kodela sivaram
-
కోడెల శివరామ్ వేధింపులతోనే మా బిడ్డ ఆత్మహత్య
పట్నంబజారు: కోడెల శివరామ్ వేధింపులు భరించలేకే తమ బిడ్డ ఆత్మహత్య చేసుకున్నాడంటూ గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరేచర్లకు చెందిన మృతుడి తల్లి విలపిస్తున్నారు. మేడికొండూరు పోలీసులు, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పేరేచర్లకు చెందిన కొల్లోజు ఫణీంద్రసాయి(22) నాలుగేళ్ల కిందట గుంటూరు నాజ్సెంటర్ డీమార్ట్లో గేట్ ఇన్చార్జిగా పనిలో చేరి సూపర్వైజర్గా ఎదిగాడు. కోడెల శివరామ్కు సంబంధించి వ్యక్తిగత పనులు కూడా చూస్తుండేవాడు. నగదుకు సంబంధించిన లావాదేవీలతో పాటు గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లోని కనస్ట్రక్షన్లకు చెందినవి కూడా చూస్తుంటాడు. కొంతకాలం కిందట ఆరోగ్యం సరిగా లేకపోవడంతో సెల్ స్విచ్ఛాఫ్ చేసి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో కంపెనీకి సంబంధించిన డబ్బులు తీసుకుని వెళ్లిపోయాడంటూ కొత్తపేట పోలీస్స్టేషన్లో డీమార్ట్ నిర్వాహకులు ఫిర్యాదు చేశారు. ఆరోగ్యం కుదుటపడ్డాకవచ్చిన ఫణీంద్రసాయి.. రూ.2 లక్షలను తిరిగి ఇచ్చారని సాటి ఉద్యోగులు చెబుతున్నారు. అనంతరం పలు కారణాల రీత్యా ఫణీంద్ర అక్కడ ఉద్యోగం మానేశాడు. కొద్ది రోజుల తర్వాత యాజమాన్యం పిలిపించి తిరిగి ఉద్యోగంలో పెట్టుకుంది. ఈ నెల ప్రారంభంలో తిరిగి అనారోగ్యం తిరగబెట్టడంతో చికిత్స పొంది.. ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో కోడెల శివరామ్ అనుచరుడైన నాయక్ నాలుగు రోజులుగా ఇంటికి వచ్చి ఫణీంద్రను భయభ్రాంతులకు గురిచేయడం ప్రారంభించాడు. ఉద్యోగానికి రావాలని లేకుంటే సార్ ఊరుకోరని వేధిస్తున్నాడు. ఈ క్రమంలో ఫణీంద్ర గురువారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. కోడెల శివరామ్, నాయక్లు అకారణంగా వేధింపులకు గురిచేయడంతోనే తమ బిడ్డ మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని తల్లి కొల్లోజు నాగమణి ఆరోపిస్తున్నారు. నిత్యం నాయక్ వచ్చి, కోడెల శివరామ్ పేరు చెప్పి బెదిరింపులకు పాల్పడే వాడంటూ ఆమె విలపించారు. తన కుమారుడి మృతికి కారణమైన కోడెల శివరామ్, అతని అనుచరుడు నాయక్లపై చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు చెప్పారు. -
వాడకమంటే బాబుదే.. సీనియర్ నేత 30 ఏళ్ల సేవలు గుర్తులేవా?
వాడుకుని వదిలేయడంతో చంద్రబాబును మించినవాళ్లు లేరు అనేది దేశవ్యాప్తంగా తెలిసిందే. తనకు అవసరం ఉంటే ఆకాశానికి ఎత్తేసి తరువాత మొహం చాటేయడంతో ఆయన్ను మించినవాళ్లు లేరని ఎప్పటికప్పుడు స్పష్టమవుతూనే ఉంది. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ అంటే వాస్తవానికి చంద్రబాబు అపారమైన ప్రేమ చూపిస్తారు. చూపిస్తారో నటిస్తారో తెలియదుకానీ.. టీడీపీ ప్రభుత్వం దిగిపోయిన కొన్నాళ్ళకు కోడెల శివప్రసాద్ తన పిల్లలు చేసిన అరాచకాలకు బాధ్యత వహించాల్సి వచ్చింది. వాస్తవానికి ఆయన్ను ఇనుమేట్ల గ్రామంలో పోలింగ్ రోజున ప్రజలు తరిమి కొట్టడం, ఇన్ని దెబ్బలు కాసినా ఆయన ఎన్నికల్లో ఓడిపోవడం తెలిసిందే. బాబు శవ రాజకీయం.. ఆఖరుకు ప్రభుత్వ ఆఫీస్ కుర్చీలు సైతం ఆయన కుమారుడు శివరామ్ ఎత్తుకురావడమే కాకుండా సత్తెనపల్లిలో వీధి వ్యాపారుల నుంచి సైతం మామూళ్లు వసూళ్లు చేసిన అరాచకాలు.. తరువాత ఆయన కేసులు ఎదుర్కొని అవమానాలు పాలై చివరకు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఆయన చనిపోయాక అది ప్రభుత్వం చేసిన హత్య అని ఆరోపణలు చేసి ఆయన పార్థివ దేహాన్ని హైదరాబాద్ పార్టీ ఆఫీసులో ఒకరోజు.. మంగళగిరి పార్టీ ఆఫీసులో ఒకరోజు.. నరసరావుపేటలో ఒక రోజు ఇలా మూడు రోజులు ఆయన శవంతో రాజకీయం చేశారు చంద్రబాబు. ఆ తరువాత శివరామ్ను ఓదార్చి నీ పొలిటికల్ కెరీర్ నేను చూసుకుంటాను అంటూ రెండు.. రెండంటే రెండే.. కన్నీటి బొట్లు కుడికన్ను నుంచి కార్చి వెళ్లిపోయారు. ఇక అక్కడ మళ్ళీ తమ పార్టీ నుంచి పోటీ చేయడానికి ఎవరూ లేకపోవడం, శివరామ్ గానీ పోటీ చేస్తే ఇనుమెట్ల సీన్ మళ్ళీ రిపీట్ అవుతుందని భయం. ఇవన్నీ కలగలిసి ఆ తరువాత శివరామ్కు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా దూరం పెట్టారు. అంటే కోడెలను వాడుకున్నారు.. ఆయన చనిపోయాక ఆయన కుటుంబానికి కెరీర్ క్లోజ్ చేసేశారు. అదన్నమాట బాబుగారి వాడకం. శివమెత్తుతోన్న శివరామ్.. శని పట్టుకున్నా వదులుతుందేమో కానీ చంద్రబాబు పట్టుకుంటే మాత్రం వదలడు అనే నానుడి ఒకటి తెలుగు తమ్ముళ్లు తరచుగా చెప్పుకుంటారు. బతికి ఉండగా కోడెల శివప్రసాద్ను అనగదొక్కి మంత్రి పదవి ఇవ్వకుండా స్పీకర్ పదవి కట్టబెట్టి మూలన కూర్చోబెట్టిన చంద్రబాబు. ఇప్పుడు కూడా ఆ కుటుంబాన్ని వెంటాడుతూనే ఉన్నారు చంద్రబాబు. తన తండ్రి రాజకీయ వారసత్వం తనకు వస్తుందని, సత్తెనపల్లి ఎమ్మెల్యే టికెట్ తనకే ఇస్తారని ఆశిస్తూ ఉన్న శివరామ్ను చంద్రబాబు పూర్తిగా పక్కన పడేసి.. అదే స్థానంలో కన్నా లక్ష్మి నారాయణను ప్రొజెక్ట్ చేయడంతో శివరామ్ శివాలెత్తి పోతున్నారు. ‘ముప్పై ఐదేళ్ల తన తండ్రి సేవలు గుర్తుకు రాలేదా.. మా కుటుంబానికి న్యాయం చేస్తాం అని గతంలో ఇచ్చిన హామీ మర్చిపోయారా’ అని నేరుగా చంద్రబాబుపై దుమ్మెత్తి పోస్తున్నాడు శివరామ్. వాస్తవానికి కోడెల గత ముప్పై ఐదేళ్ల రాజకీయం ఒకెత్తు కాగా 2014-2019 మధ్య చేసిన రాజకీయం ఇంకో ఎత్తు అని చెప్పాలి. ఇనేళ్లు తాను నిర్మించిన పొలిటికల్ కెరీర్ సౌధాన్ని జస్ట్ ఐదేళ్లలో కొడుకు శివరామ్ కూల్చేశాడు. తండ్రి పదవిని అడ్డం పెట్టుకుని జిల్లావ్యాప్తంగా దోపిడీలు..సెటిల్మెంట్లు, దందాలు చేశారు. ఆఖరుకు చిన్న వ్యాపారుల నుంచి కూడా వసూళ్లు.. బిజినెస్ అవకాశం ఇస్తానంటూ ఎందరి దగ్గరో వసూళ్లు.. అడిగితే బెదిరింపులు.. ఇవన్నీ కలగలిసి ఏకంగా కోడెల శివ ప్రసాద్ను పోలింగ్ రోజున ఇనుమేట్ల గ్రామంలో ప్రజలు వెంటాడి కొట్టిన పరిస్తితి ఎదురైంది. ఇక తెలుగుదేశం పరిస్థితి చూసి సత్తెనపల్లిలో ఓటర్లు నవ్వుకుంటున్నారు. ప్రజల ప్రశ్నలు ఇవే.. - సత్తెనపల్లి ఎవరి ఆస్తి? - మేమే పాలిస్తామని ఎవరైనా ఎలా చెప్పుకుంటారు? - ఈ పవర్ చంద్రబాబు చేతికి ఎవరిచ్చారు? - సత్తెనపల్లికి ఎవరు రుణపడి ఉన్నారు? - ఇన్నాళ్లు కోడెల చేసిందేంటీ? - స్పీకర్గా ఉంటూ ఫర్నీచర్ ఎత్తుకురావడమేంటీ? - కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లికి ఏంచేశారు? - అసలు టీడీపీకి ఎందుకు ఓటేయాలి? - పదవుల కోసం పార్టీలు మారిన వారిని ఎందుకు ఎంచుకోవాలి? - రాజకీయ అవసరాల కోసం సత్తెనపల్లిని తాకట్టు పెడతారా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇది కూడా చదవండి: టీడీపీలో అగ్గిరాజేసిన కేశినేని నాని.. తగ్గేదేలే అంటూ పచ్చ బ్యాచ్కు కౌంటర్! -
బాబు ముంచేశాడు.. ‘కోడెల’ మరణం వెనుక అసలు సీక్రెట్ ఇదేనా?
మాజీ స్పీకర్, దివంగత డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకున్న సందర్భంలో ఆ నెపాన్ని మొత్తం ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వంపై నెట్టడానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన యత్నం ఇంతా, అంతా కాదు. ఎన్నడూ లేనిది హైదరాబాద్ నుంచి నరసరావుపేట వరకు ఆయన శవయాత్ర కూడా చేశారు. కోడెల కుటుంబ సభ్యులకు భరోసా ఇస్తున్నట్లు పిక్చర్ ఇచ్చారు. తీరా సీన్ కట్ చేస్తే, గత మూడేళ్లుగా కోడెల కుటుంబాన్ని చంద్రబాబు అసలు పట్టించుకోలేదట. ఇది వేరే ఎవరో చెబితే నమ్మొచ్చో, లేదో అన్న సందేహం ఉండేది. స్వయంగా కోడెల కుమారుడు శివరామ్ చెబుతున్నారు. ఐదు నిమిషాల టైమ్ ఇవ్వలేదట.. రాజమండ్రి మహానాడులో ఐదు లక్షల రూపాయలు చెల్లిస్తే పార్టీతో కలిసి భోజనం చేయవచ్చని ఆఫర్ ఇచ్చిన పార్టీ అధిష్టానం కోడెల కుటుంబానికి ఐదు నిమిషాల టైమ్ ఇవ్వలేదట. కోడెలను స్మరించుకోకపోవడం సరికదా! ఆయన భార్యకు, కొడుకుకు కనీస గౌరవం దక్కలేదట. పుండుమీద కారం చల్లినట్లు కొత్తగా టీడీపీలో చేరిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణకు సత్తెనపల్లి టీడీపీ టిక్కెట్ ప్రకటించారన్నది ఆయన ఆవేదన. ఈయనే కాదు విజయవాడ ఎంపీ కేశినేని నాని కూడా పార్టీపై అసంతృప్తితో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నంద్యాల, ఆళ్లగడ్డలలో టీడీపీ వర్గాలు రచ్చ రచ్చ మరో వైపు నంద్యాల, ఆళ్లగడ్డలలో టీడీపీ వర్గాలు రచ్చకెక్కి నడి రోడ్డు మీదే కొట్టుకున్నాయి. ఈ పరిణామాలన్నీ టీడీపీకి ఆందోళన కలిగించేవే. వీటిలో సత్తెనపల్లి రాజకీయం మాత్రం చంద్రబాబు తన సహజమైన యూజ్ అండ్ త్రో విధానాన్ని అవలంభించినట్లుగా ఉంది. కోడెల స్పీకర్గా ఉన్నప్పుడు చేసిన చర్యలపై నిర్దిష్ట ఆరోపణలు వచ్చాయి. వాటిపై ప్రభుత్వం కేసులు పెట్టింది. దాంతో టీడీపీ నాయకత్వం కోడెలను ఎలా వదలించుకోవాలా అన్న ఆలోచనలో పడింది. ఆ తరుణంలో చంద్రబాబు పల్నాడు పర్యటనకు వెళితే కోడెలను కనీసం రమ్మని కూడా పిలవలేదు. దాంతో ఆయన కలత చెందారని అప్పట్లో వార్తలు వచ్చాయి. తదుపరి ఆయన అనారోగ్యానికి గురై గుంటూరు ఆస్పత్రిలో ఉన్నారు. కోడెలను పరామర్శించాల్సిందిగా ఆయన కుటుంబ సభ్యులు చంద్రబాబును కోరినా వెళ్లలేదని అంటారు. ఫలితంగా కోడెల తీవ్ర మనస్తాపానికి గురి అయ్యారు. ఈ పరిణామాలన్నిటి నేపథ్యంలో కారణం ఏమైనా కోడెల హైదరాబాద్ లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. అప్పుడు ఆయన ఏమైనా లేఖ రాశారా ?లేదా? అన్నది తెలియకుండా జాగ్రత్తపడ్డారు. శవయాత్రకు ప్లాన్.. కోడెల చనిపోగానే చంద్రబాబు రంగంలోకి దూకి శవయాత్రకు ప్లాన్ చేశారు. దాని వెంట ఆయన స్వయంగా వెళ్లారు. ఆయా చోట్ల కాని, స్మశానంలో కాని ప్రభుత్వ వేధింపుల వల్లే కోడెల ఆత్మహత్య చేసుకున్నారని చంద్రబాబు ఆరోపణలు గుప్పించారు. అందులో ఎంత వాస్తవం ఉందన్నది పక్కనపెడితే కోడెల మరణాన్ని రాజకీయంగా కాష్ చేసుకోవడానికి చంద్రబాబు యత్నించిన విషయం అందరికి అర్దం అయింది. ఆ తర్వాత కోడెల కుమారుడు శివరామ్ సత్తెనపల్లి లో రాజకీయాలు చేయడం ఆరంభించారు. కాని అందుకు మాత్రం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట. ఫలితంగా ఆ నియోజకవర్గంలో రెండు,మూడు గ్రూపులు తయారయ్యి గొడవలు పడసాగాయి. ఆ విషయం శివరామ్తో చెప్పించారట.. ఈ క్రమంలో సడన్గా కన్నా లక్ష్మీనారాయణను చంద్రబాబు అక్కడ అభ్యర్ధిగా ప్రకటించారు. దీంతో హతాశుడైన శివరామ్ తీవ్రంగా స్పందించారు. అప్పుడు కాని కొన్ని అసలు విషయాలు బయటపెట్టలేదు. కోడెల మరణించినప్పుడు హడావుడి చేయడం తప్పించి, తదుపరి ఆయన కుటుంబ సభ్యులను పట్టించుకోలేదని ఇప్పుడు వెల్లడైంది. చివరికి ప్రభుత్వ లాంఛనాలతో కోడెల అంత్యక్రియలు జరపవద్దని శివరామ్తో చెప్పించారట. కోడెల టీడీపీ నేతగా ఉన్న సమయంలో కన్నా లక్ష్మీనారాయణ కాంగ్రెస్లో ఉండేవారు. వారిద్దరి మధ్య రాజకీయ విమర్శలు సాగుతుండేవి. నమ్ముకున్న కుటుంబాన్ని నట్టేట ముంచేశారు.. కోడెలపై కన్నా కేసులు పెట్టించారని కూడా శివరామ్ ఆరోపిస్తున్నారు. కోడెలతో గొడవలేమో కాని, చంద్రబాబుపై కన్నా తీవ్ర విమర్శలే.. కాదు.. కాదు.. దూషణలే చేసేశారు. తనను హత్య చేయించడానికి చంద్రబాబు యత్నించారని కూడా కన్నా ఆరోపించారు. బీజేపీ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు కూడా చంద్రబాబును పట్టుకుని వాడెవడు, వీడెవడు అంటూ మాట్లాడిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయినా వీరిద్దరి మధ్య ఎక్కడ రాజీకుదిరిందో కాని కన్నా సడన్గా టీడీపీలోకి జంప్ చేయడం, ఆయనకు సత్తెనపల్లి టిక్కెట్ ఇచ్చేయడం, ఇంతకాలం తనను నమ్ముకున్న కోడెల కుటుంబాన్ని నట్టేట ముంచేయడం జరిగాయన్నమాట. ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే లక్ష్యంతో.. శివరామ్తో పాటు మరికొందరు సత్తెనపల్లి టీడీపీ నేతలకు కూడా కన్నాను అభ్యర్ధి చేయడంపై జీర్ణించుకోలేకపోయినా,వారు పెద్దగా స్పందించినట్లు కనిపించలేదు. చంద్రబాబు ఎందుకు శివరామ్ను బలి చేయడానికి వెనుకాడలేదన్న చర్చ సహజంగానే వస్తుంది. శివరామ్ సత్తెనపల్లిలో గెలవలేడన్న అభిప్రాయానికి వచ్చి ఉండాలి. లేదా శివరామ్కు సత్తెనపల్లిలో మంచి పేరు లేదన్న భావన అయినా కావాలి. లేదూ కోడెల వల్ల అప్పట్లో పార్టీకి నష్టం కలిగిందని అనుకుని ఉండవచ్చు. కాకపోతే కోడెల చనిపోయినప్పుడు ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే లక్ష్యంతో ఆయన మృతిని వాడుకున్నారన్నమాట. చదవండి: Fact Check : పేదల ఇళ్లపై పిచ్చి రాతలు.. బాబు కొంప కొల్లేరవుతుందనే! నిజానికి కన్నాపై చంద్రబాబు కూడా గతంలో చాలా తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేశారు. కొన్నిసార్లు అసెంబ్లీలో తిట్టుకున్నంత పనిచేశారు. అయినా రాజకీయం మారింది. ఇద్దరూ తమ తిట్లను తూచ్ అనుకున్నారు. చంద్రబాబు ఎవరినైనా మేనేజ్ చేయగలరన్నదానికి ఇదొక ఉదాహరణ కూడా కావచ్చు. కన్నా నిజానికి జనసేన పార్టీలో చేరవచ్చని అంతా అనుకున్నారు. ఆ మేరకు మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తో చర్చలు కూడా జరిగాయి. కన్నా కాపు సామాజికవర్గంలో కొంత గుర్తింపు పొందిన సీనియర్ నేత కనుక ఆయన జనసేనలో చేరితే ఆ పార్టీ పరిస్థితి మెరుగు అయితే పొత్తు సమయంలో ఎక్కువ సీట్లు అడుగుతారని చంద్రబాబు ఊహించి ఉండవచ్చు. అందుకే కన్నా జనసేనలోకి వెళ్లకుండా టీడీపీలోకి లాగేసింది.. అందుకే కన్నా జనసేనలోకి వెళ్లకుండా టీడీపీలోకి లాగేసి జనసేనను, ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ను ఒక దెబ్బేశారన్నమాట. అయినా పవన్ పెద్దగా పీల్ అవరు కాబట్టి ఆయన చంద్రబాబు చొక్కా పట్టుకుని వెళుతున్నారు. ఇదే సమయంలో మరో వీడియో ఒకటి సోషల్ మీడియాలో కనిపిస్తోంది. గతంలో పొత్తు లేనప్పుడు పవన్ను ఉద్దేశించి తోక కట్ చేస్తానని చంద్రబాబు అన్నట్లుగా ఆ వీడియోలో ఉంది. పవన్ను తనకు అనుకూలంగా మార్చుకోవడమే కాకుండా, ఆయన సీఎం పదవి డిమాండ్ చేయకుండా తోక కట్ చేయగలిగారని అనుకోవాలి. ఇక కన్నాకు సత్తెనపల్లిలో టీడీపీ గ్రూపులు సహకరిస్తాయా?లేదా?అన్నది సంశయమే. టీడీపీకి గుండెలో రాయి పడినట్లే.. ఇప్పటికే శివరామ్ తాను సత్తెనపల్లిలో పోటీచేస్తానని అంటున్నారు. ఆయన ఇండిపెండెంట్గా పోటీలో దిగితే కన్నా కష్టాలు తప్పకపోవచ్చు. విజయవాడ ఎంపీ కేశినేని నాని పార్టీ ఏ పిట్టల దొరకు టిక్కెట్ ఇస్తే ఏమిటి అని వ్యాఖ్యానించడం ద్వారా చంద్రబాబు నాయుడును ఇబ్బందిలో పెట్టారు. ఉన్న ముగ్గురు లోక్ సభ సభ్యులలో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ అంటీ,అంటనట్లు ఉంటున్నారు. కేశినేని నాని వైసీపీ ఎమ్మెల్యేలతో అభివృద్ది విషయంలో కలిసి పనిచేస్తానని చెబుతున్నారు. ఇదే సందర్భంలో టీడీపీ పిట్టలదొరకు ఎంపీ టిక్కెట్ ఇవ్వబోతోందని తేల్చేశారు. నానీ సోదరుడు చిన్నీకి టిక్కెట్ ఇవ్వవచ్చని వార్తలు వస్తున్న తరుణంలో నాని తన అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేశారన్నమాట. అవసరమైతే స్వతంత్రంగా పోటీచేస్తానని నాని సంకేతం ఇవ్వడం టీడీపీకి గుండెలో రాయి పడినట్లే అవుతుంది. చదవండి: కేసీఆర్కు ఆ భయం పట్టుకుందా?.. ఎక్కడో ఏదో తేడా కొడుతుంది..! కాగా మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ ఇటీవల టీడీపీలోని మరో గ్రూపు సుబ్బారెడ్డి అనుచరులపై దాడి చేసి జైలుకు వెళ్లివచ్చారు. భర్తతో కలిసి ఆమె చేస్తున్న చర్యలతో పార్టీ పరువు పోతోందని కార్యకర్తలు చెబుతున్నారు. ఆమెకు పార్టీ నోటీసు ఇచ్చింది. అసలే నంద్యాల, కర్నూలు జిల్లాలలో పార్టీ బాగా బలహీనంగా ఉందనుకుంటుంటే, ఈ గొడవలతో మరింత అప్రతిష్టపాలవుతోంది. మరో వైపు చిలకలూరిపేటలో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఫౌండేషన్ల పేరుతో కొందరు వ్యక్తులు రాజకీయాలు చేస్తుంటే వారికి టీడీపీ టిక్కెట్లు ఇస్తామనడం ఏమిటని ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలు వైసీపీలో జరిగి ఉంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టివి 5 వంటివి ఆ పార్టీ పని అయిపోయిందని విపరీత ప్రచారం చేసేవి. టిడిపిలో ఈ పరిణామాలపై మాత్రం అవి కిమ్మనకుండా మూసుకుని ఉండడం కూడా గమనించదగ్గ అంశమే. మహానాడుతో టీడీపీకి ఊపు వచ్చిందని ప్రచారం చేయాలని అనుకున్న టీడీపీకి, చంద్రబాబుకు ఈ పరిణామాలు జీర్ణం కానివే. -కొమ్మినేని శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ ఛైర్మన్ -
కోడెలకు అన్యాయం చేస్తున్నారు
సాక్షి, నరసరావుపేట: తెలుగుదేశం పార్టీ స్థాపించిన రోజు నుంచి మరణించే వరకు ఆ పార్టీ కోసం పోరాడిన డాక్టర్ కోడెల శివప్రసాద్, ఆయన కుటుంబానికి చంద్రబాబునాయుడు అన్యాయం చేస్తున్నారని శాసన సభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కుమారుడు కోడెల శివరాం ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన శుక్రవారం ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడుతూ.. ‘వైద్య వృత్తిలో పల్నాడు గడ్డపైనే కాకుండా ప్రపంచంలోని తెలుగువారందరికీ ఆదర్శంగా నిలిచిన కోడెల శివప్రసాద్ ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చారు. ఎన్టీఆర్ కోరిక మేరకు కోడెల 11 ఏళ్లు కష్టపడి బసవతారకం ఆసుపత్రిని నిర్మించారు. చనిపోయేవరకు పార్టీ, కార్యకర్తలు, పేదలకు అండగా నిలిచారు. పల్నాడు ప్రాంతం, కోటప్పకొండ అభివృద్ధి అంటే గుర్తుకొచ్చే పేరు కోడెల. అటువంటి కోడెలను పార్టీ నేతలు తీవ్రంగా అవమానిస్తున్నారు. ఆయన పేరును చెరిపివేయాలని మా పార్టీలోని కొందరు కుట్ర పన్నుతున్నారు’ అని శివరాం ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ లాంఛనాలను వద్దన్నారు ‘గత నాలుగేళ్లుగా చంద్రబాబుతో మాట్లాడాలని ఎంత ప్రయత్నించినా అవకాశం ఇవ్వలేదు. పల్నాడు టీడీపీ అధ్యక్షుడు ఆంజనేయులు, అచ్నెన్నాయుడు, చంద్రబాబు వ్యక్తిగత సహాయకుల ద్వారా ఎన్నో ప్రయత్నాలు చేశా. మహానాడులో రూ. 5 లక్షలు విరాళం ఇచ్చిన వారితో చంద్రబాబు కలసి భోజనం చేశారు. మా తండ్రి, మా కుటుంబం పార్టీ కోసం ఆహార్నిశలు కష్టపడినా మాకు మాత్రం అవకాశం ఇవ్వలేదు. పార్టీ కోసం ప్రాణాలర్పించిన నాయకుడి కుటుంబానికి చంద్రబాబు 5 నిమిషాలు సమయం ఇవ్వడంలేదు. డబ్బే ప్రామాణికమైతే ఆస్తులు అమ్మి అయినా ఇస్తాం. కోడెల త్యాగానికి వెల కడితే ఆమేరకు చెల్లిస్తాం. మా తండ్రి మరణం తర్వాత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేస్తామని చెప్పింది. అయితే, టీడీపీ అధిష్టానం వద్దని చెప్పడంతో మేము ఆ లాంఛనాలను తిరస్కరించాం. కన్న కొడుకుగా నా తండ్రికి దక్కాల్సిన గౌరవాన్ని వదులుకున్నందుకు బాధ కలిగింది. అయినా టీడీపీ కోసం ఆ బాధనూ భరించాం. ఇన్ని చేసినా చంద్రబాబు, లోకేశ్ మా కుటుంబాన్ని కావాలనే దూరం చేస్తున్నారు’ అని చెప్పారు. బసవతారకం ట్రస్ట్లో చోటు ఇవ్వలేదు... ‘ఎన్నో కష్టనష్టాలకోర్చి, ఎందరినో కలుపుకొని బసవతారకం ఆసుపత్రి నిర్మించిన కోడెల చనిపోతే.. ఆయన స్థానంలో ట్రస్ట్ మెంబర్గా మా తల్లిని నియమించలేదు. ఆ స్థానంలో చంద్రబాబు కోడలు బ్రాహ్మణిని తెచ్చారు. ఇది అన్యాయం కాదా? ఇది ట్రస్ట్ నిబంధనలకు విరుద్ధం. రాష్ట్రంలో ఎన్నో స్థానాలలో నాయకులు చనిపోతే వారి వారసులకు సీట్లు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు. అదే పాలసీ సత్తెనపల్లిలో ఎందుకు పాటించరు? కోడెల జయంతి, వర్ధంతులకు ట్వీట్లు చేయడంతో సరిపుచ్చుతున్నారు. మా అమ్మను కనీసం ఫోన్ చేసి ఓదార్చలేదు. కోడెల విగ్రహాల ఏర్పాటును కూడా సొంత పార్టీ నేతలే అడ్డుకుంటున్నారు. ఇదేమి పార్టీ’ అని అన్నారు. పోటీ చేస్తా.. గెలుస్తా ‘టీడీపీ, చంద్రబాబు, కోడెల అంటేనే పడని వ్యక్తి కన్నా లక్ష్మీనారాయణ. అక్రమాస్తులు కలిగి ఉన్నారని చంద్రబాబుపై కన్నా కేసులు వేశారు. చంద్రబాబును బూతులు తిట్టారు. అవకాశాల కోసం పార్టీలు మారిన వ్యక్తి కన్నా. అటువంటి వ్యక్తిని సత్తెనపల్లి టీడీపీ ఇన్చార్జిగా నియమిస్తారా? ఇది చాలా బాధించింది. పార్టీ శ్రేణులు కూడా హర్షించడంలేదు. వచ్చే ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి పోటీ చేసి తీరుతా. నేనే గెలుస్తా. కోడెల కుటుంబాన్ని నమ్ముకున్న కార్యకర్తలు, అభిమానులకు అండగా నిలుస్తా. నాకు పదవులు, అధికారం ముఖ్యం కాదు. కోడెల ఆశయాల సాధనే ప్రధానం. అందుకోసమే పోరాడుతా’ అని శివరాం చెప్పారు. -
నా టిక్కెట్ ఎవడికో ఇవ్వడమేంటి ?
-
టీడీపీలో ముసలం.. కోడెల కుమారుడు శివరాం సంచలన వ్యాఖ్యలు
సాక్షి, పల్నాడు జిల్లా: సత్తెనపల్లి టీడీపీలో ముసలం పుట్టింది. నియోజకవర్గ ఇంచార్ద్ నియామకం టీడీపీలో కాక రేపుతోంది. అనుచరులతో కోడెల కుమారుడు శివరాం సమావేశమయ్యారు. టీడీపీ ఇన్ఛార్జ్గా కన్నా లక్ష్మీనారాయణ నియామకాన్ని వ్యతిరేకిస్తున్న కోడెల శివరాం.. పట్టణంలో గురువారం ర్యాలీ నిర్వహించారు. ఇన్ఛార్జ్గా కన్నా పేరు ప్రకటనపై తమకు సమాచారం లేదని కోడెల శివరాం మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో కన్నా అరాచకాలను కోడెల అడ్డుకున్నారని, టీడీపీని అవమానించిన నాయకులకు పెద్దపీట వేస్తున్నారంటూ ఆయన వ్యాఖ్యానించారు. ‘‘లాలుచి రాజకీయాలు మాకు తెలియదు. తెలుగుదేశం పార్టీని కోడెల బతికించారు. కొంత మంది నాయకులు మాపై కుట్రలు చేస్తున్నారు. టీడీపీ అధిష్టానం మమ్మల్ని పట్టించుకోవటం లేదు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా అధిష్టానం సత్తెనపల్లిని టార్గెట్ చేసింది’’ అంటూ శివరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: టీడీపీకి షాకిచ్చిన కొట్టే వెంకట్రావు దంపతులు -
కోడెల శివరామ్కు బిగ్ షాక్!
తెనాలిరూరల్: టీడీపీ నేత, శాసనసభ మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ తనయుడు కోడెల శివరామ్పై చీటింగ్ కేసు నమోదైంది. తన కంపెనీలో పెట్టుబడి పెట్టించి మోసం చేశాడని బాధితులు కోర్టును ఆశ్రయించగా, కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేశారు. శివరామ్, అతడి భార్య పద్మప్రియ విజ్ఞప్తి మేరకు శివరామ్కే చెందిన కైరా ఇన్ఫ్రా కంపెనీలో 2016లో గుంటూరు జిల్లా తెనాలి మండలం పెదరావూరు గ్రామానికి చెందిన పాలడుగు బాలవెంకటసురేష్ రూ.24.25 లక్షల పెట్టుబడి పెట్టారు. మరో ముగ్గురు సుమారు రూ.కోటి వరకు పెట్టుబడి పెట్టారు. అందుకు సంబంధించి చెక్కుల ద్వారా లావాదేవీ జరిపారు. వీరి పెట్టుబడి, అందుకు తగిన ప్రతిఫలాన్ని మరుసటి ఏడాది 2017లో తిరిగి ఇచ్చేలా శివరామ్, అతడి భార్య ఒప్పందం చేసుకున్నారు. ఎన్నిసార్లు అడిగినా డబ్బులు తిరిగి చెల్లించకపోవడంతో బాధితులు తెనాలి కోర్టును ఆశ్రయించారు. బాలవెంకటసురేష్ పిటిషన్పై కోర్టు నుంచి వచ్చిన ఆదేశాల మేరకు శివరామ్పై 420, 407, 403, 386, 389, 120బి, 506, 509 ఐపీసీ, 156(3) సీఆర్పీసీ సెక్షన్ల కింద రూరల్ ఎస్ఐ చిరుమామిళ్ల వెంకటేశ్వర్లు బుధవారం రాత్రి కేసు నమోదు చేశారు. -
తెలుగుతమ్ముళ్ల కుమ్ములాట
సత్తెనపల్లి: పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో తెలుగుదేశం కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. గురువారం పార్టీ సంస్థాగత కమిటీ సమావేశం సందర్భంగా మరోసారి నియోజకవర్గంలో నాయకుల వర్గవిభేదాలు బహిర్గతమయ్యాయి. మాటలు పెరిగి కుర్చీలతో దాడులు చేసుకున్నారు. గతంలో ఇక్కడ పోటీచేసి ఓటమిపాలైన మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యానంతరం పార్టీ అధిష్టానం ఎవరికీ నియోజకవర్గ ఇన్చార్జి పదవి అప్పగించలేదు. దీంతో నియోజకవర్గంలో ఒకే సామాజికవర్గానికి చెందిన కోడెల శివరాం, మాజీ శాసనసభ్యుడు వై.వి.ఆంజనేయులు, తెలుగుయువత నాయకుడు మన్నెం శివనాగమల్లేశ్వరరావు (అబ్బూరి మల్లి) ఎవరికివారు పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గురువారం పార్టీ సంస్థాగత కమిటీ విషయంలో సత్తెనపల్లిలోని ఎన్టీఆర్ భవన్లో పార్టీ నాయకులు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి కొండెపి ఎమ్మెల్యే డోల బాలవీరాంజనేయస్వామి, పార్టీ నరసరావుపేట పార్లమెంట్ అధ్యక్షుడు జి.వి.ఆంజనేయులు, మాజీమంత్రి నక్కా ఆనందబాబు, మాజీ శాసనసభ్యుడు ధూళిపాళ్ల నరేంద్రకుమార్ హాజరయ్యారు. అప్పటికే మాజీ ఎమ్మెల్యే వై.వి.ఆంజనేయులు, మన్నెం శివనాగమల్లేశ్వరరావు తదితరులు కార్యకర్తలతో పార్టీ కార్యాలయంలో ఉన్నారు. కోడెల శివరాం తన వర్గంతో ర్యాలీగా ఎన్టీఆర్ భవన్ వద్దకు వచ్చి ఇన్చార్జిని నియమించకుండా సంస్థాగత కమిటీ నియామకాలు ఏమిటని ప్రశ్నించారు. స్థానికులుకాని వారి సలహాలు అవసరం లేదంటూ నినదించారు. ఈ క్రమంలో కార్యకర్తల మధ్య వాగ్వాదం తలెత్తింది. పరస్పరం కుర్చీలతో కొట్టుకున్నారు. సమావేశానికి వచ్చిన పరిశీలకులు ఇన్చార్జి నియామక విషయం అధిష్టానం చూసుకుంటుందని, ప్రస్తుతం సంస్థాగత కమిటీ సమావేశం జరుగుతుందని చెప్పారు. అయినా గొడవ ఆగకపోవడంతో మాజీ ఎమ్మెల్యే వై.వి.ఆంజనేయులు, ముఖ్య నాయకులు బయటకు వచ్చారు. తెలుగుతమ్ముళ్ల గొడవను కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధులపై శివరాం వర్గీయులు దురుసుగా ప్రవర్తించడమేగాక సెల్ఫోన్లు లాక్కున్నారు. దీంతో సమావేశాన్ని కవర్ చేయకుండా మీడియా ప్రతినిధులు బాయ్కాట్ చేశారు. -
సత్తెనపల్లిలో కుమ్మేసుకున్న తెలుగు తమ్ముళ్లు
సాక్షి, గుంటూరు: తెలుగుదేశం పార్టీలో అంతర్గత కలహాలు పార్టీ పరువును నడిరోడ్డుపై నిలబెడుతున్నాయి. నిన్న కళ్యాణదుర్గం.. నేడు సత్తెనపల్లి వరుసగా తెలుగు తమ్ముళ్లు బాహాబాహీకి దిగుతున్నారు. తాజాగా సత్తెనపల్లి ఎన్టీఆర్ భవన్లో పార్టీ సంస్థాగత కమిటీల విషయంలో తెలుగుదేశం నేతలు ఘర్షణ పడ్డారు. కోడేల శివరాం, వైవీ ఆంజినేయులు వర్గాలు ఒకరిపై ఒకరు గొడవపడ్డారు. కుర్చీలతో కూడా కొట్టుకున్నారు. దీంతో సంస్థాగత నియామకాల సమావేశం రసాభాసగా మారింది. కోడెల శివరాం, జీవి ఆంజినేయుల మధ్య కూడా వాగ్వాదం జరిగింది. దీంతో కమిటీ మీటింగ్ నుంచి మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజినేయులు అర్ధాంతరంగా వెళ్లిపోయారు. చదవండి: (అనంత టీడీపీలో భగ్గుమన్న విభేదాలు.. కుర్చీలతో కుమ్మేసుకున్నారు) -
కోడెల శివరామ్పై చీటింగ్ కేసు నమోదు
తెనాలి రూరల్: దివంగత కోడెల శివప్రసాదరావు తనయుడు కోడెల శివరామ్పై చీటింగ్ కేసు నమోదైంది. తన కంపెనీలో పెట్టుబడి పెట్టించి మోసం చేశాడని బాధితులు కోర్టును ఆశ్రయించగా, కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేశారు. శివరామ్కు చెందిన కైరా ఇన్ఫ్రా కంపెనీలో 2016లో తెనాలి మండలం పెదరావూరు గ్రామానికి చెందిన యలవర్తి సునీత రూ.26,25,000, పాలడుగు బాల వెంకట సురేష్ రూ.24,25,000 పెట్టుబడి పెట్టారు. వీరి పెట్టుబడి, అందుకు తగిన ప్రతిఫలాన్ని మరుసటి ఏడాది 2017లో తిరిగి ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. ఎన్నిసార్లు అడిగినా డబ్బులు తిరిగి చెల్లించకపోవడంతో బాధితులు తెనాలి కోర్టును ఆశ్రయించారు. కోర్టు నుంచి వచ్చిన ఆదేశాల మేరకు రూరల్ ఎస్ఐ జి.ఏడుకొండలు శివరామ్పై చీటింగ్ కేసును సోమవారం నమోదు చేశారు. -
కోడెల శివరాం టీడీపీ నేతలను హింసిస్తున్నాడు
-
కోడెల శివరాం కార్యకర్తలను ఇబ్బంది పెట్టారు: టీడీపీ నేత
సాక్షి, గుంటూరు: కోడెల శివప్రసాద్ కొడుకు కోడెల శివరాం గత ఐదేళ్లలో కష్టపడి పని చేసిన పార్టీ కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేశారని టీడీపీ నేత పమిడి బాలకృష్ణ సంచలన వ్యాఖలు చేశారు. నకరికల్లు మండలం కల్లకుంటలో రేపు(గురువారం) కోడెల విగ్రహావిష్కరణకు వచ్చే చంద్రబాబు నాయుడు, లోకేష్, అచ్చెన్నాయుడు, దేవినేని ఉమా జోక్యం చేసుకోవాలన్నారు. తమ దగ్గర నుంచి కోడెల శివరాం రూ.32 లక్షలు తీసుకున్నారని మండిపడ్డారు. ఆ డబ్బులు తిరిగి మాకు చంద్రబాబునాయుడు, లోకేష్, అచ్చెన్నాయుడు, దేవినేని ఉమామహేశ్వరరావు ఇప్పించాలని బాలకృష్ణ డిమాండ్ చేశారు. 30ఏళ్ల నుంచి పార్టీకి ఎంతో ఖర్చు పెట్టి అంకితభావంతో పని చేశామని గుర్తుచేశారు. గత ప్రభుత్వంలో నీరు-చెట్టు పనులు చేస్తున్న తమని కోడెల శివరాం బాగా ఇబ్బంది పెట్టారని చెప్పారు. కోడెల శివరాం వల్ల తాము బాగా నష్టపోయామని, తమచేత ఖాళీ పేపర్ల పైన సంతకాలు పెట్టించుకున్నారని తెలిపారు. పార్టీకి నష్టం చేసిన కోడెల శివరాం మళ్లీ పార్టీలో యాక్టివ్ అవ్వటానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. కోడెల శివరాం ధన దాహం వల్ల నరసరావుపేట సత్తెనపల్లి నియోజకవర్గాల్లో పార్టీ కార్యకర్తలు నష్టపోయారని బాలకృష్ణ పేర్కొన్నారు. టీడీపీ నేత పమిడి బాలకృష్ణ విడుదల చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
కోడెల శివరామ్పై టీడీపీ నేత ఫిర్యాదు
సాక్షి, సత్తెనపల్లి: శాసన సభ మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు తనయుడు కోడెల శివరామ్ తన వద్ద నుంచి రూ.1.30 కోట్ల విలువైన లిక్కర్ తీసుకుని డబ్బులివ్వడం లేదని గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణ పోలీసులకు ఆదివారం టీడీపీ నేత నర్రా రమేష్ ఫిర్యాదు చేశాడు. రాజుపాలెం మండలం గణపవరం గ్రామానికి చెందిన నర్రా రమేష్ టీడీపీ ప్రభుత్వ హయాంలో లిక్కర్ వ్యాపారం చేశారు. గత సార్వత్రిక ఎన్నికలకు తన తండ్రి శివప్రసాదరావు సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేయడంతో మద్యం పంపిణీ చేసేందుకు రూ.1.30 కోట్ల లిక్కర్ను తీసుకుని నగదు చెల్లించలేదని, డబ్బులు అడిగితే చంపేస్తానంటూ బెదిరిస్తున్నాడని, తమకు న్యాయం చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. 2015 నుంచి 2019 వరకు అధికారాన్ని అడ్డుపెట్టుకుని మద్యం వ్యాపారుల నుంచి అనధికారికంగా నగదు వసూలు చేశాడని ఆరోపించారు. -
పోలీసుల అదుపులో కోడెల బినామీ!
సాక్షి, నరసరావుపేట: కేట్యాక్స్ కేసుల్లో కీలక పాత్రధారి గుత్తా నాగప్రసాద్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కినట్లు తెలిసింది. గత టీడీపీ పాలనలో కోడెల కుటుంబానికి అన్నీ తానై వ్యవహరించి సత్తెనపల్లి, నరసరావుపేట, గుంటూరు నియోజకవర్గాల్లో ఏ ఒక్క వర్గాన్నీ వదలకుండా బలవంతపు వసూళ్లకు పాల్పడటంలో ఇతను కీలక పాత్ర పోషించాడు. పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు కావటంతో పరారయ్యాడు. మాజీ స్పీకర్ కోడెల, అతని కుమారుడు శివరాంలపై నమోదైన కేసుల్లోనూ నాగప్రసాద్ నిందితుడిగా ఉన్నాడు. ప్రభుత్వం మారాక తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో శివరాం, ప్రసాద్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. శివరాం కబ్జా చేసిన ఆస్తులను ప్రసాద్ పేరిట రాయించినట్లు తెలిసింది. భూ కబ్జా కేసులో టీడీపీ నేత పోతినేని అరెస్టు మంగళగిరి: భూకబ్జా కేసులో గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ టీడీపీ మాజీ ఇన్చార్జి పోతినేని శ్రీనివాసరావును పోలీసులు గురువారం అరెస్టు చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో పట్టణంలోని లక్ష్మీనరసింహపురం కాలనీలో బీసీలకు చెందిన రూ.కోట్ల విలువైన భూమిని పోతినేని శ్రీనివాసరావు కబ్జా చేయడంతో పాటు రికార్డులు తారుమారు చేసి ఆక్రమించారనే ఆరోపణలున్నాయి. భూ యజమాని పోలీసులతో పాటు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. అధికార యంత్రాంగం అంతా పోతినేనికి అండగా నిలవడంతో భూయజమానినిబెదిరించి ఆ భూమిని ఆక్రమించుకుని భూమికి ఫెన్సింగ్ వేసి నిర్మాణం చేపట్టాడు. అయితే పోతినేని శ్రీనివాసరావు భూ కబ్జాపై భూయజమానురాలు కుంచాల మంగేశ్వరి మళ్లీ ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టిన పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. -
శివరామ్ విచారణకు రంగం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: కోడెల శివప్రసాద్ ఆత్మహత్య కేసు దర్యాప్తును హైదరాబాద్ పోలీసులు ముమ్మరం చేశారు. ఆయన ఆత్మహత్యకు కుటుంబ వివాదాలు ఏమైనా కారణమా? అనే కోణంలోనూ విషయ సేకరణపై పోలీసులు దృష్టిపెట్టారు. ఇందులో భాగంగా కోడెల తనయుడు శివరామ్ను త్వరలోనే విచారించేందుకు రంగం సిద్ధం చేశారు. కోడెల కొన్ని రోజుల కిందట కూడా తన స్వస్థలంలో ఆత్మహత్యకు యత్నించగా కుటుంబీకులు ఆ విషయం దాచి గుండెపోటుగా చిత్రీకరించడంపైన తెలంగాణ పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కుమారుడు, కుటుంబీకుల కారణంగానే కోడెల ఆత్మహత్య చేసుకున్నట్లు ఆయన మేనల్లుడు కంచేటి సాయిబాబు గుంటూరు జిల్లా సత్తెనపల్లి డీఎస్పీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆ ఫిర్యాదు ఆంధ్రప్రదేశ్ పోలీసుల నుంచి తమకు అందిందని హైదరాబాద్ వెస్ట్జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ బుధవారం తెలిపారు. దీన్ని కూడా పరిగణలోకి తీసుకుని కోడెల ఆత్మహత్య కేసుతో కలిపి దర్యాప్తు చేస్తామని ఆయన చెప్పారు. బసవతారకం ఆస్పత్రి వైద్యురాలికి చివరి కాల్.. హైదరాబాద్లో కోడెల ఉరి వేసుకున్న గదిని పోలీసులు పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. ఆయన కొన్నేళ్లుగా వినియోగిస్తున్న మందులను వైద్య నిపుణులతో పరీక్ష చేయించాలని నిర్ణయించారు. అదే సమయంలో కోడెల పర్సనల్ మొబైల్ సెల్ఫోన్ ఎక్కడుంది? దాన్ని దాచాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఆత్మహత్యకు ముందు ఆ ఫోన్తో ఆయన ఎవరితో మాట్లాడారు? ఫోన్ దొరికితే గుట్టు రట్టవుతుందని ఎవరైనా భయపడుతున్నారా? అనే ప్రశ్నలకు సమాధానాల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఫోన్ నంబర్ ఆధారంగా కాల్డేటా రికార్డర్ యాప్ (సీడీఆర్ఏ)తో కాల్లిస్ట్ను పరిశీలిస్తున్నారు. ఆత్మహత్యకు ముందు కోడెల బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి చెందిన ఒక వైద్యురాలికి ఫోన్ చేసి 24 నిమిషాలు మాట్లాడినట్లు పోలీసుల దృష్టికి వచ్చినట్టు సమాచారం. ఆ ఫోన్ కాల్లో ఏం మాట్లాడారు అనేది తెలుసుకోవడానికి ఆ డాక్టరును విచారించాలని నిర్ణయించారు. కేబుల్ వైరుతో ఉరి.. పోస్టుమార్టం నివేదిక కోడెల శివప్రసాదరావు మృతదేహానికి సోమవారం పోస్టుమార్టం నిర్వహించిన ఉస్మానియా ఆస్పత్రి ఫోరెన్సిక్ వైద్యులు ఆ నివేదికను బుధవారం పోలీసులకు అందించారు. మెడకు కేబుల్ వైరు బిగించుకోవడం ద్వారానే మరణం సంభవించిందని వైద్యులు పోస్టుమార్టం నివేదికలో పేర్కొన్నట్లు పోలీసులు వెల్లడించారు. కోడెల గొంతు భాగంలో ఎనిమిది అంగుళాల పొడవుతో మచ్చ ఉందని తెలిపారు. ముందుగా తన పంచెను చింపి తాడుగా చేసుకుని ఉరి వేసుకోవాలని కోడెల ప్రయత్నించారని, అది సాధ్యం కాకపోవడంతో గదిలో ఉన్న కేబుల్ వైరుతో ఉరి వేసుకున్నారని తెలిపారు. 12 మందిని విచారించాం: బంజారాహిల్స్ ఏసీపీ కేఎస్రావు కోడెల ఆత్మహత్య కేసు దర్యాప్తులో భాగంగా కుటుంబీకులు, గన్మెన్, డ్రైవర్ తదితరులతో కలిపి మొత్తం 12 మంది వాంగ్మూలాలు నమోదు చేసినట్లు బంజారాహిల్స్ ఏసీపీ కేఎస్ రావు తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కోడెల అంత్యక్రియలు, ఇతర కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఆయన కుమారుడు, ఇతర కుటుంబీకులు, సన్నిహితులతోపాటు అనుమానం ఉన్న ప్రతి ఒక్కరినీ విచారిస్తామని చెప్పారు. కోడెల ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై కొడుకు శివరామ్ స్టేట్మెంట్ కీలకం కానుందని పేర్కొన్నారు. కోడెల ఫోన్లోని కాల్డేటా ఆరా తీస్తున్నామన్నారు. ముగిసిన కోడెల అంత్యక్రియలు నరసరావుపేట/నరసరావుపేటటౌన్: అనుమానాస్పద రీతిలో ఆత్మహత్యకు పాల్పడిన శాసనసభ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత డాక్టర్ కోడెల శివప్రసాదరావుకు టీడీపీ కార్యకర్తలు కన్నీటి వీడ్కోలు పలికారు. నరసరావుపేట కోటలోని కోడెల నివాసం నుంచి స్వర్గపురి వరకు సాగిన కోడెల అంతిమయాత్రలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు, లోకేష్తో పాటు ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు నేతలు పాల్గొన్నారు. కోడెల భౌతికకాయాన్ని బుధవారం మధ్యాహ్నం వరకు అభిమానుల సందర్శనార్థం కోటలో ఉంచారు. మధ్యాహ్నం 2గంటల సమయంలో చంద్రబాబు వచ్చి నివాళులర్పించి అంతియాత్ర ప్రారంభించారు. ప్రభుత్వ లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని కలెక్టర్ శామ్యూల్ కోడెల కుటుంబ సభ్యులకు వివరించగా.. వారు నిరాకరించారు. కోడెల చితికి శాస్త్రోక్తంగా ఆయన కుమారుడు శివరామకృష్ణ నిప్పంటించి అంతిమ సంస్కారం నిర్వహించారు. కోడెల అంతిమయాత్రలో ప్రతిపక్షనేత చంద్రబాబు అంతిమయాత్రలో ఉద్రిక్తత.. కోడెల శివప్రసాదరావు అంతిమయాత్రలో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముందుగా నిర్ణయించిన రూట్ మ్యాప్ ప్రకారం అంతిమయాత్ర సాగనీయకుండా ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గృహం మీదుగా తీసుకెళ్లాలంటూ టీడీపీ నేతలు పట్టుబట్టడంతో పోలీసులు అడ్డు చెప్పారు. అంతిమయాత్ర మల్లమ్మసెంటర్కు చేరిన అనంతరం తిరిగి ఉచ్చయ్య,పెంటయ్య వీధి గుండా స్వర్గపురికి వెళ్లాల్సి ఉంది. అయితే మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు మల్లమ్మ సెంటర్ నుంచి ఎమ్మెల్యే గోపిరెడ్డి ఇంటివైపు మళ్లించే ప్రయత్నం చేశారు. అయితే గుంటూరు రూరల్ ఎస్పీ ఆర్.జయలక్ష్మి , డీఎస్పీ వీరారెడ్డి సిబ్బందితో అక్కడకు చేరుకుని ముందస్తు రూట్ మ్యాప్ ప్రకారం వాహనాన్ని మళ్లించారు. సంబంధిత కథనాలు.. ‘కోడెలను తిట్టించిన చంద్రబాబు’ బీజేపీ అధికార ప్రతినిధి సంచలన వ్యాఖ్యలు ఒక మరణం.. అనేక అనుమానాలు కోడెల మృతికి చంద్రబాబే కారణం గ్రూపులు కట్టి వేధించారు.. -
కొడుకే వేధించాడు: కోడెల బంధువు
సత్తెనపల్లి: మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు ఆత్మహత్య చేసుకున్నాడని టీడీపీ నేతలు చెబుతున్న తరుణంలో ఆయన కుమారుడు కోడెల శివరామే తీవ్రంగా వేధించాడని మృతుని సమీప బంధువు కంచేటి సాయిబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘కోడెల శివరామ్ నన్ను మానసికంగా, శారీరకంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాడు.. ఆస్తులను తన పేరిట మార్చకపోతే చంపుతానని బెదిరిస్తున్నాడు. నాకు నా కొడుకు నుంచే నాకు ప్రాణహాని ఉంది’ అని గత నెలలో శివప్రసాదరావు తనతో ఫోన్లో పలుమార్లు ఆందోన వ్యక్తం చేశారని వెల్లడించారు. ఈ విషయం తనతో వ్యక్తిగతంగా కూడా చెప్పారన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన గుంటూరు జిల్లా సత్తెనపల్లి డీఎస్పీ రామిరెడ్డి విజయభాస్కరరెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. కోడెల మృతిని టీడీపీ నేతలు రాజకీయం చేస్తూ.. వైఎస్సార్సీపీపై బురద చల్లుతున్న నేపథ్యంలో సాయిబాబు ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను గుంటూరు జిల్లా క్రోసూరు మండలం పీసపాడు గ్రామానికి చెందిన వాడినని, వ్యాపార రీత్యా గుంటూరులో నివసిస్తున్నానని తెలిపారు. సోమవారం హైదరాబాద్లో మరణించిన కోడెల శివప్రసాదరావు తనకు మేనమామ కుమారుడన్నారు. ఆగస్టు నెలలో శివప్రసాదరాడు సెల్ నంబర్ 9848005923 నుంచి తన నంబర్ 6305322989కు పలుమార్లు ఫోన్లు చేసి కుమారుడు కోడెల శివరామ్ తనను మానసికంగా, శారీరకంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాడని చెప్పాడన్నారు. కోడెల మృతికి ఆయన కుమారుడే కారణమంటూ.. పోలీసులకు కోడెల బంధువు కంచేటి సాయిబాబు ఇచ్చిన ఫిర్యాదు కుమారుడి బారి నుంచి కాపాడాలని కోరారు ఆస్తులను తన పేరిట మార్చకపోతే చంపుతానని బెదిరిస్తున్నాడని శివప్రసాదరావు తనతో ఆవేదన పంచుకున్నాడని సాయిబాబు చెప్పారు. తనతో నాలుగు సార్లు వ్యక్తిగతంగా కూడా కోడెల అదే విషయం చెప్పారని వివరించారు. తన కుమారుడి నుంచి తనకు ప్రాణహాని ఉందని, అతని బారి నుంచి తనను కాపాడాలని కోరారన్నారు. దీంతో తాను శివరామ్కు పలుమార్లు ఫోన్ చేసి శివప్రసాదరావును ఇబ్బంది పెట్టవద్దని హెచ్చరించానన్నారు. శివరామ్ను కలిసి మాట్లాడదామని ప్రయత్నిస్తే.. అతను కుదరదని చెప్పాడన్నారు. ఇప్పుడు కోడెల మృతి విషయం తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానన్నారు. ఆయనకు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. కోడెల మృతిపై తనకు అనుమానం ఉందన్నారు. అతని కుమారుడే చంపి లేదా చంపించి ఆత్మహత్యగా చిత్రీకరించడానికి యత్నిస్తున్నాడని చెప్పారు. ఈ విషయమై పూర్తి స్థాయి విచారణ జరిపించి, ఆయన మరణానికి కారణమైన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. సంబంధిత వార్తలు... మాజీ స్పీకర్ కోడెల ఆత్మహత్య కోడెల మృతిపై బాబు రాజకీయం! ఆది నుంచి వివాదాలే! కోడెల మృతిని రాజకీయం చేయవద్దు -
శివరామే తండ్రిని హత్య చేశాడని ఫిర్యాదు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మరణంపై ఆయన సమీప బంధువు కంచేటి సాయి సంచలన ఆరోపణలు చేశారు. కోడెల కుమారుడు శివరామే ఆస్తికోసం ఈ హత్య చేశాడని ఆరోపించారు. ఈ మేరకు సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లో ఆయన ఫిర్యాదు చేశారు. శివారామ్ తనను శారీరకంగా, మానసికంగా చాలాకాలం నుంచి తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారని శివప్రసాద్ తనతో అనేకసార్లు చెప్పినట్లు సాయి తెలిపారు. ఆయనకు ఆత్మహత్య చేసుకునే అవసరం, బాధలేదని శివరామే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదులో పేర్కొన్న అంశాలు.. ‘గత ఆగస్టులో కోడెల శివప్రసాద్ నాకు పలుమార్లు ఫోన్ చేశారు. తన కమారుడైన శివరాం తనను మానసికంగా, శారీరకంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని, తన ఆస్తులను శివరామ్ పేరుమీదకు మార్చకపోతే చంపుతానని బెదిరిస్తున్నాడని తన ఆవేదనను నాతో పంచుకున్నారు. శివరామ్ నుంచి తనకు ప్రాణహాని ఉందని, తనను కాపాడాలని నన్ను వేడుకున్నారు. తరువాత నేనే స్వయంగా శివరామ్కు ఫోన్ చేసి తండ్రిని ఇబ్బంది పెట్టవద్దని అనేక సార్లు హెచ్చరించాను. ఈరోజు ఆయన మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. శివప్రసాద్ను శివరామే హత్య చేశాడు. దీనిపై విచారణ జరపాలి’ అని పేర్కొన్నారు. కాగా మాజీ స్పీకర్ కోడెల మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సాయి ఆరోపణలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. గుండెపోటు మృతి చెందితే.. అపోలో, కేర్ హాస్పిటల్కు తీసుకువెళ్తారు. కానీ బసవతారకం కాన్సర్ హాస్పిటల్కు ఎందుకు తీసుకెళ్లారంటూ పలు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పలువురు మాత్రం ఆయన ఉరేసుకుని మృతిచెందారంటూ చెబుతున్నారు. శవపరీక్షల నిమిత్తం ఆయన మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించగా.. మరిన్ని విషయాలు రిపోర్టు వచ్చిన తర్వాత తెలుస్తాయని అధికారులు తెలిపారు. చదవండి: శివరామే తండ్రిని హత్య చేశాడని ఫిర్యాదు కోడెల మృతితో షాక్కు గురయ్యాను... కోడెల మరణం: క్షణక్షణం అనేక వార్తలు! కోడెల మెడపై గాట్లు ఉన్నాయి కాబట్టి: సోమిరెడ్డి కోడెల మృతిపై అనేక సందేహాలు: అంబటి కోడెల మృతిపై కేసు నమోదు కోడెల కొడుకు ఆస్పత్రికి ఎందుకు రాలేదు? కోడెలది ఆత్మహత్యా? సహజ మరణమా? సుదీర్ఘ రాజకీయ జీవితం.. అనూహ్య విషాదం! కోడెల శివప్రసాదరావు కన్నుమూత -
ల్యాప్టాప్లు మాయం కేసులో అజేష్ చౌదరి అరెస్ట్
సాక్షి, గుంటూరు: సత్తెనపల్లి స్కిల్ డెవలప్మెంట్ కార్యాలయంలో ల్యాప్టాప్లు మాయమైన కేసులో ఏ-2 నిందితుడు అజేష్ చౌదరిని సత్తెనపల్లి పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. అరెస్ట్యిన నిందితుడు స్కిల్ డెవలప్మెంట్ మేనేజర్గా పనిచేశారు. ఈ కేసులో ఏ-1 నిందితుడైన మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తనయుడు శివరామ్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. స్కిల్ డెవలప్మెంట్ కార్యాలయంలో 30 ల్యాప్టాప్లు మాయం అవ్వడంతో ఆగష్టు 23వ తేదీన స్కిల్ డెవలప్మెంట్ అధికారి బాజీబాబు సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఫిర్యాదు విషయమై బయటకు రావడంతో డీఆర్డీఏ కార్యాలయంలో గుర్తు తెలియని వ్యక్తి ల్యాప్టాప్లను వదిలివెళ్లారు. -
ల్యాప్టాప్లు మాయం కేసులో అజయ్ చౌదరి అరెస్ట్
-
కోడెల అక్రమ నిర్మాణంపై చర్యలు
సాక్షి, గుంటూరు: అధికారం అండతో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమారుడు కోడెల శివరామకృష్ణ, కుమార్తె పూనాటి విజయలక్ష్మి అనేక అక్రమాలకు పాల్పడ్డారు. శివరామ్ తన షోరూమ్లో టీఆర్ లేకుండా బైక్ల విక్రయించి ప్రభుత్వానికి రూ.లక్షల్లో టోకరా వేశాడు. తన తండ్రి అక్రమంగా తెచ్చిపెట్టిన అసెంబ్లీ ఫర్నిచర్ను షోరూమ్లో ఉపయోగించుకున్నాడు. కే–ట్యాక్స్లు, ఉద్యోగాల పేరుతో అనేక మంది నుంచి డబ్బు వసూళ్లకు పాల్పడ్డాడు. ఈ వ్యవహారాలన్నింటిలో ఇప్పటికే శివరామ్పై అనేక కేసులు నమోదయ్యాయి. ఈయనగారి అక్రమాలు నరసరావుపేట, సత్తెనపల్లిలోనే కాకుండా రాష్ట్రం మొత్తం విస్తరించిన విషయం తెలిసిందే. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని గుంటూరు నగరంలో అక్రమంగా జీ ప్లస్–2 భవంతి నిర్మాణం చేపట్టారు. ఈ భవన నిర్మాణానికి కార్పొరేషన్ నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోలేదు. ఈ వ్యవహారంపై ఈ నెల 20న ‘సాక్షి’ దినపత్రికలో ‘యథేచ్ఛగా అక్రమ నిర్మాణం!’ శీర్షికతో కథనం ప్రచురితం అయింది. ఈ నేపథ్యంలో గుంటూరు నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులు కోడెల శివరామ్ నిర్మిస్తున్న అక్రమ నిర్మాణంపై చర్యలకు దిగారు. గుంటూరు నగరంలోని భాగ్యనగర్ కాలనీ ఎనిమిదో లైన్కు శివారులోని ఎక్స్టెన్షన్ ఏరియాలో సర్వే నెంబర్ 281/ఏ, 296/ఏ లలో 997 గజాలు, 291/ఏ, 296/డీ లలో 1019 గజాల స్థలం కోడెల శివరామ్కు ఉంది. ఈ స్థలంలో సుమారు ఎనిమిది నెలల క్రితం శివరామ్ జీ ప్లస్–2 భవనం నిర్మాణం చేపట్టారు. గత ప్రభుత్వ హయాంలో తన తండ్రి స్పీకర్ కావడంతో భవనం నిర్మాణానికి కార్పొరేషన్ నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోలేదు. స్పీకర్ తనయుడి భవంతి కావడంతో టౌన్ ప్లానింగ్ అధికారులు సైతం చూసీచూడనట్టు వదిలేశారు. నోటీసు జారీ... అక్రమ కట్టడం వ్యవహారంపై సాక్షిలో కథనం ప్రచురితం కావడంతో టౌన్ ప్లానింగ్ అధికారుల్లో చలనం వచ్చింది. కోడెల కుమారుడి అక్రమ నిర్మాణానికి నోటీసు జారీ చేశారు. కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారుల అనుమతులు లేకుండా నిర్మిస్తున్న భవనానికి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1955 452(1), 428, 461(1), ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ చట్టం 2014 115(1)(2), 116(1) కింద అధికారులు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. అక్రమ కట్టడంపై వివరణ ఇవ్వాలని కోరారు. బీపీఎస్ దరఖాస్తు తిరస్కరణ.. అక్రమంగా నిర్మిస్తున్న భవనాన్ని బీపీఎస్లో పెట్టి క్రమబద్ధీకరించేందుకు కోడెల శివరామ్ ప్రయత్నించారు. ఏ విధంగా ఆ భవనం బీపీఎస్ కిందకు వస్తుందో సరైన స్పష్టత ఇవ్వకపోవడంతో బీపీఎస్ దరఖాస్తును టౌన్ ప్లానింగ్ అధికారులు తిరస్కరించారు. కోడెల శివరామ్ వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కోసం 2018 సెప్టెంబర్ 3వ తేదీ దరఖాస్తు చేసుకున్నారు. వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ వేసేందుకు సర్వే చేయడం కోసం కార్పొరేషన్ రెవెన్యూ విభాగం సిబ్బంది అంతకు ముందు వరకూ ఆ స్థలం వ్యవసాయ భూమి కింద ఉండేది. కార్పొరేషన్ రెవెన్యూ అధికారులు వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ వేయడానికి ఆ స్థలం పరిశీలించేందుకు గత ఏడాది సెప్టెంబర్లో వెళ్లగా అక్కడ భవన నిర్మాణం ఇంకా ప్రారంభం కాలేదు. కోడెల శివరామ్ మాత్రం గత ఏడాది ఆగస్టు నెలకు ముందే భవన నిర్మాణం ప్రారంభం అయిందని ఆగస్టు నెలాఖరికి శ్లాబ్ పూర్తయిందని బీపీఎస్కు దరఖాస్తు చేశారు. అక్రమ కట్టడాన్ని కూల్చివేస్తారనే భయంతో భవనాన్ని క్రమబద్ధీకరించుకోవడం కోసం అనేక విధాలుగా ప్రయత్నిస్తున్నారు. టౌన్ ప్లానింగ్లోని కొందరు అధికారులు సైతం ఆయనకు సహకరిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ఇప్పటికే డీటీసీపీ (డైరెక్టర్ ఆఫ్, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్), మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నతాధికారులకు సమాచారం వెళ్లడంతో టౌన్ ప్లానింగ్ అధికారులపై ఇంటెలిజెన్స్ నిఘా పెట్టినట్టు సమాచారం. కోడెల కుమారుడితో అంటకాగి అక్రమ నిర్మాణాన్ని క్రమబద్ధీకరించడం కోసం ఏ టౌన్ ప్లానింగ్ అధికారి ప్రయత్నించినా వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేస్తున్నారని సమాచారం. -
అసెంబ్లీ ఫర్నిచర్ తరలింపు
సాక్షి, గుంటూరు: అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ తనయుడు శివరామ్ షోరూమ్లో ఉన్న శాసన సభ ఫర్నిచర్ను అధికారులు సోమవారం స్వాధీనం చేసుకుని వెలగపూడిలోని అసెంబ్లీకి తరలించారు. 2017లో అనుమతులు లేకుండా వెలగపూడి, హైదరాబాద్ నుంచి అసెంబ్లీ ఫర్నిచర్ను గుంటూరులో ఉన్న తన కుమారుడికి చెందిన గౌతమ్ షోరూమ్కు మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ తరలించిన విషయం విదితమే. ఎటువంటి అనుమతులూ లేకుండా అసెంబ్లీ ఫర్నిచర్ను గౌతమ్ షోరూమ్కు తరలించిన కోడెల శివప్రసాదరావు, ఆ ఫర్నిచర్ను వినియోగిస్తున్న అతని కుమారుడు శివరామ్పై అసెంబ్లీ సెక్షన్ అధికారి ఈ శ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తుళ్లూరు పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. ఈ ఫర్నిచర్ను సోమవారం రాత్రి రెండు లారీల్లో వెలగపూడిలోని అసెంబ్లీకి తరలించారు. -
చేసిన పాపాలే వెంటాడుతున్నాయి!!
సాక్షి, గుంటూరు: ఆ సీనియర్ నాయకుడిని చేసిన పాపాలే వెంటాడుతున్నాయి. అన్ని విధాలుగా ఉచ్చు బిగుస్తున్నాయి. ఆయన వల్ల పార్టీ పరువే కాదు.. కుటుంబపరువూ పోయింది. ఇలాంటి నాయకుడిని పార్టీ నుంచి గెంటేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయా? ఇంతకీ ఎవరా నాయకుడు? ఆయన చేసిన పాపాలు ఏంటి? గుంటూరు జిల్లా రాజకీయాల్లో కోడెల శివప్రసాదరావుది ఒక చరిత్ర. రాజకీయాల్లోకి రాకముందు ఒక మంచి డాక్టరుగా పేరు పొందారు. కానీ ఆయన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో కావాల్సినంత చెడ్డపేరు తెచ్చుకున్నారు. తీవ్రమైన అత్యాశ, పదవీకాంక్ష కోడెలను రాజకీయంగా భ్రష్టు పట్టించాయి. కోడెల ఎమ్మెల్యేగా కొత్తగా ఎన్నికయ్యాక 1983 నుంచి 85 వరకూ బాగానే సాగింది. ఆ తర్వాతే రాజకీయంగా ఎదగటం కోసం అనేక అడ్డదారులు తొక్కారు. విపరీతమైన పదవీ కాంక్ష కోడెలను పక్కదారి పట్టేలా చేసిందన్నది ఆయన అనుచరులే మాట. ఎమ్మెల్యేగా గెలిచిన తొలినాళ్లల్లోనే తుపాను బాధితులకు సాయంగా అందించాల్సిన రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించారు. ఏకంగా తన ఇంట్లో దాచుకున్న ఆ బియ్యాన్ని అప్పట్లో కమ్యూనిస్టులు వెలుగులోకి తెచ్చారు. తుఫాను బియ్యం దోచుకున్న దొంగ అని అప్పట్లో చెడ్డపేరు తెచ్చుకున్నారు. ఇతరుల ఆస్తులు బలవంతంగా లాగేసుకోవటం దగ్గర్నుంచి విలువైన స్థలాలు కబ్జాలు చేయటం, కమీషన్లు దండుకోవటం ఇలా ఎన్నో చేశారు. 1999 ఎన్నికల సమయంలో ఏకంగా ఆయన సొంత ఇంట్లోనే బాంబులు పేలి నలుగురు ముఖ్య అనుచరులు చనిపోయారు. మరెంతోమంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై కోడెల సీబీఐ విచారణ ఎదుర్కొన్నారు. హోంమంత్రిగా ఉన్న సమయంలోనే విజయవాడలో వంగవీటి రంగా హత్య జరగటం, అందులో కోడెల పాత్ర ఉందన్న అరోపణలు వచ్చాయి. గుంటూరు జిల్లా రాజకీయాలను శాసించటంతోపాటు ఎన్టీయార్ కుటుంబానికి కూడా కోడెల చాలా దగ్గర. ఈ కారణంతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆయనను ఏమీ చేయలేకపోయారు. హైదరాబాదులోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి కొంతకాలం వరకూ కోడెలే ఛైర్మన్ గా ఉన్నారు. ఆదే సమయంలో అక్కడ అక్రమాలు జరగడంతో ఆయన ఆ పదవిని వదలాల్సి వచ్చింది. ఇక గుంటూరు రాజకీయాల్లో శివప్రసాదరావు ఏం చెప్తే అదే జరిగేది. అలాంటి రాజకీయాలు చేయటం వల్ల అధినేత చంద్రబాబు కూడా ఆయనను పల్లెత్తి మాట అనలేదు. కొంతకాలంగా కోడెలకు, చంద్రబాబుకు పొసగటంలేదన్న వార్తలున్నాయి. అయినా తనకున్న పలుకుబడితో 2014 ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి సీటు సంపాదించి గెలిచారు. ఒక పత్రికాధిపతి రికమెండేషన్తో అసెంబ్లీకి స్పీకర్గా కూడా పనిచేశారు. అయితే రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నప్పటికీ కోడెల వైఖరిలో మార్పు రాలేదు. పైగా ఆయనే కాకుండా ఆయన కుమారుడు శివరామ్, కుమార్తె విజయలక్ష్మి కూడా రంగంలోకి దిగారు. వారు సత్తెనపల్లి, నరసరావుపేటలో చక్రం తిప్పారు. ఎమ్మార్వో ఆఫీసులో ఏదైనా సర్టిఫికెట్ కావాలంటే కోడెల మనుషులకు ఐదు వందల రూపాయలు లంచం ఇవ్వాలి. ఆ తరువాతే సర్టిఫికెట్ తెచ్చు్ఓవడానికి వీలయ్యేది. ఈ లంచావతారాలను తట్టుకోలేక బిల్డర్లు పనులు ఆపేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది. కే టాక్స్ పేరుతో వందల కోట్ల రూపాయలు ప్రజల ముక్కుపిండి వసూలు చేశారు. చివరికి ప్రభుత్వ ఆస్తిని సైతం చోరీ చేసే స్థాయికి దిగజారారు. అసెంబ్లీలో ఉండాల్సిన కోట్ల విలువైన ఫర్నీచర్ను నేరుగా తన ఇంటిలో దాచిపెట్టుకున్నారు కోడెల శివప్రసాద్. తాజాగా చోరీ వ్యవహారం బయట పడటంతో అధినేత చంద్రబాబుకు మంచి అవకాశం దొరికింది. దాంతో కోడెలను పార్టీ నుంచి పంపించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని సొంత పార్టీ నేతలే చెప్తున్నారు. అసెంబ్లీ ఫర్నీచర్ వ్యవహారంపై పార్టీ అధికార ప్రతినిధి వర్ల రామయ్య స్పందించారు. కోడెల చేసింది తప్పేనన్నారు. చంద్రబాబు కూడా అదే విధమైన వ్యాఖ్యలు చేశారు. కోడెల తప్పు చేసి ఉంటే చర్యలు తీసుకోవచ్చంటూ సూచించారు. అంటే కోడెలను బయటకు పంపించేందుకు పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు స్పష్టమవుతోంది. త్వరలోనే కోడెల వ్యవహారంపై ఒక కమిటీ ద్వారా విచారణ జరిపించి, వెంటనే షోకాజు నోటీసులు ఇవ్వటం, దానిపై కోడెల స్పందించిన తీరు నచ్చలేదన్న కారణంతో ఆయనను పార్టీ నుంచి బహిష్కరించాలన్నది చంద్రబాబు వ్యూహంగా చెబుతున్నారు. మొత్తమ్మీద కోడెలకు పచ్చ పార్టీలో నూకలు చెల్లిపోయే రోజులు దగ్గర్లోనే ఉన్నట్లు అర్ధం అవుతోంది. ఈ సంకట స్థితి నుంచి ఆయన ఎలా బయటపడతారో చూడాలి. -
కోడెల కేసులో కొత్త ట్విస్ట్..
సాక్షి, గుంటూరు: మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు స్వాధీనంలో ఉన్న అసెంబ్లీ ఫర్నిచర్ను అతని తనయుడికి చెందిన షోరూమ్లో గుర్తించిన ఘటన మరువక ముందే మరో దోపిడి బయటపడింది. సత్తెనపల్లి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో గతంలో అదృశ్యమైన ల్యాప్టాప్లు వెలుగులోకి వచ్చాయి. నాడు కోడెల దోపిడికి మాయమైన 29 ల్యాప్ట్యాపులు అనూహ్యాంగా ఆర్డీఏ ఆఫీసులో ప్రత్యక్షమయ్యాయి. టీడీపీ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ శివరామ్.. ప్రభుత్వ కార్యాలయంలోని విలువైన వస్తువులను అనుచరులకు విచ్చలవిడిగా పంచిపెట్టారు. ఈ సందర్భంలోనే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లోని విలువైన ల్యాప్టాప్లను తన అభిమానులకు ధారాదత్తం చేశాడు. తాజాగా వాటిపై కేసు నమోదు కావడంతో తప్పించుకునేందుకు రాత్రికిరాత్రే కొత్త ల్యాప్టాప్లు కొని వాటి స్థానంలో పెట్టారు. కాగా కోడెల శివప్రసాదరావు తనయుడు కోడెల శివరామ్ ఆదేశాల మేరకు కొందరు వ్యక్తులు 30 ల్యాప్టాప్లు, ప్రింటర్ తీసుకెళ్లారని నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి షేక్ బాజీబాబు సత్తెనపల్లి పట్టణ పోలీస్స్టేషన్లో శుక్రవారం ఫిర్యాదుచేసిన విషయం తెలిసిందే. గ్రామీణ ప్రాంత యువతలో నైపుణ్యాలు అభివృద్ధి చేసేందుకు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 2017లో సత్తెనపల్లిలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ మేరకు అప్పటి నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి అజేష్చౌదరి ఆదేశాల మేరకు 30 ల్యాప్టాప్లు, ఒక ప్రింటర్(ఇన్ఫ్రాస్ట్రక్చర్)ను సత్తెనపల్లి తీసుకొచ్చి ఎన్ఎస్పీ బంగ్లాలో భద్రపరిచారు. పర్యవేక్షణ బాధ్యతలను ఎన్ఎస్పీ ఏఈగా ఉన్న ఏసమ్మకు అప్పగించారు. 2018లో కోడెల శివరామ్.. ల్యాప్టాప్లను, ప్రింటర్ను తమ వారికి అందించాలని అజేష్చౌదరికి సూచించగా, ఆయన ఆదేశాలతో శివరామ్ అనుచరులకు ఏసమ్మ అప్పగించినట్టు బాజీబాబు చెప్పారు. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కోడెల కుమారుడు శివరామ్ అధికార బలంతో కాజేశారనే ఆరోపణలపై స్థానిక ఎమ్మెల్యే అంబటి రాంబాబు నైపుణ్యాభివృద్ధి సంస్థ ఉన్నతాధికారులకు ఇటీవల ఫిర్యాదు చేశారు. సంస్థ ఎండీ ఐఆర్టీఎస్ అధికారి ఆర్జా శ్రీకాంత్ ఆదేశాల మేరకు బాజీబాబు 16న సత్తెనపల్లి వచ్చి విచారణ చేసి నివేదికను ఉన్నతాధికారులకు అందించారు. వారి ఆదేశాల మేరకు బాజీబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా అసెంబ్లీ ఫర్నిచర్ను తన కార్యాలయాలు, ఇల్లు, కుమారుడి షోరూమ్లో ఉంచి వినియోగించుకుంటున్న కోడెల శివప్రసాదరావుపై తుళ్లూరు పోలీసులు శనివారం కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. -
మాజీ స్పీకర్ కోడెలపై కేసు నమోదు
సాక్షి, గుంటూరు: అసెంబ్లీ ఫర్నిచర్ను తన కార్యాలయాలు, ఇల్లు, కుమారుడి షోరూమ్లో ఉంచి వినియోగించుకుంటున్న మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై తుళ్లూరు పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. అసెంబ్లీ సెక్షన్ ఆఫీసర్ ఈశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోడెలపై ఐపీసీ 409 సెక్షన్ కింద, తనది కాని ప్రభుత్వ ఆస్తిని షోరూంలో ఉంచుకుని వినియోగిస్తున్న కోడెల శివరామ్పై ఐపీసీ 414 సెక్షన్ కింద కేసు నమోదైంది. అసెంబ్లీ ఫర్నిచర్ను కోడెల తన ఇంటికి మళ్లించిన వ్యవహారం బట్టబయలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో భద్రత లేక తన క్యాంపు కార్యాలయాల్లో ఆ ఫర్నిచర్ను భద్రపరిచానని కోడెల చెప్పడం, అది ఆయన కుమారుడు శివరామ్కు చెందిన షోరూంలో కూడా వినియోగిస్తున్న తరుణంలో శుక్రవారం అసెంబ్లీ అధికారులు తనిఖీలు చేపట్టారు. గుంటూరులోని గౌతమ్ హీరో షోరూమ్లో రూ.కోట్ల అసెంబ్లీ ఫర్నిచర్ ఉందని తనిఖీల్లో గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా అసెంబ్లీ ఫర్నిచర్ను ఉంచి, వినియోగిస్తున్న కోడెల, శివరామ్లపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. -
కోడెల తనయుడి షోరూంలో అసెంబ్లీ ఫర్నిచర్
సాక్షి, గుంటూరు: మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు స్వాధీనంలో ఉన్న అసెంబ్లీ ఫర్నిచర్ను అతని తనయుడికి చెందిన షోరూమ్లో గుర్తించారు. అసెంబ్లీ అసిస్టెంట్ సెక్రటరీ కె.రాజ్కుమార్, తహసీల్దార్ తాతా మోహన్రావు తదితరులు శుక్రవారం గుంటూరులోని గౌతమ్ హీరో షోరూమ్లో తనిఖీలు నిర్వహించారు. మొదటి అంతస్తులో 10 బర్మా టేకు కుర్చీలను, రెండు, మూడో అంతస్తుల్లో యూరప్ నుంచి దిగుమతి చేసుకున్న 22 కుర్చీలు, నాలుగు సోఫాలు, డైనింగ్ టేబుల్, టీపాయ్, దర్బార్ కుర్చీ, కంప్యూటర్లు, ఏసీలు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను గుర్తించారు. 22 యూరప్ కుర్చీలు, డైనింగ్ టేబుల్ విలువ రూ.65 లక్షలు పైమాటేనని తెలుస్తోంది. అసెంబ్లీ అధికారుల బృందం వస్తున్నట్టు తెలియడంతో కోడెల తనయుడు శివరామ్ రవాణా శాఖ అధికారుల అధీనంలో ఉన్న తన షోరూమ్ తాళాలను తీసుకోలేదు. షోరూమ్ తాళాలను అప్పగించేందుకు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఉదయం నుంచీ ఫోన్ చేస్తున్నా మేనేజర్ అందుబాటులోకి రాలేదు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో మేనేజర్ తాళాలు తీసుకుని షోరూమ్ తెరిచారు. పైఅంతస్తుల్లోకి అధికారులు తనిఖీకి వెళ్లే సమయంలో కోడెల తన లాయర్ను పంపి అడ్డుకున్నారు. సెర్చ్ వారెంట్ లేకుండా తనిఖీ చేయడానికి వచ్చారంటూ సుమారు గంటపాటు కోడెల తరఫు న్యాయవాది టి.చిరంజీవి అధికారుల్ని అడ్డుకుని వాదనకు దిగారు. ఎట్టకేలకు పైఅంతస్తుల్లో తనిఖీ చేసిన అధికారులు పాత అసెంబ్లీ ఫర్నిచర్ మొత్తం అక్కడ ఉందని చెప్పారు. ఇదిలావుంటే.. సత్తెనపల్లిలోని కోడెల కార్యాలయంలో రెండు కంప్యూటర్లను దొంగలు ఎత్తుకెళ్లారని పుకారు పుట్టించారు. నిన్న మొన్నటి వరకు కోడెల కార్యాలయంలో పనిచేసిన మున్సిపల్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఆకురాతి మల్లికార్జునరావు (అర్జునుడు) వాటిని దొంగిలించాడని కట్టుకథ అల్లారు. చోరీ జరిగినట్లు సత్తెనపల్లి పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. శుక్రవారం ఉదయం కోడెల కార్యాలయం వెనుక ఎవరో ఓ కంప్యూటర్ పడేశారని అదే వ్యక్తి పట్టుకొచ్చాడు. చోరీకి గురైనట్టు చెబుతున్న కంప్యూటర్ల లో కోడెల కే–ట్యాక్స్ వ్యవహారాలు, ఇతర బాగోతాలకు సంబంధించిన డేటా ఉందనే ప్రచారం సాగుతోంది. 30 ల్యాప్టాప్లు పట్టుకెళ్లారు! ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తనయుడు కోడెల శివరామ్ ఆదేశాల మేరకు కొందరు వ్యక్తులు 30 ల్యాప్టాప్లు, ప్రింటర్ తీసుకెళ్లారని నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి షేక్ బాజీబాబు సత్తెనపల్లి పట్టణ పోలీస్స్టేషన్లో శుక్రవారం ఫిర్యాదుచేశారు. గ్రామీణ ప్రాంత యువతలో నైపుణ్యాలు అభివృద్ధి చేసేందుకు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 2017లో సత్తెనపల్లిలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ మేరకు అప్పటి నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి అజేష్చౌదరి ఆదేశాల మేరకు 30 ల్యాప్టాప్లు, ఒక ప్రింటర్(ఇన్ఫ్రాస్ట్రక్చర్)ను సత్తెనపల్లి తీసుకొచ్చి ఎన్ఎస్పీ బంగ్లాలో భద్రపరిచారు. పర్యవేక్షణ బాధ్యతలను ఎన్ఎస్పీ ఏఈగా ఉన్న ఏసమ్మకు అప్పగించారు. 2018లో కోడెల శివరామ్.. ల్యాప్టాప్లను, ప్రింటర్ను తమ వారికి అందించాలని అజేష్చౌదరికి సూచించగా, ఆయన ఆదేశాలతో శివరామ్ అనుచరులకు ఏసమ్మ అప్పగించినట్టు బాజీబాబు చెప్పారు. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కోడెల కుమారుడు శివరామ్ అధికార బలంతో కాజేశారనే ఆరోపణలపై స్థానిక ఎమ్మెల్యే అంబటి రాంబాబు నైపుణ్యాభివృద్ధి సంస్థ ఉన్నతాధికారులకు ఇటీవల ఫిర్యాదు చేశారు. సంస్థ ఎండీ ఐఆర్టీఎస్ అధికారి ఆర్జా శ్రీకాంత్ ఆదేశాల మేరకు బాజీబాబు 16న సత్తెనపల్లి వచ్చి విచారణ చేసి నివేదికను ఉన్నతాధికారులకు అందించారు. వారి ఆదేశాల మేరకు బాజీబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోడెలకు అస్వస్థత టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు శుక్రవారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. ఆయనను గుంటూరు నగరం మూడు వంతెనల రోడ్డులోని శనక్కాయల ఫ్యాక్టరీ పక్కన ఉన్న కోడెల కుమార్తె విజయలక్ష్మీకి చెందిన శ్రీలక్ష్మీ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. -
కోడెల పాపం.. నీడలా
సుబ్బన్న: ఏంది రామన్నా ఈ విడ్డూరం.. కుర్చీలు, సోఫాలు ఎత్తుకురావడమేందన్నా.. ఇదంతా నిజమేనంటావా.. రామన్న: నువ్వు మాట్లాడేది మన నాయకుడు కోడెల శివప్రసాద్ గురించేనా ? సుబ్బన్న: అవును రామన్నా.. ఆయన గురించే.. రెండు, మూడు రోజులుగా ఒకటే వార్తలు ఏవో సామాను ఎత్తుకొచ్చాడంట. రామన్న: అవునురా.. నిజమే.. అసెంబ్లీలో ఉండాల్సిన ఫర్నిచర్ సామగ్రి ఇంటికేసుకొచ్చాడు.. ఆయనే స్వయంగా ఒప్పుకున్నాడు కూడా.. సుబ్బన్న: ఆ సామానోదే ఇక్కడ మన ఊళ్లో కూడా దొరుకుతాయి కదా.. ఇదేం పాడు బుద్ధన్నా. రామన్న: ఏం చెప్పమంటావురా.. ఆయన మన నాయకుడు అని చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది.. ఐదేళ్లు స్పీకర్గా వెలగబెట్టినప్పుడు ఆయన కొడుకు, కూతురు అడ్డగోలు అక్రమాలు, అవినీతి, వసూళ్లు, దందాలు ఇలా ఒకటేమిటి అన్ని రకాల దుర్మార్గాలకు పాల్పడ్డారు. వాళ్లను తండ్రిగా మందలించాల్సిందిపోయి అధికారంతో కోడెల కొమ్ముకాశారు. చివరకు ఆయన ధనదాహంతో స్పీకర్ పదవికే మచ్చ తెచ్చారు. సుబ్బన్న: అవునన్నో.. వాళ్ల అక్రమాలు కేసుల రూపంలో గుట్టలు పగులుతున్నాయి. ఇన్నాళ్లకు ఆ కుటుంబం పాపం పండింది. ఇక కోడెల ఇంటి ఛాయలికి కూడా వెళ్లేది లేదన్నా.. ఏమంటావ్.. రామన్న: నువ్వు ఇప్పుడంటున్నావ్.. మనోళ్లంతా ఆయనకు గుడ్ బై చెప్పి చాలా రోజులైంది. కేట్యాక్స్ బాధితుల కన్నీళ్లే వాళ్లకు శాపంగా మారాయి. చివరికి వాళ్ల పాపాలే నీడలా వెంటాడుతున్నాయి. సాక్షి, గుంటూరు : అధికారం అడ్డంపెట్టుకొని కోడెల కుటుంబం చేసిన పాపాల పుట్ట పగులుతోంది. ప్రభుత్వం మారిన నెలల వ్యవధిలోనే రోజుకొక అవినీతి బాగోతం బయటపడుతోంది. పాము తన పిల్లల్ని తానే తిన్నట్లుగా కోడెల కుటుంబం కూడా వారిని నమ్ముకున్నోళ్లను సైతం దోచుకున్నారు. అధికార బలంతో బలవంతపు వసూళ్లకు పాల్పడ్డాడు. గత ఐదేళ్లలో సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో కోడెల చేష్టలతో విసిగి వేసారిన ప్రజలు చీదరించుకుంటున్నారు. ఇప్పటికే కే–ట్యాక్స్ వసూలు చేసిన కోడెల కుమారుడు శివరామ్, కుమార్తె విజయలక్ష్మి ఊరు విడిచి పరారయ్యారు. కోడెల శివప్రసాద్ మాత్రం పక్కనుండే నేతలు సైతం దూరమవడంతో ఏకాకిగా మారారు. సీనియర్ రాజకీయ నేత అయిన కోడెల శివప్రసాదరావు రాష్ట్రంలో అనేక పదవులు చేపట్టారు. తొలి నుంచి అధికారం అండతో దౌర్జన్యాలకు పాల్పడుతూ వచ్చారు. గత ఐదేళ్లలో ఇవి శృతి మించాయి. స్పీకర్ పదవిలో ఉంటున్నప్పటికీ అక్రమాలకు పాల్పడుతూ ఆ పదవికే కళంకం తెచ్చారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొన్న కుమారుడు కోడెల శివరామ్, కుమార్తె పూనాటి విజయలక్ష్మి సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో ఏ ఒక్క వర్గాన్నీ వదలకుండా అందినకాడికి దోచుకున్నారు. కోడెల కుటుంబం దోపిడీకి బలైన వారిలో అధిక శాతం టీడీపీ వారే కావడం గమనార్హం. ప్రభుత్వం మారిన తర్వాత కే ట్యాక్స్ బాధితులంతా పోలీస్స్టేషన్ మెట్లు ఎక్కారు. ఉద్యోగాల పేరిట మోసాలు, భూకబ్జాలు, ల్యాండ్ కన్వర్షన్ అనుమతుల విషయంలో బలవంతపు వసూళ్లన్నీ బహిర్గతమయ్యాయి. రెండు నియోజకవర్గాల్లో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుతోసహా అతని కుమారుడు, కుమార్తె వారి అనుచరులపై 19 కేసుల వరకు నమోదయ్యాయి. దీంతో శివరామ్, విజయలక్ష్మిలు వారి అనుచరులతో అజ్ఞాతంలోకి వెళ్లి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. కేసుల్లో ఉన్న తీవ్రత దృష్ట్యా కోర్టు సైతం నిందితులకు బెయిల్ నిరాకరించింది. కే ట్యాక్స్ కేసుల వ్యవహారం మరువక ముందే కోడెల శివరామ్ తన ద్విచక్రవాహన గౌతం షోరూంలో వాహనాల విక్రయాలకు సంబంధించి ప్రభుత్వానికి చెల్లించాల్సిన కోట్లాది రూపాయల పన్నును ఎగ్గొట్టిన విషయం వెలుగులోకి వచ్చింది. దీంతోపాటు సచివాలయం మార్పు సమయంలో మాజీ స్పీకర్ కోడెల విలువైన సామగ్రిని అక్రమంగా తరలించుకు వెళ్లినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఛీకొడుతున్న ప్రజానీకం.. ఒకప్పుడు కోడెలను ఆధిరించిన ప్రజలే ప్రస్తుతం ఛీకొడుతున్నారు. సేవ్ సత్తెనపల్లి, క్విట్ కోడెల అంటూ సత్తెనపల్లి తెలుగుదేశం పార్టీ ప్రజానీకం సాక్షాత్తు చంద్రబాబు ఎదుట ఆందోళన చేపట్టారు. దీంతో సత్తెనపల్లిలో మొఖం చాటేసిన కోడెల గత కొన్ని రోజులుగా నరసరావుపేటకు వచ్చి పోతున్నారు. కే ట్యాక్స్ బాధితులు ఆగ్రహంగా ఉండటంతో కోడెల రాకపోకలను వారి అనుచరులు గోప్యంగా ఉంచారు. ఈ నేపథ్యంలో గతంలో తన ఎన్సీవీ కేబుల్ను శివరామ్ దౌర్జన్యంగా ఆక్రమించి కే ఛానల్గా మార్చుకున్న వైనంపై ఆ కేబుల్ ఎండీ లాం కోటేశ్వరరావు సోమవారం మాజీ స్పీకర్ కోడెల ఇంటి ఎదుట ఆందోళన చేపట్టారు. ఆ సమయంలో ఇంట్లోనే ఉన్న కోడెల బయటకు వచ్చేందుకు సాహసించలేదు. తన అనుచరులకు ఫోన్ చేసి పిలిచినా ఎవ్వరూ ముందుకు రాలేదు. దీంతో పార్టీ నాయకులను, పోలీస్ అధికారులను ప్రాధేయపడినట్లు సమాచారం. ఒక్కరూ తోడు లేరు కోడెల కుటుంబం చేసిన (కేట్యాక్స్) బలవంతపు వసూళ్లు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతిపై ఉక్కుపాదం మోపుతుండటంతో ధైర్యంగా ముందుకొస్తున్నారు. అయితే ఇదంతా తన కుటుంబంపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే చేస్తున్నారని కోడెల రాజకీయంగా సానుభూతి పొందేందుకు హై కమాండ్ వద్ద ప్రయత్నం చేసి భంగపడ్డారు. కోడెల కుటుంబంపై నమోదవుతున్న కేసుల వ్యవహారంలో ఖండన ఇచ్చేందుకు చంద్రబాబు సైతం వెనకాడారు. ఇక జిల్లా టీడీపీ నాయకులైతే ఈ విషయంలో నోరు తెరవడానికి భయపడుతున్నారు. దీంతో ఒకప్పుడు రాజకీయంగా గిట్టని వారిని కూడా కలిసి తనకు సహకరించాల్సిందిగా కోడెల ప్రాధేయపడుతున్నట్లు సమాచారం. కేసుల విషయంలో తెలుగుదేశం అధిష్టానం స్పందించకపోవటంతో చివరకు బీజేపీలోకి చేరేందుకు కోడెల ప్రయత్నాలు చేసి భంగపాటుకు గురైనట్లు సమాచారం. తాజాగా కోడెల బాధితుడు లాం కోటేశ్వరరావు తనకు జరిగిన నష్టంపై చేసిన ఆందోళనను సైతం ఎమ్మెల్యే గోపిరెడ్డిపై నెపం నెట్టి రాజకీయంగా లబ్ధి పొందేందుకు కోడెల ప్రయత్నించారు. దీనిని సొంత పార్టీ నేతలే వ్యతిరేకించారు. చివరికి కోడెల ఏకాకిగా మారారు. -
కోడెల తనయుడు శివరామకృష్ణకు బిగుస్తున్న ఉచ్చు!
సాక్షి, గుంటూరు: టీఆర్ లేకుండా సుమారు 800 బైక్లు విక్రయించిన వ్యవహారంలో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమారుడు కోడెల శివరామకృష్ణకు ఉచ్చు బిగుస్తోంది. రవాణా శాఖ అధికారులు విచారణ వేగవంతం చేశారు. టీఆర్ లేకుండా బైక్లు విక్రయించిన 138 మంది వాహనదారుల నుంచి స్టేట్మెంట్లు తీసుకున్నారు. గుంటూరు నగరంలోని చుట్టుగుంట సెంటర్లో కోడెల శివరామ్కు చెందిన గౌతమ్ హీరో షోరూమ్లో బైక్ల విక్రయాల్లో భారీ కుంభకోణం జరిగిన విషయం తెలిసిందే. టీఆర్ (తాత్కాలిక రిజిస్ట్రేషన్) లేకుండా 800 బైక్లను కోడెల శివరామ్ విక్రయించాడు. ఈ వ్యవహారంలో ఇటీవల గౌతమ్ షోరూమ్ను రవాణా శాఖ అధికారులు సీజ్ చేశారు. టీఆర్, లైఫ్ ట్యాక్స్ల పేరుతో వినియోగదారుల నుంచి ఒక్కో బైక్కు రూ.8–10 వేల వరకూ కోడెల శివరామ్ వసూలు చేశాడు. ఈ మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లించకుండా మోసం చేశాడు. రూ.కోటి మేర ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టాడు. వాహనదారుల నుంచి స్టేట్మెంట్లు.. గౌతమ్ షోరూమ్ నుంచి టీఆర్ లేకుండా డెలివరీ చేసిన బైక్ల వివరాలను ఇన్వాయిస్లోని చిరునామాల ఆధారంగా గుర్తించారు. రవాణా శాఖ అధికారులు స్వయంగా బైక్లు కొనుగోలు చేసిన ఇళ్లకు వెళ్లి స్టేట్మెంట్లు రికార్డు చేస్తున్నారు. ఇప్పటి వరకూ 138 మంది నుంచి స్టేట్మెంట్లు రికార్డు చేశారు. ఇప్పటి వరకూ రవాణా శాఖ అధికారులకు స్టేట్మెంట్లు ఇచ్చిన వినియోగదారులందరూ బైక్ కొనుగోలు సమయంలో తమకు టీఆర్ ఇవ్వలేదని, లైఫ్ ట్యాక్స్, టీఆర్ ఫీజుల పేరుతో రూ. 8–10 వేల వరకూ వసూలు చేశారని చెప్పినట్టు తెలుస్తోంది. వినియోగదారుల నుంచి స్టేట్మెంట్ సేకరించిన అధికారులు స్టేట్మెంట్లను రవాణా శాఖ కమిషనర్కు నివేధించారు. విచారణ రెండు రోజుల్లో కొలిక్కి రానుంది. విచారణ అనంతరం శివరామ్పై క్రిమినల్ కేసులు నమోదుచేస్తారు. బైక్లు స్వాధీనం చేసుకున్న ఫైనాన్స్ కంపెనీలు.. టీఆర్ లేకుండా గౌతమ్ షోరూమ్ యాజమాన్యం 800 బైక్లు విక్రయించింది. వీటిలో చాలా వరకూ బైక్లను వినియోగదారులు ఫైనాన్స్ రూపంలో కొనుగోలు చేశారు. టీఆర్ జనరేట్ కాకపోవడంతో వినియోగదారులు కిస్తీ (ఇన్స్టాల్మెంట్స్) చెల్లించలేదు. దీంతో ఫైనాన్స్ కంపెనీలు బైక్లను స్వాధీనం చేసుకున్నాయి. టీఆర్ జనరేట్ కాకపోవడంతో ఆ బైక్లు రిజిస్ట్రేషన్ అవ్వక వేరొకరికి బైక్లు విక్రయించడానికి వీల్లేక ఫైనాన్స్ కంపెనీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. రికవరీ చేసిన బైక్లన్నింటినీ ఫైనాన్స్ కంపెనీలు తమ గోడౌన్స్లో ఉంచుకున్నాయి. టీఆర్ లేని వాహనాలను నడపడం నేరం తాత్కాలిక రిజిస్ట్రేషన్(టీఆర్) లేని వాహనాలను నడపడం నేరం. రవాణా శాఖ అధికారులు తనిఖీల్లో టీఆర్ లేనట్టు గుర్తిస్తే ఎంవీఐ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేసి భారీ అపరాద రుసుం విధించి వాహనం సీజ్ చేస్తారు. అదే విధంగా టీఆర్ లేని వాహనం ఢీ కొని ఎవరైన గాయాలపాలైన, మృతి చెందిన వాహనదారునిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తారు. దురదృష్టవశాత్తు వాహనదారుడు మృతి చెందితే ఇన్సూరెన్స్ వంటి ఇతర స్కీమ్లు వర్తించవు. గౌతమ్ షోరూమ్ నుంచి టీఆర్ లేకుండా బైక్లు విక్రయించినవారు బైక్లను రోడ్డుపై తిప్పడానికి వీల్లేదు. – మీరా ప్రసాద్, డీటీసీ గుంటూరు -
కోడెల తనయుడి బైక్ షోరూమ్ సీజ్
సాక్షి, గుంటూరు, అమరావతి/నరసరావుపేట, నగరంపాలెం (గుంటూరు): అధికారం ఉన్నప్పుడు ‘కేట్యాక్స్’ వసూలు చేయడంలోనే కాదు ప్రభుత్వానికి చెల్లించాల్సిన ట్యాక్స్ను ఎగ్గొట్టడంలోనూ కోడెల కుటుంబానిది అందె వేసిన చెయ్యి. పారదర్శకత కోసం రవాణా శాఖలో ప్రవేశపెట్టిన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ను అడ్డుగా పెట్టుకుని శివరామ్ భారీ స్కామ్కు పాల్పడిన విషయం వెలుగులోకి వచ్చింది. తాను నిర్వహిస్తున్న గౌతమ్ హీరో బైక్ షోరూమ్లో నిబంధనలకు విరుద్ధంగా వాహన విక్రయాలు నిర్వహించి, ప్రభుత్వానికి వెళ్లాల్సిన రూ.కోటి వరకూ స్వాహా చేశాడు. దీంతో ఆ షోరూమ్లను సీజ్ చేశారు. గౌతమ్ హీరో షోరూమ్లో గత ఆరు నెలల్లో 800 బైక్లకు టీఆర్ లేకుండానే విక్రయించినట్టు తెలుస్తోంది. దీని ద్వారా కోడెల శివరామ్ ప్రభుత్వ ఆదాయానికి రూ.కోటి వరకూ గండి కొట్టారని ప్రాథమిక విచారణలో తేలింది. నిబంధనల ప్రకారం నూతన వాహనాన్ని కొనుగోలు చేసినప్పుడు రిజిస్ట్రేషన్ చార్జి కింద ప్రభుత్వానికి రూ.1000–1300 వరకూ చెల్లించాలి. లైఫ్ ట్యాక్స్ కింద బైక్ ధరపై 9–14శాతం కట్టాలి. గౌతమ్ షోరూమ్ నుంచి విక్రయించిన బైక్లన్నీ రూ.60 వేల నుంచి రూ.2 లక్షల మధ్య ఉన్నాయి. ఈ లెక్కన ఒక్కో బైకుకు రూ.6వేల నుంచి రూ.20 వేల వరకు చెల్లించాల్సి ఉండగా కోడెల శివరామ్ ప్రభుత్వానికి చెల్లించకుండా స్వాహా చేశారు. అక్రమాలు తేలడంతో గుంటూరులోని గౌతమ్ షోరూమ్తో పాటు, నరసరావుపేటలో హీరో కంపెనీ ద్విచక్రవాహనాలకు ఆధరైజ్డ్ డీలర్గా వ్యవహరిస్తున్న యర్రంశెట్టి మోటార్ షోరూమ్, సర్వీసు సెంటర్లను రవాణా వాహనాల అధికారులు శనివారం సీజ్ చేశారు. కోడెల కుటుంబానికి సన్నిహితులైన యర్రంశెట్టి రాము, బాబ్జీ సోదరులు దీన్ని నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీలలో 300 వాహనాలకు లెక్కతేలలేదని ఎం.వి.ఐ. అనిల్కుమార్ తెలిపారు. పన్నులు చెల్లించని డీలర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని రవాణా శాఖ కమిషనర్ పి.సీతారామాంజనేయులు ఎస్పీకి సూచించారు. వాహనాల రిజిస్ట్రేషన్లో అవకతవకలపై విచారణ గౌతమ్ హీరో షోరూంలో అవకతవకలు జరుగుతున్నాయని వచ్చిన ఫిర్యాదుపై విచారణ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ జాయింట్ కమిషనర్ ప్రసాదరావు తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రవాణాశాఖకు లైఫ్ టాక్స్లు చెల్లించకుండా, తాత్కాలిక రిజిస్ట్రేషన్ చేయకుండా వాహనాలు విక్రయించినట్లు తేలిందన్నారు. దీంతో శనివారం గౌతమ్ హీరో, యర్రంశెట్టి హీరో షోరూంలను సీజ్ చేశామన్నారు. – జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ప్రసాదరావు -
కోడెల శివప్రసాదరావుకు అధికారులు షాక్
సాక్షి, గుంటూరు : టీడీపీ సీనియర్ నేత, శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు షాక్లు మీద షాక్లు తగులుతున్నాయి. ఓ వైపు కే ట్యాక్స్ వసూళ్లపై కేసులు, మరోవైపు సొంత పార్టీ నుంచే అసమ్మతి ఎగసిపడుతోంది. తాజాగా కోడెలకు అధికారులు ఝలక్ ఇచ్చారు. ఆయన కుమారుడు శివరామ్కు చెందిన గౌతమ్ హోండా షోరూమ్ను సీజ్ చేశారు. పన్నులు చెల్లించకుండా నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు విక్రయించినట్లు అధికారులు గుర్తించారు. అయిదేళ్లుగా ఈ దందా కొనసాగుతున్నట్లు అధికారుల తనిఖీల్లో బయటపడింది. ఇక కోడెల బినామీ యర్రంశెట్టి మోటార్స్లో కూడా టాక్సులు చెల్లించకుండా 400 వాహనాలు విక్రయించినట్లు సమాచారం. దీంతో నరసరావుపేట, గుంటూరులోని రెండు షోరూమ్లను అధికారులు సీజ్ చేశారు. -
తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు అరెస్ట్
సాక్షి, గుంటూరు : పోలీసుల కళ్లుగప్పి పరారై తిరుగుతున్న అంతర్ రాష్ట్ర క్రికెట్ బుకీ, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు, క్రికెట్ బూకీ శాకమూరి మారుతీ చౌదరిని నరసరావుపేట పోలీసులు నిన్న (శుక్రవారం) అదుపులోకి తీసుకున్నారు. అతడిని రహస్య ప్రాంతంలో విచారణ చేస్తున్నారు. బెట్టింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉండి అజ్ఞాతంలో ఉన్న మారుతి తిరిగి క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తూ పట్టుబడినట్లు తెలిపింది. గత టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అధికారాన్ని అడ్డుపెట్టుకుని శాకమూరి మారుతి క్రికెట్ బెట్టింగ్లు నిర్వహించేవాడు. కోడెల శివరామ్ అండదండలతో యథేచ్ఛగా తన అనుచరులతో బెట్టింగ్ నిర్వహింపచేయడం, సమయానికి డబ్బులు ఇవ్వని వారిపై గూండాలతో దాడులు చేయటం వంటి చర్యలకు పాల్పడేవాడు. మాజీ స్పీకర్ కోడెల అండ పుష్కలంగా ఉండటంతో స్థానిక పోలీసులు చూసీచూడనట్లుగా వ్యవహరించేవారు. రెండేళ్ల క్రితం రూరల్ ఎస్పీగా పనిచేసిన వెంకటప్పలనాయుడు మారుతి, అతని అనుచరులను అరెస్ట్ కేసు నమోదు చేశారు. విచారణలో మారుతికి అంతర్జాతీయ బుకీలతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు తేల్చారు. అయినప్పటికీ పద్ధతి మార్చుకోకుండా క్రికెట్ బెట్టింగ్లు నిర్వహిస్తూ తన అక్రమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. అతడి వద్ద పందేలు ఆడి నష్టపోయిన బాధితులు గత నెలరోజుల క్రితం రూరల్ ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అక్కడ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు టూటౌన్ పోలీసులు వలపన్ని బీసీ కాలనీలో ఓ గృహంలో బెట్టింగ్లు నిర్వహిస్తుండగా దాడులు చేశారు. అయితే పోలీసుల రాకను ముందే పసిగట్టిన మారుతి పరారీ అవగా, అతని అనుచరులు ఖాజా, నాగూర్లను అరెస్ట్ చేశారు. -
అయోమయ స్థితిలో కోడెల కుటుంబం
సాక్షి, గుంటూరు: నాడు కప్పం కట్టాల్సిందే అని గద్దించిన నోర్లు నేడు మూగబోయాయి.. ఓ వైపు అంతటా చుక్కెదురు.. మరోవైపు సొంతపార్టీలో, ఉన్న ఊర్లో అంతటా విముఖత.. వెరసి శాసన సభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబం పరిస్థితి అయోమయంగా మారింది. ఐదేళ్లలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్రావు కుమారుడు శివరామ్, కుమార్తె పూనాటి విజయలక్ష్మి సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో కే–ట్యాక్స్ పేరుతో తోపుడు బండిపై వ్యాపారం చేసుకునే వ్యక్తి నుంచి బడా కాంట్రాక్టర్ వరకూ ప్రతి ఒక్కరి నుంచి పన్నులు వసూలు చేశారనే ఆరోపణలున్నాయి. వారి వసూళ్ల గురించి నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో వరుసగా కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకూ కోడెల శివప్రసాద్రావుపై రెండు, శివరామ్పై 9, విజయలక్ష్మిపై 7 కేసులు నమోదయ్యాయి. తనపై నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని విజయలక్ష్మి హైకోర్టును ఆశ్రయించగా చుక్కెదురైంది. కోడెల శివరామ్ బెయిల్ పిటిషన్ హైకోర్టు ముందు ఉంది. తమ నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్న వారందరూ వరుసగా పోలీస్లను ఆశ్రయిస్తుండటం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, చీటింగ్ కేసులు నమోదవుతుండటంతో కోడెల కుటుంబానికి అరెస్ట్ల భయం పట్టుకుంది. కోర్టులు సైతం ముందస్తు బెయిల్ మంజూరుకు నిరాకరిస్తుండటంతో వారు రాజీకి సిద్ధమవుతున్నారు. తీసుకున్న డబ్బు తిరిగి ఇస్తాం రాజీకి రావాలంటూ రాయబారాలు పంపుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే సత్తెనపల్లి నియోజకవర్గంలో నమోదైన ఓ కేసులో బాధితునికి రూ.35లక్షల మేర డబ్బు వెనక్కు ఇచ్చి రాజీ ప్రయత్నాలు చేశారు. అయితే ఆ ప్రయత్నాలు ఫలించలేదని సమాచారం. ఇదే తరహాలో తక్కిన బాధితుల వద్దకు రాయబారులను పంపి రాజీకి రావాలని, కావాలంటే నష్టపోయిన దానికి రెట్టింపు మొత్తాన్ని చెల్లిస్తామని కూడా బతిమాలుతున్నారని తెలుస్తోంది. కాగా ఇప్పటి వరకూ కోడెల కుటుంబంపై ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ, చీటింగ్ సహా 18 కేసులు నమోదయ్యాయి. ఆయా కేసుల్లో నిందితులుగా ఉన్న కోడెల, ఆయన కుమారుడు, కుమార్తె, అనుచరులను అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. -
టీడీపీ నేతలు ‘గడ్డి’ని కూడా వదల్లేదు..
సాక్షి, అమరావతి: పశువుల మందుల సరఫరాలో అక్రమాలపై పశు సంవర్థకశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ విచారణకు ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి మోపిదేవి మాట్లాడుతూ... ’టీడీపీ నేతలు దేనిని వదలకుండా అవినీతికి పాల్పడ్డారు. పశువులకు సరఫరా చేసే గడ్డిని కూడా వదలకుండా దోచుకున్నారు. టీడీపీ నేతలు, ఎమ్మెల్యేలు పశువుల మందులు, గడ్డిలోనూ అవినీతికి పాల్పడటం సిగ్గుచేటు మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కుమార్తె విజయలక్ష్మి, కుమారుడు శివరామ్ కంపెనీల పేరుతో అవినీతికి పాల్పడ్డారు. అయిదు కంపెనీల కోసం అక్రమంగా టెండర్ల నిబంధనలు మార్చేసి అవినీతికి పాల్పడ్డారు. రూ.4.5కోట్ల వరకూ వాళ్లకి చెల్లించాల్సిన బిల్లులను నిలిపివేయాలని ఆదేశించాను. అయిదేళ్లలో జరిగిన అవినీతిని వెలికి తీస్తాం. ఇప్పుడు పూర్తి పారదర్శకంగా టెండర్లు పిలుస్తాం.’ అని తెలిపారు. -
కోడెల కుమారుడిపై అట్రాసిటీ కేసు
నరసరావుపేట టౌన్ : ఏపీ శాసనసభ మాజీ స్పీకర్ కోడెల కుమారుడి అవినీతి బాగోతం మరొకటి వెలుగు చూసింది. నరసరావుపేట పట్టణానికి చెందిన ఎమ్మార్పీఎస్ నేత కాల్వ రవి తన బంధువు ఎం.నాగరాజుకు ఉద్యోగం ఇప్పించే విషయంలో కోడెల తనయుడు శివరామ్ను కలిశారు. నాగరాజుకు జిల్లా పరిషత్లో అటెండర్గా ఉద్యోగం ఇప్పిస్తానని శివరామ్, అతని పీఏ నాగప్రసాద్ నమ్మబలికి రూ.7 లక్షలు తీసుకున్నారు. నెలలు గడుస్తున్నా ఉద్యోగం ఇప్పించకపోవడంతో తీసుకున్న డబ్బులు తిరిగివ్వాలని వారిద్దరినీ కాల్వ రవి నిలదీశాడు. దీంతో కులం పేరుతో దూషించి దాడికి పాల్పడ్డారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శివరామ్, అతని పీఏ గుత్తా నాగప్రసాద్పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు నరసరావుపేట టూటౌన్ సీఐ ఐ.కృష్ణయ్య సోమవారం తెలిపారు. -
రూ.కోట్లు మింగిన కోడెల కుటుంబం
సాక్షి, అమరావతి: ఏదైనా ఒక వస్తువును ఉత్పత్తి చేయాలంటే దానికి తగిన యంత్రాలు అవసరమని ఏ చిన్నపిల్లాడిని అడిగినా చెబుతాడు. కానీ, ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమార్తె విజయలక్ష్మి, కుమారుడు శివరాం యంత్రాలే లేకుండా కంపెనీని సృష్టించారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రూ.కోట్ల విలువైన ఆర్డర్లు పొందారు. ఈ అవినీతి బాగోతం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆసుపత్రుల్లో చికిత్సలకు ఉపయోగించే కాటన్, బ్యాండేజీలను తయారు చేసే కంపెనీ స్థాపించామంటూ నకిలీ డాక్యుమెంట్లతో లైసెన్సులు పొందారు. ఇందుకు అధికార బలాన్ని వాడుకున్నారు. తమిళనాడు నుంచి తీసుకొచ్చిన నాసిరకం కాటన్, బ్యాండేజీని ప్రభుత్వానికి సరఫరా చేసి, ఖజానా నుంచి భారీగా నిధులు మింగేశారు. స్మాల్ స్కేల్ యూనిట్ల(ఎస్ఎస్ఐ) పేరుతో రాష్ట్ర మౌలిక వైద్య సదుపాయాల సంస్థకు (ఏపీఎంఎస్ఐడీసీ) దరఖాస్తు చేసి, అధికార బలంతో ఆర్డర్లు తెచ్చుకున్నారు. రాష్ట్రంలో చిన్న పరిశ్రమలు నడుపుకుంటూ నాణ్యమైన కాటన్, బ్యాండేజీలు తయారు చేసే వారి నోట్లో మట్టి కొట్టారు. ‘సేఫ్’ యాజమాన్యానికి నోటీసులు ఔషధ నియంత్రణ అధికారులు రెండు రోజుల క్రితం కోడెల శివప్రసాదరావు కుటుంబానికి చెందిన ‘సేఫ్’ కంపెనీలో తనిఖీలు నిర్వహించారు. అక్కడ ఒక భవనం ఉంది గానీ అందులో ఎలాంటి యంత్రాలు లేవని నిర్ధారించారు. ఇదే అంశంపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. కోడెల కంపెనీ ఏం చేసిందంటే.. తమిళనాడులోని చెన్నై, కోయంబత్తూరు నుంచి నాసిరకం కాటన్, బ్యాండేజీలను తీసుకొచ్చింది. వాటిని తామే తయారు చేశామంటూ ‘సేఫ్’ కంపెనీ పేరిట లేబుళ్లు వేసి, ప్రభుత్వానికి అంటగట్టింది. తమకు కంపెనీ ఉన్నట్లు కోడెల కుటుంబం డ్రగ్ లైసెన్స్ కూడా తీసుకుంది. లేని కంపెనీకి లైసెన్సు ఎలా ఇచ్చారో అప్పటి అధికారులే చెప్పాలి. ఔషధ నియంత్రణ అధికారులు ఇచ్చిన నివేదికతో ‘సేఫ్’ కంపెనీని స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ జాబితా నుంచి తొలగించినట్టు ఏపీఎంఎస్ఐడీసీ అధికారులు తెలిపారు. ఆ కంపెనీకి ఇకపై ఆర్డర్లు ఇవ్వబోమని తేల్చిచెప్పారు. ‘సేఫ్’ యాజమాన్యానికి ఇప్పటికే ఔషధ నియంత్రణ శాఖ నోటీసులు జారీ చేసినట్టు తెలిసింది. గడ్డిలోనూ దిగమింగారు ఆరోగ్య శాఖలోనే కాదు పశు సంవర్థక శాఖలోనూ కోడెల తన కంపెనీ పేరుతో భారీగా దాణా కుంభకోణానికి పాల్పడ్డారు. ఎండు గడ్డి సరఫరా చేస్తామంటూ పశు సంవర్ధక శాఖ నుంచి ఆర్డర్ దక్కించుకున్నారు. కానీ, సరఫరా చేయకుండానే రూ.కోట్లు కొల్లగొట్టారు. డైరెక్టర్ స్థాయి అధికారులతో కుమ్మక్కై, పశువుల దాణా తినేశారు. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో ఓ లారీ గడ్డి సరఫరా చేశామంటూ లారీ నెంబరు ఇచ్చారు. విచిత్రం ఏమిటంటే ఆ లారీకి తగిలించిన నెంబరు ఓ ద్విచక్ర వాహనానిదిగా ఆర్టీఏ అధికారులు గుర్తించారు. అంతేకాదు ఫలానా రైతులకు గడ్డి సరఫరా చేశామంటూ వారి ఆధార్ నెంబర్లను కోడెల కంపెనీ సమర్పించింది. వాస్తవానికి వారెవరూ గడ్డిని తీసుకోలేదు. ఆధార్ డేటా నుంచి కొన్ని నెంబర్లు సేకరించి, ప్రభుత్వానికి సమర్పించినట్లు సమాచారం. పశువులకు కోడెల కంపెనీ సరఫరా చేసిన మందులు కూడా నాసిరకమైనవే. ఆ మందుల నాణ్యతను నిర్ధారించకుండా ఔషధ నియంత్రణ అధికారులను బెదిరించారు. పశు సంవర్థక శాఖలో కొందరు అధికారులు కోడెలకు సహకరించి, రూ.కోట్లు వెనకేసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోడెల, అతని కుమారుడిపై టీడీపీ నేత కేసు నరసరావుపేట : మాజీ స్పీకర్ కోడెల, అతని కుమారుడు శివరామ్పై మరో కేసు నమోదైంది. తనను అపహరించటంతో పాటు బెదిరించి కాంట్రాక్ట్లో పర్సంటేజ్, అక్రమ వసూళ్లకు వీరిద్దరూ పాల్పడ్డారని టీడీపీ నాయకుడు, కాంట్రాక్టర్ వడ్లమూడి శివరామయ్య శనివారం గుంటూరు జిల్లా నరసరావుపేట స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రొంపిచర్ల మండలం వడ్లమూడివారిపాలెం గ్రామానికి చెందిన వడ్లమూడి శివరామయ్య కాంట్రాక్ట్ పనులు చేస్తుంటాడు. ఆర్డబ్ల్యూఎస్ చెరువు మరమ్మతులకు సంబంధించి 2016లో రూ.30 లక్షల కాంట్రాక్ట్ పనిని దక్కించుకున్నాడు. విషయం తెలుసుకున్న కోడెల శివరామ్ పిలిచి బెదిరించటంతో చేయాల్సిన పనిలో పది శాతం రూ.3 లక్షలు పర్సంటేజ్ (కే ట్యాక్స్) చెల్లించాడు. ఇది సరిపోలేదంటూ ఇంకా చెల్లించాలని కోడెల శివరామ్ నుంచి పిలుపు వచ్చింది. శివరామయ్య వెళ్లకపోవటంతో శివరామ్ అనుచరులు గుత్తా నాగప్రసాద్, బద్దుల రాములు బలవంతంగా కారులో గుంటూరు హీరో షోరూమ్కు తీసుకెళ్లారు. అక్కడ బెదిరించి తాను అనారోగ్యంతో కాంట్రాక్ట్ పనులు చేయట్లేదంటూ సంతకాలు పెట్టించారని బాధితుడు తెలిపాడు. కాంట్రాక్ట్ను 6 నెలలపాటు బ్లాక్లిస్టులో చేర్చి కాంట్రాక్ట్ను బద్దుల రాములు దక్కించుకున్నాడని, దీంతో రూ.3 లక్షల నష్టం జరిగిందని శివరామయ్య ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో పాటు మంచినీటి సరఫరా కాంట్రాక్ట్కు సంబంధించి మరో రూ.2 లక్షలు కోడెల శివరామ్ బెదిరించి తీసుకున్నాడని తెలిపారు. ఈ వ్యవహారంపై మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావును కలిసి చెప్పగా, నేనే అలా చేయమన్నానని కుమారుడికి వత్తాసు పలికాడన్నారు. తనకు న్యాయం చేయాలని పోలీసులను కోరారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ బిలాలుద్దీన్ తెలిపారు. -
కోడెల శివరామ్.. ఆంధ్రా నయీమ్
పట్నంబజారు (గుంటూరు): కోడెల శివరామ్ తన నుంచి ‘కే ట్యాక్స్’ వసూలు చేశాడంటూ మంగళవారం మరో బాధితుడు ఫిర్యాదు చేశారు. ఇది వరకే ఫిర్యాదు చేసిన ఇంకో బాధితుడు తన డబ్బు ఇప్పించాలంటూ గుంటూరులోని కోడెల శివరామ్కు చెందిన షోరూం ఎదుట ఆందోళనకు దిగాడు. తనకు చెల్లించాల్సిన రూ.11 లక్షలు ఇస్తే.. తప్ప తాను ఇక్కడ నుండి కదలబోనని.. డబ్బులు ఇవ్వకుంటే తనకు ఆత్మహత్యే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశాడు. కోడెల శివరామ్ను చూసినప్పుడల్లా ఆంధ్ర నయీమ్లాగే అనిపించేదని అతను వాపోయాడు. బాధితుడి కథనం మేరకు.. సత్తెనపల్లికి చెందిన యేల్లినేడి శ్రీనివాసరావు కాంట్రాక్ట్ పనులు చేయటంతో పాటు, భోజనాల క్యాటరింగ్ చేస్తుంటారు. 2017లో నరసరావుపేటలో జరిగిన ఖేలో ఇండియా కబడ్డీ పోటీలకు సంబంధించి 2 వేల మందికి భోజనాలు సరఫరా చేసేందుకు రూ.24 లక్షల కాంట్రాక్ట్ శ్రీనివాసరావు తీసుకున్నారు. దానికి సంబంధించి తొలుత ఖర్చుల నిమిత్తం రూ.5 లక్షలు ఇచ్చి, మిగతా మొత్తం కబడ్డీ పోటీలు ముగిశాక ఇస్తామని కోడెల శివరామ్ చెప్పారు. పనులు ముగిసిన తరువాత రూ.10 లక్షల చెక్కు వచ్చిందని, రూ.5 లక్షలు కట్టి తీసుకెళ్లాలని శివరామ్ హుకుం జారీ చేయటంతో చేసేది లేక రూ.5 లక్షలు చెల్లించారు. అనంతరం వచ్చిన రూ.5 లక్షల చెక్కులో రూ.3 లక్షలు, మరోసారి వచ్చిన రూ.4 లక్షల చెక్కులో రూ.2 లక్షలు తీసుకున్నారు. తనకు జరిగిన అన్యాయం శ్రీనివాసరావు తన ఆత్మీయులకు చెప్పుకున్నారు. దీంతో కోడెల శివరామ్ తన గురించి మాట్లాడతావా.. అంటూ రూ.లక్ష పెనాల్టీ వసూలు చేశాడు. దీనిపై బాధితుడు శ్రీనివాసరావు కొద్ది రోజుల క్రితం అర్బన్ ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణకు ఫిర్యాదు చేశారు. కోడెల శివరామ్ అనుచరులు, డబ్బులు జూలై 1వ తేదీ కల్లా ఇస్తామని, కేసు పెట్టవద్దని శ్రీనివాసరావుకు చెప్పారు. తర్వాత ఫోన్లు అన్ని స్విచ్చాఫ్ చేసుకోవటంతో శ్రీనివాసరావు ఆందోళన చేపట్టారు. నగరంపాలెం ఎస్హెచ్వో కె.వెంకటరెడ్డి, ఎస్ఐ పి.భాగ్యరాజులు శ్రీనివాసరావును స్టేషన్కు పిలిచి వివరాలు తెలుసుకున్నారు. డబ్బులు ఇప్పించకపోతే ఆత్మహత్యే శరణ్యం కోడెల శివరామ్ తన నుంచి వసూలు చేసిన డబ్బులు ఇప్పించకపోతే తనకు ఆత్మహత్యే శరణ్యమని గుంటూరు హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన యార్లగడ్డ వెంకటపద్మారావు నగరంపాలెం స్టేషన్లో మంగళవారం ఫిర్యాదు చేశాడు. వెంకటపద్మారావుకు 2015లో మద్యం షాపు రాగా మురళీకృష్ణ వైన్స్ పేరుతో నరసరావుపేటలో ప్రారంభించారు. అదే ఏడాది ఆగస్టు 2న కోడెల శివరామ్ ఆయనకు ఫోన్చేసి గుంటూరు చుట్టుగుంట వద్ద ఉన్న గౌతమ్ హీరో షోరూమ్కు రావాలని చెప్పారు. రూ.20 లక్షలు ఇవ్వాలని బెదిరించాడు. వెంకటపద్మారావు నాలుగు రోజుల వ్యవధిలో రూ.20 లక్షలు తీసుకెళ్ళి కోడెల శివరామ్కు ఇచ్చారు. తర్వాత 2017లో సత్తెనపల్లిలో కల్యాణి వైన్స్ పద్మారావుకు వచ్చింది. తిరిగి కోడెల శివరామ్ ఫోన్ చేసి మరో రూ.20 లక్షలు డిమాండ్ చేసి తీసుకున్నాడు. దీంతో తాజాగా వెంకట పద్మారావు నగరంపాలెం ఎస్హెచ్ఓ కె.వెంకటరెడ్డిని కలిసి ఫిర్యాదు చేశాడు. -
దళితులనూ వదలని కే ట్యాక్స్
కష్టాల్లో తోడుండాల్సిన సొంత బంధువులే తోడేళ్లుగా మారి ఉన్న స్థలంపై కన్నేశారు. టీడీపీ నేతల అండదండలతో అక్రమంగా అమ్మేసుకున్నారు. పోలీసు స్టేషన్ మెట్లెక్కితే.. కోడెల కుటుంబంవైపు దారి చూపారు. అన్యాయం చేశారయ్యా.. మీరే ఆలకించండయ్యా అని కోడెల శివరామ్ వద్ద కాళ్లావేళ్లా పడితే కాదు పొమ్మన్నారు. కాసులిచ్చిన వారి వైపే త్రాసు తూచారు. దళితులను కులం పేరుతో దూషించారు. ఊళ్లో ఉంటే ఊపిరి కూడా ఉండదని బెదిరించారు. చట్టాలు అధికారపు మోచేతి కింద మోకరిల్లగా.. ఇక చేసేది లేక కన్న ఊరు, సొంత గూడు వదిలి కన్నీటితో కదిలిపోయారు ఆ దళితులు.. ప్రభుత్వం మారడంతో తమ వేదన ఆలకిస్తారనే ఆశతో నరసరావుపేట వన్టౌన్ పోలీసులను ఆశ్రయించారు బాధితులు. ఇలా రోజురోజుకు కోడెల కుటుంబం అక్రమాలు, అన్యాయాలకు బలైన అనేక మంది పోలీసు గడప తొక్కుతున్నారు. నరసరావుపేట టౌన్: విలువైన స్థలాన్ని టీడీపీ నాయకుల సహాయంతో బంధువులు ఆక్రమించి అమ్ముకున్నారు.. న్యాయం చేయాలని కోడెల కుటుంబ సభ్యుల వద్దకు వెళితే బెదిరించి కులం పేరుతో దూషించారు.. ఆనాడు ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించకపోగా తిరిగి తమపైనే కేసులు పెడతామన్నారు.. భయంతో కుటుంబంతో సహా ఊరు విడిచి వెళ్లి ఇతర ప్రాంతంలో బతుకుతున్నాం... ప్రభుత్వం మారడంతో ఫిర్యాదు చేసేందుకు ముందుకు వచ్చానని ఓ దళిత మహిళ శుక్రవారం పోలీసుల ఎదుట వాపోయింది. వివరాలు.. కందుకూరి బుజ్జి వెంకాయమ్మ కుమారుడు రాజేష్వర్మకు అతని తాత షాలెంనగర్ ప్రాంతంలో 2.5 సెంట్ల భూమిని సుమారు 17 ఏళ్ల క్రితం రిజిస్ట్రేషన్ చేశాడు. అయితే, వాస్తవాన్ని దాచి స్థలంలో సగ భాగం తనకు హక్కు ఉందని 2006లో వెంకాయమ్మ మరిది చంద్రశేఖర్ ఇతరులకు 1.25 సెంట్ల భూమిని విక్రయించాడు. మిగిలిన స్థలంలో ఉన్న ఇంటిపై పెద్ద బావ శ్రీనివాసరావు కన్నేసి తనదిగా చూపి అతని కుమారుడికి 2014లో రాసిచ్చాడు. విషయం తెలుసుకున్న వెంకాయమ్మ ఇదేమిటని ప్రశ్నించించడంతో రెండు వర్గాల మధ్య వివాదం తలెత్తింది. ఈ క్రమంలో వెంకాయమ్మ వ్యతిరేక వర్గం టీడీపీ నాయకులు కుంపటి రవి, గుండాల రవీంద్రల్ని సంప్రదించగా వారి అనుచరులతో ఇంటి వద్దకు వెళ్లి ఖాళీ చేసి వెళ్లాలని బెదిరింపులకు పాల్పడ్డారు. న్యాయం కోసం మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమారుడు శివరామ్, కుమార్తె విజయలక్ష్మి వద్దకు వెంకాయమ్మ వెళ్లింది. అయితే, కుంపటి రవి చెప్పినట్లు విని ఇళ్లు ఖాళీ చేసి ఊళ్లో నుంచి వెళ్లిపోవాలని బెదిరించడంతో పాటు కులం పేరుతో దూషించారు. దీంతో బాధితురాలు పోలీస్స్టేషన్కు వెళ్లి జరిగిన అన్యాయం వివరించి ఫిర్యాదు చేసింది. అయితే. పోలీసులు ఫిర్యాదు తీసుకోకపోగా కోడెల శివరామ్ చెప్పినట్లుగా ఊరు విడిచి వెళ్లమని ఉచిత సలహా ఇచ్చారు. అలా కాదని అక్కడే ఉంటే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆస్తుల్ని వదిలేసి వెంకాయమ్మ కుటుంబంతో సహా ఊరు విడిచి చిలకలూరిపేట మండలం యడవల్లి గ్రామానికి వెళ్లి గత మూడేళ్లుగా అక్కడే జీవిస్తోంది. తెలుగుదేశం నాయకుల అవినీతి, అక్రమాలపై వైఎస్పార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుండటంతో బాధితురాలు ఇకనైనా తమకు న్యాయం జరుగుతుందన్నా ఆశతో శుక్రవారం వన్టౌన్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. అట్రాసిటీ కేసు నమోదు కులం పేరుతో దూషించి తమ ఆస్తిని అక్రమంగా కాజేశారని బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోడెల శివరామ్, పూనాటి విజయలక్ష్మి, వారి అనుచరులు అరుగురిపై అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఏ.వి. బ్రహ్మం శుక్రవారం తెలిపారు. కాగా ఇప్పటికే కోడెల కుటుంబ సభ్యులపై 13 క్రిమినల్ కేసులు నమోదవ్వగా శుక్రవారం మరో అట్రాసిటీ కేసు నమోదైంది. ఇప్పటికే కోడెల శివరామ్ వేధింపులతో కేబుల్ ఆపరేటర్గా పనిచేసే దివ్యాంగుడు కృష్ణారావు ఆత్మహత్యకు అనుమతి ఇవ్వాలని రాష్ట్రపతిని కోరగా.. దళిత కుటుంబం ఊరు విడిచి వెళ్లిన సంఘటన ఒకదాని వెంట మరొకటి వెలుగులోకి వచ్చాయి. -
తూర్పుగోదావరిలోనూ కోడెల లీలలు
-
కోడెల కుటుంబ కబ్జా పర్వం
సాక్షి ప్రతినిధి, కాకినాడ/సత్తెనపల్లి: అధికారాన్ని అడ్డం పెట్టుకొని మాజీ స్పీకర్ కోడెల కుటుంబం చేసిన దౌర్జన్యాల పర్వం రోజుకొకటి వెలుగు చూస్తోంది. తమకు చెందిన 17.52 ఎకరాల భూమిని కబ్జా చేశారంటూ కోడెల శివప్రసాద్ కుమారుడు శివరామ్, అతని పీఏ గుత్తా నాగప్రసాద్పై సత్తెనపల్లి మండలం వెన్నాదేవి గ్రామానికి చెందిన 16 మంది బాధిత రైతులు గురువారం సత్తెనపల్లి రూరల్ పోలీస్స్టేషన్లో ఎస్ఐ మౌనిషాకు ఫిర్యాదు చేశారు. అనంతరం బాధిత రైతు గొడుగుల సుబ్బారావు మాట్లాడుతూ.. ధూళిపాళ్ల సమీపంలోని మొత్తం 17.52 ఎకరాల భూమిని 16 మంది రైతులు సాగు చేసుకుంటున్నారన్నారు. 1900 సంవత్సరం పూర్వం నుంచి తమ ముత్తాత తాతల నుంచి ఈ భూమిని సాగు చేసుకుంటున్నామని పేర్కొన్నారు. అలాగే ఉమ్మడి కుటుంబం కింద 7 గృహాలు ఉన్నాయన్నారు. అయితే ఈ స్థలంపై కోడెల కుమారుని కన్ను పడటంతో తమను వేధించడం మొదలు పెట్టారని వివరించారు. 2016 ఏప్రిల్ 2న రాత్రి 9.30 గంటల సమయంలో కోడెల శివప్రసాదరావు పీఏ గుత్తా నాగప్రసాద్, యెలినేడి శ్రీనుతోపాటు సుమారు 20 మంది రౌడీ షీటర్లు పౌల్ట్రీ ఫారంలోకి ప్రవేశించి సీసీ కెమెరాలు పగుల గొట్టారన్నారు. రూ. 2 లక్షల డబ్బులు, 40 గ్రాముల గోల్డ్ చైన్ తీసుకొని ఇంట్లో మహిళలను కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే భూమిని వదిలి పెట్టి వెళ్లిపోకుంటే చంపేస్తామని బెదిరించారని తెలిపారు. 2016 ఏప్రిల్ 4న కూడా కోడెల అనుచరులు పోలీసుల సహాయంతో దౌర్జన్యం చేశారని వివరించారు. రెండు పౌల్ట్రీ షెడ్లలో ఉన్న 10 వేల కోళ్లు, వందలాది పొట్టేళ్లను తీసుకెళ్లారని చెప్పారు. కోటిన్నర విలువైన ఆస్తిని స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. వీరి వేధింపులు తాళలేక భయపడి ఇన్నాళ్లూ తమ కుటుంబం హైదరాబాద్లో తల దాచుకుందన్నారు. ప్రస్తుతం అందరూ కేసులు పెడుతున్నారని తెలిసి మేము ధైర్యంగా కేసు పెట్టామని, న్యాయం చేయాలని కోరారు. తూర్పుగోదావరిలోనూ కోడెల లీలలు కోడెల కుటుంబ అక్రమాలు తూర్పుగోదావరి జిల్లాలోనూ బయటపడుతున్నాయి. కోడెల శివరాం రాజానగరం గ్రామ రెవెన్యూ పరిధిలోని 10 ఎకరాల భూమిలో ఫార్మా ఉత్పత్తుల గోడౌన్ కోసం అడ్డగోలు నిర్మాణాలు ప్రారంభించారు. అటు పంచాయతీ నుంచిగానీ, ఇటు గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అథారటీ (గుడా) నుంచి గాని ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. అప్పట్లో ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. తాజాగా ఈ నెల 19న గుడా అధికారులు శివరామకృష్ణకు నోటీసులు జారీ చేశారు. ఇదే విషయాన్ని గుడా వైస్ చైర్మన్ అమరేంద్ర కుమార్ ‘సాక్షి’ వద్ద ధ్రువీకరించారు. -
కోడెల కుమార్తెపై మరో కేసు నమోదు
-
డాక్టర్ను మోసం చేసిన కోడెల కుమార్తె
సాక్షి, గుంటూరు : టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబంపై ఫిర్యాదుల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే ఆయన కుమారుడు, కుమార్తెపై పలు కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. తాజాగా కోడెల కుమార్తె విజయలక్ష్మిపై చీటింగ్ కేసు నమోదు చేశారు పోలీసులు. ఆరోగ్యశ్రీ పర్మిషన్ పేరుతో తనను మోసం చేశారంటూ డాక్టర్ చక్రవర్తి బుధవారం సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు. డాక్టర్ చక్రవర్తికి చెందిన మేఘనా ఆస్పత్రికి ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తింప చేస్తామంటూ విజయలక్ష్మి నాలుగు లక్షలు వసూలు చేశారు. అయితే ఆరోగ్యశ్రీ వర్తింపచేయలేదు. తిరిగి డబ్బులు ఇవ్వాలని అడిగినా బెదిరింపులకు దిగారు. దీంతో విజయలక్ష్మితో పాటు బొమ్మిశెట్టి శ్రీను, పోట్ల ప్రసాదుపై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. కాగా కోడెల శివప్రసాదరావు కుటుంబం అధికారం అండతో ఇన్నాళ్లూ సాగించిన దౌర్జన్యాలు, అరాచకాలు, అక్రమ వసూళ్లు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తన కుటుంబంపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారని, ఆధారాలు ఉంటే చూపించాలంటూ కోడెల సవాలు విసిరి రెండు రోజులు గడవకముందే రంజీ క్రికెట్ క్రీడాకారుడిపై దాడికి పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. గుంటూరు రూరల్ ఎస్పీ జయలక్ష్మిని ఆదేశాలతో కోడెల శివప్రసాదరావుతోపాటు ఆయన కుమారుడు శివరాంపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో తన కుమారుడు శివరాం, కుమార్తె విజయలక్ష్మి సాగించిన అరాచకాలు, అక్రమ వసూళ్లకు కోడెల శివప్రసాదరావు అండగా నిలిచినట్లు మరోమారు తేటతెల్లమైంది. కోడెల కుమారుడు, కుమార్తెపై గతంలో నమోదైన కేసుల్లో శివప్రసాదరావును సైతం నిందితుడిగానే చేర్చాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. -
కోడెల తనయుడి మరో నిర్వాకం
సాక్షి, నరసరావుపేట టౌన్: సాంకేతిక ఫైరసీకు పాల్పడుతున్న మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమారుడు శివరామ్ బండారం మరోమారు బట్టబయలైంది. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని గత కొన్నేళ్లుగా కోడెల శివరాం గౌతం కమ్యూనికేషన్ పేరిట కే చానల్ నిర్వహిస్తూ అక్రమ ఫైరసీకి పాల్పడుతున్నాడు. స్టార్ టీవీ ప్రసారాలకు సంబంధించి డీటీహెచ్ ద్వారా సాంకేతిక చోరీకి పాల్పడి ప్రతి నెలా లక్షల రూపాయలు అక్రమార్జన చేస్తున్నాడు. దీనిపై స్టార్ టీవీ ప్రతినిధులు గతంలో పోలీసులకు ఫిర్యాదు చేయగా స్పందించకపోవడంతో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. స్పందించిన న్యాయస్థానం అడ్వొకేట్ కమిషన్ను ఏర్పాటు చేసింది. కమిషన్ సభ్యుల బృందం ఈ ఏడాది ఏప్రియల్ 18న రాజాగారి కోటలోని మాజీ స్పీకర్ కోడెల నివాస గృహంలో నిర్వహిస్తున్న కే చానల్ సంస్థ కార్యాలయంపై దాడులు నిర్వహించారు. అక్కడ సాంకేతిక పరంగా ప్రసారాలు చౌర్యం చేస్తున్నట్లు గుర్తించి డీకోడర్, ఎన్కోడర్లను స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత నివేదికను న్యాయస్థానానికి సమర్పించారు. న్యాయస్థానం కోడెల శివరాంకు సమన్లు జారీ చేసినా స్పందించలేదు. దీంతో కమిషన్ న్యాయవాది లక్ష్యవీర్ ముని మంగళవారం కే చానల్ కార్యాలయానికి వెళ్లి సమన్లు తీసుకోవాల్సిందిగా కోరగా సిబ్బంది నిరాకరించారు. కోర్టు ధిక్కారణ కింద న్యాయస్థానానికి నివేదిక అందించనున్నట్లు ఆయన తెలిపారు. శివరామ్పై చర్యలు తీసుకోవాలని స్టార్ ప్రతినిధులు సీఐని కోరారు. (చదవండి: కోడెల వ్యవహారంపై టీడీపీ కీలక నిర్ణయం!) -
కోడెల బండారం బట్టబయలు
సాక్షి, గుంటూరు: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబం అధికారం అండతో ఇన్నాళ్లూ సాగించిన దౌర్జన్యాలు, అరాచకాలు, అక్రమ వసూళ్లు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తన కుటుంబంపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారని, ఆధారాలు ఉంటే చూపించాలంటూ కోడెల సవాలు విసిరి రెండు రోజులు గడవకముందే రంజీ క్రికెట్ క్రీడాకారుడిపై దాడికి పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. గుంటూరు రూరల్ ఎస్పీ జయలక్ష్మిని ఆదేశాలతో కోడెల శివప్రసాదరావుతోపాటు ఆయన కుమారుడు శివరాంపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో తన కుమారుడు శివరాం, కుమార్తె విజయలక్ష్మి సాగించిన అరాచకాలు, అక్రమ వసూళ్లకు కోడెల శివప్రసాదరావు అండగా నిలిచినట్లు మరోమారు తేటతెల్లమైంది. కోడెల కుమారుడు, కుమార్తెపై గతంలో నమోదైన కేసుల్లో శివప్రసాదరావును సైతం నిందితుడిగానే చేర్చాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. దౌర్జన్యాలను ప్రశ్నిస్తే దాడులే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కోడెల శివరాం, విజయలక్ష్మి చెలరేగిపోయారు. నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో వారు చెప్పిందే వేదం, చేసిందే చట్టం అన్నట్లుగా పరిస్థితి తయారైంది. అప్పట్లో రాజ్యాంగబద్ధమైన పదవిలో కోడెల శివప్రసాదరావు తన కుమారుడు, కుమార్తెకు సంపూర్ణంగా సహకరించారు. వారి ఇలాకాలో ల్యాండ్ కన్వర్షన్ జరగాలన్నా, అపార్టుమెంట్ నిర్మాణాలకు అనుమతులు రావాలన్నా కోడెల ట్యాక్స్ (కే ట్యాక్స్) చెల్లించాల్సిందే. చిరు వ్యాపారుల నుంచి బడా వ్యాపారుల వరకూ ఎవరినీ వదల్లేదు. దౌర్జన్యాలను ప్రశ్నిస్తే భౌతిక దాడులకు దిగేవారు. పోలీసులపై ఒత్తిడి తెచ్చి, బాధితులపై అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురిచేసేవారు. కోడెల కుటుంబంపై విచారణకు ‘సిట్’ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కోడెల కుటుంబం వల్ల నష్టపోయిన వారంతా ధైర్యంగా ముందుకొస్తున్నారు. తమకు జరిగిన అన్యాయంపై గళం విప్పుతున్నారు. నేరుగా పోలీసు స్టేషన్లకు వెళ్లి, కోడెల కుటుంబంపై ఫిర్యాదు చేస్తున్నారు. ఇప్పటికే నరసరావుపేటలో కోడెల కుమారుడు, కుమార్తెలపై దాదాపు 10 కేసులు నమోదు కావడం గమనార్హం. కోడెల కుటుంబం చేసిన అన్యాయాలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపడితే మరిన్ని వాస్తవాలు బయటకు వస్తాయని బాధితులు చెబుతున్నారు. కోడెల కుటుంబంపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) నియమించాలని పోలీసు ఉన్నతాధికారులు యోచిస్తున్నట్లు తెలిసింది. రంజీ క్రికెటర్ నుంచి రూ.15 లక్షలు వసూలు నరసరావుపేట టౌన్: స్పోర్ట్స్ కోటాలో రైల్వే శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని రూ.15 లక్షల వసూలు చేసిన కోడెల శివరాం ఉద్యోగం ఇప్పించకుండా మోసం చేశాడని ఆంధ్ర రంజీ జట్టు క్రీడాకారుడు బుడుమూరు నాగరాజు శనివారం గుంటూరు జిల్లా నరసరావుపేట డీఎస్పీ రామవర్మకు ఫిర్యాదు చేశాడు. శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం యవ్వారిపేట గ్రామానికి బుడుమూరు నాగరాజు ఆంధ్ర రంజీ జట్టు తరఫున ఐదేళ్లుగా క్రికెట్ ఆడుతున్నాడు. రెండేళ్ల క్రితం విజయవాడకు చెందిన భరత్చంద్ర ద్వారా నాగరాజుకు కోడెల శివరాం పరిచయమయ్యాడు. స్పోర్ట్స్ కోటాలో రైల్వే ఏఎల్పీ ఉద్యోగం ఇప్పిస్తానని శివరాం నమ్మబలికాడు. దాంతో నాగరాజు అతడికి 2018 ఫిబ్రవరి 27న రూ.15 లక్షలు సమర్పించుకున్నాడు. నాగరాజు నుంచి డబ్బులు తీసుకున్నట్టు ఓ బాండ్, ఉద్యోగ నియామక ధ్రువపత్రాలు ఇచ్చి మరుసటి రోజు కాన్పూర్కు వెళ్లమని శివరాం చెపాడు. శివరాం చెప్పినట్టే నాగరాజు ఉద్యోగ నియామక పత్రాలు తీసుకుని మరుసటి రోజు కాన్పూర్కు వెళ్లాడు. అక్కడ శివరాంకు చెందిన ఓ వ్యక్తి నాగరాజును కలిసి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు భర్తీ చేసేప్పుడు నీకు కబురు చేస్తామని చెప్పాడు. దీంతో నాగరాజు వెనక్కి వచ్చేశాడు. కోడెల కుటుంబంపై ఇటీవల వరుసగా నమోదవుతున్న కేసులు చూసి తాను కూడా మోసపోయానని నాగరాజు నిర్ధారించుకున్నాడు. కోడెల శివప్రసాదరావుకు ఫోన్లో జరిగిన విషయాన్ని వివరించగా డబ్బులు తిరిగి ఇప్పిస్తానని ఆయన చెప్పడంతో ఈ నెల 2వ తేదీన నాగరాజు నరసరావుపేటలోని కోడెల నివాసానికి వెళ్లాడు. అక్కడ నాగరాజుపై కోడెల అనుచరులు దాడి చేశారు. బలవంతంగా బాండ్ పేపరు లాక్కొని చించేశారు. తాను పోలీసులను ఆశ్రయిస్తానని నాగరాజు చెప్పడంతో శుక్రవారం డబ్బులు తిరిగి ఇస్తానని అతడిని నరసరావుపేటకు రప్పించారు. గుంటూరులోని లక్ష్మీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి దగ్గరకు వెళితే డబ్బులు ఇస్తారని నాగరాజుకు చెప్పారు. గుంటూరుకు వచ్చి కోడెలకు పలుమార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో నాగరాజు చివరకు రూరల్ ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. అక్కడి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు నరసరావుపేట డీఎస్పీని కలిసి, తనకు జరిగిన అన్యాయాన్ని వివరించాడు. శివప్రసాదరావు, శివరాంపై కేసు నమోదు బాధితుడు నాగరాజు ఇచ్చిన ఫిర్యాదుతో కోడెల శివప్రసాదరావు, కోడెల శివరాంలపై చీటింగ్, ఫోర్జరీ డాక్యుమెంట్ తయారీ, సెక్షన్ 420, 468, 472, 477, 387, రెడ్ విత్ 34 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నరసరావుపేట టూటౌన్ సీఐ అళహరి శ్రీనివాసరావు తెలిపారు. -
రంజీ క్రికెటర్ను మోసగించిన కోడెల కుమారుడు
సాక్షి, గుంటూరు: మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమారుడు కోడెల శివరామ్ అక్రమాలు బయటపడుతూనే ఉన్నాయి. రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తానని ఒక క్రీడాకారుడి వద్ద శివరామ్ రూ.15 లక్షలు తీసుకుని మోసం చేసిన వైనం తాజాగా వెలుగుచూసింది. బాధితుడైన ఆంధ్రా రంజీ క్రికెటర్ బుడుమూరు నాగరాజు శుక్రవారం గుంటూరు రూరల్ ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. వివరాల్లోకెళ్తే.. శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం యవ్వారిపేట గ్రామానికి చెందిన అప్పలస్వామి కుమారుడు నాగరాజు ఆంధ్రా రంజీ జట్టు తరఫున గత ఐదేళ్లుగా క్రికెట్ ఆడుతున్నాడు. రెండేళ్ల కిందట విజయవాడకు చెందిన భరత్చంద్ర ద్వారా నాగరాజుకు కోడెల శివరామ్ పరిచయమయ్యాడు. ఆ సమయంలో తనకు రైల్వే ఉద్యోగంపై మక్కువ ఉందని కోడెల శివరామ్కు చెప్పాడు. దీన్ని ఆసరాగా చేసుకున్న శివరామ్ స్పోర్ట్స్ కోటాలో రైల్వే అసిస్టెంట్ లోకో పైలట్ (ఏఎల్పీ) ఉద్యోగం ఇప్పిస్తానని రూ.15 లక్షలు డిమాండ్ చేశాడు. దీంతో గతేడాది ఫిబ్రవరి 27న నరసరావుపేటలోని కోడెల నివాసానికెళ్లి రూ.15 లక్షలను నాగరాజు ఇచ్చాడు. అప్పుడు డబ్బు తీసుకున్నట్టు ఓ బాండ్, ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చి మరుసటి రోజు కాన్పూర్ వెళ్లాలని శివరామ్ చెప్పాడు. అతడు చెప్పినట్టే నాగరాజు ఉద్యోగ నియామక పత్రాలు తీసుకుని మరుసటి రోజు కాన్పూర్ వెళ్లాడు. అక్కడ కోడెల శివరామ్కు చెందిన ఓ వ్యక్తి నాగరాజును కలిసి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల భర్తీ చేసేటప్పుడు కబురు చేస్తామని నమ్మబలికాడు. దీంతో నాగరాజు తిరిగొచ్చేశాడు. మే 23 తర్వాత అసలు విషయం తెలుసుకుని.. మే 23న ఎన్నికల ఫలితాల అనంతరం కోడెల కుటుంబం అక్రమంగా వసూళ్లు చేసిన కేట్యాక్స్, ఉద్యోగాలిస్తామని మోసగించిన సంఘటనలపై వరుసగా నమోదవుతున్న కేసుల విషయం తెలుసుకుని తాను కూడా మోసపోయానని నాగరాజు నిర్ధారించుకున్నాడు. కోడెల శివప్రసాదరావుకు ఫోన్లో జరిగిన విషయాన్ని వివరించగా డబ్బులు తిరిగి ఇప్పిస్తానని ఆయన చెప్పడంతో ఈ నెల 2న నాగరాజు నరసరావుపేటలోని కోడెల నివాసానికి వెళ్లాడు. అయితే.. నాగరాజును బెదిరించి కోడెల అనుచరులు బాండ్ పేపరును చించేశారు. దీంతో తాను పోలీసులను ఆశ్రయిస్తానని నాగరాజు హెచ్చరించాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే విషయం బయటకు తెలుస్తుందని, శుక్రవారం డబ్బు ఇస్తానని నరసరావుపేట రావాలని కోడెల పిలిపించాడు. అక్కడ నాగరాజు చాలాసేపు వేచి చూశాక గుంటూరులోని లక్ష్మీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి దగ్గరకు వెళితే డబ్బులు ఇస్తారని అక్కడకు పంపారు. గుంటూరుకు వచ్చి కోడెలకు పలుమార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో జిల్లా పోలీస్ కార్యాలయంలో రూరల్ ఎస్పీకి నాగరాజు ఫిర్యాదు చేసి న్యాయం చేయాలని కోరాడు. చదవండి: కోడెలపై లారీ ఓనర్ల ఫైర్..! ‘కోడెల ట్యాక్స్ పుట్ట బద్దలవుతోంది’ ‘కే’ ట్యాక్స్ బాధితుల క్యూ అజ్ఞాతంలో కోడెల కుమారుడు, కుమార్తె ‘కే ట్యాక్స్’పై ఐదు కేసులు కోడెల తనయుడు శివరామ్పై కేసు నమోదు కోడెల పోలీస్ పర్మిషన్ కూడా తీసుకోలేకపోయాడు -
కోడెలపై లారీ ఓనర్ల ఫైర్..!
సాక్షి, గుంటూరు : అక్రమంగా కేసులు పెట్టి వేదిస్తున్నార్న కోడెల శివప్రసాదరావు వ్యాఖ్యలపై ఇసుక లారీ అసోషియేషన్ నేతలు మండిపడ్డారు. కోడెల శివరాం తమను బెదిరించి 400 లారీల ఇసుక తీసుకెళ్లారని తెలిపారు. మాటవినకపోతే పోలీసులతో బెదిరించారని అన్నారు. గుంటూరు, నరసరావుపేట, గోళ్లపాడు, సత్తెనపల్లిలోని వారి నిర్మాణాలకు ఇసుక తరలించారని చెప్పారు. డబ్బులు ఇమ్మని అడిగితే అక్రమంగా నిర్భదించి భయభ్రాంతులకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈమేరకు కోడెల కుటుంబం నుంచి తమను కాపాలని కోరుతూ లారీ ఓనర్లు ఒక లేఖ విడుదల చేశారు. ఇన్ని అక్రమాలు బయటపడుతున్నా తమ కుటుంబంపై అక్రమ కేసులు పెడుతున్నారంటూ కోడెల వ్యాఖ్యానించడం దారుణమన్నారు. (చదవండి : ‘కోడెల ట్యాక్స్ పుట్ట బద్దలవుతోంది) (చదవండి : అజ్ఞాతంలో కోడెల కుమారుడు, కుమార్తె) -
‘కోడెల ట్యాక్స్ పుట్ట బద్దలవుతోంది’
సాక్షి, అమరావతి : ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ‘కే ట్యాక్స్’ పుట్ట బద్దలవుతోందని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి తెలిపారు. తండ్రి పదవిని అడ్డం పెట్టుకుని కొడుకు కోడెల శివరాం, కుమార్తె పూనాటి విజయలక్ష్మి చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయన్నారు. శుక్రవారం ట్విటర్ వేదికగా కోడెల కుటుంబ అక్రమాలపై విజయసాయి రెడ్డి ధ్వజమెత్తారు. కొడెల కొడుకు, కూతురు చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుని బతికే వారిని దోచుకోవడంపై పూర్తి దర్యాప్తు జరుగుతుందన్నారు. కుటుంబ సభ్యుల దోపిడీని ప్రోత్సహించిన మాజీ స్పీకర్పై ఎబెట్మెంట్ సెక్షన్ కింద కేసు నమోదు చేయాలన్నారు. కేట్యాక్స్ బాధితులు నిర్భయంగా ఫిర్యాదు చేయాలని గతంలో పిలుపునిచ్చిన విజయసాయిరెడ్డి.. కోడెల కుటుంబం వందల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. మరో ట్వీట్లో.. ‘ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంపై దేశ వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. 56 వేల మంది ఉద్యోగులు ఇక నిశ్చింతగా ఉండగలుగుతారు. గతంలో రైల్వేలను విలీనం చేయడం కంటే ఇది సాహసోపేత నిర్ణయమని ఆర్థిక నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.’ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ‘కే’ట్యాక్స్ బాధితుల ఫిర్యాదుల మేరకు కోడెల శివప్రసాదరావు కుమారుడు కోడెల శివరాం, కుమార్తె పూనాటి విజయలక్ష్మిలపై ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బూలు వసూలు చేయడం, బెదిరింపులకు పాల్పడ్డారని ఈ ఇద్దరిపై ఆరోపణలు వచ్చాయి. ఇక ఈ నేరారోపణలు ఎదుర్కొంటున్న కోడెల శివరాం, విజయలక్ష్మి ప్రస్తుతం అజ్ఞాతంలోకి జారుకున్నారు. బాధితుల తాకిడితో వారిద్దరూ ఊరు విడిచి వెళ్లినట్లు టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. మరోవైపు ఓ బాధితుడికి డబ్బులు వెనక్కి ఇచ్చినట్లు తెలియడంతో మరికొందరు బాధితులు కోడెల నివాసం, కార్యాలయం వద్ద పడిగాపులు కాస్తున్నారు. చదవండి: ‘కే ట్యాక్స్’పై ఐదు కేసులు కోడెల కుమార్తెపై కేసు కోడెల తనయుడు శివరామ్పై కేసు నమోదు -
‘కే’ ట్యాక్స్ బాధితుల క్యూ
సాక్షి, గుంటూరు/నరసరావుపేట టౌన్: మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల కొడుకు, కుమార్తెపై కేసు పెట్టేందుకు పోలీస్స్టేషన్లకు వచ్చే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దౌర్జన్యంగా తమ వద్ద లాక్కున్న డబ్బును వెనక్కు ఇప్పించాలంటూ వారి వద్ద ఉన్న ఆధారాలతో సహా పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. తాజాగా గురువారం మరో ఇద్దరు బాధితులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి లంచాలు దండుకున్న కోడెల కూతురు విజయలక్ష్మీపైనా, లైసెన్స్ ఉన్నప్పటికీ మద్యం దుకాణానికి కే ట్యాక్స్ కట్టాల్సిందేనంటూ లక్షలు వసూలు చేసిన కొడుకు శివరాంపై బాధితులు ఫిర్యాదు చేశారు. వీరిపై చీటింగ్, బలవంతపు వసూళ్ల సెక్షన్ 420, 384 కింద కేసు నమోదు చేశారు. ఇలా రోజు రోజుకూ కేసులు పెరుగుతుండటంతో ప్రత్యేక అధికారిని నియమించి దర్యాప్తు చేయించాలనే యోచనలో పోలీసు ఉన్నతాధికారులు ఉన్నట్లు సమాచారం. తమ పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్లు కోడెల కుటుంబం అక్రమ వసూళ్లు చేసిన విధానం బాధితుల కథనంతో వెలుగులోకి వస్తోంది. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమారుడు శివరాం, కుమార్తె విజయలక్ష్మి నేరుగా ఈ వసూళ్లు చేశారని బాధితులు ఆధారాలు సమర్పిస్తున్నారు. తెలుగుదేశ ప్రభుత్వం గత ఐదేళ్ల కాలంలో నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో తోపుడు బండ్ల వ్యాపారుల మొదలు మద్యం వ్యాపారుల వరకు ఎవరినీ వదల కుండా ‘కే’ట్యాక్స్ వసూలు చేసింది. కొత్త ప్రభుత్వం అవినీతి ప్రక్షాళన దిశగా చర్యలు చేపడుతుండటంతో బాధితులంతా న్యాయం కోసం పోలీసులను ఆశ్రయిస్తున్నారు. గత వారం రోజుల నుంచి నరసరావుపేట పట్టణ, రూరల్ పోలీస్ స్టేషన్లకు బాధితులు క్యూ కడుతున్నారు. కోడెల కుమారుడు, కుమార్తెపై ఇప్పటికే ఐదు కేసులు నమోదు అయ్యాయి. తాజాగా గురువారం మరో రెండు కేసులు నమోదు అయ్యాయి. ప్రత్యేక అధికారిని నియమిస్తే మరింత మంది బాధితులు బయటకు వచ్చే అవకాశం కోడెల, ఆయన కుటుంబ సభ్యుల దాష్టికాలపై నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో బాధితులు పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్న నేపథ్యంలో దీనిపై ప్రత్యేక అధికారిని నియమించి దర్యాప్తు చేయించాలనే యోచనలో పోలీసు ఉన్నతాధికారులు ఉన్నట్లు తెలిసింది. అదే జరిగితే భయంతో ఫిర్యాదు చేయకుండా ఉన్న వందలాది మంది బాధితులు బయటకు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. తమ వద్ద ఉన్న వీడియో, ఆడియో రికార్డుల ఆధారాలను సైతం అందించేందుకు బాధితులు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. బెదిరించి రూ.42 లక్షలు వసూలు చేశారు మద్యం వ్యాపారం సజావుగా సాగాలంటే తనకు రూ.50 లక్షల ‘కే’ట్యాక్స్ చెల్లించాలని, లేకుంటే కేసులు పెట్టిస్తానని కోడెల శివరాం బెదిరించటంతో విడతల వారీగా రూ.40 లక్షలు చెల్లించానని మద్యం వ్యాపారి మర్రిబోయిన చంద్రశేఖర్ టూటౌన్ పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశాడు. మద్యం షాపు నిర్వహించుకోవాలంటే తనకు రూ.50 లక్షలు ఇవ్వాలని కోడెల శివరాం బెదిరించాడన్నారు. చివరికి రూ.40 లక్షలకు ఒప్పుకునేలా చేశాడన్నారు. ‘కే’ట్యాక్స్ డబ్బులు కట్టటం ఆలస్యమైతే పోలీసులను పంపి బెదిరించేవాడన్నారు. దీంతో తన దగ్గర లేకున్నా వడ్డీకు అప్పు తీసుకొచ్చి మరీ రూ.40 లక్షల రూపాయలు కట్టానని తెలిపాడు. దీనిపై బలవంతపు అక్రమ వసూళ్ల నేరం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ అళహరి శ్రీనివాసరావు తెలిపారు. సబ్స్టేషన్లో ఉద్యోగం పేరిట మోసం చేశారు ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి మాజీ స్పీకర్ కోడెల కుమార్తె విజయలక్ష్మి, ఆమె అనుచరుడు కళ్యాణం రాంబాబు రూ.5.60 లక్షలు కాజేశారని వెంగళరెడ్డి కాలనీకి చెందిన షేక్ యాసిన్ వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సత్తెనపల్లి పట్టణంలో నిర్మించిన నూతన విద్యుత్ సబ్ స్టేషన్లో ఆపరేటర్గా ఉద్యోగం ఇప్పిస్తానని రాంబాబు నమ్మబలికి విజయలక్ష్మి వద్దకు యాసిన్ను తీసుకు వెళ్లాడు. ఆమె ఉద్యోగం కావాలంటే రూ.6 లక్షలు ఇవ్వాలని కోరగా అంత చెల్లించలేనని రూ.5 లక్షల 60 వేలు ఇచ్చేలాగా ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఉద్యోగం రాకపోవటంతో డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరగా ఇద్దరూ బెదిరింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈమేరకు చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ బ్రహ్మం తెలిపారు. -
అజ్ఞాతంలో కోడెల కుమారుడు, కుమార్తె
సాక్షి, గుంటూరు : భూకబ్జా, నకిలీ పత్రాల తయారీ, బెదిరింపులు, కులదూషణల ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే కోడెల శివప్రసాదరావు కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. కోడెల ఆయన కుమారుడు కోడెల శివరామ్, విజయలక్ష్మి ప్రస్తుతం ఎవరికీ అందుబాటులో లేనట్లు తెలుస్తోంది. వారిని విచారించేందుకు పోలీసులు ఫోన్లు చేసినా స్పందన లేనట్లు సమాచారం. బాధితుల తాకిడితో వారిద్దరూ ఊరు విడిచి వెళ్లినట్లు టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. ముందస్తు బెయిల్ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఓ బాధితుడికి డబ్బులు వెనక్కి ఇచ్చినట్లు తెలియడంతో మరికొందరు బాధితులు కోడెల నివాసం, కార్యాలయం వద్ద పడిగాపులు కాస్తున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా తన కుటుంబంపై కావాలనే ఆరోపణలు చేస్తున్నారని కోడెల శివప్రసాదరావు నిన్న ఆరోపించారు. తన కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని, కేసులకు ఆధారాలు చూపించి రుజువు చేయాలని డిమాండ్ చేశారు. చదవండి: ‘కే ట్యాక్స్’పై ఐదు కేసులు కోడెల కుమార్తెపై కేసు కోడెల తనయుడు శివరామ్పై కేసు నమోదు -
‘కే ట్యాక్స్’పై ఐదు కేసులు
నరసరావుపేట టౌన్: ‘కే’ట్యాక్స్ బాధితుల ఫిర్యాదుల మేరకు మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమారుడు కోడెల శివరాం, కుమార్తె పూనాటి విజయలక్ష్మిలపై బుధవారం పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. కోడెల కుమార్తె పూనాటి విజయలక్ష్మితోపాటు కొల్లి ఆంజనేయులు, కొల్లి నరసింహారావు, పెద్దబ్బాయి మున్సిపల్ కార్యాలయంలో ఉద్యోగం ఇప్పిస్తామంటూ నమ్మబలికి రూ.7 లక్షలు తీసుకొని మోసగించినట్లు పాతూరుకు చెందిన ఆళ్ల శేఖర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సెక్షన్ 420 కింద చీటింగ్ కేసు నమోదు చేసినట్లు టూటౌన్ సీఐ అళహరి శ్రీనివాసరావు తెలిపారు. సత్తెనపల్లికి చెం దిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు జెల్ది ప్రసాద్ నుంచి రూ.10 లక్షలు వసూలు చేసి కులం పేరుతో దూషించిన కేసులో విజయలక్ష్మిపై అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ సీఐ చిన్న మల్లయ్య తెలిపారు. పూనాటి విజయలక్ష్మి తన అనుచరుల ద్వారా బెదిరించి అక్రమంగా రూ.10 లక్షలు వసూ లు చేసినట్లు ప్రకాష్నగర్కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి తాళ్ల వెంకట కోటిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సెక్షన్ 384 కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఏవీ బ్రహ్మం తెలిపారు. ఈ ముగ్గురు బాధితులు మంగళవారమే పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. అపార్ట్మెంట్కు అనుమతుల విషయంలో డాక్టర్ కోడెల శివరాం, పీఏ గుత్తా ప్రసాద్ తనను బెదిరించి రూ.15 లక్షలు వసూలు చేసినట్లు బిల్డర్ కోటపాటి మల్లికార్జునరావు ఇచ్చిన ఫిర్యాదుతో ఇప్పటికే వన్టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పొలం ఆక్రమిస్తామంటూ బెదిరించి కోడెల కుమార్తె విజయలక్ష్మి ఆమె అనుచరులు రాంబాబు, శ్రీనివాసరావు తన నుంచి రూ.15 లక్షలు వసూలు చేసినట్లు బాధితురాలు అర్వపల్లి పద్మావతి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. విచారణలో నాలుగు ఫిర్యాదులు కోడెల శివరాం, పూనాటి విజయలక్ష్మిలపై ఐదు కేసులు నమోదు కాగా మరో నాలుగు ఫిర్యాదులు విచా రణ దశలో ఉన్నాయి. పొలం విషయంలో కోడెల కుమార్తె విజయలక్ష్మి, రాంబాబు, శ్రీనివాసరావు తనను బెదిరించి రూ.10 లక్షలు వసూలు చేసినట్లు నరసరావుపేటకు చెందిన సజ్జారావు శ్రీనివాసరావు ఫిర్యాదు చేయడంతో డబ్బులు వెనక్కి ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. బాధితులకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి భరోసా ఇవ్వడంతో వారంతా ఒక్కొక్కరే పోలీసులను ఆశ్రయిస్తున్నారు. పరారీలో కోడెల కుటుంబం నేరారోపణలు ఎదుర్కొంటున్న కోడెల శివరాం, విజయలక్ష్మి ప్రస్తుతం అజ్ఞాతంలోకి జారుకున్నారు. వారిని విచారించేందుకు పోలీసులు ఫోన్లు చేసినా స్పందన లేనట్లు తెలుస్తోంది. బాధితుల తాకిడితో వారిద్దరూ ఊరు విడిచి వెళ్లినట్లు టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. ముందస్తు బెయిల్ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు సమాచారం. మరోవైపు ఓ బాధితుడికి డబ్బులు వెనక్కి ఇచ్చినట్లు తెలియడంతో మరికొందరు బాధితులు కోడెల నివాసం, కార్యాలయం వద్ద పడిగాపులు కాస్తున్నారు. రుజువు చేయండి: కోడెల పాత గుంటూరు: తన కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆరోపించారు. కేసులకు ఆధారాలు చూపించి రుజువు చేయాలని డిమాండ్ చేశారు. బుధవారం ఆయన గుంటూరులోని టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ నూతన ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధి కోసం కృషి చేయాలని సూచించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలకు టీడీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ నరసరావుపేట, సత్తెనపల్లి ప్రాంతాల్లో అభివృద్ధే ధ్యేయంగా శివప్రసాద్ పాలన సాగించారని చెప్పారు. -
కోడెల కుమార్తెపై ఫిర్యాదు
-
కోడెల కుమార్తెపై కేసు
నరసరావుపేట టౌన్: మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబం సాగించిన అరాచక పర్వం మరొకటి వెలుగు చూసింది. సోదరుడిని మించిన సోదరిగా కోడెల కుమార్తె అవినీతి వ్యవహారం బట్టబయలైంది. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని డాక్టర్ పూనాటి విజయలక్ష్మి విలువైన భూమి కబ్జాకు అనుచరులతో కలసి ప్రయత్నం చేశారు. భూ యజమానులను బెదిరించి రూ.15 లక్షల ‘కే’ ట్యాక్స్ వసూలు చేశారు. మరో రూ.5 లక్షల కోసం వేధింపులకు దిగడంతో బాధితులు పోలీసుల్ని ఆశ్రయించారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలోని రామిరెడ్డిపేటకు చెందిన అర్వపల్లి పద్మావతికి కేసానుపల్లి వద్ద ఎకరం పొలం ఉంది. ఆ భూమిని 2002లో రావిపాడుకి చెందిన పూదోట మారయ్య వద్ద కొనుగోలు చేసింది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విలువైన ఆస్తులు, అమాయకుల భూములపై కోడెల కుమారుడు శివరామ్, కుమార్తె విజయలక్ష్మి కన్నేసి.. లేని వివాదాలను సృష్టించి ‘కే’ ట్యాక్స్ వసూలు చేశారు. కేసానుపల్లిలో రోడ్డు వెంట పద్మావతికి ఉన్న విలువైన ఎకరా భూమిపై కోడెల కుమార్తె విజయలక్ష్మి కన్నుపడింది. చదవండి: (కోడెల తనయుడు శివరామ్పై కేసు నమోదు) రెండేళ్ల కిందట ఆమె ఆంతరంగికుడు బొమ్మిశెట్టి శ్రీనివాసరావు, ముఖ్య అనుచరుడు కళ్యాణం రాంబాబు ఆ పొలం వద్దకు వెళ్లి భూ యజమానులను బెదిరించారు. ముందుగానే సృష్టించిన నకిలీ పత్రాలను చూపించి ఆ పొలాన్ని కోడెల కుమార్తె విజయలక్ష్మి కొనుగోలు చేసిందని, మరోమారు భూమి వద్దకు వస్తే హతమారుస్తామని బెదిరించారు. విజయలక్ష్మి వద్దకు వెళ్లి ముడుపులు (కే ట్యాక్స్) చెల్లించి వ్యవహారాన్ని చక్కదిద్దుకోవాలని, లేకుంటే పొలానికి ఫెన్సింగ్ వేస్తామని బెదిరించారు. దీంతో బాధితురాలు, కుమారుడు గోళ్లపాడులోని సేఫ్ కంపెనీ వద్దకు వెళ్లి విజయలక్ష్మిని కలిశారు. ఆమెను పొలం విడిచి వెళ్లాలని, లేకుంటే తమకు రూ.20 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో రూ.15 లక్షలు ఇస్తామని, అవి కూడా విడతల వారీగా కడతామని ఒప్పందం చేసుకున్నారు. అనుకున్న ప్రకారం రూ.15 లక్షల్ని 3 విడతలుగా చెల్లించారు. గత ఏడాది జనవరిలో పొలంలో ఉన్న సుబాబుల్ తోటను నరికించేందుకు పొలం యజమాని పద్మావతి, ఆమె భర్త వెళ్లగా రాంబాబు, శ్రీనివాసరావు అక్కడకు చేరుకుని మరో రూ.5 లక్షలు చెల్లిస్తేనే పొలంలోకి అడుగు పెట్టనిస్తామని, లేకుంటే చంపుతామని బెదిరించారు. దీంతో భయపడిన భూ యజమానులు మిన్నకుండిపోయారు. నాలుగు రోజుల కిందట పొలం వద్దకు వెళ్లిన పద్మావతి, ఆమె భర్తపై శ్రీనివాసరావు, రాంబాబు మరో ముగ్గురు కలసి దాడికి పాల్పడ్డారు. ఈ మేరకు బాధితురాలు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. విజయలక్ష్మి, ఆమె అనుచరులు కళ్యాణం రాంబాబు, శ్రీనివాసరావుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు ఎస్సై షేక్ మహ్మద్ షఫీ తెలిపారు. -
కోడెల తనయుడు శివరామ్పై కేసు నమోదు
‘కే’ ట్యాక్స్ పేరుతో కోడెల కుటుంబం చేసిన అరాచకాలు, అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఐదేళ్లుగా కోడెల కుటుంబ దాష్టీకానికి బలైన బాధితులు ఒక్కొక్కరూ తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. అధికార బలంతో అణచివేతకు గురైన గొంతులు నేడు గళం విప్పుతున్నాయి. లక్షల రూపాయలను ముట్టచెప్పినా ఇంకా కావాలని వేధిస్తుండటంతో ఓపిక నశించిన బాధితులు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. నరసరావుపేట టౌన్: తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని కోడెల శివరామ్ చేసిన అవినీతి, అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మాజీ స్పీకర్ కోడెల తనయుడు కోడెల శివరామ్ గత తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లోని వ్యాపారులను బెదిరించి అక్రమంగా కోట్ల రూపాయలు ఆర్జించారు. శివరామ్ అతని అనుచరులు డబ్బుల కోసం ఇంకా వేధిస్తుండటంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. రావిపాడు గ్రామ పంచాయతీ పరిధిలో ఓ అపార్ట్మెంట్ అనుమతికి రూ.17 లక్షల రూపాయలు ఇవ్వాలని బెదిరించి అక్రమంగా వసూలు చేయటంపై బాధితుడి ఫిర్యాదుతో కోడెల శివరామ్ అతని ఆంతరంగికుడు గుత్తా నాగప్రసాద్, ఇంజినీర్ వేణుగోపాల్రావులపై నరసరావుపేట వన్టౌన్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం కేసు నమోదైంది. రామిరెడ్డిపేటకు చెందిన కె.మల్లికార్జున రావు రావిపాడు గ్రామ పంచాయతీ పరిధిలో అపార్ట్మెంట్ నిర్మించేందుకు అనుమతుల కోసం ఇంజినీర్ ఉన్నం వేణుగోపాల్రావును రెండేళ్ల క్రితం సంప్రదించాడు. అనుమతులు కావల్సిన పత్రాలతో పాటు చెల్లించాల్సిన ఫీజులు, మామూళ్లు అందించాడు. అనుమతులు ఇప్పించకుండా వేణుగోపాల్రావు కాలయాపన చేస్తూ వచ్చాడు. పనులు ప్రారంభమై సగం పూర్తి అయిన సమయంలో కోడెల శివరామ్కు కప్పం చెల్లిస్తేనే అపార్ట్మెంట్ నిర్మాణం పూర్తవుతుందని ఇంజినీర్ వేణు హెచ్చరించాడు. అయినప్పటికీ ఖాతరు చేయకుండా మల్లికార్జునరావు నిర్మాణం కొనసాగించడంతో పంచాయతీ సెక్రటరీ భార్గవ్, ఈవోపీఆర్డీ శివసుబ్రహ్మణ్యం అక్కడకు వచ్చి పనులను నిలిపివేశారు. కోడెల శివరామ్కు కట్టాల్సిన మామూళ్లు (కేట్యాక్స్) చెల్లించిన తర్వాతే నిర్మాణం చేయాలని అలా కాదని నిర్మిస్తే జేసీబీతో కూల్చివేస్తామని బెధిరించారు. ఈ వ్యవహారాన్ని చక్కదిద్దేందుకు మల్లికార్జున రావును ఇంజినీర్ వేణు గుంటూరులోని కోడెల శివరామ్ కార్యాలయానికి తీసుకువెళ్లాడు. అక్కడ శివరామ్, అతని పీఏ గుత్తా నాగశివప్రసాద్ ఒక్కో ఫ్లాట్కు రూ.50 వేలు చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేసి అందరూ ఇస్తుంటే నువ్వెందుకు ఇవ్వవంటూ బెదిరించారు. నగదును వేణుకు అందించి పనులు ప్రారంభించుకోవాలని చెప్పటంతో వారి ఆదేశాల మేరకు రూ.17 లక్షలు ఇచ్చేలాగా ఒప్పందం కుదుర్చుకొని మొదట రూ.14 లక్షలు ముట్టచెప్పాడు. మిగిలిన రూ.3 లక్షల కోసం ఇంజినీర్ వేణు గత కొన్ని రోజులుగా బెదిరింపులకు పాల్పడుతుండటంతో ఈ వ్యవహారాన్ని ఫోన్లో రికార్డు చేసి బాధితుడు వన్టౌన్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. సత్తెనపల్లి, రావిపాడు రోడ్లలో అపార్ట్మెంట్లు నిర్మించి కేట్యాక్స్లు చెల్లించిన మరికొందరు బాధితులు వన్టౌన్, రూరల్ పోలీసులను ఆశ్రయించి తమకు న్యాయం చేయాలని వాపోయారు. కోడెల శివరామ్పై కేసు నమోదు... అపార్ట్మెంట్ అనుమతుల వ్యవహారంలో బెదిరించి నగదు వసూళ్లు చేసిన కోడెల శివరామ్, అతని పీఏ గుత్తా ప్రసాద్, ఇంజినీర్ వేణులపై కేసు నమోదు చేసినట్లు వన్టౌన్ ఎస్ఐ ఏవీ బ్రహ్మం తెలిపారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. -
నరసరావు పేటలో అధికారపార్టీనేతల అగడాలు
-
కోడెల పోలీస్ పర్మిషన్ కూడా తీసుకోలేకపోయాడు
గుంటూరు జిల్లా: నాపై ఆరోపణలు చేసిన కోడెల శివరామ్ బహిరంగ చర్చకు పోలీసు పర్మిషన్ కూడా తీసుకోలేకపోయాడని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి ఎద్దేవా చేశారు. వైఎస్సార్సీపీ నేతలు అంబటి రాంబాబు, మర్రి రాజశేఖర్లతో కలిసి పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ..సత్తెనపల్లి, నరసరావుపేటలో కోడెల కుటుంబం ఎన్నో భూకబ్జాలకు పాల్పడిందని ఆరోపించారు. రైల్వే కాంట్రాక్టర్లను కమిషన్ కోసం కోడెల శివరాం బెదిరించాడని, సత్తెనపల్లిలో మిఠాయి దుకాణం దగ్గర కూడా మామూళ్లు వసూలు చేస్తున్నారని తీవ్రంగా ధ్వజమెత్తారు. అవినీతి సొమ్ముతో గుంటూరులో రూ.150 కోట్లతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించారని చెప్పారు. సొంత కార్యకర్తల గురించి కూడా కోడెల పట్టించుకోరని విమర్శించారు. ప్రస్తుతం నరసరావుపేటలో ప్రశాంత వాతావరణం ఉందని, దానిని చెడగొట్టవద్దని విన్నవించారు. కోడెల కుటుంబం వల్ల మళ్లీ ఉద్రిక్తత నెలకొంటోందని వ్యాఖ్యానించారు. అవాంఛనీయ శక్తులను తరిమికొట్టాలని కార్యకర్తలకు, ప్రజలకు పిలుపునిచ్చారు. -
స్పీకర్ కోడెల తనయుడిపై కేసు నమోదు
గుంటూరు : నర్సరావుపేటలో కేబుల్ వైర్ల కత్తిరింపు వ్యవహారంలో ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తనయుడు శివరామ్పై పోలీసులు ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. నరసరావుపేటకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువనేత నల్లపాటి రామచంద్రప్రసాద్ నిర్వహిస్తున్న ఎన్సీవీ(నల్లపాటి కేబుల్ విజన్) కార్యాలయంపై టీడీపీ వర్గీయులు గతంలో దాడిచేశారు. పోలీసుల సమక్షంలోనే వైర్లు కత్తిరించి ప్రసారాలను నిలిపివేశారు. అప్పట్లోనే కోడెల తనయుడు శివరామ్పై బాధితులు ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయలేదు. దీంతో వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో కోర్టు ఆదేశాలతో శివరామ్పై పోలీసులు కేసు నమోదు చేశారు.