించని వైద్యులపై ఏ చర్యలు తీసుకోవాలో ప్రభుత్వమే నిర్ణయించుకోవాలని హైకోర్టు స్పష్టంచేసింది. క్రిమినల్ కేసులు నమోదు చేసి వి చారణ తర్వాత చర్యలు తీసుకోవాలని తాము ఆ దేశాలు జారీ చేయగలమని, అయితే కరోనాకు వైద్య సేవలు అందిస్తున్న వైద్యుల్లో మనోధైర్యం దెబ్బతినకూడదన్న ఉద్దేశంతో ఉత్తర్వులు ఇవ్వ డం లేదని తెలిపింది. క్రిమినల్ కేసు నమోదా లేక శాఖాపరంగా విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకునేదీ ప్రభుత్వమే తగిన నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. వైద్యం అందకే జెనీలా మరణించిందని, బాధ్యులపై చర్యలు తీసుకునేలా ప్రభుత్వానికి ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ న్యాయవాదులు కరణం కిషోర్కుమార్, శ్రీనిత పూజారి దాఖలు చేసిన రెండు ప్రజాహిత వ్యాజ్యాలు గురువారం విచారణకు వచ్చాయి. ప్రభుత్వం అంబులెన్స్లను ఏర్పాటు చేసిందని దాఖలు చేసిన కౌంటర్తో సంతృప్తికరంగా ఉన్నందున పిల్స్పై విచారణను ముగిస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేన్రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. -
పొంచి ఉంది.. విపత్తి!
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ : రాష్ట్రంలో ఎందరో రైతులు ఏటా నకిలీ విత్తనాలతో నష్టపోతున్నారు. మరోపక్క ఏటా మాదిరిగానే ఈసారీ రాష్ట్రవ్యాప్తంగా పత్తి నకిలీ విత్తన మాఫియా భారీ దందాకు తెర లేపింది. దళారులు, సీడ్ ఆర్గనైజర్లు, ఏజెంట్లతో కూడిన పటిష్ట నెట్వర్క్తో నకిలీ విత్తన విక్రయాలు కొనసాగిస్తోంది. ఇలా ప్రతి సీజన్లో నకిలీ విత్తన వ్యాపారం రూ.2 వేల కోట్లకుపైనే సాగుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో కేవలం ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే రూ.700 కోట్ల వరకు జరుగుతోంది. వానాకాలం సీజన్ ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతుండగా.. అధికారులు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా మూడు వేల క్వింటాళ్ల నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. వీటిలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో 200 క్వింటాళ్లు, మంచిర్యాల జిల్లాలో 1,900, ఆదిలాబాద్ జిల్లాలో 141 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు పట్టుబడ్డాయి. నియంత్రిత సాగు పద్ధతి నకిలీ విత్తన మాఫియాకు వరంగా మారింది. ప్రభుత్వ ఆదేశాలతో ప్రధానంగా పత్తి, వరి (సన్నరకం), కందులు, వేరుశనగ సాగుకు రైతులు ఉద్యుక్తులవుతున్నారు. దీంతో పత్తి, వరి సాగు ఈసారి భారీగా పెరిగే అవకాశం ఉంది. గత వానాకాలం సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా 21,26,621 హెక్టార్లలో పత్తి, 16,31,151 హెక్టార్లలో వరి వేశారు. ఈసారి పత్తి సుమారు 32 లక్షలు, వరి 25 లక్షల హెక్టార్లలో సాగు చేస్తారని అంచనా. గత వానాకాలం సీజన్లో రాష్ట్రంలో అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 2,73,699 హెక్టార్లలో పత్తి సాగైంది. నాగర్కర్నూల్లో 1,42,192, ఆదిలాబాద్లో 1,40,332, సంగారెడ్డిలో 1,40,009, కొమురంభీం ఆసిఫాబాద్ 1,24,884, ఖమ్మం 1,00,370 హెక్టార్లలో సాగైంది. ఈసారి ఆయా జిల్లాల్లో పత్తి సాగు 20 నుంచి 60 శాతానికి పెరుగుతుందని అంచనా. సాధారణంగా ఎకరాకు 900 గ్రాముల చొప్పున పత్తి విత్తనాలు అవసరం. గతేడాది పత్తి సాగు లెక్కలనే తీసుకుంటే.. 53,16,553 కిలోల విత్తనాలు కావాలి. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో 30 లక్షల కిలోలకు మించి అందుబాటులో లేవు. ఈ లోటునే నకిలీ విత్తన మాఫియా ‘మార్కెట్’గా మలుచుకుంటోంది. నడిగడ్డే అడ్డాగా.. దక్షిణ భారతదేశంలోనే ఉమ్మడి పాలమూరులోని నడిగడ్డ (జోగుళాంబ గద్వాల జిల్లా) నాణ్యమైన కాటన్ సీడ్ ఉత్పత్తికి పెట్టింది పేరు. ఏటా 40వేల ఎకరాల్లో కాటన్ సీడ్ సాగవుతుండగా, రూ. 2వేల కోట్ల టర్నోవర్ ఉంటుంది. 30 వేల రైతు కుటుంబాలు దీన్నే ప్రధాన పంటగా సాగు చేస్తుండగా, మరో 50 వేల మంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. ఈ కాటన్ సీడ్ వ్యాపారంలో సీడ్ ఆర్గనైజర్ల వ్యవస్థ కీలకం. వంద మంది వరకు సీడ్ ఆర్గనైజర్లు కాటన్సీడ్ ఉత్పత్తి సంబంధిత లావాదేవీల్లో క్రియాశీలంగా పనిచేస్తున్నారు. మరోవైపు నకిలీ సీడ్ మాఫియా సైతం నడిగడ్డేనే అడ్డాగా చేసుకుని నకిలీ దందా సాగిస్తోంది. ఇక్కడ ఏటా రూ.200 కోట్లపైనే ఈ దందా సాగుతోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాను తీసుకుంటే ఈ మొత్తం రూ.700కోట్ల వరకు ఉంటుంది. 2006లో గద్వాలకు చెందిన కొందరు సీడ్ ఆర్గనైజర్లు తయారుచేసి విక్రయిస్తున్న నకిలీ విత్తనాలు పట్టుబడ్డాయి. వీటి విలువ అప్పట్లోనే సుమారు రూ.15 కోట్లుపైనే. ఇప్పటికీ ఈ వ్యాపారం ఇక్కడ గుట్టుగా సాగుతోంది. అవీ..ఇవీ కలిపి, రంగులద్ది.. కాటన్సీడ్ పంటలో ఫలవంతం కాని 5–10 శాతం విత్తనాలు 10–20 లక్షల (450 గ్రాముల పాకెట్లు) క్వింటాళ్లు, కమర్షియల్ సీడ్ పంట ద్వారా పండిన 7 లక్షల క్వింటాళ్ల విత్తనాలను నకిలీ వ్యాపారులు ఎంచుకుంటారు. ఈ రెండు రకాలు పంటసాగుకు యోగ్యం కావు. కమర్షియల్ పంట ద్వారా పండిన విత్తనాలు నూనె తయారీ, పశువుల దాణాగా ఉపయోగపడతాయి. ఈ రెండు రకాలను కలిపి గుర్తుపట్టరాకుండా రంగులద్ది ప్రముఖ కంపెనీల పేర్లను పోలిన పాకెట్లల్లో నింపుతారు. కొందరు సీడ్ ఆర్గనైజర్లు, బడా రైతుల ద్వారా వీటిని రైతులకు అంటగడతారు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు, ఎమ్మిగనూరు, గుంటూరు, కర్ణాటకలోని రాయచూరు, మహారాష్ట్రలోని పుణె, ముంబై ప్రాంతాల్లో ఈ తయారీ కేంద్రాలున్నాయి. కేంద్ర విత్తన చట్టం ప్రకారం కల్తీ విత్తనాల విక్రేతకు కనీసం 6 నెలల జైలుశిక్ష, రూ.25 వేల జరిమానా వి«ధించాలి. డీలర్షిప్ను పూర్తిగా రద్దుచేయాలి. పీడీ యాక్టు కిందా కేసులు నమోదు చేయవచ్చు. కానీ ఈ చట్టం అమలుకు నోచుకోవట్లేదు. నకిలీ విత్తనం తయారీ ఇలా.. ఫలవంతం కాని విత్తనాలే అక్రమార్కుల చేతిలో ‘నకిలీ’గా మారుతున్నాయి. నడిగడ్డలో ఏటా కాటన్సీడ్ సాగు ద్వారా రెండు కోట్ల పాకెట్ల (450 గ్రాముల చొప్పున) దిగుబడి వస్తుంది. ఈ 450 గ్రాముల పాకెట్ను కనిష్టంగా రూ.410, గరిష్టంగా రూ.470కి విక్రయిస్తారు. వాస్తవానికి విత్తనానికి జెర్మినేషన్ ప్రక్రియ చేసినపుడు 75శాతంపైగా జెర్మినేషన్ వస్తే ఫలవంతమైన (మొలకెత్తే) విత్తనాలనీ, అంతకంటే తక్కువ వస్తే ఫలవంతం కాని (మొలకెత్తని) విత్తనాలనీ లెక్క. ఇలా దిగుబడైన 2 కోట్ల పాకెట్ల విత్తనాలలో సుమారు 5 శాతం నుంచి 10 శాతం విత్తనాలు జెర్మినేషన్లో 75శాతం కంటే తక్కువగా వస్తాయి. ఇవే నకిలీ విత్తనాలుగా మార్కెట్ను ముంచెత్తుతూ, రైతుల్ని ముంచుతున్నాయి. -
సరిహద్దుల్లో అప్రమత్తం
గట్టు (గద్వాల): జోగుళాంబ గద్వాల జిల్లాలోని కర్ణాటక సరిహద్దుల్లో అధికారులు అప్రమత్తత ప్రకటించారు. సోమవారం మాచర్ల, బల్గెర, ఇందువాసి, బోయలగూడెం గ్రామాల్లో పోలీస్ వలంటీర్లను ఎస్ఐ మంజునాథరెడ్డి ఏర్పాటు చేశారు. వీరి ద్వారా సరిహద్దు గ్రామాల్లో పటిష్ట నిఘాను ఏర్పాటు చేసినట్లు ఎస్ఐ చెప్పారు. గట్టు మండలానికి ఆనుకుని ఉన్న కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతుండటంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. కర్ణాటకలోని రాయచూర్ జిల్లాను ఆనుకుని గట్టు, కేటీదొడ్డి మండలాలు ఉండగా.. గట్టు మండలంలో మాచర్ల, బల్గెర, చమన్ఖాన్దొడ్డి, ఇందువాసి, బోయలగూడెం గ్రామాలున్నాయి. కర్నూలు రాయచూర్ అంతర్ రాష్ట్ర రహదారి బల్గెర దగ్గర సరిహద్దు చెక్పోస్టు కొనసాగుతోంది. దీంతోపాటే ఆయా గ్రామాల్లో గ్రామ పోలీస్ వలంటీర్లను ఎస్ఐ మంజునాథరెడ్డి ఏర్పాటు చేశారు. పోలీస్ వలంటీర్లను సరిహద్దు గ్రామాల్లో ఏర్పాటు చేసి, కర్ణాటక నుంచి రాష్ట్రంలోకి వచ్చే వారిపై నిఘా పెంచారు. సరిహద్దు గ్రామాలు కలిగిన ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కర్ణాటకకు వెళ్లవద్దని, అలాగే కర్ణాటకకు చెందిన వారిని గ్రామాల్లోకి రాకుండా చూసుకోవాలని ఎస్ఐ సూచించారు. బల్గెర చెక్పోస్టు దగ్గర వాహన తనిఖీలను ముమ్మరం చేశారు. అత్యవసరం అయితే తప్ప ఇతర రాష్ట్రాల వారిని రాష్ట్రంలోకి అనుమతించేది లేదని ఎస్ఐ పేర్కొన్నారు. చెక్పోస్టుల వద్ద పటిష్ట నిఘా నారాయణపేట రూరల్: ఇటీవల కర్ణాటకలో కరోనా వైరస్ వ్యాప్తి పెరగడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. హోంశాఖ ఆదేశాల మేరకు రాయిచూర్, యాద్గీర్లతో నారాయణపేట జిల్లాకు ఉన్న సరిహద్దుల్లో భద్రత పెంచారు. నారాయణపేట మండలం జిలాల్పూర్, ఎక్లాస్పూర్, దామరగిద్ద మండలం సజనాపూర్, కాన్కుర్తి, కృష్ణ మండలం గుడేబల్లూర్, టైరోడ్డు, చేగుంట, ఎనికెపల్లి, ఆలంపల్లి, మాగనూర్ మండలం ఉజ్జెలి, బైరంపల్లి, కొత్తపల్లి, మక్తల్ మండలం పస్పుల, దత్తాత్రేయ టెంపుల్ చెక్పోస్టుల ద్వారా ఎలాంటి వాహనాలను అనుమతించడం లేదు. అత్యవసరమైనా ధ్రువీకరణ పత్రాలు ఉంటేనే చెక్పోస్టు దాటేందుకు అనుమతి ఇస్తున్నారు. ఈ మేరకు సోమవారం ఎస్పీ చేతన ఆయా అంతర్రాష్ట్ర చెక్పోస్టులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బందికి వసతులు, భోజనం, తాగునీరు, మాస్క్లు, శానిటైజర్ల ఏర్పాటును పరిశీలించారు. చెక్పోస్టుల్లో పనిచేస్తున్న సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ఏ ఒక్కరిని లోపలికి అనుమతించరాదని చెప్పారు. తగు జాగ్రత్తలు తీసుకుంటూ భౌతికదూరం పాటిస్తూ విధులు నిర్వహించాలన్నారు. వాహనాల అడ్డగింత.. కృష్ణా (మక్తల్): మండల సరిహద్దులోని కర్ణాటక ప్రాంతంలో కరోనా విజృంభిస్తుండడంతో అక్కడి ప్రజలు ఎవరినీ మన రాష్ట్రంలోకి అనుమతించకుండా అధికారులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. సోమవారం వాసునగర్ ప్రాంతంలోని సరిహద్దు చెక్పోస్టులో అటు నుంచి కాలినడకన వచ్చేవారిని కూడా ఇటువైపు రానివ్వకుండా అడ్డుకున్నారు. కేవలం అత్యవసర పరిస్థితి ఉన్న వారిని మాత్రమే వదులుతున్నారు. ఏదేమైనా ఓ వారం రోజులపాటు ప్రయాణికులు ఈ అంతర్రాష్ట్ర రహదారిపై ప్రయాణించడానికి అనుమతి ఇవ్వడం లేదని రెవెన్యూ, పోలీస్ అధికారులు పేర్కొన్నారు. కర్ణాటకకు వెళ్లొద్దు.. కేటీదొడ్డి (గద్వాల): కర్ణాటక రాష్ట్రం రాయిచూర్ జిల్లాలో కరోనా వైరస్ విజృభిస్తున్నందన కేటీదొడ్డి మండలానికి చెందిన ప్రజలు అక్కడికి ఎవరూ వెళ్లవద్దని తహసీల్దార్ సుభాష్నాయుడు అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాయిచూర్లో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నందున సోమవారమే 40 కేసులు నమోదయ్యాయన్నారు. కాబట్టి రాష్ట్ర సరిహద్దు నందిన్నె, ఇర్కిచేడు, చింతలకుంట, సుల్తాన్పురం వద్ద అధికారులను అప్రమత్తం చేశామని, సరిహద్దు కర్ణాటక ప్రజలు తెలంగాణలోకి ప్రవేశించకుండా ఇక్కడి వారు కర్ణాటకకు వెళ్లకుండా సరిహద్దులో భద్రత పెంచామన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. -
ఆ గ్రామంలో గుప్తనిధులు..
గద్వాల క్రైం: ఆ గ్రామంలో గుప్తనిధులు దొరుకుతాయనే ప్రచారం ఉంది. అందులోనూ ఇంటి నిర్మాణాల కోసం గుంతలు తవ్వినా పురాతన నాణేలు బయటపడిన సంఘటనలు కోకొల్లలు. గత పదేళ్ల క్రితం పంచలోహాల విగ్రహాలు లభ్యమయ్యాయి. గద్వాల సంస్థానాధీశులు ఆ గ్రామాన్ని రాజుల రాజధానిగా కార్యకళాపాలు సాగించిన ఊరు. పురావస్తు శాఖ అధికారులు సైతం గ్రామంలో అనుమతి లేకుండా తవ్వకాలు జరిపితే చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. ఇక అంతా సవ్యంగా ఉన్న గ్రామంలో మూడు రోజుల క్రితం గుప్తనిధుల కోసం గుర్తుతెలియని వ్యక్తులు పూడూరు గ్రామ శివారులోని పురాతన విగ్రహాన్ని తొలగించిన సంఘటన శుక్రవారం వెలుగుచూసింది. ఈ ఘటనకు సంబంధించి గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామంలోని బక్కమ్మ చెరువు సమీపంలో వెలసిన శివలింగంను గత మూడు రోజుల క్రితం గుర్తుతెలియని వ్యక్తులు తొలగించి గుప్తనిధుల కోసం సుమారు ఆరు ఫీట్ల మేర తవ్వకాలు జరిపారు. దీంతో గ్రామస్తులు గద్వాల రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. గత కొన్నేళ్లుగా గ్రామంలోని పురాతన ఆలయాల వద్ద గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపిన క్రమంలో విగ్రహాలు, బంగారు, వెండి నాణేలు బయటపడ్డాయన్నారు. స్తబ్ధుగా ఉన్న గ్రామంలో మళ్లీ గుప్తనిధుల కోసం తవ్వకాలు చోటు చేసుకోవడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది సైతం.. గద్వాల రాజులు పూడూరు గ్రామాన్ని రాజధాని ప్రాంతంగా ఏర్పాటు చేసుకొని పలు ఆలయాలను నిర్మించారు. చోళ్లరాజులు సైతం ఈ ప్రాంతంలో దేవాలయం నిర్మించారు. దీంతో గ్రామంలో నిధులు ఉన్నాయనే తెలుసుకుని పలువురు గుప్తనిధుల కోసం తవ్వకాలు చేస్తున్నారు. అయితే గ్రామంలోని పురాతన ఆలయాల్లో పురావస్తు శాఖ అధికారులు తవ్వకాలపై నిషేధాజ్ఞలు విధించారు. గ్రామస్తులు సైతం ఇంటి నిర్మాణాలు, వ్యవసాయ పనుల కోసం గుంతలు తవ్విన క్రమంలో పలు విలువైన నాణేలు, పంచలోహ విగ్రహాలు బయటపడ్డాయి. వాటిని రెవెన్యూ అధికారులు పురావస్తు శాఖకు అప్పగించారు. ఈ క్రమంలోనే గతేడాది జూన్లో గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇంకుడు గుంత కోసం తవ్వకాలు జరిపిన క్రమంలో 20 పురాతన నాణేలు బయటపడ్డాయి. గ్రామస్తుల సమాచారం మేరకు వాటిని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే గుప్తనిధుల కోసం రహస్యంగా పలువురు అంగతకులు తవ్వకాలు జరిపారని గ్రామస్తులు తెలిపారు. కేసు నమోదు.. గ్రామంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిగినట్లు గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రూరల్ ఎస్ఐ శ్రీకాంత్రెడ్డి సిబ్బందితో కలిసి ఘటనా స్థలం వద్దకు చేరుకొని పరిశీలించారు. తవ్వకాలు జరిగిన ప్రాంతంలో క్షుణ్ణంగా పరిశీలించారు. గుప్తనిధుల కోసం తవ్విన తవ్వకాలనే అంశాలపై ఆరా తీశారు. గ్రామ సర్పంచ్ శశికళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
బైక్పై ఏడు నెలల చిన్నారితో.. 670 కిలోమీటర్లు
జోగుళాంబ గద్వాల, నవాబుపేట: మండలంలోని కొత్తపల్లితండాకు చెందిన భార్యాభర్తలు తమ ఏడునెలల చిన్నారితో పూణే నుంచి బైక్పై 670 కిలోమీటర్లు, 12 గంటల పాటు ప్రయాణించి గమ్యస్థానం చేరుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. తండాకు చెందిన విశాల్, లీలాబాయి పూణెలో టైల్స్ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. లాక్డౌన్ ఉండటంతో ఇంటికి రావాలని, తల్లిదండ్రులను చూడాలన్న తపనతో పలుమార్లు ప్రయత్నించారు. విఫలం కావటంతో చివరికి బైక్పై మంగళవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో పూణెలోని ఉథార్ నుంచి బయలుదేరి బుధవారం ఉదయం 10 గంటలకు తండాకు చేరుకున్నారు. ఆరోగ్యంగానే ఉన్నారని, 14 రోజులు హోం క్వారంటైన్లో ఉండాలని మండల అధికారులు సూచించారు. పాప కోసం : విశాల్ బస్సులో అందరితో కలిసి వస్తే చిన్నారికి ప్రమాదమని భావించి ఎవరూ చెప్పినా వినకుండా ధైర్యం చేసి బైక్పై బయలుదేరాం. 4 చోట్ల ఆగి చిన్నారికి పాలు తాగించి మేము తిన్నాం. ఊరికి రావాలన్న తపనతో ఎంత దూరం వచ్చామో తెలియలేదు. ఇక్కడకు వచ్చాక అందరూ మాట్లాడుతుంటే చిన్నారితో ఇంత దూరం బైక్పై రావటం నిజంగా సాహసమే అనిపిస్తోంది. -
కడుపులో శిశువు మాయమైందని..
సాక్షి, మానవపాడు (గద్వాల): కడుపులోని శిశువు మాయమైందని మండలంలోని చిన్నపోతులపాడుకు చెందిన ఓ మహిళ ఆదివారం స్థానిక పీహెచ్సీ వద్ద కలకలం సృష్టించింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన మంజుల తాను నిండు గర్భిణినని.. ప్రసవం కోసం శనివారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి మానవపాడు పీహెచ్సీకి వస్తుండగా దేవుడు కలలోకి వచ్చి ఇంటికి వెళ్లాలని సూచించటంతో తిరిగి వెళ్లాలని చెబుతోంది. ఆదివారం ఉదయం లేచేసరికి ఎలాంటి గర్భం లేదని, దీంతో తిరిగి ఆస్పతికి వచ్చానని తెలిపింది. పరీక్షించిన వైద్యులు నెల క్రితమే అబార్షన్ అయినట్లు నిర్ధారించారు. ఈ విషయమై వైద్యురాలు దివ్య మాట్లాడుతూ.. ఆ మహిళ చెప్పేది అవాస్తవమని అన్నారు. ఆమెకు మతిస్థిమితం తప్పినట్లుందని మహబూబ్నగర్కు తీసుకెళ్లి వైద్యుల పర్యవేక్షణలో సైకలాజికల్ ట్రిట్మెంట్ ఇప్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అవసరమైతే స్కానింగ్ తీయించాలని సూచించారు. విషయం తెలుసుకున్న జెడ్పీ చైర్పర్సన్ సరిత సెల్ఫోన్లో వైద్యులతో మాట్లాడి మెరుగైన మంజులకు చికిత్స అందించాలని కోరారు. అనంతరం మంజుల తల్లిగారి ఊరైన పెద్దపోతులపాడుకు వెళ్లి ఆమెను పరామర్శించారు. జెడ్పీ చైర్పర్సన్ వెంట నాయకులు చిన్న తిరుపతయ్య, పీఏసీఎస్ చైర్మన్ శ్రీధర్రెడ్డి, దామోదర్రెడ్డి, విజయ్భాస్కర్రెడ్డి, వెంకటేశ్వర్లు, భాస్కర్ ఉన్నారు. -
కలకలం రేపిన బార్బర్ పాజిటివ్ కేసు..
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: జోగుళాంబ గద్వాల జిల్లాలో పరిస్థితి రోజురోజుకు చేయి దాటిపోతోంది. ఆ జిల్లాలో కరాళనృత్యం చేస్తోన్న కరోనాను కట్టడి చేసేందుకు అధికార యంత్రాంగం విశ్వప్రయత్నాలు చేస్తున్నా.. ఈ ప్రాణాంతక వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తూనే ఉంది. ప్రతి రోజు పెరుగుతోన్న కేసులతో అధికారులు, ప్రజలే కాదూ రాష్ట్ర ప్రభుత్వమూ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. తాజాగా గురువారం మరో పది పాజిటివ్ కేసులు నమోదు కావడం కలకలం రేపింది. దీంతో ఆ జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 45కు చేరింది. గురువారం నమోదైన కేసుల్లో మోమిన్మహళ్లకు ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉన్నారు. వీరిలో 30 ఏళ్ల మహిళతో పాటు ఆమె తొమ్మిది, పన్నెండేళ్ల కుమారులు ఇద్దరు, ఆరేళ్ల కూతురున్నారు. సదరు మహిళ భర్తకు ఇది వరకే కరోనా పాజిటివ్ రాగా.. ప్రస్తుతం అతను గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని ద్వారా వీరికి వైరస్ సోకి ఉండొచ్చనే అనుమానంతో మూడు రోజుల క్రితమే నిర్ధారణ పరీక్షలు చేయగా వీరికీ పాజిటివ్ అని గురువారం తేలింది. దీంతో ఆ కుటుంబంలో కరోనా బాధితుల సంఖ్య ఐదుకు చేరింది. వైద్యవర్గాల్లో కలవరం.. గద్వాల ఏరియా ఆస్పత్రిలో బ్లడ్ బ్యాంక్లో విధులు నిర్వర్తిస్తోన్న ల్యాబ్ టెక్నిషియన్కూ పాజిటివ్ అని తేలింది. దీంతో అతనితో కలిసి ఆ ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తోన్న సిబ్బంది అందరూ ఉలికిపడ్డారు. సదరు ల్యాబ్ టెక్నిషియన్ కరోనా అనుమానితుల గొంతు, ముక్కు నుంచి నమూనాలు సేకరించేవాడు. వారితో ఇతనికి వైరస్ సోకినట్లు తెలుస్తోంది. సదరు టెక్నిషియన్ను గాంధీ ఆస్పత్రికి తరలించిన అధికారులు అతని కుటుంబ సభ్యులతో పాటు అతనితో సన్నిహితంగా ఉన్న వారందరినీ క్వారంటైన్కు తరలించారు. సహాయకులుగా సేవలందించే సిబ్బందికీ కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం ఇది వరకే ఆదేశించింది. ఆందోళనలో అధికార యంత్రాంగం రోజు రోజుకు పెరుగుతోన్న పాజిటివ్ కేసులను ఎలా కట్టడి చేయాలో తోచని స్థితిలో జిల్లా యంత్రాంగం కొట్టిమిట్టాడుతోంది. ఇప్పటికే మర్కజ్ లింకుతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోన్న క్రమంలో మరోవైపు కర్నూలులో వైద్య సేవలు పొందిన గద్వాల జిల్లా వాసులకు వైరస్ సోకడం ఆందోళనకు గురి చేస్తోంది. గద్వాలలో పరిస్థితిని అదుపులోకి తేవాలని ఇప్పటికే సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 22న రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సోమేశ్కుమార్, వైద్యారోగ్య ప్రత్యేక కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ మహేందర్రెడ్డి గద్వాలకు వచ్చి కలెక్టర్ శృతి ఓఝా, ఇన్చార్జ్ ఎస్పీ అపూర్వరావు, ఇతర జిల్లా అధికారులను దిశానిర్దేశం చేశారు. వారి పర్యటన మరుసటి రోజే ఏకంగా పది కేసులు నమోదు కావడం.. ఇంకా కేసుల సంఖ్య పెరిగే అవకాశాలుండడంతో వాటిని కట్టడి చేయడం అధికార యంత్రాంగానికి సవాలుగా మారింది. కాగా.. గురువారం 60 మంది నమూనాలకు సంబంధించిన ఫలితాలు రాగా, పది నిర్ధారణ అయ్యాయి. కలకలం రేపిన బార్బర్ పాజిటివ్ కేసు.. గద్వాల రాంనగర్కు చెందిన ఓ బార్బర్కి పాజిటివ్ వచ్చింది. మర్కజ్ వెళ్లి వచ్చిన వారికి కటింగ్, గడ్డం చేయడంతోనే వారి ద్వారా ఇతనికి వైరస్ సోకినట్లు అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. గత నెల ఢిల్లీ మర్కజ్ వెళ్లి వచ్చిన వారితో పాటు వారి కుటుంబసభ్యులు, సన్నిహితులు 40 మందికి లాక్డౌన్ కంటే ముందే కటింగ్ చేసినట్లు ప్రాథమికంగా తెలిసింది. ఇటీవల మర్కజ్ కేసుల సంఖ్య పెరగడంతో వారికి కటింగ్ చేసిన సదరు బార్బర్ని గుర్తించిన అధికారులు నాలుగు రోజుల క్రితమే అతడిని క్వారంటైన్కు తరలించారు. ఇతనికి కరోనా లక్షణాలు లేకున్నా.. ముందస్తు జాగ్రత్త నమూనాలు సేకరించి హైదరాబాద్కు పంపారు. అక్కడ నిర్వహించిన పరీక్షల్లో ఇతనికి పాజిటివ్ అని తేలింది. దీంతో ఇతని వద్ద కటింగ్ చేయించుకున్న ఆ ప్రాంత ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా.. బార్బర్ కుటుంబ సభ్యులనూ అధికారులు ముందస్తు జాగ్రత్తగా జిల్లాకేంద్రంలోని క్వారంటైన్కు తరలించారు. -
యువత.. పెడదోవ!
గద్వాల క్రైం: ఏ కుటుంబంలోనైనా వారి మధ్య సంబంధాలు బలంగా ఉంటేనే కుటుంబ వ్యవస్థ పదికాలాలపాటు నిలబడుతుంది. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబంలో ఆత్మీయ అనురాగాలు, అనుబంధాల మధ్య జీవనం సాగించేవారు.. ప్రస్తుత ఆధునిక యుగంలో ఉద్యోగాలు, వ్యాపారాల నిమిత్తం వివిధ ప్రాంతాల్లో స్థిరపడుతున్నారు. ఈ క్రమంలోనే కొందరు చెడుదారులు.. వ్యసనాలకుఅలవాటుపడి తమ విలువైన జీవితాలను చే జేతులా నాశనం చేసుకుంటున్నారు. జోగుళాంబ జిల్లాలోని గద్వాల, గట్టు, కేటీదొడ్డి, మల్దకల్, ధరూరు, అయిజ, ఇటిక్యాల, మానవపాడు, అలంపూర్, రాజోలి, శాంతినగర్ తదితర మండలాల్లో ఇటీవల చోటుచేసుకుంటున్న పలు హత్యలు ఈ విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయి. కార్తీక్ హత్యతో కలకలం.. గద్వాలకు చెందిన కార్తీక్ హత్య, మహబూబ్నగర్కు చెందిన ఓ వివాహిత ఆత్మహత్య ఘటనలు ఉమ్మడి జిల్లాలో కలకలం సృష్టించాయి. వివాహిత మొదట కార్తీక్తో అనంతరం రవికుమార్ సన్నిహితంగా ఉండడం.. చివరకు కార్తీక్ను అడ్డుతొలగించుకునేందుకు మిగతా ఇద్దరు పథకం పన్ని హత్య చేయడం, అనంతరం వివాహిత సైతం బలవన్మరణానికి పాల్పడ్డారు. అయితే ఈ కేసులో మొత్తం తొమ్మిది మంది యువకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన పలు కుటుంబాలను చిన్నాభిన్నం చేసింది. మరికొన్ని ఘటనలు ఇలా.. ♦ 2019 అక్టోబర్ 15న రాజోళి మండలం తాండ్రపాడుకు చెందిన ఓ మహిళ మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పర్చుకుంది. భర్తకు తెలిస్తే ప్రమాదమని తెలిసి.. మరొకరితో కలిసి భర్తనే హత్య చేయించింది. ఈ కేసులో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ♦ 2019 మే 7న కర్నూలుకు చెందిన ఇద్దరు వివాహేతర సంబంధం కలిగి ఉన్నారు. అయితే మహిళకు సంబంధించిన బంధువులు (వడ్డేపల్లి మండలంలోని కొంకల) ఇంటికి వచ్చి తిరుగు ప్రయాణంలో ఆటోలో వెళ్తుండగా రాజోళి శివారులో ఇద్దరిని సొంత కుమారుడే తన తల్లితోపాటు మరో వ్యక్తిని అందరూ చూస్తుండగానే వేట కొడవలితో హత్య చేశాడు. ♦ 2019 మార్చిలో కేటీదొడ్డి మండలానికి తిమ్మప్ప, పాతపాలెంకు చెందిన కొలిమి వె ంకటేష్లను వివాహేతర సంబంధం నేపథ్యంలో గు ర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. జల్సాలకు అలవాటుపడి.. ప్రస్తుతం కొందరు యువత ఆకర్షణకు లోనై.. జల్సాలకు, విలాసవంతమైన జీవనం సాగించాలనే దృక్పథంతో మెలుగుతున్నారు. తెలిసీ తెలియని వయస్సులోనే మద్యం, ఇతర అలవాట్లకు బానిసవుతున్నారు. సాంకేతికపరంగా అభివృద్ధి చెందుతున్న క్రమంలో స్నేహమంటూనే తమలోని విషం కక్కుతున్నారు. గంటల తరబడి చాటింగ్, ఫోన్ సంభాషణతో వారికి నచ్చిన కానుకలను ఇవ్వాలనే కుతూహలంతో తప్పటడుగులు వేస్తున్నారు. కట్టడి చేయాల్సిన తల్లిదండ్రులు సైతం పెద్దగా పట్టించుకోకపోవడం వీరికి కలిసొచ్చే అవకాశంగా మారింది. ఇంట్లో పెద్దలతో ఎలా మాట్లాడాలనే విషయాలు కుటుంబ సభ్యులు చెప్పకపోవడం సమస్యగా ఉంది. దీంతో అల్లరి తిరుగుడులు, చెడుస్నేహాలు, నీలి చిత్రాలు, మద్యం, గంజాయి, గుట్కా తదితర వ్యసనాలకు బానిసలై నేరస్థులుగా మారుతున్నారు. చదువుకోవాల్సిన వయస్సులో మధ్యలో చదువు మానేసి.. జులాయిగా తిరగడం అలవాటు చేసుకుంటున్నారు. జల్సాలకు చోటిస్తూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. సీరియల్స్ ప్రభావం తీవ్రమే.. ఆత్మీయ అనురాగాల మధ్య ఉండాల్సిన కుటుంబ వ్యవస్థ ప్రస్తుత పరిస్థితుల్లో వ్యతిరేకత ధోరణి ఉంది. నిత్యం టీవీలలో వచ్చే సీరియల్స్, సినిమాలలో జరుగుతున్న సంఘటనలు మానవాళి వ్యవస్థపై దుష్ప్రభావం చూపిస్తోంది. ఇంటిల్లిపాది చూడాల్సిన సిమాలు, సీరియల్స్ వస్తున్న దాఖలాలు లేవు. తెరపై వస్తున్న దృశ్యాలు మనుషుల మొదడులో నిర్లిప్తమవుతాయి. వినడం కంటే కనిపించే దృశ్యాలే చాలా వరకు హింసాత్మక ఘటనలకు దారితీస్తున్నాయి. మరోవైపు కాలంతో పరుగులు తీస్తున్నామనే ధోరణితో కుటుంబ సభ్యులు ఇంట్లోని అంశాలను మాట్లాడుకోవడం ఎక్కడా లేదు. దీంతో నేడు ఎన్నో కుటుంబాలు సరైన మార్గంలో లేక వ్యవస్థను పాతాళం వైపు తీసుకెళ్తున్నాయి. దీంతో పిల్లలను కుటుంబ సభ్యులు కట్టడి చేయడంలో నిర్లక్ష్యం వహించడంతో అనుకోని సమస్యలు చుట్టుముడుతున్నాయి. తగు చర్యలు తీసుకుంటాం.. జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఇక హత్యల విషయంపై పూర్తిస్థాయిలో దృష్టిసారించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. జిల్లాలో జరుగుతున్న హత్యలన్నీ అవగాహన లోపం, క్షణికావేశంలో జరుగుతున్నవే. వీటిపై పోలీస్ శాఖ తరఫున విస్తృతంగా అవగాహన కల్పిస్తాం. అలాగే నిఘా వ్యవస్థను పటిష్టం చేస్తాం. హత్య కేసులో ఎవరినీ ఉపేక్షించేది లేదు. – శ్రీనివాస్రెడ్డి, డీఎస్పీ -
అమ్మా.. దయ చూపమ్మా!
జోగుళాంబ శక్తిపీఠం (అలంపూర్): తాజాగా రాజకీయ నిరుద్యోగుల చూపంతా జోగుళాంబ అమ్మవారి దేవస్థానం పైపు పడింది. ఇటీవల స్థానిక ఎన్నికలలో ఆశపడి బంగపోయిన వారికంతా నామినేటెడ్ పదవులు ఇస్తామని బుజ్జగించడంతో ఇప్పుడు ఆ రాజకీయ నిరుద్యోగులంతా జోగుళాంబ అమ్మవారి దేవస్థానం కమిటీ వైపు చూస్తున్నారు. అయితే ప్రస్తుతం సహకార ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ ఎన్నికల పర్వం ముగిసిన అనంతరం దేవస్థానం కమిటీని ఏర్పాటు చేసే ఆలోచనలో పడ్డారు నియోజకవర్గ పెద్దలు. ఇదిలా ఉండగా, ఇక నియోజకవర్గ పెద్దలు దేవస్థానం ట్రస్టు బోర్డు విషయంలో ఎలాంటి పావులు కదిపినా చైర్మన్గా పీఠంపై ఎవరిని కూర్చోబెట్టాలనేది సీఎం కేసీఆర్ చేతుల్లోనే ఉంది. ఎందుకంటే ఈ ఏడాది తుంగభద్ర నదికి పుష్కరాలు రానున్న నేపథ్యంలో ఆధ్యాత్మిక చింతన కలిగిన మంచి పేరున్న వ్యక్తినే ఈ పదవిలో కూర్చోబెట్టాలని సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నట్టు దేవదాయ శాఖ అధికారులు భావిస్తున్నారు అక్రమాలకు చెక్ పెట్టేందుకు.. 2018 నవంబర్ 10వ తేదీన తిరుపతిరెడ్డి చైర్మన్గా పదవీ విరమణ కాలం ముగిసింది. దీంతో 16 నెలలుగా దేవస్థానానికి మళ్లీ ట్రస్టుబోర్డు నోటిఫికేషన్ వెలువడలేదు. నేటి దాక మళ్లీ రాష్ట్ర ప్రభుత్వం దేవస్థానం ట్రస్టు బోర్డు నియామకం చేపట్టలేదు. దీంతో పరిపాల భారమంతా కూడా కేవలం ఆలయ కార్యనిర్వహణ అధికారులపైనే పడింది. ప్రతినిత్యం ప్రముఖుల సందర్శనలతో కిక్కిరిసే ఈ ఆలయాలకు స్థానికంగా అందుబాటులో లేని కార్యనిర్వహణ అ«ధికారులతో పరిపాలన కూడా అస్తవ్యస్తంగా మారింది. పరిపాలన అధికారి స్థానికంగా లేకపోవడంతో ఆలయంలో సిబ్బంది పనితీరులో కూడా అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ఆలయాల్లో సమయపాలన పాటించని సిబ్బంది క్రమక్రమంగా అక్రమాలకు కూడా తెరతీశారు. భక్తుల ద్వారా మొక్కుబడుల రూపంలో దేవస్థానానికి వచ్చే బంగారు ఆభరణాలు ఈవో చేతిలో ఉండాల్సి ఉండగా, వాటి బాధ్యత కూడా అక్కడి సిబ్బందే నిర్వహిస్తున్నారు. ఇక ఇటీవల ఆలయంలో భక్తులకు వేలం పాట ద్వారా విక్రయించే చీరలు, భక్తులు అమ్మవారికి సమర్పించే వడిబియ్యంతో వచ్చే చిన్నపాటి బంగారు ముక్కుపుడకలు, మాంగళ్యాలు తదితర వాటిలో కూడా అక్రమాలు చోటు చేసుకుంటున్నాయనే ఆరోపణలు రాకపోలేదు. అంతేకాక ఆలయంలో గుర్తింపు పొందిన సిబ్బంది స్థానంగా ‘సేవ’ పేరిట నకిలీ ఉద్యోగులు కూడా అక్కడి కార్యక్రమాలు చక్కబెడుతూ రావడంతో దేవదాయ శాఖలోనే చర్చనీయాంశంగా మారింది. పదవిని దిక్కించుకునేందుకు యత్నాలు.. ఈ ఏడాది నవంబర్లో తుంగభద్ర నది పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని సీఎం కేసీఆర్ రానుండడంతో జోగుళాంబ అమ్మవారి దేవస్థానానికి ట్రస్టుబోర్డు సభ్యులుగా, చైర్మన్గా ఎవరిని నియామకం చేయాలనేది తేలనుంది. అయితే దేవస్థానం చైర్మన్ పోటీలో పాత చైర్మన్లు ఇద్దరు గట్టి పోటీలో ఉండగా, నూతనంగా కొత్త వారు కూడా తెరవెనక నుంచి పదవిని దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. -
తాగినంత మద్యం.. జేబునిండా డబ్బు
గద్వాల: మున్సిపల్ ఎన్నికల పుణ్యమా అని ఓటర్లకు వివిధ రాజకీయ పార్టీల నాయకులు తాగినంత మద్యం పోస్తూ.. ఆడిగినన్ని డబ్బులు ఇస్తున్నారు. ప్రస్తుతం ఓటరు చొప్పున విడదీస్తూ రూ.500 నుంచి రూ.2 వేల ముట్టజెప్పుతూ.. వారి ఓట్లను ఆశిస్తున్నారు. ఈ క్రమంలో ఆయా వార్డుల్లోని ఓటర్లను ఆకట్టుకునేందుకు నాయకులు, అభ్యర్థులు పడరాని పాట్లుపడుతున్నారు. ఎన్నికల ప్రచారం ప్రారంభమైనప్పటి నుంచే ఓటర్ల కోసం ఆయా పార్టీల అభ్యర్థులు, ముఖ్య నాయకులు మంతనాలు సాగిస్తూ తమ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరుతున్నారు. రాత్రికి రాత్రే వార్డుల్లో రహస్యంగా పర్యటిస్తూ మద్యం, డబ్బులను విచ్చలవిడిగా ఓటర్లకు అందిస్తున్నారు. ప్రస్తుత ఎన్నికల వాతావరణంలో ఓటర్లు సైతం నాయకులు, కార్యకర్తలను తమ ఇష్టాలకు ఉపయోగించుకుంటున్నారు. తమ ఇంట్లో ఇన్ని ఓట్లు ఉన్నాయంటూ అభ్యర్థులను నమ్మిస్తూ డబ్బులు ఆశిస్తున్నారు. అభ్యర్థులు సైతం అడిగిందే తడవుగా రూ.వేలు ఇచ్చేస్తున్నారు. డబ్బులు, మద్యంతోపాటు కాలనీల్లో యువకులకు అవసరమయ్యే క్రికెట్ కిట్లు, ఇతర వస్తు సామగ్రిని అభ్యర్థుల నుంచి బలవంతంగా అడిగి పుచ్చుకుంటున్నారు. మహిళలకు ఇంటికి వెళ్లి చీరలను అందజేశారు. ఓట్లను ఆశిస్తున్న అభ్యర్థులు సైతం కాదనకుండా అందిస్తున్నారు. పోలింగ్కు ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉండటంతో భారీగా ఓటర్లకు మద్యం అందజేసేందుకు.. రహస్యంగా మద్యం నిల్వలను ఇప్పటికే ఏర్పాటు చేశారు. ప్రధాన పార్టీలకు చెందిన ముఖ్య నేతలు వారి అనుచరుల ద్వారా డబ్బులు సైతం ఇప్పటికే వార్డుల్లోని బలమైన ఓటర్లుకు, వివిధ సంఘాలకు అందజేశారు. మరి కొంత నగదు అభ్యర్థులకు ఇచ్చి రాత్రివేళల్లో పంచడానికి ప్రణాళిక రూపొందించారు. దాదాపు అన్ని వార్డుల్లో ‘ఓటుకు నోటు’ అనే సంప్రదాయం కొనసాగుతోంది. డబ్బులు, మద్యాన్ని వివిధ పార్టీల అభ్యర్థులు ఎర చూపుతుండటంతో కార్యకర్తల్లో కూడా డబ్బుల సందడి స్పష్టంగా కనిపిస్తోంది. గద్వాల, అయిజ, అలంపూర్, వడ్డేపల్లి మున్సిపాలిటీల్లోని 77 వార్డుల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు డబ్బు, మద్యం, చీరలు పంచడానికి నిమగ్నమయ్యారు. ఇప్పటికే సగానికిపైగా వార్డుల్లో డబ్బులు పంపిణీ చేశారు. ‘మూడు నోట్లు.. ఆరు బాటిళ్లు’ అన్న చందంగా అభ్యర్థులు ఓటర్లను ఆకర్శిస్తున్నారు. ఫోన్లతో ఉక్కిరిబిక్కిరి.. ఇదిలా ఉండగా నాయకుల ఫోన్లు బిజీగా మారాయి. ఒక్కొక్క వార్డు నుంచి చోటామోటా నేతలు, కార్యకర్తలు, వివిధ సంఘాల నాయకుల నుంచి వచ్చే ఫోన్లతో అభ్యర్థులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ‘అన్నా ఇప్పుడే అవతలి పార్టీ వారు వచ్చి ఇక్కడ డబ్బు పంచారు..’ ‘అన్నా ఫలానా వారికి మందు సీసాలు సప్లయ్ చేయాలి..’ అన్న మాటలతో నేతల ఫోన్లు నిర్విరామంగా మోగాయి. ఎప్పటికప్పుడు అందుకు తగిన ఏర్పాట్లు చేస్తూ గెలుపే లక్ష్యంగా తొక్కాల్సిన దొడ్డి దార్లన్నీ అభ్యర్థులు తొక్కేశారు. -
‘ముస్లింలను టీఆర్ఎస్ సర్కార్ మోసం చేసింది’
సాక్షి, జోగులాంబ గద్వాల: ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ ఇస్తామని.. టీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని మాజీ మంత్రి డీకే అరుణ మండిపడ్డారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. గతంలో ఇచ్చిన హామీలపై ప్రజలు ప్రశ్నిస్తారని కేసీఆర్, కేటీఆర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారని ఆమె విమర్శించారు. మైనారిటీలకు కేటాయిస్తున్న నిధులను ప్రభుత్వం ఖర్చు చేయలేదని డీకే అరుణ ధ్వజమెత్తారు. ఓటమి భయంతోనే కేసీఆర్ కులమతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: మున్సిపల్ ఎన్నికల్లో ఆ ఇద్దరికీ సవాలే..! రాజకీయ లబ్ది కోసం బీజేపీపై టీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని డీకే అరుణ మండిపడ్డారు. టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేసే దిశలో లేదన్నారు. టీఆర్ఎస్కు ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలు అందకుండా నిలిపివేస్తామని.. ప్రజలను టీఆర్ఎస్ నాయకులు బెదిరిస్తున్నారని ఆమె ఫైర్ అయ్యారు. పింఛన్లు ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం వద్ద నిధులు లేవని డీకే అరుణ దుయ్యబట్టారు. మున్సిపాలిటీల అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమవుతుందని డీకే అరుణ స్పష్టం చేశారు. -
అరుదైన ఖురాన్.. ఏడాదిలో ఒకసారి బయటికి..
సాక్షి, గట్టు (గద్వాల): సుమారు 238 ఏళ్ల నాటివిగా భావిస్తున్న అరుదైన.. అగ్గి పెట్టేకన్నా చిన్న సైజులోని పవిత్ర ఖురాన్ గ్రంథాలను మిలాదున్ నబీ సందర్భంగా బయటకు తీశారు. గట్టులోని జామీయా మసీదు, బిచ్చాలపేటలోని మసీదులో ఈ గ్రంథాలు ఉండగా.. ఏడాదిలో ఒకేఒక్క సారి మాత్రమే బయటకు తీస్తారు. మొత్తం 480 పేజీలు... 30 పారే (పర్వాలు)లు ఈ గ్రంథంలో ఉన్నాయి. ఇందులోని అక్షరాలను భూతద్దం ద్వారా చూస్తేనే కంటికి కన్పిస్తాయి. ఇక్కడి ముస్లింలు తరతరాలుగా ఈ గ్రంథాలను పవిత్రంగా బావిస్తూ, భద్రపరుస్తూ వస్తున్నారు. ఖురాన్ను మంత్రోచ్ఛరణల మధ్య మత పెద్దలు బయటకు తీస్తారు. కేవలం కొద్ది నిమిషాలు మాత్రమే సందర్శనార్థం ఉంచి మళ్లీ లోపల భద్రపరుస్తారు. ఈ గ్రంథాన్ని దర్శించుకుంటే సర్వ పాపాలు తొలగిపోతాయనేది ఇక్కడి వారి నమ్మకం. మొగల్ కాలం నుంచి.. మొగల్ చక్రవర్తి ఔరంగజేబు కాలంలో గట్టులో జామీయా మసీదును నిర్మించినట్లుగా స్థానిక ముస్లిం మత పెద్దలు చెబుతున్నారు. తరతరాలుగా ఈ అతి చిన్న పరిమాణం (ఇంచున్నర) ఉన్న ఖురాన్ గ్రంథాన్ని ఎంతో భక్తితో, జాగ్రత్తగా మసీదులో భద్రపరుస్తున్నారు. మక్కా, మదీనా నుంచి ఈ గ్రంథంతో పాటు ఆసర్ ముబారక్ (మహమ్మద్ ప్రవక్త వెంట్రుక) తీసుకువచ్చారని పేర్కొన్నారు. ప్రతీ ఏడాది వీటిని దర్శించుకునేందుకు ఇతర ప్రాంతాలకు చెందిన ముస్లీంలు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. -
కోడిపెట్ట.. రెండు గుడ్లెట్టా?
సాక్షి, ఇటిక్యాల (అలంపూర్) : ఎక్కడైనా ఒక కోడిపెట్ట గుడ్డు పెట్టిన తర్వాత 24 గంటలకు మరో గుడ్డు పెడుతుంది. కానీ మండల కేంద్రంలోని హుస్సేన్కు చెందిన ఓ కోడిపెట్ట శనివారం ఒకే సమయంలో రెండు గుడ్లు పెట్టింది. ఒకటి సాధారణ సైజులో ఉండగా.. మరొకటి చిన్నసైజులో ఉంది. ఒకే సమయంలో కోడి రెండు గుడ్లను, అది ఒకటి చిన్నదిగా, మరొకటి సాధారణ సైజులో పెట్టడంతో స్థానికులు ఆసక్తిగా తిలకించారు. ఈ విషయమై పశువైద్యాధికారి రమేష్ను సంప్రదించగా.. ఇది అరుదైన సంఘటన అని, జన్యులోపంతో ఇలాంటివి జరుగుతాయన్నారు. -
నడిగడ్డను దోచుకున్నారు..
గద్వాల అర్బన్: గడిచిన 70 ఏళ్లలో నడిగడ్డ అన్నిరంగాల్లో దోపిడీకి గురైందని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఇక్కడి పాలకులు ఏసీ కార్లలో తిరుగుతుండగా ప్రజలు వలస పోతున్నారన్నారు. ప్రభుత్వం పెంచిన ఆసరా పింఛన్ల మంజూరు పత్రాలు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం శనివారం జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి శ్రీనివాస్గౌడ్ హాజరై మాట్లాడారు. మా పూర్వీకులు అలంపూర్ వాసులని, నడిగడ్డతో నాకు దగ్గర సంబంధాలు ఉన్నాయని వివరించారు. రెండు జీవ నదుల మధ్య ఉన్న ఇక్కడి ప్రజలు ఇంకా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడానికి గత పాలకుల దోపిడీనే కారమణ్నారు. సీఎం కేసీఆర్ జిల్లా అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ వహించారన్నారు. తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం శరవేగంగా పూర్తి చేసి అలంపూర్ ప్రజలకు తాగు, సాగునీరు అందిస్తున్నామన్నారు. అలాగే గట్టు ఎత్తిపోతలకు శంకుస్థాపన చేశామని, వచ్చే ఐదేళ్లలో నిర్మాణం పూర్తి చేసి కోనసీమను తలపించేలా ఈ ప్రాంతం పచ్చని పైర్లతో కళకళలాడుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. వృద్ధులను ఆదరిస్తున్నారు.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం వృద్ధులు, వితంతులకు రూ.2 వేలు, వికలాంగులకు రూ.3 వేల ఆసరా పింఛన్లు ఇస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ఇన్నాళ్లు నిరాధారణకు గురైన వృద్ధులను ఆసరా పింఛన్లతో ప్రతి ఇంట్లో కొడుకులు, మనువళ్లు ఆదరిస్తున్నారన్నారు. గతంలో బోర్లు ఉంటే కరెంట్ ఉండేది కాదని, కరెంట్ ఉంటే ఎరువులు, విత్తనాలు ఉండేవి కావన్నారు. వ్యవసాయం దండగ అని భావించి వ్యవసాయాన్ని వదిలేస్తున్న సమయంలో సీఎం కేసీఆర్ రైతు పెట్టుబడి సాయం పథకం అమలు చేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో రైతు సగర్వంగా వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడని చెప్పారు. అలాగే పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతలతో బీడు భూములకు నీళ్లు మళ్లించే ఉద్యమం కేసీఆర్ నాయకత్వంలో అడుగులు పడుతున్నాయన్నారు. నూతన మున్సిపల్ చట్టంతో సేవలు ప్రజలకు మరింత చేరువ అవుతాయన్నారు. గద్వాలను పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు. గద్వాల– మాచర్ల రైల్వేలైన్కు కృషి గద్వాల– మాచర్ల రైల్వేలైన్ నిర్మాణానికి శాయశక్తులా కృషిచేస్తానని ఎంపీ రాములు అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశంపై ప్రస్తావించానని గుర్తు చేశారు. ఏ దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలతో సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తు న్నారన్నారు. అభివృద్ధిలో నియోజకవర్గాన్ని అగ్రభాగాన నిలబెట్టేందుకు ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డితో పనిచేస్తానన్నారు. ఓటు బ్యాంకుగానే చూశారు.. గత పాలకులు ఇక్కడి ప్రజలను కేవలం ఓటు బ్యాంకుగానే చూశారని ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి విమర్శించారు. 40 ఏళ్లు ఒకే కుటుంబం పాలించి వారి ఆస్తులు పెంచుకున్నారని, కానీ ప్రజల కష్టాలు తీర్చలేదన్నారు. సుమారు 10 వేల మంది మహిళలకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా నియోజకవర్గంలో చిన్నతరహా, కుటీర పరిశ్రమలు స్థాపిస్తానని, అందుకు అడుగులు ప్రారంభమయ్యాయని చెప్పారు. త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ను ఆశీర్వదించి కేసీఆర్ రుణం తీర్చుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆసరా పింఛన్ల మంజూరు పత్రాలు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎంపీ రాములు చేతుల మీదుగా అందజేశారు. అంతకు ముందు ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి మంత్రి శ్రీనివాస్గౌడ్కు పౌర సన్మానం చేశారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ సరిత, రాష్ట్ర వినియోగదారుల ఫోరం చైర్మన్ గట్టు తిమ్మప్ప, కలెక్టర్ శశాంక, ఆర్డీఓ రాములు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేశవ్, జెడ్పీ మాజీ చైర్మన్ భాస్కర్, జెడ్పీ వైస్ చైర్పర్సన్ సరోజమ్మ, ఎంపీపీలు నజీమా ఉన్నీసాబేగం, మనోహరమ్మ, తిరుమల్రెడ్డి, రాజారెడ్డి, విజయ్కుమార్, జెడ్పీటీసీ సభ్యులు పద్మ, శ్యామల, రాజశేఖర్, ప్రభాకర్రెడ్డి, సర్పంచ్ జ్యోతి, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
గద్వాల మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
జోగులాంబ : గద్వాల మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన 1999లో మొదటిసారి గద్వాల నియోజకవర్గంనుంచి టీడీపీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004 వరకు ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలందించారు. ప్రముఖుల సంతాపం గద్వాల మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడు మృతిపట్ల తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.. అబ్కారీ, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్.. గద్వాల టీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డిలు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబసభ్యులకు తమ సానుభూతి తెలియజేశారు. -
‘టికెట్ల’ సందడి షురూ..
సాక్షి, నాగర్కర్నూల్: లోక్సభ ఎన్నికలకు షెడ్యూల్ రావడంతో రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు వేగవంతం చేశాయి. ప్రధాన పార్టీలకు చెందిన ఆశావహులు తమ యత్నాలను ముమ్మరం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయాన్ని సొంతం చేసుకుని సత్తా చాటిన టీఆర్ఎస్ నాగర్కర్నూల్ ఎంపీ స్థానాన్ని సైతం తన ఖాతాలో వేసుకోవాలన్న లక్ష్యంతో ముందుకెళుతోంది. అభ్యర్థి ఎంపిక విషయంలోనూ ఆచితూచి అడుగులు వేస్తోంది. అలాగే మూడు పర్యాయాలు వరుసగా విజయఢంకా మోగిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఈసారీ తన ఖాతాలోనే జమ చేసుకోవాలని చూస్తోంది. అభ్యర్థిగా పోటీ చేయాలనుకునే ఆశావహులు అధికంగా ఉండటంతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. రెండు, మూడు రోజులుగా సంపత్కుమార్, మల్లు రవి, సతీష్మాదిగల పేర్లు వినపడగా తాజాగా తెరపైకి మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ వచ్చారు. అభ్యర్థుల ఎంపికకు కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఈ నియోజకవర్గానికి 14సార్లు ఎన్నికలు జరిగితే కేవలం రెండుసార్లు మాత్రమే స్థానికులకు అవకాశం వచ్చింది. మిగతా 12సార్లు స్థానికేతరులకే పార్టీలు అవకాశం కల్పించాయి. ఈసారి స్థానికులకే టికెట్లు కేటాయించాలనే డిమాండ్లు పెరిగాయి. ప్రధాన పార్టీలు ఎవరిని అభ్యర్థులుగా నిలుపుతారనేది ఉత్కంఠ నెలకొంది. ఒకవైపు కాంగ్రెస్, టీఆర్ఎస్ అభ్యర్థుల ఎంపిక విషయంలో కసరత్తు చేస్తుండగా బీజేపీ, ఇతర పార్టీలకు సంబంధించి ఎలాంటి హడావుడి కనిపించడం లేదు. సత్తా చాటేందుకు టీఆర్ఎస్ సిద్ధం ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో నాగర్కర్నూల్ ఎంపీ పరిధిలోని ఏడింటికిగాను ఆరు నియోజకవర్గాల్లో గులాబీ జెండాను ఎగురవేసి టీఆర్ఎస్ మంచి జోష్లో ఉంది. ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లోనూ తన సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. అందులో భాగంగానే ఈనెల 9న నాయకులు, కార్యకర్తలతో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సారథ్యంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఇప్పటికే అభ్యర్థుల ఎంపికకు కసరత్తు ప్రారంభించారు. వివిధ సర్వేలు చేయించి అభ్యర్థి విషయంలో స్పష్టతకు వచ్చినట్టు సమాచారం. మాజీ మంత్రి పోతుగంటి రాములు లేదా ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మందా జగన్నాథం లేదా గాయకుడు సాయిచంద్ను బరిలో నిలపాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. అయితే మూడు పర్యాయాలుగా ఇక్కడ టీఆర్ఎస్ విజయం సాధించలేకపోయింది. ఈసారి ఎలాగైనా పాగా వేయాలనే దిశగా ప్రణాళికలు రచిస్తున్నారు. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లోనూ విజయం సాధిం చాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్న ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. 36మంది దరఖాస్తులు చేసుకోగా ఐదుగురి పేర్లను మాత్రం ఏఐసీసీకి పంపినట్టు సమాచా రం. ముఖ్యంగా సతీష్మాదిగ, మల్లు రవి, మాజీ ఎమ్మెల్యే సంపత్కుమార్ పేర్లు వినిపిం చాయి. తాజాగా మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజ నర్సింహ పేరు తెరమీదికి వచ్చింది. వీరిలో ఎవరు బరిలో ఉంటారనేది త్వరలో తేలనుంది. నాగర్కర్నూల్ ఎంపీ పరిధిలోని ఏడు అ సెంబ్లీ నియోజకవర్గాల్లో కేవలం కొల్లాపూర్లో మాత్రమే ఇటీవల కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం గమనార్హం. స్థానికేతరులే అత్యధికం 1962 నుంచి 2014 వరకు 14సార్లు జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఎంపీలుగా గెలిచిన వారిలో పార్టీలకతీతంగా స్థానికేతరులే ఎక్కువగా ఉన్నారు. వీరిలో రాజారామేశ్వర్రావు (వనపర్తి), ముత్యాలరావు (తిరుమలగిరి), భీమ్షాదేవ్ (హైదరాబాద్), మల్లు అనంతరాములు (వైరా మండలం–ఖమ్మం), మల్లు రవి (వైరా మండలం–ఖమ్మం), మందా జగన్నాథం (ఇటిక్యాల మండలం–అలంపూర్), నంది ఎల్లయ్య (మెదక్ జిల్లా) ఉన్నారు. కేవలం మందా జగన్నాథం మాత్రమే స్థానికుడు. మిగతావారంతా స్థానికేతరులే. కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు తొమ్మిది పర్యాయాలు విజయం సాధించగా టీపీఎస్ ఒకసారి, నాలుగు పర్యాయాలు టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. -
వంతెనల నిర్మాణాలు పూర్తయ్యేనా!
సాక్షి, అలంపూర్: ప్రజల సౌకర్యార్థం చేపడుతున్న ప్రభుత్వ పనులు ఏళ్ల తరబడిగా కొనసాగుతున్నాయి. నిర్మాణ పనులు నత్తనడకన సాగుతుండటంతో వాటితో కలిగే ప్రయోజనాలు ఏమో కానీ వాహనదారులు మాత్రం రోజూ నరకయాతన అనుభవిస్తున్నారు. నిర్మాణాలకు నిర్ధేశించిన గడువు ఉన్నప్పటికీ పనులు చేపడుతున్న సంస్థలు పట్టించుకోవడం లేదు. దీంతో నిర్మాణాలు ఏళ్ల తరబడిగా కొనసాగుతున్నాయి. అలంపూర్ రోడ్డు మార్గంలోని నిర్మిస్తున్న రెండు ప్రధాన బ్రిడ్జిలతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పనులు నత్తనడకన సాగుతుండటంతో ఈ మార్గంలో రోజు రాకపోకలు సాగిస్తున్న వాహనదారులతో పాటు అలంపూర్ క్షేత్రానికి వచ్చే యాత్రికులకు కష్టాలు తప్పడం లేదు. మూడేళ్లుగా నిర్మాణంలోనే.. అలంపూర్–అలంపూర్ చౌరస్తా ప్రధాన రోడ్డు మార్గంలో రెండు బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నారు. వాగుపై నిర్మించిన కల్వర్టులు రోడ్డు కంటే తక్కువ ఎత్తుకు చేరడంతో వాహనదారులకు ఇబ్బంది కలిగించేవి. దీనికి తోడు వర్షాకాలం వస్తే కల్వర్టుల వద్ద వర్షపు వరద నీరు రోడ్డుపైకి చేరి వాహనరాకపోకలను నియంత్రించే పరిస్థితి ఉండింది. దీంతో భైరాపురం స్టేజీ సమీపంలోని కల్వర్టును తొలగించి రూ. కోటి నిధులతో నూతనంగా బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నారు. అదేవిధంగా ఇమాంపురం గ్రామం వద్ద ఉన్న కల్వర్టును తొలగించి రూ.2.75 కోట్ల వ్యయంతో బ్రిడ్జి నిర్మాణం కొనసాగిస్తున్నారు. వీటిలో బైరాపురం వద్ద మూడేళ్ల క్రితం పనులు ప్రారంభించారు. ఇమాంపురం వద్ద రెండేళ్లుగా పనులు కొనసాగుతున్నాయి. డైవర్షన్ రోడ్లతో.. కల్వర్టుల స్థానంలో వంతెనల నిర్మాణం చేపడుతుండటంతో వాహనరాకపోకలకు పక్కనే తాత్కాలిక రోడ్డును ఏర్పాటు చేశారు. పనులు ఏళ్ల తరబడిగా సాగుతుండటంతో తాత్కలికంగా వేసిన రోడ్డు గుంతలమయంగా మారింది. వాహనాలు వచ్చి వెళ్లే క్రమంలో దుమ్మ అధికమైంది. అలం పూర్ పుణ్యక్షేత్రం కావడంతో ఈ మార్గం గుండా రోజుకు వందల మంది భక్తులు రాకపోకలు సాగిస్తారు. నియోజకవర్గ కేంద్రం కావడంతో వివిధ గ్రామాల ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర పనులు చక్కబెట్టుకోవడానికి వస్తూ.. ఉంటారు. కానీ ఈ మార్గంలోని రెండు బ్రిడ్జిల వద్ద పనులు ఏళ్లతరబడిగా కొనసాగుతుండటం తో కష్టాలు పడుతున్నారు. అధికారులు స్పం దించి సకాలంలో పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు. ఇబ్బందులు పడుతున్నాం అలంపూర్ నుంచి ప్రతి నిత్యం వివిధ పనుల కో సం ఈ మార్గం ద్వారానే ప్రయాణం సాగిస్తున్నాం. కానీ మూడేళ్లుగా బ్రిడ్జి పనులు కొనసాగుతుండటంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. డైవర్షన్ రోడ్డు అధ్వానంగా మారడంతో వాహనదారులు ప్రమాదాలకు గురువుతున్నారు. – బంగారు లక్ష్మణ్, అలంపూర్ నిర్లక్ష్యం వీడాలి అలంపూర్ ప్రఖ్యాతి గాంచిన పుణ్య క్షేత్రం. దేశంలోని వివిధ ప్రాం తాల నుంచి భక్తులు వస్తుంటారు. కానీ ఈ మార్గంలో మాత్రం బ్రిడ్జిల నిర్మాణం ఏళ్ల తరబడిగా కొనసాగుతున్నాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఈ మార్గం గుండా ప్రయాణం చేయడానికి ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు ఇప్పటికైనా నిర్లక్ష్యం వీడి పనులు త్వరగా పూర్తిచేయాలి. – శ్యాంసుందర్రావు, వేముల -
బైక్పై వెళ్లి.. పుట్టిలో తిరిగొచ్చి..
గద్వాల రూరల్: ముందస్తు ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల పరిశీలనలో అధికారులు నిమగ్నమయ్యారు. ఈ సందర్భంగా జోగుళాంబ గద్వాల జిల్లా గద్వాల మండలం కృష్ణా నది మధ్యలో ఉన్న గుర్రంగడ్డ గ్రామంలోని పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ శశాంక ఆదివారం పరిశీలించారు. గ్రామానికి వెళ్లేందుకు సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో జాతీయ రహదారి నుంచి బైక్పై ప్రయాణించి గ్రామానికి చేరుకున్నారు. గ్రామంలోని కేంద్రం వద్ద తాగునీరు, విద్యుత్, మూత్రశాలలు, దివ్యాంగుల కోసం ర్యాంపు ఏర్పాటు చేయించాలని తహసీల్దార్ జ్యోతిని ఆదేశించారు. తిరుగు ప్రయాణంలో ఆయన గుర్రంగడ్డ నుంచి పుట్టీలో బీరెల్లి మీదుగా ప్రయాణించి తర్వాత గద్వాలకు చేరుకున్నారు. -
ఎన్నికల వేల నగదు పట్టివేత
సాక్షి, జోగులాంబ : రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అక్రమంగా తరలిస్తున్న నగదును తరలిస్తున్నారు. ఐజ మండలంలో తెల్లవారు జామున 5 గంటలకు ప్లైయిండ్ స్క్వాడ్ బృందం చేసిన తనిఖీల్లో ఐదు లక్షలను గుర్తించారు. ఐజ పట్టణానికి చెందిన షాలు అనే వ్యక్తి వాహనాన్ని తనిఖీ చేయగా అతని వద్ద ఏ డాక్యుమెంట్స్ లేని ఐదు లక్షలు రూపాయలను సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. బతుకమ్మ చీరెల లారీని అడ్డుకున్న స్థానికులు ఖమ్మం : బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తయారు చేయించిన బతుకమ్మ చీరెలను తీసుకెళ్తున్న లారీని స్థానికులు అడ్డుకున్నారు. బతుకమ్మ చీరెలు అని స్పష్టంగా రాసి ఉన్నట్టు స్థానికులు పేర్కొన్నారు. కొత్తగూడెం చేరవేయమని చెప్పారని డ్రైవర్ చెప్పుకొచ్చాడు. చౌటుప్పల్లో చీరెలను లోడ్ చేసినట్టు తెలుస్తోంది. -
భార్య అన్నం పెట్టలేదని భర్త ఆత్మహత్య
శాంతినగర్ (అలంపూర్) : త్వరగా అన్నం పెట్టలేదని భార్యతో గొడవపడ్డాడు ఆ యువకుడు. మద్యం మత్తులో పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన వడ్డేపల్లి మండలం రామాపురంలో చోటుచేసుకుంది. ఏఎస్ఐ నర్సింహారెడ్డి తెలిపిన వివరాలిలా.. అదే గ్రామానికి చెందిన కుర్వ సోమశేఖర్ (24) వృత్తి రీత్యా ట్రాక్టర్ డ్రైవర్. ఈ మద్య తాగుడకు బానిసయ్యాడు. సోమ వారం రాత్రి 10 గంటల ప్రాంతంలో మద్యం తాగి ఇంటికి వచ్చాడు. భోజనం పెట్టమని భార్యను అడిగాడు. బాబు ఏడుస్తున్నాడు.. కాస్త ఆగని ఓదార్చిన తర్వాత ఆలస్యంగా వచ్చింది. అంతే మత్తులో ఏం చేస్తున్నాడో అర్థం కాక బయటికి వెళ్లిన సోమశేఖర్ పురుగుల మందు తాగాడు. కాసేపటి తర్వాత విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు హుటాహుటిన చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యం అందిస్తుండగానే చనిపోయాడు. తండ్రి కుర్వ నాగన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఏఎస్ఐ తెలిపారు. ఇదిలాఉండగా మృతునికి భార్య శిరీషతోపాటు ఓ కుమారుడు ఉన్నారు. -
డ్రైవర్ నిద్రమత్తు.. ట్రావెల్స్ బస్సుకు ప్రమాదం..!
సాక్షి, జోగులాంబ గద్వాల : ఇటిక్యాల మండలం కొండేరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆరెంజ్ ట్రావెల్స్కు చెందిన బస్సు తిరుపతి నుంచి హైదరాబాద్కు వస్తుండగా బోల్తా పడింది. బస్సులో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు కాగా మరో 40 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. డ్రైవర్ నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. -
జోగుళాంబ క్షేత్రంలో హైకోర్టు జడ్జి
జోగుళాంబ శక్తిపీఠం (అలంపూర్): తెలంగాణ రాష్ట్రంలోని ఏకైక శక్తి పీఠం అలంపూర్ శ్రీ జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను ఆదివారం హైకోర్టు జడ్జి వెంకటశేష సాయి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ మేరకు వారికి ఆలయ ఈఓ నరహరి గురురాజ ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. ముందుగా ప్రధాన ఆలయమైన బాలబ్రహ్మేశ్వరుడికి ఏకవార రుద్రాభిషేకాలు నిర్వహించారు. అనంతరం జోగుళాంబ అమ్మవారికి శ్రీచక్రార్చనలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వారకి క్షేత్ర ప్రాశస్త్యం తెలియజేశారు. తీర్థ, ప్రసాదాలు అందజేసి శేషవస్త్రాలతో వారిని సత్కరించారు. వీరి వెంట కర్నూలు జిల్లా జడ్జి అననుపమచ్రక్రవర్తి, కర్నూలు అడిషనల్ జిల్లా జడ్జి శ్యాంప్రసాద్, కర్నూలు సీనియర్ సివిల్ జడ్జి శ్రీనివాస్ రావు, అలంపూర్ జూనియర్ సివిల్ జడ్జి ఏ.రాధిక, ఎస్.ఐ గడ్డంకాశి , ఏ.ఎస్.ఐ సుబ్బారెడ్డి కోర్టు జూనియర్ అసిస్టెంట్ చిన్నరాజు, పుష్పప్రియ, గిరి ఉన్నారు. -
అంగన్వాడీల్లో ఆడిట్
గద్వాల అర్బన్ : అంగన్వాడీ కేంద్రాలను మరింత పటిష్టం చేసేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఆడిట్ చేపట్టి ఈ వ్యవస్థను చక్కదిద్దేందుకు జిల్లా అధికారులు యత్నిస్తున్నారు. ఈపాటికే సామాజిక తనిఖీ చేయాల్సిన అంగన్వాడీ కేంద్రాల జాబితాను ఉన్నతాధికారులకు పంపించారు. ఈ నెలాఖరులో లేదా వచ్చే నెల మొదటి వారంలో ఎంపిక చేసిన అంగన్వాడీ కేంద్రాల్లో ఏకకాలంలో ఈ తనిఖీలు కొనసాగుతాయి. ఈ సామాజిక తనిఖీలో భాగంగా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి తప్పొప్పులను నమోదు చేస్తారు. ముఖ్యంగా చిన్నారుల సంఖ్య, ఆరోగ్యలక్ష్మి, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం పంపిణీ, రోజువారీ కేంద్రం రికార్డుల నిర్వహణ, చిన్నారులకు ఆటపాటలు సక్రమంగా జరుగుతున్నాయా లేదా అనేది క్షుణ్ణంగా పరిశీలిస్తారు. అన్ని కోణాల్లో తనిఖీ నిర్వహించి నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి విచారణ చేస్తారు. రికార్డుల్లో అంగన్వాడీ టీచర్లు నమోదు చేసిన మేరకు వారికి పౌష్టికాహారం అందిందో లేదో ఆరా తీస్తారు. అనంతరం గ్రామసభ ఏర్పాటుచేసి కేంద్రం అందించాల్సిన సేవలు, దస్త్రాల్లోని వివరాలు, లబ్ధిదారుల సంఖ్యను ప్రజల సమక్షంలో వెల్లడిస్తారు. అప్పుడే అసలు విషయం బయటపడుతుంది. చిన్నారుల సంఖ్యను రికార్డుల్లో ఎక్కువగా చూపి, పోషకాహారం పంపిణీ చేసినట్టు తేలిన కేంద్రాల టీచర్లపై చర్యకు ఉపక్రమిస్తారు. అంగన్వాడీ టీచర్లలో గుబులు జిల్లా పరిధిలో గద్వాల అర్బన్, మానవపాడు, మల్దకల్ ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి పరి«ధిలో 713అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఈ ఏడాది 67 చోట్ల తనిఖీ నిర్వహించనున్నారు. గతేడాది అక్టోబర్లో 44 చోట్ల తనిఖీలు చేపట్టి అవకతవకలకు పాల్పడిన గద్వాల ప్రాజెక్టు పరిధిలోని ముగ్గురు అంగన్వాడీ టీచర్లపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈసారి చేపట్టే తనిఖీలు ఇంకా పకడ్బందీగా ఉంటాయని సమాచారం. సామాజిక తనిఖీలు చేపట్టే కేంద్రాల జాబితాను ఐసీడీఎస్ అధికారులు బయటకు పొక్కనీయకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏ చిన్న తప్పు జరి గినా వేటు వేసే అవకాశం ఉంది. దీంతో సమయంపాలన పాటించని, పౌష్టికాహారం సక్రమంగా పంపిణీ చేయని అంగన్వాడీ టీచర్లలో గుబు లు రేపుతోంది. ఇప్పటికే కొందరు సిబ్బంది ఆయా రికార్డులను సరిచేసే పనిలో నిమగ్నమయ్యారు. -
హామీలు నెరవేర్చడంలో సీఎం విఫలం
రాజోళి (అలంపూర్): టీఆర్ఎస్ ప్రభుత్వం మాటల గారడితో పని చేస్తుందని.. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని.. రానున్న రోజుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, కేసీఆర్ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలేదని ఎమ్మెల్యే సంపత్కుమార్ అన్నారు. శాంతినగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నడిగడ్డను అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని, అలంపూర్లోని ఆయకట్టుకు నీరందించి, అభివృద్ధి చేస్తానని చెప్పిన సీఎం కేసీఆర్ నడిగడ్డ పర్యటనలో భాగంగా తుమ్మిళ్లలో కనీసం ప్రజలతో మాట్లాడకపోవడం దారుణమన్నారు. గద్వాలలో జరిగిన బహిరంగ సభలో తమ పార్టీకి చెందిన ఒక నాయకుడిని ఎత్తిచూపి, డీకే అరుణను తగ్గించి చూపే ప్రయత్నం చేశారని.. దీనిని ప్రజలు గమనిస్తున్నారన్నారు. నిజంగానే టీఆర్ఎస్ ప్రభుత్వానికి నియోజకవర్గ ప్రజల మీద ప్రేమ ఉంటే ఎందుకు సమావేశం కాలేదని, గతంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని, జీఓలు కాని, ప్రస్తుతం తాలూకాకు ఏమీ చేస్తున్నామో ఎందుకు ప్రస్థావించలేదని ప్రశ్నించారు. ప్రస్తుతం టీఆర్ఎస్లో ఉన్న ప్రధాన నాయకులంతా గతంలో ఆర్డీఎస్ పరిరక్షణ సమితిలో ఉన్న తాను దీక్ష చేయగా.. సంఘీభావం తెలిపారని గుర్తు చేశారు. ఆర్డీఎస్ సమస్యను పరిష్కరించేది కేవలం సంపత్కుమారేనని అన్నారని, ఇప్పుడు టీఆర్ఎస్లో చేరి అవకాశవాదులుగా మారి అడ్డగోలుగా వాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులు జగన్గౌడ్, నర్సింహారెడ్డి, పచ్చర్ల వీరేష్, రామకృష్ణారెడ్డి, షేక్షావళి, మద్దిలేటి, ప్రకాష్గౌడ్, నేతాజీ తదితరులు పాల్గొన్నారు. -
జోన్ల లొల్లి.. వికారాబాద్ బంద్
సాక్షి, వికారాబాద్ : తమ జిల్లాను జోగులాంబ జోన్లో కలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం వికారాబాద్ జిల్లాలో కాంగ్రెస్ నాయకులు బంద్ చేపట్టారు. ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బంద్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పరిగి బస్ డిపో ముందు బైఠాయించడంతో బస్సులు డిపొకే పరిమితమయ్యాయి. వివిధ రాజకీయ పార్టీలు, ఉద్యోగ సంఘాలు జిల్లా బంద్లో పాల్గొన్నాయి. కాగా, జోన్ల విషయంలో సీఎం కేసీఆర్ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని, దీనిపై కాంగ్రెస్ తరపున కేంద్రానికి లేఖ రాస్తామని ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. వికారాబాద్ జిల్లాను పక్కనే ఉన్నచార్మినార్ జోన్లో కాకుండా ఎక్కడో సుదూరంలో ఉన్న జోగులాంబలో కలపడంపై తీవ్ర అభ్యంతరాలు వచ్చాయి. ఎక్కడో దూరంలో ఉన్న జహీరాబాద్ ప్రాంతాన్నే చార్మినార్ జోన్లో కలపగా, పక్కనే ఉన్న వికారాబాద్ను మాత్రం జోగులాంబ జోన్ల కలపడంపై తీవ్ర దుమారం రేగుతోంది. ఇక్కడి వారు అక్కడికెళ్లి ఉద్యోగాలు చేయడమంటే జిల్లా అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలైన యాదయ్య, సంజీవరావు తదితర నేతలు సైతం సీఎం కేసీఆర్ను ఒప్పించే విషయంలో విఫలమయ్యారని జిల్లా వాసులు మండిపడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వ నిర్ణయం టీఆర్ఎస్కు జిల్లాలో సెల్ఫ్గోల్గా మారింది. -
కోతలుండవ్..
గద్వాల అర్బన్ : ఒకవైపు నిరంతర సరఫరా, మరోవైపు వేసవి దృష్ట్యా విద్యుత్ వినియోగం అమాంతం పెరిగింది. దీంతో ట్రాన్స్కో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. జిల్లాలోని అన్ని సబ్స్టేషన్లలో ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం పెంచుతున్నారు. అలాగే మరమ్మతు నిమిత్తం నిధులు మంజూరయ్యాయి. ఇక వేసవితోపాటు వచ్చే ఖరీఫ్ సీజన్లోనూ విద్యుత్ సరఫరాకు డోకా లేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ ఏడాది జనవరి 1 నుంచి వ్యవసాయ రంగానికి నిరంతర విద్యుత్ సరఫరా చేస్తోంది. దీంతో ఆ నెలలో విద్యుత్ వినియోగం రెండింతలు పెరిగింది. ప్రభుత్వం ఆదేశాల మేరకు విద్యుత్ అధికారులు గ్రా మాల్లో పర్యటించి ఆటోమెటిక్ స్టార్లర్ల తొలగింపుపై రైతులకు అవగా హన కల్పించారు. బోర్లలోనూ నీటిమట్టం తగ్గిపోవడంతో క్రమేణా వినియోగం తగ్గింది. మార్చి నుంచి వేసవి ప్రారంభమైంది. వ్యవసాయ రంగానికేగాక ప్రజలు సైతం కూలర్లు, ఏసీలు, ఫ్యాన్లు తదితర ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగంతో డి మాండ్ పెరిగింది. ప్రస్తుతం ఉన్న ట్రాన్స్ఫార్మర్లపై భారం పడి ఓల్టేజీ తగ్గింది. ట్రాన్స్కో అధికారులు అప్రమత్తత అప్రమత్తమైన అధికారులు ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం పెంపు, అదనపు ట్రాన్స్ఫార్మర్ల బిగింపు, కెపాసిటర్ బ్యాంకుల కొనుగోలుకు రూ.ఆరు కోట్లు మంజూరయ్యాయి. జిల్లాలో 33/11కేవీ సబ్స్టేషన్లు 45అందుబాటులో ఉన్నాయి. నిరంతర విద్యుత్ సరఫరా, వేసవి దృష్ట్యా వీటిలోని 38చోట్ల ట్రాన్స్ఫార్మర్లపై అధిక భారం పడటంతో కెపాసిటర్ బ్యాంకులు అమర్చనున్నారు. ఒక్కోటి రూ.12లక్షలు (2ఎంబీఏఆర్ సామర్థ్యం) ఉంటుంది. వీటి ఏర్పాటుతో ట్రాన్స్ఫార్మర్లపై భారం తగ్గడమేగాక లోఓల్టేజీ సమస్య తీరుంది. రూ.మూడు కోట్లతో అదనపు పవర్ ట్రాన్స్ఫ్మార్లను అమర్చనున్నారు. ముఖ్యం గా నర్సన్దొడ్డి, రేవులపల్లి, మల్లాపురంతండా, మారమునగాల, ఉత్తనూరు, మానవపాడు, జమ్మిచేడు, రాజోళి తదితర ప్రాంతాల్లో అదనపు ట్రాన్స్ఫార్మర్లు బిగించనున్నారు. అలాగే చింతలకుంట సబ్స్టేషన్లో రెండు ట్రాన్స్ఫార్మర్లు 5ఎంఎల్వీ 8ఎంఎల్వీ, మాన్దొడ్డిలో 3.15 నుంచి 5ఎంఎల్వీగా సామర్థ్యం పెంచనున్నారు. మిగతా చోట్ల సింగిల్ ట్రాన్స్ఫార్మర్ల స్థానంలో డబుల్ పెంచనున్నారు. ప్రస్తు త వేసవితోపాటు వచ్చే జూన్లో ప్రారంభమయ్యే ఖరీఫ్లోనూ విద్యుత్ సరఫరాకు డోకా లేదని అధికారులు చెబుతున్నారు. అయితే విద్యుత్ స్తంభాలు, వైర్ల మరమ్మతు, కొత్త పరికరాలు అమర్చాలని రైతులు, వినియోగదారులు కోరుతున్నారు. అంచనాలు పంపించాం వ్యవసాయ రంగానికి నిరంతర విద్యుత్ సరఫరా, వేసవి కాలం దృష్ట్యా జిల్లాలో విద్యుత్ విని యో గం అమాంతం పెరిగింది. దీంతో కొన్ని సబ్స్టేషన్లలోని ట్రాన్స్ఫార్మర్లపై తీవ్ర ఒత్తిడి ఏర్పడింది. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో కెపాసిటర్ బ్యాంకులు, అడిషనల్ పవర్ ట్రాన్స్ఫార్మర్లకు నిధులు వచ్చాయి. పనుల అంచనా తయారుచేసి ఉన్నతాధికారులకు పంపించాం. త్వరలోనే ఈ పనులు తప్పక చేపడతాం. – సీహెచ్ చక్రపాణి, ట్రాన్స్కో ఎస్ఈ, గద్వాల -
సైబర్ వల
పొద్దస్తమానం చెమటోడ్చి నాలుగు డబ్బులు సంపాదించి తమ ఆర్థిక ఇబ్బందులను అధిగమించి.. ఎంతో కొంత భవిష్యత్ అవసరాల కోసం బ్యాంకుల్లో దాచుకుంటారు. ఒకే ఒక్క ఫోన్కాల్తో ఎక్కడో ఉన్న సైబర్ నేరగాళ్లు ఖాతాలో క్షణాల్లో ఉన్న నగదు నిల్వలను లాగేసుకుంటున్నారు. డెబిట్, క్రెడిట్ కార్డుల డేటా హ్యాకింగ్కు పాల్పడుతూ ఖాతాదారుల్లో కలవరం పుట్టిస్తున్నారు. గద్వాల క్రైం: బ్యాంకింగ్ సేవలు సరళతరమైన నేపథ్యంలో ఖాతాదారులకు సౌలభ్యంగా ఉండటంతోపాటు కంటిమీద కునుకు లేకుండా సైబర్ మాయగాళ్లు తలనొప్పులు సృష్టిస్తున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా గద్వాల, ఇటిక్యాల, అలంపూర్ తదితర మండలాల్లో ఖాతాదారుల డబ్బులను సైబర్ నేరగాళ్లు సునా యాసంగా తస్కరిస్తున్నారు. జిల్లాలో ఈ ఘటనలపై జిల్లా పోలీసులు బ్యాంక్ ఖాతాదారులకు ముం దుస్తు భద్రతగా పలు సూచనలు చేస్తూ.. హైఅలర్ట్ ప్రకటించారు. దీంతో వివిధ బ్యాంకుల ఖాతాదారులు హడలిపోతున్నారు. బ్యాంకుల్లో నగదు నిల్వ చేసేందుకు మల్లగుల్లాలు పడుతున్నారు. సులభతరమే.. భయంకరం ఖాతాదారుల సేవలను సులభతరం చే యడానికి ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన ఆన్లైన్, ఆటోమేటిక్ టెల్లర్ మెషీన్ (ఏటీఎం), డెబిట్, క్రెడిట్ కార్డులు, వివిధ యా ప్స్ ద్వారా ఖాతాదారులు ఇప్పుడు చెల్లింపులు చేస్తున్నారు. ఆయా సేవలు సులభతరమే అయినా ఖాతాదారులకు భ యంకరంగా మారాయి. సులభంగా మోసాలు, చోరీలు చేయడానికి ఓ వేదికగా మారుతున్నాయి. ఇక వివిధ స్థాయి బ్యాం క్ ఖాతాదారులకు నేరుగా వారి సమాచా రం సేకరించి హిందీ, ఇంగ్లిష్, మరాఠీ భా షల్లో బ్యాంక్ అధికారులుగా మాట్లాడు తూ మీ యెక్క ఖాతా నంబర్కు అదనపు సమాచారం పొందుపర్చడానికి, ఆధార్, ఏటీఎం పిన్, ఫోన్ నంబర్ వంటి వివరాలతో కొంతమంది సైబర్ నేరగాళ్లు ఖాతా లను హ్యాక్ చేస్తున్నారు. మీ ఖాతాలను అప్డేట్ చేస్తున్నామని నమ్మకంగా వివరించి ఖాతాకు సంబంధించిన పూర్తి సమాచారం రాబట్టి క్షణాల్లో వ్యక్తిగత ఖాతాల నుంచి డబ్బులను మాయం చేస్తారు. నంబర్ అప్డేట్ చేయాలి.. కొత్త మొబైల్ నంబర్ను ఖాతా ఉన్న అన్ని బ్యాంకుల శాఖలకు అప్డేట్ చేయడం మం చిది. వ్యక్తిగత ఖాతా నుంచి నగదు బ దిలీ జరిగిన ప్రతిసారి మొబైల్కు సమాచా రం వస్తుంది. అయితే బ్యాంకుల్లో మీ యె క్క ఫోన్ నంబర్ రిజిస్టర్ లేకుంటే వెంటనే అధికారులకు తెలియజేసి ఖాతాకు ఫోన్ నంబ ర్ జతపరిచే విధంగా చర్యలు చేపట్టాలి. ఇక్కడి నుంచే మోసాలు సైబర్ నేరాలు ఎక్కువగా ఢిల్లీ, బీహార్, ముంబయి, ఉత్తరప్రదేశ్, నైజీరియన్, ఇతర దేశాల కేటుగాళ్లు ఇలాంటి మోసాలు ఎక్కువగా చేస్తుంటారు. నూతన టెక్నాలజీ ఆధారంగా కొత్త ఐడీలను ఏర్పాటు చేసి ప్రజల ఖాతాల నుంచి క్షణాల్లో డబ్బులను మాయం చేయడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. ఇలాంటి మోసాలపై నిఘా పోలీసులకు సమాచారం అందించి ఆకతాయిల ఆగడాలకు చెక్ పెట్టవచ్చు. నమోదైన కేసులు ♦ డిసెంబర్ 8, 2016న గద్వాల పట్టణానికి చెందిన ఆటోడ్రైవర్ ప్రభాకర్ ఖాతా నుంచి రూ.90 వేలు ఆన్లైన్ ద్వారా డబ్బులు మాయం చేశారు. ♦ సెప్టెంబర్ 1వ తేదీ 2017లో గద్వాలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగి దౌలు వ్యక్తిగత ఖాతాలో రూ.36 వేలు డ్రాచేశారు. ♦ సెప్టెంబర్ 18వ తేదీ 2017లో గద్వాలకు చెందిన సోమిరెడ్డి అనే వ్యక్తి ఖాతాలో రూ.60 వేలు మాయమయ్యాయి. ♦ ఏకంగా జోగుళాంబ గద్వాల కలెక్టర్ రజత్కుమార్సైని తల్లిదండ్రుల ఇరువురి ఖాతాల నుంచి రూ.20 వేలు ఆన్లైన్ ద్వారా సైబర్ నేరగాళ్లు గత నెలలో మాయం చేశారు. జిల్లాలో ఇప్పటి వరకు గద్వాల, అలంపూర్, ఇటిక్యాల పోలీసు స్టేషన్లలో 13 కేసులు నమోదు కాగా సుమారు రూ.3 లక్షలకుపైగా ఆన్లైన్లో ఖాతాదారుల సొమ్మును కొల్లగొట్టారు. నిఘా ఏర్పాటు చేశాం.. జిల్లాలోని వివిధ బ్యాంక్ ఖాతాదారులు అపరిచిత ఫోన్ కాల్స్పై జాగ్రత్తగా ఉండాలి. బ్యాంక్ అధికారులు వ్యక్తిగత సమాచారం ఎట్టి పరిస్థితిలో అడగరు. ఒకవేళ ఇలాంటి ఫోన్ కాల్స్ వస్తే నేరుగా బ్యాంక్కు వస్తామని చెప్పాలి. వారి నంబర్లను పోలీసులకు తెలియజేయాలి. ఇలాంటి సైబర్ నేరాలపై పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. ఎవరూ కూడా మోసాలకు గురికాకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి.– బాలకోటి, డీఎస్పీ, గద్వాల -
మనస్తాపం.. క్షణికావేశం
కుటుంబంలో నెలకొన్న చిన్నపాటి మనస్పర్థలు ముగ్గురి ప్రాణాలను బలితీసుకున్నాయి. తీవ్ర మనోవేదనకు గురైన ఆ తల్లి చనిపోవాలనుకుంది. తన ఇద్దరు చిన్నారులను కూడా వెంట తీసుకెళ్లాలని నిర్ణయించుకుంది. అనుకున్నట్టుగానే నిండుగా ప్రవహిస్తున్న జూరాల ప్రాజెక్టు కుడి కాలువలో దూకి కుటుంబంలో తీరని విషాదాన్ని మిగిల్చింది. గద్వాల క్రైం: గద్వాల జిల్లాకేంద్రంలోని బృందావన్ కాలనీకి చెందిన తెలుగు రాజేష్ను నాగర్కర్నూల్కు చెందిన సునిత (27)తో పదేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కూతుళ్లు అమృత(5), వైష్ణవి(3) ఉన్నారు. ప్రస్తుతం 5 నెలల గర్భిణీ. ఎంతో అన్యోన్యంగా సాగే వీరి సంసారంలో ఇటీవలే చిన్నచిన్న మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. సోమవారం రాత్రి పిల్లల విషయంలో వివాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురైన సునిత మంగళవారం తెల్లవారుజామున ఇంట్లోంచి ఎవరికి చెప్పకుండా పిల్లలను వెంట పెట్టుకొని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు కుడి కాలువ వద్దకు వెళ్లి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఉదయం నుంచి భార్యా పిల్లలు కన్పించక పోవడంతో చుట్టు పక్కల, బంధువుల ఇళ్లల్లో వాకాబు చేసినా ఆచూకి లభించలేదు. చిన్నారి మృతదేహంతో వెలుగులోకి.. భర్త, తల్లిదండ్రులు, బంధువులు గ్రామంలో వెతుకుతుండగా జములమ్మ రిజర్వాయర్లో ఓ పసికందు మృతదేహం తెలియాడుతూ కన్పించింది. రిజర్వాయర్లోకి వెళ్లి చూడగా అది రాజేష్ కుతూరు వైష్ణవిగా గుర్తించారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు కాలువ గట్టున కన్నీరు మున్నీరుగా విలపించారు. అప్పటికే విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలం వద్దకు చేరుకొని పీజేపీ అధికారులతో మాట్లాడారు. కాలువలోని నీటిని నిలిపి వేయించారు. గజ ఈతగాళ్లను రప్పించి మృతదేహల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చీకటి పడుతుడడంతో గద్వాల సీఐ రవి, రూరల్ ఎస్ఐ అంజద్అలీ మరో ఇద్దరు గజ ఈతగాళ్ల సహాయంతో రిజర్వాయర్లో గాలింపు ముమ్మరం చేశారు. పట్టణంలో చర్చనీయాంశం అయిదు నెలల గర్భిణీ తన ఇద్దరు చిన్నారులను తీసుకుని ఆత్మహత్యకు పాల్పడటంతో పట్టణంలో ఇదే విషయం చర్చనీయాంశంగా మారింది. అసలు ఏం జరిగిందనే విషయం తెలియక ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. భార్యభర్తల మధ్య తలెత్తిన వివాదమా.. లేక మరేదైనా కారణమా అనే విషయం తెలియరాలేదు. ఈ సంఘటనతో పట్టణంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బంధువులు, కుటుంబసభ్యులు ఏటివద్దే ఉండి కన్నీరుమున్నీరుగా విలపించారు. -
జోగుళాంబ జిల్లా చేయాలి
అలంపూర్రూరల్: ప్రసిద్ద పుణ్య క్షేత్రంగా బాసిల్లుతున్న జోగుళాంబ అమ్మవారి పేరుతో జిల్లాను ఏర్పాటు చేయాల్సిందేనని వైఎస్సాఆర్సీపీ తాలూకా ఇన్చార్జ్ జెట్టి రాజశేఖర్ డిమాండ్ చేశారు. శనివారం అలంపూర్ ప్రభుత్వ అతిథి గృహంలో ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. డీకే అరుణ జోగుళాంబ జిల్లా కావాలని చేస్తున్న పోరాటం హర్షించదగ్గదే కానీ, ఏక పక్షంగా పోరాటం చేస్తుండటంతో పెద్దగా స్పందన రావడం లేదన్నారు. కే వలం కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలసి మాత్రమే పోరాటం చేస్తుండటంతో మిగితా పార్టీల మద్ధతును కోల్పోతున్నారని అన్నారు. ఇప్పటికైనా జోగుళాంబ జిల్లా సాధన కోసం అన్ని పారీల్ట నాయకులను కలసి అందరినీ సమన్వయం చేసుకుని పోరాడితే జిల్లాను సాధించవచ్చన్నారు. ఒక వ్యక్తి కి ఇచ్చిన మాట కోసం జిల్లా చేయడం ఎంత వరకు సమంజసం అనేది కేసీఆర్ ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. నడిగడ్డ ప్రజల కోసం, అలంపూర్ ప్రాంత అభివృద్ది కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చివరి దాక నిలపడుతుందని అన్నారు. జోగుళాంబ జిల్లా కోసం హైద్రాబాద్లో చేస్తున్న నిరాహార దీక్షకు తమ పార్టీ తరపున కార్యకర్తలు తరలివెళుతున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మహేశ్వర్రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మినారాయణ, మండల కార్యదర్శి శేఖర్రెడ్డి, నాయకులు అశోక్గౌడ్ , బండారి రాజు పాల్గొన్నారు. -
జోగులాంబ జిల్లా ఏర్పాటు చేయాలి
సాక్షి, హైదరాబాద్: గద్వాల కేంద్రంగా జోగులాంబ జిల్లాను ఏర్పాటు చేయాలని మహబూబ్నగర్ జిల్లా ప్రజాప్రతినిధులు ఆందోళనకు దిగారు. గద్వాల జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో కొందరు ఎంసీఆర్హెచ్ఆర్డీలో ధర్నా చేశారు. కొత్త జిల్లాలకు ఏర్పాటు చేసిన సబ్ కమిటీ ఎదుట తమ అభిప్రాయాలను వెల్లడించారు. వరంగల్లో జనగామను కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రతిపాదించారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ఆదివారం మహబూబ్నగర్, వరంగల్, నల్లగొండ జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధుల నుంచి సబ్కమిటీ అభిప్రాయాలను స్వీకరించింది. నల్లగొండను మూడు జిల్లాలుగా విభజించడం పట్ల ఆ జిల్లా నేతలు అభ్యంతరం పెట్టనప్పటికీ, వరంగల్ జిల్లాలోని కొన్ని మండలాలను యాదాద్రి జిల్లాలో కలపవద్దని సూచించారు. గద్వాలకు లేనిదేంటీ.. వనపర్తిలో ఉన్నదేంటి! మహబూబ్నగర్ జిల్లాలో గద్వాల జిల్లా కేంద్రంగా జోగులాంబ జిల్లాను ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి డీకే అరుణ సబ్కమిటీకి విన్నవించారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే వనపర్తి జిల్లాను ప్రభుత్వం ప్రతిపాదించిందని, గద్వాలలో లేని ప్రత్యేకతలు వనపర్తిలో ఏమున్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం తనలక్కీ నంబరు కోసమని రాష్ట్రాన్ని 24 జిల్లాలుగా చేయడం సరికాదని, ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా మొత్తం 17 జిల్లాలు చేస్తే సరిపోతుందని కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి అన్నారు. తక్కువ దూరంలో ఉన్న నాగర్ కర్నూల్, వనపర్తిలను కొత్త జిల్లాలకు కేంద్రాలుగా ప్రతిపాదించడం సరికాదని ఎమ్మెల్యే వంశీచందర్రెడ్డి అన్నారు. కొత్త జిల్లాలు ప్రజలకు సౌలభ్యంగా ఉండాలని, రాజకీయ ప్రయోజనాల కోసం పొరపాట్లు చేస్తే ప్రజలు క్షమించరని అలంపూర్ ఎమ్మెల్యే సంపత్కుమార్ చెప్పారు. మరోవైపు జనగామను జిల్లా చేయాలని మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య కోరారు. ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, ఎర్రబెల్లి, ఎమ్మెల్సీలు బోడకుంటి వెంకటేశ్వర్లు, పల్లా రాజేశ్వర్రెడ్డి కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అఖిలపక్ష సమావేశం వాయిదా జిల్లాల పునర్విభజన ప్రక్రియలో భాగంగా మంగళవారం జరగాల్సిన అఖిలపక్ష సమావేశాన్ని ప్రభుత్వం వాయిదా వేసింది. సోమవారం అన్ని పార్టీల నేతలు స్వాతంత్య్ర దినోత్సవాల్లో పాల్గొనేందుకు తమ నియోజకవర్గాలకు వెళ్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సబ్కమిటీతో 17న జరగాల్సిన జిల్లా కలెక్టర్ల భేటీ యథావిధిగా నిర్వహించనున్నారు. -
గద్వాలను జోగుళాంబ జిల్లాగా చేయాల్సిందే!
గద్వాల : జిల్లాల పునర్విభజనలో గద్వాలకు అన్యాయం జరిగితే ముఖ్యమంత్రి కేసీఆర్ జోగుళాంబ అమ్మవారి ఆగ్రహానికి గురికావాల్సి ఉంటుందని మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే డీకే అరుణ అన్నారు. గద్వాల జిల్లా సా«దన కోసం మంగళవారం మండల పరిధిలోని జమ్ములమ్మ ఆలయం నుంచి అలంపూర్లోని జోగుళాంబ ఆలయం వరకు ఎమ్మెల్యే డీకే అరుణ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. అలంపూర్ ఎమ్మెల్యే సంపత్కుమార్తో కలిసి మొదటిరోజు 14 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా జమ్ములమ్మ ఆలయం, జమ్మిచేడు గ్రామాల్లో ప్రజలనుద్దేశించి అరుణ మాట్లాడారు. ప్రజలను అయోమయానికి గురిచేసే విధంగా ప్రభుత్వం కొత్త జిల్లాల పేర్లను ప్రకటిస్తూ గందరగోళానికి గురి చేస్తోందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు రాజకీయ సపర్యలు చేసే వారికే అందలమెక్కిస్తున్నారని అలంపూర్ ఎమ్మెల్యే సంపత్కుమార్ విమర్శించారు. పాదయాత్రలో భాగంగా ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ప్రజల ఆకాంక్షలను పెడచెవిన పెట్టి స్వార్థపూరితంగా సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. నియమ, నిబంధనలకు అనుగుణంగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేయదలిస్తే మొట్టమొదటగా గద్వాలకే అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో పీసీసీ నాయకుడు విజయ్కుమార్, చైర్పర్సన్ పద్మావతి, వైస్ చైర్మన్ శంకర్, నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, వేణుగోపాల్, బండల వెంకట్రాములు, పట్టణ, గ్రామ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.