khelo india
-
ఖేలో ఇండియా సెంటర్లకు ఆహ్వానం...
కరీంనగర్ స్పోర్ట్స్: ప్రస్తుత కాలంలో క్రీడలపై ఆసక్తి ప్రతి ఒక్కరిలో పెరిగింది. ప్రపంచ పోటిలు, ఒలంపిక్స్ లాంటి మోగా పోటీల్లో భారత క్రీడాకారులు సాధించిన పతకాలతో క్రీడల్లో తమ పిల్లలను ప్రొత్సహించాలనే ఆసక్తి సైతం తల్లిదండ్రుల్లో మొదలైంది. దీనికి తోడు భారత్ ఇటీవలీ కాలంలో ప్రపంచ కప్ ఖోఖో పోటీలకు ఆతిథ్యం ఇవ్వడం, పుట్బాల్ పోటీలు త్వరలో జరుగనుండడం, 2036లో ఒలంపిక్స్ నిర్వహించేందుకు బిడ్స్ వేయడం ఇలా చెప్పుకుంటే పోటే క్రీడలు క్రేజీగా మారాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం ఖేలో ఇండియా సెంటర్లను వెలుగులోకి తెచ్చాయి. తెలంగాణ వ్యాప్తంగా ఆయా జిల్లాల్లో పలు క్రీడల్లో ఖేలో ఇండియా సెంటర్లను ఏర్పాటు చేసింది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ సెంటర్లలో శిక్షణ పొందుతున్న క్రీడాకారులు సత్పలితాలు తీసుకువస్తున్నారు. ఇందులో భాగంగానే హైదరాబాద్, రంగారెడ్డిలలోని ఖేలో ఇండియా సెంటర్లలోని పలు క్రీడల్లో నూతన క్రీడాకారులకు అవకాశం కల్పించింది. ఏయే క్రీడల్లో ఖేలో ఇండియా సెంటర్లు ఉన్నాయి.....ఏ ప్రాంతంలో పోటీలు జరుగనున్నాయి....ఎలా హాజరుకావాలని తదితర వివరాలతో సాక్షి కథనం..క్రీడలు...హాకీ, అథ్లెటిక్స్, అర్చరీ (బాలబాలికలు) కబడ్డీ (బాలురు), జిమ్నాస్టిక్స్ (బాలబాలికలు)కావాల్సిన పత్రాలు...ఆధార్ కార్డు, వయస్సు ధృవీకరణ పత్రం, స్పోర్ట్స్ సర్టిఫికేట్లు, మెడికల్ సర్టిఫికేట్లు, విద్యార్హత పత్రాలు, పాస్ పోర్టు సైజ్ ఫోటోలు 2 అథ్లెటిక్స్, అర్చరీ (బాలబాలికలు), కబడ్డీ (బాలురు)....ఫిబ్రవరి 4, 5 తేదీల్లో హైదరాబాద్ గచ్చీబౌళీ స్టేడియంలో, హాకీ కాంప్లెక్స్లో ఎంపికలు జరుగును. 12 నుంచి 18 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న బాలబాలికలు అర్హులు. ఎంపిక పోటీలకు హాజరయ్యే వారు గుర్తించబడిన క్రీడలో కనీసం రాష్ట్రస్థాయి పోటిల్లో ప్రాతినిథ్యం వహించి ఉండాలి. క్రీడాకారులు 4న ఉదయం 7 గంటలకు రిపోర్టు చేయాలి.హాకీ (బాలబాలికలు)..: ఫిబ్రవరి 4 నుంచి 6 తేదీల్లో హైదరాబాద్ గచ్చీబౌళీ స్టేడియంలో, హాకీ కాంప్లెక్స్లో ఎంపికలు జరుగును. 12 నుంచి 18 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న బాలబాలికలు అర్హులు. ఎంపిక పోటీలకు హాజరయ్యే వారు గుర్తించబడిన క్రీడలో కనీసం రాష్ట్రస్థాయి పోటిల్లో ప్రాతినిథ్యం వహించి ఉండాలి. క్రీడాకారులు 4న ఉదయం 7 గంటలకు రిపోర్టు చేయాలి.జిమ్నాస్టిక్స్ (బాలబాలికలు)...ఫిబ్రవరి 4, 5 తేదీల్లో రంగారెడ్డి ఎల్బీనగర్ సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో ఎంపికలు జరుగును. 8 నుంచి 18 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న బాలబాలికలు అర్హులు. ఎంపిక పోటీలకు హాజరయ్యే వారు కనీసం జిల్లా స్థాయి పోటిల్లో ప్రాతినిథ్యం వహించి ఉండాలి. క్రీడాకారులు 4న ఉదయం 7 గంటలకు రిపోర్టు చేయాలి. -
ఉమెన్ పవర్ 2024: కాలాన్ని కట్టడి చేశారు
కాలం.. మరో నూతన అధ్యాయాన్ని ఆవిష్కరించడానికి సిద్ధమవుతోంది. జారిపోతున్న కాలపు క్షణాలను అపురూపంగా ఒడిసిపట్టుకొని ఉన్నతంగా ఎదిగినవారు కొందరు... ఉదాత్తంగా జీవనాన్ని మలుచుకున్నవారు ఇంకొందరు ఆర్థిక స్థితి గతులు ఎలా ఉన్నా వెనక్కి లాగే పరిస్థితులు ఏవైనా కాలానికి ఎదురు నిలిచి అవకాశాలను అందిపుచ్చుకుంటూ అత్యున్నతంగా ఎదిగిన కొందరు మహిళా మణుల కృషిని ఈ ఏడాది ‘సాక్షి ఫ్యామిలీ’ ఆవిష్కరించింది. ఆ గాథలను మరోమారు గుర్తుచేసుకుందాం. ఎదనిండా స్ఫూర్తిని నింపుకుందాం.డాక్టరమ్మ క్రీడా శిక్షణనిజామాబాద్ పట్టణంలో బాలికల క్రీడానైపుణ్యాలను చూసి, వారి కోసం తన పేరుతోనే 2019లో ఫుట్బాల్ అకాడమినీ ఏర్పాటు చేశారు డాక్టర్ శీలం కవితారెడ్డి. ఈ అకాడమీలో 41 మంది బాలికలకు కోచ్ పర్యవేక్షణలో శిక్షణ ఇస్తున్నారు. ఇంటర్, డిగ్రీ చదువుతున్న గ్రామీణ విద్యార్థులకు ఈ అకాడమీ లో ఉచిత వసతి, ఆహారం, దుస్తులు, వైద్యసేవలను అందిస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో జరిగే టోర్నమెంట్లలో పాల్గొనే క్రీడాకారులకు అవసరమైన ఖర్చులన్నీ భరిస్తున్నారు. ఈ అకాడమీ నుంచి జాతీయ–అంతార్జాతీయ స్థాయికి ఎదిగిన క్రీడాకారులు ఉన్నారు.అమ్మాయిలను కాపాడుకుందాం..గ్రామీణ మహిళలను నిత్యం కలుస్తూ వారి సంక్షేమానికి కృషి చేస్తూ పరిష్కారాలను సూచిస్తూ మహిళా రైతుల అభివృద్ధికి చేయూతనిస్తున్నారు డాక్టర్ రుక్మిణారావు. హైదరాబాద్ వాసి అయిన ఈ సామాజిక కార్యకర్త డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ డైరెక్టర్గానూ, వందకు పైగా మహిళా రైతు సంఘాలతో కూడిన జాతీయ వేదిక ‘మకాం’ సహ వ్యవస్థాపకురాలిగానూ ఉన్నారు. నారీశక్తి పురస్కార గ్రహీత అయిన రుక్మిణీరావు ముప్పై ఏళ్లుగా ‘గ్రామ్య రిసోర్స్ సెంటర్ ఫర్ ఉమెన్’ ద్వారా తెలంగాణలోని ఆరు మండలాలో 800 మంది మహిళలు తమ జీవనోపాధిని మెరుగుపరుచుకోవడానికి, అలాగే ఆడపిల్లల పెంపంకం పట్ల వారి వైఖరిని పునరాలోచించడానికి కృషి చేస్తున్నారు.అమ్మలాంటి అన్నదాత కోసంసాయి ప్రియాంక చదువుకున్నది హైదరాబాద్లో. పోషకాహారం దాని ప్రభావిత అంశాల గురించి చర్చించడానికి 600 మంది ప్రతినిధులతో కొలంబోలో జరిగే అంతర్జాతీయ సదస్తులో పాల్గొనే అవకాశాన్ని పొందింది. ఖమ్మంవాసి అయిన పగడాల సాయి ప్రియాంక తల్లిదండ్రులిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులే. కూతురికి వ్యవసాయ రంగంపై ఉన్న ఆసక్తిని గమనించి ప్రోత్సహించారు. తెలంగాణలోని రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్న గ్రామాలలో రైతులను కలిసి సేంద్రీయ వ్యవసాయ పద్ధతులను పరీక్షించింది. ఢిల్లీలోని ఐఏఆర్ఐ (ఇండియన్అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్)లో పీహెచ్డి చేస్తోంది. ప్రస్తుతం జహీరాబాద్ ‘కృషి విజ్ఞాన కేంద్రం’లో అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ సైంటిస్ట్గా పనిచేస్తోంది. విభిన్న ఆలోచనలు గల సాయి ప్రియాంక కొత్త దారిలో ప్రయాణించడమే కాదు, తన తోటివారి స్ఫూర్తిగా నిలుస్తోంది.సవాళ్లే పట్టాలెక్కించేదిదక్షిణ మధ్య రైల్వేలో ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ (పిసిసిఎమ్)గా భారతీయ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ సీనియర్ అధికారిగా కె.పద్మజ ఈ ఏడాది ఆగస్టులో నియమితులయ్యారు. 1991 ఐఆర్సిఆర్లో మొట్టమొదటి మహిళా పిసిసిఎమ్. ఉద్యోగంలో మహిళగా ఎదుర్కొన్న వివక్షను వివరించారు. ‘సమస్యలు వచ్చేదే మనల్ని ధైర్యంగా ఉంచడానికి. మనకు ఏం కావాలో స్పష్టత ఉంటే ఆ పని కూడా సులువు అవుతుంది’ అని తెలిపారు‘మారతాను’ అనుకుంటే మారథాన్ గెలిచినట్టే!జీవనశైలిని మార్చుకోవాలన్న ఒకే ఒక ఆలోచనతో ఇండియా ఫాసెస్ట్ మారథాన్ రన్నర్గా తనకై తాను ఓ గుర్తింపును సాధించారు కవితారెడ్డి. 50 ఏళ్ల వయసులో ఆరు ప్రపంచ మారథాన్లను పూర్తి చేసి, స్టార్ మెడల్స్ను సొంతం చేసుకున్నారు. హైదరాబాద్తో పాటు దేశంలోని అన్ని ప్రధాన నగరాలలో మారథాన్ రన్స్లో పాల్గొంటున్న కవితారెడ్డి పదేళ్ల క్రితం వరకు గృహిణిగా బాధ్యతల నిర్వహణలో ఉన్నారు. ఆరోగ్యకరమైన జీవనం కోసం జిమ్లో చేరి, అటు నుంచి మారథాన్ రన్నర్గా దేశ విదేశాల్లో మహిళల్లో క్రీడాస్ఫూర్తిని నింపుతున్నారు.అన్నీ తానై... తానే నాన్నయివ్యవసాయం చేసే తండ్రి అనారోగ్యంతో చనిపోతే డిగ్రీ చదువుతున్న అతని చిన్న కూతురు అఖిల రైతుగా మారింది. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం నర్సాపురం గ్రామ వాసి అఖిల ఉన్న రెండెకరల భూమిని సాగు చేస్తూ అనారోగ్యంతో బాధపడుతున్న తల్లినీ, నాయినమ్మనూ సంరక్షిస్తోంది. ΄÷లం పనులకు ట్రాక్టర్ నడుపుతూ, వ్యవసాయం చేసుకుంటూ, పోటీ పరీక్షలకు సిద్ధపడుతోంది. తండ్రిలేని లోటును తీర్చుతూ కుటుంబానికి అండగా నిలబడింది. నానమ్మ గురించి రాస్తా!పన్నెండేళ్ల అమ్మాయి పదహారేళ్ల అమ్మాయి గురించి కథలుగా రాసి, దానిని బుక్గా అందరికి ముందుకు తీసుకువచ్చింది ఏడవ తరగతి చదువుతున్న అక్షయినీ రెడ్డి. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మనవరాలైన అక్షయినీ తాతయ్యలా ‘లా’ చేస్తాను, సమాజంలో ఉన్న గాధలను కథలుగా పరిచయం చేస్తాను, నానమ్మ గురించి రాస్తాను.. అంటూ తన భవిష్యత్తు లక్ష్యాలను మన ముందుంచింది. ఆటపాటలతో రోజులు గడిపేసే ఎంతో మంది పిల్లల మధ్య ఉంటూనే ప్రపంచంలో పేరొందిన రచయితల పుస్తకాలు చదువుతూ, క్రీడల్లో రాణిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన మార్గాన్ని రూపొందించుకుంటూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. చిన్నపిల్లలైనా పెద్ద కలలు కనవచ్చు అంటూ తన పుస్తకాన్ని చూపుతూ భావితరానికి చెబుతోంది.నీ ఆటే బంగారం శ్రీవల్లికరీంనగర్ వాసి శ్రీవల్లికి క్రికెట్ అంటే ఇష్టం. ఐదవ తరగతి చదువుతున్న రోజుల్లోనే హై స్కూల్ అబ్బాయిలతో కలిసి క్రెకెట్ ఆడటానికి వెళ్లింది. అందరూ ఆమెను చూసి వెటకారం గా నవ్వారు. వారి నవ్వులకు వెనకడుగు వేయకుండా విషయం పీటీటీ సర్కు చెప్పింది. శ్రీవల్లి ఇష్టం చూసిన పీఈటీ రహీం శ్రీవల్లి ఉత్సాహానికి మద్దతుగా నిలిచారు. తల్లిదండ్రులూ తమ ఆమోదం తెలిపారు. హైదరాబాద్లోని స్పోర్ట్స్ అకాడమీలో చేరి, నైపుణ్యాలను మెరుగుపరుచుకుంది. జాతీయ స్థాయి మహిళా క్రికెట్ జట్టులో తన సత్తా చాటుతోంది. చైతన్య లహరి బాసర ట్రిపుల్ ఐటీ ఆర్జీయూకేటీలో ఈసీఈ ఫైనలియర్ చదువుతోంది లహరి. కరాటేలో బ్లాక్బెల్ట్, కిక్ బాక్సింగ్లో ప్రావీణ్యం సాధించింది. ‘ఖేలో ఇండియా’లో ఉషూ ప్లేయర్గా సత్తా చాటింది. అత్యవసరంగా రక్తం అవసరం ఉన్నవారికి అందించేందుకు సిద్ధిపేటలో ‘లహరి బ్లడ్ ఫౌండేషన్’ ఏర్పాటు చేసింది. నేర్చుకున్న ఆత్మరక్షణ విద్యలను విద్యార్థినులకు నేర్పిస్తోంది. తోటి విద్యార్థులకు అండగా నిలిచేందుకు ‘హోప్ హౌజ్ ఫౌండేషన్’ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇటీవల బ్యాంకాక్లో నిర్వహించిన ‘ఏషియా యూత్ ఇంటర్నేషనల్ మోడల్ యునైటెడ్ నేషన్స్’ సదస్సుల్లో పాల్గొంది. తండ్రిలాగే సైన్యంలో చేరి దేశ సేవ చేయాలనేది లహరి లక్ష్యం.బస్తీ దొరసానిచెత్తను సేకరించే అమ్మాయి బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ హోదాలో ఒక రోజు అధికారిణిగా పలు శాఖల విధులను స్వయంగా సందర్శించి, తెలుసుకుంది. హైదరాబాద్ దిల్సుఖ్నగర్లోని పిల్లిగుడెసెల బస్తీ వాసి అరిపిన జయలక్ష్మి. బస్తీల పిల్లల బాగు కోసం కృషి చేస్తోంది. తల్లిదండ్రులతో పాటు చేత్త సేకరణ పనిచేస్తూ, కాలేజీ చదువులు చదువుతూ, బస్తీ పిల్లలకు చదువులు చెబుతుంటుంది. కోవిడ్ సమయంలో యునిసెఫ్ నుంచి వాలెంటీర్గా పనిచేసింది. ఢిల్లీలో ఛేంజ్ మేకర్ అవార్డ్ తీసుకుంది. గాంధీ కింగ్ స్కాలర్షిప్కి దేశం మొత్తంలో పది మంది సెలక్ట్ అయితే వారిలో జయలక్ష్మి ఒకరు. ఇందులో భాగంగా కిందటేడాది అమెరికా వెళ్లి వచ్చింది. ఇప్పుడు డిగ్రీ చేస్తూ యుపీఎస్సీ సాధించాలని కృషి చేస్తోంది.టీచర్ కొలువిచ్చిన సి‘విల్’ పవర్వనపర్తి వాసి అయిన హుమేరా బేగం తండ్రి రోజువారీ కూలీగా హైదరాబాద్లో ఒక మదర్సాలో పనిచేసేవాడు. అమ్మ ఉర్దూ టీచర్గా కొంత కాలం పనిచేసింది. హుమేరా ఏడో తరగతిలో ఉన్నప్పుడు తండ్రి పక్షవాతం బారిన పడ్డాడు. తండ్రి అనారోగ్య ప్రభావం హుమేరా చదువుపై పడింది. పదవ తరగతి లో ఉండగా తండ్రి ఆరోగ్యం క్షీణించి మరణించాడు. హుమేరాకు సివిల్స్ సాధించాలన్నది కల. ఆర్థిక స్థితి లేక చదువును వదిలేయాల్సిన స్థితి. హుమేరాకు చదువుపై ఉండే ఆసక్తి, పట్టుదల ‘సేవ్ ద గర్ల్ చైల్డ్’ సంస్థ దృష్టికి చేరింది. ఆ సంస్థ ఆమె చదువుకు అండగా నిలబడింది. డీఎడ్పూర్తి చేసి ఎస్జీటీ ఉర్దూ టీచర్గా ఎంపిక అయ్యింది. దయనీయమైన పరిస్థితుల నుంచి టీచర్గా ఎదిగిన హుమేరా కృషి ఎంతో మందికి స్ఫూర్తినిస్తుంది. -
చైతన్య లహరి
చదువులో ‘శభాష్’ అనిపించుకున్న లహరి చదువే ప్రపంచం అనుకోలేదు. సమకాలీన సమాజం నుంచి కూడా ఎన్నో విషయాలను పాఠాలుగా నేర్చుకుంటోంది. విద్యార్థి దశ నుంచే సామాజిక స్పృహతో ముందడుగు వేస్తోంది.‘మన కోసం మనమే కాదు ఇతరుల కోసం మనం’ అనే స్పృహతో రకరకాల సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగం అవుతున్న సిద్దిపేట జిల్లా తడకపల్లికి చెందిన బండోజీ లహరి బ్యాంకాక్లో జరిగిన ‘ఏషియా యూత్ ఇంటర్నేషనల్ మోడల్ యునైటెడ్ నేషన్స్’ సదస్సులో ప్రసంగించింది...‘ఇది ఆడవాళ్లకు సాధ్యం కాదు’ అనే మాట ఎన్నోచోట్ల విన్నది లహరి. ‘ఎందుకు సాధ్యం కాదు?’ అని ధైర్యంగా అడిగే వయసు కాదు. అయితే చిన్న వయసులోనే రకరకాల సందర్భాలలో శక్తిమంతమైన మహిళల గురించి విన్న లహరికి ‘మహిళలకు సాధ్యం కానిది లేదు’ అనే సత్యం బోధపడింది.‘ప్రతిభావంతులతో పోటీ పడితే మనలోని ప్రతిభ కూడా మెరుగుపడుతుంది’ అనే పీటీ ఉష మాట ప్రభావంతో ఆటలపై ఆసక్తి పెంచుకుంది. ఎన్నో ఆటల్లో భాగం అయింది.మదర్ థెరెసా గురించి విన్నప్పుడల్లా ఆమె చేసిన అపారమైన సేవా కార్యక్రమాలలో ఏ కొంచెం చేసినా జీవితం ధన్యం అయినట్లే అనుకునేది. ‘ఇతరుల కోసం జీవించని జీవితం జీవితం కాదు’ అనే మదర్ మాట లహరి మనసులో నాటుకుపోవడమే కాదు సామాజికసేవా కార్యక్రమాలపై ఆసక్తి పెంచుకునేలా చేసింది. కరాటే...కిక్ బాక్సింగ్బాసర ట్రిపుల్ఐటీలో ఆర్జీయూకేటీలో ఈసీఈ ఫైనలియర్ చదువుతోంది లహరి. ఎప్పుడూ ఏదో నేర్చుకోవాలనే తపనతో ఉండే లహరి కరాటేలో బ్లాక్బెల్ట్ సాధించింది. కిక్ బాక్సింగ్లో ప్రాపావీణ్యం సాధించింది. ‘ఖేలో ఇండియా’లో ఉషూ ప్లేయర్గా సత్తా చాటింది.అత్యవసరంగా రక్తం అవసరమున్నవారికి సహాయం అందించేందుకు సిద్ధిపేటలో ‘లహరి బ్లడ్ ఫౌండేషన్ ’ ఏర్పాటు చేసింది. మిత్రులతో కలిసి రక్తదానాలు చేయడం, చేయించేలా ప్రోత్సహించడం చేస్తోంది. కోవిడ్ టైమ్లోనూ రిస్క్ తీసుకుని సేవలందించింది. తాను నేర్చుకున్న ఆత్మరక్షణ విద్యలను విద్యార్థినులకు నేర్పిస్తోంది. బాసర ఆర్జీయూకేటీలోనూ స్టూడెంట్ గవర్నింగ్ కౌన్సిల్ (ఎస్జీసీ) కౌన్సిల్ మెంబర్గా ఉంది. ట్రిపుల్ ఐటీలో ఆపదలో ఉన్న విద్యార్థులకు అండగా నిలిచేందుకు ఏర్పాటు చేసిన ఈ ‘హోప్హౌజ్ ఫౌండేషన్’’ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటోంది.ఇటీవల బ్యాంకాక్లో నిర్వహించిన ‘ఏషియా యూత్ ఇంటర్నేషనల్ మోడల్ యునైటెడ్ నేషన్స్’ సదస్సుల్లో పాల్గొంది. 36 దేశాల నుంచి 699 మంది పాల్గొన్న ఈ సదస్సుకు మన దేశం నుంచి హాజరైన అయిదుగురిలో లహరి ఒకరు. ఈ సదస్సులో ‘ఉమెన్ ట్రాఫికింగ్ అండ్ మైగ్రేషన్ స్మగ్లింగ్’ అనే అంశంపై మాట్లాడిందామె.నాన్నలాగే సైన్యంలో చేరి దేశసేవ చేయాలనేది లహరి లక్ష్యం. ఆమె లక్ష్యం నెరవేరాలని ఆశిద్దాం. లెట్స్ షేప్ ఏ బెటర్ వరల్డ్కొత్త ప్రదేశం అంటే భౌగోళిక విషయాల పరిచయం మాత్రమే కాదు. ఎన్నో విషయాలను తెలుసుకునే పుస్తక సముద్రం. ‘యూత్ సమ్మిట్’లో పాల్గొనడానికి బ్యాంకాక్కు వెళ్లిన లహరి ‘ఇక్కడ ప్రసంగించి వెళ్లిపోతే తన బాధ్యత పూర్తయిపోతుంది’ అనుకోలేదు. ఇటీవల థాయ్లాండ్లోని బ్యాంకాక్లో ‘లెట్స్ షేప్ ఏ బెటర్ వరల్డ్’ నినాదంతో మొదలైన అంతర్జాతీయ యువ సమ్మేళనంలో వివిధ దేశాల నుంచి వైబ్రెంట్ డెలిగేట్స్ పాల్గొన్నారు. పర్యావరణ సంక్షోభం నుంచి సాంస్కృతిక విశేషాల వరకు ఎన్నో అంశాలపై ఎంతోమంది డెలిగేట్స్తో లహరి మాట్లాడింది. ఉద్యమ ప్రయాణంలో వారి అనుభవాలతో స్ఫూర్తి పొందింది. ‘బ్యాంకాక్ సమ్మిట్లో పాల్గొనడం గొప్ప అనుభవం’ అంటుంది లహరి. – రాసం శ్రీధర్, సాక్షి, నిర్మల్ -
ఖేలో ఇండియా గేమ్స్కు వేదికగా హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి విజ్ఞప్తి మేరకు ఖేలో ఇండియా-2026 పోటీలను హైదరాబాద్లో నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.వచ్చే ఏడాది నిర్వహించేలా ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేసినా 2025లో బిహార్లో నిర్వహించేలా ఇప్పటికే నిర్ణయం జరగడంతో 2026లో హైదరాబాద్లో నిర్వహించేందుకు కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ సింగ్ మాండవీయ సానుకూలంగా స్పందించి సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జితేందర్రెడ్డికి హామీ ఇచ్చారు.రాతపూర్వక విజ్ఞప్తిని జితేందర్రెడ్డి గురువారం (నవంబరు 28) కేంద్ర మంత్రికి అందజేసి వివరించగా పై స్పష్టత లభించింది. హైదరాబాద్ నగరంలో 32వ జాతీయ క్రీడలు (2002లో), ఆఫ్రో ఆషియన్ గేమ్స్, 7వ మిలిటరీ గేమ్స్ సహా అనేక జాతీయ స్థాయి పోటీలు జరిగాయని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆ లేఖలో ప్రస్తావించారు. క్రీడా రంగానికి గత పదేండ్ల పాలనతో పోలిస్తే ప్రస్తుత ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నదని, జాతీయ స్థాయి పోటీలను నిర్వహించడానికి అవసరమైన అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయని ఆ లేఖలో సీఎం రేవంత్రెడ్డి గుర్తుచేశారు.గచ్చిబౌలిలోని స్పోర్ట్స్ కాంప్లెక్సుల అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఇండోర్ స్టేడియం, స్విమ్మింగ్ పూల్, సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్, హాకీ టర్ఫ్, షూటింగ్ రేంజ్, సరూర్నగర్లో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం (ఎయిర్ కండిషన్డ్), సింథటిక్ టెన్నిస్ కోర్ట్, స్కేటింగ్ ట్రాక్, ఔట్ డోర్ స్టేడియం, ఎల్బీ స్టేడియంలో ఇండోర్ స్టేడియంతో పాటు టెన్నక్ కాంప్లెక్స్, ఫుట్ బాల్ గ్రౌండ్, కేవీబీఆర్ ఇండోర్ స్టేడియం, హుస్సేన్ సాగర్లో వాటర్ స్పోర్ట్స్ నిర్వహించే సౌకర్యం, ఉస్మానియా క్యాంపస్లో సైక్లింగ్ వెల్డ్రోమ్, సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్, స్విమ్మింగ్ పూల్, స్కేటింగ్ ట్రాక్, జింఖానా-2 గ్రౌండ్లో ఫుట్ బాల్ గ్రౌండ్తో పాటు ఔట్ డోర్ గేమ్స్ నిర్వహించే వసతులు ఉన్నాయని ఆ లేఖలో సీఎం రేవంత్ గుర్తుచేశారు.క్రీడాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇస్తూ ప్రతి ఏటా ఖేలో ఇండియా యూత్ గేమ్స్, వింటర్ గేమ్స్, పారా గేమ్స్, యూనివర్శిటీ గేమ్స్ తదితరాలను 2018 నుంచి క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నదని సీఎం రేవంత్ గుర్తుచేశారు. గతేడాదితో పోలిస్తే ఈసారి బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం పది రెట్ల మేర క్రీడల కోసం కేటాయింపులను పెంచినట్లు సీఎం రేవంత్ గుర్తుచేశారు.కేవలం క్రీడల నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాలు మాత్రమే కాకుండా క్రీడాకారులు చేరుకునేలా రైలు, విమాన సౌకర్యాలు కూడా ఉన్నాయని, పేరెన్నికగన్న స్టార్ హోటళ్ళు, ఇతర వసతి సౌకర్యాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వడం మాత్రమే కాకుండా యువతను ప్రోత్సహించేలా ప్రత్యేక పాలసీని కూడా రూపొందిస్తున్నదని, ఆ శాఖను స్వయంగా ముఖ్యమంత్రే నిర్వహిస్తున్నట్లు కూడా ఆ లేఖలో పేర్కొన్నారు.రేవంత్ విజ్ఞప్తిని కేంద్ర మంత్రికి వివరించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జితేందర్ రెడ్డి.. అంతర్జాతీయ స్థాయిలో మన దేశానికి క్రీడారంగంలో గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు వచ్చేలా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని వివరించారు. క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నందుకు కేంద్ర మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.తెలంగాణ ఒక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఆర్థికంగా మాత్రమే కాక అనేక రంగాల్లో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ప్రత్యేక గుర్తింపు సాధించిందని, ఇకపైన క్రీడా పోటీల నిర్వహణతో పాటు భవిష్యత్తులో ఉత్తమ క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన అవగాహనతో ఉన్నదని జితేందర్ రెడ్డి గుర్తుచేశారు. కేంద్ర మంత్రితో జరిగిన ఈ సమావేశంలో జితేందర్ రెడ్డితో పాటు ఎంపీలు డాక్టర్ మల్లు రవి, అనిల్ కుమార్ యాదవ్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, రామసహాయం రఘురామ్రెడ్డి తదితరులు కూడా పాల్గొన్నారు. -
చేయాల్సింది చాలావుంది!
ప్యారిస్ వేసవి విశ్వక్రీడా సంరంభం ముగిసింది. దాదాపు 850 పతకాలు విజేతలను వరించిన ఈ 2024 ఒలింపిక్స్లో 10 ప్రపంచ రికార్డులు, 32 ఒలింపిక్ రికార్డులతో సహా మొత్తం 42 రికార్డులు బద్దలయ్యాయి. మరి, భారత్ సాధించినదేమిటి అన్నప్పుడే ఆశ నిరాశలు దోబూచులాడతాయి. 117 మంది అథ్లెట్లతో, 16 క్రీడాంశాల్లో పోటీపడుతూ భారత ఒలింపిక్ బృందం ఎన్నో ఆశలతో విశ్వ వేదికపై అడుగుపెట్టింది. ఈసారి రెండంకెల్లో పతకాలు సాధిస్తామనే ఆకాంక్షను బలంగా వెలి బుచ్చింది. తీరా ఒలింపిక్స్ ముగిసేవేళకు అరడజను పతకాలతోనే (5 కాంస్యం, 1 రజతం) తృప్తి పడాల్సి వచ్చింది. గడచిన 2020 టోక్యో ఒలింపిక్స్లో సాధించిన 7 పతకాల అత్యుత్తమ ప్రదర్శనతో పోలిస్తే... ఇది ఒకటి తక్కువే. ఈ సంరంభంలో మొత్తం 84 దేశాలు పాల్గొంటే, ప్రపంచంలో అత్యధికంగా 145 కోట్ల జనాభా గల మన దేశం పతకాల పట్టికలో 71వ స్థానంలో నిలిచింది. మన పతకాలు, జనాభా నిష్పత్తి చూస్తే, ప్రతి 25 కోట్ల మందికి ఒక్క పతకం వచ్చిందన్న మాట. ‘ఖేలో ఇండియా’ పేరిట కోట్లు ఖర్చుచేస్తున్నామంటున్న పాలకులు ఆత్మశోధనకు దిగాల్సిన అంశమిది.ఫ్రాన్స్లో రాజకీయ సంక్షోభం, పొంచివున్న దాడుల పట్ల భద్రతా సిబ్బంది భయం, ఫ్రెంచ్ ప్రజానీకంలో పెద్దగా ఉత్సాహం లేకపోవడం... వీటన్నిటి మధ్య ప్యారిస్ ఒలింపిక్స్ సరిగ్గా జరుగు తాయో జరగవో అని అందరూ అనుమానపడ్డారు. అన్నిటినీ అధిగమించి ఈ విశ్వ క్రీడోత్సవం విజయవంతంగా ముగిసింది. పైగా, అస్తుబిస్తుగా ఉన్న ఫ్రెంచ్ ఆర్థిక వ్యవస్థకు ఇప్పుడు అత్యవ సరమైన కొత్త ఉత్సాహమూ నింపింది. క్రితంసారి కోవిడ్ మూలంగా టోక్యోలో ప్రేక్షకులు లేకుండానే పోటీలు నిర్వహించిన నేపథ్యంలో ఈసారి స్పాన్సర్లు, బ్రాడ్కాస్టర్ల నుంచి అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీకి ఒత్తిడి ఉంది. నిర్వాహకులు మొత్తం ప్యారిస్ను ఓపెన్–ఎయిర్ ఒలింపిక్ క్రీడాంగణంగా మార్చేసి, అందరూ ఆహ్వానితులే అనడంతో ఊహించని రీతిలో ఇది దిగ్విజయమైంది. పోటీల్లో పాల్గొన్న ఒకరిద్దరు క్రీడాకారుల జెండర్ అంశం, భారత రెజ్లర్ వినేశ్ ఫోగట్ అనర్హత వ్యవహారం లాంటివి మినహా ఈ ప్యారిస్ ఒలింపిక్స్ అతిగా వివాదాస్పదం కాలేదనే చెప్పాలి. ఉక్రెయిన్, గాజా లాంటి భౌగోళిక రాజకీయ అంశాలు, అలాగే అమెరికాలో ఎన్నికల వేడి, బ్రిటన్లో అల్లర్లు, బంగ్లాదేశ్లో సంక్షోభం లాంటివి పతాక శీర్షికలను ఆక్రమించేసరికి ఒలింపిక్స్ వివాదాలు వెనుకపట్టు పట్టాయనీ ఒప్పుకోక తప్పదు. ప్యారిస్ వేసవి ఒలింపిక్స్కు తెర పడింది కానీ, ఈ ఆగస్ట్ 28 నుంచి అక్కడే పారా ఒలింపిక్స్–2024 జరగనుంది. తదుపరి 2028 వేసవి ఒలింపిక్స్కు లాస్ ఏంజెల్స్ సిద్ధమవుతోంది. కేవలం రెండే పతకాలు సాధించిన 2016 నాటి రియో ఒలింపిక్స్తో పోలిస్తే, భారత్ మెరుగైన మాట నిజమే. అథ్లెటిక్స్, వెయిట్ లిఫ్టింగ్, మహిళా బ్యాడ్మింటన్లో వెనుకబడినా టేబుల్ టెన్నిస్, షూటింగ్లలో కాస్త ముందంజ వేశామన్నదీ కాదనలేం. ఒకే ఒలింపిక్స్లో రెండు పతకాలు సాధించి, ఆ ఘనత సాధించిన తొలి భారతీయ షూటర్గా 22 ఏళ్ళ మనూ భాకర్ చరిత్ర సృష్టించారు. గోల్కీపర్ శ్రీజేశ్ సహా హాకీ బృందమంతా సర్వశక్తులూ ఒడ్డి, వరుసగా రెండో ఒలింపిక్స్లోనూ పతకం సాధించింది. ఇక ఈ ఒలింపిక్స్లో ఊరించి చేజారిన పతకాలూ చాలా ఉన్నాయి. భారత మల్లయోధురాలు వినేశ్ ఫోగట్ సంచలన విజయాలు నమోదు చేసినా, వంద గ్రాముల అధిక బరువు రూపంలో దురదృష్టం వెన్నాడకపోతే స్వర్ణం, లేదంటే కనీసం రజతం మన ఖాతాలో ఉండేవి. షట్లర్ లక్ష్యసేన్, అలాగే 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటర్ అర్జున్ బబుతా సహా కనీసం 6 సందర్భాల్లో మనవాళ్ళు ఆఖరి క్షణంలో నాలుగో స్థానానికి పరిమితమ య్యారు. లేదంటే పతకాల పట్టికలో మన దేశం మరింత ఎగబాకేదే. పతకాలు, విజయాల మాటెలా ఉన్నా, మన మార్కెటింగ్ విపణికి కొన్ని కొత్త ముఖాలు దొరికాయి. గాయాల నుంచి ఫీనిక్స్ పక్షిలా లేచిన నీరజ్ చోప్రా, పీవీ సింధుల మొదలు నిలకడగా ఏళ్ళ తరబడి ఆడిన శ్రీజేశ్, రెండు పతకాల విజేత మనూ భాకర్, బ్యాడ్మింటన్ క్రేజ్ లక్ష్యసేన్ దాకా పలువురు బ్రాండ్లకు ప్రీతిపాత్రులయ్యారు. కానీ ఇది సరిపోతుందా? ఆర్చరీ, బాక్సింగ్ సహా పలు అంశాల్లో నిరాశాజనక ప్రదర్శన మాటే మిటి? మిశ్రమ భావోద్వేగాలు రేగుతున్నది అందుకే. ఇప్పటికైనా మన ప్రాధాన్యాలను సరి చేసుకో వాలి. అత్యధిక జనాభా గల దేశంగా ప్రతిభకు కొదవ లేదు. ప్రతిభావంతుల్ని గుర్తించి, ప్రోత్సహించి, సరైన రీతిలో తీర్చిదిద్దడమే కరవు. మనకొచ్చిన 6 పతకాల్లో 4 దేశ విస్తీర్ణంలో 1.4 శాతమే ఉండే హర్యానా సంపాదించి పెట్టినవే. అంటే, మొత్తం పతకాల్లో హర్యానా ఒక్కదాని వాటా 66 శాతం. మరి, మిగతా దేశం సంగతి ఏమిటి? అక్కడి పరిస్థితులేమిటి? ప్రపంచంలోని అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థ మనదని జబ్బలు చరుచుకుంటున్న పాలకులు ఇవాళ్టికీ క్రీడలకు సరైన రీతిలో వస తులు, వనరులు ఇవ్వట్లేదు. పేరొచ్చాక సాయం చేస్తే సరిపోదు. క్షేత్రస్థాయిలో ఆటగాళ్ళకు నారు పోసి, నీరు పెట్టాలి. మన క్రీడా సంఘాలు, ప్రాధికార సంస్థలు రాజకీయ నేతల గుప్పెట్లో ఇరుక్కుపోవడం పెను విషాదం. పతకాలకై పోరాడాల్సిన ఆటగాళ్ళు లైంగిక వేధింపులు సహా అనేక సమస్యలపై రోడ్డెక్కి పోరాడాల్సిన పరిస్థితిని కల్పించడం మన ప్రభుత్వాల తప్పు కాదా? క్రీడా సంస్కృతిని పెంచి పోషించడానికి బదులు రాజకీయాల క్రీనీడలో ఆటను భ్రష్టు పట్టిస్తే, పతకాలు వచ్చేదెట్లా? అంతర్జాతీయ స్థాయిలో విజయానికి దూరదృష్టి, సరైన వ్యూహం, నిరంతరం పెట్టుబడి, స్పష్టమైన క్రీడా విధానం రాష్ట్ర స్థాయి నుంచే కీలకం. ఆ దిశగా ఆలోచించాలే తప్ప దాహమేసినప్పుడు బావి తవ్వితే కష్టం. అందుకే, 1900 తర్వాత నూటపాతికేళ్ళలో ఒలింపిక్స్లో ఇది మన రెండో అత్యుత్తమ ప్రదర్శన. ఇకనైనా అపూర్వ క్రీడాదేశంగా మనం అవతరించాలంటే, పాలకులు చేయాల్సింది చాలా ఉంది. -
Manu Bhaker: రూ. 2 కోట్లు ఖర్చు చేశాం..
ఒలింపిక్ పతకం గెలిచిన షూటర్ మనూ భాకర్కు కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అభినందనలు తెలిపారు. కఠిన శ్రమతోనే ఆమెకు ఈ ఘనత సాధ్యమైందని ప్రశంసించారు. ‘ఖేలో ఇండియా’లో మనూ భాకర్ భాగమైందని.. ఆమె శిక్షణ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేశామని తెలిపారు. ప్యారిస్ ఒలింపిక్స్-2024లో భారత్ పతకాల ఖాతా తెరిచిన విషయం తెలిసిందే.భారత్ను గర్వపడుతోందిమహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్ విభాగంలో హర్యానాకు చెందిన మనూ భాకర్ కాంస్యం గెలిచింది. తద్వారా విశ్వ క్రీడల్లో పతకం గెలిచిన భారత తొలి మహిళా షూటర్గా ఆమె చరిత్రకెక్కింది. 22 ఏళ్ల వయసులోనే ఈ ఘనత సాధించిన మనూపై దేశవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి.ఈ నేపథ్యంలో కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ స్పందిస్తూ.. ‘‘ప్యారిస్ ఒలింపిక్స్లో కాంస్య పతకం గెలవడం ద్వారా మనూ భాకర్ భారత్ను గర్వపడేలా చేసింది. తనను ప్రశంసించిన క్రమంలో.. తానూ ఖేలో ఇండియాలో భాగమయ్యానని ఆమె తెలిపింది. ప్రధాని మోదీ చొరవతో ఖేలో ఇండియా కార్యక్రమం రూపుదిద్దుకుంది.ఆమె శిక్షణ కోసం రూ. 2 కోట్లు ఖర్చు చేశాంపాఠశాల స్థాయి నుంచే ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహిస్తున్నాం. వారిని మెరికల్లా తీర్చిదిద్దే బాధ్యతను కోచ్లకు అప్పగిస్తున్నాం. మనూ భాకర్ శిక్షణ కోసం దాదాపు రూ. 2 కోట్లు ఖర్చు చేశాం. ట్రెయినింగ్ కోసం ఆమెను జర్మనీ, స్విట్జర్లాండ్కు పంపించాం.తను కోరుకున్న కోచ్ను శిక్షకుడిగా నియమించాం. కావాల్సిన ఆర్థిక సహాయం అందించాం. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా మన క్రీడాకారులకు శిక్షణ ఇప్పిస్తున్నాం. ప్యారిస్ ఒలింపిక్స్లో మన వాళ్లు సత్తా చాటుతారని నమ్మకం ఉంది. మన ఆటగాళ్లకు మనం ఎల్లవేళలా మద్దతుగా ఉండాలి. మన అథ్లెట్లు అద్భుతంగా ఆడి పతకాలతో తిరిగి రావాలని ఆశిద్దాం’’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఒలింపిక్స్లో తలపడుతున్న అథ్లెట్లకు మన్సుఖ్ మాండవీయ ఆల్ ది బెస్ట్ చెప్పారు.చదవండి: ‘మీ అహానికి అభినందనలు’: నాడు కోచ్తో మనూ గొడవ.. శాపం పోయిందంటూ.. -
బడ్జెట్లో క్రీడలకు రూ. 3,442.32 కోట్లు... ‘ఖేలో ఇండియా’కే రూ. 900 కోట్లు
న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం క్రీడలకు ఇచ్చే వార్షిక బడ్జెట్ను స్వల్పంగా పెంచింది. మంగళవారం ప్రకటించిన 2024–25 ఆరి్థక సంవత్సర బడ్జెట్లో క్రీడలకు రూ. 3,442.32 కోట్లు కేటాయించింది. గత ఏడాది ఇచి్చన రూ.3,396.96 కోట్లతో పోలిస్తే ఇది రూ.45.36 కోట్లు ఎక్కువ. ఎప్పటిలాగే ఇందులో ఎక్కువ మొత్తం దిగువ స్థాయిలో క్రీడాకారులను గుర్తించి తీర్చిదిద్దే ‘ఖేలో ఇండియా’ పథకానికే కేటాయించింది. గత ఏడాదికంటే రూ.20 కోట్లు ఎక్కువగా ‘ఖేలో ఇండియా’కు ఈసారి రూ.900 అందిస్తున్నట్లు ఆరి్థక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఈ పథకంలో భాగంగా యూత్ గేమ్స్, యూనివర్సిటీ గేమ్స్ల నిర్వహణతో పాటు అత్యుత్తమ స్థాయి శిక్షణ కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ల ఏర్పాటు, అక్కడ సౌకర్యాల కల్పన కోసం ఈ మొత్తాన్ని ఖర్చు చేస్తారు. మరోవైపు దేశవ్యాప్తంగా స్టేడియాల నిర్వహణ, టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (టాప్స్) కోసం ఖర్చు చేసేందుకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్)కు ప్రభుత్వం రూ.822.60 కోట్లు కేటాయించింది. దేశంలోని వివిధ క్రీడా సమాఖ్యలకు ఈ సారి రూ.340 కోట్లు అందజేస్తున్నారు. జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా), జాతీయ డోపింగ్ టెస్టింగ్ లేబొరేటరీ (ఎన్డీటీఎల్)ల కోసం వరుసగా 21.73 కోట్లు, రూ. 22 కోట్ల చొప్పున కేటాయించారు. -
Interim Budget 2024: బడ్జెట్లో క్రీడలకు రూ. 3,442 కోట్లు
Interim Budget 2024- న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో క్రీడల కోసం రూ. 3,442.32 కోట్లు కేటాయించారు. 2023–24 వార్షిక బడ్జెట్లో రూ. 3,396.96 కోట్లు క్రీడలకు వెచ్చిస్తే ఈసారి రూ.45.36 కోట్లు పెంచారు. కేంద్ర క్రీడాశాఖ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘ఖేలో ఇండియా’ కార్యక్రమం కోసం రూ. 900 కోట్లు (రూ.20 కోట్లు పెరుగుదల), స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్)కు రూ. 822.60 కోట్లు (రూ.26.83 కోట్లు పెంపు) కేటాయించారు. మౌలిక వసతుల కల్పన, అథ్లెట్లకు అధునిక క్రీడాసామాగ్రి, కోచ్ల నియామకం కోసం ఆ మొత్తాన్ని వినియోగిస్తారు. ఇక జాతీయ క్రీడా సమాఖ్యలకు రూ 340 కోట్లు (రూ.15 కోట్లు పెంచారు) ఇవ్వనున్నారు. జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) బలోపేతానికి రూ. 22.30 కోట్లు కేటాయించారు. నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి రూ. 91.90 కోట్లు (రూ.8.69 కోట్లు హెచ్చింపు) కేటాయించారు. చదవండి: భారత్తో డేవిస్కప్ మ్యాచ్పై పాకిస్తాన్లో అనాసక్తి -
ఇంటి వద్ద పాలు పోస్తూనే సాధన.. పోటీకి వెళితే పతకమే! కాంస్యంతో సత్తా చాటి..
గుంటూరు వెస్ట్ (క్రీడలు): ప్రతిభతో ముందుకు దూకుతున్నారు ఆ హైజంపర్. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. అచంచల ఆత్మ విశ్వాసంతో క్రీడా సాధన చేస్తున్నారు. పార్ట్టైం జాబ్ చేస్తూనే రాణిస్తున్నారు. ఇటీవల లక్నోలో జరిగిన ఖేలో ఇండియా నేషనల్స్లో కాంస్య పతకం కైవసం చేసుకుని తన సత్తాచాటారు షేక్ మొహిద్దీన్. పేద కుటుంబం మొహిద్దీన్ది కాకుమాను మండలం రేటూరు గ్రామం. తండ్రి షేక్ షంషుద్దీన్ పదేళ్ల క్రితం మరణించారు. తల్లి నూర్జహాన్ గృహిణి. ఇంటి వద్దే పాలవ్యాపారం చేస్తున్నారు. మొహిద్దీన్ కూలి పనులు చేసుకుంటూ కుటుంబానికి బాసటగా నిలిస్తున్నారు. ఇద్దరక్కలు పెళ్లిళ్లై వెళ్లిపోయారు. ప్రస్తుతం మొహిద్దీన్ ఇంటి వద్ద పాలు పోస్తూనే గుంటూరులో పార్ట్టైమ్ ఉద్యోగం చేస్తున్నారు. రాత్రి వరకు హైజంప్ సాధన చేస్తున్నారు. పోటీకి వెళితే పతకమే హైజంప్ వైవిధ్యమైన క్రీడ. పోటీ తక్కువగా ఉన్నా, సాధనలో తేడా వస్తే వైకల్యం సంభవించే అవకాశం ఉంది. జిల్లా స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదిగిన మొహిద్దీన్ ఏ పోటీలకు వెళ్లినా పతకం సాధించి తీసుకొస్తున్నారు. ఇప్పటివరకు 20కుపైగా రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని 10 బంగారు, మరో 10 రజత, కాంస్య పతకాలు సాధించారు. ఏడుసార్లు జాతీయ పోటీల్లో పాల్గొన్నారు. అన్నింటా ఉత్తమ ప్రతిభ కనబరిచారు. పూర్తిగా సాధనలో నిమగ్నమైతే దేశానికి అతి త్వరలోనే ప్రాతినిధ్యం వహించే అవకాశముందని అతని శిక్షకులు అంటున్నారు. అయితే ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో వీలు కావడంలేదు. స్పాన్సర్షిప్ ఇప్పించండి ఖేలో ఇండియా నేషనల్స్లో కూడా 2.06 మీటర్ల ఎత్తు జంప్ చేశాను. ఇది బెస్ట్ మీట్ రికార్డ్. అందుకే కాంస్య పతకం వచ్చింది. సాధన, పోటీల్లో పాల్గొనేందుకు స్పాన్సర్షిప్ ఇప్పించాలని మనవి. ఇటీవల శాప్ పెద్దలను కలిశాను. ఒక్క ఏడాది మనస్సుపెట్టి సాధన చేస్తే తప్పకుండా దేశానికి ప్రాతినిధ్యం వహిస్తాను. హైజంప్కు నా దేహం చాలా బాగా సహకరిస్తుందని జాతీయస్థాయి శిక్షకులూ చెప్పారు. ఎప్పటికై నా ఈ దేశానికి ప్రాతినిధ్యం వహించాలని కోరిక – షేక్ మొహిద్దీన్, నేషనల్ హైజంపర్. చదవండి: సచిన్ టెండూల్కర్ కొత్త ఇన్నింగ్స్ షురూ.. ఇంతకంటే చెత్త ఆలోచన మరొకటి లేదు: రవిశాస్త్రిని ఏకిపారేసిన గంభీర్ -
మనవాళ్ళు బంగారం
ఇది మన అమ్మాయిలు రాసిన కొత్త చరిత్ర. ఒకటీ రెండు కాదు... ఏకంగా నాలుగు స్వర్ణాలు. అదీ అంతర్జాతీయ పోటీల్లో! ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ (ఐబీఏ) నిర్వహించిన మహిళల వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్స్లో మన దేశ మహిళా బాక్సింగ్ జట్టు నాలుగు పసిడి పతకాలతో ప్రపంచమంతా తలతిప్పి చూసేలా చేసింది. ఢిల్లీలో జరిగిన ఈ పోటీల్లో శనివారం నీతూ ఘంఘాస్ (48 కిలోల విభాగం), స్వీటీ బూరా (81 కిలోలు) బంగారు పతకాలు సాధిస్తే, ఆదివారం మన తెలుగమ్మాయి నిఖత్ జరీన్ (50 కిలోలు), లవ్లీనా బొర్గొహైన్ (75 కిలోలు) పసిడి కాంతులు పూయించారు. మొత్తం నలుగురూ తమ బాక్సింగ్ పంచ్లతో బలమైన ప్రత్యర్థులను మట్టికరిపించి, దేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేశారు. నిన్నటి మేరీ కోమ్ వారసులుగా బాక్సింగ్లో మరింత మంది యువతులు ముందుకొచ్చిన చరిత్రాత్మక సందర్భం పతకాల సాక్షిగా వెల్లడైంది. హర్యానా ఆడపిల్ల నీతూ, తెలంగాణ యువతి నిఖత్, అస్సామ్ అమ్మాయి లవ్లీనా, హర్యానాకే చెందిన సీనియర్ క్రీడాకారిణి స్వీటీ... నలుగురూ దేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేశారు. స్వర్ణపతకం సాధించి తల్లి మెడలో దాన్ని అలంకరించాలని ఓ అమ్మాయి, బహుమతిగా వచ్చే పారితోషికంతో కొత్త మెర్సిడెస్ కారు కొని తల్లితండ్రులను తమ సొంతవూరు నిజామాబాద్కు తీసుకెళ్ళాలని మరో యువతి, సరైన ఫామ్లో లేవంటూ కొట్టిపారేసిన విమర్శకుల నోళ్ళు మూయించాలని ఇంకో వనిత, ఇష్టదైవతారాధన, ఆశీస్సులతోనే విశ్వవేదికపై విజయం సాధ్యమని భావించే వేరొక హర్యానా యువతి – ఇలా ఈ నలుగురిలో ఒక్కొక్కరికీ ఒక్కో రకమైన ప్రేరణ. మొత్తం 13 దేశాల నుంచి వచ్చి, ప్రపంచపోరులో ఫైనల్స్కు చేరిన మహిళలు 24 మంది. వారిలో భారత మహిళా బాక్సింగ్ చతుష్టయం సత్తా చాటింది. భారత్తో పాటు ఒక్క చైనా నుంచే నలుగురు ఫైనల్స్కు చేరుకొని, స్వర్ణాల కోసం పోటీపడ్డారు. గత ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్షిప్లో 3 పతకాలు సాధించిన భారత్ ఈసారి 4 పతకాలు గెలిచి, మునుపటి రికార్డును మెరుగుపరుచుకోవడం విశేషం. గత ఏడాది 52 కిలోల విభాగంలో వరల్డ్ టైటిల్ సాధించిన 26 ఏళ్ళ నిఖిత్ ఈసారి కొత్తగా 50 కిలోల విభాగం ఎంచుకొని, అందులో తన సత్తా చాటారు. గతంలో రెండుసార్లు ఏషియన్ ఛాంపియన్ అయిన వియత్నామ్కు చెందిన ప్రత్యర్థి నూయెన్ తీ తామ్పై ఫైనల్లో 5–0 తేడాతో విజయం సాధించారు. కీలకమైన ఆఖరి మూడు నిమిషాల ఆటలో, ప్రత్యర్థి చాలా దూకుడు మీద ఉన్నప్పుడు, శరీర దార్ఢ్యం, మానసిక బలం తోడుగా నిఖత్ ప్రతిష్ఠాత్మక ప్రపంచ పోటీల్లో వరుసగా రెండుసార్లు స్వర్ణాలు సాధించి, చరిత్రకెక్కారు. మేరీ లానే ఈశాన్య ప్రాంతం నుంచి వచ్చిన లవ్లీనా సైతం ఫైనల్లో రెండుసార్లు కామన్వెల్త్ గేమ్స్ పతక విజేత అయిన ఆస్ట్రేలియాకు చెందిన గెయిట్లిన్ పార్కర్పై హోరాహోరీ పోరాడి, 5–2 తేడాతో గెలుపు కైవసం చేసుకున్నారు. ఎప్పుడూ ఎదురుదాడి అనే ఏకైక వ్యూహంతో సాగే నీతూ ఆటలో పరిస్థితి, ప్రత్యర్థిని బట్టి వ్యూహాన్ని మార్చుకొనే కళను అలవరుచున్నారు. బాక్సింగ్ మెలకువల్లో ఆరితేరిన నిఖత్ సైతం తాను పోటీపడ్డ ఒలింపిక్ వెయిట్ వర్గంలోని ప్రపంచ అగ్రశ్రేణి బాక్సర్లతో తలపడి, మెరుగైన ఆటతీరుతో దుమ్మురేపడం గమనార్హం. రానున్న ఆసియా క్రీడోత్సవాలకు సిద్ధం కావడానికీ, తప్పులు సరిదిద్దుకోవడానికీ ఈ ప్రపంచ బాక్సింగ్ పోటీలు మన అమ్మాయిలకు మంచి అవకాశమయ్యాయి. మరో 16 నెలల్లో ప్యారిస్లో జరిగే ఒలింపిక్స్లో స్వర్ణమే ధ్యేయంగా ముందుకు సాగే ఊపు తెచ్చింది. నిజానికి, క్రీడల్లో మన దగ్గర ప్రతిభాపాటవాల కొరత లేదు. యువతరంలో బోలెడంత ఉత్సాహం, ఉత్తేజం ఉన్నాయి. అయితే, ఆ యువ క్రీడాప్రతిభను సరైన పద్ధతిలో తీర్చిదిద్ది, దోవలో పెట్టే వేదికలే ఎప్పుడూ కరవు. 2018లో క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ క్షేత్రస్థాయిలో క్రీడా సంస్కృతినీ, ప్రాథమిక వసతి సౌకర్యాలనూ పెంపొందించడానికి హిమాచల్ప్రదేశ్లో ‘ఖేల్ మహాకుంభ్’ను ప్రారంభించారు. క్రమంగా అది బిహార్, ఉత్తరప్రదేశ్, లద్దాఖ్, కశ్మీర్లలోని గ్రామాలకు విస్తరించింది. దేశంలో కనీసం 200 మంది దాకా ఎంపీలు తమ తమ నియోజకవర్గాల్లో ఈ ఖేల్ మహాకుంభ్ను నిర్వహిస్తూ వచ్చారు. ఇవన్నీ దిగువ, మధ్యాదాయ కుటుంబాల యువతుల కలలకు కొత్త రెక్కలు తొడిగాయి. సాంప్రదాయిక పురుషాధిక్య రంగంలోనూ మహిళలు పైకి రావడానికి దోహదపడ్డాయి. ‘బేటీ బచావో, బేటీ పఢావో’ తర్వాత పాలకుల ‘ఖేలో ఇండియా’ పథకం నవతరం ఆశలకు కొత్త ఊపిరి. మెరుగైన శిక్షణకు క్రీడా సామగ్రి అందుబాటులో ఉండే ఖేలో ఇండియా కేంద్రాలు గ్రామీణ యువతరానికి, ముఖ్యంగా యువతులకు వరం. మీడియా దృష్టిపెట్టని అనేక భారతీయ ఆటలు ఈ పథకంతో జనం ముందుకు వస్తున్నాయి. గ్రామీణ స్థాయిలోనే అథ్లెట్లకు ప్రోత్సాహం అందుతోంది. మగవారివే అనుకొనే క్రీడల్లోనూ మన వనితల జైత్రయాత్రకు ఇలాంటి ప్రయత్నాలు ఓ ఉత్ప్రేరకం. లింగభేదాల గోడలను బద్దలుకొట్టి, అందరికీ అభిమాన బాక్సర్గా నిఖత్ అవతరించడం అవిస్మరణీయం. గమనిస్తే, మన దేశపు ఒలింపిక్ పతకాల పట్టికలోనూ మహిళలే మహారాణులు. ఇంటా బయటా ఎన్నో సవాళ్ళను అధిగమించి, ఆరుసార్లు ప్రపంచ టైటిళ్ళు సాధించిన బాక్సర్ మేరీ కోమ్ ఆదర్శంగా మరిన్ని జాతి రత్నాలు వెలుగులోకి వచ్చాయి. 2008 ఒలింపిక్స్లో కాంస్యం సాధించిన విజేందర్ సింగ్ విజయ గాథ తర్వాత మన పురుషుల బాక్సింగ్ కొంత స్తబ్దుగా మారినవేళ బాక్సింగ్ను భారత్కు పతకాల అడ్డాగా మార్చిన మహిళలూ మీకు జోహోర్లు! -
తెలంగాణకు మరో స్వర్ణం
సాక్షి, హైదరాబాద్: ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో బుధవారం తెలంగాణ కుర్రాడు లక్ష్మణ్ జూడోలో (50 కేజీలు ) పసిడి పతకం గెలిచాడు. స్విమ్మింగ్లో బాలుర 400 మీటర్ల వ్యక్తిగత మెడ్లేలో సాయి నిహార్ కాంస్యం... బాలికల 400 మీటర్ల ఫ్రీస్టయిల్లో వ్రితి అగర్వాల్ రజతం నెగ్గారు. రోయింగ్లో బాలుర క్వాడ్రాపుల్ స్కల్స్ రేసులో తెలంగాణ జట్టుకు కాంస్యం దక్కింది. చదవండి: IND vs AUS: తొలి బంతికే సిరాజ్ వికెట్.. రోహిత్, ద్రవిడ్ రియాక్షన్ మామూలుగా లేదుగా! వీడియో వైరల్ -
ఏపీ: ఖేలో ఇండియాకు ప్రత్యేక శిక్షణ
సాక్షి, అమరావతి: ఖేలో ఇండియా–2022 జాతీయ పోటీలకు ఏపీ క్రీడాకారుల బృందం సమాయత్తం అవుతోంది. ఈ నెల 30 నుంచి ఫిబ్రవరి 11వ తేదీ వరకు అండర్–19 బాలబాలికల విభాగంలో దేశ వ్యాప్తంగా క్రీడాకారులు పోటీపడనున్నారు. ఇందులో 13 క్రీడాంశాల్లో ఏపీ బృందం అర్హత సాధించగా 87 మంది క్రీడాకారులు రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు. చరిత్రలో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ఖేలో ఇండియాకు వెళ్తోన్న క్రీడాకారులకు ప్రత్యేక శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేసింది. రెండు వారాల పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లోని స్పెషల్ కోచ్లతో క్రీడాకారులకు శిక్షణ అందించనుంది. ఇక్కడే ప్రత్యేక శిక్షణ ఖేలో ఇండియా పోటీల్లో క్రీడాకారులు పతకాలు సాధించేలా శాప్ ప్రోత్సహిస్తోంది. 53 మంది బాలురు, 32 బాలికల క్రీడాకారులతో ప్రత్యేక శిక్షణ క్యాంప్నకు శ్రీకారం చుట్టింది. అథ్లెటిక్స్ (ఏఎన్యూ), షూటింగ్, వెయిట్ లిఫ్టింగ్ (కాకినాడ డీఎస్ఏ), స్విమ్మింగ్ (ఈడుపుగల్లు), జూడో (అనకాపల్లి డీఎస్ఏ), బాక్సింగ్ (విజయనగరం డీఎస్ఏ), బ్యాడ్మింటన్, కానోయింగ్ అండ్ కయాకింగ్, ఆర్చరీ (విజయవాడ), ఖోఖో, జిమ్నాస్టిక్స్ (బీఆర్ స్టేడియం గుంటూరు), మల్లఖంబ (భీమవరం), గటక్ (రేణిగుంట)లో ఈ నెల 17 నుంచి కోచింగ్ క్యాంప్ను ప్రారంభించనుంది. క్రీడాకారులకు డీఏ ఖేలో ఇండియా–2022 జాతీయ పోటీలు మధ్యప్రదేశ్లోని భోపాల్, ఇండోర్, గ్వాలియర్, ఉజ్జయిని, జబల్పూర్, మండల, బాలాఘాట్, ఖర్గోన్ వేదికగా జరగనున్నాయి. భారత క్రీడా ప్రాధికార సంస్థ క్రీడాకారులకు ప్రయాణ సౌకర్యాన్ని కలి్పస్తుండగా ఏపీ ప్రభుత్వం ప్రతి ఒక్క క్రీడాకారుడికి నేరుగా డీఏను అందించనుంది. ఖేలో ఇండియాకు అత్యధికంగా బాక్సింగ్లో 10 మంది, మల్లఖంబలో 12 మంది, వెయిట్ లిఫ్టింగ్లో 19 మంది క్రీడాకారులు ఏపీ నుంచి అర్హత సాధించడం విశేషం. పతకాలు నెగ్గేలా తర్ఫీదు రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. జాతీయ స్థాయిలో జరిగే ప్రతి మీట్లో పతకాలు సాధించేలా తరీ్ఫదును అందిస్తున్నాం. ఈ సారి ఖేలో ఇండియా పోటీల్లో అర్హత సాధించిన క్రీడాంశాలతో పాటు వయిల్కార్డ్ ద్వారా పాల్గొన్న క్రీడాకారులు కూడా కచి్చతంగా పతకం నెగ్గేలా ప్రణాళిక రూపొందించాం. అందుకే రాష్ట్రంలోని నిపుణులైన కోచ్లతో ప్రత్యేక శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశాం. – ఆర్కే రోజా, పర్యాటక, క్రీడా శాఖ మంత్రి. -
ప్రాథమిక స్థాయిలో శిక్షణేదీ?
ఇటీవల 36వ జాతీయ క్రీడలను ప్రారంభిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ... గత పాలకుల వైఫల్యం, క్రీడల్లో బంధుప్రీతి, అవినీతి, తీవ్రమైన మౌలిక వసతుల కొరత వంటి కారణాలవల్ల ప్రపంచ క్రీడా వేదికలపై మనం వెనుకపడ్డామని అన్నారు. విద్యావిధానంలో భాగంగా క్రీడా విధానాన్ని చూసినప్పుడే క్రీడలు కాలానుగుణంగా అభివృద్ధి చెందుతాయి. మన ప్రభుత్వాలు ఆ విషయాన్ని మరచాయి. 1968లో ఇందిరాగాంధీ, 1986లో రాజీవ్ గాంధీ, 1992లో పీవీ నరసింహారావు ప్రభుత్వాలు జాతీయ విద్యా విధానంలో మార్పులు చేసినప్పటికీ క్రీడలకు సముచిత స్థానం కల్పించలేకపోయాయి. కానీ మోదీ ప్రభుత్వ ఆధ్వర్యంలో వచ్చిన నూతన విద్యా విధానం – 2020లో వ్యాయామ విద్యకు ప్రాధాన్యం ఇవ్వడం గమనార్హం. మోదీ ప్రభుత్వం ప్రత్యేకంగా తీసుకొచ్చిన ‘గ్రాస్ రూట్ టాలెంట్ హంట్’ అనే నినాదంతో ‘ఖేలో ఇండియా’ గేమ్స్ను తీసుకురావడం కొంతవరకు మంచి సత్ఫలితాలు ఇస్తున్నప్పటికీ ఇంకా అనేక అంశాలలో దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్ర జనాభా కన్నా చాలా తక్కువ ఉన్న దేశాలు కూడా ఒలింపిక్స్లో మొదటి పది దేశాల జాబితాలో ఉంటున్నాయి. ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెటిక్స్ ఈవెంట్స్, ఈత కొలనులో జరిగే పోటీల్లో అత్యంత వెనుకబడిన దేశాలూ ఎన్నో పతకాలను కొల్లగొడు తున్నాయి. కాబట్టి మనం కూడా వీటిపై ప్రత్యేక శ్రద్ధపెడితే మంచి ఫలితాలు వస్తాయి. విద్యాహక్కు చట్టం–2009 ప్రతి పాఠశాలలో క్రీడాస్థలం, క్రీడలకు కావాల్సిన సౌకర్యాలు ఉండాలని ప్రతిపాదించింది. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని పట్టించు కున్నట్టు కనిపించదు. చదువు కన్నా ఆటలను ఇష్టపడే వయసులో ఉన్న పిల్లలు ప్రాథమిక పాఠశాలల్లో ఉంటారు. ఆ వయసులోనే పిల్లల్లో నిబిడీకృతమై ఉన్న క్రీడా నైపుణ్యాలు బయటపడతాయి. కానీ దురదృష్టవశాత్తూ మన దేశంలో ప్రాథమిక పాఠశాల స్థాయిలో వ్యాయామ ఉపాధ్యాయులు కనిపించరు. క్రీడల్లో అగ్రదేశాలకు సవాల్ విసురుతున్న చైనా... అతిచిన్న వయసులోనే పిల్లలో ఉన్న క్రీడా సామర్థ్యాన్ని గుర్తించి వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్న విష యాన్ని ఇక్కడ గమనంలో ఉంచుకోవాలి. అందుకే ముందుగా ప్రాథమిక పాఠశా లల్లోనూ వ్యాయామ ఉపాధ్యాయులను నియ మించాలి. పాఠశాలలూ, కళాశాలల్లోనే కాక... గ్రామ, మండల, జిల్లా స్థాయుల్లో క్రీడా మైదానాలు ఏర్పాటు చేసి శిక్షకులనూ అందుబాటులో ఉంచాలి. అప్పుడే మన దేశంలో ఎంతో మంది పీవీ సింధులు, నికత్ జరీన్లు, నీరజ్ చోప్రాలు మన మువ్వన్నెల జాతీయ పతాకాన్ని ప్రపంచ వేదికపై రెపరెపలాడిస్తారు. (క్లిక్ చేయండి: వెల్లివిరుస్తున్న కొత్త క్రీడా సంస్కృతి!) – జంగం పాండు, ఏబీవీపీ ఖేల్ స్టేట్ కన్వీనర్ -
Khelo India University Games 2021: స్విమ్మర్ అభిలాష్కు రజతం
సాక్షి, హైదరాబాద్: ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్లో హైదరాబాద్ స్విమ్మర్ చల్లగాని అభిలాష్ 400 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో రజత పతకం సాధించాడు. బెంగళూరులో జరిగిన ఈ గేమ్స్లో అభిలాష్ 4ని. 19.86 సెకన్లలో రేసును పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచాడు. వీఎన్ఆర్ విజ్ఞానజ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విద్యార్థి అభిలాష్ జేఎన్టీయూ తరఫున పాల్గొన్నాడు. -
ఓయూ మహిళల టెన్నిస్ జట్టుకు స్వర్ణం
బెంగళూరు: ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్లో ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) మహిళల టెన్నిస్ జట్టు స్వర్ణ పతకం సాధించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో భమిడిపాటి శ్రీవల్లి రష్మిక సారథ్యంలోని ఓయూ జట్టు 2–0తో రాజస్తాన్ యూనివర్సిటీ జట్టును ఓడించింది. ఫైనల్ మ్యాచ్లోని తొలి సింగిల్స్లో సామ సాత్విక 6–2, 6–2తో సాచి శర్మను ఓడించి ఓయూకు 1–0 ఆధిక్యాన్ని అందించింది. రెండో సింగిల్స్లో శ్రీవల్లి రష్మిక 6–0, 6–0తో రెనీ సింగ్పై గెలిచి ఓయూ విజయాన్ని ఖాయం చేసింది. రష్మిక, సాత్వికలతోపాటు అవిష్క గుప్తా, పావని పాథక్లు కూడా ఓయూ జట్టులో సభ్యులుగా ఉన్నారు. ఓయూ జట్టుకు సి.నాగరాజ్ కోచ్గా, సయ్యద్ ఫారూఖ్ కమాల్ మేనేజర్గా వ్యవహరించారు. చదవండి: Uber Cup 2022: ఇక ఉబెర్ కప్ టోర్నీపై దృష్టి: పీవీ సింధు -
స్పోర్ట్స్ కోచ్లకు దరఖాస్తుల ఆహ్వానం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఖేలో ఇండియా కేంద్రాల్లో వివిధ క్రీడాంశాల్లో శిక్షణ ఇచ్చేందుకు 13 మంది కోచ్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ఎండీ ఎన్.ప్రభాకరరెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. బీఏ, బీఎస్సీ, బీకాంతో పాటు సమాన విద్యార్హత, ఎన్ఎస్ఎన్ఐఎస్ డిప్లొమా, ఎన్ఐఎస్ సర్టిఫికెట్ కోర్సు, జాతీయ స్థాయి పతక విజేతలు, ప్రాతినిధ్యం వహించినవారు కూడా అర్హులన్నారు. నెలకు రూ.25 వేలు వేతనం ఉంటుందన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు వచ్చే నెల 4వ తేదీలోగా దరఖాస్తులను విజయవాడలోని శాప్ ప్రధాన కార్యాలయానికి లేదా kisce.ap@gmail. comకు పంపాలన్నారు. మరిన్ని వివరాలకు www.sports. ap.gov.in వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఖేలో ఇండియా పథకంలో భాగంగా జిల్లాకు ఒక్కో క్రీడాంశం చొప్పున 13 ఖేలో ఇండియా కేంద్రాలను మంజూరు చేసిందన్నారు. -
క్రీడా బడ్జెట్లో రూ. 230 కోట్లు కోత
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారితో దేశ క్రీడా రంగం కుదేలైన వేళ బడ్జెట్లో క్రీడల ప్రాధాన్యాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తగ్గించారు. సోమవారం 2021–22 వార్షిక బడ్జెట్ను ప్రవేశ పెట్టిన ఆమె క్రీడా బడ్జెట్లో రూ. 230.78 కోట్లు కోత విధిం చారు. గతేడాది క్రీడల కోసం రూ. 2826.92 కోట్లు కేటాయించగా... ఈసారి ఆ మొత్తాన్ని రూ. 2596.14కోట్లతో సరిపెట్టారు. ► మరోవైపు మోదీ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఖేలో ఇండియా’ కార్యక్రమానికి సైతం బడ్జెట్లో ప్రాధాన్యం భారీగా తగ్గింది. గతేడాది రూ. 890.42 కోట్లుగా ఉన్న ఈ మొత్తాన్ని ఈ ఏడాదికి గానూ రూ. 657.71 కోట్లకు కుదించారు. దీంతో ఏకంగా రూ. 232.71 కోట్లపై కోత పడింది. ► అయితే జాతీయ స్థాయి క్రీడా కార్యక్రమాలను, క్రీడాకారులను, సంస్థలను పర్యవేక్షించే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్)తోపాటు నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్లకు (ఎన్ఎస్ఎఫ్) కేంద్రం సముచిత ప్రాధాన్యాన్నిచ్చింది. బడ్జెట్ కేటాయింపులో గతేడాదితో పోలిస్తే భారీ పెంపును ప్రకటించింది. దీంతో ‘సాయ్’ నిధులు రూ. 500 కోట్లు నుంచి రూ. 660.41 కోట్లకు చేరగా... సమాఖ్యల బడ్జెట్ రూ. 245 కోట్లు నుంచి ఏకంగా రూ. 280 కోట్లకు పెరిగింది. ► క్రీడాకారులకు అందించే ప్రోత్సాహకాలను రూ. 70 కోట్ల నుంచి రూ. 53 కోట్లకు తగ్గిస్తున్నట్లుగా బడ్జెట్లో ప్రతిపాదించారు. ► జాతీయ క్రీడాభివృద్ధి నిధుల్లోనూ కత్తెర వేశారు. సగానికి సగం తగ్గించి ఈ మొత్తాన్ని రూ. 25 కోట్లుగా నిర్ధారించారు. ► కామన్వెల్త్ క్రీడల సన్నాహాల బడ్జెట్ను రూ. 75 కోట్లు నుంచి రూ. 30 కోట్లకు తగ్గించిన కేంద్రం... జమ్ము కశ్మీర్లో క్రీడా సదుపాయాల కల్పన నిధులు (రూ. 50 కోట్లు), జాతీయ క్రీడాకారుల సంక్షేమానికి కేటాయించే నిధుల్లో (రూ. 2 కోట్లు) ఎలాంటి మార్పుచేర్పులు చేయలేదు. ► గ్వాలియర్లోని లక్ష్మీబాయి జాతీయ వ్యాయామ విద్య సంస్థ బడ్జెట్ను యథాతథంగా రూ. 55 కోట్లుగా కొనసాగించింది. ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థకు కేటాయించే నిధుల్ని రూ. 2 కోట్లు నుంచి రూ. 2.5 కోట్లకు పెంచింది. -
క్రీడా రంగానికి కేటాయింపులెన్నో!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రవేశపెట్టనున్న 2021–22 వార్షిక బడ్జెట్లో క్రీడా రంగానికి లభించే కేటాయింపులపై ఆసక్తి నెలకొంది. గత కొన్నేళ్లుగా బడ్జెట్లో క్రీడారంగానికి ప్రాధాన్యత పెరిగినప్పటికీ, కేటాయింపుల్లో నిలకడ లోపించింది. గతేడాది (2020–21) ఖేలో ఇండియా గేమ్స్ కోసం రూ. 890 కోట్లను కేటాయించిన కేంద్రం... భారత క్రీడాప్రాధికార సంస్థ (సాయ్), జాతీయ క్రీడా సమాఖ్య (ఎన్ఎస్ఎఫ్)ల నిధుల్లో కోత విధించింది. 2019లో రూ. 615 కోట్లుగా ఉన్న ‘సాయ్’ కేటాయింపులు గతేడాది రూ. 500 కోట్లకు తగ్గగా... క్రీడా సమాఖ్యలకు (రూ. 245 కోట్ల నుంచి రూ. 55 కోట్లకు తగ్గింపు) సైతం భారీ కోత పడింది. అయితే కరోనా ప్రభావంతో కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి సిద్ధం చేసిన ఈ బడ్జెట్లో క్రీడారంగానికి ఎన్ని నిధులు దక్కుతాయనేది ఆసక్తికరం. ► లాక్డౌన్ కారణంగా యూత్ స్పోర్ట్స్కు ఆదరణ పెరగడంతో ఈసారి బడ్జెట్లో క్రీడలపై ఎక్కువ వెచ్చించే అవకాశముంది. ► మరోవైపు కేంద్రం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఖేలో ఇండియా, ఫిట్ ఇండియా కార్యక్రమాలను విజయవంతం చేయాలంటే అందుకు తగిన నిధులు కేటాయించాల్సిందే. ► లింగ సమానత్వాన్ని పెంపొందించేందుకు, క్రీడల్ని కెరీర్గా ఎంచుకున్న మహిళలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే అంశంపై కేంద్రం దృష్టి సారించాల్సి ఉంది. దీనితో పాటు ఒలింపిక్స్ ఏడాది కావడంతో ఆటగాళ్లకు దన్నుగా నిలిచేందుకు ‘సాయ్’, ఎన్ఎస్ఎఫ్లకు ఎక్కువ నిధులు కేటాయించాల్సి ఉంటుంది. ► కరోనా కారణంగా ప్రజలు ఇంటికే పరిమితం కావడంతో గతేడాది గేమింగ్ సెక్టార్ విపరీతంగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో ఈస్పోర్ట్స్, గేమింగ్ సెక్టార్లను అభివృద్ధి చేసే స్వదేశీ గేమ్ డెవలపర్స్, స్టార్టప్స్ను ప్రోత్సహిస్తూ బడ్జెట్లో తగిన ప్రాధాన్యం ఇస్తే... నరేంద్ర మోదీ ప్రభుత్వం కృషి చేస్తోన్న మేకిన్ ఇండియా బ్రాండ్కు మంచి ప్రోత్సాహం లభించినట్లు అవుతుంది. -
‘ఖేలో ఇండియా’ కేంద్రంగా వైఎస్సార్ స్పోర్ట్స్ స్కూల్
న్యూఢిల్లీ: భవిష్యత్ ఒలింపిక్స్ చాంపియన్లను తయారు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఖేలో ఇండియా’ పథకంలో ఆంధ్రప్రదేశ్లోని వైఎస్సార్ కడప జిల్లా చోటు దక్కించుకుంది. దేశ వ్యాప్తంగా ఏడు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ‘ఖేలో ఇండియా స్టేట్ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ (కేఐఎస్సీఈ)’ కేంద్రాలను అభివృద్ధి చేయనున్నట్లు కేంద్ర క్రీడా శాఖ శనివారం ప్రకటించింది. ఇందులో వైఎస్సార్ జిల్లాలోని ‘డా. వైఎస్సార్ స్పోర్ట్స్ స్కూల్’ ఎంపిక కావడం విశేషం. ఈ పథకంలో స్థానం దక్కడంతో వైఎస్సార్ స్పోర్ట్స్ స్కూల్లో మౌలిక వసతులు, హై పెర్ఫార్మెన్స్ అధికారులు, కోచ్లు, సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ఇతరత్రా సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ ఏడాది ఆరంభంలో 14 సెంటర్లను కేఐఎస్సీఈగా మారుస్తున్నట్లు క్రీడా శాఖ ప్రకటించగా... తాజా జాబితాతో వాటి సంఖ్య 23కు చేరింది. తాజాగా ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్తో పాటు ఛత్తీస్గఢ్, చంఢీగఢ్, గోవా, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, త్రిపుర, పుదుచ్చేరి, జమ్మూ కశ్మీర్లు చేరాయి. -
తెలంగాణాలో ‘ఖేలో ఇండియా’ కేంద్రం
న్యూఢిల్లీ: భవిష్యత్ ఒలింపిక్స్ చాంపియన్లను తయారు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఖేలో ఇండియా’ పథకంలో తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు దక్కింది. దేశ వ్యాప్తంగా ఎనిమిది రాష్ట్రాల్లో ‘ఖేలో ఇండియా స్టేట్ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ (కేఐఎస్సీఈ)’ కేంద్రాలను అభివృద్ధి చేసేందుకు కేంద్ర క్రీడా శాఖ సిద్ధమైంది. ఇందులో తెలంగాణ రాష్ట్రానికి చోటు దక్కింది. తొలి దశలో తెలంగాణతోపాటు ఒడిశా, మిజోరం, మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ప్రదేశ్, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో ఈ కేంద్రాలను అభివృద్ధి చేయనున్నారు. ఇందుకుగానూ రూ. 95.15 కోట్ల బడ్జెట్ను క్రీడాశాఖ వెచ్చించనుంది. ఎంపిక చేసిన రాష్ట్రాల క్రీడా ప్రాంగణాల్లో మౌలిక వసతుల కల్పన, స్పోర్ట్స్ సైన్స్ సెంటర్ల ఏర్పాటు, నిపుణులైన కోచ్ల నియామకం, ఆటగాళ్ల కోసం ఫిజియోథెరపిస్టులతో పాటు స్ట్రెంథెనింగ్ కండిషనింగ్ నిపుణులను అందుబాటులోకి తీసుకురానున్నారు. రాష్ట్రాల సహకారంతో ఈ ఎక్స్లెన్స్ కేంద్రాలను నిర్వహిస్తామని కేంద్ర క్రీడా శాఖ పేర్కొంది. ‘ప్రతీ ఎక్స్లెన్స్ కేంద్రం 14 ఒలింపిక్స్ క్రీడాంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తుంది. ఇందులో మూడు క్రీడాంశాలకు ఆయా రాష్ట్రాలు మద్దతుగా నిలుస్తాయి. ఈ అత్యాధునిక కేంద్రాలు ఒక నిర్దిష్ట క్రీడలో నైపుణ్యం ఉన్న అథ్లెట్లకు అత్యున్నత స్థాయి శిక్షణ అందిస్తాయి. 2028 నాటికి పతకాల జాబితాలో టాప్–10లో భారత్ నిలిచేందుకు ఈ కేంద్రాలు దోహదపడతాయి’ అని కేంద్ర క్రీడా మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. -
‘సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్’ కేంద్రంగా స్పోర్ట్స్ స్కూల్
ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఖేలో ఇండియా’ కార్యక్రమాన్ని మరింత ఫలవంతం చేసేందుకు క్రీడా శాఖ పటిష్ట కార్యాచరణతో ముందుకొచ్చింది. దేశవ్యాప్తంగా ‘సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్’ కేంద్రాలను ఏర్పాటు చేసి వాటి ద్వారా విద్యార్థులను అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రచించింది. ఈ మేరకు తెలంగాణలో హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్ను ‘ఖేలో ఇండియా స్టేట్ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ (కేఐఎస్సీఈ)’ కేంద్రంగా ప్రకటించింది. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల నుంచి ప్రతిపాదనలు రాగా మెరుగైన క్రీడా వసతులున్న ఎనిమిది రాష్ట్రాలకు కేంద్ర క్రీడా శాఖ ఆమోదముద్ర దక్కింది. అందులో తెలంగాణలోని హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్ ఒకటి. దీనితో పాటు కర్ణాటక, ఒడిశా, కేరళ, అరుణాచల్ప్రదేశ్, మణిపూర్, మిజోరామ్, నాగాలాండ్ రాష్ట్రాలు కూడా కేఐఎస్సీఈలను ఏర్పాటు చేయనున్నాయి. ఆయా రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు, శిక్షణ, వసతుల ఆధారంగానే వీటిని ఆమోదించినట్లు క్రీడాశాఖ వెల్లడించింది. వీటి అభివృద్ధికి కేంద్రం నుంచి గ్రాంట్ లభించనుంది. కేఐఎస్సీఈ హోదాకు తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ను ఎంపిక చేయడం పట్ల రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్) చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ కేంద్రాల ద్వారా రాష్ట్రంలోని క్రీడాకారులకు లబ్ధి చేకూరుతుందని అన్నారు. -
‘ఖేలో ఇండియా’ అథ్లెట్లకు రూ. 30 వేలు: సాయ్
న్యూఢిల్లీ: భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) 2,749 మంది ‘ఖేలో ఇండియా’ అథ్లెట్లకు ఖర్చుల కోసం ఒక్కొక్కరికి రూ.30 వేలు చెల్లించింది. ఖేలో ఇండియా స్కాలర్షిప్లో భాగంగా ఏడాదికి రూ. 1.20 లక్షలు ఒక్కో అథ్లెట్కు చెల్లిస్తారు. 2020–21 సీజన్లో తొలి త్రైమాసికానికి ఆ మొత్తాన్ని అథ్లెట్ల బ్యాంక్ ఖాతాల్లో జమ చేశామని ‘సాయ్’ తెలిపింది. ఖేలో ఇండియా అథ్లెట్ల జాబితాలో మొత్తం 21 క్రీడాంశాలకు చెందిన 2,893 మంది ఉన్నారని, వీరిలో 2,749 మందికి చెల్లింపులు చేశామని, మిగతా 144 మందికి కూడా త్వరలోనే వారి ఖాతాల్లో నగదు బదిలీ చేస్తామని సాయ్ అధికారులు తెలిపారు. సొంతూళ్లకు వెళ్లేందుకు, వ్యక్తిగత, ఇతరత్రా ఖర్చుల కోసం ప్రతి త్రైమాసికానికి రూ. 30 వేలు భత్యంగా చెల్లిస్తారు. -
100 మీటర్ల రేసులో దీప్తికి స్వర్ణం
గువాహటి: ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో తెలంగాణకు మరో స్వర్ణం లభించింది. గువాహటిలో జరుగుతున్న ఈ క్రీడల్లో ఆదివారం జరిగిన అండర్–17 బాలికల 100 మీటర్ల విభాగం ఫైనల్లో జీవంజి దీప్తి విజేతగా నిలిచింది. దీప్తి 12.26 సెకన్లలో గమ్యానికి చేరి కొత్త మీట్ రికార్డు నెలకొల్పింది. రుతిక శరవణన్ (తమిళనాడు), షెరోన్ మారియా (తమిళనాడు)లకు వరుసగా రజత, కాంస్య పతకాలు లభించాయి. -
తెలంగాణ నుంచి బరిలో 115 మంది
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక ఖేలో ఇండియా పోటీల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు తెలంగాణ రాష్ట్ర జట్టు సిద్ధమైంది. గువాహటిలో నేటి నుంచి 22వ తేదీ వరకు జరిగే ఈ పోటీల్లో రాష్ట్రానికి చెందిన 115 మంది క్రీడాకారులు పాల్గొననున్నారు. మొత్తం 16 క్రీడాంశాల్లో తెలంగాణ క్రీడాకారులు ప్రాతినిధ్యం వహించనున్నారు. అండర్–17, అండర్–21 బాలబాలికల విభాగాల్లో జరిగే ఈ మెగా టోర్నీలో 90 మంది వ్యక్తిగత ఈవెంట్లలో, 24 మంది టీమ్ విభాగాల్లో పాల్గొంటారు. తెలంగాణ రాష్ట్ర జట్టుకు చెఫ్ డి మిషన్గా రవీందర్ వ్యవహరించనున్నారు. రాష్ట్ర జట్ల వివరాలు: ∙ ఆర్చరీ: శంకర్ పట్నాయక్, కె. సింధూజ. అథ్లెటిక్స్: మహేశ్, అనికేత్, రుచిత, పద్మశ్రీ, దీప్తి, అక్షయ్చౌదరీ, జి. మహేశ్వరి, నందిని, బ్యాడ్మింటన్: నవనీత్, పి. విష్ణు, సామియా ఇమాద్ ఫరూఖీ, శ్రీవిద్య, గంధం ప్రణవ్, పుల్లెల గాయత్రి, మొహమ్మద్ ఖదీర్, శ్రీయ సాయి, మేఘన రెడ్డి, తరుణ్, అచ్యుతాదిత్య రావు బాక్సింగ్: నిహారిక. సైక్లింగ్: చిరాయుశ్, తనిష్క్, ఆశీర్వాద్ సక్సేనా, సాయిరామ్, ఉదయ్ కుమార్, ప్రణయ్, రాకేశ్, అరుణ్, యశ్వంత్ కుమార్, రాజ్కుమార్, దామోదర్ ముదిరాజ్. జిమ్నాస్టిక్స్: అక్షితి మిశ్రా, సురభి ప్రసన్న, విశాల్, అనన్య, సౌమ్య, సూర్యదేవ్, కె. సాయి హరిణి. జూడో: సాయిరామ్ దేవేందర్. కబడ్డీ: అంజి, ప్రవీణ్ కుమార్, జి. రాజు, శివకుమార్, రాజు నాయక్, తేజావత్ శ్రీనాథ్, మనోజ్, శ్రీ ప్రకాశ్, మేఘావత్ లక్కీరామ్, సుశాంక్, సంతోష్, సాహిల్. ఖో–ఖో: శ్రీరామ్, అన్వేశ్, ప్రసాద్, మనోజ్, ఉదయ్ కుమార్, జీవిత్ రావు, టి. మహేశ్, గణేశ్, వెంకటేశ్, సోమరాజు, తరుణ్ కుమార్, సతీశ్, అశోక్, సాయికుమార్, మన్మథరావు, జగపతి, ప్రవీణ్ కుమార్, నరేశ్ నాయక్, ప్రశాంత్, మహేందర్, నరేశ్, శ్రీనాథ్, హేమంత్, వసంతరావు. షూటింగ్: రుద్రరాజు ఆయుశ్, హోమాన్షిక రెడ్డి, ధనుశ్ శ్రీకాంత్, జహ్రా ముఫద్దల్ దీసవాలా, మునేక్, కాత్యాయని, ధీరజ్. స్విమ్మింగ్: గోలి జాహ్నవి, వై. జశ్వంత్ రెడ్డి, సాయి నిహార్, తనుజ్. టేబుల్ టెన్నిస్: ఎస్ఎఫ్ఆర్ స్నేహిత్, నైనా, మొహమ్మద్ అలీ, వరుణి. టెన్నిస్: శ్రీవల్లి రష్మిక భమిడిపాటి, సంస్కృతి దామెర, సంజన సిరిమల్ల, సాయికార్తీక్ రెడ్డి, శ్రావ్య శివాని, ఆయుశ్, సామ సాత్విక, వేదరాజు ప్రపూర్ణ, తీర్థశశాంక్. వెయిట్ లిఫ్టింగ్: ఎం. హనుమాన్ నిహాల్రాజ్, కార్తీక్, గణేశ్, సాహితి, గంగా భవాని, గురునాయుడు, సాగరిక, గంగోత్రి, స్వప్న, అనూష, సింధూజ, రాజేశ్వరి, శివాని, అఖిల్. -
కూలీబిడ్డలు.. బాక్సింగ్ కింగ్లు
కరీంనగర్ స్పోర్ట్స్: వారంతా కూలీల బిడ్డలు. ఇల్లుగడవడమే కష్టంగా ఉన్న తరుణంలో వారి తల్లిదండ్రులు తమ పిల్లలను బాక్సర్లుగా చూడాలనుకున్నారు. మేరీకాం లాంటి మహోన్నత వ్యక్తిని ఆదర్శంగా తీసుకున్నారు.దేశానికి ఒలింపిక్ పతకం తేవాలనుకున్నారు.ప్రపంచానికి ఇండియా పంచ్ పంచ్ చూపించాలనుకుంటున్నారు. కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియంలో రెండ్రోజులుగా జరుగుతున్న రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలకు జాతీయస్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారి నేపథ్యంపై కథనం.. కూలీబిడ్డ కాంస్య పతక విజేత వరంగల్ జిల్లా హన్మకొండకు సీహెచ్.దివ్య బాక్సింగ్లో దిట్ట. నాన్న కూలీ చేస్తుండగా అమ్మ గృహిణి. ఇప్పటి వరకు ఐదుసార్లు జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంది. గత సంవత్సరం పాఠశాలల జాతీయక్రీడా పోటీల్లో అద్వితీయ పోరాటపటిమ కనబరిచి కాంస్య పతకం సాధించింది. మేరీకామ్ స్ఫూర్తితో ఒలింపిక్లాంటి మెగాపోటీల్లో ప్రాతినిథ్యం వహించాలనుకుంటోంది. ఆటోడ్రైవర్ కొడుకు భాగ్యనగరంలో బాక్సింగ్లో రాణించి ఇండియన్ బాక్సర్గా పేరుసంపాదించడమే తన ఆశయమంటున్నాడు హైదరాబాద్కు చెందిన వేణు. నాన్న సిటీలో ఆటోడ్రైవర్గా పనిచేస్తుండగా తల్లి గృహిణి. నాలుగుసార్లు జాతీయస్థాయితో పాటు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఖేలో ఇండియాలో పాల్గొని సత్తా చాడాడు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జాతీయ పోటీల్లో కాంస్య పతకం సాధించాడు. ఖేలో ఇండియాలో కూలీకొడుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన గణేష్ బాక్సింగ్లో దిట్ట. మంథనిలోని గురుకుల కళాశాలలో చదువుతున్నాడు. ఇప్పటి వరకు 8సార్లు సత్తా చాటాడు. తండ్రి కూలీ పనిచేస్తుండగా తల్లి గృహిణి. గతేడాది జరిగిన ఖేలో ఇండియా పోటీల్లో కరీంనగర్ నుంచి సత్తాచాటాడు. గణేష్ భవిష్యత్లో ఐపీఎస్ అధికారిగా సేవలందించాలనుకుంటున్నాడు. -
రాజ్యవర్ధన్ నయా ఛాలెంజ్
న్యూఢిల్లీ: గతంలో క్రీడాకారులు, బాలీవుడ్ తారలకు ఫిట్నెస్ చాలెంజ్ విసిరిన కేంద్ర క్రీడల మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ తాజాగా మరో సవాల్కు శ్రీకారం చుట్టారు. బుధవారం పుణేలో ‘ఖేలో ఇండియా’ క్రీడాపోటీలను ప్రారంభించిన ఆయన #5MinuteAur పేరుతో చేసిన కొత్త చాలెంజ్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ఆయన రెండు చేతులతోనూ టేబుల్ టెన్నిస్ ఆడుతూ కనిపించారు. ‘చిన్నప్పుడు మనం హోమ్వర్క్ చేసుకోకుండా ఆడుకుంటూ ఉంటే అమ్మ మనల్ని వారించేది. వచ్చి హోమ్వర్క్ చేసుకోవాలని హెచ్చరించేది. అప్పుడు మనం ‘ఇంకో ఐదు నిమిషాలే’ అని అనే ఉంటాం. ఈ అనుభవం దాదాపు అందరికీ ఎదురయ్యే ఉంటుంది. ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరూ ఐదు నిమిషాల పాటు క్రీడల గురించి ఆలోచించండి. ఖేలో ఇండియా కార్యక్రమంలో భాగంగా మీకు కూడా ఇలాంటి అనుభవాలు ఉంటే పంచుకోండి’ అంటూ ఈ వీడియో సందేశాన్ని ఆయన వినిపించారు. ఈ చాలెంజ్ ప్రాముఖ్యాన్ని చెబుతూ భారత క్రికెట్ జట్టు సారథి విరాట్ కోహ్లీ, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్, బాలీవుడ్ నటి దీపికా పదుకోన్ను ట్యాగ్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. క్రీడా అభివృద్ధికి మంత్రి చేస్తున్న కృషి పట్ల నెటిజన్లు ఫిదా అవుతూ.. ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. Bas #5MinuteAur-haven't v all asked fr it-in playgrounds,exam halls or on the phone? Let's b the voice of our young athletes & say it loud- #5MinuteAur #KheloIndia Aur Khelenge Toh Aur Jitenge! Share ur story of #5MinuteAur @imVkohli @NSaina @deepikapadukone @BeingSalmanKhan pic.twitter.com/dg91JfzN7z — Rajyavardhan Rathore (@Ra_THORe) 9 January 2019 -
క్రీడా ప్రగతికి కృషి చేస్తున్నాం
సాక్షి, హైదరాబాద్: గతంతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రంలో క్రీడా ప్రగతి చాలా జరిగిందని, క్రీడాభివద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నామని ‘శాట్స్’ చైర్మన్ ఎ. వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. బుధవారం శాట్స్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మన రాష్ట్రంలో క్రీడాభివద్ధికి తీసుకుంటోన్న చర్యల గురించి వివరించారు. ‘ఖేలో ఇండియా’ పథకం ద్వారా కరీంనగర్, వరంగల్, మెదక్ జిల్లాలతో పాటు ఉస్మానియా యూనివర్సిటీ, హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్లో సింథటిక్ అథ్లెటిక్స్ ట్రాక్లను ఏర్పాటు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశామని చెప్పారు. వేసవి శిక్షణా శిబిరాల నిర్వహణ కోసం ప్రతి జిల్లాకు లక్ష రూపాయలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు పేర్కొన్నారు. ఏప్రిల్ 15 నుంచి మే 31 వరకు ప్రభుత్వ వేసవి శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. తన సొంత గ్రామమైన చిన్న చింతకుంట మండలం (మహబూబ్నగర్)లో మినీ స్టేడియం నిర్మాణానికి ప్రభుత్వం నుంచి రూ. 1.30 కోట్లు మంజూరు అయ్యేలా కషి చేశామని తెలిపారు. జాతీయ స్థాయిలో రాణించే క్రీడాకారులకు రూ. 10,000 స్టయిఫెండ్, ఎల్బీ స్టేడియం పునర్నిర్మాణం, నూతనంగా 200 కోచ్ల నియామకం, ప్రతి జిల్లాలో స్పోర్ట్స్ హాస్టల్స్ నిర్మాణానికి కషి చేస్తున్నామని వివరించారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సహకార అభివద్ధి సంస్థ చైర్మన్ వాసుదేవరెడ్డి, ఒలింపిక్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షులు కె. రంగారావు, కార్యదర్శి ప్రేమ్రాజ్, గన్ఫౌండ్రీ కార్పొరేటర్ మమత గుప్తా, కాచిగూడ కార్పొరేటర్ కన్నా, తదితరులు పాల్గొన్నారు. -
స్కూల్ గేమ్స్నూ వీడని చీడ!
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఈవెంట్లు, జాతీయ స్థాయి టోర్నీలలో డోపింగ్ వివాదాలు ఎప్పటికప్పుడు బయట పడుతూనే ఉంటాయి. పెద్ద స్థాయిలో ఇలాంటివి కొత్త కాదు. కానీ పాఠశాల స్థాయిలో ప్రతిభను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘ఖేలో ఇండియా’ పోటీల్లో కూడా డోపింగ్లో పట్టుబడటం అసాధారణం. తొలిసారి నిర్వహించిన ఈ క్రీడల అండర్–17 విభాగంలో మొత్తం 12 మంది డోపింగ్కు పాల్పడినట్లు తేలింది. వీరిలో ఐదుగురు స్వర్ణ పతకాలు నెగ్గిన వారుండటం గమనార్హం. జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) నివేదిక ప్రకారం నిషేధిత ఉత్ప్రేరకం వాడిన ఈ 12 మందిలో నలుగురు రెజ్లర్లు, ముగ్గురు బాక్సర్లు, ఇద్దరు జిమ్నాస్ట్లతో పాటు జూడో, వాలీబాల్, అథ్లెటిక్స్కు చెందిన ఒక్కో ఆటగాడు ఉన్నాడు. వీరిలో ఒక అమ్మాయి కూడా ఉంది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3 వరకు ‘ఖేలో ఇండియా’ క్రీడలు దేశంలోని వివిధ నగరాల్లో జరిగాయి. ‘పట్టుబడిన ఆటగాళ్లలో ఎక్కువ మంది ఫ్యూరోసెమైడ్, టర్బు టలైన్ వాడినట్లు తేలింది. అయితే ‘వాడా’ నిబంధనల ప్రకారం ఈ ఉత్ప్రేరకాలు ప్రత్యేక కేటగిరీలో ఉన్నాయి కాబట్టి ఇంకా నిషేధం గురించి ఆలోచించలేదు’ అని అధికారులు వెల్లడించారు. అయితే పూర్తిగా నిషేధం ఉన్న స్టెనజలోల్ను వాడిన ఒక బాక్సర్పై మాత్రం తాత్కాలిక నిషేధం విధించారు. డోపింగ్లో దోషులుగా తేలితే వీరందరిపై కనీసం 2 నుంచి 4 సంవత్సరాల నిషేధం పడుతుంది. -
క్రీడల అభివృద్ధితోనే దేశాభివృద్ధి
న్యూఢిల్లీ: దేశం అభివృద్ధి చెందాలంటే కేవలం సమర్థమైన ఆర్మీ, బలమైన ఆర్థిక వ్యవస్థ మాత్రమే చాలదని, క్రీడాభివృద్ధి కూడా జరగాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మన యువతలో క్రీడా నైపుణ్యానికి లోటు లేదని, ప్రపంచ యవనికపై భారత్ను నిలబెట్టే సత్తా క్రీడాకారులకు ఉందని ఆయన ఉద్ఘాటించారు. దేశంలో క్రీడల అభివృద్ధే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న ‘ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్ (కేఐఎస్జీ)’ బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన ప్రారంభోత్సవ వేడుకల్లో మోదీ ముఖ్య అతిథిగా విచ్చేసి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ వ్యక్తిత్వ వికాసానికి క్రీడలు దోహదం చేస్తాయన్నారు. ఖేలో ఇండియా పోటీలు క్రీడల్లో భారత్ స్థాయిని ప్రపంచానికి చాటి చెప్తాయని అన్నారు. ఈ ప్రోగ్రామ్ ద్వారా ఏటా 1000 మంది ప్రతిభ గల యువ క్రీడాకారులను గుర్తించి వారికి 8 ఏళ్ల పాటు రూ. 5 లక్షల నగదు ప్రోత్సాహకాలను ఇస్తామని వెల్లడించారు. దేశానికి పేరు ప్రఖ్యాతులు తెచ్చిన క్రీడాకారుల చిన్ననాటి కోచ్లను సత్కరిస్తామని చెప్పారు. అండర్–17 విభాగంలో 16 క్రీడాంశాల్లో ఫిబ్రవరి 8 వరకు ఈ పోటీలు జరగుతాయి. ఇందులో 29 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 5000 పాఠశాలల విద్యార్థులు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర క్రీడా శాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్తో పాటు పలువురు ప్రముఖ క్రీడాకారులు పాల్గొన్నారు. -
ఉర్రూతలూగిస్తోన్న క్రీడా గీతం.. వైరల్ వీడియో
న్యూ ఢిల్లీ: పాఠశాల క్రీడా పోటీల నేపథ్యంలో రూపొందించిన ప్రత్యేక గీతం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నది. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంబించిన ‘ఖేలో ఇండియా’ ప్రచారంలో భాగంగా ‘ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్’ జరుగనున్నాయి. జనవరి15న కేంద్ర యువజన, క్రీడల శాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ ఆవిష్కరించిన క్రీడా గీతాన్ని గంటల వ్యవధిలోనే సుమారు 20కోట్ల మంది వీక్షించారు. అమితాబ్, సచిన్ టెండూల్కర్, పలువురు రాజకీయనేతలు సైతం ఈ పాటకు కితాబిచ్చారు. నిర్వాణ ఫిల్మ్స్ సంస్థ రూపొందించిన ఈ ప్రత్యేక గీతాన్ని ప్రముఖ సంగీతకారుడు లూయిస్ బ్యాంక్ స్వరపర్చారు. ఏమిటీ క్రీడా గీతం? : పాఠశాల స్థాయిలో ఆటలను ప్రోత్సహించానే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఖేలో ఇండియా ప్రోగ్రామ్ను ప్రవేశపెట్టింది. అందులో భాగంగా జనవరి 31 నుంచి ఫిబ్రవరి 8 వరకు ‘ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్’ను నిర్వహించనుంది. 17 ఏళ్లలోపు బాలబాలికలకు అథ్లెటిక్స్, ఆర్చరీ, బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, బాక్సింగ్, ఫుట్బాల్, జిమ్నాస్టిక్స్, హాకీ, కబడ్డీ, ఖొఖో, షూటింగ్, వాలీబాల్, స్విమ్మింగ్, వెయిట్లిఫ్టింగ్, రెజ్లింగ్ తదితర అంశాల్లో పోటీలు నిర్వహిస్తారు. ఈ పోటీల ద్వారా వెయ్యి మంది క్రీడాకారులను ఎంపిక చేసి వరుసగా ఎనిమిది సంవత్సరాల పాటు ఐదు లక్షల స్కాలర్షిప్ను కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ అందజేస్తుంది. -
ఉర్రూతలూగిస్తోన్న క్రీడా గీతం..
-
ఖేలో ఇండియాలో సాగర్ సత్తా
విజయవాడ స్పోర్ట్స్ : గుజరాత్లోని గాంధీనగర్లో జరుగుతున్న ఖేలో ఇండియా జాతీయ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో రాష్ట్ర అథ్లెట్ ఎం.సాగర్ ఫాస్టెస్ట్ (100 మీటర్ల పరుగు) రన్నింగ్లో రజత పతకం సాధించాడు. అండర్–14 విభాగంలో ఫాస్టెస్ రన్నర్గా జార్ఖండ్ అథ్లెట్ నిలువగా, కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం కల్లుదేవకుంటకు చెందిన ఎం.సాగర్ (11.82 సెకన్లు) ద్వితీయ స్థానంలో నిలిచి రాష్ట్రానికి రజత పతకం సాధించాడు. ఈ సందర్భంగా సాగర్ను సాయ్ రీజనల్ డైరెక్టర్ (గుజరాత్) రూప్కుమార్నాయుడు, శాప్ వీసీ అండ్ ఎండీ ఎస్.బంగారురాజు, ఓఎస్డీ పి.రామకృష్ణ అభినందించారు. -
‘ఖేలో ఇండియా’లో అనంత హవా
- బాల బాలికల విభాగాల్లో విజయకేతనం - ముగిసిన అండర్-17 ఫుట్బాల్ చాంపియన్షిప్ శ్రీకాకుళం న్యూకాలనీ : ఖేలో ఇండియా రాష్ట్ర ఫుట్బాల్ చాంపియన్షిప్ను అనంతపురం క్రీడాకారులు సొంతం చేసుకున్నారు. బాలబాలికల విభాగాల్లో విజేతలుగా నిలిచారు. ఇటీవల ముగిసిన అండర్–14 విభాగంలోనూ అనంత జయకేతనం ఎగురవేసిన సంగతి తెలిసిందే. శ్రీకాకుళం జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో కోడిరామ్మూర్తి స్టేడియం, నైర వ్యవసాయ కళాశాల, కేంద్రీయ విద్యాలయం క్రీడా ప్రాంగణాల్లో ఽమూడు రోజులుగా సాగిన ఖేలో ఇండియా రాష్ట్ర బాలబాలికల అండర్–17 ఫుట్బాల్ చాంపియన్షిప్ పోటీలు ఆదివారం ముగిశాయి. అనంత అదరహో.. శ్రీకాకుళం కోడిరామ్మూర్తి స్టేడియంలో బాలుర విభాగంలో జరిగిన తుది పోరులో కృష్ణా జిల్లాపై 2–0 గోల్స్ తేడాతో అనంతపురం జట్టు జయభేరి మోగించి ట్రోఫీ దక్కించుకుంది. బాలికల్లోనూ.. బాలికల విభాగంలో వైఎస్సార్ కడప జిల్లాతో సాగిన హోరాహోరీ ఫైనల్స్ పోరులో అనంతపురం జట్టు చాంపియన్గా నిలిచింది. తుదిపోరులో 1–0 గోల్స్ తేడాతో విజయభేరి మోగించింది. బహుమతుల ప్రదానం శ్రీకాకుళంలోని కోడిరామ్మూర్తి స్టేడియంలో నిర్వహించిన ముగింపు కార్యక్రమంలో విజేతలకు కలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మీనరసింహం బహుమతులు ప్రదానం చేశారు. మెరుగైన ఏర్పాట్లు, మౌలిక సదుపాయాలు కల్పించిన డీఎస్డీఓ శ్రీనివాస్ను కలెక్టర్ అభినందించారు. పోటీలు విజయవంతంగా ముగియానికి సహకరించిన ప్రతి ఒక్కరికి డీఎస్డీఓ కృతజ్ఞతలు తెలిపారు. -
ఖేలో ఇండియా ఫుట్బాల్ విజేత ‘అనంత’
శ్రీకాకుళం : ఖేలో ఇండియా రాష్ట్ర ఫుట్బాల్ బాలబాలికల విజేతలుగా అనంతపురం, చిత్తూరు జిల్లాల జట్లు నిలిచాయి. శ్రీకాకుళం జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నగరంలోని కోడిరామ్మూర్తి స్టేడియం, నైరా వ్యవసాయ కళాశాల, కేంద్రీయ విద్యాలయం క్రీడా ప్రాంగణాల్లో మూడు రోజులుగా సాగిన ఖేలో ఇండియా రాష్ట్ర బాలబాలికల అండర్–14 ఫుట్బాల్ పోటీలు గురువారం ముగిశాయి. బాలుర విభాగంలో జరిగిన ఉత్కంఠ పోరులో టైటిల్ ఫేవరేట్గా బరిలోకి దిగిన వైఎస్సార్ కడపపై చిత్తూరు జట్టు 2–1 గోల్స్ తేడాతో జయభేరి మోగించింది. మరో మ్యాచ్లో అనంతపురంపై కర్నూలు జట్టు గెలిచింది. అనంత అదరహో.. కేంద్రీయ విద్యాలయ క్రీడా ప్రాంగణంలో మధ్యాహ్నం జరిగిన బాలికల విభాగం తుది పోరులో అనంతపురం విజేతగా నిలిచింది. కర్నూలుతో జరిగిన ఫైనల్ పోరులో 2–1 గోల్స్ తేడాతో విజయభేరి మోగించింది. మరో మ్యాచ్లో శ్రీకాకుళంపై 3–0 గోల్స్ తేడాతో వైఎస్సార్ కడప విజయం సాధించింది. -
అథ్లెటిక్స్ పోటీలు షురూ
హైదరాబాద్: ‘ఖేలో ఇండియా’ అథ్లెటిక్స్ పోటీలు సోమవారం గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో ప్రారంభమయ్యాయి. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ (శాట్స్) మేనేజింగ్ డెరైక్టర్ ఎ. దినకర్ బాబు ముఖ్యఅతిథిగా విచ్చేసి పోటీలను లాంఛనంగా ఆరంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తోందని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అంతర్జాతీయ పోటీల్లో రాణించిన వారికి భారీ ప్రోత్సాహకాలు అందిస్తున్నారని తెలిపారు. ప్రతిభావంతులను సానబెట్టేందుకు... వారు జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పతకాలు గెలిచేందుకు ‘శాట్స్’ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఈ చాంపియన్షిప్లో 31 జిల్లాలకు చెందిన 1200 మంది క్రీడాకారులు, పీఈటీలు పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అథ్లెటిక్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి వెంకటేశ్వర్రెడ్డి, శాట్స్ డిప్యూటీ డెరైక్టర్ కె. మనోహర్, వాటర్ స్పోర్ట్స అడ్మినిస్ట్రేటర్ ఎల్. హరినాథ్, జిల్లా స్పోర్ట్స అథారిటీ అధికారి ఎన్. సుధాకర్రావు, పలువురు క్రీడాకారులు, పీఈటీలు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు వేంపల్లె విద్యార్థులు
వేంపల్లె : వేంపల్లె జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు దాసరి శ్రీనివాసులు, అరవిందులు రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైనట్లు ఆ పాఠశాల హెచ్ఎం నారాయణ, ఫిజికల్ డైరెక్టర్ రాజశేఖర్ తెలిపారు. కడప నగరంలో జరిగిన అండర్14 ఖేలో ఇండియా పోటీలలో పాల్గొని వీరు ప్రతిభ కనబరిచారని తెలిపారు. ఈనెల 28 నుంచి 30వ తేదీ వరకు తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో జరిగే కబడ్డీ పోటీలలో వీరు పాల్గొంటారని చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థులను పాఠశాల యాజమాన్యం అభినందించింది. -
ముగిసిన ఖేలో ఇండియా పోటీలు
కర్నూలు (టౌన్): ఖేలో ఇండియా జిల్లా స్థాయి పోటీలు మంగళవారం ముగిశాయి. ఆరురోజులుగా స్థానిక స్పోర్ట్స్ అథారిటీ ఔట్డోర్ స్టేడియంలో ఈ పోటీలు జరుగుతున్నాయి. చివరి రోజు అథ్లెటిక్స్, తైక్వాండో, వాలీబాల్, లాంగ్జంప్, షాట్ఫుట్ క్రీడాంశాల్లో విద్యార్థినీ, విద్యార్థులు పోటీ పడ్డారు. వీటిలో గెలుపొందిన క్రీడాకారులకు డీఎస్డీఓ మలి్లకారు్జన మెడల్స్ అందజేశారు. విజేతల వివరాలు అథ్లెటిక్స్ అండర్–14 బాలుర వంద మీటర్ల పరుగులో ఆదోనికి చెందిన సాగర్, కోడుమూరుకు చెందిన అజిత్కుమార్, రాము, 400 మీటర్ల పరుగు పందెంలో ఎమ్మిగనూరుకు చెందిన ఫరూక్, ఆళ్లగడ్డకు చెందిన అబూసిద్ధిక్, పాణ్యంకు చెందిన వీరసాయి, లాంగ్జంప్లో మంత్రాలయానికి చెందిన నరసింహులు, కోడుమూరుకు చెందిన అజిత్కుమార్, మంత్రాలయానికి చెందిన టి.రాజు , షాట్ఫుట్ విభాగంలో ఆళ్లగడ్డకు చెందిన హేమంత్, పత్తికొండకు చెందిన రవి, ఎం.రాజు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. అథ్లెటిక్స్ అండర్–14 బాలికల వంద మీటర్ల పరుగులో డోన్కు చెందిన రామలక్ష్మి, పాణ్యంకు చెందిన జి.ప్రియాంక, ఆళ్లగడ్డకు చెందిన డి.బెల్లి, 400 మీటర్ల పరుగులో పాణ్యంకు చెందిన మెహరూన్బీ, డోన్కు చెందిన డి.రేఖ, పత్తికొండకు చెందిన సి.మనీష, లాంగ్జంప్లో పత్తికొండకు చెందిన కె.రామలక్ష్మి, నందికొట్కూరుకు చెందిన టి.విజయరాణి, కోడుమూరుకు చెందిన బి.శిరీష, షాట్ఫుట్ విభాగంలో ఆలూరుకు చెందిన జి.సుజాత, బి.ఇందు, కోడుమూరుకు చెందిన కె.శోభ వరుసగా ఆయా విభాగాల్లో మొదటి మూడు స్థానాలు సాధించారు. -
ముగిసిన ఖేలో ఇండియా క్రీడా పోటీలు
అనంతపురం సప్తగిరి సర్కిల్ : ఖేలో ఇండియా క్రీడా పోటీలు ఆదివారంతో ముగిశాయి. శనివారం క్రీడా పోటీలు ముగియాల్సి ఉండగా వర్షం పడడంతో ఆదివారానికి వాయిదా వేశారు. అండర్–14, 17 ఫుట్బాల్ క్రీడా పోటీలు స్థానిక ఆర్ట్స్ కళాశాల క్రీడా మైదానంలో నిర్వహించారు. క్రీడా పోటీలు ముగిసినట్లు జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి బాషామోహిద్దీన్ తెలిపారు. విజేత జట్లను రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఎంపిక చేయనున్నట్లు ఆయన చెప్పారు. కార్యక్రమంలో పీడీలు, పీఈటీలు తదితరులు పాల్గొన్నారు. విజేతల వివరాలు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు వరుసగా అండర్–14 ఫుట్బాల్ బాలురు పెనుకొండ–1, గుంతకల్–2, రాప్తాడు–3. బాలికలు రాప్తాడు–1, కళ్యాణదుర్గం–2, రాయదుర్గం–3. అండర్–17 ఫుట్బాల్ బాలురు రాప్తాడు–1, కళ్యాణదుర్గం–2, గుంతకల్–3. బాలికలు ఉరవకొండ–1, కళ్యాణదుర్గం–2, ధర్మవరం–3. -
ముగిసిన ఖేలో ఇండియా క్రీడా పోటీలు
వర్షం కారణంగా ఆగిన అండర్–14, 17 ఫుట్బాల్ బాలుర పోటీలు అనంతపురం సప్తగిరి సర్కిల్ : ఖేలో ఇండియా క్రీడా పోటీలు శనివారం ముగిశాయి. వర్షం కారణంగా అండర్–14, 17 ఫుట్బాల్ బాలుర పోటీలు ఆగిపోయాయి. తిరిగి ఆదివారం నిర్వహించనున్నట్లు డీఎస్డీఓ బాషామోహిద్దీన్ తెలిపారు. శనివారం స్థానిక ఆర్ట్స్ కళాశాల క్రీడా మైదానంలో హాకీ, ఫుట్బాల్, తైక్వాండో క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో 14 నియోజకవర్గాల క్రీడాకారులు పాల్గొన్నారు. అట్టహాసంగా సాగిన క్రీడా పోటీలు శనివారంతో ముగియాల్సి ఉండగా వర్షం వల్ల అర్ధంతరంగా ముగిశాయి. ఆల్రౌండ్ ప్రతిభలో ఉరవకొండ, రాప్తాడు నియోజకవర్గాల క్రీడాకారులు జిల్లాస్థాయి క్రీడా పోటీల్లో ప్రతిభను కనబరిచారు. ఈ క్రీడా పోటీలు కబడ్డీ, అథ్లెటిక్స్, వెయిట్ లిఫ్టింగ్, ఖో–ఖో, ఆర్చరీ, వాలీబాల్, బాక్సింగ్, ఫుట్బాల్, హాకీ, తైక్వాండో పోటీలను నిర్వహించారు. మండల స్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను నియోజకవర్గ స్థాయికి, నియోజకవర్గాలలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను జిల్లా స్థాయి క్రీడా పోటీలకు ఎంపిక చేశారు. జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఎంపిక చేశారు. గతంలో జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఎంపిక చేసే విధానం ఉండేది. ఈ ఏడాది జిల్లా స్థాయిలో విజేతలుగా నిలిచిన జట్లను రాష్ట్రస్థాయికి ఎంపిక చేశారు. రాష్ట్రస్థాయి క్రీడా పోటీల తేది, పోటీలు జరిగే ప్రదేశాలను ఎంపిక ప్రక్రియ జరగలేదు. వాటిని త్వరలోనే ఏర్పాటు చేయనున్నట్లు డీఎస్డీఓ బాషామోహిద్దీన్ తెలిపారు. అనంతపురం, రాప్తాడు నియోజకవర్గాల హాకీ జట్టు విషయంలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఆర్డీటీ అకాడమీ క్రీడాకారులు అనంతపురం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించడంతో పీఈటీలు అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. డీఎస్డీఓ అక్కడికి చేరుకొని సమస్య పరిష్కరించారు. మూడో రోజు విజేతలు వీరే అండర్–14 బాలురు 18 కేజీల విభాగం–రాజీవ్లోచన్ (అనంతపురం), గౌతంకృష్ణారెడ్డి(అనంతపురం), ఙానశ్రీపతి (తాడిపత్రి) 21–సుజీత్ చౌదరి (తాడిపత్రి), శ్రావణ్ (అనంతపురం), రవికాంత్రెడ్డి (శింగనమల). 23–కార్తీక్(రాప్తాడు), నందకిషోర్ (గుంతకల్), గైబుబాషా(తాడిపత్రి). 25–నందకిషోర్ (తాడిపత్రి), జునేద్అహమ్మద్ (శింగనమల), మాలిక్బాషా (శింగనమల). 27–కౌశిక్(తాడిపత్రి), మోక్షిత్రామ్ (అనంతపురం), యర్రంకిరెడ్డి(శింగనమల). బాలికలు 16–సర్తాజ్బేగం (శింగనమల). 18–నిహారిక (శింగనమల), రుక్సాన (శింగనమల), సాయివినోదిని (తాడిపత్రి). 20–నీతుశ్రీసాయి (అనంతపురం), చరిత (శింగనమల), సాయిశ్రీ(రాప్తాడు). 22–జోత్స్న (అనంతపురం), పూజిత(శింగనమల), డీ.పూజిత(శింగనమల). 24–వెన్నెల (అనంతపురం), గౌతమి (శింగనమల), లాశ్రీరెడ్డి(శింగనమల). అండర్–17 బాలురు 35–మహర్షి (అనంతపురం). 41–ఫిరోజ్ (తాడిపత్రి), దస్తగిరి (గుంతకల్), మహేష్ (గుంతకల్). 44–నాగగుర్రప్ప (అనంతపురం), అమీర్ (అనంతపురం), పవన్కళ్యాణ్ (తాడిపత్రి). 48–రూపేష్ (పెనుకొండ), శాంతకుమార్ (రాయదుర్గం), మోహమ్మద్ జునేద్ (గుంతకల్). బాలికలు 32–అశ్విని (గుంతకల్). 35–దుర్గ (అనంతపురం). 38–సాయిదీప్తి (రాప్తాడు), కళ్యాణి (గుంతకల్), చాముండేశ్వరి(గుంతకల్). 41–స్రవంతి (అనంతపురం), రామాంజినమ్మ(గుంతకల్),ప్రశాంతి(గుంతకల్). 44–యశశ్విణి (అనంతపురం), మాధురి (తాడిపత్రి), హేమ(అనంతపురం). ఫుట్బాల్ అండర్–14 బాలికలు రాప్తాడు–1, కళ్యాణదుర్గం–2, రాయదుర్గం–3. అండర్–17 బాలికలు ఉరవకొండ–1, కళ్యాణదుర్గం–2, ధర్మవరం–3. హాకీ అండర్–14 బాలురు ధర్మవరం–1, ఉరవకొండ–2, రాప్తాడు–3. బాలికలు రాప్తాడు–1, ధర్మవరం–2, పుట్టపర్తి–3. అండర్–17 బాలురు రాప్తాడు–1, ధర్మవరం–2, పుట్టపర్తి–3. బాలికలు రాప్తాడు–1, ధర్మవరం–2, ఉరవకొండ–3 -
హోరాహోరీగా ఖోఖో పోటీలు
గుంటూరు స్పోర్ట్స్: ఖేలో ఇండియా జిల్లా స్థాయి క్రీడాపోటీలలో భాగంగా జిల్లా క్రీడాభివృ«ద్ధి సంస్థ ఆధ్వర్యంలో శనివారం స్థానిక బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో అండర్–14, 17 బాలబాలికల ఖోఖో పోటీలు హోరాహోరీగా జరిగాయి. పోటీలలో 110 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. విజేతలకు జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈవో జోసఫ్ కుమార్ బహుమతులు అందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారుల ప్రతిభను వెలికితీసేందుకు క్రీడలు దోహదపడుతాయన్నారు. కార్యక్రమంలో జిల్లా క్రీడాభివృద్ధి అధికారి శ్రీనివాసరావు, వ్యాయామ ఉపాధ్యాయులు, శిక్షకులు తదితరులు పాలొన్నారు.అండర్–14 బాలుర విభాగంలో మాచర్ల జట్టు ప్రథమ, సత్తెనపల్లి జట్టు ద్వితీయ, వినుకొండ జట్టు తృతీయ స్థానాలు సాధించాయి.బాలికల విభాగంలో మాచర్ల జట్లు ప్రథమ, బాపట్ల ద్వితీయ, వినుకొండ తృతీయ స్థానాలు సాధించాయి. అండర్–17 బాలుర విభాగంలో బాపట్ల జట్టు ప్రథమ, చిలకలూరి పేట జట్టు ద్వితీయ, గురజాల జట్టు తృతీయ స్థానాలు సాధించాయి. బాలికల విభాగంలో మాచర్ల జట్టు ప్రథమ, వేమూరు జట్టు ద్వితీయ, ప్రత్తిపాడు జట్టు తృతీయ స్థానాలు సాధించాయి. -
హోరా హోరీగా ఖేలో ఇండియా
అనంతపురం సప్తగిరి సర్కిల్ : రెండోరోజు జిల్లాస్థాయి ఖేలో ఇండియా పోటీలు హోరా హోరీగా సాగాయి. స్థానిక నీలం సంజీవ రెడ్డి, ఆర్ట్స్ కళాశాల క్రీడా మైదానాల్లో శుక్రవారం ఆర్చరీ, ఖోఖో, వాలీబాల్, బాక్సింగ్ పోటీలు నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ఈ పోటీల్లో వివిధ నియోజకవర్గాల క్రీడాకారులు పాల్గొన్నారు. ఒక్కో నియోజకవర్గం నుంచి ప్రతి క్రీడలోనూ నాలుగు జట్లు ప్రాతినిధ్యం వహించాయి. క్రీడా ప్రాంగణమంతా క్రీడాకారుల సందడితో కోలాహలంగా మారింది. అండర్-14, 17 విభాగాలలో విజయానికి క్రీడాకారులు కఠోర శ్రమ చేయాల్సి వచ్చింది. ఆర్ట్స్ కళాశాల క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన బాక్సింగ్ రింగ్ను చూసేందుకు రోడ్డు వెంబడి వెళ్తున్న వారు ఎగబడటంతో కళాశాల వెలుపల ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు డీఎస్డీఓ బాషామోహిద్దీన్ పతకాలను, ట్రోఫీలను అందించారు. జిల్లాస్థాయిలో ప్రతిభ కనబరచిన క్రీడాకారులు రాష్ట్రస్థాయి ఖేలో ఇండియా క్రీడా పోటీలకు ఎంపికయ్యారు. రెండో రోజు విజేతలు ఆర్చరీలో : అండర్-14లో బాలురు స్నేహిత్రెడ్డి, యశస్చంద్ర(అనంతపురం), జనార్ధన్(శింగనమల).., బాలికలు తీర్థ శ్రీవల్లి(అనంతపురం), లత(శింగనమల), మేఘన(రాప్తాడు).., అండర్-17లో బాలురు శ్రీశక్తి(అనంతపురం), శేఖర్(రాప్తాడు), భాస్కర్రెడ్డి(శింగనమల).., బాలికలు అఖిల, పరిమళ, యోగిత(శింగనమల) వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించారు. బాక్సింగ్లో : అండర్-14లో బాలురు 46 కేజీల విభాగంలో శ్రీను, చిన్నరాయుడు(అనంతపురం), వీరేష్(ఉరవకొండ).., 48 కేజీల్లో చంద్ర, నందకుమార్(అనంతపురం).., 50 కేజీల్లో రాహుల్(అనంతపురం), మహేష్బాబు(ఉరవకొండ).., 52 కేజీల్లో హర్షవర్ధన్(కదిరి), వేణుగోపాల్(ఉరవకొండ).., 54 కేజీల్లో దేవహర్ష(అనంతపురం), ఖలందర్(కదిరి) వరుసగా బహుమతులు సాధించారు. బాలికలు 46 కేజీల్లో హేమలత, కేశవి, లలిత(ఉరవకొండ).., 48 కేజీల్లో షాలిని, శ్వేత(ఉరవకొండ), 52 కేజీల్లో నందిని బాయి, జానుబాయి(ఉరవకొండ).., 54 కేజీల్లో కవిత(ఉరవకొండ) వరుస స్థానాలు కైవసం చేసుకున్నారు. అండర్-17లో బాలురు 49 కేజీల్లో ఏజాజ్(కదిరి), శివ(అనంతపురం), రఘు(ఉరవకొండ).., 52 కేజీల్లో మహేష్(ఉరవకొండ), ఇర్ఫాన్(కదిరి), తన్వీర్(అనంతపురం).., 56 కేజీల్లో బాబాయునుస్(అనంతపురం), పరమేష్(ఉరవకొండ).., 60 కేజీల్లో హరికృష్ణ, శివకృష్ణ(అనంతపురం), నాగేంద్ర(ఉరవకొండ).., 64 కేజీల్లో రాకేష్(ఉరవకొండ), ఫయాజ్(అనంతపురం).., బాలికలు 48 కేజీల్లో షమీమ్(కదిరి), హేమా(శింగనమల), నందిని(ఉరవకొండ).., 51 కేజీల్లో శ్రావణి(శింగనమల), దివ్యశ్రీ (ఉరవకొండ), కిరణ్మయి(శింగనమల).., 54 కేజీల్లో గౌతమి, నిక్షిత(శింగనమల).., 57 కేజీల్లో సంఘవి(శింగనమల), సునీత(ఉరవకొండ).., 60 కేజీల్లో హర్షిణి(శింగనమల) బహుమతులు సాధించారు. ఖోఖోలో : అండర్-14లో ఉరవకొండ, రాప్తాడు, రాయదుర్గం బాలుర జట్లు.., ఉరవకొండ, ధర్మవరం, రాప్తాడు బాలికల జట్లు.., అండర్-17లో ఉరవకొండ, కళ్యాణదుర్గం, రాయదుర్గం బాలుర జట్లు.., రాప్తాడు, ఉరవకొండ, కళ్యాణదుర్గం బాలికల జట్లు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. వాలీబాల్లో : అండర్-14లో రాప్తాడు, పెనుకొండ, కదిరి బాలుర జట్లు, ఉరవకొండ, కళ్యాణదుర్గం, పుట్టపర్తి బాలికల జట్లు.., అండర్-17లో గుంతకలు, రాప్తాడు, శింగనమల బాలుర జట్లు, పెనుకొండ, హిందూపురం, ఉరవకొండ బాలికల జట్లు వరుస స్థానాల్లో నిలిచాయి. -
ఖేలో ఇండియాతో క్రీడాభివృద్ధి
– డీఎస్డీఓ లక్ష్మినారాయణశర్మ కడప స్పోర్ట్స్: ఖేలో ఇండియా పథకం క్రీడల అభివృద్ధికి దోహదం చేస్తుందని జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి లక్ష్మినారాయణశర్మ పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని వైఎస్ఆర్ క్రీడాపాఠశాలలో జిల్లాస్థాయి ఖేలో ఇండియా క్రీడాపోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్డీఓ మాట్లాడుతూ నియోజకవర్గ స్థాయిలో విజేతలుగా నిలిచిన జట్లకు జిల్లాస్థాయి పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా జట్టుకు ఎంపికైన క్రీడాకారులు డిసెంబర్ నెలలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందని తెలిపారు. అనంతరం ఫుట్బాల్, వాలీబాల్, తైక్వాండో క్రీడాంశాల్లో అండర్–14, అండర్–17 విభాగాల్లో బాలబాలికలకు పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో డీఎస్ఏ కోచ్లు గౌస్బాషా, షఫీ, సిబ్బంది అక్బర్, సూర్యనారాయణరాజు, మార్కర్బాషా, క్రీడాపాఠశాల కోచ్లు చంద్రమోహన్, తైక్వాండో అసోసియేషన్ కోశాధికారి విజయభాస్కర్రెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు. -
ఖేలో ఇండియా క్రీడాపోటీలకు సన్నద్ధం
కడప స్పోర్ట్స్: జిల్లా క్రీడాప్రాథికార సంస్థ ఆధ్వర్యంలో 'ఖేలో ఇండియా' పోటీలు నిర్వహించేందుకు సన్నద్ధమైనట్లు జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి లక్ష్మినారాయణశర్మ తెలిపారు. శనివారం నగరంలోని డీఎస్ఏ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజీవ్గాంధీ ఖేల్ అభియాన్ స్థానంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఖేలో ఇండియాలో భాగంగా క్రీడా పోటీలను ఈనెల 23 నుంచి 25 వరకు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. అయితే కడప నియోజకవర్గంలో మాత్రం 24, 25 తేదీల్లో ఈ పోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు. అండర్–14, అండర్–17 విభాగాల్లో బాలబాలికలకు 10 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. కడప నియోజకవర్గంలోని క్రీడాకారులకు 24న ఆర్చరీ, అథ్లెటిక్స్, తైక్వాండో, వెయిట్లిఫ్టింగ్, హాకీ, వాలీబాల్, 25న బాక్సింగ్, కబడ్డీ, ఖోఖో, ఫుట్బాల్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం జిల్లాస్థాయి పోటీల షెడ్యూలును ఆయన విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కోచ్లు గౌస్బాషా, షఫీ పాల్గొన్నారు. జిల్లాస్థాయి క్రీడాపోటీలు ––––––––––––––––––––––––––––––– తేదీ క్రీడాంశాలు ––––––––––––––––––––––––––––––––– 26 అథ్లెటిక్స్, తైక్వాండో, వాలీబాల్ 27 హాకీ, బాక్సింగ్, వెయిట్లిఫ్టింగ్ 28 ఖోఖో, ఆర్చరీ 29 ఫుట్బాల్, కబడ్డీ