Malnutrition
-
పోషకాహార లోపాన్ని అధిగమించడానికి.. ఏం తినాలో తెలుసా!?
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మన దేశంలో ఆహార సమస్యకు పరిష్కారంగా హరిత విప్లవం వచ్చింది. హరిత విప్లవం ఫలితంగా ఆహార పంటల దిగుబడులు గణనీయంగా పెరిగాయి. ఆ తర్వాత గ్రామీణ భారత స్వయంసమృద్ధి లక్ష్యంతో శ్వేత విప్లవం వచ్చింది. శ్వేత విప్లవం వల్ల దేశంలో పాల ఉత్పత్తి పెరగడమే కాకుండా, ఎందరికో స్వయం ఉపాధి లభించింది. ఈ రెండు విప్లవాలు వచ్చి దశాబ్దాలు గడిచిపోయాయి. అయినా, నేటికీ మన దేశంలో ఎందరో శిశువులు, చిన్నారులు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు.దేశవ్యాప్తంగా 2019–21 మధ్య చేపట్టిన ఐదో విడత జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్–5) ప్రకారం మన దేశంలో ఐదేళ్ల లోపు వయసు ఉన్నవారిలో ఎదుగుదల లోపించిన చిన్నారులు 36.5 శాతం, బక్కచిక్కిపోయిన చిన్నారులు 19.3 శాతం, తక్కువ బరువుతో ఉన్న చిన్నారులు 32.1 శాతం మంది ఉన్నారు. చాలా రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత మధ్యాహ్న భోజన పథకాలను అమలు చేస్తున్నా, చిన్నారుల్లో పోషకాహార లోపం ఈ స్థాయిలో ఉండటం ఆందోళనకరం. ఇదిలా ఉంటే, మన దేశంలో ఐదేళ్ల లోపు చిన్నారుల్లో 2.4 శాతం మంది స్థూలకాయంతో బాధడుతున్నారు. చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని నివారించడానికి పోషకాహార నిపుణులు చెబుతున్న జాగ్రత్తలు ‘జాతీయ పోషకాహార వారోత్సవం’ సందర్భంగా మీ కోసం...నేటి బాలలే రేపటి పౌరులు. దేశ భవితవ్యానికి చిన్నారుల ఆరోగ్యమే కీలకం. చిన్నారులు ఆరోగ్యంగా ఉండాలి. వారు ఏపుగా ఎదగాలి. అప్పుడే దేశ భవిష్యత్తు బాగుంటుంది. ప్రపంచవ్యాప్తంగానే కాకుండా, మన దేశంలోని చిన్నారుల్లో పోషకాహార లోపానికి గల కారణాలను, చిన్నారుల్లో పోషకాహార లోపం వల్ల తలెత్తే పరిణామాలను కూలంకషంగా అర్థం చేసుకుని, చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని భర్తీ చేసేందుకు వారికి ఎలాంటి ఆహారాన్ని ఇవ్వాలో, వారిలోని ఎదుగుదల లోపాలను అరికట్టేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.చిన్నారుల్లో పోషకాహార లోపం సమస్య తీవ్రతను అర్థం చేసుకోవాలంటే, ప్రపంచవ్యాప్త పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. వెనుకబడిన దేశాల్లోను, అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనూ ఈ సమస్య అత్యంత తీవ్రంగా ఉంది. అంతర్జాతీయ గణాంకాలను చూసుకుంటే, ప్రపంచవ్యాప్తంగా ఐదేళ్ల లోపు వయసు గల చిన్నారుల్లో 14.9 కోట్ల మంది పోషకాహార లోపం కారణంగా ఎదుగుదల లోపంతో బాధపడుతున్నారు. మరో 4.5 కోట్ల మంది చిన్నారులు పోషకాహారం అందక బక్కచిక్కి ఉంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న బాలల మరణాల్లో 45 శాతం మరణాలు పోషకాహార లోపం వల్ల సంభవిస్తున్నవే! చిన్నారుల ఆరోగ్య పరిస్థితిపై ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే! మరోవైపు, 3.7 కోట్ల మంది చిన్నారులు స్థూలకాయంతో బాధపడుతున్నారు.పోషకాహార లోపాన్ని అధిగమించాలంటే, రోజువారీ ఆహారంలో వీలైనంత వైవిధ్యం ఉండేలా చూసుకోవాలి. తృణధాన్యాలు, గింజధాన్యాలు, పప్పులు, కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పాలు, పెరుగు, ఇతర పాల ఉత్పత్తులు, గుడ్లు, చికెన్ వంటివి తీసుకోవాలి. ఐరన్, జింక్, అయోడిన్ తదితర ఖనిజ లవణాలు, విటమిన్–ఎ, విటిమన్–బి, విటమిన్–సి తదితర సూక్ష్మపోషకాలు సమృద్ధిగా ఉండే పదార్థాలను క్రమం తప్పకుండా తీసుకోవాలి.చక్కని పోషకాహారం తీసుకోవడమే కాకుండా, ఆహారం సరిగా జీర్ణమవడానికి ప్రతిరోజూ తగినంత నీరు తాగాలి. ప్రతిరోజూ నిర్ణీత వేళల్లో భోజనం చేయడం వల్ల ఆహార జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది. అలాగే, కుటుంబ సభ్యులతో కలసి భోజనం చేయడం వల్ల తినడంలో ఆరోగ్యకరమైన పద్ధతులు అలవడటమే కాకుండా, సామాజిక అనుబంధాలు పెరుగుతాయి. ఆకలి వేసినప్పుడు తినే పదార్థాల మీద పూర్తిగా దృష్టిపెట్టి తృప్తిగా భోజనం చేయాలి. తినే సమయంలో టీవీ చూడటం సహా ఇతరత్రా దృష్టి మళ్లించే పనులు చేయకుండా ఉండటం మంచిది.పోషకాహార లోపానికి కారణాలు..చిన్నారుల్లో పోషకాహార లోపానికి అనేక కారణాలు ఉన్నాయి. శిశువులకు తల్లిపాలు అందకపోవడం మొదలుకొని ఆహార భద్రతలేమి వరకు గల పలు కారణాలు చిన్నారులకు తీరని శాపంగా మారుతున్నాయి. భారత్ సహా పలు దేశాల్లోని పిల్లలకు పేదరికం వల్ల ఎదిగే వయసులో ఉన్నప్పుడు తగినంత పోషకాహారం అందడంలేదు. కడుపు నింపుకోవడమే సమస్యగా ఉన్న కుటుంబాల్లోని చిన్నారులకు పోషకాహారం దొరకడం గగనంగా ఉంటోంది. ప్రపంచవ్యాప్తంగా ఆరునెలల లోపు వయసు ఉన్న శిశువుల్లో 44 శాతం మందికి మాత్రమే తల్లిపాలు అందుతున్నాయి. మన దేశంలో ఇదే వయసులో ఉన్న శిశువుల్లో దాదాపు 55 శాతం మందికి తల్లిపాలు అందుతున్నట్లు ‘ఎన్ఎఫ్హెచ్ఎస్–5’ గణాంకాలు చెబుతున్నాయి. బాల్యంలో పోషకాహార లోపం వల్ల ఎన్నో సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా అవి:– కండరాలు పెరగక బాగా బక్కచిక్కిపోతారు.– ఎదుగుదల లోపించి, వయసుకు తగినంతగా పెరగరు.– పెద్దయిన తర్వాత డయాబెటిస్, హైబీపీ, గుండెజబ్బులు, ఎముకల బలహీనత, రకరకాల క్యాన్సర్లు వంటి ఆరోగ్య సమస్యలకు లోనవుతారు.డైటరీ సప్లిమెంట్ల ఉపయోగాలు..మూడు పూటలా క్రమం తప్పకుండా భోజనం చేసినా, మన శరీరానికి కావలసిన సూక్ష్మపోషకాలు తగినంత మోతాదులో అందే అవకాశాలు తక్కువ. అందువల్ల వైద్య నిపుణులను సంప్రదించి, వయసుకు తగిన మోతాదుల్లో సూక్ష్మపోషకాలను అందించే డైటరీ సప్లిమెంట్లను తీసుకోవడం మంచిది. ముఖ్యంగా చిన్నారులకు విటమిన్–ఎ, ఐరన్ సప్లిమెంట్లు ఎక్కువగా అవసరమవుతాయి. విటమిన్–ఎ సప్లిమెంట్ను చిన్నప్పటి నుంచి తగిన మోతాదులో ఇస్తున్నట్లయితే, కళ్ల సమస్యలు, దృష్టి లోపాలు రాకుండా ఉంటాయి.ఐరన్ సప్లిమెంట్లు ఇచ్చినట్లయితే, రక్తహీనత వంటి సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. అన్ని పోషకాలు సమృద్ధిగా దొరికే ఆహారం తీసుకోవడం, అవసరం మేరకు డైటరీ సప్లిమెంట్లు తీసుకోవడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. మంచి ఆరోగ్యం కోసం రోజువారీ భోజనంలో కూరగాయలు, ఆకుకూరలు, గింజ ధాన్యాలు, పప్పు ధాన్యాలు ఎక్కువ పరిమాణంలో ఉండేలా చూసుకోవాలి. వీటికి తోడు కొద్ది పరిమాణంలో నట్స్, డ్రైఫ్రూట్స్, పండ్లు, పెరుగు ఉండేలా చూసుకోవాలి. నూనెలు, ఇతర కొవ్వు పదార్థాలు, ఉప్పు అవసరమైన మేరకే తప్ప ఎక్కువగా వాడకుండా ఉండాలి.పిల్లల ఆహారంలో తప్పనిసరిగా ఉండాల్సినవి..ఎదిగే వయసులో ఉన్న చిన్నారులు పుష్టిగా ఎదగాలంటే, వారి ఆహారంలో తగినన్ని పోషకాలు ఉండాలి. వారు తినే ఆహారం తేలికగా జీర్ణమయ్యేలా కూడా ఉండాలి. పిల్లలకు అందించే ఆహారంలో తప్పనిసరిగా ఉండాల్సిన పదార్థాలు ఇవి:– పిల్లల భోజనంలో పప్పుధాన్యాలు, గింజధాన్యాలు, నూనెగింజలు, కూరగాయలు, ఆకుకూరలు, కాలానికి తగిన పండ్లు, గుడ్లు, పాలు, పెరుగు తప్పనిసరిగా ఉండాలి.– పిల్లలు చురుకుగా ఉండటానికి, ఆరోగ్యకరంగా ఎదగడానికి వారిని ఆరుబయట ఆటలు ఆడుకోనివ్వాలి. శారీరక వ్యాయామం చేసేలా, ఆటలాడేలా, ఇంటి పనుల్లో పాలు పంచుకునేలా పిల్లలను ప్రోత్సహించాలి.– పిల్లలకు ఆరోగ్యకరమైన అలవాట్లు నేర్పించాలి. వారు వ్యక్తిగత శుభ్రత పాటించేలా అలవాటు చేయాలి.– అతిగా తినడం, వేళాపాళా లేకుండా తినడం వంటి అలవాట్లను చిన్న వయసులోనే మాన్పించాలి. ఈ అలవాట్లను నిర్లక్ష్యం చేస్తే పిల్లలు స్థూలకాయం బారినపడే ప్రమాదం ఉంటుంది.– ఉప్పు, చక్కెర, కొవ్వు పదార్థాలు మితిమీరి ఉండే జంక్ఫుడ్కు పిల్లలు దూరంగా ఉండేలా చూడాలి.కుకింగ్ క్లాసెస్తో.. "విద్యార్థులకు ఆకు కూరలు, కూరగాయలు, పళ్లు, ఇతర ఆహారపదార్థాల్లోని పోషకవిలువల పట్ల అవగాహన కల్పించేందుకు హైదరాబాద్లోని విద్యారణ్య, ఓక్రిజ్ స్కూళ్లలో కుకింగ్ క్లాసెస్నూ నిర్వహిస్తున్నారు." – అడ్డు కిరణ్మయి, సీనియర్ న్యూట్రిషనిస్ట్, లైఫ్స్టైల్ కన్సల్టంట్ -
కష్టాలకు గొడుగు పట్టారు
కేరళలోని అట్టపాడి గిరిజనప్రాంతంలో నవజాత శిశువుల మరణాలు అనేకం చోటు చేసుకున్నాయి. కారణం పౌష్టికాహార లోపం. పోషకాలు ఇచ్చే అటవీ ఆహారం నశించిపోయి గర్భిణులకు తిండి కరువైంది. దాంతో ఒక స్వచ్ఛంద సంస్థ వారిని గొడుగుల తయారీలో శిక్షణ ఇచ్చింది. 2015 నుంచి ‘కార్తుంబి’ (తూనీగ) అనే బ్రాండ్ కింద ఆ గిరిజన మహిళలు తయారు చేస్తున్న గొడుగులు దేశమంతా అమ్ముడుపోతున్నాయి. తాజాగా ప్రధాని మోడి తన ‘మన్ కీ బాత్’లో వీరిని శ్లాఘించారు. కర్తుంబి గురించి....‘కేరళ సంస్కృతిలో గొడుగులు ఒక భాగం. అక్కడి కార్తుంబి గొడుగుల గురించి నేను ప్రస్తావించ దలుచుకున్నాను. రంగు రంగుల ఆకర్షణీయమైన ఈ గొడుగులను ఆదివాసి మహిళలు తయారు చేస్తారు. కేరళలోని చిన్న పల్లె నుంచి తయారయ్యే ఈ గొడుగులు నేడు పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలకు చేరుతున్నాయి. ఓకల్ ఫర్ లోకల్కు ఇంతకుమించిన ఉదాహరణ ఏం కావాలి’ అని జూన్ 30న తన 111వ ‘మన్ కీ బాత్’లో ప్రధాని మోడి కర్తుంబి గొడుగుల గురించి చేసిన ప్రస్తావన అక్కడి గిరిజన మహిళల ముఖాన చిర్నవ్వులు తేవడమే కాదు దేశవ్యాప్తంగా వారు సాగిస్తున్న కృషిని తెలిపింది. చాలామంది నేడు కార్తుంబి గొడుగుల గురించి తెలుసుకుంటున్నారు. ఆ గాథతో స్ఫూర్తి పొందుతున్నారు.పాలక్కాడ్లో గిరిజనులుపాలక్కాడ్లోని లోపలి పల్లెల్లో ముడుగ, ఇరుల, కర్ముగ తదితర గిరిజనులు ఉంటారు. చాలా ఏళ్లపాటు వీరికి డబ్బు అవసరం ఏర్పడలేదు. అటవీ ఆహారమే వీరి ఆహారం. అయితే 2012 నుంచి ఈప్రాంతంలో నవజాత శిశువుల మరణాలు ఎక్కువగా నమోదవడం స్వచ్ఛంద సంస్థలు గమనించాయి. 2012 నుంచి 2015 వరకు ఇక్కడ అనధికారికంగా 200 శిశుమరణాలు జరిగి ఉంటాయని అంచనా. ఇందుకు కారణం గర్భిణులకు పౌష్టికాహారం లేకపోవడమే. ‘మేము తినే కందమూలాలు, పండ్లు, ఆకుకూరలు ఇప్పుడు అడవుల్లో లేవు. క్రూరమృగాల భయం వల్ల మేము వ్యవసాయం చేయము. మాకు అంతిమంగా డబ్బుతో అవసరం ఏర్పడింది. అది మా దగ్గర లేదు. కాబట్టి మేము ఆహారం కొనుక్కుని తినే పరిస్థితుల్లో లేము’ అని అక్కడ మహిళలు చె΄్పారు. దాంతో పాలక్కాడ్లో గిరిజనుల కోసం పని చేసే ‘తంపు’ అనే స్వచ్ఛంద సంస్థ వీరి సమస్యను లోకానికి తెలియచేసింది. గల్ఫ్లో పని చేస్తున్న కేరళీయుల బృందం వీరి సాయానికి ముందుకు వచ్చింది. ఫలితంగా ఏర్పడిందే ‘కార్తుంబి’ గొడుగుల బ్రాండ్.రంగుల తూనీగపాలక్కాడ్లో పిల్లల కోసం పని చేసే ఒక సంస్థ ‘కార్తుంబి’ (తూనీగ) పేరుతో అందరికీ తెలుసు. అందరినీ ఆకర్షించే ఈ పేరుతోనే బ్రాండ్ ఏర్పాటు చేసి ఆదివాసీ మహిళలకు గొడుగుల తయారీలో శిక్షణ ఇచ్చారు. మొదట 70 మందిని ఎంపిక చేసి వారికి మెటీరియల్ సరఫరా చేస్తే గొడుగులు ఎలా చేయాలో నేర్పారు. ఆ తర్వాత వారు తమ రోజువారీ పనులు చేసుకుంటూనే ఇంట్లో వీలైనప్పుడల్లా గొడుగులు తయారు చేసే వెసులుబాటు ఇచ్చారు. ఒక గొడుగు తయారు చేస్తే 30 రూపాయల కూలీతో ఈ పని మొదలైంది. 2017 నుంచి కేరళ గిరిజన సంక్షేమ శాఖ ఫండ్ రిలీజ్ చేస్తోంది. వీరి నుంచి తయారైన గొడుగులు వివిధ సంస్థల ద్వారా మార్కెటింగ్ అవుతున్నాయి.సీజన్లో 17 వేల గొడుగులు70 మంది మహిళలతో మొదలైన ఈ పని నేడు 350 గిరిజన మహిళలకు చేరుకుంది. వీరు జనవరి నుంచి మే చివరి వరకు మాత్రమే పని చేస్తారు. జూన్ మొదటి వారంలో మాన్సూన్ రావడంతో గొడుగుల అమ్మకాలు ఉంటాయి కాబట్టి. ఒక సీజన్లో వీరంతా కనీసం 17 వేల గొడుగులు తయారు చేస్తున్నారు. ఒక్కొక్క మహిళ రోజుకు 700 నుంచి వేయి రూపాయల వరకు సంపాదిస్తుంది. ఈ త్రీఫోల్డ్ గొడుగులు మెటీరియల్ను బట్టి 350 రూపాయల నుంచి 649 రూపాయల వరకూ అందుబాటులో ఉన్నాయి.గొడుగుల దానంచలికాలంలో రగ్గుల దానం ఎంత అవసరమో వానాకాలంలో గొడుగుల దానం అంత అవసరం. కార్తుంబి గొడుగుల మార్కెటింగ్ కోసం ఒక టెకీ సంస్థ కార్పొరేట్ సంస్థలను సంప్రదించి వారిచేత గొడుగులు కొనేలా చేస్తోంది. ఉద్యోగులకు, పేదవారికి ఉచితంగా ఇచ్చేలా చూస్తుంది. అలాగే కేరళలో వానాకాలంలో స్కూళ్లకు వచ్చిపోయే పేద పిల్లలకు గొడుగులు చాలా అవసరం. అందుకే ‘స్కూలు పిల్లలకు కార్తుంబి గొడుగులు’ పేరుతో కూడా క్యాంపెయిన్లు జరుగుతుంటాయి. సీజన్ మొదట్లో బల్క్గా ఈ గొడుగులు కొని పిల్లలు పంచుతుంటారు చాలామంది. ఇప్పుడు ప్రధాని ప్రసంగం వల్ల కేరళలోని ఇతర మహిళలు కూడా ఈ గొడుగుల తయారీ పట్ల ఆసక్తి చూపుతున్నారు. రాబోయే రోజుల్లో వానలొస్తే రంగు రంగుల కార్తుంబి తూనీగలు ప్రతి ఒక్కరి నెత్తిమీద ఎగురుతుంటాయని ఆశిద్దాం. -
పొగచూరుతున్న బాల్యం!
సాక్షి, హైదరాబాద్: వాయు కాలుష్యంతో పసి మొగ్గలు రాలిపోతున్నాయి. ఐదేళ్లలోపు పిల్లల ఊపిరితిత్తులు వాయు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. ఫలితంగా దేశంలో రోజూ సగటున 464 మంది మృత్యువాత పడుతున్నారు. అమెరికాకు చెందిన లాభాపేక్షలేని పరిశోధనా సంస్థ ‘హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్స్టిట్యూట్’తొలిసారిగా ‘స్టేట్ ఆఫ్ ది గ్లోబల్ ఎయిర్–2024’ నివేదికను విడుదల చేసింది. అందులోని ముఖ్యాంశాలివీ..పిల్లలకు న్యుమోనియా, పెద్దలకు ఆస్తమామానవ ఆరోగ్యంపై పీఎం (పర్టిక్యులేట్ మ్యాటర్)–2.5, నైట్రోజన్ డయాక్సైడ్ తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. గాలి కాలుష్యంతో పిల్లలు న్యుమోనియా బారిన, పెద్దలు ఆస్తమా బారిన పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా గత ఏడాది కాలంలో వాయు కాలుష్యం సంబంధమైన వ్యాధుల కారణంగా 81 లక్షల మంది మరణించగా.. ఇందులో 7 లక్షల మంది ఐదేళ్లలోపు చిన్నారులే. ఇందులో సుమారు 5 లక్షల మంది పిల్లలు గృహాల నుంచి విడుదలయ్యే కాలుష్యం కారణంగానే మృత్యువాతపడ్డారు. ఇక, మన దేశంలో 21 లక్షల మంది చనిపోగా.. అత్యధికంగా చైనాలో 23 లక్షల మంది కన్నుమూశారు.శ్వాస, నాడీ వ్యవస్థలపై ప్రభావం అడ్డూఅదుపు లేని మానవ చర్యల కారణంగా వాయు కాలుష్యం నానాటికీ పెరిగిపోతోంది. స్వచ్ఛమైన గాలి కరువైపోతోంది. ఫలితంగా అనునిత్యం భారీగా కాలుష్యకారకాలు ఊపిరితిత్తుల్లోకి చేరిపోతున్నాయి. ప్రధానంగా ఇది చిన్నారులపై తీవ్ర దుష్ర్పభావాన్ని చూపిస్తోంది. ఎదుగుతున్న దశలో ఉన్న వారి శ్వాస, నాడీ వ్యవస్థలను దెబ్బతీసి, ప్రాణసంకటంగా మారుతోంది. ఐదేళ్ల లోపు చిన్నారుల మరణాలకు ప్రధాన కారణం పోషకాహార లోపం కాగా.. రెండో అత్యంత ప్రమాదకారి వాయు కాలుష్యమే. ముఖ్యంగా ఐదేళ్లలోపు చిన్నారులు నెలలు నిండకముందే పుట్టడం, తక్కువ బరువుతో జని్మంచడం, ఉబ్బసం, ఊపిరితిత్తుల వ్యాధులు వంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు.ప్రమాద ఘంటికలిలా.. ⇒ బాల్యంలో అధిక మోతాదులో వాయు కాలుష్యం బారినపడితే పెద్దయ్యాక గుండె జబ్బుల ముప్పు పెరుగుతుంది. ⇒ వాయు కాలుష్యం ఎక్కువైతే చిన్నారుల్లో మెదడు, నాడీ వ్యవస్థలో వృద్ధి మందగిస్తుంది. విషయ పరిజ్ఞాన సామర్థ్యం తగ్గుతుంది. ⇒ఉబ్బసం ముప్పు పెరుగుతుంది. చిన్నతనంలోనే కేన్సర్ వచ్చే ప్రమాదం లేకపోలేదు. ⇒నవజాత శిశువులకు ఇళ్లల్లోని వాయు కాలుష్యం ముప్పు ఎక్కువ. ⇒ గర్భిణీలు కలుíÙతమైన గాలికి గురైతే.. వారికి నెలలు నిండకుండానే కాన్పు అయి తక్కువ బరువుతో శిశువులు జన్మించే ప్రమాదం ఉంది.ఏం చేయాలంటే.. ⇒ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నిర్దేశించిన వాయు నాణ్యత ప్రమాణాలను చేరుకోవడానికి ప్రభుత్వాలు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగాలి. ⇒ శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించాలి. ఇంధన సమర్థతను పెంచడంపై పెట్టుబడులు పెంచాలి. ⇒ పునరి్వనియోగ వనరులకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. ⇒ బహిరంగంగా వ్యర్థాలను కాల్చడం తగ్గించాలి. వ్యర్థాల నిర్వహణ మెరుగుపడాలి. ⇒ రద్దీగా ఉండే రోడ్లు, కర్మాగారాలు, థర్మల్ విద్యుత్ కేంద్రాలు వాయు కాలుష్యానికి ప్రధాన కారణం. కాబట్టి విద్యా సంస్థలు, క్రీడా మైదానాలు వీటికి దూరంగా ఏర్పాటు చేస్తే చిన్నారులను ఈ విషతుల్య వాయువుల నుంచి కాపాడొచ్చు. ⇒ రహదారుల వెంబడి ఆక్సిజన్ జనరేటర్లు, బూస్టర్లను ఏర్పాటు చేయాలి. ⇒ఎలక్ట్రిక్ వాహనాలను లేదా సాధ్యమైనంత వరకు ప్రజా రవాణా వ్యవస్థలను వినియోగించాలి. -
ఇంతుల ఆరోగ్యం మరింత మెరుగ్గా...
కుటుంబ సంరక్షణలో తలమునకలయ్యే మహిళలు సొంత ఆరోగ్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుంటారు. సరైన పద్ధతిలో ఆహారం తీసుకోకపోవడం... అందులోనూ పోషకాహారం లోపించడం... అవసరమైన మేరకు వ్యాయామం లేకపోవడం... సమయపాలన పాటించకపోవడం... ఇలాంటి సమస్యల వల్ల వారు లేనిపోని రుగ్మతలకు గురవుతుంటారు.నిత్యం వ్యాయామం లేకపోయినా... ఓ పద్ధతిలో ఆహారం తీసుకోవడం ద్వారా ఫిట్గా ఉండటానికి కొన్ని పద్ధతులు పాటించాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) చెబుతోంది. అందుకోసం ఓ డైట్ చార్ట్ను కూడా రూపొందించింది. దీని ద్వారా వారు చాలా వరకూ ఆరోగ్యవంతులుగా ఉండవచ్చని అభిప్రాయపడింది.సాక్షి, అమరావతి: మహిళలు సంపూర్ణ పోషకాలు పొందేలా ప్రత్యేక ఆహారాన్ని తీసుకోవడం ద్వారా పూర్తి ఆరోగ్యవంతులుగా ఉండవచ్చని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసర్చ్(ఐసీఎంఆర్) చెబుతోంది. ఇందుకోసం రోజుకు 1670 కిలో కేలరీలు అందించే భోజనాన్ని సిఫారసు చేస్తోంది. తాము చేసే సూచనల ద్వారా బరువును అదుపులో ఉంచడంతో పాటు గుండె జబ్బులు, మధుమేహం, కొన్ని రకాల క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులనుంచి దూరంగా ఉండవచ్చని చెబుతోంది. వంట చేయడానికీ ఓ పద్ధతుందిదేశంలో 56.4శాతం వ్యాధులు అనారోగ్యకర ఆహారపు అలవాట్లతోనే వస్తున్నాయని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్(ఎన్ఐఎన్) చెబుతోంది. ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల స్థూలకాయం, మధుమేహం, కరోనరీ హార్ట్ డిసీజ్ వంటి వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయని స్పష్టం చేసింది. సమతుల్య ఆహారంతో పాటు రోజువారీ దినచర్యల్లో చిన్నపాటి శారీరక శ్రమ తప్పనిసరిగా అలవర్చుకోవాలని ఐసీఎంఆర్ సూచిస్తోంది. ముఖ్యంగా మెట్లు ఎక్కడం, విరామ సమయంలో చిన్నపాటి నడక, శరీర కదలికలతో కూడిన ఇంటి పనులు చేయాలని అభిప్రాయపడింది. తగినంత సమయం నిద్రపోవడం, శారీరక, మానసిక ఆరోగ్యానికి హాని కలిగించే ఆహారానికి దూరంగా ఉండాలని చెబుతోంది. దీనికోసం వంట చేయడానికి ఓ పద్ధతి అవసరమని స్పష్టం చేసింది. తినే ఆహారాన్ని స్టీమింగ్, ఉడకబెట్టడం, బేకింగ్ వంటి పద్ధతుల్లో వండాలనీ తద్వారా పోషక విలువలు కాపాడుకోవచ్చని వివరించింది.ఐసీఎంఆర్ సిఫారసు చేసిన డైట్ ఇలా..⇒ అల్పాహారం కోసం (ఉదయం 8–10 గంటల మధ్య): నానబెట్టిన/ఉడకబెట్టిన తృణధాన్యాలు(60గ్రా), ఉడకబెట్టిన నలుపు/ఎరుపు బీన్స్, లోబియా(బ్లాక్–ఐడ్ బఠానీలు)/చిక్పీస్(30గ్రా), పచ్చి ఆకు కూరలు(100గ్రా), గింజల(20గ్రా)తో కూడిన భోజనం చేయాలని. దీనిద్వారా ఉదయం 470 కిలో కేలరీలు లభ్యమవుతాయి.⇒ మధ్యాహ్న భోజనం (మధ్యాహ్నం 1–2 గంటల మధ్య): తృణధాన్యాలు(80గ్రా), గింజలు/విత్తనాల నూనెలతో వండిన కూరగాయలు(150గ్రా), పప్పు/మాంసం(20గ్రా), పెరుగు/పనీర్(150 మి.లీ), చివర్లో పండ్లు (50గ్రా) తిసుకోవాలి. ఈ భోజనం రోజుకు 750 కిలో కేలరీలు అందజేస్తుంది.⇒ సాయంత్రం స్నాక్స్ కోసం (సాయంత్రం 5 గంటలకు): శరీరానికి శక్తిని అందించడానికి ఎల్లప్పుడూ ఒక గ్లాసు పాలు తాగడం మంచిది. 50 మిల్లీలీటర్ల పాలు ఒక మహిళ శరీరానికి 35 కిలో కేలరీలు అందిస్తుంది.⇒ రాత్రి భోజనం (రాత్రి 7–8 గంటల మధ్య): మధ్యాహ్నం మాదిరిగానే రాత్రి భోజనంలో తృణధాన్యాలు(60గ్రా), పప్పులు (15గ్రా), గింజలు/విత్తనాల నూనె (5గ్రా), పెరుగు (100 మి.లీ), పండ్ల (50గ్రా)లో తీసుకోవాలి. ఇవి రోజుకు మొత్తం 415 కిలో కేలరీలు అందజేస్తాయని నివేదికలో పేర్కొంది. -
పేదల ఊసు పెద్దలకు పట్టదా?
భారతదేశంలో తీవ్రమైన ఆహార సంక్షోభం నెలకొని ఉంది. పౌష్టికాహార లోపంతో పిల్లలు, స్త్రీలు, బాలింతలు బాధపడుతున్నారు. కోట్లాది కార్మికులకు పనిలేదు. ఉద్యోగాలు లేక యువతకు పెళ్లిళ్ళు కూడా జరగడం లేదు. ఇదొక సామాజిక సమస్యగా రూపుదిద్దుకుంటోంది. బీజేపీ ఇచ్చిన ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాల హామీ అడ్రస్ గల్లంతైంది. మతం మనిషికి తిండి పెట్టదు అని ప్రజలు తెలుసుకుంటున్నారు. అలాంటి పార్టీతో చంద్రబాబు అంటకాగు తున్నారు. దేశంలో తమ పేరు మీద సాగుభూమి లేనివారు ఎందరో! ఊరు పేరేగాని ఊరిలో సెంటు భూమి లేదు. ‘ఇండియా’ కూటమి కూడా తన ప్రణా ళికలో భూమి పంపకాన్ని గురించి మాట్లాడకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. భూమి పంపకాన్ని నిరాకరించటం అంటే సామ్యవాదాన్ని నిరాకరించటమే!18వ సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్ 19 నుండి జూన్ 1 వరకు ఏడు విడతలుగా జరుగుతున్నాయి. తిరిగి మళ్లీ మూడోసారి అధికారంలోనికి రావడానికి మోదీ విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఏ ఉత్తరప్రదేశ్ మీద అయితే వాళ్లు ఎక్కువ ఆధారపడి ఉన్నారో అక్కడ సామాజిక రాజకీయ చైతన్యం పెల్లుబికింది. ముఖ్యంగా ముస్లింలలో ఎంతో మార్పు రావడం వల్లే రాయబరేలీలో రాహుల్ గాంధీ నిలబడటానికి పూనుకున్నారు. మతోన్మాద దాడులు, మహిళా సాధికారతను పునాదులతో తొలిచే భావజాలం, కార్పొరేట్ శక్తులకు దేశాన్ని తాకట్టు పెడుతున్న బీజేపీ విధానాలు లౌకికవాదులను, ఓబీసీలను, దళితులను, స్త్రీలను ఆలో చింపజేస్తున్నాయని చెప్పక తప్పదు. ముఖ్యంగా 370 ఆర్టికల్ రద్దు ద్వారా జమ్మూ కశ్మీర్ శాసనసభను రద్దుచేసి, ఆ రాష్ట్రాన్ని మూడు ప్రాంతాలుగా విడగొట్టిన ఉదంతాన్ని ప్రజాస్వామిక వాదులు అర్థం చేసుకుంటున్నారు. రాష్ట్రాల ఆదాయాన్ని తగ్గించి, జీఎస్టీ ద్వారా కేంద్రీకృత ఆర్థిక పెత్తనాన్ని పెంచి, రాష్ట్రాల ఉనికిని నామమాత్రం చేయా లని చేస్తున్న ప్రయత్నాలను కూడా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ముఖ్యంగా రాష్ట్రాలకు ప్రత్యేక హక్కులు కలిగిన భాష, సంస్కృతి, విద్య, విద్యుత్, మానవ వనరులపై కూడా కేంద్ర ప్రభుత్వమే పెత్తనం చేయాలనే చర్యలపై రాష్ట్ర ప్రభుత్వాలు చైతన్యవంతంగా ఆలోచిస్తు న్నాయి. ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలైన పత్రికల మీద చేస్తున్న దాడి బ్రిటిష్ వాళ్ళ కాలంలో కూడా జరగలేదని జర్నలిస్టు మేధావులు వాపోతున్నారు.ఏప్రిల్ చివరి వారంలో వచ్చిన ‘గ్లోబల్ రిపోర్ట్ ఆన్ ఫుడ్ క్రైసిస్’ ప్రకారం, భారతదేశంలో తీవ్రమైన ఆహార సంక్షోభం నెలకొని ఉంది. పౌష్టికాహార లోపంతో పిల్లలు, స్త్రీలు, బాలింతలు బాధపడుతు న్నారు. అత్యధిక స్త్రీలు రక్తలేమితో ఇబ్బంది పడుతున్నారు. కోట్లాది మంది కార్మికులకు పనిలేదు. భారతదేశం మొత్తం వలసలతో అన్నా ర్తులై పొట్ట చేత పట్టుకుని నగర శివారుల్లోని మురికివాడలలో జీవిస్తు న్నారు. నిజానికి పంజాబ్ రైతులు చేసిన రైతు ఉద్యమ ప్రభావం భారతదేశం మొత్తం మీద ఉంది. సంయుక్త కిసాన్ మోర్చా హోరా హోరీ రైతు ఉద్యమాన్ని నడిపింది. కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ చట్టా లను రద్దు చేయాలనే డిమాండ్పై రాజీలేని పోరాటం చేసింది.ముఖ్యంగా అడవుల నరికివేత వల్ల, నీటిపారుదల ప్రాజెక్టులకు ప్రోత్సాహం ఇవ్వకపోవడం వల్ల దేశంలో తీవ్రంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మండుటెండల్లో ప్రజలు ఆహారం కోసం పని చేయాల్సిన పరిస్థితులు వచ్చాయి. మతం మనిషికి అన్నం పెట్టదు అని ప్రజలు తెలుసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా భారతదేశంలో 75 సంవత్సరాల స్వాతంత్య్రం తరువాత కూడా గ్రామాలలో మంచి నీళ్ళు దొరకడం లేదు. మద్యాన్ని అందించటంలో సఫలమైన ప్రభు త్వాలు, మంచినీళ్లు అందించడంలో విఫలమయ్యాయి.ఇకపోతే దేశంలో నిరుద్యోగం విలయ తాండవం చేస్తోంది. ఉద్యో గాలు లేక యువతకు పెళ్లిళ్ళు కూడా జరగడం లేదు. ఇదొక సామాజిక సమస్యగా రూపుదిద్దుకుంటోంది. కాగా ఎన్నికల నేపథ్యంలో నిరు ద్యోగం ప్రధాన అంశంగా చర్చకొస్తోంది. ప్రతిపక్ష నేతలు నిరుద్యోగ సమస్యపై నిలదీస్తుండగా అధికార బీజేపీ నేతలు సమస్యను పూర్తిగా పక్కన పెట్టేశారు. ప్రధాని మోదీ ప్రసంగాలు, బీజేపీ మేనిఫెస్టో యువతకు భరోసా కల్పించలేదు. పైగా ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాల హామీ అడ్రస్ గల్లంతైంది. నిరుద్యోగ రేటు పెరగడం ఆందోళన కలిగించే విషయం. ఇకపోతే ‘ఇండియా’ కూటమి కూడా తన ప్రణాళికలో భూమి పంపకాన్ని గురించి మాట్లాడకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే భారతదేశంలో కోట్లాది మందికి సాగుభూమి సెంటు కూడా లేదు. ఊరు పేరేగాని ఊరిలో సెంటు భూమి లేదు. ఇంటి స్థలం లేదు. మంచినీళ్ల వసతి లేదు. చనిపోతే పాతిపెట్టడానికి శ్మశానం లేదు. దేశంలోని సుమారు 7 లక్షల గ్రామాల్లో అంటరానితనం కొనసాగు తూనే వుంది. భారతదేశంలో దళితులు ఆర్థిక సామాజిక రాజకీయ న్యాయం లేక పేదరికంలో, అస్పృశ్యతలో, అవిద్యలో మగ్గిపోతున్నారు. బీటెక్లు, ఎంటెక్లు, బీఏలు, ఎంఏలు చదివినా నిరుద్యోగు లుగా, ఉపాధి హామీ కూలీలుగా జీవిస్తున్నారు. ఈ రోజున దళిత వాడల్లో విద్యార్థులు, స్త్రీలు నిరాశా నిస్పృహలలో జీవిస్తున్నారు. వారి కుటుంబానికి తలా రెండెకరాల భూమి ఇవ్వటం ద్వారా ఆర్థిక సాధికారతను కల్గిస్తాం అని ఏ ప్రభుత్వమూ చెప్పటం లేదు. రాజకీయ పార్టీల మేనిఫెస్టోలు అంబేడ్కర్ ఆలోచనకు భిన్నంగా ఉన్నాయి.భూమి పంపకాన్ని నిరాకరించటం అంటే సామ్యవాదాన్ని నిరాకరించటమే. ఇప్పుడు ఎన్నికల్లో ప్రకటించిన ఏ మేనిఫెస్టోలో కూడా భూమి పంపకం గురించి రాయక పోవటం, అస్పృశ్యతా నివా రణ ఒక ఎన్నికల ఎజెండాగా లేకపోవటం, కుల నిర్మూలన కార్యక్రమం ఎవరి లక్ష్యంగా లేకపోవటాన్ని దళిత మేధావులు, ఆలోచనాపరులు అర్థం చేసుకుంటున్నారు. రాజ్యాధికారమే వీటన్ని టికీ పరిష్కారం అని ఆలోచిస్తున్నారు. నిజానికి ప్రసిద్ధమైన కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో, ఐఐటీల్లో, వైద్య విశ్వవిద్యాలయాల్లో, అన్ని కళా శాలల్లో దళిత విద్యార్థులు ఎంతో వివక్షకు గురి అవుతున్నారు.మోదీ ఇంత తిరోగమన చర్యలతో ముందుకు వెళ్తుంటే, నారా చంద్రబాబు నాయుడు ఎన్డీయే కూటమిలో చేరటం ఆయనకున్న దళిత వ్యతిరేకతనూ, హిందూ మతోన్మాద భావజాలాన్నీ, కులాధి పత్య వైఖరినీ, మైనారిటీల పట్ల ద్వేషాన్నీ తెలియజేస్తున్నాయి. చంద్రబాబు నాయుడుకూ, మోదీకీ మధ్య భావజాలంలో, దళితులు, స్త్రీల పట్ల వ్యతిరేకతలో ఏ విధమైన తేడాలేదు అని అర్థం అవుతోంది. ముఖ్యంగా మోదీ యూనివర్సిటీల్లో జీవపరిణామ, మానవ పరిణామ చారిత్రక సిద్ధాంతాల బోధనకు భిన్నంగా మతవాద భావజాలాన్ని ప్రోత్సహించటం లౌకిక భావజాల వ్యాప్తికి గొడ్డలి పెట్టు అవుతుంది.ఇకపోతే అంబేడ్కర్ భావజాల ప్రచారంలో తమిళనాడు ముందుంది. తమిళనాడులోని అన్ని థియేటర్లలో సినిమా ప్రారంభంలో అంబేడ్కర్ జీవిత పోరాటం గురించి ఐదు నిమిషాల నిడివిగల డాక్యుమెంటరీ ప్రదర్శించాలని అక్కడి ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ ఆదేశించారు. అంబేడ్కర్ ఆ రాజ్యాంగం ద్వారానే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ముఖ్యమంత్రులు ప్రధానులు, రాష్ట్రపతులు అవుతున్నారని గ్రహించాలి.అంబేడ్కర్ రాజ్యాంగం భారతదేశ పునర్ నిర్మాణానికి ఆయువు పోసింది. ఏ దేశంలో స్త్రీ వ్యక్తిత్వంతో జీవిస్తుందో, ఏ దేశంలోకుటుంబ వ్యవస్థ బలంగా నిలబడుతుందో, ఏ దేశంలో స్త్రీ ఉత్పత్తి శక్తి దేశ సౌభాగ్యానికి ఊపిరి పోస్తుందో ఆ దేశం ఆర్థిక సంపదవున్న ప్రపంచ పంక్తిలో నిలబడగలుగుతుంది. నిజానికి అంబేడ్కర్ అడుగు అడుగులో స్త్రీ సమానత్వం కోసం పోరాడారు. వారి అభ్యున్నతి కోసం, వారి విద్యాభ్యాసం కోసం, వారి సాధికారిత కోసం, వారి భావ చైతన్యం కోసం, వారి రాజకీయ హక్కుల కోసం పోరాడారు. హిందూ కోడ్ బిల్లు విషయంలో మొదటిసారిగా కేంద్ర ప్రభుత్వంలో న్యాయ శాఖ మంత్రిగా రాజీనామా చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి హిందూ కోడ్ బిల్లును సాధించారు. ఈనాడు ప్రభుత్వాలు స్త్రీ సాధికారితను నిలబెట్టాలి అంటే నిరుద్యోగులయిన స్త్రీలకు ఉద్యోగ వసతి కల్పించాలి. విధవరాండ్రకు నెలకు పది వేల రూపాయల పింఛన్ ఇవ్వ గలిగిన స్థాయికి రావాలి. ప్రతి దళిత స్త్రీకి రెండు ఎకరాల భూమి ఇచ్చి భారతదేశంలో వ్యవసాయ విస్తృతికి కృషి చేయాలి. ఇంటింటికీ మంచినీటి వసతి, విద్యుత్ వసతి కల్పించి, ఆరోగ్య సంరక్షణ కోసం పౌష్టికాహారాన్ని అందించి స్త్రీ శారీరక మానసిక శక్తిని పెంచి దేశ సౌభాగ్యానికి బాటలు వేయాలి. డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకులు ‘ 98497 41695 -
ప్రపంచ ఆకలి సూచీలో...మనకు 111వ స్థానం
న్యూఢిల్లీ: ప్రపంచ ఆహార సూచీ–2023లో భారత్ 111వ స్థానంలో నిలిచింది. గురువారం విడుదల చేసిన ఈ సూచీలో మొత్తం 125 దేశాల్లో మనకు ఈ ర్యాంకు దక్కింది. దీన్ని లోపభూయిష్టమైనదిగా కేంద్రం కొట్టిపారేసింది. ‘ఇది తప్పుడు ర్యాంకింగ్. దురుద్దేశపూర్వకంగా ఇచ్చిన బాపతు‘ అంటూ మండిపడింది. అన్ని రకాలుగా పీకల్లోతు సంక్షోభంలో మునిగిన పాకిస్తాన్ (102), అంతే సంక్షోభంలో ఉన్న శ్రీలంక (60)తో పాటు బంగ్లాదేశ్ (81), నేపాల్ (61) మనకంటే చాలా మెరుగైన ర్యాంకుల్లో ఉండటం పట్ల ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. 28.7 స్కోరుతో ఆకలి విషయంలో భారత్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని నివేదిక చెప్పుకొచ్చింది. 27 స్కోరుతో దక్షిణాసియా, సహారాకు దక్షిణాన ఉన్న ఆఫ్రికా ప్రాంతాలు ఆకలి సూచీలో టాప్లో ఉన్నట్టు చెప్పింది. ‘భారత బాలల్లో పౌష్టికాహార లోపం తీవ్రంగా 18.7గా ఉంది. ఐదేళ్లలోపు పిల్లల్లో మరణాల రేటు 3.1 శాతం, 15–24 ఏళ్ల లోపు మహిళల్లో రక్తహీనత ఉన్నవారి సంఖ్య ఏకంగా 58.1 శాతం ఉన్నాయి‘ అని పేర్కొంది. వాతావరణ మార్పులు, కల్లోలాలు, మహమ్మారులు, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం వంటివి ఆకలి సమస్యను ఎదుర్కోవడంలో అవరోధాలుగా నిలిచాయని సర్వే పేర్కొంది. ఇదంతా అభూత కల్పన అంటూ కేంద్రం మండిపడింది. ‘ఇది తప్పుడు పద్ధతులు వాడి రూపొందించిన సూచీ. కేవలం 3,000 మందిపై నిర్వహించిన ఒపీనియన్ పోల్ ఆధారంగా పౌష్టికాహార లోపం శాతాన్ని నిర్ధారించడం క్షమార్హం కాని విషయం. దాంతో బాలల్లో వాస్తవంగా కేవలం 7.2 శాతమున్న పౌష్టికాహార లోపాన్ని ఏకంగా 18.7గా చిత్రించింది. దీని వెనక దురుద్దేశాలు ఉన్నాయన్నది సుస్పష్టం‘ అంటూ విమర్శించింది. -
‘సంపూర్ణ’ ఆరోగ్యం
సాక్షి, అమరావతి: ఆరోగ్యవంతమైన భావి తరాల కోసం వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ కార్యక్రమాలను మరింత బలోపేతం చేసినట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. డబ్బులకు వెనుకాడకుండా ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఖర్చు చేస్తూ గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నట్లు చెప్పారు. డ్రై రేషన్ కింద అందించే సరుకుల నాణ్యతను నిరంతరం సమీక్షిస్తూ ఎప్పటికప్పుడు పరీక్షించాలని అధికారులను ఆదేశించారు. ఫౌండేషన్ స్కూళ్లలో చిన్నారుల బోధనపై ప్రత్యేకంగా దృష్టి సారించి ఆంగ్ల భాషలో పరిజ్ఞానం, ఉచ్చారణ బాగుండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గర్భిణులు, బాలింతల కోసం వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ టేక్ హోం రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని సీఎం జగన్ బుధవారం తన క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించి లబ్ధిదారులకు స్వయంగా సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా మహిళా శిశు సంక్షేమ కార్యకలాపాలపై ముఖ్యమంత్రి జగన్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆ వివరాలివీ.. గతంతో పోలిస్తే ఐదు రెట్లు అధికంగా వ్యయం రక్తహీనత, పౌష్టికాహారలేమి రాష్ట్రంలో పూర్తి తొలగిపోవాలనే లక్ష్యంతో భారీ ఖర్చు గర్భిణిలు, బాలింతలు, చిన్నారుల పౌష్టికాహారం కోసం గత ప్రభుత్వం ఏడాదికి సుమారు రూ.450 – రూ.500 కోట్లు మాత్రమే ఖర్చు చేయగా ఇప్పుడు ఏటా సుమారు రూ.2,300 కోట్లు వ్యయం చేస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్ వెల్లడించారు. పౌష్టికాహారాన్ని అందించేందుకు వైఎస్సార్ సంపూర్ణ పోషణ కింద ఒక్కొక్కరికీ రూ.850 చొప్పున ఖర్చు చేస్తుండగా సంపూర్ణ పోషణ ప్లస్ కోసం రూ.1,150 చొప్పున వ్యయం చేస్తున్నట్లు చెప్పారు. రక్తహీనత, పౌష్టికాహార లేమి లాంటి సమస్యలు రాష్ట్రంలో పూర్తిగా తొలగిపోవాలన్న లక్ష్యంతో ఇంత ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాలన్నీ మంచి ఫలితాలనిచ్చేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఫ్యామిలీ డాక్టర్లు అంగన్వాడీల సందర్శన తప్పనిసరి ఫ్యామిలీ డాక్టర్లు గ్రామాలకు వెళ్లినప్పుడు తప్పనిసరిగా అంగన్వాడీలను సందర్శించాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. పిల్లలు, తల్లులు, బాలింతల ఆరోగ్యాన్ని పరిశీలించి ఏమైనా సమస్యలుంటే మంచి వైద్యాన్ని అందించాలని సూచించారు. బాలికా విద్య ప్రోత్సాహ పథకాలపై అవగాహన బాల్య వివాహాల నిరోధం, అక్షరాస్యత పెంపు, బాలికలు ఉన్నత చదువులు అభ్యసించేలా ప్రోత్సహించే లక్ష్యంతో తెచ్చిన అమ్మ ఒడి, కళ్యాణమస్తు, వసతి దీవెన, విద్యా దీవెన పథకాలు ఎలా ఉపయోగపడతాయో విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీతోఫా పథకాలు బాల్య వివాహాలను ఎలా నిరోధిస్తాయో వివరించాలన్నారు. కళ్యాణమస్తు కింద లబ్ధి పొందాలంటే వధూవరులు తప్పనిసరిగా పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలన్న నిబంధన అందుకే విధించామన్నారు. రాష్ట్రంలో వెనకబడ్డ ప్రాంతాల్లో ఇలాంటి కార్యక్రమాలపై ముమ్మరంగా ప్రచారం నిర్వహించాలని సూచించారు. అంగన్వాడీల్లో పరిశుభ్ర వాతావరణం అంగన్వాడీ కేంద్రాల్లో పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. ఇందుకోసం క్రమం తప్పకుండా తనిఖీలు చేయాలన్నారు. టాయిలెట్లు పరిశుభ్రంగా ఉండాలని, అంగన్వాడీ కేంద్రాలకు మరమ్మతుల సమయంలో ఈ అంశాన్ని ప్రాధాన్యతగా పరిగణించాలని సూచించారు. చిన్నారులకు బోధనలో నాణ్యతకు పెద్దపీట ఫౌండేషన్ స్కూల్ చిన్నారులకు విద్యా బోధనలో నాణ్యతకు పెద్దపీట వేయాలని సీఎం జగన్ పేర్కొన్నారు. ఇప్పుడున్న విద్యా విధానం కాకుండా ఇతర మార్గాలను కూడా పరిశీలించాలని సూచించారు. ఫౌండేషన్ స్కూల్ (పీపీ–1, పీపీ–2) పిల్లల్లో ఇంగ్లీషు భాషా పరిజ్ఞానం, ఫోనిటిక్స్, ఉచ్ఛారణ లాంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. నిర్దేశించుకున్న సిలబస్ను వినూత్న బోధనా విధానాలతో నేర్పించడంపై దృష్టి పెట్టాలని సూచించారు. పునాది బాగుంటే పై తరగతుల్లో సాఫీగా చిన్నారులకు మూడో తరగతి నుంచే టోఫెల్ పరీక్షకు శిక్షణ ఇచ్చే కార్యక్రమం మొదలైందని సీఎం జగన్ చెప్పారు. ఇప్పుడు పీపీ–1 నుంచి రెండో తరగతి పిల్లల మీద దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందన్నారు. పిల్లల మెదడు గరిష్టంగా వికసించే వయసు కాబట్టి వినూత్న బోధనా విధానాల ద్వారా మంచి భాషా జ్ఞానాన్ని అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ వయసులో పునాది గట్టిగా ఉంటే పై తరగతుల్లో విద్యార్థుల ప్రయాణం సాఫీగా సాగుతుందన్నారు. మాంటిస్సోరి విద్యా విధానంపై సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ చర్చించారు. అధికారులు తొలుత మాంటిస్సోరి స్కూళ్లను పరిశీలించాలని సూచించారు. సమీక్షలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి కేవీ ఉష శ్రీచరణ్, సీఎస్ డాక్టర్ కేఎస్ జవహర్రెడ్డి, మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి, ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఫెడరేషన్ ఎండీ ఏ.బాబు, పాఠశాల విద్యాశాఖ (మౌలిక వసతులు కల్పన) కమిషనర్ కాటమనేని భాస్కర్, పౌర సరఫరాల శాఖ ఎండీ జి.వీరపాండ్యన్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ జె.నివాస్, మహిళా శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ ఏ.విజయ సునీత తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ సంపూర్ణ పోషణతో నెలకు అందించే రేషన్ సరుకులు – 2 కిలోలు రాగి పిండి – 1 కేజీ అటుకులు – 250 గ్రాముల బెల్లం – 250 గ్రాముల చిక్కీ – 250 గ్రాముల ఎండు ఖర్జూరం – 3 కేజీల బియ్యం – 1 కేజీ పప్పు – అర లీటర్ వంటనూనె – 25 గుడ్లు – 5 లీటర్ల పాలు వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్తో నెలకు అందే రేషన్ సరుకులు – 1 కేజీ రాగి పిండి – 2 కిలోలు మల్టీ గ్రెయిన్ ఆటా – 500 గ్రాముల బెల్లం – 500 గ్రాముల చిక్కీ – 500 గ్రాముల ఎండు ఖర్జూరం – 3 కేజీల బియ్యం – 1 కేజీ పప్పు – అర లీటరు వంటనూనె – 25 గుడ్లు – 5 లీటర్ల పాలు -
‘బంగారు కొండ’లకు పోషకాహారం!
సాక్షి, రాజమహేంద్రవరం : చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని అధిగమించి, సంపూర్ణ పోషణ అందించేందుకు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కె.మాధవీలత వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ‘బంగారుకొండ’ పేరుతో నూతన విధానానికి బుధవారం నాంది పలికారు. వయసుకు తగ్గ బరువు, ఎత్తు, ఎత్తుకు తగ్గ బరువు లేని పిల్లల్ని బాల మిత్రల ద్వారా గుర్తించి సాధారణ స్థితికి తెచ్చే వరకూ 6 నెలల పాటు నెలకు రూ.300 విలువ చేసే 8 రకాల పోషక పదార్థాలను దాతల సాయంతో అందివ్వాలన్నదే కార్యక్రమ ఉద్దేశం. కలెక్టరేట్ వేదికగా వెబ్సైట్, ఆండ్రాయిడ్ యాప్ను హోం మంత్రి తానేటి వనిత, ఎంపీ మార్గాని భరత్రామ్, ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, తలారి వెంకట్రావ్, కలెక్టర్ కె.మాధవీలతలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటికే పిల్లల్లో పౌష్టికాహార సమస్యను దూరం చేయాలని సీఎం జగన్.. వైఎస్సార్ సంపూర్ణ పోషణ, సంపూర్ణ పోషణ ప్లస్ లాంటి పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు. ప్రతి ఒక్క ప్రజా ప్రతినిధి కనీసం ఇద్దరు ముగ్గురు పిల్లలను దత్తత తీసుకుని వారి ఎదుగుదల, పౌష్టికాహార సమస్యను అధిగమించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం దాతలు నెలకు రూ.500 చొప్పున ఆరు నెలలకు రూ.3,000 వేలు చెల్లించి బాలమిత్రగా నమోదు కావాలని సూచించారు. పలువురు చిన్నారుల బాధ్యత తీసుకున్న ప్రజాప్రతినిధులు, అధికారులు పౌష్టికాహార సమస్యతో బాధపడుతున్న పిల్లల్ని ఆరు నెలల పాటు పోషణ నిమిత్తం దత్తత తీసుకునేందుకు ప్రజా ప్రతినిధులు ఉత్సాహం చూపారు. హోం మంత్రి వనిత ఓ చిన్నారిని, ఎంపీ మార్గాని భరత్రామ్ ఇద్దరిని, ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, తలారి వెంకట్రావ్లు ఇద్దరు చొప్పున, జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్, కమిషనర్ దినే‹Ùకుమార్లు చెరో చిన్నారిని దత్తత తీసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 85,700 మంది పిల్లలుంటే.. వారిలో తక్కువ బరువు ఉన్న పిల్లలు 368 మంది, వయస్సుకు తగ్గ ఎత్తు లేని వారు 506 మంది, బరువుకు తగ్గ ఎత్తు లేని వారు 409 మందిని గుర్తించినట్లు తెలిపారు. ఆ మేరకు 1,283 మంది పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకునేందుకు 1,283 మంది బాల మిత్రలుగా అధికారులు, ప్రజా ప్రతినిధులు పేర్లు నమోదు చేసుకున్నారు. -
ఆరోగ్య సిరులు.. పోషకాహార లోపాన్ని నివారించే చిరుధాన్యాలు
సాక్షి, అమరావతి: పోషకాహార లోపాన్ని నివారించి, ఆరోగ్యాన్ని పెంపొందించే చిరు ధాన్యాల (మిల్లెట్స్)ఉత్పత్తి పెంపుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాయి. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్తో సహా దేశంలో ఏడు రాష్ట్రాలు మిల్లెట్ మిషన్లను ఏర్పాటు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏపీ, మహారాష్ట్ర, ఒడిశా, అస్సోం, ఛత్తీస్గఢ్, కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వాలు మిల్లెట్ మిషన్లు ఏర్పాటు చేశాయని వివరించింది. ఈ ఏడాది అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరంగా జరుపుకుంటున్న నేపథ్యంలో కేంద్రం, రాష్ట్రాలు చిరుధాన్యాల ఉత్పత్తిని, స్థానిక వినియోగాన్ని పెంచడంపై దృష్టి సారించినట్లు కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ పేర్కొంది. చిరుధాన్యాల ఉత్పత్తి, డిమాండ్ను పెంచేందుకు రాష్ట్రాలకు సహకారం అందిస్తున్నట్లు తెలిపింది. దేశంలో 170.67 లక్షల టన్నుల చిరుధాన్యాల ఉత్పత్తి అవుతున్నాయి. రాష్ట్రంలో 4.64 లక్షల టన్నులు ఉత్పత్తి అవుతున్నట్లు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రపంచంలో అత్యధికంగా చిరుధాన్యాలు పండించేంది భారతదేశంలోనే. భారతదేశంలోనే 41 శాతం చిరుధాన్యాలు పండిస్తున్నారు. దేశవ్యాప్తంగా చిరు ధాన్యాల వేడుకలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సంవత్సరం అంతా చిరుధాన్యాల వేడుకలను నిర్వహిస్తున్నాయి. 2023–24లో దేశాన్ని చిరుధాన్యాలకు గ్లోబల్ హబ్గా మార్చేందుకు ప్రణాళికలు రూపొందించాయి. మిల్లెట్స్ ఉత్పత్తి, డిమాండ్ పెంచేందుకు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఉత్పాదకతను పెంచడం, వినియోగం, ఎగుమతి, విలువను బలోపేతం చేయడం, బ్రాండింగ్, సృష్టించడం వంటి వాటిపై దృష్టి పెట్టాయి. వీటి వినియోగం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నెలవారీ కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్నాయి. చిరుధాన్యాల ఉత్పత్తి పెంచేందుకు అవసరమైన సాంకేతికత, మెరుగైన వ్యవసాయ పనిముట్లు, వనరులు, సీడ్ హబ్ల ఏర్పాటులో విషయంలో కేంద్రం రాష్ట్రాలకు సహకారం అందిస్తోంది. 2023–24 సంవత్సరమంతా కేంద్ర మంత్రిత్వ శాఖలు చిరుధాన్యాలతో కూడిన తినుబండారాలనే అందించనున్నాయి. విమానాలు, రైళ్లలో చిరుధాన్యాలతో కూడిన ఆహారాన్ని అందించనున్నారు. అన్ని బహిరంగ ప్రదేశాల్లో మిల్లెట్ వెండింగ్ మెషీన్లు ఏర్పాటు చేస్తారు. డిఫెన్స్ ఫుడ్ అండ్ రీసెర్చ్ ల్యాబ్, పోలీస్ ఫోర్స్ క్యాంటీన్లలోనూ చిరుధాన్యాల ఆహారాన్ని అందించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక చర్యలు రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చిరుధాన్యాల ఉత్పత్తి, వినియోగం పెంపునకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఉత్పత్తిని, వినియోగాన్ని పెంచేందుకు ప్రత్యేకంగా మిల్లెట్ మిషన్ ఏర్పాటు చేసింది. చిరుధాన్యాలు పండించే రైతులకు ప్రోత్సాహకాలను అందిస్తోంది. పోషకాహార లోపం నివారణకు చిరుధాన్యాలతో చేసిన ఆహారాన్ని తీసుకోవడంపై ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తోంది. జగనన్న గోరుముద్దలో భాగంగా పిల్లల్లో పోషకాహార లోపాన్ని నివారించడానికి మార్చి 2 నుంచి రాగి జావ ఇవ్వనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాదంతా చిరుధాన్యాల వేడుకలను నిర్వహించేందుకు కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తోంది. -
ఫోర్టిఫైడ్ రైస్.. బియ్యానికి బలం
సాక్షి, హైదరాబాద్: దేశ ప్రజల్లో రక్తహీనత సమస్య చాపకింద నీరులా విస్తరిస్తోంది. అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజనులతోపాటు మైదాన ప్రాంతాల్లోని పేదలు, పాఠశాల విద్యార్థుల్లో ఈ సమస్య అధికంగా ఉంటోంది. పోషకాహార లోపం వల్ల సంభవించే రక్తహీనత సమస్యను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా బలవర్థక బియ్యాన్ని (ఫోర్టిఫైడ్ రైస్) ప్రజలకు అందించాలని నిర్ణయించింది. ఐసీడీఎస్, పీఎం పోషణ్ పథకాలతోపాటు దేశంలోని 151 జిల్లాల్లో గతేడాది ఏప్రిల్ నుంచే ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా ఫోర్టిఫైడ్ రైస్ అందిస్తోంది. అందులో తెలంగాణలోని ఐసీడీఎస్, మధ్యాహ్న భోజన పథకాలతోపాటు ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని రేషన్ షాపులు కూడా ఉన్నాయి. ఏప్రిల్ నుంచి రాష్ట్రంలోని మిగతా 27 జిల్లాల్లోనూ పీడీఎస్ ద్వారా ఫోర్టిఫైడ్ రైస్నే ఇవ్వాలని కేంద్రం ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ను సాధారణ బియ్యంలో కలపడం వల్ల వచ్చేవే బలవర్థక బియ్యం. అసలు దీన్ని ఎలా తయారుచేస్తారు.. ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ తయారీ ఇలా... ►98 శాతం బియ్యపు పిండికి 2 శాతం ఖనిజాలను కలిపి హాట్ ఎక్స్ట్రూషన్ టెక్నాలజీ ద్వారా 90 డిగ్రీలకన్నా తక్కువ వేడిలో జెలటనైజేషన్ (జెల్గా తయారు) చేసి దాన్ని బియ్యం ఆకారంలోకి మారిస్తే వచ్చేవే ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్. 10 గ్రాముల ఎఫ్ఆర్కే కోసం 28 మిల్లీగ్రాముల నుంచి 48 మిల్లీగ్రాముల ఐర¯Œ 75 మైక్రో గ్రాముల నుంచి 125 మైక్రో గ్రాముల ఫోలిక్ యాసిడ్ (బీ–9 విటమిన్), 0.75 మైక్రో గ్రాముల నుంచి 1.25 మైక్రో గ్రాముల బీ–12 విటమిన్ (కొబాలమైన్ )ను కలుపుతారు. ఈ నిష్పత్తిలో కలిపే ఖనిజాలు, విటమిన్లతో కుర్కురే వంటి తినుబండారాలు తయారు చేసే తరహాలో ప్రత్యేక యంత్రాల ద్వారా బియ్యం అచ్చుల్లో ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ తయారు చేస్తారు. బలవర్థక బియ్యం కలిపే తీరిదీ... ►సాధారణ బియ్యానికి 1:100 నిష్పత్తిలో ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ను మిల్లుల్లో కలుపుతారు. అంటే క్వింటాలు బియ్యానికి కిలో ఎఫ్ఆర్కే కలుపుతారన్నమాట. సాధారణ బియ్యం తరహాలోనే ఉండే ఈ ఎఫ్ఆర్కే బియ్యంలో కలిసిపోతాయి. వండిన అన్నం తరహాలోనే... ►ఎఫ్ఆర్కేతో కూడిన బియ్యాన్ని వండినప్పుడు వాటి పోషకాలు ఆవిరవ్వడం, అన్నం వార్చినప్పుడు గంజితో కలిసి బయటకు పోవడం జరగదని పౌరసరఫరాల సంస్థకు ఫోర్టిఫైడ్ రైస్ కన్సల్టెంట్గా వ్యవహరిస్తున్న బాలగంగాధర్ తిలక్ చెబుతున్నారు. ఒకవేళ పోషకాలు పోయినా 10 శాతం లోపేనని, మిగతా 90 శాతం అన్నంతోపాటే ఉంటాయని ఆయన ‘సాక్షి’కి చెప్పారు. ఈ నేపథ్యంలో బియ్యాన్ని ప్రెషర్ కుక్కర్లో వండాలని కేంద్రం సూచిస్తోందన్నారు. రాష్ట్రంలో 7 యూనిట్లు... ►ఎఫ్ఆర్కే తయారు చేసే యూనిట్లు ఎక్కువగా పంజాబ్, హరియాణా, రాజస్తాన్లలో ఉన్నాయి. తెలంగాణలోని కరీంనగర్, నిజామాబాద్, సిద్దిపేట, ములుగు, వరంగల్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఎఫ్ఆర్కే యూనిట్లు ఉన్నాయి. మనకు కొత్తేం కాదు... ►మనం నిత్యం ఆహారంలో వినియోగించే పలు పదార్థాలు ఫోర్టి ఫైడ్ విధానంలో రూపొందినవే. నిత్యం వాడే ప్యాకెట్ పాలతోపాటు అయోడిన్గల ఉప్పు, గోధుమపిండి, వంట నూనె ఫోర్టిఫైడ్ విధానంలో ఖనిజాలు, విటమిన్లను కలిపి తయారు చేస్తారు. ఈ నాలుగింటితోపాటు ఇప్పుడు దేశంలో వినియోగించే బియ్యం కూడా ఫోర్టిఫైడ్ విధానంలోనే తయారు చేయాలని కేంద్రం నిర్ణయించింది. 30 దేశాల్లో... ►మన దేశంలో గతేడాది నుంచి ఫోర్టిఫైడ్ రైస్ను వినియోగంలోకి తెచ్చినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా సుమారు 30 దేశాల్లో ఇప్పటికే ఈ రకమైన బియ్యాన్ని వాడుతున్నారు. అమెరికాలో 2019లోనే 80 వేల మెట్రిక్ టన్నుల ఫోర్టిఫైడ్ రైస్ను వినియోగించినట్లు తెలుస్తోంది. కోస్టారికా, నికరగ్వా, పనామా, పాపువా న్యూగినియా, సోలొమన్ దీవులు, ఫిలిప్పీన్స్లలో బలవర్థక బియ్యం వాడకం తప్పనిసరి. అలాగే మరికొన్ని ఆఫ్రికా దేశాలతోపాటు కిర్గిస్తాన్, లావోస్, నేపాల్లలోనూ ఫోర్టిఫైడ్ రైస్ను వినియోగిస్తున్నారు. -
పిల్లల్లో పోషకాహార లోపం.. తెలంగాణలో 1.20 లక్షల మందిలో గుర్తింపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. మొత్తం 1.20 లక్షల మందిలో పోషకాహార లోపం ఉందని తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ (గణాంక నివేదిక)–2022 వెల్లడించింది. రాష్ట్రంలో మొత్తం 19.79 లక్షల మంది పిల్లలు ఉంటే, అందులో 6.09 శాతం మంది పోషకాహార (న్యూట్రిషన్) లోపంతో బాధపడుతున్నారు. 1.83 శాతం మంది తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్నారని నివేదిక పేర్కొంది. కాగా 12.18 లక్షల మంది పిల్లలు న్యూట్రిషన్ సప్లిమెంటరీలు (అదనపు పోషకాలు) తీసుకుంటున్నారు. అత్యధి కంగా సిద్దిపేట జిల్లాలో 78.4 శాతం మంది పిల్లలు సప్లిమెంటరీలు తీసుకుంటుండగా, అత్యంత తక్కువగా కామారెడ్డి జిల్లాలో 20.9 శాతం మంది తీసుకుంటున్నారు.2021–22 లెక్కల ప్రకారం రాష్ట్రంలో 4.92 లక్షల మంది తల్లులు సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ కింద నమోదయ్యారు. అందులో 2.58 లక్షల మంది న్యూట్రిషన్ సప్లిమెంటరీలు తీసుకుంటున్నారని నివేదిక వెల్లడించింది. న్యూట్రిషన్ సప్లిమెంటరీలు తీసుకునేవారిలో అత్యధికంగా జగిత్యాలలో 62.9 శాతం మంది ఉండగా, అత్యంత తక్కువగా కామారెడ్డి జిల్లాలో 26.9 శాతం మంది ఉన్నారు. 97,448 మందికి కేసీఆర్ కిట్... రాష్ట్రంలో 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు నాటికి 97,448 మందికి కేసీఆర్ కిట్లను పంపిణీ చేశారు. కేసీఆర్ కిట్ పథకం 2017 జూన్ రెండో తేదీన ప్రారంభమైన సంగతి తెలిసిందే. మాతృత్వ, శిశు మరణాల రేటును తగ్గించాలన్న ఉద్దేశంతో దీన్ని ప్రారంభించారు. మగ బిడ్డ పుడితే రూ.12 వేలు, ఆడిపిల్ల పుడితే రూ.13 వేలు తల్లులకు అందజేస్తున్నారు. అలాగే టవళ్లు, సబ్బులు, పౌడర్తో కూడిన కిట్ను కూడా ఇస్తున్నారు. నివేదికలోని ముఖ్యాంశాలు... ► జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–5 (ఎన్ఎఫ్ హెచ్ఎస్–5) ప్రకారం రాష్ట్రంలో 6–59 నెలల మధ్య చిన్నారుల్లో 70 శాతం మంది రక్తహీన తతో బాధపడుతున్నారు. ఎన్ఎఫ్హెచ్ఎస్–4 ప్రకారం అది 60.7 శాతంగా ఉంది. ► ఎన్ఎఫ్హెచ్ఎస్–5 ప్రకారం రాష్ట్రంలో 15–49 ఏళ్ల మధ్య వయస్సు గల గర్భిణుల్లో 53.2 శాతం మందిలో రక్తహీనత నమోదయ్యింది. ► అన్ని కేటగిరీలకు చెందిన 15–49 ఏళ్ల మధ్య వయస్సు గల మహిళల్లో 57.6 శాతం మంది, పురుషుల్లో 15.3 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. ► మహిళల్లో అత్యంత తీవ్రమైన బ్లడ్ షుగర్ లెవల్స్ ఉన్నవారు ఎన్ఎఫ్హెచ్ఎస్–4 ప్రకారం 3.9 శాతం మంది ఉండగా, ఎన్ఎఫ్హెచ్ఎస్–5 ప్రకారం 7 శాతం ఉన్నారు. ► పురుషుల్లో ఎన్ఎఫ్హెచ్ఎస్–4 ప్రకారం అత్యంత తీవ్రమైన బ్లడ్ షుగర్ లెవల్స్ ఉన్నవారు 4.1 శాతం ఉండగా, ఎన్ఎఫ్హెచ్ఎస్–5 ప్రకారం రెట్టింపునకు పైగా 9.3 శాతం ఉన్నారు. ► ఎన్ఎఫ్హెచ్ఎస్–4 ప్రకారం మహిళల్లో మధ్యస్తం నుంచి తీవ్రమైన బీపీ ఉన్నవారు 1.7 శాతం ఉండగా, ఎన్ఎఫ్హెచ్ఎస్–5 ప్రకారం ఏకంగా 6.3 శాతం ఉన్నారు. ► ఎన్ఎఫ్హెచ్ఎస్–4 ప్రకారం పురుషుల్లో మధ్యస్థం నుంచి తీవ్రమైన బీపీ ఉన్నవారు 3.5 శాతం ఉండగా, ఎన్ఎఫ్హెచ్ఎస్–5 ప్రకారం 8.1 శాతం ఉన్నారు. ► రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ లబ్ధిదారులు 1.33 లక్షల మంది ఉన్నారు. చదవండి: తెలంగాణలో మొత్తం వాహనాల సంఖ్య ఎంతో తెలుసా? -
షాకింగ్! మంచి తిండికి దూరంగా 300,00,00,000 మంది
- కంచర్ల యాదగిరిరెడ్డి తిండి కలిగితే కండగలదోయ్... కండ కలవాడేను మనిషోయ్.. అని మహాకవి ఎప్పుడో చెప్పాడు. కానీ ప్రస్తుత పరిస్థితులు ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. కొద్దోగొప్పో అందరూ తిండి తినడమైతే తింటున్నారు కానీ, ఈ భూమి మీద సుమారు 300 కోట్ల మంది ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారానికి దూరంగా ఉన్నారు. ఐక్యరాజ్య సమితి (ఐరాస) సంస్థ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏఓ) ఈ విషయాన్ని స్పష్టం చేయడం గమనార్హం. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 138 దేశాల సమాచారాన్ని ఈ సంస్థ విశ్లేషించింది. తన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా 2030 నాటికల్లా భూమ్మీద ఆకలన్నది లేకుండా చేయాలని ఎఫ్ఏఓ తీర్మానం చేసుకుంది. అయితే ఏటేటా ఆరోగ్యకరమైన తిండికి దూరమవుతున్న వారి సంఖ్య పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఏడాదిలో11.2 కోట్ల పెరుగుదల తిండి లేని పేదల గురించి తరచూ వార్తలు వస్తుంటాయి కానీ, తిన్న తిండితో ఆరోగ్యంగా ఉండలేని వారి గురించి తెలిసింది తక్కువే. ఈ క్రమంలోనే ఎఫ్ఏఓ ప్రతి దేశంలో ఆరోగ్యకరమైన తిండి తినగలిగిన వాళ్లు ఎంతమంది? అసలు ఆరోగ్యకరమైన తిండి అంటే ఏమిటన్నది తెలుసుకుని వివరాలు వెల్లడించింది. దీని ప్రకారం 2020లో ఆరోగ్యకరమైన ఆహారం అందుబాటులో లేని వారి సంఖ్య 300 కోట్లు. 2019 గణాంకాలతో పోలిస్తే 11.2 కోట్లు ఎక్కువ. దీనికి ప్రధాన కారణం ఆహారపు ధరలు పెరగడమేనని సంస్థ చెపుతోంది. ఈ మేరకు ఆదాయం పెరగకపోతే పరిస్థితి మరింత దిగజారుతుందని హెచ్చరించింది. దీని ప్రభావం ధనిక దేశాలపై కాకుండా, ఆహార ద్రవ్యోల్బణం అదుపు తప్పడం ద్వారా పేద దేశాల్లోనే ఎక్కువగా కనిపిస్తుందని తేల్చి చెప్పింది. శక్తి అవసరాలను తీర్చగలగాలి ఒక మనిషి రోజువారీ శక్తి అవసరాలను తీర్చగలిగేదే ఆరోగ్యకరమైన ఆహారమని ఎఫ్ఏఓ నిర్వచిస్తోంది. అలాగే ఆయా దేశాల్లో నిర్వచించుకున్న పౌష్టికాహార మార్గదర్శకాలనూ సంతృప్తి పరచాలి. ఉదాహరణకు భారత్లో ప్రతి ఒక్కరు రోజుకు కనీసం 400 గ్రాముల కాయగూరలు, పండ్లు తినడం అవసరమని జాతీయ పోషకాహార సంస్థ పేర్కొంటోంది. చాలామంది ఈ స్థాయిలో వీటిని తీసుకోవడం లేదు. పైగా ఈ మోతాదుల్లో కాయగూరలు, పండ్లు తీసుకునే స్థోమత కూడా కొందరికి ఉండదు. ఒక కుటుంబం రోజువారీ ఆదాయంలో 52% లేదా అంతకంటే ఎక్కువను ఆహారానికి వెచి్చంచాల్సిన పరి స్థితి ఉంటే, దాన్ని స్థోమతకు మించిందిగా ఎఫ్ఏఓ చెపుతోంది. ఆఫ్రికాలోనే సగం దేశాలు సర్వే చేసిన 138 దేశాల్లో కనీసం 52 దేశాల జనాభాలో సగం మందికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునే స్థోమత లేదని ఎఫ్ఏఓ సర్వే వెల్లడించింది. ఇందులో అత్యధికం ఆఫ్రికా ఖండంలో ఉండగా మిగిలినవి ఆసియా, ఓషియానా, ఉత్తర, దక్షిణ అమెరికా ప్రాంతాల్లో ఉన్నాయి. ఆహార కొరత అన్నది ఆఫ్రికా ఖండంలో ఎప్పుడూ సమస్యే కానీ, సహారా ఎడారి పరిసర దేశాల్లోని జనాభాలో 90 శాతం మందిలో ఈ సమస్య కనిపిస్తుండటం ఆందోళన కలిగించే అంశం. కరువు ప్రాంతాల్లో మూడింట ఒక వంతు ఇక్కడే ఉండటం, వాతావరణ మార్పుల ప్రభావం తీవ్రంగా ఉండటం వల్ల ఆహార ధరలు భారీగా హెచ్చుతగ్గులకు గురవుతుండటం ఈ పరిస్థితికి కారణమని ఎఫ్ఏఓ విశ్లేషించింది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం పుణ్యమా అని ఇప్పుడు ఆఫ్రికా దేశాలకు గోధుమ దిగుమతులు సగం కంటే ఎక్కువ పడిపోయాయి. ఫలితంగా చాలా దేశాల్లో ఆహార ద్రవ్యోల్బణం అధికమైంది. సమస్యను మరింత జటిలం చేసింది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునే స్థోమత లేని వారు ఒక్క భారత దేశంలోనే 97.3 కోట్ల మంది ఉన్నట్లు ఎఫ్ఏఓ దగ్గర ఉన్న సమాచారం చెపుతోంది. ఆసియా మొత్తం మీద 189 కోట్లు, ఆఫ్రికాలో సుమారు 100 కోట్ల మంది ఉన్నారు. అమెరికా, ఓషియానాల్లో సుమారు 15.1 కోట్ల మంది ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఆజర్బైజాన్, ఐస్లాండ్, స్విట్జర్లాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో మాత్రమే జనాభా మొత్తం పుష్టికరమైన ఆహారాన్ని కొనుక్కోగల స్థితిలో ఉన్నట్లు ఆ సర్వే నివేదిక తెలిపింది. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన యూరోపియన్ దేశాల్లో 95 శాతం ప్రజలు కూడా మంచి స్థితిలోనే ఉన్నారు. పెరుగుతున్న జనాభా కూడా కారణమే ఆరోగ్యకరమైన ఆహారం అందుకునే స్థోమత లేకపోవడానికి పెరుగుతున్న జనాభా కూడా ఒక కారణం. ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరుకోనుంది. 2050 నాటికి ఇది ఇంకో 35 శాతం పెరగనుంది. అంటే సుమారు 250 కోట్ల మందికి అదనంగా ఆహారం అవసరం. ఈ డిమాండ్ను తట్టుకోవాలంటే పంట దిగుబడులు ఇప్పుడున్న స్థాయికి రెట్టింపు కావాలి’అని యునైటెడ్ నేషన్స్ తరఫున అధ్యయనంలో పాల్గొన్న స్టాన్ఫర్డ్ వర్సిటీ ఎకనామిక్స్ విభాగం హెడ్ అబ్రమిస్కీ అన్నారు. పెరిగిపోతున్న జనాభాకు తగినంత ఆహారం పండించాలన్నా, పండించిన ఆహారం ప్రజల కడుపులు నింపడం మాత్రమే కాకుండా తగిన పుష్టిని ఇవ్వాలన్నా పలు రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు అవసరమని పేర్కొంటూ యూఎన్కు ఆయన ఓ నివేదిక కూడా అందజేశారు. ‘ఆహార వృథాను తగ్గించాలి’ ఆహార వృథాను వీలైనంత వరకూ తగ్గించడం. పండిన పంట వినియోగదారుడి చేతికి చేరేలోపు జరుగుతున్న వృథాను గణనీయంగా తగ్గించడం ద్వారా ఉన్న ఆహారాన్ని ఎక్కువమందికి చేరేలా చేయవచ్చునని ఐరాస ఇటీవల తన సభ్యదేశాలకు సూచించింది. వాతావరణ మార్పులను తట్టుకోగల రీతిలో కొత్త కొత్త వంగడాల సృష్టి, ఉత్పాదకత పెంచడం ద్వారా మాత్రమే భవిష్యత్తు ఆహార సవాళ్లను ఎదుర్కోగలమని నిపుణులు అంటున్నారు. పరిస్థితిని దిగజార్చిన కోవిడ్ ఆకలి కారణంగా 2018లో ఐదేళ్లు నిండకుండానే మరణించిన పిల్లల సంఖ్య 53 లక్షలు. 2020లో విడుదలైన గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ఈ విషయం చెపుతోంది. ► ఐక్యరాజ్య సమితి నిర్దేశించినసుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో రెండోది‘జీరో హంగర్’. 2030 నాటికి ఆకలిని చెరిపేసేందుకు చేసుకున్న తీర్మానం ఇది. ► కోవిడ్ మహమ్మారి పుణ్యమా అని ప్రపంచమిప్పుడు ‘జీరో హంగర్’లక్ష్యాన్ని అందుకోలేని స్థితిలో ఉంది. ఒకపక్క వాతావరణ సమస్యలు సవాళ్లు విసురుతుండగా, కోవిడ్ పరిస్థితిని మరింత దిగజార్చింది. సమాజంలోని అసమానతలను ఎక్కువ చేయడం ద్వారా మరింత మంది ఆకలి కోరల్లో చిక్కుకునేలా చేసింది. ►ప్రపంచం మొత్తమ్మీద ఏటా 400 కోట్ల టన్నుల ఆహారం ఉత్పత్తి అవుతుండగా, ఇందులో 33 శాతం వృథా అవుతోంది. దీని విలువ ఏకంగా 60 లక్షల కోట్ల రూపాయలు. అభివృద్ధి చెందిన దేశాల్లో తినే ఆహారం ఎక్కువగా వృథా అవుతుండగా, అభివృద్ధి చెందుతున్న, పేద దేశాల్లో పంటనష్టాలు ఎక్కువ. డిమాండ్కు తగ్గ ఆహారం కోసం.. ఆకలిని ఎదుర్కొనేందుకు మన దేశంలో అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మేరకు ఇప్పటికే అనేక పథకాలు ఆచరణలో ఉన్నాయి. వాటిలో కొన్ని.. 1.నేషనల్ న్యూట్రిషన్ మిషన్: పోషణ్ అభియాన్ అని పిలిచే ఈ పథకాన్ని 2018లో మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.గర్భిణులు, పాలిచ్చే తల్లుల్లో పోషకాహార లోపాలను తగ్గించడం, రక్తహీనత, తక్కువ బరువున్న పిల్లలు పుట్టడాన్ని నివారించడం ఈ పథకం ఉద్దేశం 2. జాతీయ ఆహార భద్రత పథకం: 2007లో నేషనల్ డెవలప్మెంటల్ కౌన్సిల్ ప్రారంభించిన పథకం ఇది. 11వ పంచవర్ష ప్రణాళిక ముగిసే సమయానికి దేశంలో వరి ఉత్పత్తి రెండు కోట్ల టన్నులు అధిమించగా, గోధుమల ఉత్పత్తి 80 లక్షల టన్నులకు చేరుకుంది. కాయధాన్యాల దిగుబడి 20 లక్షల టన్నుల పైచిలుకుకు చేరుకుంది. 12వ పంచవర్ష ప్రణాళికలోనూ లక్ష్యానికి మించి దిగుబడులు సాధించాం. భవిష్యత్తులోనూ డిమాండ్కు తగ్గ ఆహారాన్ని పండించేందుకు నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ పలు వ్యూహాలను సిద్ధం చేసి అమలు చేస్తోంది. 3. రెండేళ్ల లోపు పిల్లల్లో పౌష్టికాహార లోపాలను తగ్గించేందుకు, ఏడాది పొడవునా మంచి ఆహారం అందరికీ అందుబాటులో ఉండేలా చేసేందుకు ప్రభుత్వం జీరో హంగర్ పేరుతో ఇంకో పథకాన్ని అమలు చేస్తోంది. పోషకాహార లోపాలను అధిగమించేందుకు ఆహారానికి పోషకాలు జోడించడం కూడా ప్రభుత్వ ప్రయత్నాల్లో ఒకటి. -
పాకిస్తాన్ వరద బాధితులుగా... 1.6 కోట్ల చిన్నారులు!
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో సంభవించిన భీకర వరదల ధాటికి 1.6 కోట్ల మంది చిన్నారులు బాధితులుగా మారారని, వీరిలో 34 లక్షల మందికి తక్షణమే సాయం అందించాల్సిన అవసరం ఉందని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందని పేర్కొంది. ఇప్పటికే పోషకాహార లేమిని ఎదుర్కొంటున్న బాలలు డయేరియా, డెంగ్యూ జ్వరం, చర్మ వ్యాధులతో పోరాడుతున్నారని తెలియజేసింది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి(యునిసెఫ్) ప్రతినిధి అబ్దుల్లా ఫాదిల్ తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. పాకిస్తాన్లో సింధ్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన ఇటీవలే రెండు రోజులపాటు పర్యటించారు. పాకిస్తాన్లో వరదలు 528 మంది చిన్నారులను పొట్టనపెట్టుకున్నాయని చెప్పారు. ఇవన్నీ నివారించగలిగే మరణాలే అయినప్పటికీ ప్రభుత్వం ఆ పని చేయలేకపోయిందని ఆక్షేపించారు. ఆవాసం లేక చిన్నపిల్లలు కుటుంబాలతో కలిసి బహిరంగ ప్రదేశాల్లోనే ఉంటున్నారని, ఆహారం, నీరు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వేలాది భవనాలు, పాఠశాలలు, ఆసుపత్రులు కూలిపోయాయని అన్నారు. బాధితులను ఆదుకొనేందుకు అంతర్జాతీయ సమాజం తక్షణం ముందుకు రావాలని అబ్దుల్లా ఫాదిల్ విజ్ఞప్తి చేశారు. -
Poshan Abhiyaan: ‘పోషణ్ అభియాన్’ అమల్లో ఏపీ భేష్
సాక్షి, అమరావతి: కరోనా కష్టకాలంలో గర్భిణులు, పిల్లల్లో పోషకాహార లోపం నివారణకు ఉద్దేశించిన పోషణ్ అభియాన్ పథకం అమలులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. పథకం మొత్తం అమలులో అత్యధిక విజయాలు సాధించిన రాష్ట్రాల్లో తొలుత మహారాష్ట్ర నిలవగా రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్, మూడో స్థానంలో గుజరాత్ నిలిచాయి. ఈ రాష్ట్రాలు మొత్తం మీద 70 శాతానికి పైగా స్కోర్ సాధించాయి. ఆ తరువాత స్థానాల్లో తమిళనాడు, మధ్యప్రదేశ్, హిమాచల్ప్రదేశ్ ఉన్నట్లు నీతి ఆయోగ్ అధ్యయన నివేదిక వెల్లడించింది. కోవిడ్ సమయంలో కీలకమైన ఆరోగ్య, పోషకాహార సేవల విషయంలో ఆయా రాష్ట్రాలు చేపట్టిన వినూత్న చర్యలపై నీతి ఆయోగ్ అధ్యయనం చేసింది. 2019 అక్టోబర్ నుంచి డిసెంబర్ 2020 వరకు పోషణ్ అభియాన్ అమలులో మౌలిక సదుపాయాలు, మానవ వనరులు, శిక్షణపై పురోగతి, అమలు సామర్థ్యాలు, కెపాసిటీ బిల్డింగ్, కన్వర్జెన్స్, ప్రోగ్రామ్, ఔట్పుట్ యాక్టివిటీస్, సర్వీస్ డెలివరీలపై నీతి ఆయోగ్ అధ్యయనంచేసి ఆయా రాష్ట్రాలకు స్కోర్లు ఇచ్చింది. ఆ వివరాలు.. మానవ వనరుల నియామకాల్లో ఏపీ టాప్ ► కోవిడ్ సమయంలో పోషణ్ అభియాన్ అమలుకు అవసరమైన మానవ వనరుల నియామకాలను నూరు శాతం చేసిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. జాయింట్ ప్రాజెక్టు కో–ఆర్డినేటర్ స్థానాలనూ నూరు శాతం భర్తీచేసిన రాష్ట్రాల్లో ఏపీ ఈ ఘనత సాధించింది. అంగన్వాడీ వర్కర్లకు మొబైల్ ఫోన్లను నూరు శా>తం పంపిణీలోనూ ఏపీ టాప్లో నిలిచింది. పిల్లల వృద్ధి పర్యవేక్షణ పరికరాలనూ నూటికి నూరు శాతం ఏపీ పంపిణీ చేసింది. అంతేకాక.. రాష్ట్రస్థాయిలో సిబ్బంది శిక్షణ, సామర్థ్యం పెంపునూ నూరు శాతం అమలుచేసింది. ► ఆరోగ్య సంబంధిత సేవలు, మౌలిక సదుపాయాలు, మానవ వనరులను అంచనా వేయగా.. కమ్యూనిటీ హెల్త్ కేంద్రాలు, పిల్లలు, బాలింతలకు సేవలు, ఏఎన్ఎంల భర్తీలో ఆంధ్రప్రదేశ్ అత్యధిక స్కోర్ సాధించింది. ఆ తరువాత స్థానాల్లో గుజరాత్, కర్ణాటక, కేరళ నిలిచాయి. ► రాష్ట్రస్థాయిలో మౌలిక సదుపాయాలకు సంబంధించి సబ్ సెంటర్లు, కకమ్యూనిటీ హెల్త్ కేంద్రాలు, హెల్త్ అండ్ వెల్నెస్ కేంద్రాలు ఆంధ్రప్రదేశ్లో నూటికి నూరు శాతం పనిచేస్తున్నాయి. ఈ విషయంలో దేశంలోని 13 పెద్ద రాష్ట్రాల్లో ఏపీ అగ్రస్థానంలో ఉంది. ► ఏపీ సర్కారు ప్రత్యేకంగా సప్లిమెంటరీ పోషకాహారం కూడా పంపిణీ చేసింది. గృహ సందర్శనలు, వర్చువల్గా కౌన్సెలింగ్ నిర్వహించడంతో పాటు పిల్లలకు వర్చువల్ తరగతులు నిర్వహించింది. కమ్యూనిటీ పద్ధతిలో వర్చువల్ ఈవెంట్లనూ నిర్వహించింది. కోవిడ్ సమయంలో జనసమూహాన్ని నివారించేందుకు టోకెన్ ఆధారిత వ్యవస్థ ద్వారా జింక్, ఓఆర్ఎస్లను పంపిణీ చేసింది. ► కోవిడ్ సంక్షోభ సమయంలో అక్టోబర్ 2019 నుంచి 2020 రెండో త్రైమాసికం వరకు ఆరు నెలల నుంచి ఆరేళ్ల వయస్సు గల పిల్లలకు సప్లిమెంటరీ పౌష్టికాహారం ఏపీలో 113 శాతం మేర పంపిణీ చేయగా 2020 మూడో త్రైమాసికం నాటికి అది 115 శాతం మేర.. నాలుగో త్రైమాసికం నాటికి అది 119 శాతానికి పెరిగింది. ► ఇక అక్టోబర్ 2019 నుంచి 2020 రెండో త్రైమాసికం వరకు గర్భిణులతో పాటు పాలు ఇచ్చే తల్లులకు సప్లిమెంటరీ పౌష్టికాహారం పంపిణీ 108 శాతం ఉండగా 2020 మూడో త్రైమాసికానికి 111 శాతం, 2020 నాలుగో త్రైమాసికంలోనూ అదే స్థాయిలో పంపిణీ జరిగింది. ► ఇక అక్టోబర్ 2019 నుంచి 2020 రెండో త్రైమాసికం వరకు ఇనిస్టిట్యూషనల్ కాన్పులు ఏపీలో 90 శాతం ఉండగా 2020 మూడో త్రైమాసికంలో 94 శాతానికి.. 2020 నాలుగో త్రైమాసికానికి 100 శాతానికి పెరిగాయి. -
National Nutrition Week: నీరసమూ నిద్ర వదలగొట్టండి
సోఫా కనిపిస్తే నడుము వాల్చాలనిపిస్తోందా? ఏ పనీ చేయలేని నీరసం ముంచుకు వస్తోందా? ఇదేమైనా పోస్ట్ కోవిడ్ లక్షణమా? మరేదైనా సమస్యా? ఇటీవల గృహిణులు నీరసాన్ని ఫిర్యాదు చేస్తున్నారు. పని మాని నిద్ర పోవడానికి ఇష్టపడుతున్నారు. దీనికి పోషకాహార లోపం ఒక కారణం. ఇతర కారణాలు కూడా ఉంటాయి. గృహిణి నీరసంగా ఉంటే ఇల్లు నడవదు. లేవండి. చలాకీగా మారండి. ‘ఈసురోమని మనుషులుంటే దేశమేగతి బాగుపడునోయ్’ అన్నాడు మహాకవి గురజాడ. ఆయన బాధపడింది తగినంత పౌష్టికాహారం లేని తన కాలపు మనుషులను చూసే. సరైన ఆహారమే శక్తి. సరికాని ఆహారం నీరసం. ఫుల్లుగా తిన్నా అసలు తినకపోయినా విలోమ ప్రతిఫలం వస్తుంది. అతి నిద్ర, నీరసం ఇంటి సభ్యులకు ముఖ్యంగా గృహిణులకు ఉంటే పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది. కోవిడ్ తర్వాత చాలా ఇళ్లల్లో స్త్రీలు నీరసం అని అంటూ ఉన్నారు. కోవిడ్ బారిన పడ్డ పిల్లలు కూడా అప్పుడప్పుడు నీరసం అని అనువుగాని సమయాలలో నిద్ర అని అంటూ ఉన్నారు. ఈ సమస్యలన్నింటినీ తగిన పౌష్టికాహారంతో ఎదుర్కొనవచ్చు. ఇప్పుడు దేశంలో పౌష్టికాహార చైతన్యం కోసం కోసం సెప్టెంబర్ 1 నుంచి 7వ తేదీ వరకు ‘పౌష్టికాహార వారోత్సవం’ జరుగుతుంది. సరిౖయెన ఆహారంతో నీరసాన్ని ఎదుర్కోవడం ముఖ్యం. సమతుల ఆహారం: మధుమేహం, గుండె, బి.పి, స్థూలకాయం... వీటిని అదుపు చేసే ఆహారం తినడం గురించి కొందరు శ్రద్ధ పెడతారు. కాని సమగ్రంగా శరీరాన్ని చురుగ్గా ఉంచే ఆహారాన్ని పట్టించుకోరు. అసమతుల ఆహారం శరీరానికి నీరసం తెస్తుంది. కార్బోహైడ్రేట్లు ఉన్న ఆహారం అతిగా తింటే మందకొడితనం వస్తుంది. అది కూడా ఒక రకమైన అలసట కలిగిస్తుంది. కేల్షియం, మెగ్నిషియం, ఐరన్, జింక్, విటమిన్లు ఇవన్నీ తగినంతగా తీసుకుంటే సరైన నిద్ర పడుతుంది. తిన్నది ఒంటికి పట్టి ఉదయానికి హుషారు వస్తుంది. లేకుంటే నిద్ర సరిగ్గా పట్టదు. మరుసటి రోజు మత్తు, అలసట, నీరసం ఉంటాయి. జొన్నలు, కొర్రలు, గ్రీన్ టీ: నిదానంగా జీర్ణమయ్యే జొన్నలు, కొర్రలు మంచివి. చికెన్, చేపలు మేలు చేస్తాయి. పాలు, పెరుగు, గుడ్డు, సోయా, పెసలు, అలసందలు ఆహారంలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరెంజ్, జామ, బొప్పాయి, స్ట్రాబెర్రీలు నీరసాన్ని, కీర మలబద్ధకాన్నీ తొలగిస్తాయి. అరటిపండు నీరసానికి బద్ధ విరోధి. బ్రొకోలి, క్యాప్సికమ్, క్యారెట్, కాలిఫ్లవర్, టొమాటోలు ఇవి ఉన్న కూరలు ముఖ్యం. ఆకుకూరలు పెంచాలి. మజ్జిగ బాగా తీసుకోవాలి. జొన్న రొట్టె, జొన్న రవ్వ ఒక పూట అలవాటు చేసుకోవాలి. ఇవన్నీ పోషకాలనిస్తాయి. గ్రీన్ టీ మిమ్మల్ని ఎనర్జిటిక్ గా ఉంచడంలో సహాయపడుతుంది. ఏకాగ్రతను పెంచడంతో పాటు అలసటను తొలగిస్తుంది. మందులు: కొన్ని రకాల మందులు కూడా నిద్ర లేమికి, నీరసానికి కారణం అవుతాయి. బి.పి, యాంగ్జయిటీ, యాంటీ డిప్రెసెంట్లు వంటివి నిద్రకు విఘాతం కలిగిస్తాయి. అందువల్ల అప్పుడప్పుడు డాక్టర్ను కలిసి వాడుతున్న మందులు చెక్ చేయించి వాటి మోతాదును సరి చేసుకోవాలి. నిద్ర సమస్యలు ఉంటే మందులు మార్చే వీలుంటే మార్చుకోవాలి. ఆహారం, అలవాట్లు ఇవే మనిషికి ఆరోగ్యాన్ని ఇస్తాయి. గృహిణి ఆరోగ్య బాధ్యత గృహిణిది మాత్రమే కాదు. కుటుంబానిది. అందరూ కలిసి ఇంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం తప్పనిసరి. తగినంత నీరు, నిద్ర: జీవక్రియలకు నీరు అవసరం. జీవక్రియలు జరిగే కొద్దీ శరీరంలో నీటి శాతం తగ్గుతూ ఉంటుంది. అందువల్ల ఎప్పటికప్పుడు నీరు తీసుకోవాలి. లేదంటే శరీరంలో రసం పోయి నీరసం వస్తుంది. అలాగే సరిౖయెన నిద్ర కోసం పూర్తిగా ప్రయత్నించాలి. అలజడి, ఒత్తిడి, అనవసర ఆలోచనలు నిద్రకు దూరం చేస్తాయి. నిద్ర లేకపోతే ఆరోగ్యం ఉండదు. కనుక రోజంతా ఎంత పని, చికాకులు ఉన్నా నిద్రా సమయంలో మంచి సంగీతం వింటూ, కుటుంబ సభ్యులతో మంచి మాటలు చెబుతూ, శుభ్రమైన పక్క మీద నిద్ర పోవాలి. అదే నీరసానికి సరైన విరుగుడు. నిద్ర పోయే ముందు ఒక గ్లాసు మంచినీరు తాగితే మంచిది. -
పోషకాహార లోపాన్ని నివారించేందుకు కృషి చేయాలి: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: దేశంలో పోషకాహార లోపాన్ని నివారించేందుకు ప్రజలు కృషి చేయాలని, దానికి సామాజిక అవగాహన కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రతినెల చివరి ఆదివారం నిర్వహించే ‘మన్కీ బాత్’ కార్యక్రమంలో భాగంగా జాతినుద్దేశించి ప్రసంగించారు. భారత్ స్వాతంత్య్రం సాధించి 75 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా నిర్వహించిన ‘అమృత్ మహోత్సవ్’ అమృత ధారలు దేశం నలుమూలలా ప్రవహించాయని పేర్కొన్నారు. ‘పండుగలతోపాటు ఈ సారి సెప్టెంబర్ నెలను పోషకాహారంపై ప్రచారానికి అంకితం చేద్దాం. మనం సెప్టెంబర్ 1 నుంచి 30 తేదీ వరకూ ‘షోషణ్ మాహ్’ ( పోషకాహార మాసం)గా పాటిద్దాం. పోషకాహార నివారణకు చాలా సృజనాత్మక, విభిన్నమైన ప్రయత్నాలు చేస్తున్నాం. పోషణ్ అభియాన్లో సాంకేతిక, ప్రజాభాగస్వామ్యాన్ని మెరుగైన పద్ధతుల్లో వాడటం చాలా కీలకం. భారత్లో పోషకాహార లోపాన్ని రూపుమాపడంలో ‘జల్జీవన్ మిషన్’ భారీగా ప్రభావం చూపనుంది. పోషకాహార లోపాన్ని రూపుమాపటంలో సామాజిక అవగాహన కీలక పాత్ర పోషిస్తుంది.’ అని ప్రధాని మోదీ తెలిపారు. దూరదర్శన్లో స్వతంత్ర సమరయోధుల త్యాగాలపై వచ్చే ‘స్వరాజ్’ సీరియల్ను వీక్షించాలని ఈ సందర్భంగా ప్రజలను కోరారు ప్రధాని మోదీ. స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్న యోధుల కృషిని యువతరానికి తెలియజేయడానికి ఇదో గొప్ప ప్రయత్నమన్నారు. ఇదీ చదవండి: బీజేపీ నేత సోనాలి ఫోగట్ మృతిపై సీబీఐ దర్యాప్తు? -
పుష్కలంగా ఆహారం.. అయినా పోషకాహార లోపం..
సాక్షి, అమరావతి: దేశంలో ఆహారం పుష్కలంగా అందుబాటులో ఉన్నప్పటికీ పోషకాహార లోపం పిల్లలను, మహిళలను పట్టిపీడిస్తోంది. తిండి కొరతవల్ల కాకుండా ఆహారపు అలవాట్లు కారణంగానే ఎక్కువమంది ఈ లోపం బారిన పడుతున్నారు. నిజానికి.. దేశంలో తలసరి ఆహార ఉత్పత్తి గత కొన్నేళ్లుగా క్రమంగా పెరుగుతోంది. 1980 ప్రారంభంలో ఒక వ్యక్తికి రోజుకు ఒక కిలోకంటే కొంత ఎక్కువగాను.. ఇటీవల కాలంలో 1.73 కిలోల ఆహారం అందుబాటులో ఉన్నప్పటికీ ఆరోగ్య, పోషకాహార సూచికలు పేలవంగా ఉన్నాయని.. ఈ సూచికల క్షీణత ఆందోళన కలిగిస్తోందని నాబార్డు నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–2021 వెల్లడించింది. నివేదికలో పొందుపర్చిన సూచనలు, ఇతర ముఖ్యాంశాలివీ.. ► దేశంలోని ఐదేళ్లలోపు పిల్లల్లో 67.1% మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. ► 15–49 ఏళ్లలోపు మహిళల్లోని 57 శాతం మందిని కూడా ఇదే సమస్య పట్టిపీడిస్తోంది. 2015–16తో పోలిస్తే పిల్లల్లోనూ, మహిళల్లోనూ ఇది పెరగడం ఆందోళన కలిగించే అంశం. ► ఆహారాన్ని తక్కువగా తీసుకోవడమే పోషకాహార లోపానికి ప్రధాన కారణం. ► పౌష్టికాహారం అందుబాటులో ఉన్నప్పటికీ ఆహారపు అలవాట్లు కారణంగా ఈ లోపాలబారిన పడుతున్నారు. ► ఎక్కువగా కారం, నూనె, చక్కెరతో కూడిన ఆహారం తీసుకోవడమే కారణం. ► ఈ లోపానికి పూర్తిగా కొనుగోలు సామర్థ్యం తక్కువగా ఉండటం కారణం కాదు. ఆర్థికంగా బాగా ఉన్న కుటుంబాల వారిలో కూడా ఈ లోపాలున్నాయి. ► ఈ లోపంతో పిల్లలు బరువు తక్కువగా ఉండటం చాలా సాధారణమైంది. ► శరీరం పోషకాలను గ్రహించడం కూడా ప్రభావితం చేస్తుంది. స్వచ్ఛమైన నీరు, పారిశుధ్యం, పరిశుభ్రతతో పాటు వైవిధ్యభరితమైన ఆహారం తీసుకోవడంలో సమతుల్యత పాటించాలి. ► ఆరోగ్య సూచికలను మెరుగుపరచడానికి పోషకాహారంపై ప్రజల్లో అవగాహన చాలా ముఖ్యం. ► ఆహార భద్రతపై అనేక నివేదికలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం.. పంటలు, పశువులు, చేపలలో రసాయనాలు, హార్మోన్లు అధికంగా ఉంటున్నాయి. ► రసాయన అవశేషాల వినియోగంపై కఠినమైన నియంత్రణ ఉండాలి. -
ఫోర్టిఫైడ్ బియ్యంతో ఆరోగ్యం పదిలం
ఏయూక్యాంపస్: ఫోర్టిఫైడ్ బియ్యంతో ఆరోగ్యం పదిలంగా ఉంటుందని పరిశోధకులు పేర్కొంటున్నారు. బియ్యానికి అదనంగా విటమిన్లు, ఖనిజాలను జోడించడాన్ని రైస్ ఫోర్టిఫికేషన్ అంటారు. ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి 12 వంటి కీలక సూక్ష్మ పోషకాలను అదనంగా బియ్యంలో చేర్చడం ద్వారా పోషకాహార లోపాన్ని సరిదిద్దే ప్రయత్నం ఏపీ ప్రభుత్వం చేపట్టింది. కళాశాల ఆచార్యులు, ఏయూ పాలక మండలి సభ్యురాలు ఆచార్య ఎ.కృష్ణమంజరి పవార్ నేతృత్వంలో బి.ఫార్మసీ విద్యార్థులు ప్రాజెక్టులో భాగంగా చేసిన అధ్యయనంలో ఫోర్టిఫైడ్ బియ్యంలో ఫోలిక్ యాసిడ్, ఐరన్ పుష్కలంగా ఉన్నట్లు తేలింది. ఫోర్టిఫైడ్ రైస్ ఎందుకు వాడాలి.. పౌష్టికాహార లోపం బారినపడే మహిళలు, చిన్నారులకు ఫోర్టిఫైడ్ బియ్యం ఎంతో ఉపయుక్తంగా నిలుస్తుంది. ఐసీడీఎస్, ప్రజా పంపిణీ వ్యవస్థ, మధ్యాహ్న భోజన పథకం వంటి ప్రభుత్వ పథకాల్లో ఫోర్టిఫైడ్ రైస్ను పంపిణీ చేయడం వల్ల సూక్ష్మపోషకాలను అందించడం సాధ్యపడుతుంది. ఫోలిక్ యాసిడ్.. ఫోలిక్ యాసిడ్ బాలింత తల్లుల పెరుగుదలలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. పసిపిల్లలలో మెదడు, వెన్నెముక పెరుగుదలకు తోడ్పడుతుంది. అదే విధంగా విటమిన్ బి 12 మెదడు, నాడీమండలం పనిచేయడానికి, ఎర్రరక్తకణాల ఉత్పత్తిలో కీలక భూమిక పోషిస్తుంది. రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని సరైన మొత్తంలో ఉంచుతూ రక్తహీనతను అరికట్టడంలో ఐరన్ ప్రధానపాత్ర పోషిస్తుంది. నిత్యం 400 మైక్రో గ్రామ్స్ అవసరం.. మనం నిత్యం తీసుకునే ఆహారంలో 400 మైక్రో గ్రామ్స్ ఫోలిక్ యాసిడ్ ఉండే విధంగా మనం జాగ్రత్త వహించాలి. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) సూచించిన ప్రమాణాలకు అనుగుణంగా మనం తీసుకునే 100 గ్రాముల అన్నంలో ఫోలిక్ యాసిడ్ 75 నుంచి 125 మైక్రోగ్రామ్స్ మధ్యలో ఉండాలి. ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న ఫోర్టిఫైడ్ రైస్లో 100 గ్రాముల్లో 98 మెక్రో గ్రామ్స్ ఫోలిక్ యాసిడ్ ఉంది. ఎఫ్ఎస్సీఐ ప్రమాణాల ప్రకారం 100 గ్రాముల అన్నంలో 28–42 మిల్లీ గ్రాముల ఐరన్ ఉండాలి. ప్రభుత్వం అందించే ఫోర్టిఫైడ్ బియ్యంలో 40 మిల్లీగ్రాముల ఐరన్ ఉంది. ఇతర ప్రైవేటు ఫోర్టిఫైడ్ బియ్యంలో 35 నుంచి 36.5 మిల్లీ గ్రాములు ఐరన్ కనిపించింది. కాగా అధికంగా వినియోగించే బ్రాండెడ్ మసూరి రైస్లో కేవలం 0.98 శాతం ఐరన్ ఉన్నట్లు తేలింది. నాలుగు రకాల బియ్యంపై అధ్యయనం.. ప్రభుత్వం అందిస్తున్న ఫోర్టిఫైడ్ బియ్యం శాంపిల్తో పాటు మార్కెట్లో లభించే మూడు రకాల ఫోర్టిఫైడ్ బియ్యం బ్రాండ్ల శాంపిల్స్తోపాటు సాధారణ సోనామసూరి బియ్యం శాంపిల్స్ తీసుకుని అధ్యయనం చేశారు. అధ్యయనం అనంతరం ఫలితాలను విశ్లేషించగా ప్రభుత్వం అందించే ఫోర్టిఫైడ్ బియ్యంలో ఫోలిక్ యాసిడ్ 98 శాతం ఉండగా, మిగిలిన మూడు ఫోర్టిఫైడ్ రైస్ బ్రాండ్లలో ఫోలిక్ యాసిడ్ శాతాలను పరిశీలించగా 96, 97.24,95, ప్రముఖ బ్రాండ్ సోనా మసూరి రైస్లో 93 శాతం ఫోలిక్యాసిడ్ ఉండడాన్ని గమనించారు. మరింత లోతైన పరిశోధనలు విద్యార్థుల పరిశోధన సమాజానికి ఉపయుక్తంగా నిలపాలనే ఉద్దేశంతో ప్రయోగాత్మకంగా ఈ ప్రాజెక్టును చేపట్టాం. ప్రభుత్వం కోరితే బి 12 శాతం సైతం గణించి ఇస్తాం. ఈ బియ్యం వినియోగించిన తరువాత శరీరంలో ఐరన్శాతం పెరుగుదలను అధ్యయనం చేయాల్సి ఉంటుంది. దీనికి ప్రభుత్వం ఆర్థిక సహకారం అందిస్తే పరిశోధన ప్రాజెక్టుగా నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాం. – ఆచార్య ఎ.కృష్ణమంజరి పవార్, ఫార్మసీ కళాశాల, ఏయూ -
పోషకాహార లోపంతోనే వ్యాధులు
జూలూరుపాడు: పోషకాహార లోపమే వ్యాధులకు ప్రధాన కారణమని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్)– జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) హైదరాబాద్ డిప్యూటీ డైరెక్టర్, శాస్త్రవేత్త డాక్టర్ జె.శ్రీనివాసరావు పేర్కొన్నారు. గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం భేతాళపాడు గ్రామానికి వచ్చిన ఐసీఎంఆర్ – ఎన్ఐఎన్ బృందం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలసి అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ..తెలంగాణలో గిరిజన జనాభా అధికంగా ఉన్న గ్రామాల్లో కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉన్నట్లు తెలంగాణ రాష్ట్ర ఆరోగ్యశ్రీ, నేషనల్ హెల్త్ ఫ్యామిలీ సర్వే(ఎన్హెచ్ఎఫ్ఎస్), ఇతర జాతీయ సంస్థల నివేదికల్లో వెల్లడైందని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, మహబూబాబాద్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో మహిళలు, యువతులు, చిన్నారుల్లో 60% మంది రక్తహీనతతో బాధపడుతున్నట్లు సర్వే ద్వారా తేలిందని చెప్పారు. మరోసారి నమూనాల సేకరణ గ్రామంలో కిడ్నీ వ్యాధులతో పలువురు మరణించిన నేపథ్యంలో ‘సాక్షి’ప్రధాన సంచికలో గతేడాది అక్టోబర్ 10న ‘ఆ ఊరికి ఏమైంది?’శీర్షికతో కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి స్పందించిన డాక్టర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలోని బృందం అదే నెల 26న గ్రామాన్ని సందర్శించి కిడ్నీ వ్యాధిగ్రస్తుల నుంచి నమూనాలను సేకరించారు. ఈ నేపథ్యంలో గురువారం వ్యాధిగ్రస్తులనుంచి మరోసారి నమూనాలను తీసుకున్నారు. అనంతరం వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ మాట్లాడుతూ..ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా ప్రజలు మిషన్ భగీరథ నీళ్లు తాగాలని సూచించారు. కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం డీఎంహెచ్ఓ డాక్టర్ శిరీష, అడిషనల్ డీఎంహెచ్ఓ డాక్టర్ దయానంద్, డీఎంఓ డాక్టర్ భూక్యా వీరబాబు,తహసీల్దార్ లూథర్ విల్సన్, జెడ్పీచైర్మన్ కోరం కనకయ్య తదితరులు పాల్గొన్నారు. -
33లక్షల మంది బాలల్లో పౌష్టికాహార లోపం
న్యూఢిల్లీ: దేశంలోని చిన్నారుల్లో 33 లక్షల మంది పౌష్టికాహారలోపంతో బాధపడుతుండగా అందులో దాదాపు సగం మందిలో ఈ సమస్య తీవ్రంగా ఉందని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. పిల్లల్లో పౌష్టికాహారలోపం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర, బిహార్, గుజరాత్ అగ్రస్థానంలో ఉన్నట్లు సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ సమాధానం ఇచ్చింది. కోవిడ్ మహమ్మారి పేద కుటుంబాల్లోని పిల్లల ఆరోగ్యం, పౌష్టికాహారం సమస్యను మరింత తీవ్రతరం చేసిందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 2021 అక్టోబర్ 14వ తేదీనాటికి దేశంలో 17.76 లక్షల మంది చిన్నారులు తీవ్ర పౌష్టికాహారలోపంతోనూ, 15.46 లక్షల మంది చిన్నారులు మధ్యస్త పోషకాహార లోపంతోనూ బాధపడుతున్నట్లు అంచనా వేసింది. ఈ గణాంకాలు ప్రభుత్వం ప్రారంభించిన ‘పోషణ్ ట్రాకర్’యాప్లో నమోదై ఉన్నాయి. ఈ గణాంకాలను నేరుగా అంగన్వాడీ సిబ్బంది నమోదు చేసినవి కావడం గమనార్హం. 2020 గణాంకాలతో పోలిస్తే తీవ్ర పౌష్టికాహారలోపం ఉన్న ఆరు నెలల నుంచి ఆరేళ్లలోపు వయస్సున్న చిన్నారుల సంఖ్యలో ఏడాది కాలంలోనే 91% పెరుగుదల నమోదు కావడం ఆందోళన కలిగించే అంశం. ఎత్తుకు తగిన బరువు లేకపోవడం, మొహం, పొట్ట తదితర భాగాలు ఉబ్బినట్లు ఉండటం తదితర లక్షణాల ఆధారంగా తీవ్ర, మధ్యస్త పౌష్టికాహారలోపంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వచిస్తోంది. ఈ లక్షణాలున్న పిల్లలు త్వరగా అనారోగ్యం పాలయ్యేందుకు అవకాశం ఉంది. తీవ్ర పోషకాహార లోపంతో ఉన్న చిన్నారులు ఆరోగ్యవంతులతో పోలిస్తే మృత్యువాత పడేందుకు 9 రెట్లు ఎక్కువ అవకాశాలుంటాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 6.16 లక్షల మంది చిన్నారుల్లో పౌష్టికాహారలోపంతో బాధపడుతుండగా, వీరిలో 4.58 లక్షల మంది తీవ్రమైన, 1.57 లక్షల మంది మధ్యస్తమైన పౌష్టికాహారలోపంతో ఉన్నట్లు గుర్తించారు. కోవిడ్ మహమ్మారి దాదాపు అన్ని సామాజిక–ఆర్థిక సూచికలపైనా వ్యతిరేక ప్రభావం చూపిందని చైల్ రైట్స్ అండ్ యు(క్రై) సీఈవో పూజా మార్వాహ అన్నారు. గత దశాబ్ద కాలంపాటు సాధించిన పురోగతి కోవిడ్తో తుడిచి పెట్టుకుపోయిందని చెప్పారు. కోవిడ్ ఆంక్షల కారణంగా దీర్ఘకాలంపాటు అంగన్వాడీ కేంద్రాలను, స్కూళ్లలో మధ్యాహ్నభోజన పథకాన్ని నిలిపివేయడం పేద బాలలపై అన్ని రకాలుగా తీవ్ర ప్రభావం చూపిందన్నారు. కాగా, 2011 జనగణన ప్రకారం దేశంలో 46 కోట్ల మంది చిన్నారులున్నారు. -
Millet Snacks: చిరుధాన్యాలతో చిరుతిళ్ల వ్యాపారం!.. కోట్లలో లాభం..
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–4 ప్రకారం మన దేశంలో ఐదేళ్ల లోపు వయసు పిల్లల్లో 38% మందిలో పౌష్టికాహార లోపం వల్ల పెరుగుదల లోపించింది. 59% పిల్లలు రక్తహీనతతో బాధపడుతున్నారు. పిల్లలతో పాటు పెద్దల్లోనూ పౌష్టికాహార లోపం తీవ్రంగానే ఉంది. రోజువారీగా తినే ప్రధాన ఆహార పదార్థాలతోపాటు పౌష్టిక విలువలు లోపించిన చిరుతిళ్లు కూడా వీరి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇంట్లో అమ్మ చేసి పెట్టే చిరుతిళ్ల కన్నా మార్కెట్లో దొరికే ఆరోగ్యపరంగా నష్టదాయకమైన(జంక్) చిరుతిళ్లనే పిల్లలు.. ఆ మాటకొస్తే పెద్దలూ అంతే. జంక్ ఫుడ్కు చక్కని ప్రత్యామ్నాయం చిరుధాన్యాలతో తయారైన చిరుతిళ్లే అనటంలో సందేహం లేదు. ‘పౌష్టిక ధాన్యాలు’ (న్యూట్రి–సీరియల్స్)గా ప్రభుత్వం గుర్తించిన చిరుధాన్యాలలో ఖనిజ లవణాలు, బీకాంప్లెక్స్ విటమిన్లు, ప్రొటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటమే ఇందుకు కారణం. హైదరాబాద్లోని ఐసీఏఆర్ అనుబంధ కేంద్ర ప్రభుత్వ సంస్థ భారతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థ (ఐఐఎంఆర్) ప్రజలకు పౌష్టికాహార భద్రత కల్పించాలన్న లక్ష్యంతో కృషి చేస్తోంది. ఐదేళ్ల క్రితం అత్యాధునిక మౌలిక సదుపాయాలతో ఐఐఎంఆర్ దేశంలోనే తొలి ‘న్యూట్రిహబ్’ను నెలకొల్పింది. చిరుధాన్యాలతో రుచికరమైన వందలాది వంటకాలు, చిరుతిళ్లను అత్యాధునిక పద్ధతుల్లో తయారు చేయటంపై ‘న్యూట్రిహబ్’ ఔత్సాహిక స్టార్టప్ సంస్థలకు శిక్షణతోపాటు సాంకేతికత విజ్ఞానాన్ని, ఆర్థిక తోడ్పాటును సైతం అందించి ప్రోత్సహిస్తున్నట్లు ఐఐఎంఆర్ డైరెక్టర్ డా. విలాస్ ఎ తొనపి తెలిపారు. న్యూట్రిహబ్ ద్వారా ఇప్పటికి మిల్లెట్స్తో రకరకాల ఉత్పత్తులను తయారు చేసి విక్రయించటంపై 175 స్టార్టప్ సంస్థలకు మార్గదర్శనం చేసినట్లు న్యూట్రిహబ్ సీఈవో, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి. దయాకర్రావు చెప్పారు. వినూత్న ఉత్పత్తులతో ముందుకొచ్చి మార్కెట్లో దూసుకెళ్తున్న స్టార్టప్లలో కొన్నిటికి మహిళలే సారధులుగా ఉన్నారు. వీరిలో ఉత్తమ ఫలితాలు సాధించిన వారికి ఇటీవల ఐఐఎంఆర్ నిర్వహించిన న్యూట్రి–సీరియల్స్ భాగస్వాముల జాతీయ మెగా సమ్మేళనంలో అవార్డులు ప్రదానం చేశారు. అవార్డు గ్రహీతలైన మిల్లెట్ మహిళల విజయగాథలు.. చదవండి: ఇదే అతి పె..ద్ద.. గోల్డ్ మైనింగ్! ఏటా లక్షల కిలోల బంగారం తవ్వుతారట! నెల రోజులు తింటే తేడా తెలుస్తుంది! వరి, గోధుమలకు బదులు చిరుధాన్యాలను రోజుకు ఒక భోజనం చేస్తూ.. చిరుధాన్యాలతో చేసిన చిరుతిళ్లు (స్నాక్స్) తింటే జీవన శైలి జబ్బులతో బాధపడేవారు నెల రోజుల్లో ఆరోగ్యంలో మంచి మార్పును గమనించవచ్చు అని హైదరాబాద్ నివాసి అయిన డాక్టర్మందరపు సౌమ్య అంటున్నారు. ఆహార శుద్ధి రంగంలో ఉన్నత విద్యను అభ్యసించి, ఆహార సాంకేతిక నిపుణురాలిగా 16 ఏళ్ల అనుభవం కలిగిన ఆమె 120 రకాల ఆహారోత్పత్తుల ఫార్ములాలను రూపొందించారు. మూడేళ్ల క్రితం ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి ‘మిల్లెనోవా ఫుడ్స్’ పేరిట స్టార్టప్ సంస్థను నెలకొల్పారు. ఐఐఎంఆర్లోని న్యూట్రిహబ్ ద్వారా ఇంక్యుబేషన్ సేవలు పొందారు. పిల్లలు, పెద్దలు, వృద్ధులు తినదగిన ఆరోగ్యదాయకమైన చిరుధాన్య చిరుతిళ్ల ఫార్ములేషన్లకు రూపకల్పన చేశారు. చిరుధాన్యాలు, పండ్లు, పప్పుధాన్యాలు, కూరగాయలను కలిపి శాస్త్రీయ సమతులాహార ఫార్ములేషన్స్తో ప్రొటీన్ బార్, బ్రేక్ఫాస్ట్ బార్, ఇమ్యుటినిటీ బూస్టర్ బార్, స్పోర్ట్స్ ఎనర్జీ బార్లను రూపొందించారు. రైతుల నుంచి నేరుగా చిరుధాన్యాలను కొనుగోలు చేసి.. పోషకాలు సులువుగా జీర్ణమయ్యేందుకు ఎక్స్ట్రూజన్ టెక్నాలజీతో ఉత్పత్తులను తయారు చేసి విక్రయిస్తున్నామని డా. సౌమ్య తెలిపారు. రూ. 1.41 కోట్ల పెట్టుబడి పెట్టారు. చదవండి: Wemmer Pan Killer: అతనో నరరూప రాక్షసుడు.. ఏ శిక్ష వేసినా తక్కువే..! పది మందికి ఉపాధి కల్పిస్తున్నారు. మూడో ఏడాదిలో రూ. 1.27 కోట్ల నికర లాభాన్ని ఆర్జించారు. ఐఐఎంఆర్ నుంచి ఉత్తమ మహిళా స్టార్టప్ అవార్డును అందుకున్నారు. సిఎఫ్టిఆర్ఐ నుంచి తొలి బెస్ట్ స్టార్టప్ అవార్డును, ఇక్రిశాట్ నుంచి స్మార్ట్ ఫుడ్ ఎంటర్ప్రైజ్ అవార్డుతో పాటు ఐఎస్బి–యాక్షన్ ఫర్ ఇండియా బెస్ట్ సోషల్ ఎంటర్ప్రైజ్ పురస్కారం అందుకున్నారు. తెలంగాణ ప్రభుత్వ టీ–హబ్లో ఎం.ఎస్.ఎం.ఈ. అసోసియేట్ గ్రోత్ సెక్రెటరీగా ఎంపికైన డా. సౌమ్య ప్రజలకు ఆరోగ్యాన్నిచ్చే చిరుధాన్యాలదే భవిష్యత్తు అంటున్నారు. చిరుధాన్యాల ఉత్పత్తుల రంగంలోకి అడుగుపెట్టాలనుకునే వారికి సలహాలు సూచనలు ఇస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు డా.సౌమ్య. (79895 86619). https://millennova.com/ మహిళలకోసం ప్రత్యేక ఆహారోత్పత్తులు బెంగళూరుకు చెందిన రుచిక భువాల్క వృత్తి రీత్యా సోషల్ టీచర్. కుటుంబం కోసం వరి, గోధుమలు లేని ఆరోగ్యదాయకమైన ఆహారం తయారు చేసే క్రమంలో ఆమె చిరుధాన్యాలపై దృష్టి సారించారు. చిరుధాన్యాలను దైనందిన ఆహారంలో భాగం చేసుకోవటంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులను అధిగమించడంలో ప్రజలకు దోహపడాలన్న తపనతో ‘అర్బన్ మాంక్’ పేరిట స్టార్టప్ను నాలుగేళ్ల క్రితం నెలకొల్పారు. ఐఐఎంఆర్ న్యూట్రిహబ్ తోడ్పాటుతో చిరుధాన్యాల బియ్యం, పిండితోపాటు ఇడ్లీ /దోసెల పిండి, బిస్కెట్లు వంటి రోజువారీ అవసరమయ్యే 40 ఉత్పత్తులను అందిస్తూ పట్టణ ప్రాంత గృహిణుల మనసు చూరగొనటంలో రుచిక విజయం సాధించారు. సేంద్రియ చిరుధాన్యాలతో 30–60 ఏళ్ల మధ్య మహిళల కోసం ప్రత్యేక ఆహారోత్పత్తులను అందిస్తూ మిల్లెట్ అమ్మగా ప్రసిద్ధి పొందారు. 20 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఈ కామర్స్ సైట్స్ ద్వారా విక్రయిస్తూ రూ. 2 కోట్ల వార్షిక టర్నోవర్ సాధించిన రుచిక.. ఐఐఎంఆర్ నుంచి బెస్ట్ ఎమర్జింగ్ స్టార్టప్ అవార్డును అందుకున్నారు. https://milletamma.com/ చదవండి: African Wild Dogs: దయచేసి ఒక్కసారి తుమ్మి మా పార్టీని గెలిపించండి..!! ఆరోగ్యకరమైన చిరుతిళ్లు పౌష్టిక విలువలు లేని జంక్ స్నాక్స్ నుంచి పిల్లలను రక్షించుకోవడం కోసం చిరుధాన్యాలతో చిరుతిళ్లను తయారు చేయటం ప్రారంభించారు హైదరాబాద్కు చెందిన డి.మాధవి, బి. దివ్యజ్యోతి. ప్రగతినగర్లోని ఎలీప్ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో చిరుధాన్యాలతో రెడీ టు ఈట్ చిరుతిళ్ల ఉత్పత్తి కోసం చిరు పరిశ్రమను స్థాపించారు. రాగి కుకీస్, జోవార్ ఫ్లేక్స్ తయారీ కోసం ఐఐఎంఆర్ నుంచి టెక్నాలజీ తీసుకున్నారు. రాగి చోకో బాల్స్ తదితర ఉత్పత్తులను తయారు చేసి వినియోగదారులకు అందిస్తున్నారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాల నుంచి గిట్టుబాటు ధర చెల్లించి చిరుధాన్యాలను నేరుగా కొనుగోలు చేస్తున్నారు. రూ. 1.04 కోట్ల పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించి మూడేళ్లలో 80% తిరిగి రాబట్టుకోగలిగారు. 9 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. 2017లోనే ఐఐఎంఆర్ నుంచి ఉత్తమ మహిళా పారిశ్రామికవేత్తల అవార్డును మాధవి, దివ్యజ్యోతి స్వీకరించారు. తాజాగా ఐఐఎంఆర్ కన్సొలేషన్ అవార్డును అందుకున్నారు. https://rigdamfoods.com/ చదవండి: ఈ పుట్టగొడుగు పొడిని మహిళలు ప్రసవసమయంలో తింటే.. మిల్లెట్ మీల్ బాక్స్ హైదరాబాద్కు చెందిన వేముల అరుణ ఐదేళ్ల క్రితం శిక్షణ పొంది జొన్న లడ్డు, ఇడ్లీ, దోసెలు వంటి వంటకాలను విక్రయించడం ప్రారంభించారు. వివిధ సంస్థల్లో మధ్యాహ్న భోజనం (మీల్ బాక్స్) అందిస్తున్నారు. ప్రస్తుతానికి 8 రకాల చిరుధాన్య వంటకాలను అందిస్తున్నారు. ఐఐఎంఆర్ న్యూట్రిహబ్ తోడ్పాటుతో మరికొన్ని ఉత్పత్తులను జోడించబోతున్నామని అరుణ తెలిపారు. స్విగ్గి, జొమాటో తదితర ఆన్లైన్ పార్టనర్స్ ద్వారా రుచికరమైన చిరుధాన్య వంటకాలను కోరిందే తడవుగా ప్రజల ముంగిటకు అందించాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నామని ఆమె తెలిపారు. రూ. 2.5 లక్షల పెట్టుబడితో అరుణ చిరుధాన్యాల వంటశాలను ప్రారంభించారు. ఇద్దరికి ఉపాధి కల్పిస్తున్నారు. రూ. 2.8 లక్షల ఆదాయం గడించారు. తాజాగా ఐఐఎంఆర్ నుంచి కన్సొలేషన్ అవార్డును అందుకున్నారు అరుణ. vemulaaruna81@gmail.com చదవండి: ఈ వ్యాయామం క్రమంతప్పకుండా చేస్తే ఆయుష్షు పెరుగుతుందట! 6న వేరుశనగ, కంది, ఉల్లిగడ్డ సాగుపై శిక్షణ ప్రకృతి వ్యవసాయంలో వేరుశనగ, కంది, ఉల్లిగడ్డ సాగుపై ఈనెల 6 (శనివారం)న రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం తారామతి పేట దగ్గర తన వ్యవసాయ క్షేత్రంలో ప్రముఖ రైతు శాస్త్రవేత్త గుడివాడ నాగరత్నం నాయుడుతోపాటు తాండూరు రైతు నారాయణ, నాగర్కర్నూలు రైతు రాజు రైతులకు శిక్షణ ఇస్తారు. పాల్గొనదలచిన వారు ముందుగా పేర్లు నమోదు చేయించుకోవాలి. వివరాలకు.. 95538 25532. 7న బొప్పాయి, మునగ, అరటి సాగుపై శిక్షణ గుంటూరు జిల్లా పుల్లడిగుంట దగ్గర కొర్నెపాడులోని రైతునేస్తం ఫౌండేషన్ రైతు శిక్షణా శిబిరంలో ఈ నెల 7 (ఆదివారం)న బొప్పాయి, మునగ, అరటి సాగుపై నందివెలుగు రైతు మీసాల రామకృష్ణ, ఉద్యాన సహాయ సంచాలకులు రాజా కృష్ణారెడ్డి రైతులకు శిక్షణ ఇస్తారు. వివరాలకు.. 97053 83666. 60% రైతులు మెట్ట ప్రాంతాల్లో వర్షాధారంగా వ్యవసాయం చేస్తున్నారు. పంటలు సాగయ్యే విస్తీర్ణంలో 55% వర్షాధార ప్రాంతాల్లోనే ఉంది. భూతాపోన్నతి సమస్యలను ఎక్కువగా ఎదుర్కొంటున్న రైతులు వీరు. అయితే, దేశ వ్యవసాయ బడ్జెట్లో 10% మాత్రమే ఈ ప్రాంతాలపై ఖర్చు పెడుతున్నాం. ప్రభుత్వ పెట్టుబడులు పెంచాలి. ఫసల్ బీమా యోజన ఒక్కటే మెట్ట రైతును రక్షించలేదు. పంటల జీవవైవిధ్యం పెంపొందించాలి. – డాక్టర్ సబ్యసాచి దాస్, రీవైటలైజింగ్ రెయిన్ఫెడ్ అగ్రికల్చర్ నెట్వర్క్ చదవండి: అందుకే కార్డియాక్ అరెస్ట్ సంభవిస్తుందట..! ఇలా చేస్తే ప్రాణాలు నిలుపుకోవచ్చు.. -
World Food Day: పాలకూర, పప్పు దినుసులు, బాదం..తింటే స్త్రీలలో ఆ సమస్యలు ..
మన దేశంలో అనేకమంది స్త్రీలు పోషకాహారలోపంతో బాధపడుతున్నారనే విషయం అందరికీ విధితమే. దీనితో తాము అనారోగ్యంగా ఉండటమేకాకుండా, పోషకాహార లోపం ఉన్న రేపటి తరానికి జన్మనిస్తున్నారు. అందువల్ల మహిళలకు వారి పోషకాలలో వాటా అందేలా చూడడం అత్యవసరం. మన దేశంలో కేవలం ఆకలిని మాత్రమే నిర్మూలిస్తే సరిపోదు, బదులుగా, ఆరోగ్యకరమైన సమతుల్య ఆహారం ప్రజలందరికీ అందుబాటులో ఉంచడమూ అవసరమేనని పోషకాహారనిపుణులు అభిప్రాయపడుతున్నారు. మహిళల ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాలు, వాటి ప్రాముఖ్యత తెలుసుకుందాం.. పాలకూర పాలకూరలో పోషకాలను తక్కువగా అంచనా వేయకండి. ఇది రోగనిరోధక శక్తి పెరుగుదలకు, ఎముకల పుష్టికి సహాయపడుతుంది. పాలకూరను మహిళల సూపర్ఫుడ్ అని కూడా అంటారు. ఎందుకంటే దీనిలో మాగ్నీషియం అధికంగా ఉంటుంది. ఇది మహిళల గర్భధారణ సంమయంలో అవసరమైనంతమేరకు శరీరానికి ఖనిజాలను అందిస్తుంది. చదవండి: పెట్రోల్ రేట్లు ఎంత పెరిగినా నో ప్రాబ్లం.. వాటే ఐడియా గురూ..!! పప్పు దినుసులు పప్పు దినుసుల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా 40 ఏళ్లు పైబడిన మహిళలకు అవసరమైన ప్రొటీన్లు అందించడంలో వీటి పాత్ర కీలకం. ప్రతి రకం పప్పుల్లో దానిదైన ప్రత్యేక పోషక ప్రయోజనాలను అందిస్తుంది. ఓట్స్ రోజువారీ శక్తికి అవసరమైన ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లు, ఫైబర్ ను అందించడంలో ఓట్స్ కీలకం. వీటిల్లో ఇతర ధాన్యాల కంటే ఎక్కువ ప్రోటీన్లు, కొవ్వులు కలిగి ఉంటాయి. అంతేకాకుండా వీటిల్లో ఆరోగ్యకరమైన విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు కూడా అధికమే. పాలు వర్కింగ్ ఉమెన్కు ఎముకల్లో పటుత్వం తగ్గి, ఎముకల నిర్మాణంలో మార్పులు సంభవించే ప్రమాధం ఉంది. ఇది ఎముకల వ్యాధి వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఐతే పాలల్లో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. గ్లాస్ పాలు తాగితే రోజువారీ అవసరమైన కాల్షియంను తగుమోతాదులో అందిస్తుంది. ఇందులో ప్రోటీన్, భాస్వరం, పొటాషియం, డి, బి విటమిన్లు కూడా ఉన్నాయి. బ్రోకోలీ మహిళలకు మేలుచేసే ఆరోగ్యకరమైన ఆహారాల్లో బ్రోకోలీ అత్యంత కీలకమైనది. ఎందుకంటే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్వహించడంలో ఎంతో సహాయపడుతుంది. క్యాన్సర్కు కారణమయ్యే ఈస్ట్రోజెన్ స్థాయిలను తగ్గిస్తుంది. ముఖ్యంగా రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ నివారణలో దీని పాత్ర కీలకం. గుండె ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుంది. దీనిలో కాల్షియం కూడా పుష్కలంగా ఉంటుంది. ఎముకల పటుత్వానికి దోహదపడుతుంది. బాదం జీర్ణవ్యవస్థను మెరుగుపరిచే ప్రోబయోటిక్స్ ఉత్పత్తికి బాదం ఎంతో సహాయపడుతుంది. అంతేకాకుండా పావు కప్పు బాదంలో గుడ్డు కంటే ఎక్కువ ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. దీనిలో మెగ్నీషియం కూడా అధికంగానే ఉంటుంది. నిపుణులు సూచిస్తున్న ఈ ఆహారాలను తీసుకుంటే మహిళల్లో పోషకాహారలోపాన్ని అరికట్టవచ్చు. చదవండి: ఈ వాటర్ బాటిల్ ధర సీఈవోల జీతం కంటే ఎక్కువే!.. రూ.45 లక్షలు.. -
హంగర్ ఇండెక్స్లో దిగజారిన ఇండియా: ముంచుకొస్తున్న ఆకలి భూతం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచ ఆకలి తీర్చడమే వరల్డ్ ఫుడ్ డే ప్రధాన లక్ష్యం. ప్రపంచవ్యాప్తంగా 150 కి పైగా దేశాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి. అందరికీ ఆరోగ్యకరమైన ఆహారం అంటూ ప్రతీ ఏడాది లాగానే ‘‘ఆరోగ్యకరమైన రేపటి కోసం ఇప్పుడు సురక్షితమైన ఆహారం" అనే థీమ్ను నిర్ణయించారు. ఆహారాన్ని ఆదా చేయడం, వ్యర్థాలను తగ్గించడం, వ్యవసాయం, ఆరోగ్యకరమైన ఆహార పదార్థాల అభివృద్ధిని పెంచడం అనేది లక్ష్యం. తద్వారా భవిష్యత్తు తరాల కోసం ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో ప్రబలంగా ఉన్న పోషకాహారలోప సమస్యను నిర్మూలించాలనేది ప్రధానోద్దేశం. వరల్డ్ ఫుడ్ డే : చరిత్ర, ప్రాధాన్యత ఐక్యరాజ్య సమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏఓ) 1945లో స్థాపితమైంది. దీనికి గుర్తుగా ప్రపంచ ఆహార దినోత్సవాన్ని పాటిస్తున్నారు. 1979 నుండి ప్రతి సంవత్సరం అక్టోబర్ 16న ప్రపంచ ఆహార దినోత్సవాన్ని జరుపుకుంటారు. హంగేరియాకు చెందిన మాజీ వ్యవసాయ, ఆహార మంత్రి డాక్టర్ పాల్ రోమానీ సూచన మేరకు ప్రపంచవ్యాప్తంగా 150కి పైగా దేశాలు ఈ డేను జరుపుకుంటాయి. దాదాపు 821 మిలియన్ల ప్రజలు దీర్ఘకాలికంగా పోషకాహార లోపంతో ఉన్నారు. వీరిలో దాదాపు 99 శాతం మంది అభివృద్ధి చెందుతున్న దేశాలలో నివసిస్తుండటం గమనార్హం. ప్రపంచంలో ఆకలితో ఉన్నవారిలో 60శాతం మంది మహిళలు. ప్రతి సంవత్సరం దాదాపు 20 మిలియన్ల మంది పిల్లలు తక్కువ బరువుతో పుట్టారు. ఇందులో కూడా 96.5శాతం మంది అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఉన్నారు. అది కూడా ప్రతి ఐదు జననాలలో ఒకటి సరైన వైద్య సదుపాయం లేనందు వల్ల చనిపోతున్నారు. ఫలితంగా పిల్లల్లో మరణాలలో దాదాపు 50శాతం మంది 5 సంవత్సరాల లోపే ఉంటున్నాయి. ఎయిడ్స్, మలేరియా, క్షయ వ్యాధి కారణగా సంభవిస్తున్న మరణాలకంటే ఆకలి కారణంగా ప్రపంచవ్యాప్తంగాఎక్కువగా మరణాలు సంభవిస్తున్నాయి. ప్రతి రోజు, 10,000 మందికి పైగా పిల్లలతో సహా 25,000 మంది ఆకలి, సంబంధిత కారణాలతో మరణిస్తున్నారు. 2050 నాటికి ప్రపంచ జనాభా 9.6 బిలియన్లకు చేరుకుంటుందని అంచనా. ఈ నేపథ్యంలో ఆహార ఉత్పత్తని పెంచడం అంటే తక్కువ ప్రాంతంలో ఎక్కువ ఆహారాన్ని ఉత్పత్తి చేసే పద్ధతులు ముఖ్యంగా సహజ వనరులను ఉపయోగించాలినేది లక్ష్యం. మెరుగైన పంట, నిల్వ, ప్యాకింగ్, రవాణా, మౌలిక సదుపాయాలు, మార్కెట్ యంత్రాంగాలతో పాటు, సంస్థాగత చట్టపరమైన చర్యల తో అనేక కార్యక్రమాల ద్వారా తుది వినియోగానికి ముందు ఆహార నష్టాలను తగ్గించాలని నిర్ణయించింది. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ మరోవైపు గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో ఇండియా మరింత దిగజారింది. ప్రపంచ ఆకలి సూచిక (జీహెచ్ఐ) 2021లో 116 దేశాలలో భారతదేశం 101వ స్థానానికి పడి పోయింది. తాజా నివేదిక ప్రకారం 94వ స్థానం 101కి దిగజారింది. తద్వారా పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్ , నేపాల్ కంటే కూడా ఇండియా వెనుకబడి ఉంది. బ్రెజిల్, చిలీ, చైనా. క్యూబా కువైట్ సహా పద్దెనిమిది దేశాలు జీహెచ్ఐ స్కోరు తొలి అయిదు టాప్ ర్యాంక్లో నిలిచాయని ఆకలి, పోషకాహారలోపాలను లెక్కించే గ్లోబల్ హంగర్ ఇండెక్స్ వెబ్సైట్ గురువారం తెలిపింది. అంతేకాదు ఇండియాలో ఆకలి స్థాయి ఆందోళనకరంగా ఉందని పేర్కొంది. దేశంలో కరోనా వైరస్ మహమ్మారి, సంబంధిత ఆంక్షల ప్రభావంతో ప్రజలు తీవ్రంగా నష్ట పోతున్నారనీ, ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే పోషహార లోపంతో బాధపడుతున్న పిల్లల రేటు అత్యధికంగా ఉన్న దేశం ఇండియానే అని నివేదిక పేర్కొంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 47 ప్రకారం దేశంలో పోషకాహార ప్రమాణాలను కాపాడటం ప్రభుత్వాల విధి. -
మెరుగైన వంగడాల అభివృద్ధే లక్ష్యం కావాలి
సాక్షి, అమరావతి/యూనివర్సిటీ క్యాంపస్ (తిరుపతి): మెరుగైన వంగడాలను అభివృద్ధి చేయడంలో వ్యవసాయ విశ్వవిద్యాలయాలు కీలక పాత్ర పోషించాలని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆకాంక్షించారు. దేశంలో ఆహార కొరత తీర్చడానికి అదే పరిష్కారమన్నారు. తిరుపతిలో మంగళవారం నిర్వహించిన ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 50వ స్నాతకోత్సవ వేడుకల్లో విజయవాడ నుంచి వర్చువల్ విధానంలో ఆయన చాన్స్లర్ హోదాలో హాజరయ్యారు. గవర్నర్ మాట్లాడుతూ.. ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏవో) తాజా గణాంకాల ప్రకారం దేశ జనాభాలో దాదాపు 14 శాతం మంది ఇంకా పోషకాహార లోపం, ఐదేళ్లలోపు పిల్లల్లో 20 శాతం మంది తక్కువ బరువు సమస్య, పునరుత్పత్తి వయసులో ఉన్న మహిళల్లో 51.4 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారని వివరించారు. పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు బయో–ఫోర్టిఫికేషన్పై పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సమీకృత వ్యవసాయ విధానాలు, యాంత్రీకరణ విధానాల్లో పరిశోధనల ద్వారానే సాగు ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే లక్ష్యాన్ని సాధించగలమని గవర్నర్ అన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్, సాగునీరు సమర్థ వినియోగ సాంకేతికత, దిగుబడులు పెంపొందించడం, వ్యవసాయ–వ్యవసాయేతర రంగాల మధ్య సమన్వయాన్ని పెంచడం తదితర అంశాలపై శాస్త్రవేత్తలు ప్రధానంగా దృష్టి సారించాలని కోరారు. పంటల ఉత్పత్తి, రక్షణకు సంబంధించిన సాంకేతికతలను అభివృద్ధి చేసి రైతుల సమస్యలను పరిష్కరించాలన్నారు. బోధన, పరిశోధనల్లో నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలని సూచించారు. తక్కువ ధరలకు వ్యవసాయ ఉపకరణాలు అందుబాటులోకి తేవడం ద్వారానే రైతుల జీవన స్థితిగతులను మెరుగుపర్చగలమన్నారు. వ్యవసాయ విద్యార్థులు తాము ఎంచుకున్న ప్రత్యేక అంశాల్లో నిరంతర పరిశోధనలతో విజ్ఞానాన్ని పెంపొందించుకుని నవ కల్పనలను ఆవిష్కరించాలని గవర్నర్ హరిచందన్ ఆకాంక్షించారు. స్నాతకోత్సవంలో తిరుపతి నుంచి విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ ఆదాల విష్ణువర్ధన్రెడ్డి, రాజ్భవన్ నుంచి గవర్నర్ కార్యదర్శి ముఖేష్ కుమార్మీనా, విశ్వ విద్యాలయ ప్రతినిధులు డాక్టర్ వి.చెంగారెడ్డి, డాక్టర్ చెరుకూరి శ్రీనివాసరావు, రిజిస్ట్రార్ గిరిధర్కృష్ణ పాల్గొన్నారు. -
Leaf Vegetable: పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారా?
సాక్షి, అమరావతి: దేశంలో నూటికి 80 శాతం మంది కౌమార దశలో ఉన్న పిల్లలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. వీరిలో ఎక్కువమంది పేదలే. ఇవి ప్రైవేటు సంస్థలో, వ్యక్తులో చెప్పిన మాటలు కాదు. సాక్షాత్తు ఐక్యరాజ్యసమితికి అనుబంధంగా ఉండే యూనిసెఫ్ భారతదేశానికి సంబంధించి ఇటీవల ఇచ్చిన నివేదిక. మారుతున్న రోజులకు ఇదో సవాలు. దీన్ని ఎదుర్కొనేందుకు అనేక పరిష్కార మార్గాలు మన చేతుల్లోనే ఉన్నా వాటిని చిన్నచూపు చూస్తున్న ఫలితమే ఈ దుర్గతి అని ఆహార నిపుణులు ఆవేదన చెందుతున్నారు. ఈనేపథ్యంలో పోషకాహార లేమిని తరిమి కొట్టేందుకు డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన వర్శిటీ నిపుణులు అనేక పరిష్కారాలను సూచిస్తున్నారు. వాటిల్లో అత్యంత ఆచరణాత్మకమైంది పెరటి తోటల పెంపకం. పెరటి తోటలకు పెరిగిన గిరాకీ పోషకాహార లోపం, కాలుష్యం, హిడెన్ హంగర్ (పౌష్టికాహర లేమి)కు ఏదీ అతీతం కాకపోవడంతో ఇటీవలి కాలంలో పెరటి తోటలకు బాగా గిరాకీ పెరిగింది. పోషకాహారలోప నివారణలో వీటి పాత్ర కీలకమైంది. ఆహార ఉత్పత్తిలో ప్రపంచవ్యాప్తంగా భారత్ రెండో స్థానంలో ఉన్నప్పటికీ పోషకాహార లోపంలోనూ అదేస్థాయిలో ఉంది. పెరుగుతున్న జనాభాను, పోషకాహార లోపాలను, కూరగాయల లభ్యతను, ధరలను దృష్టిలో ఉంచుకుని నాణ్యమైన కూరగాయలను ఏడాది పొడవునా అందుబాటులో ఉంచేందుకు ఈ పోషకాహార పెరటి తోటలు ఉపయోగపడతాయి. అందుకే వీటిని ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. రసాయన ఎరువులు, సస్యరక్షణ, కలుపు నివారణ మందులు వాడకుండా సేంద్రియ పద్ధతిలో కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు పండించుకోవడం అనివార్యమని శాస్త్రవేత్తలు సైతం సలహా ఇస్తున్నారు. ఒక్కో మనిషికి ఎన్నెన్ని గ్రాములు కావాలంటే.. సగటున ప్రతి మనిషికి రోజుకు కనీసం 85 గ్రాముల పండ్లు, 75 నుంచి 125 గ్రాముల ఆకుకూరలు, 85 గ్రాముల ఇతర కూరగాయలు, 85 గ్రాముల దుంప కూరలు కావాలి. ఇలా తీసుకున్నప్పుడే శరీరానికి అవసరమైన పోషకాలు సమకూరతాయి. ప్రస్తుత లెక్క ప్రకారం ఇంతకన్నా తక్కువ తీసుకుంటున్నారు. మారుతున్న ఆహారపు అలవాట్ల నేపథ్యంలో ఆకుకూరలకు రోజువారీ ఆహారంలో చోటు తక్కువైంది. ఫలితంగా విటమిన్ల లోపం ఏర్పడుతోంది. విటమిన్–ఎ లోపంతో రేచీకటి వస్తుంది. ఐరన్ లోపంతో రక్తహీనత వస్తుంది. దాదాపు సగంమంది మహిళలు, పిల్లలు, యుక్త వయస్కులు రక్తహీనతతో బాధపడుతున్నారు. విటమిన్–బి లోపంతో ఆకలి మందగించడం, నోటిచివర పగుళ్లు, నాలుకపై పూత వస్తాయి. ఈ లోపాలను నివారించాలంటే ఆకుకూరలు, పండ్లు తగిన మోతాదులో తీసుకోవాలి. సమగ్ర జాతీయ పోషకాహార సర్వే లెక్క ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలకు సరైన పోషకాహారం అందడంలేదు. 2 నుంచి 4 ఏళ్ల వయసున్న పిల్లల్లో విటమిన్–ఎ లోపం తీవ్రంగా ఉంది. కూరగాయల వినియోగం తక్కువగా ఉంది. పెరటి తోటల్లోని ఆకుకూరలతో.. పోషకాహార పెరటి తోటలు పెంచడం వల్ల కుటుంబ ఆరోగ్యం బాగవుతుంది. దీనికి కావాల్సిందల్లా ఆసక్తే. చాలామందికి పెరళ్లు ఉంటాయి. లేనివారు కుండీల్లోను పెంచుకోవచ్చు. ఏడాది పొడవునా బెండ, వంగ, టమోటా, మిరప, పాలకూర, మెంతికూర, గోంగూర, తోటకూర, చుక్కకూర, బచ్చలి, సిర్రాకు, నిమ్మ, జామ, అరటి, బొప్పాయి, మామిడి, దానిమ్మ వంటి వాటిని పెంచుకోవచ్చు. అదనపు ఆదాయం పొందవచ్చు. ఇవి పోషకాహార లోపాన్ని నివారిస్తాయి. ఇళ్లల్లో మనకున్న స్థలాన్ని చిన్న మడులుగా విడగొట్టి తీగ జాతి కూరగాయలను కంచె మీదికి పాకించవచ్చు. దంప కూరలను గట్లపై పెంచవచ్చు. పండ్ల చెట్లను పెరట్లో ఏదైనా మూలగా వేసుకోవచ్చు. పెరట్లోనే ఒక పక్క కంపోస్టు గుంతను ఏర్పాటు చేసుకుని సేంద్రియ ఎరువును తయారు చేసుకుని దాన్నే ఉపయోగించుకోవచ్చు. బయటి నుంచి నారు తెస్తే 3, 4 వారాల మధ్య నాటుకోవాలి. నాటే సమయంలో 2, 3 గంపల పశువుల ఎరువులు వేయాలి. ఉపయోగాలు ఏమిటంటే.. కూరగాయల వినియోగం పెరిగితే పోషకాహార లోపం, సూక్ష్మపోషకాల లోపాలను నివారించుకోవచ్చు. కుటుంబ ఆహార అవసరాలను తీర్చుకోవచ్చు. తాజా కూరగాయలతో పోషకాలు మెండుగా వస్తాయి. వ్యాధుల నుంచి రక్షణ ఉంటుంది. ఖనిజాలు, పోషకాలు, విటమిన్లు సరేసరి. డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలోని కృషి విజ్ఞాన కేంద్రాలు ఈ పోషకాహార తోటలు పెంచుకోవడానికి సూచనలు, సలహాలు ఇస్తున్నాయి. ఇళ్లల్లో పెంచుకోవడానికి ఆకుకూరల విత్తనాలు కూడా సరఫరా చేస్తున్నట్లు డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం గృహ విజ్ఞానశాస్త్ర విభాగం శాస్త్రవేత్తలు డాక్టర్ బి.విజయలక్ష్మి, డాక్టర్ కె.మల్లికార్జునరావు, బి.గోవిందరాజులు తెలిపారు. -
కొండకోనల్లో ప్రవాసిని వైద్యం
పోషకాహార లేమి, ప్రసూతి మరణాలు ఇప్పటికీ మారుమూల గ్రామాల్లో నెలకొన్న పరిస్థితులకు అద్దం పడుతుంటాయి. ఒరిస్సాలోని కంధమాల్ జిల్లాలో గిరిజన తండాలు ఎక్కువ. అరకొరగా కూడా అందని వైద్యసేవలు. రోడ్లు, రవాణా, ఫోన్ సదుపాయాలు లేక అటవీ ప్రజానీకం నిత్యం అవస్థలను ఎదుర్కొంటూనే ఉంది. 33 ఏళ్ల ప్రవాసినీ భట్నాగర్ ఈ పరిస్థితిని గుర్తించి, అవసరమైన మెడిసిన్స్ పట్టుకొని కొండకోనల్లో ఉన్న గిరిజనులకు అందజేస్తోంది. ప్రసూతి మరణాల నివారణకు కృషి చేస్తోంది. ఆరోగ్య అవగాహన సదస్సులను ఏర్పాటు చేస్తోంది. మూడేళ్లుగా ఆత్మశక్తి ట్రస్ట్ ద్వారా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రవాసిని మారుమూల గ్రామాల్లోని దాదాపు 21 వేల మంది గిరిజనుల్లో ఆరోగ్య స్పృహ కల్పిస్తోంది. గిరిజన గ్రామాలు కొండకోనల్లో ఉంటాయి. వాటికి చేరుకోవాలంటే కాలువలు, కొండగట్లు, రాళ్లూ రప్పలు, ముళ్ల పొదలు.. దాటుకుంటూ ప్రయాణించాలి. అలా ప్రవాసిని రోజూ కొన్ని మైళ్ల దూరం నడుస్తూనే గిరిజనులను కలుసుకుంటుంది. ఎలాంటి రవాణా సదుపాయాలు లేని ఈ ప్రాంతాల్లో పనిచేయడం తనకు కష్టమని ప్రవాసినికి తెలుసు. కానీ, వీటి గురించి పట్టించుకోలేదు ప్రవాసిని. గిరిజనులు నేటికీ మొరటైన సాంప్రదాయ వైద్యపద్ధతులనే అనుసరిస్తున్నారు. ఆరోగ్య వృద్ధి లేక ఇబ్బందులు పడుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని తన సేవలను విస్తరించింది. గిరిజన, ఇతర అట్టడుగు వర్గాలకు కరోనా మహమ్మారి మరిన్ని సమస్యలను సృష్టించింది. దీంతో ప్రవాసిని పాత్ర గతంలో కంటే మరింత ముఖ్యమైంది. ఆరోగ్య పథకాల పట్ల అవగాహన గిరిజన ప్రాంతాల పరిస్థితి గురించి ప్రవాసిని వివరిస్తూ –‘పోషకాహార లోపం వారికి అన్నిరకాల ఆరోగ్యసమస్యలకు మూలమైంది. ఆరోగ్య సదుపాయాలు లేకపోవడం వల్ల తల్లీ పిల్లల మరణాల రేటు పెంచుతోంద’ని వివరిస్తుంది. 2018 లో లాభాపేక్షలేని ఆత్మశక్తి ట్రస్టు ద్వారా తన సేవలను అందించడానికి సిద్ధపడింది ప్రవాసిని. మూడునెలలు ఆ సంస్థలో పనిచేసిన తర్వాత పోషకాహారం లేని మారుమూల గ్రామాల ప్రజలకు చేరువకావడానికి ఆసక్తి చూపించింది. అప్పటి నుండి ‘హెల్త్ యానిమేటర్గా’గా పనిచేస్తోంది. శిక్షణ పొందిన ఆరోగ్య కార్యకర్తగా గిరిజనులకు కావల్సిన ఔషధాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకాల్లో గిరిజనులు భాగం పంచుకునే లా చేస్తోంది. కష్టపడలేక మధ్యలోనే సేవలను ఆపేసే కొందరిలా కాకుండా ఇష్టంతో తన పనిని కొనసాగిస్తోంది. ప్రతి రోజూ 2–3 గ్రామాలను సందర్శించి ఇల్లిల్లూ తిరిగి ఆరోగ్య సంరక్షణ చేపడుతోంది. తుడిబంధ బ్లాకులో 76 మంది పురుషులు, 37 మంది మహిళలను గ్రామ కార్యకర్తలు గా ఆరోగ్య పరిరక్షకులుగా తయారు చేసింది. కష్టం తీరింది.. ‘ఈ గిరిజన ప్రాంతాల మహిళలు, బాలికలు తమ ఆరోగ్య సమస్యలను పంచుకోవడానికి వెనకాడతారు. కానీ, నాతో ఎలాంటి జంకు లేకుండా పంచుకుంటారు. దీని వల్ల వారి అవసరాలను తెలుసుకోవడానికి, సరైన మార్గం చూపడానికి నాకు వీలవుతుంది’ అని చెబుతుంది ప్రవాసిని. ‘గతంలో జ్వరం వచ్చి ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి వెళ్లాలంటే పదేసి కిలోమీటర్లు నడవాల్సి వచ్చేది. దీనికి 200 నుంచి 500 రూపాయలు ఖర్చు కూడా అయ్యేది. ఎంతో కష్టపడి ఆసుపత్రి కి వెళ్లినా అక్కడ సిబ్బంది ఉండేవాళ్లు కాదు. ఇప్పుడు ప్రవాసిని ద్వారా మాకు ఆ కష్టం తీరింది. చిన్న చిన్న జబ్బులకు మందులు అందుబాటులో ఉండటంతో త్వరగా కోలుకోగలుగుతున్నాం’ అని గుమా గ్రామ పంచాయితీ సర్పంచ్ సుస్మిత వివరిస్తారు. ఈ ప్రాంతాల్లో 102, 108 అంబులెన్స్ సర్వీసులు అందుబాటులో లేవు. అందుకే జబ్బులు ముదరకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకునేలా వారిలో అవగాహన కల్పించడంతోపాటు బాల్య వివాహాలు, రుతు శుభ్రతకు సంబంధించిన అంశాలపై ప్రజలను చైతన్యవంతులను చేస్తోంది. పోషకాహారం ఆవశ్యకత గురించి చెబుతూ పెరటి తోటల పెంపకాన్ని ప్రోత్సహిస్తోంది. ప్రవాసిని లాంటి మహిళలు ఈ సమాజానికి ఎంతో మంది అవసరం. ఇలాంటి వారి వల్లే గ్రామాల అభివృద్ధి మెరుగుపడుతుంది. ఆదివాసీలతో ప్రవాసినీ భట్నాగర్ -
బాల భారతం.. బలహీనం
న్యూఢిల్లీ: భారత్లో కరోనా మహమ్మారి విసిరిన పంజాకు లక్షల కుటుంబాల ఆర్థిక పరిస్థితి దిగజారింది. ఎన్నో కుటుంబాలు పేదరికంలోకి జారిపోయాయి. ఫలితంగా ఆయా కుటుంబాల్లోని పిల్లలకు సరైన పోషకాహారం అందడం లేదు. బాల భారతం బలహీనంగా మారుతోంది. దేశంలో గత ఏడాది నవంబర్ నాటికి ఆరు నెలల నుంచి ఆరేళ్ల వయసున్న చిన్నారుల్లో 9,27,606 మంది తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్నట్లు తేలిందని కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ వెల్లడించింది. బాధితుల్లో ఎక్కువ మంది ఉత్తరప్రదేశ్, బిహార్లోనే ఉన్నారని తెలియజేసింది. సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కింద అడిగిన ప్రశ్నకు ఈ మేరకు సమాధానం ఇచ్చింది. పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లల గణాంకాలను విడుదల చేసింది. దీనిప్రకారం.. అత్యధికంగా ఉత్తరప్రదేశ్లో 3,98,359 మంది, బిహార్లో 2,79,427 మంది బాధిత బాలలు ఉన్నారు. లద్దాఖ్, లక్షద్వీప్, నాగాలాండ్, మణిపూర్, మధ్యప్రదేశ్లో తీవ్రమైన పోషకాహార కొరతను ఎదుర్కొంటున్న చిన్నారులెవరూ లేకపోవడం గమనార్హం. అనారోగ్య ముప్పు అధికం ఎత్తుకు తగిన బరువు లేకుండా... చాలా బలహీనంగా ఉంటే తీవ్రమైన పోషకాహార లోపంగా (ఎస్ఏఎం) ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నిర్వచించింది. ఈ సమస్యతో బాధపడుతున్న చిన్నారులు ఉండాల్సిన దానికంటే చాలా తక్కువ బరువు ఉంటారు. వారిలో రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటుంది. అందువల్ల సాధారణ ఆరోగ్యవంతులతో పోలిస్తే.. అలాంటి వారికి ఏదైనా వ్యాధి సోకితే మరణించే అవకాశాలు 9 రెట్లు అధికంగా ఉంటాయి. కరోనా వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్న బాలల సంఖ్య ఇంకా పెరుగుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ‘‘దేశంలో కరోనా మహమ్మారి వల్ల చాలామంది ఉద్యోగాలు, ఉపాధి కోల్పోతున్నారు. నిరుద్యోగ సమస్య వేగంగా పెరుగుతోంది. ఆర్థిక సంక్షోభం ఇప్పటికే మొదలయ్యింది. ఫలితంగా ఆకలి రక్కసి కాటేస్తోంది. ఆకలి ఉన్నచోట పోషకాహార సమస్య కచ్చితంగా ఉంటుంది. ఈ సమస్యను అధిగమించడానికి ప్రభుత్వం చర్యలను వేగవంతం చేయాలి’’అని హెచ్ఏక్యూ సెంటర్ ఫర్ చైల్డ్ రైట్స్ సంస్థ సహ వ్యవస్థాపకురాలు ఇనాక్షీ గంగూలీ సూచించారు. కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ గణాంకాల ప్రకారం.. 2020 నవంబర్ నాటికి ఆరు నెలల నుంచి ఆరేళ్లలోపు చిన్నారుల్లో తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్నవారు మహారాష్ట్రలో 70,665 మంది, గుజరాత్లో 45,749, ఛత్తీస్గఢ్లో 37,249, ఒడిశాలో 15,595, తమిళనాడులో 12,489, జార్ఖండ్లో 12,059, ఆంధ్రప్రదేశ్లో 11,210, తెలంగాణలో 9,045, అస్సాంలో 7,218, కర్ణాటకలో 6,899, కేరళలో 6,188, రాజస్తాన్లో 5,732 మంది ఉన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 10 లక్షలకు పైగా అంగన్వాడీ కేంద్రాల నుంచి ఈ సమాచారం సేకరించారు. పిల్లల్లో పోషకాహార లోపాన్ని నివారించడంలో అంగన్వాడీ కేంద్రాలదే కీలక బాధ్యత అని ఇనాక్షీ గంగూలీ చెప్పారు. చిన్నారులు, కౌమార బాలికలు, మహిళల్లో పోషకాహార సమస్యను నివారించడానికి కేంద్ర ప్రభుత్వం 2018లో పోషన్ అభియాన్ పథకాన్ని ప్రారంభించింది. -
బాల్యం.. బలహీనం
సాక్షి, హైదరాబాద్: ‘తిండి కలిగితే కండ కల దోయ్.. కండ కలవాడేను మనిషోయ్’అన్నాడు కవి గురజాడ. సమయానుకూలంగా ఆహారం తీసుకోక పోవడంతో అనర్థాలు తలెత్తుతాయి. గర్భిణులు, బాలింతలు సరైన ఆహారం తీసుకోక పోవడం పుట్టబోయే, పుట్టిన పిల్లల ఎదుగుదలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. పుట్టినప్పటి నుంచి ఆర్నెల్ల వరకు పిల్లలు తల్లిపాల పైనే ఆధారపడతారు. తల్లి సరైన ఆహారం తీసుకోకుంటే పిల్లలకు సరిపడా పాలు అందక సమస్యల బారినపడే ప్రమాదం ఉం టుంది. అంగన్వాడీల్లో నమోదైన ప్రతి 100 మంది చిన్నారుల్లో 15 మంది పౌష్టికాహార లోపంతో సతమతమవుతున్నట్లు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిశీలన చెబుతోంది. 2.16 లక్షల మంది చిన్నారుల పరిశీలన రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాల్లో నమోదైన చిన్నా రుల ఆరోగ్య స్థితిని వారి బరువు ఆధారంగా నిర్ధారిస్తున్నారు. ఈ క్రమంలో పక్షం రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఐదేళ్లలోపు వయసున్న 2,16,044 మంది చిన్నారుల బరువును కొలిచారు. వీరిలో 1,34,429 మంది చిన్నారులు సాధారణ బరువుతో ఆరోగ్యంగా ఉన్నట్లు నిర్ధారించారు. మరో 33,034 మంది చిన్నారులు సాధారణ బరువు కంటే 15– 25 శాతం తక్కువగా ఉన్నారు. వీరిలో 8,191 మంది చిన్నారులు 35 శాతం కంటే తక్కువ బరువున్నట్లు తేల్చారు. ఆరోగ్యంగా ఉన్న చిన్నా రుల విషయంలో తల్లిదండ్రులకు సలహాలు, సూచ నలు ఇచ్చి సరిపెట్టగా... బరువు తక్కువున్న చిన్నా రుల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇవ్వాలని నిర్ణ యించారు. అదేవిధంగా ఆ పిల్లలకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఇచ్చే సాధారణ ఆహారంతో పాటు మరింత పోషకాలు అందే విధంగా అదనపు కోటా కింద ఆహార పంపిణీ చేయనున్నారు. ఈ రకం పిల్లలను ప్రతివారం పరిశీలించి ఆరోగ్య స్థితిని అంచనా వేయనున్నారు. మరో 48,581 మంది చిన్నారులు నిర్ణీత బరువు కంటే అధికంగా (ఓవర్ వెయిట్) ఉన్నట్లు గుర్తించారు. ఈ పిల్లల తల్లులకు సరైన జాగ్రత్తలు పాటించాలని, లేకుంటే ఊబకాయం బారినపడే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. అదేవిధంగా పిల్లలకు ఇచ్చే ఆహారం క్రమపద్దతిలో ఉండాలని సూచిస్తూ మెనూను రూపొందించి ఇస్తున్నారు. పౌష్టిక పునరావాసానికి 1.2 శాతం పిల్లలు బరువును అంచనా వేస్తూ పిల్లల ఆరోగ్యస్థితిని గుర్తిస్తున్న అధికారులు... ప్రమాదకరంగా ఉన్న చిన్నారులపై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారు. ప్రస్తుతం బరువును పరిశీలించిన వారిలో 2,658 మంది చిన్నారులు తీవ్ర పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. వీరిని ఎన్ఆర్సీ (న్యూట్రీషియన్ రిహాబిలిటేషన్ సెంటర్)కి రిఫర్ చేస్తూ కొంతకాలం అక్కడే ఉండేలా అడ్మిట్కు ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా 23,917 పిల్లల ఆరోగ్య స్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించనున్నారు. ఈ చిన్నారుల కోసం ప్రత్యేక రిజిస్టర్ నిర్వహించి ఆరోగ్య స్థితిని నమోదు చేయాల్సిందిగా ఉన్నతాధికారులు వైద్యశాఖ సిబ్బందిని ఆదేశించారు. విటమిన్లు, మినరల్స్పై దృష్టి పెట్టాలి పిల్లలకు ఆహారాన్ని ఇచ్చే విషయంలో చాలామంది పరిమాణం (క్వాంటిటీ) పైనే ఎక్కువ దృష్టి పెడతారు. ఈ సమయంలో ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని అందిస్తుంటారు. విటమిన్లు, మినరల్స్ ఉండే ఆహారాన్ని పెద్దగా పట్టించుకోరు. పిల్లలకు ఐరన్, కాల్షియం ఉన్న ఆహారం సమపాళ్లలో ఇస్తేనే వారి ఎదుగుదల ఆశాజనకంగా ఉంటుంది. ఏడాది దాటిన చిన్నారులకు అన్నిరకాల ఆహారాన్ని ఇవ్వొచ్చు. బలవర్ధకమైన ఆహారం పేరిట మార్కెట్లో దొరికే డబ్బాల కంటే ఇంట్లో తయారు చేసే ఉగ్గు శ్రేష్టమైనది. ఈ ఉగ్గులో తృణదాణ్యాలను కలిపి తయారు చేస్తే మంచిది. - డాక్టర్ స్పందన, న్యూట్రిషనిస్ట్ -
పిల్లల్లో పెరుగుతున్న పౌష్టికాహార లోపం
సాక్షి, అమరావతి : పిల్లల్లో పౌష్టికాహార లోపం దేశంలో పెద్ద సవాలుగా తయారైందని పోషన్ అభియాన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఏడాది నుంచి నాలుగో ఏడాది వరకు పిల్లలు అత్యధికంగా రక్తహీనతతో బాధ పడుతున్నారని పోషన్ అభియాన్ ఈ ఏడాది సెప్టెంబర్లో వెల్లడించిన మూడవ నివేదికలో స్పష్టం చేసింది. 5-9 సంవత్సరాల లోపు పిల్లలతో పాటు 10-19 సంవత్సరాల పిల్లల్లో రక్తహీనతతో పాటు విటమిన్ ఏ, విటమిన్-డి, బి-12, జింక్ లోపాలు అత్యధికంగా ఉన్నట్లు స్పష్టం చేసింది. పట్టణ ప్రాంతాల పిల్లల్లో ఎక్కువ బరువు, ఊబకాయం పెరుగుతోందని.. ఇందుకు ప్రధాన కారణం ఆహారపు అలవాట్లేనని నివేదికలో పేర్కొంది. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అదనపు పోషకాహారం అందించాలని సూచించింది. సమగ్ర శిశు అభివృద్ధి సర్వీసెస్-సంయుక్త అప్లికేషన్ సాఫ్ట్వేర్ ద్వారా పౌష్టికాహార లోపం ఉన్న పిల్లలను, గర్భిణులను గుర్తించి అంగన్వాడీ కేంద్రాల ద్వారా సప్లిమెంటరీ పోషకాలను అందించాల్సి ఉందని స్పష్టం చేసింది. వివిధ రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాల్లో ఎక్కువ పౌష్టికాహార లోపం గల పిల్లలు ఉంటున్నారని, రక్తహీనత కూడా కొన్ని జిల్లాల్లో అత్యధికంగా ఉందని, ఆ జిల్లాలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని పేర్కొంది. దేశ వ్యాప్తంగా పోషకాహార లోపం ఉన్న పిల్లల వివరాలు రక్తహీనత 1-4 ఏళ్లలోపు పిల్లలు 41 శాతం 5-9 ఏళ్లలోపు పిల్లలు 24 శాతం 10-19 ఏళ్లలోపు పిల్లలు 28 శాతం విటమిన్-డి లోపం 1-4 ఏళ్లలోపు పిల్లలు 14 శాతం 5-9 ఏళ్లలోపు ప్లిలలు 18 శాతం 10-19 ఏళ్లలోపు పిల్లలు 24 శాతం విటమిన్ బి-12 లోపం 10-19 ఏళ్లలోపు పిల్లలు 31 శాతం 5-9 ఏళ్లలోపు పిల్లలు 17 శాతం 1-4 ఏళ్లలోపు పిల్లలు 14 శాతం పోలిక్ యాసిడ్ లోపం 10-19 ఏళ్లలోపు పిల్లలు 37 శాతం 5-9 ఏళ్లలోపు పిల్లలు 28 శాతం 1-4 ఏళ్లలోపు పిల్లలు 23 శాతం జింక్ లోపం 10-19 ఏళ్లలోపు పిల్లలు 32 శాతం 1-4 ఏళ్లలోపు పిల్లలు 19 శాతం 5-9 ఏళ్లలోపు పిల్లలు 17 శాతం -
హెల్దీ బాడీతో తల్లీ బిడ్డల వికాసం
సాక్షి, అమరావతి: ‘హెల్దీ బాడీ ఉంటేనే హెల్దీ మైండ్.. అప్పుడే తల్లీ బిడ్డల్లో వికాసం ఉంటుంది’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. నేటి తరంలో చాలా మంది పిల్లలు, తల్లుల్లో పౌష్టికాహార లోపం కనిపిస్తోందని, వారందరిలో మార్పు తీసుకురావడానికే వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకాలను తీసుకువచ్చామని వెల్లడించారు. అంగన్వాడీ కేంద్రాల పనితీరులో సమూల మార్పులు చేస్తూ చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అత్యంత మెరుగైన పౌష్టికాహారం అందించే వైఎస్సార్ సంపూర్ణ పోషణ, 77 గిరిజన మండలాల్లో వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకాలను సోమవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్లో బటన్ నొక్కి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లాల్లోని లబ్ధిదారులనుద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. గతంలో చాలీచాలని నిధులు ► గతంలో పిల్లలు ఎలా ఉన్నారు? ఎత్తుకు తగ్గ బరువు ఉన్నారా? లేరా? పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారా? వారి తల్లులు ఎలా ఉన్నారు? అనే వాటి గురించి ఎవరూ ఆలోచించలేదు. ► గత ప్రభుత్వ హయాంలో అంగన్వాడీ కేంద్రాలు, చిన్న పిల్లలు, గర్భిణులు, బాలింతల కోసం చాలీ చాలని నిధులు ఇచ్చేవారు. ఏటా రూ.500 కోట్లు ఇస్తే ఎక్కువ అన్నట్లు ఉండేది. ► నేటి తరంలో మంచి ఆహారం లభించని పిల్లలు, తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారు. అందుకే 6 నెలల నుంచి 6 ఏళ్ల వయసు ఉన్న పిల్లల వరకు, బిడ్డకు జన్మనివ్వనున్న తల్లులు, బాలింతలకు వర్తించేలా వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకాలు అమలు చేస్తున్నాం. ► రాష్ట్రంలోని గర్భవత్లులో దాదాపు 53 శాతం మందిలో రక్తహీనత ఉంది. 31.9 శాతం పిల్లలు తక్కువ బరువుతో జన్మించడం లేదా 5 ఏళ్ల వరకు ఆ పరిస్థితిలోనే పెరుగుతున్నారు. ► 5 ఏళ్లలోపు పిల్లల్లో 17.2 శాతం మంది బరువుకు తగ్గట్లు ఎత్తు పెరగని వారున్నారు. వయసుకు తగ్గట్లు ఎత్తు పెరగని వారు 32 శాతం మంది ఉన్నారు. గత పాలకుల నిర్లక్ష్యమే ఇందుకు కారణం. మార్పు దిశగా అడుగులు ► రాష్ట్ర వ్యాప్తంగా నాడు–నేడు ద్వారా 55,607 అంగన్వాడీల రూపురేఖలు మార్చబోతున్నాం. వాటిని ప్రిప్రైమరీ కేంద్రాలుగా మార్పు చేస్తున్నాం. పీపీ–1, పీపీ–2 మొదలు పెడుతున్నాం. ఆట పాటల ద్వారా, మాటల ద్వారా ఇంగ్లిష్ మీడియంకు గట్టి పునాది వేస్తున్నాం. తద్వారా దాదాపు 30.16 లక్షల మంది అక్క చెల్లెమ్మలు, చిన్న పిల్లలకు లబ్ధి కలుగుతుంది. ► రాష్ట్రంలో 47,287 అంగన్వాడీ కేంద్రాలు గిరిజనేతర ప్రాంతాల్లో ఉన్నాయి. వాటి పరిధిలో 26.36 లక్షల మంది తల్లులు, పిల్లలకు దాదాపు రూ.1,555.56 కోట్లు ఖర్చు చేయబోతున్నాం. ► 77 గిరిజన మండాలాల్లోని 8,320 అంగన్వాడీల పరిధిలో వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ చేపట్టాం. 3.8 లక్షల మంది పిల్లలు, తల్లులకు మేలు జరుగుతుంది. ఇందుకు రూ.307.55 కోట్లు ఖర్చవుతుంది. మొత్తంగా ఏటా రూ.1,863.11 కోట్లు ఈ కార్యక్రమాల కోసం వ్యయం చేస్తున్నాం. ► ఈ కార్యక్రమంలో మంత్రులు తానేటి వనిత, బొత్స సత్యనారాయణ, ఎం.శంకర నారాయణ, సీఎస్ నీలం సాహ్ని, మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఏఆర్ అనురాధ, ఆ శాఖ డైరెక్టర్ కృతికా శుక్లా, పలువురు అధికారులు, పథకాల లబ్ధిదారులు పాల్గొన్నారు. ఆహారం అందకపోవడమే కరువు ఆహార కొరత వల్ల కరువు ఏర్పడదు. ఆహారం అందుబాటులో లేకపోవడం వల్ల కరువు ఏర్పడుతుంది. పేదలు, అట్టడుగు వర్గాల వారికి సామాజిక, ఆర్థిక, పాలనా పరమైన కారణాల వల్ల ఆహారం అందించడానికి ఆటంకం కలుగుతుంది. రాష్ట్ర, జిల్లా, స్థానిక స్థాయిలో సరిగా పని చేయని, నిర్లక్ష్యంగా వ్యవహరించే ప్రభుత్వాల తీరు ఇందుకు కారణం కావచ్చు. – అమర్త్యసేన్, ప్రఖ్యాత ఆర్థిక వేత్త ఈ పరిస్థితి మార్చబోతున్నాం పిల్లలు, తల్లులు, వారి మెదడు, ఆలోచనా సరళిపై పౌష్టికాహార లోపం కనిపిస్తుంది. తద్వారా పిల్లల చదువు, మేధస్సు, దేహం మీద ప్రభావం ఉంటుంది. హెల్దీ బాడీ అండ్ హెల్దీ మైండ్ కాన్సెప్ట్తో ఈ పరిస్థితిని మార్చబోతున్నాం. ఈ రెండూ కూడా ఇంటర్ రిలేటెడ్. హెల్దీ బాడీ ఉంటేనే హెల్దీ మైండ్ ఉంటుంది. –సీఎం వైఎస్ జగన్ -
కిడ్స్కు.. కిడ్నీ గండం!
స్థూలకాయం, పోషకాహార లోపమే కారణం.. స్థూలకాయం, పోషకాహార లోపం, జన్యుపరమైన సమస్యలు, అనారోగ్యకరమైన ఆహారం, రసాయనాలతో నిండిన ఆహారం, శారీరక శ్రమ లోపించడం తదితర కారణాల వల్ల కిడ్నీ సమస్యలు రావడానికి ప్రధాన కారణాలుగా వైద్యులు చెబుతున్నారు. దేశంలో అత్యధికంగా కూల్డ్రింక్స్ వంటి వాటిని తాగేవారిలో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. ఇంట్లో తినడానికి బదులు బయట పిజ్జాలు, బర్గర్లు, ఇతరత్రా ఫాస్ట్ఫుడ్ వంటివి తినడం వల్ల రక్తంలో క్రియాటిన్ పెరగడానికి కారణంగా వైద్యులు విశ్లేషిస్తున్నారు. దేశంలో 10 నుంచి 19 ఏళ్ల వయస్సు వారిలో 4.9 శాతం మందికి బీపీ ఉండగా, తెలంగాణలో 6.7 శాతం మంది ఉండటం గమనార్హం. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చిన్న పిల్లల ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఒకప్పుడు పెద్దలకు మాత్రమే, అదీ బీపీ, షుగర్ అధికంగా ఉన్న వారిలోనే కనిపించే కిడ్నీ వ్యాధి ఇప్పుడు పిల్లలనూ వెంటాడుతోంది. 5 నుంచి 19 ఏళ్ల వయసు పిల్లలపై పంజా విసురుతోంది. 5 నుంచి 9 ఏళ్ల వయసు పిల్లల్లో కిడ్నీ వ్యాధులు వచ్చే అవకాశమున్న రాష్ట్రాల్లో తెలంగాణ నాలుగో స్థానంలో ఉండగా, 10 నుంచి 19 ఏళ్ల వయసు వారిలో రెండో స్థానంలో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. 2016–18 సమగ్ర జాతీయ న్యూట్రిషన్ సర్వేను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసింది. దాని ప్రకారం రాష్ట్రంలో దాదాపు పావు శాతం పిల్లలకు కిడ్నీ వ్యాధి వచ్చే అవకాశాలున్నాయి. అంటే ఆయా వయసు పిల్లల్లో ప్రతీ నలుగురిలో దాదాపు ఒకరికి కిడ్నీ వ్యాధి ప్రమాదం ఉన్నట్లు నివేదిక తెలిపింది. దీనిపై వైద్య నిపుణులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోకపోతే యువతీ యువకుల భవిష్యత్ అంధకారం కానుందని హెచ్చరిస్తున్నారు. వారి రక్తంలో సీరం క్రియాటిన్ అధికం.. కేంద్రప్రభుత్వం నిర్వహించిన ఈ సర్వే ప్రకారం వివిధ వయçస్సు వారి ఆరోగ్య వివరాలను సేకరించింది. కిడ్నీ పనితీరును తనిఖీ చేయడానికి వైద్యులు సాధారణంగా బ్లడ్ క్రియాటిన్ స్థాయిని కొలుస్తారు. ఇది మూత్రపిండాల పనితీరును సూచిస్తుంది. సర్వే ప్రకారం దేశవ్యాప్తంగా 5 నుంచి 9 ఏళ్ల వయసు పిల్లల్లో సరాసరి 7 శాతం మందిలో సీరం క్రియాటిన్ అధికంగా ఉన్నట్లు తేలింది. అందులో తెలంగాణలో 23.6 శాతం పిల్లల్లో అధికంగా ఉన్నట్లు వెల్లడించింది. అలాగే 10 నుంచి 19 ఏళ్ల వయసు పిల్లల్లో దేశవ్యాప్తంగా 6.6 శాతం మందిలో సీరం క్రియాటిన్ అధికంగా ఉన్నట్లు గుర్తించగా, తెలంగాణలో 24.3 శాతం మందికి అధికంగా ఉన్నట్లు నిర్ధారించారు. దేశ సగటు కంటే మూడు నాలుగు రెట్ల వరకు క్రియాటిన్ అధికంగా ఉండటం మరింత ఆందోళన కలిగించే పరిణామం. అయితే సీరం క్రియాటిన్ అధికంగా ఉన్నా, ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే సాధారణ పరిస్థితికి రావొచ్చని వైద్యులు చెబుతున్నారు. మూత్రాశయ సమస్యలు లేదా పుట్టుకతో వచ్చే రుగ్మతల కారణంగా ఒక్కోసారి సీరన్ క్రియాటిన్ అధికంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు పూర్తిస్థాయిలో కిడ్నీలు ఏర్పడకపోవడం, లేదా జన్యుపరమైన సమస్యలు, పర్యావరణం, కాలుష్యం వంటివి కారణాలుగా ఉంటున్నాయని చెబుతున్నారు. పుట్టుకతో వచ్చే కిడ్నీ సమస్యలను తల్లి గర్భంలో ఉన్నప్పుడు ప్రారంభ దశలోనే గుర్తించడానికి వీలుంటుందని అంటున్నారు. అయితే రాష్ట్రంలో ఇంత అధికంగా ఆయా వయసు పిల్లల్లో క్రియాటిన్ అధికంగా ఉండటానికి కారణాలపై మరింత అధ్యయనం చేయాల్సి ఉందని వైద్యులు చెబుతున్నారు. మాంసాహారుల్లోనే అధికం.. 10 నుంచి 19ఏళ్ల వయసున్న వారిలో బాలికల కంటే బాలురుల్లోనే అధికంగా క్రియాటిన్ సమస్యలున్నాయని నివేదిక తెలిపింది. దేశవ్యాప్తంగా పరిశీలిస్తే ఈ వయసు పిల్లల్లో 8.3% మంది బాలురు, 4.9% మంది బాలికల్లో కిడ్నీ సంబంధిత సమస్యలున్నాయని తెలిపింది. మాంసాహారుల్లోనే అధికంగా క్రియాటిన్ కని పిస్తోంది. దేశంలో మాంసాహారం తినే ఈ వయసు పిల్లల్లో 9% మందిలో సీరం క్రియాటిన్ అధికంగా ఉండగా, కేవలం గుడ్డు తినే వారిలో 6% ఉంది. శాకాహారుల్లో 5.4% మందిలోనే క్రియాటిన్ కనిపించి నట్లు నివేదిక తెలిపింది. మతపరంగా చూస్తే ఈ వయసు పిల్లల్లో అత్యధికంగా క్రిస్టియన్లలో 18.4% మందిలో క్రియాటిన్ ఎక్కువ గా ఉండగా, ముస్లింల్లో 11.2% ఉంది. హిందువుల్లో 5.6% ఉం డగా, సిక్కుల్లో 3.8% ఉన్నట్లు నిర్ధారించారు. సామాజిక వర్గాల వారీగా చూస్తే ఈ వయసు గల వారిలో ఎస్సీల్లో 6.3%, ఎస్టీల్లో 7.2%, బీసీల్లో 5.1%, ఇతరుల్లో 9.2% క్రియాటిన్ ఉన్నట్లు నిర్ధారించారు. ఇదే వయసున్న పట్ట ణపిల్లల్లో 4.3% సీరం క్రియాటిన్ ఉండగా, గ్రామీణ ప్రాంత పిల్లల్లో అది 7.4‘% ఉండటం గమనార్హం. నిరుపేదలైన ఈ వయసు పిల్లల్లో 8.9 శాతం సీరం క్రియాటిన్ ఉండగా, పేదల్లో 7.4 శాతం, మధ్యతరగతి పిల్లల్లో 7.5 శాతం, ధనికుల్లో 5 శాతం, అత్యంత ధనికుల్లో 4.6 శాతం ఉన్నట్లు నివేదిక తెలిపింది. తల్లిదండ్రులు మేల్కొనాలి.. కేంద్ర సర్వే నివేదిక ప్రకారం తెలంగాణలో కిడ్నీ సమస్యలు రావడానికి అవకాశాలెక్కువ. స్థూలకా యం, శారీరక శ్రమ లేకపోవడం, జన్యుపరమైన కారణాలతో ఈ ముప్పు వస్తుంది. ప్రస్తుత నివేదిక హెచ్చరికలాంటింది. పిల్లల తల్లి దండ్రులు జాగ్రత్తలు తీసుకోకుంటే మరింత ప్రమాదం జరగొచ్చు. – డాక్టర్ గంగాధర్, నెఫ్రాలజిస్ట్, నిమ్స్, హైదరాబాద్ ఆహారం, తాగునీటి లోపాల వల్లే..: అనారోగ్యకరమైన ఆహారం, శుద్ధమైన తాగునీరు లేకపోవడంతో కిడ్నీ సమస్యలు వస్తుంటాయి. పోషకాహార లోపం రాష్ట్రంలో అధికం. ఇది కూడా ఓ కారణమే. తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. మిషన్ భగీరథ నీటితో కిడ్నీ వ్యాధులు తగ్గుతాయి. – డా.కిరణ్ మాదల, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రభుత్వ మెడికల్ కాలేజీ, నిజామాబాద్ -
బక్క చిక్కిన బాల్యం..!
సాక్షి, హైదరాబాద్: బాల్యం చిక్కి శల్యమైపోతోంది. చిన్నారి చేతికండలు ఐస్క్రీం పుల్లల్లా చిక్కిపోయాయి. కొందరు పిల్లలు ఎత్తు ఎదగట్లేదు. మరికొందరికి వయసుకు తగ్గ బరువు లేదు. చిరుప్రాయంలోనే మధుమేహం, గుండె జబ్బుల ముప్పును ఎదుర్కొంటున్నారు. కిడ్నీ రోగాల బారినపడుతున్నారు. పౌష్టికాహార లోపంతో రాష్ట్రంలోని బాలల్లో తీవ్ర శారీరక ఎదుగుదల లోపం బయటపడింది. ఐదేళ్ల లోపు బాలల్లో ఏకంగా 29.3 శాతం మంది ఎదుగుదల (ఎత్తుపరంగా) లోపాన్ని కలిగి ఉన్నారు. 8.7 శాతం మంది తీవ్ర ఎదుగుదల లోపంతో బాధపడుతున్నారు. పట్టణ ప్రాంత బాలల్లో ఏకంగా 38.2 శాతం మంది ఎదుగుదల లోపం కలిగి ఉన్నారు. 30.8 శాతం మంది వయసుకు తగ్గ బరువు లేరు. మరో 17.9 శాతం మంది ఎత్తుకు తగ్గ బరువు లేరు. తాజాగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసిన సమగ్ర జాతీయ పౌష్టికాహార సర్వే 2016–18 నివేదికలో ఈ విషయాలు వెలుగుచూశాయి. బక్క చిక్కిన మగపిల్లలు: పాఠశాలకు వెళ్లే 5 నుంచి 9 ఏళ్ల పిల్లల్లో 31.4 శాతం మంది మగపిల్లలు, 24.2 శాతం మంది ఆడపిల్లలు, 10–14 ఏళ్ల పిల్లల్లో 33.2 శాతం మగ, 23.4% ఆడపిల్లలు, 15–19 ఏళ్ల పిల్లల్లో 35.4 శాతం మగ, 21.8 శాతం ఆడపిల్లలు బక్క చిక్కిపోయారు. 5–9 ఏళ్ల పిల్లల్లో 5.5 శాతం మగ, 4.2 శాతం ఆడపిల్లలు ఊబకాయాన్ని కలిగి ఉన్నారు. ప్రధానంగా పట్టణ బాలల్లోనే ఊబకాయం సమస్య అధికంగా ఉంది. 11 శాతం పట్టణ, 1.5 శాతం గ్రామీణ బాలలు ఊబకాయాన్ని కలిగి ఉన్నారు. ఇదే వయసు శ్రేణిలోని 15.6 శాతం మగ, 15.3 శాతం ఆడపిల్లల్లో ఎదుగుదల లోపాన్ని గుర్తించారు. చిక్కిన చేతి కండలు వయసుతో పోలిస్తే 6–59 నెలల బాలల్లో 13.2 శాతం మంది ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) నిర్దేశిత ప్రమాణం కన్నా తక్కువ చేతికండ చుట్టు కొలత కలిగి ఉన్నారు. 5.2 శాతం మంది 12.5 సె.మీటర్ల లోపు, 0.9 శాతం మంది 11.5 సె.మీ. కన్నా తక్కువ చేతికండ చుట్టు కొలత కలిగి ఉన్నారు. మూడో వంతు చిన్నారుల్లో రక్తహీనత రాష్ట్రంలోని కిశోర బాలికలు తీవ్ర రక్త హీతనతో బాధపడుతున్నారు. 10–19 ఏళ్ల బాలికల్లో ఏకంగా 46 శాతం మంది, బాలురల్లో 18.5 శాతం మంది రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. 1–4 ఏళ్ల పిల్లల్లో 33.4 శాతం మంది ఇనుము లోపం కలిగి ఉన్నారు. 10–19 ఏళ్ల పిల్లల్లో ఏకంగా 63.7 శాతం మంది బి–విటమిన్ లోపంతో బాధపడుతున్నారు. మధుమేహం ముప్పు.. రాష్ట్రంలోని 15.4 శాతం మంది 5 నుంచి 9 ఏళ్ల బాలలు, 15.2 శాతం మంది 10–19 ఏళ్ల బాలలు మధుమేహం ముప్పును ఎదుర్కొంటున్నారు. రక్తంలో 5.7 –6.4 శాతం చక్కెర (గైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్ కాన్సన్ట్రేషన్) కలిగి ప్రీడయాబెటిక్ స్టేజీలో ఉన్నట్లు సర్వేలో తేలింది. ఇక 5–9 ఏళ్ల పిల్లల్లో 1 శాతం మంది మధుమేహంతో బాధపడుతున్నారు. 5–9 ఏళ్ల పిల్లల్లో 21.9 శాతం మంది, 10–19 ఏళ్ల పిల్లల్లో 12.4 శాతం మంది తమ రక్తంలో అధిక కొవ్వు కలిగి ఉన్నారు. వీరు గుండె సంబంధిత వ్యాధుల ముప్పు ఎదుర్కొంటున్నారు. 5–9 ఏళ్ల పిల్లల్లో 23.6 శాతం మంది, 10–19 ఏళ్ల పిల్లల్లో 24.3 శాతం మంది కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతుండటంతో అధిక ‘క్రియాటిన్’కలిగి ఉన్నారు. తొలిసారి సమగ్ర సర్వే! పాఠశాలకు వెళ్లడానికి ముందు వయసు (0–4 ఏళ్లు), పాఠశాల వెళ్లే వయసు (4–9 ఏళ్లు), కిశోర వయసు (10–14 ఏళ్లు) బాలబాలికలను ఇంటర్వ్యూలు చేయడం, శరీర కొలతలు తీయడం, మలమూత్ర, రక్త పరీక్షలు నిర్వహించడం ద్వారా బాలల్లో పౌష్టికాహార స్థితిగతులపై అధ్యయనం జరిపింది. బాలల్లో సూక్ష్మ పౌష్టికాహార లోపం తీవ్రత, స్థాయిలను అంచనా వేయడం, అసంక్రమిత వ్యాధుల బారినపడేందుకు ఉన్న అవకాశాలను గుర్తించేందుకు ప్రామాణిక పద్ధతుల్లో పకడ్బందీగా ఇలాంటి సర్వే నిర్వహించడం దేశంలో ఇదే తొలిసారి. క్షేత్ర స్థాయిలో పౌష్టికాహార లోపం స్థితిగతులను తెలుసుకుని, తదనుగుణంగా కేంద్ర ప్రభుత్వ విధానాలను అభివృద్ధిపరచాలనే ఉద్దేశంతో ఈ సర్వే నిర్వహించారు. రాష్ట్రంలో 30 బృందాలు 2016 ఫిబ్రవరి 26 నుంచి జూలై 24 మధ్య కాలంలో 3,600 మంది బాలల శరీర కొలతలు తీసుకోవడంతో పాటు 1,800 బాలల రక్త, మల, మూత్ర పరీక్షలు నిర్వహించి వారి ఆరోగ్య స్థితిగతులపై అధ్యయనం జరిపాయి. 55 శాతం శాఖాహారులే.. జాతీయ స్థాయిలో 0–4 ఏళ్ల వయసున్న 38,060 మంది, 5–9 ఏళ్ల 38,355 మంది, 10–19 ఏళ్ల 35830 మంది బాలబాలికలపై సర్వే నిర్వహించారు. వీరిలో 55 శాతం బాలలు శాఖాహారమే (కోడిగుడ్డు కూడా లేకుండా) తీసుకుంటున్నారు. 36–40 శాతం మంది మాంసాహారం తీసుకుంటుండగా, మిగిలిన వారు శాఖాహారంతో పాటు కోడిగుడ్డు తీసుకుంటున్నారు. 5 నుంచి 9 ఏళ్ల బాలల్లో 91 శాతం మంది, 10–14 ఏళ్ల బాలల్లో 52 శాతం, 15–19 ఏళ్ల బాలల్లో 48 శాతం మంది పాఠశాలకు వెళ్తున్నారు. 42 శాతం మందికి సరిగ్గా దొరకని ఆహారం 6–23 నెలల బాలల్లో 42 శాతం మందికి వారి వయసుకు తగ్గట్టు రోజూ లభించాల్సిన ఆహారం కన్నా తక్కువగా లభిస్తోంది. 21 శాతం మందికి సరిపడా వైవిధ్యమైన ఆహారం దొరుకుతుండగా, 6 శాతం మంది కనీస ఆమోదయోగ్యమైన ఆహారం పొందగలుగుతున్నారు. తెలంగాణలోని 6–23 నెలల బాలల్లో 3.6 శాతం మందికి కనీస ఆమోద్యయోగ్యమైన ఆహారం లభిస్తోంది. 58 శాతం మందికి తల్లిపాలే దిక్కు 6 నెలల లోపు బాలల్లో 58 శాతం మంది కేవలం తల్లిపాలపై ఆధారపడి ఉన్నారు. 12–15 నెలల బాలల్లో 83 శాతం మందికి తల్లిపాలు కొనసాగిస్తున్నారు. 6–8 నెలల బాలల్లో 53 శాతం మందికే పుష్టికరమైన ఆహారం లభిస్తోంది. 0–24 నెలల బాలల్లో 57 శాతం మందికి పుట్టిన గంటలోపే తల్లిపాలు తాగించడం జరిగింది. -
ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా సీఎం అడుగులు
-
మన లక్ష్యం ఆరోగ్యాంధ్రప్రదేశ్
సాక్షి, అమరావతి : మహిళలు, పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించి రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మార్చాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా రక్తహీనత, పౌష్టికాహార లోపం అధికంగా ఉన్న గిరిజన, సబ్ప్లాన్ ప్రాంతాల్లోని గర్భిణులు, 6 ఏళ్లలోపు చిన్నారులకు పౌష్టికాహారాన్ని పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. మహిళలు, పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించడం, మధ్యాహ్న భోజన పథకం అమలు తీరుపై బుధవారం సచివాలయంలో ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైఎస్సార్ అమృత హస్తం, వైఎస్సార్ బాల సంజీవని కింద గర్భవతులు, పిల్లలకు మరింత పౌష్టికాహారం అందజేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. గర్భవతులు, బాలింతలకు నెలకు రూ.1062 విలువైన, 6 నెలల నుంచి 3 ఏళ్లలోపు పిల్లలకు నెలకు రూ.600 విలువైన, 3 – 6 ఏళ్ల లోపు పిల్లలకు నెలకు రూ.560 విలువైన పౌష్టికాహారం అందించాలని సూచించారు. పౌష్టికాహార లోపం, రక్తహీనత అధికంగా ఉన్న 77 గిరిజన, సబ్ప్లాన్ మండలాల్లో డిసెంబర్లో పైలట్ ప్రాజెక్టుగా ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని ఆదేశించారు. ఇప్పటి వరకు ఇస్తున్న గుడ్లు, పాలతో పాటు బలవర్థకమైన ఆహారం అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మధ్యాహ్నం మంచి భోజనం పెట్టండి రాష్ట్రంలో మహిళలు, చిన్నారులు రక్తహీనత, పౌష్టికాహార లోపంతో తీవ్రంగా బాధపడుతున్నారని, ఇది తీవ్ర ఆరోగ్య సమస్యలకు దారితీస్తోందని అనేక నివేదికలు వెల్లడిస్తున్న నేపథ్యంలో మహిళా, శిశు సంక్షేమం, విద్యాశాఖల పరిధిలో అమలవుతున్న కార్యక్రమాలు, వాటిలో మార్పులపై అధికారులతో ఇప్పటికే పలుమార్లు సమావేశమైన ముఖ్యమంత్రి.. బుధవారం మరోసారి సచివాలయంలో మహిళా, శిశు సంక్షేమం, విద్యా శాఖ మంత్రులు తానేటి వనిత, ఆదిమూలపు సురేష్, అధికారులతో సమావేశమయ్యారు. రక్తహీనత, పౌష్టికాహార లోపం అధికంగా ఉన్న గిరిజన, సబ్ప్లాన్ ప్రాంతాల్లో మరింత పోషక విలువలున్న ఆహారాన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేశాక, మిగతా ప్రాంతాలకూ విస్తరించేలా ప్రణాళిక రూపొందించాలన్నారు. మరోవైపు మధ్యాహ్న భోజనంలో నాణ్యత, పోషక విలువలు పెంచడంపై దృష్టి పెట్టాలని సూచించారు. క్షేత్ర స్థాయిలోకి వెళ్లి.. పిల్లలు ఏం తింటున్నారన్నది గమనించి, తదుపరి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత ఎలాంటి మార్పులు చేయాలన్నదానిపై ప్రతిపాదనలు ఇవ్వాలన్నారు. పిల్లలకు మంచి మెనూతో భోజనం పెట్టాలని, దీనిపై అధ్యయనం చేయాలని సూచించారు. పిల్లలకు తగిన పోషక విలువలు యాడ్ అయ్యేలా ఉన్న ఆహారాన్ని ఇవ్వాలన్నారు. ఇందుకోసం పోషకాహార నిపుణుల సలహాలు కూడా తీసుకోవాలని చెప్పారు. – పైలట్ ప్రాజెక్టు అమలు కోసం శ్రీకాకుళం జిల్లాలో 1, విజయనగరంలో 7, విశాఖపట్నం 11, తూర్పుగోదావరి 11, పశ్చిమగోదావరి జిల్లాలో 6 గిరిజన మండలాలతో పాటు మొత్తం 36 మండలాలు ఎంపిక చేశారు. సబ్ప్లాన్ ఏరియాకు సంబంధించి శ్రీకాకుళంలో 19, విశాఖపట్నం 6, తూర్పుగోదావరి 4, పశ్చిమగోదావరి 3, ప్రకాశం 3, కర్నూలు 3, గుంటూరు జిల్లా నుంచి 3 మండలాలు కలిపి మొత్తం 41 మండలాలు ఎంపిక చేశారు. మొత్తంగా 77 మండలాల్లో ఈ ప్రాజెక్టు అమలు కానుంది. కొత్త విధానమిది.. గర్భిణులు, బాలింతలకు నెలకు రూ.1,062 విలువైన ఆహారం లభిస్తుంది. 25 రోజుల పాటు రోజూ భోజనం, గుడ్డు, 200 మి.లీ పాలు అందిస్తారు. రూ.500 విలువ చేసే వైఎస్సార్ బాల సంజీవని కిట్ కింద మొదటి వారం 2 కేజీల మల్టీ గ్రెయిన్ ఆటా, రెండోవారం అరకేజీ వేరుశనగలతో చేసిన చిక్కీ, మూడోవారం అరకేజీ రాగి ఫ్లేవర్, అరకేజీ బెల్లం.. నాలుగోవారం అరకేజీ నువ్వులుండలు ఇవ్వనున్నారు. 6 నెలల నుంచి 3 ఏళ్లలోపు పిల్లలకు నెలలో ప్రతిరోజూ గుడ్డు, 200 మి.లీ పాలతో పాటు వైఎస్సార్ బాలామృతం కిట్ కింద రోజుకు 100 గ్రాముల చొప్పున 25 రోజులు బలవర్థకమైన ఆహారం 2.5 కేజీలు ఇస్తారు. మొత్తంగా నెలకు రూ.600 విలువ చేసే పౌష్టికాహారాన్ని అందిస్తారు. 3–6 సంవత్సరాల్లోపు పిల్లలకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా నెలకు 25 రోజులు పౌష్టికాహారం అందిస్తారు. ఇందుకు నెలకు రూ.560 ఖర్చు చేయనున్నారు.నెలలో 25 రోజులపాటు భోజనం, గుడ్డు, 200 మి.లీ పాలు, పోషకాలు ఉండే మరో అల్పాహారం ఇస్తారు. -
ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా సీఎం జగన్ అడుగులు
సాక్షి, అమరావతి : రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మార్చే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అడుగులు వేస్తున్నారు. రాష్ట్రంలోని మహిళలు, పిల్లల్లో పౌష్టికాహార లోపం నివారణకు సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. పిల్లలకు మధ్యాహ్న భోజనం, పౌష్టికాహారం పైన బుధవారం సీఎం వైఎస్ జగన్ సమీక్ష చేపట్టారు. మధ్యాహ్న భోజనంలో నాణ్యత, పోషక విలువలు పెంచడంపై దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. క్షేత్ర స్థాయిలోకి వెళ్లి పిల్లలు ఏం తింటున్నారో గమనించాలన్నారు. ఆ తర్వాత వారికి అందించే ఆహారంలో ఎలాంటి మార్పులు చేయాలనే దానిపై సూచనలు చేయాలని కోరారు. ఇందుకోసం షోషకాహారంలో నిపుణులైన వారి సలహాలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్ అధికారులకు సూచించారు. మహిళలు, పిల్లల్లో పౌష్టికాహార లోపం నివారణలో భాగంగా.. మొదటి దశలో రక్తహీనత, పౌష్టికాహార లోపం అధికంగా ఉన్న గిరిజన, సబ్ప్లాన్ ప్రాంతాల్లోని గర్భవతులు, 6 ఏళ్ల లోపు చిన్నారులకు పౌష్టికాహారాన్ని పెంచాలని.. దీనిని పైలట్ ప్రాజెక్టు కింద అమలు చేయాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు. 77 గిరిజన, సబ్ప్లాన్ మండలాల్లో డిసెంబర్ నుంచి ఈ పైలట్ ప్రాజెక్టు అమలు కానుంది. వైఎస్సార్ బాల సంజీవని, వైఎస్సార్ బాలామృతం.. ఈ పైలట్ ప్రాజెక్టును అనుసరించి గర్భవతులకు, బాలింతలకు నెలకు రూ. 1062 విలువైన ఆహారం అందించనున్నారు. 25 రోజులపాటు రోజూ భోజనం, గుడ్డు, 200 మి.లీ. పాలతో పాటు రూ. 500 విలువ చేసే వైఎస్సార్ బాల సంజీవని కిట్ ఇస్తారు. వైఎస్సార్ బాల సంజీవని కిట్లో మొదటి వారం రెండు కేజీల మల్టీ గ్రెయిన్ ఆటా, రెండో వారం అర కేజీ వేరుశనగలతో చేసిన చిక్కీ, మూడో వారం అర కేజీ రాగి ఫ్లేవర్, అర కేజీ బెల్లం, నాలుగో వారం అర కేజీ నువ్వులుండలు అందజేస్తారు. 6 నెలల నుంచి 3 ఏళ్లలోపు చిన్నారులకు నెలలో ప్రతి రోజూ గుడ్డు, 200 మి.లీ. పాలు, వైఎస్సార్ బాలామృతం కిట్టు కింద రోజుకు రూ. 100 గ్రాముల చొప్పున 2.5 కేజీలు మొత్తంగా రూ. 600 విలువ చేసే పౌష్టికాహారం ఇవ్వనున్నారు. అలాగే 3 నుంచి 6 ఏళ్లలోపు పిల్లలకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా నెలకు 25 రోజుల పౌష్టికాహారం అందజేయాలని నిర్ణయించారు. మొత్తంగా నెలకు రూ. 560లతో పౌష్టికాహారం అందించనున్నారు. ఈ మేరకు నెలలో 25 రోజులపాటు భోజనం, గుడ్డు, 200 మి.లీ. పాలు, పోషకాలు ఇచ్చే మరో అల్పాహారం అందజేస్తారు. పైలట్ ప్రాజెక్టు అమలయ్యే ప్రాంతాలు.. ఈ పైలట్ ప్రాజెక్టు అమలు కోసం మొత్తం 36 గిరిజన మండలాలు ఎంపిక చేయగా.. శ్రీకాకుళం జిల్లాలో 1, విజయనగరం జిల్లాలలో 7, విశాఖపట్నం జిల్లాలో 11, తూర్పు గోదావరి జిల్లాలో 11, పశ్చిమ గోదావరి జిల్లాలో 6 ఉన్నాయి. సబ్ప్లాన్ ప్రాంతానికి సంబంధించి శ్రీకాకుళం జిల్లాలో 19, తూర్పు గోదావరి జిల్లాలో 4, విశాఖపట్నం జిల్లాలో 6, పశ్చిమ గోదావరి జిల్లాలో 3, ప్రకాశం జిల్లాలో 3, కర్నూలు జిల్లాలో 3, గుంటూరు జిల్లాలో 3 కలపి మొత్తం 41 మండలాలను ఎంపిక చేశారు. -
వసివాడుతున్న పసి మొగ్గలు
సాక్షి, విశాఖపట్నం : పోషకాహార లోపం చిన్నారులకు శాపంగా మారుతోంది. పోషకాహార లోపంతో సరైన ఎదుగుదల లేక చిన్నారులు మృత్యువాత పడుతున్నారు. గర్భిణులు రక్త హీనతతో వ్యాధుల బారిన పడుతున్నారని వివిధ సంస్థల అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్ర సగటుతో పోలిస్తే.. ఈ సమస్యలతో బాధపడుతున్న పిల్లలు, మహిళలు ఎక్కువగానే ఉన్నారని స్పష్టమవుతోంది. చైల్డ్ రైట్స్ అండ్ యూ(క్రై) అనే స్వచ్ఛంద సంస్థ విశాఖ ఏజెన్సీ గ్రామాల్లో సర్వే నిర్వహించింది. శైశవ దశనుంచే చిన్నారులకు పోషకాహారం అందిస్తేనే సరైన ఎదుగుదల కనిపిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే.. ఈ విషయంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యంగానే వ్యవహరించింది. సాధారణంగా శిశువు జన్మించినప్పుడు 2.5 కిలోల కంటే ఎక్కువగా బరువు ఉంటేనే ఆరోగ్యంగా ఉన్నట్లు లెక్క. కానీ. నీతి ఆయోగ్ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 2.5 కిలోల కంటే తక్కువ బరువుతో జన్మిస్తున్న వారి శాతం 5.7గా ఉంటే విశాఖలో దాదాపు 4.2 శాతంగా ఉంది. 5 ఏళ్లలోపు వయసుకి తగ్గ బరువు ఎదగలేకపోతున్న వారి శాతం రాష్ట్రంలో 31.9గా ఉంటే విశాఖలో దాన్ని మించి పోయి ఏకంగా 33.1శాతంగా ఉంది. ఐదేళ్లు నిండకుండానే నూరేళ్లు విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లోని చిన్నారులు తీవ్రమైన పోషకాహార సమస్య బారిన పడుతున్నారు. చైల్డ్ రైట్స్ అండ్ యూ విడుదల చేసిన నివేదిక ప్రకారం 2015 నుంచి 2018 మధ్య 18 గిరిజన గ్రామాల్లో 115 మంది చిన్నారులు పోషకాహారలోపం, రక్త హీనతతో బాధపడుతూ మరణించారని పేర్కొంది. వీరంతా 0 నుంచి 5 సంవత్సరాల్లోపు శిశువులే కావడం శోచనీయం. ఈ సంస్థ 18 గ్రామాల్లో చేసిన సర్వేలో కొన్ని ఆందోళనకరమైన అంశాలు కూడా వెల్లడయ్యాయి. ఐసీడీఎస్ నివేదిక ప్రకారం చింతపల్లి, కొయ్యూరు మండలాల్లో ఈ తరహా చిన్నారులు 165 మంది అతి తీవ్రమైన పౌష్టికాహార లోపంతో బాధపడుతుండగా 87 మంది చిన్నారులు తీవ్రమైన పౌష్టికాహార లోపంతో ఉన్నట్టుట్టు గుర్తించారు. 25 మంది ఉండాల్సిన దానికంటే చాలా తక్కువ బరువుతో ఉన్నట్లు గుర్తించారు. మహిళా లోకమా.. మన్నించు... అవనిలో సగమని చెబుతున్న అతివల ఆరోగ్య విషయంలో టీడీపీ సర్కారు ఆది నుంచి చిన్నచూపు చూసింది. ముఖ్యంగా రక్తహీనత సమస్య మహిళల్లో అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. రాష్ట్రంలో చూస్తే గతేడాది 56 శాతంగా ఉన్న రక్తహీనత మూడేళ్లలో 60 శాతానికి చేరుకుంది. మహిళల ఆరోగ్యంపై జీవిత కాలం ప్రతికూల ప్రభావం చూపుతోంది. పౌష్టికాహారం సరిగా అందకపోవడంతో ఎక్కువగా ఈ సమస్య ఉత్పన్నమవుతోంది. రక్త హీనతతో బాధపడుతున్న మహిళల శాతం రాష్ట్ర సగటుతో పోలిస్తే జిల్లాలో ఎక్కువగా ఉంది. 2015 నుంచి 2018 కాలంలో 35 ప్రసూతి మరణాలు సంభవించాయని చైల్డ్ రైట్స్ అండ్ యూ సర్వేలో వెల్లడైంది. ప్రాణాలు కాపాడని పథకాలు వాస్తవంగా జిల్లాలో ఏజెన్సీ ప్రాంతం ఎక్కువగా ఉండటంతో.. ఈ తరహా సమస్యలు ఎక్కువగా ఉండటానికి ప్రధాన కారణమని అధికారులు చెబుతున్నారు. అయితే ఏజెన్సీలో సరైన పౌష్టికాహారం అందించేందుకు గత ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు లెక్కలు చూపించింది. అన్న అమృత హస్తం, గిరి గోరు ముద్ద, బాలసంజీవని పేరుతో.. అనేక పథకాలు అమలు చేసినా.. అవేవీ చిన్నారుల ప్రాణాలు కాపాడలేకపోయాయి. దిద్దుబాటు చర్యలు చేపడుతున్న ప్రభుత్వం గత ప్రభుత్వ నిర్లక్ష్యం.. ఏజెన్సీ పాలిట శాపంలా మారిపోయింది. ఈ పరిస్థితి నుంచి గిరిజన గ్రామాల్ని కాపాడేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. గిరిజన గ్రామాల్లో పోషకాహారలోపంతో మరణాలు, ప్రసూతి మరణాలు సంభవించకుండా ఉండేందుకు చర్యలకు ఉపక్రమించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో గిరిపుత్రులకు 100 శాతం పౌష్టికాహారం అందించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. పోషణ్ అభియాన్ మొదలైన పథకాల ద్వారా పాలు, గుడ్లు, శనగ చెక్కీలతో పాటు ప్రతినెలా కిలో ఖర్జూరం, రాగిపిండి, బెల్లం మొదలైన పౌష్టికాహారం అందిస్తోంది. దీనికితోడు కొత్త పథకాలు అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రతి ఒక్కరికీ పౌష్టికాహారం చిన్నారుల్లో పౌష్టికాహార లోపం, మహిళల్లో ఐరన్ లోపాల్ని అధిగమించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాం. గిరిజన ప్రాంతాల్లో ప్రతి ఒక్క ఇంటికీ పౌష్టికాహారం అందిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం చిన్నారుల్లో రక్త హీనతల్ని, పౌష్టికాహార లోపాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తోంది. – సీతామహాలక్ష్మి, జిల్లా మహిళా శిశు, అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ ప్రొటీన్ లోపం వల్లే మరణాలు 2015–18 మధ్య కాలంలో పౌష్టికాహార లోపం 0–6 సంవత్సరాల్లోపు చిన్నారుల్లో ఎక్కువగా ఉన్నట్లు మేము చేసిన సర్వేలో తేలింది. అలాగే గర్భిణులు, బాలింతల్లో కూడా అధికంగా కనిపించింది. సరైన ప్రొటీ æన్ అందకపోవడమే దీనికి ప్రధాన కారణం. అతి తక్కువ నాణ్యత ఉన్న రేషన్ను అంగన్వాడీ కేంద్రాల ద్వారా సరఫరా చేయడం వల్లే ఈ పరిస్థితి. కొత్త ప్రభుత్వం దీన్ని అధిగమించేలా చర్యలు తీసుకోవాలి. – జాన్ రాబర్ట్స్, చైల్డ్ రైట్స్ అండ్ యూ ప్రోగ్రామ్ హెడ్. -
కంటి వెలుగవుతాం
ప్రజలందరికీ కంటి పరీక్షలు, అవసరమైన వారికి శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు శంకర నేత్రాలయ, ఎల్వీ ప్రసాద్ ఐ ఆసుపత్రి, ఇతర ఎన్జీఓల సహకారం తీసుకుంటాం.ఈ కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు జిల్లాల్లో టాస్క్ఫోర్స్ కమిటీలు ఏర్పాటు చేస్తాం. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 5.3 కోట్ల మంది ప్రజలకు ఆరు విడతలుగా వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమం కింద కంటి పరీక్షలు నిర్వహించనున్నట్లు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. మూడేళ్ల కాలంలో మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికీ కంటికి సంబంధించిన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రూ.560 కోట్లతో వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమం చేపట్టనున్నామని.. స్క్రీనింగ్, కంటి అద్దాల పంపిణీ, క్యాటరాక్ట్ శస్త్ర చికిత్స, ఇతరత్రా అవసరమైన పరీక్షలన్నీ ఈ పథకం కింద జరుగుతాయని చెప్పారు. ‘స్పందన’ కార్యక్రమంపై మంగళవారం ఆయన సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమం కోసం చేసిన ఏర్పాట్లపై కూడా ముఖ్యమంత్రి సమీక్షించారు. అక్టోబరు 10 నుంచి 16 వరకు తొలి దశలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోని 70 లక్షల మందికి పైగా విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహిస్తామని, రెండో విడతలో నవంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు అవసరమైన విద్యార్థులకు శస్త్రచికిత్సలు చేయిస్తామని చెప్పారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1వ తేదీ నుంచి మూడు, నాలుగు, ఐదు, ఆరు విడతల్లో మిగిలిన ప్రజలందరికీ దశల వారీగా కంటి పరీక్షలు, చికిత్సలు అందిస్తామని స్పష్టం చేశారు. జిల్లాల్లో టాస్క్ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసి పటిష్టంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని సీఎం సూచించారు. మొదటి స్క్రీనింగ్లో చికిత్స అవసరమున్న విద్యార్థులను గుర్తించి ఆ మేరకు వారికి తదుపరి చికిత్స అందించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా వెబ్సైట్ను రూపొందించామని చెప్పారు. రక్తహీనతను అధిగమించాల్సిందే పౌష్టికాహార లోపం, రక్తహీనతతో బాధపడుతున్న మహిళలకు రోజుకు రూ.43, చిన్నారులకైతే రూ.18 ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేశారు. వీలైనంత త్వరగా పౌష్టికాహార లోపం, రక్తహీనతను అధిగమించడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్లు, అంగన్వాడీ కేంద్రాలను సమర్థవంతంగా వినియోగించుకోగలిగితే ఈ సమస్యను అధిగమించవచ్చన్న విశ్వాసం ఉందని సీఎం పేర్కొన్నారు. వలంటీర్లు ప్రతి ఇంటినీ సర్వే చేసి, పిల్లలను, తల్లులను, మహిళలను అంగన్వాడీ కేంద్రాల దగ్గరకు వెళ్లేలా మోటివేట్ చేయించి, అక్కడ వారికి పరీక్షలు నిర్వహించాలని సూచించారు. రక్తహీనత పరీక్షలు నిర్వహించాక వారి ఆరోగ్య కార్డులో వివరాలు పొందుపరిచి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. పర్యవేక్షణ బాధ్యతను వలంటీర్లకు అప్పగించాలన్నారు. అంగన్వాడీల ద్వారా ఏమేమి ఇవ్వబోతున్నామో వలంటీర్లకు సమాచారం ఇచ్చి, ఆ మేరకు అవన్నీ కూడా పిల్లలు, తల్లులకు అందేలా చూడాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉందన్నారు. పారిశుద్ధ్యం, ఆహారం, తాగునీటిపై ప్రజలకు అవగాహన కల్పించాలని, వచ్చే సమీక్షా సమావేశానికి దీనిపై ఏం చర్యలు తీసుకున్నారన్న దానిపై నివేదించాలని అధికారులను ఆదేశించారు. గ్రామ సచివాలయాల్లో సోషల్ ఆడిట్ అక్టోబర్ 2 నుంచి ప్రారంభిస్తున్న గ్రామ, వార్డు సచివాలయాల్లో సోషల్ ఆడిట్కు ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు. అక్టోబర్, నవంబర్ నెలల్లో సామాజిక తనిఖీలు పూర్తి చేయాలని చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయాలు అందుబాటులోకి రాగానే అక్కడే ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల జాబితాలను ఉంచాలన్నారు. పెన్షన్లు, రేషన్కార్డులు ఉన్న వారి జాబితాను బోర్డులో పెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇళ్ల స్థలాల పట్టాలకు సంబంధించిన లబ్ధిదారుల జాబితా కూడా పెట్టే ప్రయత్నం చేయాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు సంబంధించి లబ్ధిదారుల జాబితాలన్నింటినీ బోర్డులో ఉంచాలని చెప్పారు. ఈ జాబితాలపై ఏమైనా అభ్యంతరాలుంటే, పథకం ఎవరికైనా అందకపోతే ఆ సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలని సూచించారు. కొత్త రేషన్కార్డులు, పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి డిసెంబర్ నుంచి ఇవ్వాలన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పథకాలు అందాలని, వారికి అందించాల్సిన ధర్మం, బాధ్యత మనదేనని సీఎం స్పష్టం చేశారు. వైఎస్సార్ రైతు భరోసాపై అవగాహన కల్పించాలి కౌలు రైతులకు సంబంధించి వైఎస్సార్ రైతు భరోసా మార్గదర్శకాలపై గ్రామ సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లకు పూర్తి స్థాయి అవగాహన ఉండాలని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ సూచించారు. దరఖాస్తులు, ప్రొఫార్మాలు అన్నీ కూడా అక్టోబర్ 2 నాటికి అందుబాటులో ఉంచడంతో పాటు లబ్ధిదారుల ఎంపిక కూడా పూర్తి చేయాలన్నారు. ఉగాది నాటికి పేదలందరికీ ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు లబ్ధిదారుల ఎంపిక, వెరిఫికేషన్ వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. సెప్టెంబర్ ఆఖరు నాటికి డేటా కలెక్షన్, వెరిఫికేషన్ పూర్తి కావాలన్నారు. అక్టోబర్ చివరి నాటికి అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమి ఎంతో తేల్చాలని, నవంబర్ నుంచి అవసరమైన చోట భూముల కొనుగోలు ప్రక్రియ ప్రారంభించాలని చెప్పారు. అధికారులందరూ ఈ కార్యక్రమంపై దృష్టి పెట్టాలని సూచించారు. సొంతంగా ఆటో, ట్యాక్సీ, మాక్సీ కాబ్లు నడుపుకుంటున్న వారికి ఏడాదికి రూ.10 వేల ఆర్థిక సాయం పథకానికి సంబంధించి దరఖాస్తులు, తనిఖీలు, ఆమోదంపై ఆరా తీశారు. వరద జలాలు సద్వినియోగం చేసుకోవాలి కర్నూలు, వైఎస్సార్, ప్రకాశం తదితర ప్రాంతాల్లో భారీ వర్షాల సమాచారం వస్తోందని, అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. అనంతపురంలో చిరుధాన్యాల విత్తనాలను పంపిణీ చేస్తున్నామని ఈ సందర్భంగా ఆ జిల్లా కలెక్టర్ తెలిపారు. వచ్చే ఏడాది నాటికి రాయలసీమ ప్రాజెక్టులన్నీ పూర్తి స్థాయిలో నింపేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. 117 టీఎంసీల నీరు వెళ్లినా రిజర్వాయర్లు నిండలేదంటే.. కాల్వల పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుందోని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. స్పందన కార్యక్రమంపై కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహిస్తున్న సీఎం వైఎస్ జగన్ వరద జలాలు సద్వినియోగం చేసుకునే దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వర్షాలు, వరదల కారణంగా ఇసుక అందుబాటులోకి రాలేదని వివిధ జిల్లాల అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. గోదావరి, కృష్ణా నదుల్లో ఇంకా ప్రవాహం కొనసాగుతోందని, వరద తగ్గిన వెంటనే రీచ్లు అందుబాటులోకి వస్తాయని వివరించారు. వరద తగ్గగానే వీలైనంత ఇసుకను స్టాక్ యార్డుల్లోకి తరలించడానికి ముమ్మర ప్రయత్నాలు చేయాలని సీఎం ఆదేశించారు. మానవీయ దృక్పథంతో ప్రజల వినతులు పరిష్కరించాలి ప్రజల నుంచి వచ్చే వినతుల పరిష్కారంలో మరింత మానవీయ దృక్పథంతో ఉండాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ప్రధానంగా ఎమ్మార్వోలు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు మానవీయ కోణంలో ప్రజల వినతులకు పరిష్కారం చూపాలని కోరారు. వినతులు ఇచ్చే వారి స్థానంలో మనం ఉంటే ఎలా ఆలోచిస్తామో అదే రీతిలో మనం స్పందించాలని, అప్పుడే స్పందనకు అర్థం ఉంటుందన్నారు. స్పందన ద్వారా అందే వినతుల పరిష్కారంలో నాణ్యత కోసం కార్యాచరణ ప్రణాళిక తయారు చేశామని, ఇందులో భాగంగా ఎమ్మార్వోలు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లకు వర్క్షాపు నిర్వహిస్తామని చెప్పారు. సమస్యలు తీరుస్తామన్న ఆశతో ప్రజలు మన దగ్గరకు వస్తారని, అందుకు అనుగుణంగానే అధికారులు స్పందించాలని కోరారు. ఇందు కోసమే ఈ వర్క్షాపులని చెప్పారు. రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఈ నెల 24, 27 తేదీల్లో, అక్టోబర్లో జిల్లాల స్థాయిలో రెండు రోజుల పాటు వర్క్షాపులు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. దిగువ స్థాయి అధికారుల్లో మరింత మోటివేషన్ పెంచడమే దీని ఉద్దేశమని, కలెక్టర్లు కూడా ఈ వర్క్షాపులో పాల్గొనాలని సూచించారు. నవంబర్ నుంచి స్పందన వినతుల విషయంలో ప్రభుత్వం సీరియస్గా ఉంటుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రజలందరికీ కంటి పరీక్షలు, అవసరమైన వారికి శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు శంకర నేత్రాలయ, ఎల్వీ ప్రసాద్ ఐ ఆసుపత్రి, ఇతర ఎన్జీఓల సహకారం తీసుకుంటాం. ఈ కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు జిల్లాల్లో టాస్క్ఫోర్స్ కమిటీలు ఏర్పాటు చేస్తాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఇతర వర్గాల్లో పేదరికంతో ఉన్న మహిళలు, తల్లులు, పిల్లలను పౌష్టికాహార లోపం సమస్య నుంచి గట్టెక్కించాల్సిందే. ప్రభుత్వం ఇంతగా ఖర్చు చేస్తున్నా, పౌష్టికాహార లోపం ఎందుకు వస్తోంది? అవసరమైతే మరింత ఖర్చు చేద్దాం.. కానీ సమస్య పరిష్కారం కావాల్సిందే. -
పౌష్టికాహార చాంపియన్ ఒడిశా
భారత్లో అత్యంత వెనుకబడిన రాష్ట్రాల్లో ఒడిశా ఒకటి. అయినా చిన్నారుల పౌష్టికాహార సూచీలో ఆ రాష్ట్రమే చాంపియన్. చిన్నారుల్లో పౌష్టికాహార లోపాలను అధిగమించడంలో ఆ రాష్ట్రం చాలా ముందుందని అంతర్జాతీయ ఆహార విధాన అధ్యయన సంస్థ (ఐఎఫ్పీఆర్ఐ) వెల్లడించింది. వాషింగ్టన్కు చెందిన ఈ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం ఐదేళ్ల లోపు పిల్లల్లో 2005–06 సంవత్సరంలో 46.5 శాతం పిల్లలు పౌష్టికాహార లోపంతో బాధపడుతుంటే 2015–16 సంవత్సరం వచ్చేసరికి వారి సంఖ్య 35.3 శాతానికి తగ్గిపోయింది. ఇక తక్కువ బరువున్న పిల్లల శాతం కూడా గణనీయంగా తగ్గిపోయింది. 2005–06లో 42.3 శాతం తక్కువ బరువున్న పిల్లల సంఖ్య 2015–16 వచ్చేసరికి 35.8 శాతానికి తగ్గిపోయింది. అన్నిటికంటే ముఖ్యంగా ప్రభుత్వం గర్భిణుల మీద అత్యధికంగా దృష్టి సారించింది. ఒడిశాలో ‘నవీన్ పట్నాయక్ సర్కార్ పౌష్టికాహార పథకం’లో భాగంగా గర్భిణులకు పప్పులు, గోధుమ, బార్లీ, బియ్యంతో పాటు చటువా అనే ఆహార పదార్థాన్ని తయారుచేసి ఇస్తారు. దాంతో పాటు బాదంతో తయారుచేసిన లడ్డూలు, నెలకు 8 గుడ్లు రేషన్ కింద ఇస్తారు. బిడ్డ పుట్టాక కూడా గోధుమ రవ్వ ఇస్తారు. బిడ్డకి 9 నెలలు వచ్చే వరకు వారిద్దరి ఆరోగ్యంపై శద్ధ చూపుతారు. దానికితోడు ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ (ఐసీడీఎస్) పథకం, మధ్యాహ్నభోజన పథకం వంటివి అమలు చేయడంలో ఒడిశాలో పరిపాలనా యంత్రాంగం చేసిన కృషి ఒడిశాను నవంబర్ వన్ను చేసింది. కానీ ధనిక రాష్ట్రాల జాబితాలో ఉన్న కర్ణాటక.. చిన్నారుల పౌష్టికాహారం విషయంలో ఆఖరి స్థానంలో ఉంది. అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 18 ఏళ్ల వయసు పిల్లలకు సంబంధించిన పథకాల్లో అత్యంత తక్కువ బడ్జెట్ కేటాయించడం వల్లే ఆ రాష్ట్రం వెనుకబడి ఉన్నట్లు యూనిసెఫ్ సర్వేలో వెల్లడైంది. -
పంటశాలలు
అక్కడి బడిపిల్లలు పోషకాహారలోపంతో ఎండిపోవడాన్ని చూశారు అక్కడి డిప్యూటీ కమిషనర్ శశాంక ఆలా ! ఆలోచించి ఆమె ఓ నిర్ణయం తీసుకున్నారు. బడిలో స్థలముందా... అదే పొలమవుతుంది. ఒకవేళ లేదా... అప్పుడు బడి కప్పే చేనవుతుంది. ఇప్పుడక్కడ ప్రతి చిన్నారికీ బలపం పలకా మాత్రమే కాదు... ప్రతి స్కూలుకూ చేనూచెలకా ఉన్నాయి. పిల్లల ఆరోగ్యాలూ బాగున్నాయి. ఇప్పుడక్కడి స్కూళ్లు పాఠశాలలే కాదు... పంటశాలలు కూడా! మిజోరాంలోని లాంతాలై జిల్లా.. ఏమాత్రం సౌకర్యంగా లేని రోడ్డు మార్గం గుండా పది గంటలు ప్రయాణిస్తే లాంతాలై చేరుకుంటారు. బాగా వెనుకబడిన ప్రాంతం. వర్షాకాలం వచ్చిందంటే చాలు, అక్కడి 170 గ్రామాల్లో 40 గ్రామాలకు మానవ సంబంధాలు తెగిపోతాయి. తిండి కూడా దొరకదు. 180 కి. మీ. దూరంలో ఉన్న అస్సాం నుంచి పండ్లూ, కూరగాయలు రావాలి. అవి ఇక్కడకు చేరేసరికి కుళ్లిపోయి తినడానికి పనికిరాకుండా అయిపోతాయి. నాణ్యత ఉన్న సరుకులను ఎక్కువ ధరలకు అమ్ముతారు. ఉప్పు, పంచదార కూడా నాసిరకానివే దొరుకుతాయి. ఆ జిల్లాకు ఏ ఐఏఎస్ అధికారిని బదిలీ చేసినా.. రాష్ట్ర రాజధాని నుంచి అక్కడికి చేరుకునే దూరాన్ని లెక్కించుకుంటారు. అలాంటి చోటికి చార్జ్ తీసుకున్న ఐఏఎస్ .. శశాంక ఆలా. డిప్యూటీ కమిషనర్ శశాంక ఆలా నా స్కూల్... నా తోట.. లాంతాలైకి సరైన సమయంలో పదార్థాలు చేరకపోవడం వల్ల, స్థానికంగా ఉండే చమ్కా, లాయి తెగలవారికి తాజా కూరగాయలు దొరికేవి కాదు. అక్కడ పండే కూరగాయలతో చేసిన సూప్, ప్రభుత్వం అందచేసే బియ్యం వాళ్ల ఆహారం. అందువల్ల ఇక్కడ ఐదు సంవత్సరాల లోపు పిల్లల్లో 22 శాతం మంది అండర్వెయిట్తో ఉన్నారు. ఈ విషయాన్ని గ్రహించిన శశాంక ఆ సమస్యకు పరిష్కారం ఆలోచించారు. ‘‘కన్ సికుల్.. కన్ హువాన్ (నా స్కూల్.. నా తోట)’’ పేరుతో తన ఆలోచనకు శ్రీకారం చుట్టారు. ప్రతి పాఠశాలలోను చిన్న వంటగది ఉండేలా.. పోషకాలతో కూడిన తోటను పెంచేలా చేశారు. ఒకవేళ ఆ పాఠశాలలో పండించడానికి కావలసిన భూమి లేకపోతే డాబా మీద తోటను పెంచేలా ఏర్పాట్లు చేశారు . ఈ పాఠశాలలు, అంగన్వాడీలు.. వారికి కావలసిన పండ్లు, కూరగాయలను వారే పండించుకోవాలి. విత్తనాలు, కంపోస్టులను జిల్లా కేంద్ర కార్యాలయం నుంచి తెచ్చుకోవాలి. సిల్చార్, ఐజ్వాల్ నుంచి భోజనాల ట్రక్ కోసం నిరీక్షించకుండా, వారు పెంచిన కూరగాయలతో వారే స్వయంగా మధ్యాహ్న భోజనం తయారుచేసుకోవాలి. దీనివల్ల పిల్లలకు కావల్సిన పోషకాహారం అంది వాళ్లు ఆరోగ్యంగా ఉంటారు. ఈ సేంద్రియ సాగు వల్ల పర్యావరణాన్ని పరిరక్షించినట్లవుతుందంటారు శశాంక. వీరు ఉంటారు... హార్టి కల్చర్ విభాగ అధికారి, వ్యవసాయ శాఖ ఉద్యోగి, స్థానిక కృషి విజ్ఞాన్ కేంద్ర ఉద్యోగి, జిల్లా భూ అధికారి.. ఈ నలుగురూ ఒక వ్యవస్థగా ఏర్పడి... మొక్కలు ఎలా నాటాలి, కంపోస్ట్ ఎలా తయారుచేసుకోవాలి, కలుపును ఏ విధంగా వేరు చేయాలి వంటి విషయాలు నేర్పిస్తున్నారు. తెలుపు రంగు బియ్యం, బంగాళ దుంపల నుంచి కార్బోహైడ్రేట్లు, ఆకుపచ్చ ఆకుకూరలు, బీన్స్, క్యాబేజీల నుంచి విటమిన్లు, ఎరుపు రంగు శనగలు, క్యారట్ల నుంచి ఐరన్, విటమిన్లు అందుతాయి. ప్రతి పాఠశాలలోను కనీసం 100 చదరపు గజాల స్థలం ఉండాలి. విత్తనాలు, మొక్కలు నాటి, వాటిని పండించి, మధ్యాహ్నం భోజనం తయారుచేసుకుని తినే ప్రక్రియ వరకు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బాధ్యత తీసుకోవాలి. ప్రస్తుతం త్వరగా వచ్చే పసుపు, అల్లం, టమాటో, మొక్కజొన్న, ముల్లంగి వంటివాటినీ పండిస్తున్నారు. తక్కువ నూనెతో వంట చేసి, పోషకాహారం తీసుకోగలుగుతున్నారు. తొలి విడతగా 213 పాఠశాలల్లో తోటలు పెంచడం మొదలుపెట్టారు. రెండవ విడతగా 500 పాఠశాలలు, అంగన్వాడీలలో ప్రారంభించాలనుకుంటున్నారు. ఆ తరు వాత కోళ్ల పెంపకం మొదలుపెట్టి ఆర్గానిక్ కోడిగుడ్లను ఉత్పత్తి చేసి, వాటిని కూడా అందించాలనుకుంటున్నారు. ‘‘మార్చి 2020 నాటికి ప్రతి పాఠశాలలోను, అంగన్వాడీ, శిశుసంరక్షణ కేంద్రాలలోను, అక్కడి పిల్లలకు సరిపడా పోషకాలను ఇచ్చే పళ్లు, కూరలను వారికి వారే పండించుకునేలా చర్యలు తీసుకుంటున్నాం’’ అంటున్నారు శశాంక ఆలా. ఇది మిజోరంకు మాత్రమే పరిమితం కాదు.. మన అధికారులకూ ఆదర్శం. ఈ ఆలోచనను తెలుగు రాష్ట్రాల్లోనూ అమలు చేస్తే పిల్లలకు రసాయనాల్లేని ఆరోగ్యకరమైన ఆహారం అందడమే కాక వ్యవసాయం చేయడమూ తెలుస్తుంది. హ్యాట్సాఫ్ టు శశాంక ఆలా!!! – వైజయంతి -
పుష్టిని పెంచే సూక్ష్మజీవులు...
పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న పిల్లలకు శక్తినిచ్చే ఆహారం కంటే.. శరీరంలోని బ్యాక్టీరియా వైవిధ్యతను పెంచే ఆహారం ఇవ్వడం మేలని అంటున్నారు వాషింగ్టన్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. ఆశ్చర్యంగా అనిపిస్తుందా? బంగ్లాదేశ్లో జరిగిన ఒక అధ్యయనం ఇదే విషయాన్ని చెబుతోంది మరి! పౌష్టికాహారంతో బాధపడుతున్న పిల్లల్లో శరీరానికి మేలు చేసే బ్యాక్టీరియా తక్కువగా ఉన్నట్లు తాము గుర్తించామని ఈ అధ్యయనంలో పాల్గొన్న శాస్త్రవేత్త జెఫ్రీ గార్డన్ తెలిపారు. ఈ సమస్యను అధిగమించేందుకు తాము ప్రత్యేక ఆహారాన్ని సిద్ధం చేశామని.. ఇది శరీరంలోని మంచి బ్యాక్టీరియా సంతతి, వైవిధ్యతను పెంచేదిగా ఉందని తెలిపారు. పుష్టిలేని పిల్లల్లోని బ్యాక్టీరియా అపరిపక్వంగా ఎదిగి ఉంటుందని.. ఈ ప్రభావం కాస్తా రోగనిరోధక వ్యవస్థతోపాటు జీర్ణక్రియను బలహీన పరుస్తోందని జెఫ్రీ తెలిపారు. జంతువుల్లో బ్యాక్టీరియా సంతతిని పెంచే ఆహారాన్ని గుర్తించి అందుకు అనుగుణంగా తాము పిల్లలకోసం మూడు రకాల ఆహారాలు సిద్ధం చేశామని.. 12 – 18 నెలల కాలం ఈ ఆహారం తీసుకున్న 63 మంది పిల్లల పౌష్టికత గణనీయంగా పెరిగినట్లు గుర్తించామని వివరించారు. ఈ ప్రత్యేక ఆహారం తీసుకోవడం మొదలుపెట్టిన నెలరోజుల్లోనే పిల్లల జీర్ణక్రియల్లో వృద్ధి కనిపించిందని చెప్పారు. శనగ, సోయా, ఆరటిపండు, వేరుశనగలతో కూడిన ఈ ఆహారం బియ్యం, పప్పు దినుసుల కంటే మెరుగైన ఫలితాలు చూపినట్లు చెప్పారు. -
బక్కచిక్కిన బాల్యం
కర్నూలు(హాస్పిటల్): పిల్లల్లో పౌష్టికాహార లోపం నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా అమలు చేస్తున్న పథకాలు సత్ఫలితాలు ఇవ్వడం లేదు. ఆయా కేంద్రాలకు వచ్చే పిల్లల్లో ఇప్పటికీ 30 నుంచి 40 శాతం మంది పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారని అంచనా. ప్రధానంగా బాలికల్లో పోషకాహార లోపం అధికంగా ఉందని, ఈ కారణంగా వారిలో రక్తహీనత ఉన్న వారి సంఖ్య 40 శాతానికి పైగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. జిల్లాలో 16 ఐసీడీఎస్ ప్రాజెక్టుల కింద 3,549 అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఇందులో కర్నూలు డివిజన్లో 1,261, నంద్యాల డివిజన్లో 1,031, ఆదోని డివిజన్లో 1,251 కేంద్రాలు ఉన్నాయి. ఇందులో గర్భిణులు, బాలింతలు, పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించడం, పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పడం చేస్తున్నారు. పిల్లలకు, బాలింతలు, గర్భిణులకు అమృతహస్తం, బాల సంజీవని, బాలామృతం, మధ్యాహ్న భోజన పథకం ద్వారా పౌష్టికాహారాన్ని పంపిణీ చేస్తున్నారు. ఈ మేరకు జిల్లాలో ఆరేళ్లలోపు పిల్లలు 3,40,245 మంది, ఐదేళ్లలోపు పిల్లలు 3,29,057 మంది నమోదయ్యారు. పిల్లల్లో రక్తహీనత, ఎదుగుదల లేకపోవడం, ఎత్తుకు తగ్గ బరువు లేకపోవడం, తరచూ అనారోగ్యానికి గురికావడం, పలు రకాల అనారోగ్య సమస్యలు ఉండటం కనిపిస్తోంది. వీరిలో కాస్త బరువు తక్కువగా ఉన్న వారు 12,605 మంది, మధ్యస్తంగా బరువు తక్కువగా ఉన్న వారు 3,507 మంది, పూర్తిగా బరువు తక్కువగా ఉన్న వారు 6,905 మంది ఉన్నట్లు అధికార లెక్కలు చెబుతున్నాయి. మొత్తంగా జిల్లాలోని 3,29,057 మంది పిల్లల్లో 23,017 మంది బాలలు బరువు తక్కువగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ప్రధానంగా కర్నూలు, నంద్యాల డివిజన్ కంటే ఆదోని డివిజన్లోని కేంద్రాల్లోనే పిల్లలు అధికంగా పోషకాహార లోపంతో బాధపడుతున్నట్లు అధికారుల నివేదికలు చెబుతున్నాయి. కర్నూలు, నంద్యాల డివిజన్లో 8 శాతం పిల్లలు పోషకాహారలోపంతో బాధపడుతుండగా, ఆదోని డివిజన్లో 12 శాతం మంది పిల్లలు ఈ సమస్యతో బాధపడుతున్నారని అంచనా. ఈ కారణంగా వీరు తరచూ పలు రకాల అనారోగ్యానికి గురవుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. మూడు నెలలుగా అందని గుడ్లు ఎదిగే పిల్లలకు సమతుల ఆహారం లేకపోతే వారికి అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ఈ మేరకు కేంద్రాలకు వచ్చే పిల్లలకు కేంద్రం వారంలో ఐదు రోజులు గుడ్లు ఇవ్వాలని సూచించింది. అయితే జిల్లాలో మూడు నెలల నుంచి పిల్లలకు కోడిగుడ్లను సరఫరా చేయడం లేదు. టెండర్దారుడు కోడ్ చేసిన ధరకు, మార్కెట్లో కోడిగుడ్ల ధరకు భారీగా వ్యత్యాసం ఉండటంతో కాంట్రాక్టర్ గుడ్ల సరఫరా నిలిపివేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం దీనికి ప్రత్యామ్నాయం ఆలోచించకుండా పిల్లలకు కడుపు కొడుతోంది. పక్కదారి పడుతున్న పౌష్టికాహారం అంగన్వాడీ కేంద్రాల్లో వారంలో ఐదు రోజులు కోడిగుడ్లు, ఉదయం పాలు, రక్తహీనత ఉంటే సాయంత్రం శనగలను పిల్లలకు ఇస్తారు. దీంతో పాటు మధ్యాహ్నం వేళ వారికి ఆహారాన్ని వండి అక్కడే తినిపిస్తారు. ఈ మేరకు బియ్యం, కందిబేడలు, ఇతర నిత్యావసర సరుకులను, పాలు, కోడిగుడ్లను కేంద్రాలకు ప్రభుత్వం సరఫరా చేయాలి. అయితే చాలా కేంద్రాల్లో రిజిస్టర్లో నమోదైన పిల్లల సంఖ్యకు, హాజరైన వారి సంఖ్యకు పొంతన ఉండటం లేదు. ఎవరైనా అధికారులు తనిఖీకి వెళితే పలురకాల కారణాలు చెప్పి పిల్లలు గైర్హాజరైనట్లు అంగన్వాడీ ఆయాలు, టీచర్లు చెబుతున్నారు. అయితే ప్రతిరోజూ 90 శాతం దాకా పిల్లలు ఆహారాన్ని తీసుకుంటున్నట్లు నమోదు చేస్తున్నారు. జిల్లా మొత్తంగా కేంద్రాల్లో నమోదైన పిల్లల్లో 50 శాతానికి మించి ఆహారాన్ని తీసుకోవడం లేదన్నది బహిరంగరహస్యం. కానీ 90 శాతం పిల్లలు తింటున్నారని లెక్కలు రాస్తున్నారు. 40 శాతం ఆహారాన్ని పక్కదారి పట్టించి సొమ్ము చేసుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఈ విషయం సీడీపీఓలకు తెలిసినా మామూళ్లు తీసుకుని ఊరుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. -
‘భవిష్యత్’ బలహీనం!
సాక్షి, హైదరాబాద్: శరీరానికి సరిపడా పోషకాహారాన్ని తీసుకోకపోవడంతో భావిపౌరులు సత్తువ కోల్పోతున్నారు. వసతిగృహాల్లో పౌష్టికాహారాన్ని ఇస్తున్నప్పటికీ అక్కడి విద్యార్థుల్లో రక్తహీనత అధికంగా ఉంటోంది. తీసుకునే ఆహారంలో పోషకాలు లోపిస్తున్నాయో... లేక సరైన ఆహారమే అందడం లేదో కాని అత్యధికుల్లో రక్తహీనత లోపం కనిపిస్తోంది. ఒక ప్రైవేటు సంస్థ చేసిన సర్వేలో ఈ విషయం వెలుగు చూసింది. రాష్ట్రవ్యాప్తంగా 2,245 సంక్షేమ వసతి గృహాలున్నాయి. వీటి పరిధిలో 2.85 లక్షల మంది విద్యా ర్థులు వసతి పొందుతున్నారు. ప్రస్తుతమున్న వసతి గృహాల్లో 1,722 వసతి గృహాలు ప్రీ మెట్రిక్ హాస్టళ్లు కాగా.. మిగతా 523 వసతి గృహాలు పోస్టుమెట్రిక్ హాస్టళ్లు. తాజాగా ప్రీ మెట్రిక్ హాస్టళ్లలోని విద్యార్థుల ఆరోగ్య స్థితిపై ఓ సంస్థ అధ్యయనం చేసింది. అనీమియా కారణంగా దాదాపు 65.3 శాతం చిన్నారుల ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తేలింది. వీరిలో అత్యధికంగా బాలికలే ఉండడం గమనార్హం. బాలికల్లో అత్యధికం.. రక్తహీనత బాలుర కంటే బాలికల్లోనే అత్యధికంగా ఉంది. సాధారణంగా పిల్లల రక్తంలో ప్రతీ డెస్సీలీటర్కు కనీసం 12 గ్రాముల హిమోగ్లోబిన్ ఉండాలి. అంతకంటే తక్కువగా ఉంటే రక్తహీనత సమస్య ఉన్నట్లే. కానీ చాలామంది చిన్నారుల్లో 10 గ్రాములు/డీఎల్ కంటే తక్కువ ఉన్నట్లు తేలింది. ప్రతి 100 మంది బాలికల్లో 55 మందిలో రక్తహీనత తీవ్రంగా ఉంది. అదే బాలుర కేటగిరీలో 50 మంది పిల్లల్లో రక్తహీనత ఉన్నట్లు స్పష్టమైంది. ప్రతి 100 మందిలో 13 మంది పిల్లల ఆరోగ్యం ప్రమాదకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. రక్తహీనతతోపాటు పోషక లోపాలతో ఇతర అనారోగ్యాల బారిన పడుతున్నట్లు తెలుస్తోంది. నూరు మందిలో కేవలం 35 మంది పిల్లలు మాత్రమే ఆరోగ్యంగా ఉన్నట్లు సర్వేలో తేలింది. అనర్థాలకు దారితీసేలా.. ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బీ12 లోపించిన చిన్నారుల్లో రక్తహీనత సమస్యలు తలెత్తుతాయి. పిల్లల్లో రక్తహీనత సమస్య పలు అనర్థాలకు దారితీస్తాయి. ముఖ్యంగా చిన్నారుల ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. అదేవిధంగా శ్వాస సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పలు రకాల ఇన్ఫెక్షన్లు సోకి దీర్ఘకా లిక వ్యాధులకు ఆస్కారం ఉంటుంది. రోగ నిరోధక శక్తి కోల్పోయి పలు రకాల వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది. దీంతో వారు ఏకాగ్రతను క్రమంగా కోల్పోయి అనారోగ్యానికి గురవుతారు. ఏఎన్ఎమ్లు వసతిగృహాలకు క్రమం తప్పకుండా వెళ్లి పిల్లల ఆరోగ్య పరిస్థితిని సమీక్షించాల్సి ఉంది. అయితే అదేమీ లేకపోవడంతో పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. మరోవైపు సంక్షేమ శాఖలు కూడా దీనికి సంబంధించి ఎటువంటి నివారణ చర్యలను చేపట్టడం లేదు. -
మునగాకు సాగు ఇలా..
పోషకాహార లోపాలకు మునగాకు సరైన మందు. కొన్ని ప్రాంతాల్లో మునగాకు ఉత్పత్తులను రోజు వారీ ఆహారంలో భాగంగా చేసుకున్నారు. ఇటీవల కాలంలో నగరాల్లోనూ పోషకాహార లోపం నివారణకు వివిధ పద్ధతుల్లో మునగ ఆకు ఉత్పత్తుల వాడకం పెరిగింది. పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా మునగ ఆకును సాగు చేయటం ఎలా? ఇంటి పెరటిలోనో లేదా పొలంలోనో కొద్దిపాటి స్థలంలో మునగ ఆకు తోట పెంపకాన్ని చేపడితే ఏడాదంతా తాజా మునగాకును పొందవచ్చు. ఉన్న కొద్దిపాటి స్థలంలోనే మంచి పంట వస్తుంది. సామాజిక స్థలాలు, తోటలు, పాఠశాల ఆవరణల్లోనూ ఈ విధానంలో మునగతోటలను సాగు చేసుకుంటే మంచి ఆరోగ్యకరమైన ఆహారం మన సొంతమవుతుంది. ఎండిన కాడల నుంచి ఆకును సేకరించాలి. తాజా ఆకును వాడుకోవచ్చు. లేదా నీడలో ఆరబెట్టిన ఆకుతో పౌడర్ తయారు చేసుకోవచ్చు. కత్తిరించిన తరువాత మునగ మొక్కలు మళ్లీ చిగురిస్తాయి. మరో 50 రోజుల్లో కోతకొస్తాయి. మునగ తోట ఏళ్ల తరబడి ఆకును ఇస్తూ ఉంటుంది. అదెలాగో చదవండి మరి.. ముందుగా 13 చదరపు అడుగుల స్థలాన్ని ఎంపిక చేసుకోవాలి. అక్కడ 2 అడుగులు లోతు మట్టి తవ్వాలి తవ్విన మట్టికి సమాన నిష్పత్తిలో కోళ్ల ఎరువు లేదా వానపాముల ఎరువును కలుపుకోవాలి తవ్విన గుంతను లేదా మడిని మట్టి, ఎరువుల మిశ్రమంతో నింపాలి. మడిని నీటితో తడుపుతుండాలి. ఆరు వారాల్లో మంచి ఎరువు తయారవుతుంది చెక్కముక్కలను ఉపయోగించి మడిని నాలుగు సమాన భాగాలుగా విభజించుకోవాలి తర్వాత మునగ విత్తనాలు నాటుకోవాలి విత్తనాలు విత్తిన తర్వాత గడ్డిని పరచి ఆచ్ఛాదన కల్పించి, నీటి తడులివ్వాలి పెంపుడు జంతువులు, పశువుల నుంచి మడికి రక్షణ కల్పించాలి మడిలో నెల రోజుల్లో ఏపుగా, వత్తుగా పెరిగిన మునగ మొక్కలు 5 వారాల్లో మునగ మొక్కలు ఇలా కనువిందు చేస్తాయి 6 వారాల వయసున్న మునగ మొక్కలు భూమి మట్టం నుంచి అడుగున్నర ఎత్తులో కత్తిరించాలి కొమ్మలను నీడలో ఆరబెట్టాలి 50–60 రోజులకల్లా మళ్లీ మునగ తోట కోతకు సిద్ధంగా ఉంటుంది మూడోసారి కోతకు సిద్ధంగా ఉన్న మునగ మొక్కలు మూడో కోతలో దాదాపు 90 కిలోల తాజా రెమ్మల దిగుబడి వస్తుంది -
చిట్టి బొజ్జలకు.. చేటు భోజనం!
మధ్యాహ్నం భోజనం కింద పిల్లలకు అందిస్తున్న ఆహారాన్ని జంతువులు కూడా తినవు. ఒకవేళ తిన్నా అవి బతికి బట్టకట్టవు’’.. ప్రభుత్వ పాఠశాలల్లో భోజన నాణ్యతా ప్రమాణాలపై ప్రకాశం జిల్లా రామాయపట్నం మండల పరిషత్ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు హైకోర్టుకు లేఖరాయడంతో నివేదిక తెప్పించుకున్న రాష్ట్ర సర్వోత్తమ న్యాయస్థానం..విచారణ సందర్భంగా చేసిన వ్యాఖ్యలివి.. ఉడకని బియ్యం, నీళ్ల చారు. గోలీ సైజు కోడిగుడ్డు.. ఇదీ ప్రకాశం జిల్లాలో మధ్యాహ్న భోజనం మెను. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం విషయం ప్రస్తావిస్తేనే విద్యార్థులు ‘అమ్మో’ అంటున్నారు. అది తిని ఆరోగ్యంగా ఉంటామా? అని సందేహం వ్యక్తంచేశారు ఒంగోలు నగరంలోని పలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు. మధ్యాహ్న భోజనం కంటే జైలు భోజనమే నయమంటూ వారు వ్యాఖ్యానించడం విశేషం. దీంతో చాలామంది ఇంటి నుంచే తెచ్చుకు తింటున్నారు. ఇది ఒక్క ప్రకాశం జిల్లాకే పరిమితం కాదు..రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లోనూ మధ్యాహ్న భోజనం పరిస్థితి దాదాపు ఇంతే. సాక్షి, అమరావతి/నెట్వర్క్: పిల్లలకు పౌష్ఠికాహారం అందించేందుకు కేంద్ర ప్రభుత్వ నిధులతో కొనసాగుతున్న మధ్యాహ్న భోజన పథకం రాష్ట్రంలో అధ్వానంగా మారింది. జంతువులు కూడా ముట్టుకోని రీతిలో ఉంటున్న ఆహార పదార్థాలను ప్రభుత్వం పిల్లలకు అందిస్తోంది. ఈ ఆహారాన్ని తినలేక పిల్లలు నానా అవస్థలు పడుతున్నారు. పౌష్టికత మాట దేవుడెరుగు.. తిన్నవారంతా రోగాల బారిన పడుతున్నారు. ప్రధానంగా కమీషన్ల యావతో ప్రభుత్వ పెద్దలు పిల్లల కడుపుకొడుతున్నారు. భారీగా కమీషన్లు తీసుకుంటుండడంతో సరుకులు పంపిణీ చేసే సంస్థలు నాసిరకమైనవి సరఫరా చేస్తున్నాయి. వాస్తవానికి గతంలో ఆయా జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలోనే సరుకుల పంపిణీ వ్యవహారాల టెండర్లు ఖరారుచేసి, పాఠశాలల వారీగా అక్కడికక్కడే డ్వాక్రా మహిళల ద్వారా మధ్యాహ్న భోజనం వండించి పిల్లలకు వేడివేడి పదార్ధాలను అందించేవారు. కానీ, కమీషన్ల యావతో ప్రభుత్వ పెద్దలు ఈ టెండర్లను రాష్టస్థాయిలో కేంద్రీకరించి తమకు భారీగా ముడుపులిచ్చే సంస్థలకు కట్టబెడుతున్నారు. మరోపక్క డ్వాక్రా మహిళలను తప్పించి క్లస్టర్ల వారీగా పలు స్వచ్ఛంద సంస్థలకు అప్పగించారు. ఎప్పుడో తెల్లవారుజామున వండిన పదార్థాలను మధ్యాహ్నానికి ఆయా స్కూళ్లకు అందిస్తున్నాయి. దీంతో ఆ పదార్థాలు పాడవుతున్నాయి. విద్యార్థులు తినడానికి పనికిరావడంలేదు. వారానికి ఐదు గుడ్లు అందించాల్సి ఉన్నా ఈ సంస్థలు పంపిణీ చేయడంలేదు. కొన్ని జిల్లాల్లో గుడ్లు పంపిణీ చేస్తున్నా అవి పురుగులుపట్టి ఉండడంతో విద్యార్థులు పారేస్తున్నారు. నాణ్యత ఒట్టిమాటే! రాష్ట్రంలోని 45,589 స్కూళ్లలోని 36.17 లక్షల మంది విద్యార్థులకుగాను హాజరును బట్టి 23.46లక్షల మందికి ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలుచేస్తున్నారు. ఆరంభంలో 1 నుంచి 8వ తరగతి పిల్లల వరకే ఇది అమలుకాగా తరువాత 9, 10 తరగతుల పిల్లలకు విస్తరించారు. వీరికి ఉడికీ ఉడకని అన్నం, కూరలు కొన్నిసార్లు వడ్డిస్తుండగా కొన్నిమార్లు ముద్దయిన అన్నం పెడుతున్నారు. ఇక జిల్లాల్లో పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉందో చూడండి.. - కర్నూలు జిల్లా కల్లూరు మండలం పెద్దపాడు దగ్గర ఇటీవల ఒక కేంద్రీకృత వంటశాలను ప్రారంభించారు. నాణ్యత సక్రమంగా లేకపోవడంతో రెండు రోజులకే బంద్ చేశారు. బియ్యం నాసిరకంగా ఉండడంతో ఉడకడంలేదు. కందిపప్పు సైతం విద్యార్థులకు సరిపడా పంపిణీ చేయడంలేదు. 840 స్కూళ్లకు కోడిగుడ్డు సరఫరా నిలిచి పోయింది. - శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పలుచోట్ల పూర్తిస్థాయిలో భోజనం సరఫరా కావడంలేదు. అప్పుడప్పుడు తడిసిపోయిన, ముక్కిపోయిన బియ్యం సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. దీంతో రంగుమారి వాసన వస్తుండడంతో అనేకమంది విద్యార్థులు భోజనం చేయడంలేదు. - ప్రభుత్వం సరఫరా చేస్తున్న బియ్యం, కందిపప్పు, కోడిగుడ్లు నాసిరకంగా ఉంటున్నాయని నెల్లూరు జిల్లా నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. - చిత్తూరు జిల్లాలో బడ్జెట్ సరిపోక నీళ్లచారు, నీళ్ల పప్పును వడ్డిస్తున్నారు. బియ్యం కూడా నాసిరకం కావడంతో అన్నం ముద్దముద్ద అవుతోంది. భోజనం అధ్వానంగా ఉండటంతో చాలాచోట్ల పిల్లలు తినడానికి ఆసక్తి చూపించడంలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చదువుకున్న చంద్రగిరి బాలుర ఉన్నత పాఠశాలలో కూడా ఇదే పరిస్థితి. - కృష్ణాజిల్లా వ్యాప్తంగా 90శాతం పాఠశాలల్లో నీళ్లచారు, ఉడకని అన్నం, కుళ్లిన కోడిగుడ్లు అందిస్తున్నారు. వాటిని తినలేక బయటపడేస్తున్న పరిస్థితి నెలకొంది. - కేంద్రీకృత వంటశాల విధానంతో అనంతపురం జిల్లాలోని నాలుగుచోట్ల ప్రయోగాత్మకంగా తెల్లవారుజామున 2.30గంటలకే తయారుచేస్తున్నారు. దీంతో సుదూర ప్రాంతాలకు వెళ్లేసరికి నాణ్యత లోపిస్తోందని టీచర్లు ఆరోపిస్తున్నారు. కోడిగుడ్లను సైతం నాణ్యతలేనివి సరఫరా చేస్తున్నారు. - విజయనగరం జిల్లాను ఐదు క్లస్టర్లుగా విడగొట్టి కార్పొరేట్ సంస్థకు అప్పగించారు. దీంతో రెండ్రోజులపాటు అనేక పాఠశాలలకు సకాలంలో భోజనాలు అందలేదు. జిల్లాలో శుక్రవారం గుడ్డు, అన్నం, వెజిటబుల్స్, పప్పు పెట్టాలి. కానీ, ఉడికీ ఉడకని అన్నం, తాలింపులేని పప్పు మాత్రమే పెట్టారు. గుడ్డు ఇవ్వలేదు. - వైఎస్సార్ జిల్లాలో అయితే చాలాచోట్ల కోడిగుడ్ల సరఫరా లేదు. ఇక్కడ మెనూను పక్కన పెట్టి వండుతున్నారు. - గుంటూరు జిల్లాలో సన్న బియ్యం బదులు దొడ్డు బియ్యం పెడుతుండడంతో పిల్లలు తినకుండా ఇంటి నుంచి తెచ్చుకుంటున్నారు. అలాగే, ఎక్కువశాతం పాఠశాలల్లో మంచినీరు అందుబాటులో ఉండడంలేదు. - ఇక విశాఖ జీవీఎంసీ పరిధిలో నాణ్యత కొంతమేర బాగానే ఉన్నప్పటికీ గ్రామీణ ప్రాంతంలో మాత్రం అధ్వాన్నంగా ఉంది. ముతకబియ్యం సరఫరా చేస్తున్నారు. అన్నంలో రాళ్లు, ఇసుక, పురుగులు కూడా ఉంటున్నాయని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. సాంబారు చిక్కగా ఉండేందుకు పప్పుకు బదులుగా జొన్న, శనగపిండి కలిపేస్తున్నారు. సాంబారులో కూరగాయల ఊసే లేదు. దీంతో విద్యార్థులు ముట్టకుండానే పారేస్తున్నారు. - తూర్పుగోదావరి జిల్లాలోనైతే విద్యార్థులు ఆహారాన్ని తినడంలేదని సాక్షాత్తు కేంద్ర, రాష్ట్ర ఆహార కమిటీ సభ్యులు గుర్తించడం గమనార్హం. ఢిల్లీ, అమరావతి నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు గత నెల 68 పాఠశాలల్లో పరిశీలించగా 20 శాతానికిపైగా విద్యార్థులు మధ్యాహ్న భోజనాన్ని తీసుకోవడంలేదని గుర్తించాయి. పర్యవేక్షణ లేకపోవడం, శుభ్రత పాటించకపోవడం, నాసిరకం సామాగ్రి వినియోగంతో విద్యార్థుల్లో పోషకాహారం లోపించి వ్యాధుల బారిన పడుతున్నారని.. వయసు, ఎత్తుకు తగిన బరువు కలిగి ఉండటంలేదని, మరికొన్ని, ఇతర ఆరోగ్య సమస్యలకు లోనవుతున్నట్టు వారి పరిశీలనలో తేలింది. వంట ఏజెన్సీలపై బకాయిల బండ పిల్లలకు భోజనాలు అందించే వంట ఏజెన్సీలకు, కార్మికులకు బిల్లులు ప్రభుత్వం సకాలంలో చెల్లించకపోవడంతో నెలల తరబడి పెండింగ్లో ఉంటున్నాయి. ఉదాహరణకు.. శ్రీకాకుళం జిల్లాలో రెండు నెలలుగా ఇలా బకాయి ఉన్నాయి. దీంతో పలుచోట్ల ప్రధానోపాధ్యాయులే సొంత డబ్బులతో గుడ్లు తెప్పిస్తున్నారు. వారానికి ఐదు కోడిగుడ్లు అందించాల్సి ఉన్నప్పటికీ కర్నూలు జిల్లాలో ఈ ఏడాది సెప్టెంబరు వరకు ఏజెన్సీలు, కార్మికులకు మొత్తం రూ.4.36 కోట్లు చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వం ఇస్తున్న నిధులు సరిపోవడంలేదని నెల్లూరు జిల్లాలోని నిర్వాహకులు వాపోతున్నారు. కృష్ణాజిల్లాలోనూ సకాలంలో బిల్లులు రాక అప్పుల పాలవుతున్న వంట నిర్వాహకులు నాణ్యమైన భోజనం అందించలేకపోతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా రెండు నెలలుగా బిల్లులు విడుదల చేయకపోవడంతో ఏజెన్సీలు, కార్మికులకు మొత్తం రూ.3.72కోట్ల బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. ఇక విజయనగరం జిల్లాల్లోనూ రూ.6కోట్ల వరకు బకాయిలున్నాయి. ఇక్కడ సకాలంలో ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోయినా విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా అప్పులు చేసి వారు బాధ్యతగా భోజనాలు పెడుతుండగా ఇక్కడ ప్రైవేట్కు అప్పజెప్పడంతో నిర్వాహకులు రోడ్డునపడ్డారు. వైఎస్సార్ జిల్లాలో రూ.1.32కోట్ల బకాయిలున్నాయి. బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో అప్పులు చేస్తూ మరీ నిర్వాహకులు వంట చేస్తున్నారు. జిల్లాలన్నింటిలో ఇదే పరిస్థితి. రాష్ట్ర ఫుడ్ కమిషన్ తప్పుబట్టినా మారని వైనం మధ్యాహ్న భోజనం తీరుపై రాష్ట్ర ఫుడ్ కమిషన్ ఛైర్మన్ జేఆర్ పుష్పరాజ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి కొద్దికాలం క్రితం ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. మధ్యాహ్న భోజనం అత్యంత నాసిరకంగా ఉంటోందని ప్రభుత్వానికి కమిషన్ నివేదిక ఇచ్చినా పథకం అమలు తీరులో ఎలాంటి మార్పు రాలేదు. గుడ్లలో 60 శాతం మాత్రమే పంపిణీ అవుతోందని తేల్చింది. గుడ్లు కూడా 52 గ్రాములు ఉండాల్సి ఉండగా కేవలం 35 గ్రాములే ఉంటున్నట్లు గుర్తించింది. ఈ లెక్కన రూ.131కోట్ల వరకు నిధులు పక్కదారి పడుతున్నట్లు కమిషన్ నివేదిక ద్వారా తేటతెల్లమవుతోంది. స్వచ్ఛంద సంస్థలకు ఇవ్వడం సరికాదు 16 ఏళ్లుగా మధ్యాహ్న భోజనం ఏజెన్సీ నిర్వహిస్తున్నా. ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థకు అప్పగిస్తే మేం రోడ్డున పడతాం. ప్రస్తుతం మూడు నెలల బిల్లులు రావాలి. తొమ్మిది నెలల బిల్లులు పెండింగ్లో ఉన్న రోజుల్లో కూడా అప్పులు తెచ్చి విద్యార్థులకు వడ్డించాం. – రుక్మిణి, ఏజెన్సీ నిర్వాహకురాలు, బేతంచెర్ల, కర్నూలు జిల్లా కడుపులో నొప్పి వస్తోంది అన్నం లావుగా ఉంటోంది. తినాలంటే చాలా కష్టంగా ఉంది. ముద్ద దిగడంలేదు. ఆకలికి ఉండలేక తింటున్నాం. ఒక్కోసారి అన్నం తిన్నాక కడుపులో నొప్పి వస్తోంది. అందుకే ఎక్కువ రోజులు ఇంటి దగ్గర నుంచి అన్నం తెచ్చుకుంటాం. ఇక్కడ మంచి నీళ్లు కూడా సరిగాలేవు. – ఓర్చు అశ్వని, 4వ తరగతి, చండ్రాజుపాలెం పాఠశాల, బెల్లంకొండ మండలం, గుంటూరు జిల్లా రోడ్డున పడేస్తున్నారు పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతాన్ని బట్టి మాకు రేషన్ సరుకులు ఇచ్చేవారు. వాటితోనే అప్పటికప్పుడు వండి వేడివేడిగా పిల్లలకు పెడుతున్నాం. కానీ, ఇప్పుడు నవప్రయాస్ సంస్థ వారు వండి తీసుకొస్తున్నారు. నాణ్యత లేని భోజనం పెడుతున్నారు. విద్యార్థులు చాలా ఇబ్బందిపడుతున్నారు. అయినా సరే ఆ ఏజెన్సీకే సహకరిస్తూ సేవలందిస్తున్న మమ్మల్ని రోడ్డుపాల్జేస్తున్నారు. చాలా దారుణం. మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రభుత్వమే నిర్వహించాలి. మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి. – జి.వరలక్ష్మి, రాష్ట్ర అధ్యక్షురాలు, మిడ్ డే మీల్స్ నిర్వాహుకల సంఘం, విశాఖపట్నం వంట కార్మికులకు ఇస్తున్న వేతనం అత్యల్పం రాష్ట్రంలో మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికులకు ప్రభుత్వం రూ.1000 చొప్పున మాత్రమే అందిస్తోంది. ఇది కనీస వేతనం కూడా కాదు. అదే ఇతర ప్రాంతాల్లో చూస్తే తమిళనాడులో రూ7,500, కేరళలో 6వేలు, లక్షద్వీప్లో రూ.6వేలు, పాండిచ్చేరిలో రూ.5నుంచి 9వేలు ఇస్తున్నారు. కేంద్రం ఇస్తున్నది రూ.1000 అయినా మిగతా మొత్తాన్ని కలిపి టైమ్స్కేల్ కింద ఈ మొత్తాన్ని ఆయా ప్రభుత్వాలు అందిస్తున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం రూ.1000 మాత్రమే ఇస్తుండగా ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని క్రమేణా స్వచ్ఛంద సంస్థలకు అప్పగిస్తూ వారి నోట మట్టికొడుతోంది. రూ.4.35తో భోజనం వస్తుందా.. ప్రభుత్వం ఆయా విద్యార్థులకు భోజనానికి నిర్దేశించిన మొత్తాన్ని పరిశీలిస్తే విస్మయం కలుగక మానదు. ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్ధుల్లో 90 శాతానికి పైగా బడుగు, బలహీన వర్గాలకు చెందిన నిరుపేద కుటుంబాలకు చెందిన వారే. ఈ రోజుల్లో బయట భోజనం చేయాలంటే కనీసం 30 నుంచి 40 రూపాయల వరకు ఖర్చవుతుంది. ఇక ఈ పిల్లల భోజనానికి అవసరమయ్యే బియ్యాన్ని పౌరసరఫరాల ద్వారా అందిస్తుండగా పప్పులు, కూరగాయలు, ఆయిల్, ఇతర పప్పు దినుసులు, గుడ్లు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఇస్తున్న మొత్తం మరీ దారుణంగా చాలా తక్కువగా ఉంటోంది. ఈ విద్యార్ధుల్లో ప్రాథమిక స్థాయి వారికి రూ.4.35, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల వారికి రూ.6.51 కేటాయిస్తున్నారు. ఇందుకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో నిధులు సమకూరుస్తున్నాయి. ఈ మొత్తమే అతి తక్కువ కాగా ఇందులో ఆయా సరుకుల కాంట్రాక్టులను కట్టబెడుతూ ప్రభుత్వ పెద్దలు కమీషన్లు కోట్లలో కాజేస్తున్నారు. కోడిగుడ్లు, కందిపప్పు, ఆయిల్ సరఫరా కాంట్రాక్టుల్లో రూ.10 నుంచి 15 కోట్ల వరకు ముడుపులు చేతులు మారుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఇలా అయితే క్యాలరీస్, ప్రొటీన్లు ఎలా.. ప్రభుత్వమిచ్చే మొత్తమే తక్కువగా ఉండగా అందులో కమీషన్ల కారణంగా కాంట్రాక్టర్లు నాసిరకంగా ఉన్న వాటిని సరఫరా చేస్తున్నారు. దీంతో విద్యార్ధులకు సరైన పౌష్ఠికాహారం అందడంలేదు. హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, హోమ్సైన్సు కాలేజీ, అగ్రికల్చరల్ యూనివర్సిటీ సూచనల మేరకు స్థానిక వనరులతో పౌష్టికాహార మెనూను నిర్దేశించారు. అన్నం, పప్పు, కూరగాయలు, సాంబారు, పులిహోరతో పాటు వారానికి ఐదు గుడ్లు, అరటి పండ్లు పంపిణీ చేయాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం నిర్దేశిత మార్గదర్శకాలు విడుదల చేస్తున్నా ఆ మేరకు పథకం అమలుకావడంలేదు. మిగిలిన జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. ఈ స్థాయిలో క్యాలరీస్, ప్రొటీన్లు అందకపోవడంతో అందడానికి విద్యార్థులకు ప్రయోజనం లేకుండాపోతోంది. ఏ మోతాదులో ఆయా పదార్థాలు అందించాలో సూచించినా అవి అందడం లేదు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఆధ్యాత్మిక వ్యవహారాలతో కూడుకున్నవి అయినందున కోడిగుడ్ల పంపిణీని పూర్తిగా నిలిపివేశాయి. కిచెన్ షెడ్లు ఏవీ? ఇప్పటివరకు ఈ మధ్యాహ్న భోజనాన్ని ఆయా పాఠశాలల పరిధిలోని డ్వాక్రా మహిళలకు అప్పగించారు. వారే స్కూళ్లలో ఈ ఆహారాన్ని వండి విద్యార్థులకు వేడివేడిగా అందిస్తున్నారు. అనేకచోట్ల కిచెన్ షెడ్లు వంటివి లేకపోయినా ఆరుబయటే ఏదోలా సర్దుబాటు చేసుకుంటూ భోజన తయారీ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఇదే పరిస్థితి. కర్నూలు జిల్లాలో 1,078 స్కూళ్లలో వంట గదులు, 1,445 స్కూళ్లలో తాగునీటి సదుపాయంలేదు. అనంతపురం జిల్లాలో షెడ్లు లేకపోవడంవల్ల పొయ్యిలు మండక ఉడికీ ఉడకని భోజనాన్నే పిల్లలకు వడ్డించే పరిస్థితి. ఇక్కడ 2012లో మంజూరు చేసిన వంట గదుల నిర్మాణాలు ఇప్పటికీ పూర్తికాలేదు. గుంటూరు జిల్లాలోని సగం పాఠశాలల్లో కిచెన్ షెడ్లు లేక అపరిశుభ్రమైన వాతావరణంలోనే విద్యార్థులకు భోజనాన్ని వండి పెడుతున్నారు. పాఠశాలల్లోనే వండి వడ్డించాలని ‘సుప్రీం’ చెప్పినా.. విద్యార్థులకు అందించే భోజనాన్ని పాఠశాలల్లోనే వండి వడ్డించాలని సుప్రీంకోర్టు గతంలో ఆదేశాలు ఇచ్చినా ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2013లో రాష్ట్రంలో సుప్రీంకోర్టు నియమించిన కమిషన్ పర్యటించింది. మొత్తం 13 మందితో కూడిన ఈ కమిషన్ ఆయా స్వచ్ఛంద సంస్థల్లో తయారవుతున్న ఆహార పదార్ధాలను, సరఫరా తీరుతెన్నులను పరిశీలించింది. - ఈ సంస్థలు అనేక అక్రమాలకు పాల్పడుతున్నట్లు కమిషన్ గుర్తించింది. - అటెండెన్సు ప్రకారం కాకుండా తమ ఇష్టానుసారం పిల్లల సంఖ్యలను వేస్తూ కోట్లాది రూపాయలను ప్రభుత్వం నుంచి పిండుకుంటున్నట్లు నివేదికలో పొందుపరిచింది. - భోజనాన్ని అందించే పరిమాణంలో కూడా 200 గ్రాముల నుంచి 275 గ్రాములు తక్కువగా ఉంటోందని పేర్కొంది. - యంత్రాల సహాయంతో అత్యధిక వేడితో టన్నుల కొద్దీ ఆహార పదార్ధాలను వండుతుండడం వల్ల రేడియేషన్ ప్రభావం పడుతోందని గుర్తించింది. - అదే సమయంలో తెల్లవారుజాము నుంచి ఈ పదార్ధాలు తయారుచేసి మధ్యాహ్నానికి ఆయా స్కూళ్లకు పంపిణీ చేస్తున్నందున పాచిపోతున్నాయని గుర్తించింది. - వీటిని తింటున్న విద్యార్ధులు అనారోగ్యం పాలవుతున్నారని నివేదించింది. - కుళ్లిన కూరగాయలు, నాణ్యతలేని సరుకులతో వంటకాలు తయారు చేస్తుండడంవల్ల అవి మరింత త్వరగా పాడవుతున్నాయి. డ్వాక్రా మహిళల పొట్టకొట్టి.. పాఠశాలలకు బియ్యం వచ్చినా ఇతర సరకులు సరఫరా కాని సమయంలో కూడా డ్వాక్రా మహిళలు స్థానికంగా ఉన్న షాపుల్లో అరువుకు తెచ్చి పిల్లలకు పదార్ధాలు చేసి పెడుతుండేవారు. ఈ వంటలకు కాలసిన గ్యాస్ సరఫరా ప్రభుత్వమే చేయాల్సి ఉన్నా పలుచోట్ల అదీ లేదు. దీంతో స్థానికంగా ఉన్న వనరులతో పూర్తిచేస్తూ వచ్చారు. ఇటీవల గ్యాస్ సరఫరాను చేస్తున్నా దానికి సంబంధించిన నిధులు విడుదల చేయకపోతుండడంతో నెలల తరబడి ఆ గ్యాసూ రావడంలేదు. నూరు శాతం గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేశామని, కిచెన్ షెడ్లు నిర్మాంచామని గొప్పలు చెబుతున్నప్పటికీ విశాఖ జిల్లాలోని 70 పాఠశాలల్లో ఆరుబయటే కట్టెల పొయ్యిపైనే వంటలు చేస్తున్నారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. కాగా, ప్రస్తుతం గుడ్లు, పప్పు, ఆయిల్ వంటి సరుకుల సరఫరా కాంట్రాక్టును రాష్ట్రస్థాయిలో కేంద్రీకరించడంతో పాటు ఆహార పదార్థాలు వండి స్కూళ్లకు సరఫరా బాధ్యతను కొన్ని స్వచ్ఛంద సంస్థలకు ప్రభుత్వం అప్పగిస్తోంది. క్లస్టర్ల వారీగా ఆయా స్కూళ్లకు సెంట్రలైజ్డ్ కిచెన్లను తానే ఏర్పాటుచేసి అక్కడ వండే పదార్థాలను ఈ స్వచ్ఛంద సంస్థల ద్వారా పంపిణీ చేయిస్తున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 80వేల మంది డ్వాక్రా మహిళలను దశలవారీగా ఈ వంట పని నుంచి తొలగిస్తూ వస్తున్నారు. దీనిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వారు ఉద్యమం చేపట్టినా ప్రభుత్వం స్పందించలేదు. -
ప్రపంచంలో పెరుగుతున్న ఆకలి కేకలు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా వరుసగా మూడో సంవత్సరం సరైన ఆహారం అందుబాటులో లేక ఆకలి కేకలు పెరిగాయి. 2016 సంవత్సరం నుంచి ఆహారం అందుబాటులేని వారి సంఖ్య అదనంగా 1.5 పెరిగింది. దీంతో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆహారం అందుబాటులో లేనివారి సంఖ్య 82 కోట్లకు చేరుకుందని ఐక్యరాజ్య సమితి వార్షిక ఆహార భద్రతా నివేదిక వెల్లడించింది. పదేళ్ల క్రితం ప్రపంచంలో ఆకలి కేకలు ఏ స్థాయిలో ఉండేవో ఇప్పుడు ఆ స్థాయికి చేరకున్నాయని ఈ నివేదిక తెలియజేస్తోంది. పౌష్టికాహార లోపంతో పుడుతున్న పిల్లల సంఖ్య కూడా పెరుగుతోంది. ముఖ్యంగా దక్షిణ అమెరికా, మధ్య ఆసియా, ఆఫ్రికాలోని పలు ప్రాంతాలు సరైన ఆహారం అందుబాటులోలేక అలమటిస్తున్నాయి. ముఖ్యంగా ఈ ప్రాంతాల్లోని మహిళలు పిల్లలనుకనే వయస్సులో పౌష్టికాహార లోపం వల్ల బాధ పడుతున్నారు. ప్రతి ముగ్గురిలో ఓ మహిళ పౌష్టికాహార లోపం వల్ల బాధ పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 2005 నుంచి 2014 వరకు వరుసగా ఆహార కొరత తగ్గుతూ రాగా, 2015 నుంచి మళ్లీ కొరత అనూహ్యంగా పెరుగుతూ వస్తోందని, దీనికి వాతావరణ మార్పులే కారణమని ఐక్యరాజ్య సమితి నివేదిక వెల్లడిస్తోంది. ఆహార కొరత కారణంగా ప్రాంతీయ అస్థిరతలు, అలజడి పెరిగి సంఘర్షణలు కూడా జరుగుతాయని హెచ్చరించింది. మధ్య అమెరికాలో కరువు పరిస్థితులు తలెత్తి పంటల దిగుబడి తగ్గడంతో అమెరికా సరిహద్దుల్లో వలసల అలజడి మొదలైందని నివేదిక వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా గత యాభై ఏళ్లుగా భూ వాతావరణం వేడెక్కుతూ వస్తోందని, ముఖ్యంగా 2014, 2015, 2016 సంవత్సరాల్లో భూ వాతావరణం గణనీయంగా వేడెక్కిందని ఐక్యరాజ్య సమితి తెలియజేసింది. ఫలితంగా కొన్ని ప్రాంతాల్లో కరవు పరిస్థితులు ఏర్పడుతుండగా, మరికొన్ని ప్రాంతాల్లో అధిక వర్షాలు పడుతున్నాయని తెలిపింది. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయం ఉండాలని, ఆ విషయమై వ్యవసాయ రంగంలో ఆధునిక పరిశోధనలు పెరగాలని సమితి అభిప్రాయపడింది. వ్యవసాయ రంగంలో పరిశోధనల కోసం ప్రపంచ దేశాలు కేవలం మూడు శాతం ఆర్థిక వనరులను ఖర్చు చేయడం శోచనీయమని సమితి అభిప్రాయపడింది. -
పోషకాహార లేమితో కేన్సర్ ముప్పు!
పోషకాహారం తింటే ఆరోగ్య సమస్యలు దగ్గరకు రావని చాలాకాలంగా తెలుసుగానీ.. మార్కెట్లో దొరికే జంక్ ఫుడ్తో కేన్సర్ వచ్చే అవకాశాలూ పెరిగిపోతాయి అంటున్నారు ఫ్రాన్స్ శాస్త్రవేత్తలు. యూరప్లోని వివిధ దేశాలకు చెందిన దాదాపు ఐదు లక్షల మంది వివరాలను పరిశీలించి మరీ తాము ఈ అంచనాకు వచ్చామని 1992 – 2014 మధ్య జరిగిన ఈ అధ్యయనం తరువాత పరిశీలన జరిపితే దాదాపు 50 వేల మంది వేర్వేరు కేన్సర్ల బారిన పడ్డారని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త మెలీన్ డెశాచ్ చెప్పారు. యూరప్లో ఆహారంలోని పోషక విలువలను సూచించే ఐదు రంగుల సంకేతాలను ఆధారంగా చేసుకుని ఈ అధ్యయనం జరిగింది. తీసుకునే ఆహారాన్ని బట్టి ఒక్కో వ్యక్తికి ఈ అయిదు రంగుల్లో ఒకదాన్ని కేటాయించారు. పోషక విలువలు తక్కువగా ఉన్న ఆహారం తీసుకున్న వారిలోనే కేన్సర్ కేసులు ఎక్కువగా ఉన్నట్లు ఈ అధ్యయనం ద్వారా తెలిసింది. మరీ ముఖ్యంగా పేవు, జీర్ణ వ్యవస్థ పైభాగం లో వచ్చే కేన్సర్ల విషయంలో నిమ్న పోషక విలువలున్న ఆహారం ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమైంది. -
ఢిల్లీలో ముగ్గురు చిన్నారుల ఆకలిచావు
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో ఆకలిచావులు వెలుగుచూశాయి. సరైన ఆహారం అందక ఢిల్లీలో రెండేళ్లు, నాలుగేళ్లు, ఎనిమిదేళ్ల వయస్సున్న ముగ్గురు అక్కాచెల్లెళ్లు ప్రాణాలుకోల్పోయిన ఘటన ఢిల్లీలో చర్చనీయాంశమైంది. ఢిల్లీలోని మండావలి ప్రాంతానికి చెందిన ఓ తల్లి తీవ్రఅనారోగ్యంతో బాధపడుతున్న తన ముగ్గురు కుమార్తెలను మంగళవారం జీటీబీ ఆస్పత్రిలో చేర్పించింది. తీవ్ర పోషకాహారలేమి, ఆకలి కారణంగా చిన్నారులు ముగ్గురూ ఆస్పత్రిలో కన్నుమూశారని పోస్ట్మార్టమ్ ప్రాథమిక నివేదికలో వెల్లడైంది. ఆకలి చావుల ఘటనతో దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఢిల్లీ ప్రభుత్వం మేజిస్ట్రేట్ విచారణకు ఆదేశించినట్లు ఢిల్లీ డెప్యూటీ సీఎం సిసోడియా చెప్పారు. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు చిన్నారులున్న ఇంటిని సోదా చేశారు. నీళ్ల విరేచనాల చికిత్సలోవాడే ఔషధ సీసాలు, మాత్రలు ఇంట్లో దొరికాయి. ఐదు రోజుల క్రితమే చిన్నారుల కుటుంబం ఈ ప్రాంతంలో అద్దెకు దిగిందని స్థానికులు చెప్పారు. చిన్నారుల తండ్రి ఆటో రిక్షా నడిపేవారని, దాన్నిఎవరో దొంగలించడంతో పని కోసం కొద్దిరోజులు వేరేచోటుకు వెళ్లాడని స్థానికులు చెప్పారు. -
బక్కచిక్కుతున్న బాల్యం
సాక్షి, అమరావతి: పౌష్టికాహార లోపం రాష్ట్రాన్ని కలవర పరుస్తోంది. బరువు తక్కువ శిశువులు, ఎదుగుదల లేని(గిడసబారిన) పిల్లల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. సరిపడా పోషక విలువలు అందకపోవడం వల్ల లక్షలాది మంది గర్భిణులు, బాలింతలు, శిశువులు రక్తహీనతతో బాధపడుతున్నారు. రాష్ట్రం మొత్తమ్మీద సగటున 11.33 శాతం మంది శిశువులు సాధారణం కంటే తక్కువ బరువుతో జన్మించినట్లు తేలింది. మరో 36.45 శాతం మంది ఎదుగుదలలేని శిశువులు జన్మించారు. మొత్తం మీద తక్కువ బరువు, ఎదుగుదల లేకుండా పుడుతున్న చిన్నారుల సంఖ్య 47.81 శాతంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం జరిగిన కలెక్టర్ల సదస్సులో వెల్లడైన ఈ గణాంకాలు చర్చకు దారితీశాయి. కర్నూలు, విజయనగరం, విశాఖ, చిత్తూరు, వైఎస్సార్, అనంతపురం, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి జిల్లాల్లో తక్కువ బరువు గల శిశువులు ఎక్కువగా జన్మిస్తున్నట్లు వెల్లడైంది. పౌష్టికాహార లోపాన్ని చక్కదిద్దకపోతే ఇలాంటి శిశువులు పుడుతూనే ఉంటారని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పిల్లల్లో శారీరకంగా, మానసికంగా ఎదుగుదల ఉండదని.. ఇది సమాజానికి తీవ్ర నష్టదాయకమన్నారు. ఇప్పటికీ సుమారు సగం మంది శిశువులు ఇలా ఎదుగుదల లేకుండా పుట్టడం ఆందోళనకరమన్నారు. గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల్లోనే పౌష్టికాహార లోపం ఎక్కువగా ఉన్నందున.. ఆయా ప్రాంతాల్లో పోషక విలువలున్న కొర్రలు, సజ్జలు, రాగులు పంపిణీ చేసే విషయాన్ని పరిశీలించాలని అధికారులు నిర్ణయించారు. వేరుశనగ పప్పు ఉండలు, కొర్రపాయసం, రాగి జావ లాంటివి పంపిణీ చేయాలని కొందరు సూచించారు. -
కంట్లో చీకట్లు
సాక్షి, హైదరాబాద్: సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు పెద్దలు.. అయితే ముఖ్యమైన ఆ కన్నే ప్రమాదంలో పడిందిప్పుడు. మారుతున్న జీవనశైలి, పౌష్టికాహార లోపం తదితర కారణాల వల్ల కంటిచూపు సమస్యలు పెరుగుతున్నాయి. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ గణాంకాల ప్రకారం రాష్ట్రంలోని 25 శాతం మంది కంటి చూపు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. పెద్ద వయస్సు వారికి శుక్లాలు (పొర), చిన్న పిల్లలకు పోషకాహార లోపం వల్ల దృష్టి లోపాలు వస్తున్నాయి. శుక్లాల కారణంగానే 43 శాతం మంది కంటిచూపు కోల్పోతున్నారని నిపుణు లు నిర్ధారించారు. మధుమేహం కారణంగా కంటిచూపు సమస్యల(డయాబెటిక్ రెటినోపతి)తో బాధపడుతున్నవారూ పెరుగుతున్నా రు. రాష్ట్రంలోని 7 శాతం జనాభా డయాబెటిక్ రెటినోపతి సమస్యతో బాధపడుతున్నారు. వీరు కాకుండా మరో 7 శాతం మంది చూపు కోల్పోయేందుకు కారణమయ్యే నీటి కాసులు(గ్లకోమా) సమస్యతో బాధపడుతున్నారు. 40 ఏళ్లు దాటిన వారిలో గ్లకోమా లక్షణాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. దీంతో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అంధత్వ నివారణపై ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. అన్ని రకాల దృష్టి లోపాలను గుర్తించేందుకు ప్రత్యేక సర్వేను చేపట్టింది. 550 గ్రామాలను ఎంపిక చేసి 2017 అక్టోబర్లో సర్వే మొదలుపెట్టింది. ఇటీవల వివరాలను నమోదు చేసింది. గ్రామీ ణ ప్రాంతాల్లోని ప్రతి వంద మందిలో ఇద్దరు కంటి చూపు సమస్యలతో బాధపడుతుండగా పట్టణాల్లో వంద మందిలో ఒకరు ఈ ఇబ్బం ది ఎదుర్కొంటున్నారు. ఎక్కువగా శుక్లాల సమస్యతోనే కంటిచూపు కోల్పోతున్నారు. రాష్ట్రంలో 3.21 లక్షల శుక్లాల చికిత్సలు నిర్వహించారు. నేత్రదానంతో 5,126 మంది కంటిచూపును పొందారు. పోషకాహారం తీసుకోకపోవడం వల్లే.. మహిళలు గర్భంతో ఉన్నప్పుడు పోషకాహా రం తీసుకోకపోవడం వల్ల పిల్లలు పుట్టుకతోనే కంటిచూపు సమస్యల బారిన పడుతున్నారు. చిన్న వయస్సులోనే కంటిచూపు సమస్యలతో బాధపడుతున్నవారు 7 శాతం మంది ఉంటున్నారు. నెలలు నిండకుండానే పుట్టిన వారిలో రెటినోపతి ఆఫ్ ప్రిమెచ్యూరిటీ సమస్య వస్తోంది. దీన్ని నిర్లక్ష్యం చేస్తే శాశ్వతంగా చూపు పోయే ప్రమాదం ఉంది. మన రాష్ట్రంలోని పిల్లల్లో కంటి చూపు సమస్య బాధితులు పెరుగుతున్నారు. 2014–15లో 5,44,469 మంది విద్యార్థుల్లో 24,947 మందికి కంటి చూపు సమస్యలున్నాయి. 2015– 16లో 6,53,156 మందిని పరీక్షించగా... 40,264 మంది బాధితులున్నారు. 2016– 17లో 6,10,234 మంది లో 40,367 మంది విద్యార్థులకు చూపు సమస్యలున్నాయి. ప్రస్తుత విద్యా సంవత్సరంలో పరీక్షల ఫలితాలు రావాల్సి ఉంది. చికిత్స ఏర్పాట్లు... కంటి చూపు సమస్యల నివారణపై ఆరోగ్య, కుటుంబ సంక్షేమ ప్రత్యేక కార్యాచరణ మొదలుపెడుతోంది. మూడేళ్లలో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లోని ప్రజలకు పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్యం అందించేలా ఏర్పాట్లు చేస్తోంది. స్వచ్ఛంద సంస్థల సహకారంతో ‘అంధత్వ రహిత తెలంగాణ(అవైడబుల్ బ్లైండ్నెస్ ఫ్రీ తెలంగాణ–ఏబీఎఫ్టీ)’పేరుతో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనుంది. నేత్ర వైద్య నిపుణులు, ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు దీంట్లో భాగస్వాములు అవుతున్నాయి. ఇందుకోసం మొదటి దశలో 2017–18లో 10 జిల్లాలను ఎంపిక చేసింది. వచ్చే ఏడాది 10 జిల్లాల్లో, మరో ఏడాది ఇంకో 10 జిల్లాల్లో ఇదే తరహా కార్యక్రమాలను నిర్వహించనుంది. రాష్ట్రంలో 2019 నాటికి కంటిచూపు సమస్యలు లేకుండా చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నాం. స్వచ్ఛంద సంస్థల సహకారంతో కంటి శుక్లాల శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నాం. కొన్ని గ్రామాలను ఎంపిక చేసి పూర్తి స్థాయిలో వైద్యం అందించే ఏర్పాట్లు చేస్తున్నాం. – డాక్టర్ మోతీలాల్, జాయింట్ డైరెక్టర్, జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమం శుక్లాల సమస్యతోనే ఎక్కువ మందికి కంటి చూపు సమస్యలు వస్తున్నాయి. కాలుష్యం సైతం కంటి సమస్యలకు కారణమవుతోంది. పోషకాహార లోపంతో చిన్న వయస్సులోనే కంటి చూపు సమస్యలు వస్తుంటాయి. మధుమేహం ఉన్నట్లు తేలితే వెంటనే కంటి పరీక్షలు చేయించుకోవాలి. – డాక్టర్ రవీందర్గౌడ్, సూపరింటెండెంట్, సరోజినిదేవి కంటి ఆస్పత్రి -
శిశువులు, తల్లులకు ఆసరా!
సాక్షి, హైదరాబాద్: నవజాత శిశువులు, తల్లుల పౌష్టికాహార అవసరాల పర్యవేక్షణకు డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించనున్నట్లు కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి రాజేశ్కుమార్ తెలిపారు. గర్భస్థ మహిళలకు పోషకాహారం అందడం మొదలు నవజాత శిశువులకు సకాలంలో టీకాలు వేయడం.. వారిలోని విటమిన్, పోషకాల లోపాలు, వాటిని సరిచేసేందుకు తీసుకుంటున్న చర్యలు తదితరాలతో రూపొందించిన సాఫ్ట్వేర్ను జనవరి 1 నుంచి దేశంలో ని 315 జిల్లాల్లో అమల్లోకి తేనున్నట్లు పేర్కొన్నారు. ఈ సాఫ్ట్వేర్ సాయంతో ఢిల్లీలోని ప్రధాని కార్యాలయం నుంచే గ్రామాల్లోని బిడ్డలు, తల్లుల ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనించవచ్చన్నారు. జాతీయ పౌష్టికాహార సంస్థ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం అంతర్జాతీయ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా రాజేశ్కుమార్ మాట్లాడుతూ.. 2030 నాటికి అగ్రరాజ్యంగా ఎదగాలన్న దేశ ఆకాంక్షలకు నవజాత శిశువుల ఆరోగ్యం కీలకమని స్పష్టం చేశారు. ఐదేళ్లలోపు పిల్లల్లో 38 శాతం మంది ఇప్పటికే పూర్తిస్థాయిలో ఎదగలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారానికి జాతీయ పౌష్టికాహార సంస్థ సహకారంతో కేంద్రం యత్నాలు చేస్తోందన్నారు. సగటు ఐక్యూ 82 పాయింట్లే.. పోషకాహార లోపం వల్ల భారతీయ బాలల సగటు మేధో శక్తి (ఐక్యూ) 82 పాయింట్ల స్థాయిలోనే ఉందని.. గర్భిణులు తొలి త్రైమాసికంలో తగినంత ఫోలిక్ యాసిడ్, ఐరన్లను తీసుకుంటే ఈ సమస్యను అధిగమించి సగటు మేధోశక్తిని 8–12 పాయింట్ల వరకూ పెంచవచ్చని చెప్పారు. -
జీవనశైలి వ్యాధులే టాప్ కిల్లర్స్
సాక్షి,న్యూఢిల్లీ:దేశవ్యాప్తంగా టీబీ, డయేరియా వంటి వ్యాధుల కన్నా గుండె, శ్వాస సంబంధిత వ్యాధులతోనే ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయని తాజా నివేదిక వెల్లడించింది. అత్యంత వెనుకబడిన రాష్ర్టాల్లోనూ జీవనశైలి వ్యాధులు విస్తృతమయ్యాయని పేర్కొంది. 1990ల వరకూ అంటు,సీజనల్ వ్యాధుల కారణంగా అధిక మరణాలు నెలకొంటే తాజాగా జీవనశైలి వ్యాధులే జనజీవితాన్ని అతలాకుతలం చేస్తున్నాయని స్టేట్ లెవెల్ డిసీజ్ బర్డెన్ ఇనీషియేటివ్ పేరిట వెల్లడైన నివేదిక పేర్కొంది. దేశం అభివృద్ధి బాట పట్టినా పౌష్టికాహార లేమి ఇప్పటికీ అనారోగ్య కారణాల్లో ముందువరసలో ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇక 2016లో చోటుచేసుకున్న మరణాల్లో అంటు సీజనల్ వ్యాధుల కారణంగా మృత్యువాత పడిన వారి సంఖ్య 26 శాతం కాగా, జీవనశైలి వ్యాధుల మరణాలు 60 శాతం పైగా ఉన్నాయి.గాయాలబారిన పడి మరణించిన వారి సంఖ్య 11 శాతంగా నమోదైంది. ఈశాన్య రాష్ట్రాల వారిలో జీవనశైలి వ్యాధులు ఎక్కువగా ఉండటం గమనార్హం. ఇక దేశవ్యాప్త మరణాల్లో 28 శాతం గుండె సంబంధిత వ్యాధులు కారణం కాగా, డయేరియా, ఇన్ఫెక్షన్లతో 15.5 శాతం, శ్వాసకోశ సమస్యలతో 11 శాతం, గాయాలతో 10.7 శాతం, క్యాన్సర్తో 8.3 శాతం మృత్యువాతన పడుతున్నారు. పక్షవాతం, మధుమేహం, కిడ్నీ వ్యాధులతో కూడా పెద్దసంఖ్యలో మరణాలు చోటుచేసుకుంటున్నాయని నివేదిక తెలిపింది. భారతీయ వైద్య పరిశోధన మండలి, భారత ప్రజారోగ్య ఫౌండేషన్ సంయుక్తంగా ఈ నివేదికను వెల్లడించాయి. -
బాలల చెంతకు అమృతం
♦ పోషకాహారలోపంఅధిగమించే ప్రయత్నం ♦ నేటి నుంచి జిల్లాలో బాలామృతం పంపిణీకి శ్రీకారం పేద కుటుంబాలకు చెందిన చిన్నారులు పోషకాహార లోపంతో సతమతమవుతున్నారు... దీంతో పలువురు వ్యాధుల బారిన పడుతున్నారు... ఈ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది... పట్టణాల్లో మురికి వాడలతోపాటు గ్రామీణ ప్రాంత బాలబాలికల్లో శారీరక, మానసిక అభివృద్దికి అనుబంధ పోషకాహారంగా బాలమృతం పథకాన్ని ప్రవేశపెడుతున్నారు... నేటి నుంచి అంగన్వాడీ కేంద్రాల ద్వారా పంపిణీ చేసేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ సన్నద్ధమవుతోంది. కడప కోటిరెడ్డిసర్కిల్ : ఉమ్మడి రాష్ట్రం విడిపోకముందే ఖనిజ లవణాలతో కూడిన బలమైన పోషకాహార పదార్థాల మిశ్రమాన్ని బాలామృతం పేరుతో పంపిణీ చేసేవారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత ఈ పథకం నిలిచిపోవడంతో పంపిణీ ఆగిపోయింది. మూడేళ్లుగా దీనికి ప్రత్యామ్నాయంగా పలు రకాలైన పోషకాహారాన్ని అదనంగా అందించారు. తొలుత కుర్కురేలు, శనగలు ఇచ్చారు. ఎక్కువగా వస్తున్న శారీరక లోపాలను అరికట్టేందుకు ఆహార పదార్థాలను కూడా అందించారు. ఒక్కొక్క చిన్నారికి మూడు కిలోల బియ్యం, 500 గ్రాముల కందిపప్పు, 450 గ్రాముల వంటనూనె ఇంటికి అందించేవారు. ఇప్పుడు దీని స్థానంలో ప్రవేశ పెడుతున్న బాలామృతంతో టీహెచ్ఆర్ను రద్దు చేయనున్నా రు. జిల్లాలో 3621 అంగన్వాడీ కేంద్రాల్లో 203 281 మంది బాలబాలికలకు లబ్ధి చేకూర్చేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ సన్నద్ధమవుతోంది. ఇది ఎంతో ప్రయోజనం ఏడు నెలల నుంచి మూడేళ్ల వయసున్న బాలబాలికలకు బాలామృతం ద్వారా లబ్ధి చేకూరనుంది. బాలామృతం పథకాన్ని తొమ్మిది రకాల పోషక పదార్థాలతో రూపొందించారు. క్యాల్షియం, ఐరన్, విటమిన్–ఎ, బీ1, బీ2, సి, పోలిక్ యాసిడ్, నియాసిన్ ఖనిజ లవణాలు ఉన్నాయి. వేయించిన శనగ పప్పు, గోధుమపిండి, రీఫైండ్ ఆయిల్, పంచదార, స్కిమ్డ్ మిల్క్ పౌడర్తో కలిపి రుచికరంగా తయారు చేశారు. ఒక్కొక్కరికి 100 గ్రాముల చొప్పున అందిస్తారు. అయితే నెలలో 25 రోజులు మాత్రమే ఐసీడీఎస్ ద్వారా సరఫరా చేస్తారు. ఏడు నెలల నుంచి ఏడాది వరకు పాలలో కలిపి తాపించాలి. ఏడాది నుంచి మూడేళ్ల వరకు పాలు లేదా వేడి నీళ్లలో ముద్దగా చేసి తినిపించాలి. ఐదేళ్లలోపు వయసున్న చిన్నారుల ఎదుగుదలకు ఇదెంతో కీలకంగా ఉపయోగ పడుతుందని ఐసీడీఎస్ సిబ్బంది పేర్కొంటున్నారు. -
ఈ బియ్యం.. అమృతతుల్యం
పోషకాల మిశ్రమంతో బియ్యం ⇒ అందుబాటులోకి తీసుకురావాలని డబ్ల్యూహెచ్వో సూచన ⇒ విటమిన్ల లోపంతో బాధపడే వారికోసం ఏర్పాట్లు ⇒ తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ అధికారుల దృష్టి ⇒ రాష్ట్రంలో 60 శాతం పిల్లల్లో ఐరన్ లోపమున్నట్లు అంచనా సాక్షి, హైదరాబాద్: రక్తహీనత, డయేరియా, గుండె జబ్బులు, షుగర్ తదితర అనారోగ్య సమస్యలకు కారణమయ్యే ఐరన్, విటమిన్లు, లవణాల లోపాన్ని నివారించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) నడుం బిగించింది. పోషకాలు, లవణాలు, విటమిన్లు కలిగిన బియ్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆయా దేశాలకు సూచించింది. ఈ నేపథ్యంలో దీనిపై రాష్ట్ర ప్రభుత్వమూ దృష్టి సారించింది. ఇటువంటి బియ్యాన్ని తయారుచేసి ప్రజా పంపిణీ వ్యవస్థ(పీడీఎస్) ద్వారా ప్రజలకు అందజేస్తే ఎలా ఉంటుందన్న దానిపై జాతీయ పోషకాహార సంస్థతో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. 60 శాతం చిన్నారుల్లో రక్తహీనత... దేశంలో అత్యధికమంది బియ్యంతో తయారైన ఆహారాన్నే తీసుకుంటారు. దక్షిణ భారతంలో ఇదే ప్రధాన ఆహారం. అయితే బియ్యంలో అవసరమైన పోషకాలు, విటమిన్లు, ఐరన్ వంటివి ఉండటంలేదు. దీంతో బియ్యాన్ని ప్రధాన ఆహారంగా తీసుకునేవారు పోషకాల లోపంతో అనేక రోగాలకు గురవుతున్నారు. 2015–16 జాతీయ ఆరోగ్య సర్వే లెక్కల ప్రకారం తెలంగాణలో 6 నుంచి 59 నెలల పిల్లల్లో 60.7 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. 15–49 ఏళ్ల మహిళల్లో 56.9 శాతం మంది, అదే వయస్సు గల గర్భిణీల్లో 49.8 శాతం మంది, అదే వయస్సులోని 15.4 శాతం మంది పురుషులు రక్తహీనతతో బాధపడుతున్నారు. వీరంతా ఐరన్ లోపం కారణంగా రక్తహీనతకు గురవుతున్నారు. దాదాపు 25 శాతం మంది పోషకాహార లోపంతో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. సరైన పోషకాలు లేకపోవడంతో అనేకమంది రక్తహీనత, డయేరియా, అధిక బరువు, ఎముకల జబ్బులు, గుండె సంబంధిత వ్యాధులతో అనారోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నారు. ఈ పరిస్థితి ప్రధానంగా పేదల్లో ఉండటం గమనార్హం. పోషకాలతో బియ్యాన్ని ఎలా తయారుచేస్తారంటే..? బియ్యంతో తయారైన అన్నం బదులు ఇతరత్రా ఆహార పదార్థాలను తినడానికి చాలా మంది ఇష్టపడరు. ఈ నేపథ్యంలో సూక్ష్మ పోషకాల మిశ్రమంతో బియ్యాన్ని తయారు చేయాలనేది డబ్ల్యూహెచ్వో సూచన. నిర్ణీత నిష్పత్తిలో ఐరన్, అయోడిన్, జింక్, ఫోలిక్ యాసిడ్, బీ1, బీ2, బీ6, బీ12, నియాసిన్ వంటి నీటిలో కరిగే విటమిన్లు సహా ఏ, డీ వంటి కొవ్వులో కరిగే విటమిన్లతో సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని తయారు చేస్తారు. అలాగే బియ్యాన్ని దంచి, అందులో ఈ పోషకాల మిశ్రమాన్ని కలుపుతారు. ఈ మిశ్రమాన్ని ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానంతో వండడానికి అనువు గా తిరిగి బియ్యంగా తయారుచేస్తారు. ఈ బియ్యంలో అన్ని రకాల పోషకాలు, విటమిన్లు ఉంటాయి. ఈ బియ్యంతో పోషక లోపం నివారించవచ్చు ‘పోషకాహార బియ్యాన్ని ప్రజలకు అందజేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే ఆయా దేశాలకు సూచించింది. ముఖ్యంగా విటమిన్లు, ఐరన్ వంటి లోపంతో బాధపడే పిల్లలు, పెద్దలకు ఇవి అందజేయాలి. దీనిపై జాతీయ పోషకాహార సంస్థ కూడా దృష్టిసారించింది. వీటిని ప్రజా పంపిణీ వ్యవస్థ, అంగన్వాడీ కేంద్రాల ద్వారా పేదలకు అందజేస్తే పోషకాహార లోపాన్ని సరిదిద్దవచ్చు.’ –డాక్టర్ గంగాధర్, నెఫ్రాలజిస్ట్, నిమ్స్ -
బక్కచిక్కిన బాల్యం
- ఆందోళన కలిగిస్తున్న పౌష్టికాహార లోపం - తక్కువ బరువుతో జన్మిస్తున్న 19% పిల్లలు - ఐదేళ్లలోపు చిన్నారుల్లో 22% పౌష్టిక సమస్య - 71% పిల్లల్లో రక్తహీనత లక్షణాలు సాక్షి, హైదరాబాద్: భావిపౌరుల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తోంది. పౌష్టికాహార లోపం వారి భవిష్యత్తును ప్రమా దంలో పడేస్తోంది. జనన సమయంతోనే మొదలవుతోన్న ఈ సమస్య.. వారిపై పలు విధాలుగా ప్రభావాన్ని చూపు తోంది. రాష్ట్రంలో సగటున 19% పిల్లలు తక్కువ బరువుతో జన్మిస్తుండగా... 22% చిన్నారులు పౌష్టికాహార సమస్యతో సతమతమవుతున్నారు. ఈ నెల తొలి వారంలో మహిళాభి వృద్ధి, శిశు సంక్షేమ శాఖతో పాటు వైద్య, ఆరోగ్య శాఖలు సంయుక్తంగా నిర్వహించిన పౌష్టికాహార సర్వేలో ఈ వాస్తవాలు వెలుగు చూశాయి. రాష్ట్రంలో 37,500 అంగన్ వాడీ కేంద్రాలున్నాయి. వీటి పరిధిలో 3,15,886 మంది పిల్లలు నమోదు కాగా... క్రమం తప్పకుండా కేంద్రాలకు వస్తున్న పిల్లలు సగం మందే. ఈ నెల 1 నుంచి 5వ తేదీ వరకు అంగ న్వాడీ కేంద్రాలకు వచ్చిన పిల్లల ఆరోగ్య స్థితిని పరిశీలిం చారు. ఇందులో భాగంగా ఎత్తు, బరువు తదితర పరీక్షలు నిర్వహించారు. మొత్తంగా 5 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న 1,66,229 పిల్లలకు ఈ పరీక్షలు చేశారు. వీరిలో 85,007 మంది బాలురు, 81,222 మంది బాలికలున్నారు. ప్రమాదంలో 31.42% చిన్నారులు శిశు సంక్షేమ శాఖ నిర్వహించిన పరిశీలనలో ప్రాథమిక గణాంకాల ప్రకారం 31.42% చిన్నారుల ఆరోగ్య స్థితి ప్రమాదకరంగా ఉంది. వీరిలో ఎక్కువ శాతం ఎత్తుకు తగిన బరువు లేకపోవడం గమనార్హం. 10.79% చిన్నారులు సగటు బరువు కన్నా అతి తక్కువగా ఉన్నారు. 1,66,229 మంది పిల్లలను పరిశీలించగా వీరిలో 45,278 మంది చిన్నారుల్లో తీవ్ర పౌష్టికాహార లోపం ఉండగా.. ఇందులో 17,944 మంది పిల్లల పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా ఉన్నట్లు తేలింది. పౌష్టికాహార లోపానికి గురవుతున్న పిల్లలకు సంబంధించి ఎక్కువ భాగం తల్లుల ఆహారపు అలవాట్లే ప్రభావం చూపుతున్నాయి. అన్ని సమయాల్లో ఒకే ఆహారమా..! గ్రామీణ మహిళల్లో ఆహారపు అలవాట్లు గందరగోళంగా ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. గ్రామీణ ప్రాంతంతో పాటు పట్టణ ప్రాంత పేద మహిళలు గర్భిణి దశకు ముందు తీసుకునే ఆహారాన్నే గర్భస్థ సమయంలో, పిల్లలకు పాలిచ్చే సమయంలోనూ తీసుకుంటున్నారు. సాధారణ సమయాల్లో కంటే గర్భిణిగా ఉండేటప్పుడు మహిళలకు ఎక్కువ పోషకాలు అవసరం. అదేవిధంగా పాలిచ్చే తల్లులు సైతం ఎక్కువ మోతాదులో ఆహారాన్ని తీసుకోవాలి. కానీ పేద మహిళలు అలా తీసుకోకపోవడంతో వారి తర్వాత తరం పిల్లలు బలహీనంగా పెరుగుతున్నారు. వంద మంది చిన్నారుల్లో 71 శాతం మందిలో రక్తహీనత లక్షణాలు బయటపడటం గమనార్హం. -
అమ్మా... చెప్పు... వింటున్నా!
పిల్లలు బోర్లా పడడం, పాకడం, కూర్చోవడం,లేచి నిలబడడం, నడవడం... ఏడాదిలోపు జరిగిపోతాయి.మరి... మాట్లాడేదెప్పుడు? ఏడాది నిండేలోపుమాటలు వస్తే ఆ ప్రశ్నే తలెత్తదు.కానీ... మాట్లాడడం ఆలస్యమైతే?మాటలు వంశ సాలును బట్టి వస్తాయని...మూడేళ్లకు మాట్లాడతారని సరిపెట్టుకుంటారు.పిల్లల మాట్లాడడం ఆలస్యమైనా పర్లేదు కానీ...మన మాటలను వినడంలో అలక్ష్యం కనిపిస్తే?!? వేచి చూద్దాం అని చాచివేత ధోరణితో ఉంటే ప్రమాదమే!మనం మాట్లాడింది వినలేకపోతున్నారంటే...దానిని తిరిగి ఉచ్ఛరించడమూ జరగదు.అందుకే... పిల్లలు పుట్టగానే వింటున్నారాలేదా అని చూడాలి... వినలేదనిపిస్తే వెంటనే వినిపించేప్రయత్నం చేయాలి!! మనదేశంలో ప్రతి వెయ్యి మందిలో నలుగురు వినికిడి లోపంతో పుడుతున్నారు. పుట్టినప్పటికీ బాగానే ఉన్నప్పటికీ జీవనశైలి, పోషకాహార లోపం వంటి ఇతర కారణాల వల్ల నలభై దాటేటప్పటికి చెవి సమస్యలకు గురయ్యే వారి సంఖ్య గణనీయంగా ఉంటోంది. గడచిన కాలంలో ఎక్కువమంది పోషకాహారలోపంతో వార్ధక్యంలో వినికిడి సమస్యలకు గురయ్యేవారు. ఇటీవల పెరుగుతున్న కేసుల్లో మారిన జీవనశైలి ప్రధానకారణంగా కనిపిస్తోంది. మేనరికపు వివాహాల ద్వారా పుట్టిన పిల్లల్లో కూడా వినికిడి లోపాలు కనిపిస్తున్నాయి. కాక్లియాలో ఉండే హెయిర్సెల్స్ తక్కువగా ఉండడం, ఒకవేళ తగినన్ని ఉన్నప్పటికీ అవి సరిగ్గా పనిచేయకపోవడం వలన వినికిడి లోపం కలుగుతుంది. ఇన్ఫెక్షన్ వంటి సాధారణ కారణాలతో వచ్చే లోపాలను మందుల వాడకం, చిన్న ఆపరేషన్తో సరిచేయవచ్చు. పుట్టుకతోనే చెవి నిర్మాణం లోపం ఉన్నవారికి, తీవ్రమైన వినికిడి సమస్యలకు, వినికిడి మెషీన్తో ఫలితం లేని వారికి, కాక్లియర్ ఇంప్లాంట్ మాత్రమే ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయం. పిల్లల్లో వినికిడి లోపాన్ని త్వరగా గుర్తించడం ఎంత అవసరమో, వెంటనే వైద్యం చేయడమూ అంతే ముఖ్యం. ఎందుకంటే... పిల్లల మెదడు వికాసం మొదటి మూడేళ్లలో ఎక్కువగా ఉంటుంది. ఆ వయసులోనే అన్ని రకాల శబ్దాలనూ వినాలి, వాటిని అర్థం చేసుకోవాలి. మాటలను తిరిగి పలకడానికి ప్రయత్నించాలి. అందుకే పుట్టిన వెంటనే వినికిడి పరీక్ష చేయడం, లోపం ఉంటే సరిదిద్దుకోవడం రెండూ చాలా కీలకం. ఇటీవల జీవనశైలిలో మార్పుల వల్ల పెద్దల్లోనూ వినికిడి సమస్యలు ఏర్పడుతున్నాయి. ఇలా పెద్దలకు వచ్చే వినికిడి సమస్యలకూ కాక్లియర్ సర్జరీ ఒక మంచి పరిష్కారం. కాక్లియర్ శస్త్ర చికిత్స! ఈఎన్టి నిపుణులు, ఆడియాలజిస్ట్ల సూచనమేరకు ఆటోస్కోపీ, ఆడియాలజీ పరీక్షలు, సైకలాజికల్ అసెస్మెంట్, స్పీచ్ అసెస్మెంట్, సిటిస్కాన్, ఎంఆర్ఐ పరీక్షలు చేయాలి. అలాగే సర్జికల్ ప్రొఫైల్ పరిశీలించాలి. అవసరాన్ని బట్టి కంటి వైద్యులు, చిన్నపిల్లల వైద్యులను కూడా సంప్రదించాల్సి ఉంటుంది. రేడియాలజిస్ట్, ఆనస్తిస్ట్లతో కూడిన బృందం సేవలు అవసరమవుతాయి. ఈ పరీక్షలు, అధ్యయనాల తర్వాత పేషెంటుకి కాక్లియర్ సర్జరీ చేయవచ్చా లేదా అనే నిర్ధారణకు రావడం జరుగుతుంది. సాధారణంగా వీటి అవసరం ఎవరెవరికి ఉంటుందంటే... n వినికిడి సమస్య రెండుచెవులలో 70–80 శాతం ఉన్నవారికి n వినికిడి మెషీన్ ద్వారా ఉపయోగం లేని వారికి n కాక్లియ, కాక్లియర్ నరం అభివృద్ధి చెందని వారికి n ఆడిటరీ న్యూరోపతి స్పెక్ట్రమ్ డిజార్డర్ ఉన్న వారికి సర్జరీ తర్వాత! సర్జరీ చేసి కాక్లియర్ ఇంప్లాంట్ను అమర్చిన తర్వాత మూడు వారాలకు బయటి మెషీన్ను ఆన్ చేస్తారు. అప్పటి నుంచి అన్ని శబ్దాలూ చక్కగా వినిపిస్తాయి. పిల్లలకు అప్పటి వరకు భాష, మాటలను విన్న అనుభవం ఉండదు కాబట్టి ప్రతి శబ్దానికి ఆశ్చర్యంగా స్పందిస్తుంటారు. వారు అప్పుడే పుట్టిన బిడ్డతో సమానం అన్నమాట. వారికి ఆడిటరీ వెర్బల్ థెరపీ, మెషీన్ ప్రోగ్రామింగ్లో శిక్షణ ఇవ్వాలి. ఇంటి దగ్గర సాధన చేయడం ద్వారా విన్న మాటలను అర్థం చేసుకోవడం, ఉచ్ఛరించడం నేర్చుకుంటారు. మాటకు ప్రతిస్పందించడమూ నేర్చుకుంటారు. ఈ దశలో తల్లిదండ్రుల పాత్ర చాలా కీలకం. ఎంత ఎక్కువగా సాధన చేస్తే అంత త్వరగా మామూలు పిల్లలతో సమానమవుతారు. వినికిడి వ్యవస్థ – చెవి నిర్మాణం! బయటి చెవి, మధ్య చెవి, లోపలి చెవి, వినికిడి నరం, ఆడిటరీ కార్టెక్స్ అనేవి ముఖ్యమైన భాగాలు. పిన్నా, చెవి రంధ్రం బయటకు కనిపిస్తాయి. వాటి లోపల కర్ణభేరి ఉంటుంది. అది కూడా బయటిచెవిలో భాగమే. మధ్య చెవి భాగాలు ఎముకల గొలుసు (ఆసిక్యూలార్చైన్) లోపలి చెవి భాగాలు కాక్లియ, వెస్టిబ్యూలార్ సిస్టమ్ ఉంటాయి. తర్వాత వినికిడి నరం, ఆడిటరీ కార్టెక్స్ వంటి క్లిష్టమైన భాగాలుంటాయి. ఇలా వింటాం! శబ్దతరంగాలు పిన్నాను తాకి, చెవిరంధ్రం ద్వారా కర్ణబేరికి ప్రకంపనలను చేరవేస్తాయి. ఆ ప్రకంపనలకు ఆసిక్యూలార్ చైన్ కదిలి కాక్లియాను స్పందింపచేస్తుంది. కాక్లియాలో ఉండే హెయిర్ సెల్స్ ఎలక్ట్రిక్ ఇంపల్షన్ను సృష్టించి వాటికి అనుసంధానమై ఉన్న ఆడిటరీ నర్వ్ ఫైబర్ను స్పందింపచేస్తాయి. ఆ తర్వాత ఆడిటరీ నర్వ్ ద్వారా శబ్దం మెదడులోని ఆడిటరీ కార్టెక్స్కు చేరుతుంది. వినికిడి లోపాలెన్నెన్నో! చెవి నిర్మాణాన్ని విభజించినట్లే వినికిడి లోపాలను కూడా వర్గీకరిస్తారు. బయటిచెవి, మధ్య చెవి లోపాలను కండక్టివ్ హియరింగ్ లాస్, లోపలిచెవి లోపాలను సెన్సరీన్యూరల్ హియరింగ్ లాస్, వినికిడి నరం, ఆ తరవాత భాగాల లోపాలతో వచ్చే వినికిడి సమస్యను ఆడిటరీ ప్రాసెసింగ్ డిజార్డర్ అంటారు. నిర్ధారణ! ప్రస్తుతం పుట్టిన వెంటనే శిశువులో వినికిడి వ్యవస్థ పనితీరు ఎలా ఉందోనని పరీక్షించే పరికరాలున్నాయి. ఈ పరీక్షను నియోనేటల్ హియరింగ్ స్క్రీనింగ్ అంటారు. మనదేశంలో కొన్ని హాస్పిటళ్లలో మాత్రమే ఓటో అకాస్టిక్ ఎమిషన్స్ పరికరాలు అందుబాటులో ఉన్నాయి. n ఓటో అకాస్టిక్ ఏమిషన్స్ పరీక్షలో ఫెయిలైన పిల్లలకు ఆడిటరీ ఎవోక్డ్ పొటెన్షియల్స్, ఇంపీడెన్స్ ఆడియోమెట్రీ వంటి పరీక్షలు చేయాల్సి ఉంటుంది. కాక్లియర్ ఇంప్లాంట్ పనితీరిలా! కాక్లియర్ ఇంప్లాంట్లో రెండు భాగాలుంటాయి. ఒకటి శస్త్ర చికిత్స చేసి చెవి లోపల అమర్చే సాధనం. మరొకటి చెవి బయట అమర్చే సౌండ్ ప్రాసెసర్. దీనిని స్పీచ్ ప్రాసెసర్ అని కూడా అంటారు. ఇందులో ఉండే మైక్రోఫోన్ శబ్దాలను గ్రహించి ప్రాసెసర్లోకి పంపిస్తుంది. ఆ శబ్దం ప్రాసెసర్ ద్వారా ప్రయాణించి కాయిల్ ద్వారా శబ్దతరంగాలుగా మారి లోపల ఉండే ఇంప్లాంట్లోని రిసీవర్కు చేరుతుంది. కాక్లియలో అమర్చిన ఎలక్ట్రోడ్ అరే లోని ఎలక్ట్రోడ్కు చేరిన శబ్దం ఫైబర్స్ను స్పందింపచేస్తుంది. దాంతో శబ్దాన్ని కచ్చితంగా వినగలుగుతారు. డాక్టర్ ఇ.సి. వినయకుమార్ హెచ్ఓడి – ఈఎన్టి సర్జన్, అపోలో హాస్పిటల్స్ జూబ్లీ హిల్స్, హైదరాబాద్ -
దువ్వెన తీయవచ్చు
హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎండలో తిరిగి తిరిగి అలసట... ముఖం కడిగి సేదదీరచ్చు. పనిలో పనిగా జేబులో నుంచి దువ్వెన తీసి తల దువ్వుకోనూ వచ్చు. కానీ... దువ్వెన తీయాలంటే బెరుకు. తల దువ్వుకోవాలంటే జుట్టు ఎక్కడో వెతుక్కోవాల్సి వస్తోంది. ఎవరైనా చూస్తారేమోననే బెంగ. అటూ ఇటూ చూసి మాడు నిమురుకుంటూ తలదువ్వుకోవాలి ప్రపంచానికి విశాలంగా కనిపిస్తున్న ముఖం అద్దంలో మాత్రం చిన్నబోయి కనిపిస్తుంది. ఎక్సర్సైజ్ దేహాన్ని ఫిట్గా ఉంచి యూత్ ఫీల్నిస్తుంది. అయినా... జుట్టే వెవ్వెవ్వె అని వెక్కిరించి పరుగెడుతోంది. బోసిపోయిన తలకు యంగ్ లుక్ ఎలాగ?! జుట్టు ఎందుకు రాలుతుందంటే..! జుట్టు రాలడానికి ఒకటి – రెండు కాదు, అనేక కారణాలుంటాయి. పోషకాహార లోపం, అస్వస్థత ఎక్కువ రోజులు ఉన్నప్పుడు, క్యాన్సర్ చికిత్సలో భాగంగా కీమోథెరపీ చేసినప్పుడు జుట్టు రాలిపోతుంది. అస్వస్థత కారణంగా దేహంలో నిల్వ ఉన్న ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్ వంటి పోషకాలు తగ్గిపోతాయి. అలాంటప్పుడు ఆ ప్రభావం జుట్టు మీద కూడా ఉంటుంది.ఇవేవీ కాకుండా దేహం ఆరోగ్యంగా ఉండి కూడా జుట్టు రాలిపోవడం జరుగుతుంటుంది. అందుకు కారణం మాడుకు (స్కా ల్ప్)కు సంబంధించిన సమస్యలతో వచ్చే డాండ్రఫ్ ఒకటి. ఇటీవల పని ఒత్తిడి, వాతావరణ కాలుష్యం కూడా తోడవుతున్నాయి. ఈ కండిషన్స్లో జుట్టు రాలడాన్ని తగ్గించడానికంటూ ట్రీట్మెంట్ ఉండదు. కారణాన్ని బట్టి ఆ సమస్య పరిష్కారానికి ట్రీట్మెంట్ తీసుకుంటే చాలు. ఇవేవీ హెయిర్ట్రాన్స్ప్లాంటేషన్ ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిన అవసరం ఉన్నవి కానే కాదు. చాలామంది ఎదుర్కొంటున్న కామన్ ప్రాబ్లమ్ – మేల్ పాటర్న్ బాల్డ్నెస్... అంటే మగవారిలో వయసురీత్యా వచ్చే బట్టతల. హెయిర్ట్రాన్స్ప్లాంటేషన్ ట్రీట్మెంట్ అవసరం ప్రధానంగా ఈ రెండింటికి మాత్రమే. ఫిమేల్ పాటర్న్ బాల్డ్నెస్ (మహిళల్లో వయసు రీత్యా జుట్టు పలచబడడం) కూడా ఉంటుంది. కానీ అది తలంతా సమంగా ఉంటుంది గనక ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం ఉండదు. బాల్డ్నెస్ ఎందుకు? మగవారిలోని టెస్టోస్టిరాన్ హార్మోన్ ప్రభావం వల్ల జుట్టు రాలిపోతుంటుంది. సాధారణంగా 30–40 ఏళ్లు దాటినప్పటి నుంచి ఈ సమస్య మొదలవుతుంది. చాలా అరుదుగా అతికొద్దిమందిలో ఇరవై ఏళ్ల నుంచే బట్టతల మొదలవుతుంది.ఎక్కువ మందిలో తల ముందు భాగంలో నుదురు నుంచి పైకి జుట్టు రాలిపోయి ఖాళీ ఏర్పడుతుంటుంది. కొందరిలో నడినెత్తిన చంద్రాకారంలో ఖాళీ ఏర్పడుతుంది. బట్టతల వచ్చినప్పటికీ మాడులో జుట్టు పెరగగలిగిన పోషణ ఉంటుంది. కానీ వెంట్రుక కుదురు దగ్గర బలహీనపడి రాలిపోయి ఖాళీ ఏర్పడి ఉంటుంది. అలాంటి చోట కొత్త కుదుళ్లను నాటడం ద్వారా అక్కడ తిరిగి వెంట్రుకలు పెరిగేలా చేయవచ్చు. డోనర్ జోన్లు! ఆక్సిపిటల్ రీజియన్ (తల వెనుక వైపు) నుంచి జుట్టును సేకరించాలి. దీనినే డోనార్ సైట్ అని కూడా అంటారు. బట్టతల ఎంతగా విస్తరించిన వారిలోనైనా ఆక్సిపిటల్ రీజియన్లో జుట్టు ఉంటుంది. ఆ ప్రదేశం నుంచి సేకరించిన వెంట్రుకలను అవసరమైన చోట ఇంప్లాంట్ చేస్తారు. చదరపు సెంటీమీటరు జాగాలో 20 ఫాలికల్ యూనిట్స్ ఇంప్లాంట్ చేస్తారు. గడ్డం నుంచి కూడా! అనేక పరిశోధనలు, అధ్యయనాల తర్వాత ఇప్పుడు గడ్డం నుంచి కూడా వెంట్రుకలను సేకరిస్తున్నారు. టెస్టోస్టిరాన్ హార్మోన్ ప్రభావంతో వయసు పెరిగే కొద్దీ తల మీద వెంట్రుకలు పలుచబడుతూ, గడ్డం వెంట్రుకల సాంద్రత పెరుగుతూ ఉంటుంది. ఈ లక్షణాన్ని ట్రీట్మెంట్కు అనువుగా మార్చుకోవడం జరుగుతోంది. గడ్డం నుంచి రెండు– మూడు వేల వెంట్రుకలను తీయవచ్చు. మందులతో చికిత్స! ► పిల్లల్లో పోషకాహార లోపం,విటమిన్స్ లోపం, చుండ్రు, జ్వరం, కామెర్లు, ఇతర కాలేయ సమస్యలతో జుట్టు రాలిపోతుంటుంది. అలాంటి సమస్యలను మందులు, చక్కటి పరిశుభ్రత, పోషకాహారంతో అదుపుచేయవచ్చు. ► మేల్పాటర్న్ బాల్డ్నెస్ మొదలైన వారికి ఆరు నెలల నుంచి ఏడాది పాటు ఫైన్స్టెరెడ్ మందులతో చికిత్స చేయవచ్చు. ఇది షార్ట్టర్మ్ ట్రీట్మెంట్. మగవారికి మాత్రమే చేసే చికిత్స. ► తలలో రక్తప్రసరణ తగ్గడం వల్లా జుట్టు రాలిపోతుంటుంది. మినాక్సిడిల్ మందులతో జుట్టు కుదురును శక్తిమంతం చేయవచ్చు. ఈ మందులను మగవాళ్లు, మహిళలు వాడవచ్చు. సెమీ ఇన్వేజివ్ ట్రీట్మెంట్! ఈ పద్ధతిలో పేషెంటు రక్తం నుంచి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మాను సేకరించి, ప్రాసెస్ చేసి మాడుకు ఇంజెక్ట్ చేస్తారు. దాంతో జుట్టు కుదురు, హెయిర్ రూట్ బలపడతాయి. దీనిని అందరికీ చేయవచ్చు. మధ్య వయసు మహిళలకు అంటే ఫిమేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ ఉన్న వారికి అనువైన చికిత్స. విటమిన్లు, ఇతర పోషకాలను కూడా నేరుగా మాడుకే ఇంజక్షన్ ద్వారా ఇస్తారు. డయాబెటిస్, హైబీపీ వంటి ఏ ఇతర అనారోగ్యాలున్నా సరే చేయించుకోవచ్చు. ఆపరేషన్కు సిద్ధం చేయడం ఇలా? ► సర్జరీ చేయాల్సిన ముందురోజు రాత్రి తలస్నానం చేయాలి. ► సర్జరీకి ఒకటి– రెండు రోజుల ముందుగా హెయిర్ ట్రిమ్ చేయించాలి. పొట్టి జుట్టుతో పోలిస్తే పొడవు జుట్టును తీయడం, ఇంప్లాంట్ చేయడానికి శ్రమ, సమయం ఎక్కువ. పొట్టిగా ఉంటే మరింత కచ్చితంగా ఇంప్లాంట్ చేయవచ్చు. సక్సెస్రేట్ కూడా పెరుగుతుంది. – వాకా మంజులా రెడ్డి ‘సాక్షి’ ఫీచర్స్ ప్రతినిధి మొక్కను నాటినట్లే! పేషెంటు తల మీద జుట్టును ఒత్తుగా ఉన్న చోట నుంచి కుదురుతో పాటుగా తీస్తారు. జుట్టు లేని చోట చిన్న రంధ్రం చేసి ఒక్కొక్క ఫాలికల్ను నాటుతారు. ఈ ప్రక్రియలో కేశాలను తీయడంతోపాటు ఇంప్లాంట్ చేయడం కూడా చాలా మెళకువతో చేయాలి. భూమి మీద ఒక చోట మొలచిన ఒక మొక్కను అక్కడ నుంచి తీసి మరొక చోట నాటేటప్పుడు వేరుతో పాటుగా తీసి ఎంతlజాగ్రత్తగా నాటుతామో, ఇదీ అలాగేనన్నమాట. ఇలా నాటిన కుదుళ్లలో నూటికి90 ఫాలికల్స్విజయవంతంఅవుతాయి. గుర్తుంచుకోవాల్సినవి ► హెయిర్ట్రాన్స్ప్లాంటేషన్ ఏ వయసులోనైనా చేయించుకోవచ్చు. ►ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత కూడా బాల్డ్నెస్ ప్రాసెస్ ఆగదు. అంటే నాటిన ప్రదేశంలో వెంట్రుకలు ఉంటాయి. మిగిలిన భాగంలో జుట్టు రాలడాన్ని నివారించడం కష్టం. ► గతంలో పాటించిన స్ట్రిప్ ఎక్స్ట్రాక్ట్ పద్ధతుల్లో డోనార్ సైట్ నుంచి జుట్టు తీసిన చోట మచ్చ పడేది. ఇప్పుడు డోనార్ సైట్లో జుట్టు పలచబడుతుంది తప్ప మచ్చ పడదు. ► ఈ ట్రీట్మెంట్ తర్వాత కొందరిలో జుట్టు పొడవులో తేడాలు వచ్చే అవకాశం లేకపోలేదు. హెయిర్కట్ నిడివి మార్చుకోవాలి. ►చాలా అరుదుగా అతి కొద్దిమందిలో మందుల కారణంగా అలర్జీలు వస్తుంటాయి. అందుకోసం ట్రీట్మెంట్కు ముందుగానే పేషెంటు తన ఫ్యామిలీ హెల్త్ హిస్టరీని డాక్టరుకు తెలియచేసి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. డాక్టర్ వై. వెంకట రమణ సీనియర్ ప్లాస్టిక్ సర్జన్, కాంటూర్స్ ప్లాస్టిక్ సర్జరీ సెంటర్, హైదరాబాద్ -
‘మీ పిల్లలు చనిపోతే మమ్మల్ని ఏం చేయమంటారు’
పాల్ ఘర్: తమ కష్టాలను చెప్పుకునేందుకు వచ్చిన గిరిజనులపై ఓ మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేశారు. పోషకాహార లోపంతో పిల్లలు చనిపోతున్నారని.. ఆదుకోవాలని మొర పెట్టుకున్నవారిపై మహారాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి విష్ణు సావ్రా విరుచుకుపడ్డారు. పౌష్టికాహార లోపంతో బాలలు అధికంగా మరణిస్తున్న యెఖదా సబ్ జిల్లాలోని ఖోచ్ గ్రామంలో ఆయన నిన్న పర్యటించారు. ఈ సందర్భంగా ఏడాదికాలంలో దాదాపు 600 మంది పిల్లలు పోషకాహార లోపంతో మరణించారని గ్రామంలో కొందరు మంత్రితో మొరపెట్టుకున్నారు. మరికొందరు ప్రభుత్వ చర్యలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయని సావ్రాను నిలదీశారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన సావ్రా మీ పిల్లలు చనిపోతే మమ్మల్ని ఏం చేయమంటారు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో కోపోద్రేకులైన గ్రామస్తులు మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ... గ్రామం విడిచి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. కాగా, గిరిజన గ్రామ పర్యటనలో వివాదాస్పదంగా మాట్లాడిన మంత్రి సావ్రా వెంటనే రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. దీంతో మాటమార్చిన సావ్రా.. తాను అలా అనలేదని చెప్పుకొచ్చారు. మరోవైపు సావ్రా గ్రామస్ధులపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీటిపై స్పందించిన మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు రాష్ట్రంలో పౌష్టికాహార లోప మరణాలు అదుపులోకి తీసుకురావాలని మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి పంకజా ముండే, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి విష్ణు సావ్రా, ప్రజా ఆరోగ్యశాఖ మంత్రి దీపక్ సావంత్ ఆదేశాలు జారీ చేశారు. -
'గిరిజన శాఖ మంత్రి రాజీనామా చేయాల్సిందే'
ముంబై: మహారాష్ట్ర గిరిజన శాఖ మంత్రికి పోషకాహారలోపం సెగ తగిలింది. శుక్రవారం ప్రతిపక్ష కాంగ్రెస్.. మంత్రి విష్ణు సవరా రాజినామా చేయాలని డిమాండ్ చేసింది. ఇటీవల పాల్గర్ జిల్లాలో పోషకాహార లోపంతో మృతి చెందిన రెండేళ్ల బాలుడి వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో గురువారం బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన మంత్రి సవరా కు చేదు అనుభవం ఎదురైంది. ఆ ప్రాంతంలో సుమారు 600 మంది బాలలు పోషకాహారలోపంతో మరణించారని తెలుపుతూ స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గిరిజన బాలల మృతికి నైతిక బాధ్యత వహిస్తూ గిరిజన శాఖ మంత్రి రాజీనామా చేయాలని ప్రతిపక్ష కాంగ్రెస్ నేత విఖే పాటిల్ డిమాండ్ చేశారు. గిరిజన శాఖ మంత్రి రాజీనామాకు ఒప్పుకోని పక్షంలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ మంత్రిని తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. -
మృదువైన మర్దన
బ్యూటిప్స్ వెంట్రుకలు రాలడం, నిర్జీవంగా కనిపించడం వంటి సమస్యలు పోషకాహరం లోపంతో తలెత్తుతాయి. అలాగే సరైన పోషణ లేకపోవడం వల్ల కూడా కురుల నిగనిగలకు సమస్యలు ఎదురవుతాయి. పరిష్కారంగా... కొబ్బరి నూనె, నువ్వుల నూనెలతో మాడుకు మసాజ్ చేసుకోవాలి. ఈ నూనెలలో ఉసిరి లేదా మందార పువ్వు లేదా బంతిపువ్వు లేదా కరివేపాకు వేసి వేడి చేయాలి. ఈ మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడు తలకు పట్టించి, మృదువుగా మసాజ్ చేయాలి. అలాగే వెంట్రుకల చివర్లకు రాయాలి. రాత్రి పడుకునేముందు ఇలా మసాజ్ చేసుకొని, మరుసటి రోజు ఉదయం తలస్నానం చేయాలి. ఇలా వారంలో రెండు సార్లు చేయడం వల్ల మాడుపై గల మృతకణాలు తొలగిపోతాయి. చుండ్రు తగ్గుతుంది. వెంట్రుకల పెరుగుదల బాగుంటుంది. షాంపూల వాడకం వల్ల జుట్టు పాడైపోతుందనుకునేవారు సహజసిద్ధంగా లభించే వాటితో తలంటుకోవచ్చు. కుంకుడుకాయ, షికాయలను నానబెట్టి రసం తీసి దీంట్లో ఉసిరిపొడి, మందారపువ్వుల పొడి, టీ స్పూన్ బంకమట్టి, మెంతి పొడి, గోరింటాకు పొడి కలపాలి. ఈ మిశ్రమాన్ని ఐస్ట్రేలలో పోసి డీప్ ఫ్రీజర్లో పెట్టాలి. ఈ ఐస్క్యూబ్స్ని కావల్సినప్పుడు తీసి ఉపయోగించడం సులువు అవుతుంది. పదిహేను రోజులకొకసారి పప్పులతో తయారుచేసిన షాంపూతో తలస్నానం చేయాలి. ఇందుకు శనగపిండి, మినప్పిండి, పెసరపిండి సమభాగాలుగా తీసుకోవాలి. ఈ పిండిలో నీళ్లు లేదా కుంకుడు రసంలో కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు ప్యాక్లా వేసి, మృదువుగా రుద్దుతూ కడిగేయాలి. -
బైక్పై తిరిగితే నడుంనొప్పి వస్తుందా?
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 40 ఏళ్లు. బరువు 80 కేజీలు. ఉద్యోగరీత్యా రోజూ దాదాపు 60 కి.మీ. పైగా ద్విచక్రవాహనం నడుపుతుంటాను. ఈమధ్య నడుము నొప్పి ఎక్కువైంది. ఒకవైపు కాలి నొప్పితో కూడా బాధపడుతున్నాను. దయచేసి పరిష్కార మార్గాలు చెప్పండి. - రేవతి, ఏలూరు నేటి జీవనశైలిలో పని ఒత్తిడి, పోషకాహార లోపం, తగినంత నిద్రలేకపోవడం, మానసిక ఆందోళన, మీలా బైక్పై ఎక్కువగా తిరుగుతుండటం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అలాంటి వాటిల్లో ముఖ్యమైనది సయాటికా. శరీరంలోని నరాలన్నింటిలోనూ ఇదే పొడవైనది. ఇది వీపు కింది భాగం నుంచి పాదాల వరకు ప్రయాణం చేస్తుంది. ఈ నరంపై ఒత్తిడి కలిగినప్పుడు వచ్చే నొప్పిని సయాటికా నొప్పి అంటారు. ఈ నొప్పి భరింపరానిదిగా ఉండటమే గాక రోజువారీ వ్యవహారాల్లోనూ ఆటంకం కలిగిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది ఈ సమస్యతో తమ విధులు సక్రమంగా నిర్వహించలేకపోతున్నారు. ముఖ్యంగా 30 - 50 ఏళ్ల మధ్య వయసు వారిలో ఈ సమస్య ఎక్కువ. కారణాలు: ఎముకల్లో ఏర్పడే స్పర్శ వల్ల వెన్నెముక కంప్రెస్ అవుతుంది దెబ్బలు తగిలినప్పుడు పైరిఫార్మిస్ అనే కండరం వాచి, అది నరాలపై ఒత్తిడిని కలిగిస్తుంది గర్భిణుల్లో పిండం బరువు పెరిగి నరాలపై ఒత్తిడి కలిగిస్తుంది శారీరక శ్రమ, వ్యాయామం లేకపోవడం వల్ల కీలు సక్రమంగా పనిచేయక సయాటికా నొప్పి కలగవచ్చు. లక్షణాలు: కాళ్లలో నొప్పి సూదులు గుచ్చినట్లుగా ఉండటం కండరాల బలహీనత, స్పర్శ కోల్పోవడం రెండు కాళ్లలో లేదా ఒక కాలిలో తీవ్రమైన నొప్పి రావడం బరు వులు ఎత్తినప్పుడు, దగ్గినప్పుడు లేదా అధికశ్రమ కలిగినప్పుడు నొప్పి మరింత పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. నిర్ధారణ పరీక్షలు: ఎక్స్-రే, సీటీ స్కాన్, ఎమ్మారై చికిత్స: సయాటికా నొప్పికి, వెన్నుపూసల్లో సమస్యలకు హోమియోలో మంచి చికిత్స ఉంది. రస్టాక్స్, కోలోసింథ్, కాస్టికమ్, సిమిసిఫ్యూగా వంటి మందులు అందుబాటులో ఉన్నాయి. రోగి లక్షణాలను బట్టి అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడితే సయాటికా నొప్పి పూర్తిగా నయమవుతుంది. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి హైదరాబాద్ పాప పాలిపోతోంది... పరిష్కారం? హెమటాలజీ కౌన్సెలింగ్ మా పాప పుట్టిన తర్వాత తెల్లగా పాలిపోయినట్లుగా ఉంటే పరీక్షచేసి హీమోగ్లోబిన్ పాళ్లు చాలా తక్కువగా ఉన్నట్లు చెప్పారు. అప్పటి నుంచి నెలనెలా తప్పకుండా రక్తం ఎక్కిస్తూ ఉండాలని చెప్పారు. మూడేళ్ల తర్వాత ప్లీహం (స్ల్పీన్) తొలగిస్తే ఇలా తరచూ రక్తం ఎక్కించే అవసరం తగ్గుతుందని డాక్టర్లు చెప్పారు. ఆ ఆపరేషన్ చేయించాం. తర్వాత రెండు నెలలకోసారి రక్తం ఎక్కిస్తున్నారు. మంచి ఆహారం పెడుతున్నాం. నెలకోసారి పెనిడ్యూర్ ఇంజెక్షన్ చేయిస్తున్నాం. రక్తం ఎక్కించాక కేవలం నెలన్నర అయిందంటే చాలు... పాప పాలిపోయి నీరసంగా తయారవుతోంది. ఇలా మాటిమాటికీ రక్తం ఎక్కించే బాధ తప్పదా? దీనికి శాశ్వత చికిత్స లేదా? - ఒక సోదరి, విశాఖపట్నం సాధారణంగా మన రక్తంలోని ఎర్రరక్తకణాలు మధ్యన కాస్తంత నొక్కినట్లుగా బిళ్లల్లా ఉంటాయి. కానీ మీ పాపకు ఉన్న సమస్య వల్ల తయారయ్యే ప్రక్రియలోనే అవి బంతిలా గుండ్రంగా తయారవుతుంటాయి. పాపకు ఇది పుట్టుకతో జన్యుపరంగా వచ్చిన సమస్య. ఇలా కణాల ఆకృతి భిన్నంగా ఉండటంతో మన శరీరంలోని ప్లీహం (స్ప్లీన్) వాటిని లోపభుయిష్టమైన కణాలుగా గుర్తించి, ఎప్పటికప్పుడు నాశనం చేసేస్తుంటుంది. అందుకే పాపకు తరచూ రక్తహీనత వస్తోంది. సాధారణంగా ఒక ఎర్రరక్తకణం జీవితకాలం 120 రోజులు. కానీ ప్లీహం ఈ రక్తకణాలన్నింటినీ చాలా ముందుగానే నాశనం చేస్తుండటంతో వాటి సంఖ్య తగ్గిపోయి, తరచూ రక్తహీనత వస్తుంది. అందుకే చికిత్సలో భాగంగా బయటి నుంచి రక్తం ఎక్కిస్తున్నారు. అలాగే ఉన్న రక్తకణాలు నాశనం కాకుండా కాపాడుకునేందుకు ప్లీహాన్ని కూడా తొలగించారు. ఇక పుట్టిన ఎర్ర రక్తకణాలు త్వరత్వరగా నాశనమైపోతున్నాయి. కాబట్టి ఎముక మూలుగ/మజ్జ ఇంకా ఎక్కువెక్కువ ఎర్ర రక్తకణాలను తయారు చేస్తుంటుంది. అది అవసరం కూడా. అందుకే దానికి కావాల్సిన మూల వనరులైన ఫోలిక్ యాసిడ్, విటమిన్లు, ఐరన్ తదితరాలను మనం మాత్రల రూపంలో బయటి నుంచి ఇస్తుండాలి. దీనివల్ల పుట్టిన ఎర్రరక్తకణాలు ఎంతో కొంత సమర్థంగా ఉంటాయి. ప్లీహాన్ని తొలగించారు కాబట్టి ఒంట్లో నుంచి హానికారక/వ్యాధికారక సూక్ష్మక్రిముల వంటివి త్వరగా బయటకు తొలగిపోవు. ఫలితంగా రకరకాల ఇన్ఫెక్షన్ల నుంచి వచ్చే ముప్పు ఎక్కువ. దీన్ని నివారించేందుకు పాపకు నెలనెలా పెనిడ్యూర్ ఇంజెక్షన్లు ఇస్తున్నారు. ఇది చాలా అవసరం. ఇక మీ పాప విషయంలో ప్రతి రెండు నెలలకోసారి తప్పనిసరిగా రక్తం ఎక్కించాల్సి రావడం కాస్త దురదృష్టమే. మామూలుగా ప్లీహం తొలగించిన తర్వాత కొందరిలో రక్తం ఎక్కించాల్సిన అవసరమే తలెత్తదు. కానీ సమస్య తీవ్రంగా ఉన్న కొద్దిమందిలో మాత్రం ఇలా తరచూ రక్తం ఎక్కించాల్సి వస్తుంటుంది. తరచూ రక్తం ఎక్కిస్తున్నప్పుడు ఒంట్లో నుంచి ఇనుమును తొలగించే మందులు వాడడం తప్పనిసరి. ఎందుకంటే రక్తం ఎక్కించిన ప్రతిసారీ దాదాపు 100-150 మి.గ్రా. ఇనుము మన శరీరంలో పేరుకుపోతుంది. దీన్ని తొలగించేందుకు పాపకు నిత్యం మందులు ఇవ్వాలి. లేకపోతే ఆ ఇనుము... కాలేయం, గుండె వంటి అవయవాల్లో పేరుకుపోయి వాటిని దెబ్బతీస్తుంది. అందుకే ఆ మాత్రలు తప్పనిసరి. నిజానికి జన్యుపరంగా వచ్చే ఇలాంటి రక్తవ్యాధులన్నింటికీ రక్తం ఎక్కించడం తప్పించి, ఇతరత్రా చికిత్స ప్రక్రియలు తక్కువనే చెప్పాలి. ఇలాంటి వారికి కచ్చితమైన చికిత్స ఎముక మూలుగ మార్పిడి (బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్). మిగతా చికిత్సలన్నీ సమస్యను నియంత్రణలోకి తెచ్చేందుకే. మీరు ఒకసారి మీకు దగ్గర్లోని రక్తవ్యాధుల నిపుణుడిని సంప్రదించండి. డా॥శైలేశ్ ఆర్ సింగీ సీనియర్ హిమటో ఆంకాలజిస్ట్, బీఎమ్టీ స్పెషలిస్ట్, సెంచరీ హాస్సిటల్స్, హైదరాబాద్ -
‘38.7% పిల్లల్లో ఎదుగుదల లోపాలు’
న్యూఢిల్లీ: భారత్లో 38.7 శాతం పిల్లలు పోషకాహార లోపం వల్ల సరిగా ఎదగలేకపోతున్నారని ప్రపంచ పోషకాహార నివేదిక(జీఎన్ఆర్)లో వెల్లడైంది. ఇది ప్రపంచ సగటు 23.8 కన్నా ఎంతో అధికం. సర్వే జరిపిన 132 దేశాల్లో భారత్ 114వ స్థానంలో నిలిచిందని తెలిపింది. ఇదే సరళి కొనసాగితే భారత్... 2030 కల్లా ఘనా, టోగోలను 2055 వరకు చైనా అధిగమిస్తుందని అంచనా వేసింది. చైనా భారత్ కన్నా 106 అధిక పాయింట్లతో 26వ స్థానంలో ఉంది. టోగో, ఘనాలు వరసగా 52, 80 ర్యాంకులు దక్కించుకున్నాయి. ఇంకా, దేశంలో 9.5 శాతం పెద్దలు డయాబెటిస్తో బాధపడుతున్నారని, 190 దేశాల్లో జరిపిన మధుమేహ వ్యాధి సర్వేలో భారత్కు 104వ స్థానం దక్కినట్లు నివేదిక తెలిపింది. -
విందు భోజనం తిని 300మందికి అస్వస్థత
కంకిపాడు(కృష్ణా జిల్లా): వివాహ వేడుకలో కలుషిత ఆహారం తిన్న దాదాపు 300 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన కృష్ణా జిల్లా కంకిపాడు మండలం కోలవెన్ను గ్రామంలో శనివారం జరిగింది. వివరాలు.. కోలవెన్ను గ్రామంలో ఒక ఇంటిలో శుక్రవారం రాత్రి వివాహం జరిగింది. శనివారం వ్రతం సందర్భంగా విందు భోజనం ఏర్పాటు చేశారు. ఈ విందులో భోజనం చేసిన దాదాపుగా 300 మంది అస్వస్తతకు గురయ్యారు. కొందరు వాంతులు, విరేచనాలతో స్థానిక ఆర్ఎమ్పీ వైద్యుని వద్ద ప్రాథమిక చికిత్స పొందారు. విషయం తెలిసిన గ్రామ సర్పంచ్ విజయవాడ నుంచి ప్రత్యేక వైద్య బృందాన్ని రప్పించి చికిత్స చేయించారు. ఎవరికి ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పారు. ఇదిలా ఉండగా, కృష్ణా జిల్లా కోలవెన్నులో ఫుడ్ పాయిజన్ పై ఆ జిల్లా మంత్రి కామినేని శ్రీనివాస్ స్పందించారు. ఈ విషయమై ఆయన కృష్ణాజిల్లా వైద్యాధికారులతో మాట్లాడారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి కామినేని ఉన్నతాధికారులను ఆదేశించారు. -
యవ్వనంలోనూ...అరుగుతున్నాయ్ కీళ్లు
నేడు వరల్డ్ ఆర్థరైటీస్ డే పాతికేళ్లకే కీళ్లనొప్పులు.. గ్రేటర్లో పెరుగుతున్న ఆర్థరైటీస్ బాధితులు అధిక బరువు, పోషకాహార లోపమే కారణమంటున్న నిపుణులు సాక్షి, సిటీబ్యూరో: కీళ్ల నొప్పులు ఒకప్పుడు ఆరుపదుల వయసు దాటిన వారిలోనే కన్పించేవి. కానీ మారిన జీవన స్థితిగతులు, తీసుకునే ఆహారం దృష్ట్యా ప్రస్తుతం అన్ని వయస్సుల వారిని వేధిస్తోంది. యువతే కాదు పిల్లలు సైతం కీళ్ల నొప్పులతో బాధపడుతుండడం బాధాకరం. బాధితుల్లో 70 శాతం మంది మహిళలు, 30 శాతం పురుషులు ఉంటున్నారు. 10-15 శాతం వరకు పిల్లలు కూడా ఉండటం ఆందోళనకరం. గత పదేళ్లతో పోలిస్తే ఈ సంఖ్య రోజు రోజుకు మరింత పెరుగుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అధిక బరువు, మారిన ఆహారపు అలవాట్లు, పోషకాహారలోపం, పిల్స్వాడటమే ఇందుకు కారణమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఆదివారం ‘వరల్డ్ ఆర్థరైటీస్ దినోత్సవం’ సందర్భంగా ప్రత్యేక కథనం. రుమటాయిడ్ ఆర్థరైటీస్ బాధితులే అధికం.. నగరంలో వివిధ రకాల కీళ్లనొప్పులతో బాధపడుతున్న వారిపై కిమ్స్ ఆస్పత్రి రుమాటాలజీ విభాగం ఇటీవల ఓ సర్వే నిర్వహించగా విస్తుగొలిపే వాస్తవాలు వెలుగు చూశాయి. గత ఐదేళ్లలో ఆస్పత్రికి వచ్చిన 10 వేల మందిపై పరిశోధన చేయగా, వీరిలో రుమటాయిడ్ ఆర్థరైటీస్ (కీళ్లనొప్పి)తో 29 శాతం, ఆస్టీయో ఆర్థరైటీస్(మోకాలు, మోచేతి కీళ్లలోని గుజ్జు అరిగిపోవడంతో వచ్చే నొప్పి)తో 17 శాతం, సొరియాటిక్ ఆర్థరైటీస్(చర్మం పొడుసుబారిపోవడం)తో 8 శాతం, లూపస్(ముఖంపై సీతాకొక చిలుకలా మచ్చలు ఏర్పడటం)తో 7 శాతం, ఎంకైలోజింగ్ స్పాండిలైటీస్(వెన్నెముఖ, నడుం వంగిపోవడం)తో 4 శాతం, ఆస్టియో పోరోసిస్(ఎముకల్లో సాంద్రత తగ్గడం వల్ల అవి విరిగిపోవడం)తో 3 శాతం, గౌట్(రక్తంలో యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల కాలిబొటన వేలిపై నొప్పి)తో మరో 3 శాతం మంది బాధపడుతున్నట్టు తమ పరిశోధనలో తేలిందని కిమ్స్ రుమటాలజీ విభాగాధిపతి డాక్టర్ శరత్చంద్రమౌలి వీరవల్లి వెల్లడించారు. ఆర్థరైటీస్ మహిళల్లో హృద్రోగ సమస్యలు.. నగరంలోని ఆర్థరైటీస్తో బాధపడుతున్న 800 మంది వివరాలు సేకరించి, ఆరోగ్యంగా ఉన్న మరో 800 మందితో వయసు, లింగ, నిష్పత్తి, స్మోకింగ్ , నడుం చుట్టూ కొలత, హైపర్టెన్షన్, డయాబెటిస్ మెల్లటస్, బాడీ మాస్ ఇండెక్స్, బీపీ, షుగర్, ఆధారంగా అధ్యయనం చేయగా ఈ విషయం బయట పడిందని డాక్టర్ శరత్చంద్రమౌలి స్పష్టం చేశారు. 25-46 ఏళ్లలోపు వారిని ఎంపిక చేయగా వీరిలో 666 మంది మహిళలే. రుమటాయిడ్ ఆర్థరైటీస్ రోగులను సాధారణ ప్రజలతో పోలిస్తే వారిలో 2-3 శాతం కార్డియో వాస్క్యులర్ ప్రమాదం ఉన్నట్టు తేలింది. వైట్ కాలర్ ఉద్యోగులే అధికం.. శరీరానికి కనీసం ఎండ కూడా తగలకుండా 24 గంటలు ఏసీల్లో కూర్చోని పని చేస్తున్న వారు ఆర్థరైటీస్ బారినపడుతున్నారు. ఇందులో ఐటీ, అనుబంధ రంగాల్లోని ఉద్యోగులతోపాటు ఆస్పత్రుల్లో పని చేస్తున్న వైద్యులు, ఇతర వైట్ కాలర్ ఉద్యోగులు ఉన్నారు. అదీగాక కార్పొరేట్ విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థులు సైతం కీళ్ల నొప్పుల బాధితులుగా మారుతున్నారు. బాధితుల్లో ఎక్కువ శాతం 40 ఏళ్లలోపు వారే ఉన్నారు. మహిళలు ఎక్కువగా లూపస్ సమస్యను ఎదుర్కొంటుంటే, పురుషులు ఎంకైలోజింగ్ స్పాండిలైటీస్తో బాధపడుతున్నారు. - డాక్టర్ శరత్చంద్రమౌలి వీరవల్లి, చీఫ్ రుమాటాలజిస్ట్, కిమ్స్ -
మెతుకుల్లేని బతుకులు
పల్లెవాసుల కూడు గోడు రోజూ రూ.8తో కడుపు నింపుకుంటున్న గిరిజనులు నిత్యం నీళ్లపులుసు, కారం మెతుకుల తిండి గ్రామీణ ప్రాంత ప్రజల దరిచేరని ప్రభుత్వ పథకాలు పౌష్టికాహార లోపంతో ఏటా 34 శాతం మరణాలు ‘జాతీయ శాంపిల్ సర్వే’లో వెల్లడి హన్మకొండ ఈ కాలంలో రూ.ఎనిమిదికి ఏం వస్తుంది... సింగిల్ చాయ్, ఒక్క మస్కా బిస్కెట్ తప్ప ఏం రాదు. అలాంటిది ఈ పైసలతో గిరిజన జీవి ఒక రోజు వెళ్లదీస్తున్నాడు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాలు బతికేందుకు ప్రతి రోజూ ఖర్చు పెడుతున్న సొమ్ము అక్షరాలా ఎనిమిది రూపాయలు. దొడ్డు బియ్యం, నీళ్ల పులుసు, కారం మెతుకులతో రోజులు గడుపుతున్నాడు. ఇదీ... జాతీయ శాంపిల్ సంస్థ చేసిన సర్వేలో తేలిన నిజం. ఈ సంస్థ ఢిల్లీకి చెందిన మరో రెండు సర్వే సంస్థలతో కలిసి గత ఏడాది జూలై నుంచి డిసెంబర్ వరకు జిల్లావ్యాప్తంగా 21 మండలాలు, 112 గ్రామాలు, వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్, జనగామ మునిసిపాలిటీ పరిధిలో సర్వే చేపట్టింది. ప్రజల జీవన విధానం, తీసుకుంటున్న ఆహారం, రోజువారీ ఖర్చులు, పౌష్టికాహారం, తిండి కోసం వెచ్చిస్తున్న ఖర్చుల వంటి అంశాలపై స్వీయ పరిశీలన చేసింది. ఒక బృందానికి 100 మంది చొప్పున మొత్తం 14 గ్రూపులు చేసిన సర్వేలో అధ్వానపు పరిస్థితులు బట్టబయలయ్యూరుు. అంతేకాదు... ప్రభుత్వం అందించే రూపాయి కిలో బియ్యం వారి దరికి చేరడం లేదనే నగ్న సత్యం వెలుగుచూసింది. సర్వేలో తేలిన మరి కొన్ని అంశాలు... పౌష్టికాహారం తీసుకుంటోంది 17 శాతమే.. 36 లక్షలున్న జిల్లా జనాభాలో పౌష్టికాహారం తీసుకుని ఆరోగ్యకర జీవనం సాగిస్తున్నది కేవలం 17 శాతం మందే. ఇది కూడా... బడా వ్యాపారులు, ఉద్యోగులు, సంపాదనపరులు మాత్రమే. పౌష్టికాహారం తీసుకుంటున్న జాబి తాలో పట్టణవాసులు 11 శాతం, మునిసిపాలిటీ, మండల కేంద్రాల్లో నివసిస్తున్న వారు 6 శాతం మాత్రమే ఉన్నారు. మిగిలిన వారందరూ బతికేందుకే ఎదో ఒకటి తింటూ కడుపు నింపుకుంటున్నవారే. ఏటా 34 శాతం మరణాలు గ్రామీణ ప్రాంతాల్లో తినేందుకు తిండి కూడా దొరకని పరిస్థితులు నెలకొన్నాయి. 51 శాతం గ్రామీణ ప్రాంత ప్రజలు ప్రతిరోజూ కేవలం రూ. 8 ఖర్చుతో కడుపు నింపుకుంటున్నారు. వారు తినే తిండి అతి దారుణంగా ఉంటోంది. స్థానికంగా దొరుకుతున్న చింతకాయలతో నీళ్ల చారు పెట్టుకుని, పచ్చడి మెతుకుల తిండి తింటున్నారు. తండాలు, అటవీ ప్రాంతాల్లో నివాసం ఉండేవారు వారంలో మూడు రోజులు గంజితోనే గడుపుతున్నారని సర్వేలో వెల్లడైంది. రోజు మొత్తం పనిచేసినా... వారికి పూట గడిచే పరిస్థితులు లేవు. రోజువారి సంపాదనలో తిండి కోసం ఒక్క మనిషి రూ. 8 మాత్రమే వెచ్చిస్తున్నాడని, అంతకు మించి ఖర్చు పెట్టే స్థోమత వారికి లేదని సర్వేలో వెల్లడైంది. గ్రామీణ ప్రాంతాలు, తండాలు, అటవీ గ్రామాల్లో పౌష్టికాహార లోపంతో ప్రతి ఏటా 34 శాతం మరణాలు సంభవిస్తున్నట్లు గుర్తించారు. అరుునా... లోపమే మరో 32 శాతం మంది రోజువారి సంపాదనలో రూ. 21 నుంచి రూ.36 వరకు తిండి కోసం వెచ్చిస్తున్నారు. వీరు కూడా పౌష్టికాహార లోపంతో ఉన్నట్లు సర్వేలో తేలింది. పల్లెలు కాకుండా పెద్ద పెద్ద గ్రామాలు, మండల కేంద్రాల్లో నివసిస్తున్న వారే ఈ ఖర్చు చేస్తున్నారు. వీరిలో చిరుద్యోగులు, చిన్న చిన్న వ్యాపారులు, రాజకీయ నేతలు ఉన్నారు. అందని పథకాలు ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయికి వెళ్లడం లేదని సర్వేలో బహిర్గతమైంది. అటవీ గ్రామాలు, గిరిజన తండాల ప్రజల కు రూపాయి కిలో బియ్యంతోపాటు జీవనోపాధి కల్పించే పథకాలు అందడం లేదు. రూపా యి కిలో బియ్యం అందనివారు పౌష్టికాహార లోపం జాబితాలో అధిక సంఖ్యలో ఉన్నట్లు తేలింది. -
రక్తాన్ని శుద్ధిచేసే ‘నల్ల’ క్యారెట్లు!
లూథియానా: పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధకులు నలుపు రంగులో ఉండే క్యారెట్ల రకాన్ని అభివృద్ధి చేశారు. ఇవి శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేస్తాయని, మరెన్నో పోషకాలను అదనంగా కలిగి ఉంటాయని వారు చెబుతున్నారు. ఈ ‘నల్ల’ క్యారెట్లకు ‘పంజాబ్ బ్లాక్ బ్యూటీ’ అని పేరు పెట్టినట్లు శాస్త్రవేత్త ఎస్.ధిల్లాన్ చెప్పారు. రక్తహీనత, కడుపులోని వివిధ అవయవాల వ్యాధులకు కారణమయ్యే హానికర రసాయనాలు, పదార్థాలను రక్తం నుంచి శుద్ధి చేసేందుకు ఈ ‘నల్ల’ క్యారెట్ తోడ్పడుతుందని తెలిపారు. దేశంలో పోషకాహార లోపంతో బాధపడుతున్న వారికి ఈ క్యారెట్లు మంచి ప్రత్యామ్నాయమని ధిల్లాన్ పేర్కొన్నారు. ఈ క్యారెట్లలో కెరోటిన్, ఫ్లేవనాల్లు, కాల్షియం, ఐరన్, జింక్లతో పాటు నాలుగు రెట్లు ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయని తెలిపారు. నాటిన 93 రోజుల్లో ఈ ‘నల్ల’ క్యారెట్లు దిగుబడికి వస్తాయన్నారు. -
ఏపీలో శిశు మరణాలపై ఐఏపీ ఆందోళన
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఏటా 2.5 కోట్ల మంది జన్మిస్తుండగా, వారిలో 50 శాతం మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారని ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (ఐఏపీ) తెలిపింది. ప్రస్తుతం నమోదు అవుతున్న శిశు మరణాల్లో 54 శాతం మంది పౌష్టికాహార లోపంతో చనిపోతున్నట్లు పేర్కొంది. మరణాల రేటు ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా 40 శాతం నమోదు అవుతుండటంపై ఐఏపీ ఆందోళన వ్యక్తం చేసింది. ‘శిశువులు, ఎదిగే పిల్లలో పోషణ’ అనే అంశంపై శుక్రవారం ఇక్కడ ఏర్పాటు చేసిన సదస్సులో సుమారు 300 మంది పిల్లల వైద్య నిపుణులు పాల్గొన్నారు. డా. పి.సుదర్శన్రెడ్డి, డా. హిమబిందు సింగ్, డా. ఆర్.కె.అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు.