minister jogu ramanna
-
పంద్రాగస్టున బీసీల రాయితీ పథకం ప్రారంభం: మంత్రి
సాక్షి, హైదరాబాద్: బీసీల ఆర్థికాభివృద్ధిలో భాగంగా ఈ నెల 15న అమల్లోకి రానున్న ప్రత్యేక రాయితీ పథకం ప్రారంభానికి అన్ని జిల్లా కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు బీసీ సంక్షేమశాఖ మంత్రి జోగు రామన్న చెప్పారు. సోమవారం జిల్లా కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పంద్రాగస్టు రోజున అన్ని జిల్లా కేంద్రాల్లో వంద మంది లబ్ధిదారులకు రాయితీ పథకం లబ్ధి చేకూర్చనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఒక్కొక్కరికి రూ.50 వేల చెక్కును అందిస్తామన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.2 వేల కోట్లతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని, తక్షణ సాయం కింద రూ.725 కోట్లు విడుదల చేశామన్నారు. నిధులను జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి ఖాతాలో జమ చేసినట్లు తెలి పారు. రుణాల కోసం దళారులను ఆశ్రయించవద్దని ఎంపిక పారదర్శకంగా జరుగుతుందన్నారు. జిల్లా కలెక్టర్ చైర్మన్గా, జేసీ, డీఆర్డీవో పీడీలు సభ్యులుగా, బీసీ సంక్షేమాధికారి కన్వీనర్గా ఉన్న కమిటీ ద్వారా ఎంపిక చేస్తుందని చెప్పారు. -
మూడో కూటమిపై సీఎం ప్రకటన హర్షనీయం
ఆదిలాబాద్: దేశ రాజకీయాల్లో బీజేపీ, కాంగ్రెస్లకు ప్రత్యామ్నాయంగా మూడో కూటమి ఏర్పాటు అవసరమని, అందుకు ముందుండి నడిపించేందుకు సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తున్నట్లు రాష్ట్ర అటవీ, బీసీ శాఖమంత్రి జోగురామన్న ఓ ప్రకటన విడుదల చేశారు. దేశంలో బీజేపీ, కాంగ్రెస్ అధికారంలోకి రావడమే తప్ప ప్రజలకు చేసిందేమి లేదని పేర్కొన్నారు. 70 ఏళ్ల స్వాతంత్య్రంలో ఇప్పటికి గ్రామాల్లో కరెంటు, తాగు, సాగునీరు అందకపోవడం శోచనీయమని తెలిపారు. దేశంలో ఎన్నో జీవ నదులున్నా జాతీయ పార్టీలు అధికారంలో ఉండి సద్వినియోగం చేసుకోలేకపోయాయని, రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధర కల్పించడం లేదని కేసీఆర్ చెప్పిన మాటలు వంద శాతం వాస్తవమేనని పేర్కొన్నారు. వ్యవసాయ రంగాన్ని జాతీయ పార్టీలు పట్టించుకోవడం లేదని తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమం ద్వారా సాధించిన తెలంగాణ రాష్ట్రాన్ని దేశం గర్వించేలా అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు. సాగు, తాగునీరు, విద్యుత్, విద్య, వైద్యం, రవాణా రంగాల్లో తెలంగాణ రాష్ట్రం అద్భుత ఫలితాలు సాధించామని గుర్తు చేశారు. దేశ రాజకీయాలను సైతం మార్చగల శక్తి కేసీఆర్కు ఉందని, సీఎం ప్రకటన ప్రకంపనలు సృష్టిస్తున్నాయని, దేశ వ్యాప్తంగా రాజకీయ నాయకులు మద్దతు పలుకుతున్నారని తెలిపారు. కేసీఆర్ వెంట తాము ఎల్లవేళలా ఉంటామని స్పష్టం చేశారు. -
కోర్టుకు హాజరయిన మంత్రి రామన్న
ఆదిలాబాద్: ఆదిలాబాద్లోని జిల్లా కోర్టుకు రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న, టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, కాంగ్రెస్ నేత అరవిందరెడ్డి సోమవారం హాజరయ్యారు. 2012లో ఉప ఎన్నికల ప్రచారం సందర్భంగా జిల్లా కేంద్రం ఆదిలాబాద్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎన్నికల కోడ్ ఉల్లంగించారని అప్పటి ఎన్నికల అధికారి గుగ్లోత్ రవినాయక్ కేసు నమోదు చేశారు. కేసుకు సంబంధించి ముగ్గురు కోర్టుకు హాజరుకాగా ఏప్రిల్ 4వ తేదీకి కేసు వాయిదా వేసింది. దీంతోపాటు 2010లో ఎమ్మెల్యేగా ఉన్న జోగు రామన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్రమంగా సంపాదించారని వ్యాఖ్యలు చేయడంతో కాంగ్రెస్ పార్టీ నేత సంజీవ్రెడ్డి పరువు నష్ట దావా కేసు వేశారు. ఈ కేసుకు సంబంధించి కూడా జోగు రామన్న కోర్టుకు హాజరు కాగా, ఈ నెల 27కు వాయిదా పడింది. -
గిరిజన జంటలకు సామూహిక పెళ్లిళ్లు
బెజ్జూర్(సిర్పూర్): కుమురం భీం జిల్లా బెజ్జూర్ మండలంలో సోమిని గ్రామ శివారు, ప్రాణహిత నది ఒడ్డున నిర్వహించిన సమ్మక్క–సారలమ్మ జాతరలో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆధ్వర్యంలో మంగళవారం 58 గిరిజన జంటలకు సామూహిక వివాహాలు జరిపించారు. మంత్రి జోగు రామన్న, ఐటీడీఏ చైర్మన్ లక్కెరావు, ఎమ్మెల్యే సతీమణి రమాదేవిలతో పాటు అరిగెల నాగేశ్వరరావు పెళ్లి పెద్దలుగా హాజరై గిరిజన జంటలను ఆశీర్వదించారు. నూతన వధూవరులకు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కుటుంబ సభ్యులు మంగళసూత్రాలు, మెట్టెలు అందించారు. ఎమ్మెల్యేతోపాటు మంత్రి నూతన వధూవరులకు గృహోపయోకరణ సామగ్రిని అందించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ కేసీఆర్ మంత్రి వర్గంలో ఉండి 58 నూతన జంటలను ఆశీర్వదించడం చాలా గర్వంగా ఉందన్నారు. ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మాట్లాడుతూ ఈ 58 జంటలే కాకుండా మరో 116 జంటలకు సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో సామూహిక వివాహాలు చేయిస్తానన్నారు. త్వరలో సిర్పూర్పేపర్ మిల్లును తెరిపించి కార్మికుల కష్టాలను తొలగించేంత వరకు నిద్రపోనన్నారు. కార్యక్రమంలో కోనేరు ట్రస్ట్ అధ్యక్షుడు కోనేరు వంశీ దంపతులు, జెడ్పీటీసీ సభ్యులు కోండ్ర శారద జగ్గాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
2019లో మరో 119 గురుకులాలు: జోగు రామన్న
హైదరాబాద్: వచ్చే ఏడాది మరో 119 గురుకుల పాఠశాలల ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తోందని బీసీ సంక్షేమ మంత్రి జోగు రామన్న చెప్పారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం బాటసింగారంలోని గురుకుల పాఠశాల విద్యార్థులకు నీట్, ఐఐటీలో ప్రత్యేక శిక్షణ కోసం ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ కార్యక్రమాన్ని మంత్రి బుధవారం ప్రారంభించారు. పూలే బీసీ సంక్షేమ గురుకుల విద్యా సంస్థ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్, బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ అనితారాజేంద్ర హాజరయ్యారు. గురుకులాల సంఖ్య పెంచడంతో పాటు కొత్త జిల్లాల ప్రకారం ప్రతి జిల్లాకు 2 డిగ్రీ కళాశాలల ఏర్పాటు చేస్తామన్నారు. గురుకుల విద్యార్థులు ఉన్నత చదువుల్లో పోటీని తట్టుకునేలా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో ప్రయోగాత్మకంగా నీట్, ఐఐటీ శిక్షణ తరగతులు ప్రారంభిం చామన్నారు. దీనిలో భాగంగా 19 గురుకులాలకు చెందిన 3,779 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి 386 మందిని ఎంపిక చేశామని, వారికి ఈ శిక్షణను ఇవ్వనున్నట్లు తెలిపారు. గురుకులాలకు పక్కా భవనాలను నిర్మించేందుకు కేసీఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు. గత విద్యా సంవత్సరంలో పదో తరగతి, ఇంటర్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులతో పాటు అధ్యాపకులను నగదు పురస్కారంతో సత్కరించారు. -
మంటలు ఆర్పేందుకు ఆస్ట్రేలియా టెక్నాలజీ
సాక్షి, హైదరాబాద్: అడవుల్లో మంటలను ఆర్పేందుకు ఆస్ట్రేలియా టెక్నాలజీని వినియోగిస్తామని అటవీ, పర్యావరణ మంత్రి జోగు రామన్న తెలిపారు. మంగళవారం సచివాలయంలోని ఆయన చాంబర్లో ఎఫ్డీసీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డితో కలిసి అటవీ అభివృద్ధి సంస్థ (ఎఫ్డీసీ) కార్యక్రమాలను సమీక్షించారు. ఎకో టూరిజంలో ప్రోత్సహించే చర్యల్లో భాగంగా నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ బ్యాక్ వాటర్తో నేరెడిగొమ్మ మండలం పెద్ద మునగాల గ్రామంలో రూ. రెండు కోట్లతో, మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చింతగూడ గ్రామంలో రూ. రెండు కోట్ల వ్యయంతో కొత్త ప్రాజెక్టులు చేపట్టినట్లు తెలిపారు. ఎకో టూరిజం అభివృద్ధికి అనువైన ప్రాంతాలను గుర్తించాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎఫ్డీసీకి యూకలిప్టస్ అమ్మకాల ద్వారా రూ.123 కోట్లు, వెదురు ద్వారా రూ.13 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. దేశంలోనే మొదటి సారిగా హైదరాబాద్ కొత్తగూడ బొటానికల్ గార్డెన్లో పాలపిట్ట సైక్లింగ్ పార్క్ను ఏర్పాటు చేశామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎఫ్డీసీ పూర్తిగా నిరాదరణకు గురైందని, రానున్న రోజుల్లో ఎఫ్డీసీని మరింత బలోపేతం చేస్తామని బండ నరేందర్రెడ్డి పేర్కొన్నారు. సమీక్షలో ఎఫ్డీసీ మేనేజింగ్ డైరెక్టర్ చందన్ మిత్రా సంస్థ పనితీరును పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. -
బీసీ గురుకుల విద్యార్థులకు ఐఐటీ శిక్షణ
సాక్షి, హైదరాబాద్: వెనుకబడ్డ తరగతుల (బీసీ) గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు శుభవార్త. ప్రతిభావంతులైన విద్యార్థులకు ఎంసెట్, ఐఐటీ, నీట్ వంటి ప్రవేశ పరీక్షల కోసం ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని మహాత్మా జ్యోతిభాపూలే వెనుకబడిన తరగతుల గురుకుల పాఠశాలల సొసైటీ నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేకంగా సీఓఈ (సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ) పేరిట శిక్షణ సంస్థను ఏర్పాటు చేసింది. విద్యార్థులు ఇంటర్మీడియెట్ చదువుతున్నప్పుడే దీర్ఘకాలిక శిక్షణ ఇస్తే ప్రవేశ పరీక్షల్లో అత్యుత్తమ ర్యాంకులతో పాటు ప్రఖ్యాత విద్యా సంస్థల్లో సీట్లు వస్తాయని భావించిన అధికారులు ఈమేరకు చర్యలు వేగవంతం చేశారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 19 బీసీ గురుకుల జూనియర్ కాలేజీలున్నాయి. వీటి పరిధిలో దాదాపు 5 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇందులో ప్రతిభావంతులను గుర్తించి వారికి ప్రత్యేక కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు ఇటీవల అర్హత పరీక్ష నిర్వహించిన యంత్రాంగం 360 మందిని అర్హులుగా గుర్తించింది. ఈ విద్యార్థులను సీఓఈ కేంద్రంలో శిక్షణ ఇచ్చి తీర్చిదిద్దుతారు. ఒకటి రెండురోజుల్లో తరగతులు ప్రారంభం సీఓఈని ప్రస్తుతం హైదరాబాద్లోని హయత్నగర్లో ప్రారంభించనున్నారు. ఈ మేరకు హయత్నగర్ మండలం బాటసింగారం సమీపంలో ఉన్న ఓ ఇంజనీరింగ్ కాలేజీ భవనాన్ని అద్దెకు తీసుకున్నారు. ఇప్పటికే అర్హులను గుర్తించిన అధికారులు, ఒకట్రెండు రోజుల్లో అక్కడ తరగతులు ప్రారంభించనున్నారు. 360 మంది అభ్యర్థులను ఎంపిక చేయగా... ఇందులో ఇంటర్మీడియెట్ ఫస్టియర్కు చెందిన 180 మంది, సెకండియర్ చదువుతున్న 180 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో సగంమంది బాలికలున్నారు. విద్యార్థులకు గురుకుల పాఠశాలలో నిర్వహించే తరగతులతో పాటు అదనపు శిక్షణ కోసం ప్రత్యేకంగా సబ్జెక్ట్ నిపుణులతో శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. ప్రధాన సబ్జెక్టులకు సంబంధించి అ«ధ్యాపకులను సైతం నియమించారు. ఈ కేంద్రాన్ని రెండ్రోజుల్లో బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న ప్రారంభించనున్నారు. వారాంతంలోగా తరగతులు ప్రారంభించనున్నట్లు గురుకుల సొసైటీ కార్యదర్శి మల్లయ్యభట్టు ‘సాక్షి’కి తెలిపారు. -
ఆదివాసీల డిమాండ్పై స్పష్టత ఉంది
సాక్షి, ఆదిలాబాద్: ఆదివాసీల డిమాండ్పై ప్రభుత్వానికి స్పష్టత ఉందని అటవీ, పర్యావరణ, బీసీ సం క్షేమ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో నాగోబా జాతర సందర్భంగా శుక్రవారం నిర్వహించిన దర్బార్లో రామన్న మాట్లాడారు. రాజ్యాంగబద్ధంగా హక్కులను అమలు చేసే విషయంలో సీఎం కేసీఆర్ ప్రణాళికలు చేస్తున్నారని తెలిపారు. ఆదివాసీ, లంబాడీల మధ్య తలెత్తిన వివాదం సున్నితమైందని, ప్రభుత్వం తరఫున సీఎస్, డీజీపీలు ఇరువర్గాలతో చర్చించారని వివరించారు. నాగోబా దర్బార్లో ఆదివాసీలు తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను ప్రభు త్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని, శాంతియుతంగా ఉద్యమాలు నిర్వహించి ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ఎంపీ గోడం నగేశ్ మాట్లాడుతూ మేడారం జాతర తర్వాత మలి విడత చర్చలు జరిపి, వివాదాన్ని పరిష్కరించేందుకు ప్రభు త్వం ఆలోచన చేస్తోందన్నారు. ఏజెన్సీ ధ్రువీకరణ పత్రాలు, ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో సీట్లు, ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు తదితర అంశాలలో ఆదివాసీలకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ జెడ్పీ చైర్పర్సన్ వి.శోభారాణి, ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్, మంచిర్యాల జిల్లా కలెక్టర్, ఇన్చార్జి ఐటీడీఏ పీవో ఆర్వీ కర్ణన్, ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ విష్ణు ఎస్.వారియర్ తదితరులు పాల్గొన్నారు. ఎస్టీ జాబితా నుంచి తొలగించాల్సిందే.. దర్బార్ సందర్భంగా ప్రభుత్వం ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి ఆదివాసీల నుంచి అర్జీలు స్వీకరించింది. సాధారణంగా దర్బార్లో ఆదివాసీలు తాము ఎదుర్కొంటున్న సమస్యలకు సంబంధించి అర్జీలు అందజేస్తారు. కానీ, ఈసారి లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలనే ఏకైక డిమాండ్తో అర్జీలు అందజేయడం గమనార్హం. దర్బార్ వేదికపై నుంచి ఆదివాసీ నాయకులు మాట్లాడుతూ ఇదే డిమాండ్ను ప్రధానంగా ప్రస్తావించారు. పోటెత్తిన కేస్లాపూర్ దర్బార్ సందర్భంగా తెలంగాణతోపాటు వివిధ రాష్ట్రాల నుంచి జాతరకు తరలివచ్చిన ఆదివాసీలతో కేస్లాపూర్ పోటెత్తింది. పరిసరాల్లో ఎక్కడ చూసినా జనమే కనిపించారు. ఈ నెల 16న ప్రారంభమైన నాగోబా జాతర శుక్రవారం దర్బార్తో అధికారికంగా ముగిసింది. మరో రెండు, మూడు రోజులపాటు ఆదివాసీలు నాగోబాను దర్శించుకుంటారు. -
నా మాటలను వక్రీకరించారు
సాక్షి, ఆసిఫాబాద్: ఆదివాసీల ఉద్యమం వెనుక మాజీ మావోయిస్టులు ఉన్నారని తానెప్పుడూ అనలేదని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. కావాలనే కొందరు తన మాటలను వక్రీకరించారని పేర్కొనారు. సోమవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్రెడ్డి చెప్పిన మాటలను తాను చెబితే కొందరు వక్రీకరించారని అన్నారు. అల్లర్ల వెనుక మావోయిస్టులు ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం కానీ, తాను కానీ ఎక్కడా అనలేదని తెలిపారు. కావాలనే కొంతమంది తనపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ఇటీవల ఆసిఫాబాద్లో జరిగిన విలేకర్ల సమావేశంలో తాను డీజీపీ పేర్కొన్న విధంగా అలర్లను అదనుగా తీసుకుని అదృశ్యశక్తులు బలపడతాయనే విషయాన్ని చెప్పానే తప్ప ఆదివాసీ ఉద్యమానికి, మావోయిస్టులకు సంబంధం ఉందని చెప్పలేదని స్పష్టం చేశారు. ఆదివాసీల సమస్యలకు రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా పరిష్కారం చూపుతుందన్నారు. చర్చల ద్వారానే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని పేర్కొన్నారు. ఏజెన్సీలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా అందరూ సమన్వయంతో మెలగాలని సూచించారు. ఏదైనా సమస్య ఉంటే తమకు విన్నవిస్తే పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. -
‘గద్వాల జిల్లా కేంద్రంలో బీసీ స్టడీ సర్కిల్’
సాక్షి, హైదరాబాద్: గద్వాల జిల్లా కేంద్రంలో బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న పేర్కొన్నారు. అలాగే గట్టులో బీసీ బాలికల గురుకుల పాఠశాల కూడా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. శుక్రవారం మంత్రి జోగురామన్నను బీసీ కమిషన్ సభ్యుడు ఆంజనేయ గౌడ్ కలిశారు. అక్షరాస్యత, ఉపాధి కల్పనలో జిల్లా వెనకబడి ఉన్నందున అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రిని కోరారు. వీటిపై ప్రాధాన్యత క్రమంలో చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. -
రిమ్స్లో మంత్రి ఆకస్మిక తనిఖీ
ఆదిలాబాద్: రాష్ట్ర అటవీ, బీసీ శాఖ మంత్రి జోగు రామన్న సోమవారం జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. సుమారు గంటపాటు ఆస్పత్రిలోని అన్ని వార్డులను తిరుగుతూ పరిశీలించారు. రోగులు, వారి బంధువులతో మాట్లాడి వైద్యసేవల గురించి తెలుసుకున్నారు. పారిశుధ్య నిర్వహణ తీరు సరిగా లేదని మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. వార్డుల్లో అపరిశుభ్రత లేకుండా చూడాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం రిమ్స్ అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. నిరుపేదలకు వైద్యసేవలు అందించేందుకు అధునాతన సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. గతంలో వైద్యం కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లే వారని, ఇప్పుడు ఆ బాధ తప్పిందన్నారు. ఆస్పత్రిలో రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సదుపాయాలు కల్పించాలని, వైద్యసేవలపై నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదన్నారు. పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కార్మికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. మున్సిపల్ చైర్పర్సన్ మనీశ తదితరులున్నారు. -
ప్రతిపక్షాల డిపాజిట్లు గల్లంతు
బేల(ఆదిలాబాద్): వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, బీజేపీ డిపాజిట్లు గల్లంతవుతాయని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. గురువారం మండల బేలతోపాటు మశాల(బి), దహెగాం, మణియార్పూర్, గూడ, కాంఘర్పూర్, బెదోడ, సాంగిడి గ్రామాల్లో మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. బేలలోని సబ్ మార్కెట్ యార్డులో జైనథ్ మార్కెట్ కమిటీ నిధులు రూ.1.25 కోట్ల వ్యయంతో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులను సంఘటితం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేసిందని చెప్పారు. రైతు సమితులు దీర్ఘకాలికంగా ఉన్న భూ సమస్యలు పరిష్కారం చేసే ప్రక్రియలో భాగంగా భూ ప్రక్షాళన కోసం పనిచేస్తాయని తెలిపారు. వచ్చే ఖరీప్ సీజన్ నుంచి ప్రభుత్వం రైతులకు వ్యవసాయం కోసం ఆర్థిక చేయూత అందించడానికి ప్రారంభించనున్న పెట్టుబడి పథకానికి పరిశీలన కోసం ఈ సమితులు కీలకంగా పనిచేస్తాయని అన్నారు. ప్రభుత్వం బతుకమ్మ సంబరాల్లో భాగంగా ఆడపడుచులకు ప్రేమతో చీరలు పంపిణీ చేస్తోందని, ఎక్కడో ఒకట్రెండు చీరలు సరిగా లేకపోతే.. ఆ చీరలను కాల్చడం, ప్రతిపక్ష పార్టీలు రాద్ధాంతం చేయడం సరికాదని పేర్కొన్నారు. ఇష్టముంటేనే ఆడపడుచులు ఈ చీరలను తీసుకోవాలని తెలిపారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పనప్పటికీ తమ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ రావుత్ మనోహర్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ జిల్లా ఆర్గనైజర్ కస్తాల ప్రేమల, టీఆర్ఎస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు టాక్రే గంభీర్, మండల అధ్యక్షుడు ఓల్లఫ్వార్ దేవన్న, ప్రధాన కార్యదర్శి ప్రమోద్రెడ్డి, నాయకులు మస్కే తేజ్రావు, బండి సుదర్శన్, నిపుంగే సంజయ్, జక్కుల మధుకర్, వట్టిపెల్లి ఇంద్రశేఖర్, తన్వీర్ఖాన్, ఆయా గ్రామాల సర్పంచ్లు పాల్గొన్నారు. -
నేతన్నలను ఆదుకుంటాం
►రాష్ట్ర అటవీశాఖ మంత్రి జోగు రామన్న ►జిల్లా పరిషత్లో జాతీయ చేనేత దినోత్సవం ఆదిలాబాద్అర్బన్: తెలంగాణ ప్రభుత్వం నేతన్నలను ఆదుకునేలా చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా పట్టణంలోని కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి మొక్కలు నాటారు. అనంతరం అక్కడి నుంచి జిల్లా పరిషత్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించడంతోపాటు రుణాలు మాఫీ చేసినట్లు చెప్పారు. పాఠశాలలు, వసతిగృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదివే విద్యార్థుల యూనిఫారాల కోసం చేనేత కార్మికులకు ఆర్డర్లు ఇచ్చామన్నారు. చేనేత కార్మికుల కోసం బడ్జెట్లో రూ.1,286 కోట్లు కేటాయించడం, కులవృత్తుల వారికి నైపుణ్య శిక్షణ ఇచ్చి పరిశ్రమల స్థాపనకు రుణాలు, భూములు ఇవ్వడం జరుగుతుందన్నారు. చేనేత వస్త్రాలను ధరించిన పాత రోజులు మళ్లీ పునరావృతం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్ ఎం.జ్యోతిబుద్ధ ప్రకాశ్ మాట్లాడుతూ జిల్లాలో చేనేత ఉత్పత్తులు లేకున్నా మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తామన్నారు. సాంకేతిక పరంగా అభివృద్ధి చెంది పవర్లూమ్స్ రావడంతో హ్యాండ్లూమ్స్ కొంత మేరకు తగ్గిందన్నారు. ఇండియా చేనేత ఉత్పత్తులకు ఇతర దేశాల్లో మంచి గీరాకీ ఉందన్నారు. జిల్లా స్థాయిలో చేనేత కార్మికులను ఆదుకుంటామన్నారు. హ్యాండ్లూమ్కు మంచి భవిష్యత్ వస్తుందన్నారు. అనంతరం బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, మున్సిపల్ చైర్పర్సన్ రంగినేని మనీశ మాట్లాడుతూ.. నియోజకవర్గంలో 32వేల చేనేత కుటుంబాలుండేవని, ప్రస్తుతం 32కుటుంబాలు కూడా లేవన్నారు. అంతకుముందు పద్మశాలీ కుల పెద్దలను సన్మానించారు. -
జయశంకర్ సార్కు నివాళి
ఘనంగా 83వ జయంతి ఆదిలాబాద్టౌన్: తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతిని ఆదివారం జిల్లా అంతటా ఘనంగా జరుపుకున్నారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్లోగల జయశంకర్ విగ్రహానికి రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ జయశంకర్ సార్ చూపిన బాటలో నడవాలన్నారు. తెలంగాణ ఏర్పాటుకు మార్గదర్శకునిగా ఉన్న ఆయన స్వరాష్ట్రం ఏర్పడ్డాక లేకపోవడం బాధాకరమన్నారు. ప్రతిఒక్కరూ ప్రొఫెసర్ ఆశయసాధనకు కృషి చేయాలన్నారు. రాష్ట్ర డెయిరీ డెవలప్మెంట్ చైర్మన్ లోక భూమారెడ్డి, డీసీసీబీ చైర్మన్ దామోదర్రెడ్డి, నాయకులు గంగారెడ్డి, నారాయణ, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్లో.. ఆదిలాబాద్అర్బన్: జయశంకర్ సార్ జయంతిని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. జేసీ కృష్ణారెడ్డి, డీఆర్వో బానోత్ శంకర్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ రాష్ట్ర సాధనకు అహర్నిషలు కృషి చేసిన జయశంకర్ సార్ను స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ఆయన కృషి మరువలేనిదని కొనియాడారు. ఆర్డీవో సూర్యనారాయణ, కలెక్టరేట్ ఏవో సంజయ్కుమార్, పర్యవేక్షకులు సుశీల, ఇన్చార్జి డీసీఎస్వో తనూజ పాల్గొన్నారు. పోలీస్ క్యాంపు కార్యాలయంలో.. ఆదిలాబాద్: పోలీసు క్యాంప్ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఎస్పీ ఎం.శ్రీనివాస్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఆయన పోషించిన పాత్ర మ రువలేనిదన్నారు. స్పెషల్బ్రాంచ్ ఎస్సైలు అన్వర్ ఉల్హఖ్, రామన్న, సీసీ పోతరాజు, ఫింగర్ప్రింట్ అధికా రి అశోక్కుమార్, సిబ్బంది కృష్ణమూర్తి, ప్రకాశ్రెడ్డి, అ బ్దుల్లా, సత్యనారాయణ, షకీల్, వెంకట్ పాల్గొన్నారు. -
బీసీ యువతకు 102 కోట్ల రాయితీ రుణాలు
వారం రోజుల్లో ఆర్థిక శాఖ ఆమోదం: మంత్రి జోగు రామన్న సాక్షి, హైదరాబాద్: బీసీ యువతకు స్వయం ఉపాధి పథకం కింద 2017–18 వార్షిక సంవ త్సరంలో ఇచ్చే రుణాలపై రూ.102 కోట్ల రాయితీ ఇవ్వనున్నట్లు బీసీ సంక్షేమశాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. వారం రోజుల్లో ఆర్థిక శాఖ ఆమోదం లభిస్తుందని, ఈ ప్రక్రియ ముగిసిన వెం టనే క్షేత్ర స్థాయిలో లబ్ధిదారుల ఎంపిక చేపడ తామన్నారు. గురువారం బీసీ సంక్షేమ భవన్లో ఆ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. వచ్చే నెలలో రాష్ట్ర వ్యాప్తంగా 119 గురు కుల పాఠశాలలు ప్రారం భిస్తున్నట్లు తెలిపారు. గురుకులాలు అన్ని సౌకర్యా లతో శాశ్వత భవనాల్లో నిర్మించేందుకు స్థలాలను గుర్తించామని, విడతల వారీగా నిర్మాణాలు పూర్తి చేస్తామన్నారు. గతంలో హాస్టల్ విద్యార్థులకు నెలకు 4 సార్లు మాంసాహారాన్ని అందించగా, ప్రస్తుతం 7 సార్లు ఇస్తున్నామన్నారు. కల్యాణలక్ష్మి పథకాన్ని పక్కాగా అమలు చేయాలని సూచించారు. బీసీ విదేశీ విద్యా నిధి పథకం కింద త్వరలో దరఖాస్తుల సంఖ్య భారీగా పెరగనుందని, అధికారులు సకాలంలో నిధులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి అశోక్కుమార్, అదనపు కార్యదర్శి సైదా, కమిషనర్ అరుణ, జేడీలు అలోక్కుమార్, బీసీ కార్పొరేషన్ ఎండీ మల్లయ్యభట్టు తదితరులు పాల్గొన్నారు. -
గిరిజన సంక్షేమమే ప్రభుత్వ ఎజెండా
మంత్రులు అల్లోల, జోగు నాగోబా సన్నిధిలో ప్రజాదర్బార్ ఉట్నూర్: గిరిజన సంక్షేమమే ప్రధాన ఎజెండాగా ఆదివాసీ గిరిజనుల అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, ఆదివాసీల ఆరాధ్యదైవం నాగోబా ఆలయాన్ని శాశ్వతంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని రాష్ట్ర దేవదాయ, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, అటవీ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్నలు పేర్కొన్నారు. సోమవారం ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లోని నాగోబా ఆలయ సన్నిధిలో నిర్వహించిన ప్రజాదర్బార్లో వారు మాట్లాడుతూ నాగోబా అలయంలో శాశ్వత అభివృద్ధి పనులకు ప్రభుత్వం రూ.4 కోట్లు కేటాయించిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాలు జాతర నిర్వహణకు రూ.పది లక్షలు మాత్రమే కేటాయించాయన్నారు. ఉట్నూర్ కేంద్రంగా ఉన్న ఐటీడీఏ ఉమ్మడి జిల్లాల్లోని గిరిజనుల అభివృద్ధి కోసం పని చేస్తోందని, ఐటీడీఏకు త్వరలోనే పూర్తిస్థాయి ప్రాజెక్టు అధికారిని నియమించేలా చర్యలు చేపడతామని అన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కుమ్రం భీం ప్రాంతం జోడేఘాట్ అభివృద్ధికి రూ.25 కోట్లు ఖర్చు చేసిందన్నారు. వచ్చే పంచాయతీ ఎన్నికల నాటికి ఐదు వందల జానాభా ఉన్న గిరిజన తండాలు, గూడాలను పంచాయతీలుగా గుర్తించి ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. ప్రజాదర్బార్లో ఆదిలాబాద్ ఎంపీ గెడం నాగేశ్, ఖానాపూర్, బోథ్ ఎమ్మెల్యేలు అజ్మీరా రేఖ, రాథోడ్ బాపురావు, ఆదిలాబాద్, మంచిర్యాల, కుమ్రం భీం జిల్లా కలెక్టర్లు, జ్యోతి బుద్దప్రకాశ్, ఆర్వీ కర్ణన్, చంపాలాల్, ఆదిలాబాద్ ఏస్పీ శ్రీనివాస్, ట్రైనీ కలెక్టర్ అనురాగ్ జయంతి, రాయి సెంటర్ జిల్లా గౌరవ అధ్యక్షుడు లక్కెరావ్, ఆలయ కమిటీ చైర్మన్ మెస్రం ఆనంద్రావ్ పాల్గొన్నారు. సతి స్థానంలో పతి నాగోబా ఆలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాదర్బార్లో సతుల స్థానంలో పతులు వేదికపై కూర్చున్నా రు. ప్రజాదర్బార్ సందర్భంగా మంత్రు లు, ఎంపీ, అధికారులు వేదికపై కూర్చున్నారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ను వేదికపై ఆహ్వానించారు. కార్యక్రమానికి ఆమె హాజరు కాలేదు. కానీ, ఆమె భర్త సత్యనారాయణగౌడ్ వేదికపైకి వచ్చి బోకే అందుకున్నారు. ఎమ్మెల్యే రేఖానాయక్తో పాటు ఆమె భర్త శ్యాంనాయక్ వేదికపై కూర్చున్నారు. -
మంత్రి కుమారుడిపై హత్య కేసు
హైదరాబాద్: తెలంగాణ అటవీ శాఖ మంత్రి జోగు రామన్న కుమారుడిపై హత్య కేసు నమోదైంది. ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలం లక్ష్మీపూర్కు చెందిన కాంగ్రెస్ కార్యకర్త తిరుపతిరెడ్డి హత్య కేసులో మంత్రి కుమారుడు ప్రేమ్చంద్ నిందితుడని ఆరోపణలు వినపడుతున్నాయి. ఈ నేపథ్యంలో మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు ఆధారంగా ఇతనితోపాటు అదే గ్రామానికి చెందిన మరో తొమ్మిదిమంది టీఆర్ఎస్ నాయకులపై పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. ఈ హత్యపై రెండు రోజులుగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు ప్రేమ్చంద్పై పోలీసులు కేసు నమోదు చేశారు. -
ముస్లిం, ఎస్టీ రిజర్వేషన్లపై ముందుకే
ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టీకరణ - వాటి పెంపునకు రాజ్యాంగ ప్రక్రియ ప్రారంభించండి - తమిళనాడు తరహా వ్యూహం ఖరారు చేయండి - అక్కడికెళ్లి అధ్యయనం చేయండి.. అవసరమైతే నేనూ వస్తా - అధికారులకు సీఎం ఆదేశాలు.. కోర్టు రద్దు చేసేలా ఉండొద్దు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పేద ముస్లింలు, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు పునరుద్ఘాటించారు. ఎన్నికల హామీ మేరకు ఈ రెండు వర్గాలకు రిజర్లేషన్లు పెంచి తీరుతామని స్పష్టం చేశారు. వారికి రిజర్వేషన్ల పెంపుకు అవసరమైన రాజ్యాంగబద్ధ ప్రక్రియను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. రిజర్వేషన్లు 50 శాతానికి మించి ఉండకూడదనే కోర్టు ఉత్తర్వులను దృష్టిలో పెట్టుకుని వ్యూహాన్ని ఖరారు చేయాల్సిందిగా సూచించారు. ముస్లింలు, ఎస్టీలకు రిజర్వేషన్ల పెంపుపై బుధవారం ప్రగతిభవన్లో సీఎం చర్చలు జరిపారు. బీసీ సంక్షేమ మంత్రి జోగు రామన్న, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, బీసీ కమీషన్ చైర్మన్ బీఎస్ రాములు, సభ్యులు వకుళాభరణం కృష్ణమోహన్, జూలూరి గౌరీశంకర్, ఆంజనేయులు గౌడ్తో పాటు ముస్లింల స్థితిగతులపై అధ్యయనం జరిపిన కమీషన్ ఛైర్మన్ సుధీర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర, అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి, సీఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ్రావు, న్యాయ శాఖ కార్యదర్శి సంతోష్రెడ్డి సమీక్షలో పాల్గొన్నారు. రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అధికంగా ఉన్నారని, వారిలో ఎక్కువ శాతం సామాజిక, ఆర్ధిక, విద్యాపరమైన వెనుకబాటుతనం అనుభవిస్తున్నారని ఈ సందర్భంగా సీఎం ఆవేదన వెలిబుచ్చారు. ఈ విషయాల్లో వారు ముందడుగు వేయాల్సిన అవసరముందన్నారు. ‘‘సామా జిక అంతరాలు, ఆర్ధిక అసమానతలు, వెనుకబాటుతనం వల్లే యువతలో నిరాశ నిస్పృహలు నెలకొన్నాయి. వీటిపై గతంలో ఎన్నో ఉద్యమాలు జరిగాయి. ప్రాణనష్టం జరిగింది. కొత్త రాష్ట్రంలో ఈ పరిస్థితి మారాలి. పేదరికం అనుభవిస్తున్న బలహీన వర్గాలకు ప్రభుత్వ తోడ్పాటు అందాలి. వారి జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు అందినప్పుడే వారి జీవితాల్లో మార్పు వస్తుంది. రిజర్వేషన్ల పెంపుకు త్రికరణ శుధ్దితో పని చేయాల్సి ఉంది. రిజర్వేషన్ల పెంపు కోర్టు వివాదాల్లో చిక్కుకోకుండా, ఎవరూ ప్రశ్నించలేని విధంగా ప్రక్రియను నిర్వహించాలి’’ అని విస్పష్టంగా సూచించారు. కేంద్రంపై ఒత్తిడి పెంచుతాం అందరికీ ఒకే న్యాయం ఉండాలని, అన్ని రాష్ట్రాలకూ ఒకే చట్టం అమలు కావా లని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ‘‘తమిళనాడులో అక్కడి బలహీనవర్గాలకు జనాభాకు అనుగుణంగా 69 శాతం రిజర్వే షన్లు అమలవుతున్నాయి. మిగతా రాష్ట్రా ల్లో మాత్రం 50 శాతం మించకుండా కోర్టు తీర్పులున్నాయి. మన రాష్ట్రంలోనూ రిజర్వే షన్లు పెంచి తీరాలి. ముందుగా ముస్లింలు, ఎస్టీలు జనాభా నిష్పత్తిలో రిజర్వేషన్లు పొందాలి. దీనిపై అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపుతాం. తెలంగాణలో ముస్లింలు, ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచే అంశాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాల్సిందిగా కేంద్రంపై ఒత్తిడి పెంచుదాం. తమిళనాడులో అనుసరించాల్సిన వ్యూహం, రిజర్వేషన్లు పెంపు నేపథ్యంపై అధ్యయనానికి అధికారుల బృందం త్వర లో చెన్నై వెళ్లి రావాలి. అవసరమైతే నేను కూడా వెళ్లి సంబంధిత అధికారులు, న్యా య నిపుణులతో చర్చిస్తా. మనం రిజ ర్వేషన్లను పెంచడం, కోర్టు దాన్ని రద్దు చేయడం జరగకూడదు. పెంచిన రిజర్వేష న్లు అమలయ్యేలా మన విధానం ఉండాలి’’ అని సీఎం స్పష్టం చేశారు. ఉమ్మడి ఏపీలో జనాభాకు అనుగుణంగా ఎస్టీలకు 6 శాతం రిజర్వేషన్ అమలయిందని, కానీ తెలంగా ణలో ఎస్టీల జనాభా 9 శాతానికి పైగా ఉం దని ఆయన తెలిపారు. రాజ్యాగం ప్రకారం ఎస్టీలకు సైతం జనాభా ఆధారంగా రిజర్వే షన్లు అమలు కావాల్సి ఉందన్నారు. -
త్వరలో అటవీశాఖలో పోస్టుల భర్తీ
హరితహారం కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టాలి జిల్లాలో 1.80 కోట్ల మొక్కలు పెంచేందుకు చర్యలు రివ్యూ సమావేశంలో అటవీశాఖ మంత్రి జోగు రామన్న ఖమ్మం: త్వరలో అటవీశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు కృషి చేస్తామని రాష్ట్ర అటవీ, వెనుకబడిన తిరుగతుల శాఖ మంత్రి జోగు రామన్న పేర్కొన్నారు. ఆదివారం జిల్లా పర్యటనలో భాగంగా అటవీశాఖ కార్యాలయంలో అటవీ, బీసీ సంక్షేమ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జోగు రామన్న మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టేందుకు కార్యాచరణ ప్రణాళికతో ముందుకెళ్లాలన్నారు. హరితహారం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. నాటిన మొక్కలను సంరక్షించడంలో అధికారుల తమ వంతు బాధ్యతగా చర్యలు చేపట్టాలన్నారు. వర్షాభావ పరిస్థితులున్న ప్రాంతంలో మొక్కల సంరక్షణకు ఎక్కువ ప్రాధాన్యత కల్పించాలని సూచించారు. కొత్తగా జిల్లాల పునర్విభజన నేపథ్యంలో అటవీశాఖలో రేంజ్ ఆఫీసర్ స్థాయి, ఇతర అధికారుల సంఖ్యను పెంచడం జరిగిందని, కార్యాలయాల వసతి, పోస్టుల ఖాళీ వివరాలను అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే అటవీశాఖలోని ఖాళీలను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. బీసీ సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి మాట్లాడుతూ హాస్టళ్లలో విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. జిల్లా కలెక్టర్ డి.ఎస్.లోకేష్కుమార్ మాట్లాడుతూ హరితహారం కార్యక్రమం ద్వారా జిల్లాలో 3 కోట్ల 88 లక్షల మొక్కలను నాటామని, వీటిలో 90 శాతం వరకు మొక్కలను సంరక్షించుకున్నామని అన్నారు. వర్షాభావ పరిస్థితులున్న తిరుమలాయపాలెం, నేలకొండపల్లి, ముదిగొండ, కూసుమంచి మండలాల్లో 80 శాతం వరకు మొక్కలు సంరక్షించడం జరిగిందన్నారు. నర్సరీలలో మొక్కలు పెంచే ప్రణాళికలను కలెక్టర్ వివరించారు. జిల్లాలో కోటీ 80 లక్షల మొక్కలను నాటాలనే లక్ష్యంతో ప్రణాళిక రూపొందించడం జరిగిందని, ఇందుకుగాను 2 కోట్ల మొక్కలను పెంచేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. -
హైదరాబాద్లో సైన్స్ సిటీ
హైదరాబాద్: తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ ద్వారా 5-డీ థియేటర్లు తదితరాల ఏర్పాటునకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్లు అటవీ, పర్యావరణ, శాస్త్ర,సాంకేతికశాఖల మంత్రి జోగు రామన్న తెలిపారు. ఈ ప్రాజెక్టులో భాగంగా వివిధ పెవిలియన్లు ఏర్పాటు చేయనున్నట్లు, పిల్లల్లో సైన్స్ పట్ల అవగాహన, భౌతిక, రసాయన, జీవ శాస్త్రాలు, అంతరిక్ష పరిశోధన, రాకెట్ మోడల్స్, పవన, జీవశక్తి, భూగోళశాస్త్ర వివరాలను పొందపరచనున్నట్లు తెలియజేశారు. వివిధ ప్రాంతాల్లో సైన్స్ సెంటర్లు, ప్రజోపయోగకరమైన పరిశోధన, సైంటిస్టులు, అధ్యాపకులు, రిసెర్చీ స్కాలర్లు, విద్యార్థులకు వివిధ శాస్త్ర సాంకేతిక కార్యక్రమాలను అమలు చేసేందుకు ప్రభుత్వం సంకల్పించిందన్నారు. గురువారం సచివాలయంలో తెలంగాణ స్టేట్ శాస్త్ర, సాంకేతిక శాఖ వెబ్సెట్, లోగోను ఆవిష్కరించారు. ఈ శాఖ సభ్యకార్యదర్శి వై.నగేశ్కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జోగురామన్న విలేకరులతో మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.160 కోట్లు కాగా అందులో కేంద్ర ప్రభుత్వం రూ.66 కోట్లు, హెచ్ఎండీఏ రూ.40 కోట్ల వరకు భరించనుండగా, మిగిలిన మొత్తాన్ని ప్రైవేట్,పబ్లిక్ పద్ధతిలో ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, హెచ్ఎండీఏ, పర్యాటక, సాంస్కృతిక శాఖల ద్వారా ఈ సైన్స్ సిటీ ఏర్పాటునకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఉమ్మడి రాష్ర్టంలో 2014లో రంగారెడ్డి జిల్లాలోన బుద్వేల్ సమీపంలో సుమారు 80 ఎకరాల స్థలాన్ని గుర్తించి కేంద్రానికి ప్రతిపాదనలు పంపించారన్నారు. ఈ ప్రాజెక్టు సాధన కోసం తమ ప్రభుత్వం వచ్చాక వివిధ రూపాల్లో ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో సాంకేతికపరంగా చోటుచేసుకునే మార్పుచేర్పులకు సంబంధించిన అంశాలు, శాస్త్ర, సాంకేతిక శాఖ ద్వారా చేపట్టే కార్యక్రమాలు, వర్క్షాపు వివరాలు తదితర అంశాలను www.tscost.telangana.gov.in వెబ్సైట్లో పొందుపరచనున్నట్లు తెలియజేశారు. కొత్త పరిశోధనలు.. ఈ శాఖ ద్వారా కొమరం భీమ్ జిల్లా కెరమెరి మండలం ఎగువప్రాంతాల్లో ఆపిల్, మల్బరీ సాగుకు గల అవకాశాలపై సీసీఎంబీ సహకారంతో పరిశీలన, ఆముదం పంటకు వచ్చే గ్రేమోల్డ్ రోగ నివారణ పద్ధతులను రూపొందించడంపై మహబూబ్నగర్ జిల్లాలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ రిసెర్చీ ద్వారా వర్షపు నీటి వినియోగించి ఫ్లోరైడ్ సమస్యను తగ్గించేందుకు నల్లగొండ జిల్లాలో జేఎన్టీయూ, సెంటర్ వాటర్ రిసోర్సెస్ ద్వారా పరిశోధనలు, రైతులు, వినియోగదారుల ప్రయోజనార్దం తృణ ధాన్యాల నిల్వ కాలాన్ని పెంపొందించడంపై ఓయూ, ఇక్రిశాట్ల సహకారంతో పరిశోధనలు నిర్వహిస్తున్నట్లు జోగురామన్న తెలిపారు. -
మున్సిపల్ అభివృద్ధికి సహకరించాలి
కబ్జా భూములు తేల్చేందుకు కమిటీ అటవీ శాఖ మంత్రి జోగు రామన్న ఆదిలాబాద్ మున్సిపల్ అధికారులతో సమీక్ష ఆదిలాబాద్ అర్బన్ : ఆదిలాబాద్ మున్సిపాలిటీని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని, ఇందుకు అధికారులందరూ సహకరించాలని అటవీ శాఖ మంత్రి జోగు రామన్న కోరారు. రానున్న రెండున్నరేళ్లలో మున్సిపాలిటీలో ఎలాంటి సమస్యలు లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మున్సిపల్ చైర్పర్సన్ రంగినేని మనీశ అధ్యక్షతన ఆదిలాబాద్ మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణంలోని మున్సిపల్ పరిధిలోగల లీజ్ ల్యాండ్స్, కబ్జాకు గురైన స్థలాలు, భూములు, కోర్టు కేసులతో పెండింగ్లో భూముల వివరాలు సేకరించేందుకు ఒక కమిటీ వేయనున్నట్లు చెప్పారు. ఐదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి జేసీ సుందర్ అబ్నార్తో చర్చించారు. ముందుగా కార్యాలయం రికార్డ్సు ఉన్నాయా.. రికార్డులో ఉన్నది.. క్షేత్రస్థాయిలో ఉందా లేదా.. అనేది పరిశీలించాలని సూచించారు. ప్రస్తుతం ల్యాండ్ ఉందా.. కబ్జాకు గురైందా.. ఎంత మేరకు ఉంది.. అనే వివరాలు అధికారుల వద్ద ఉంచుకోవాలన్నారు. అనంతరం గత సమావేశంలో చర్చించిన అంశాలు ఏవి.. ఎంత మేరకు చర్యలు తీసుకున్నారో మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. మున్సిపల్కు సంబంధించిన ఆస్తులు, ఆదాయంపై దృష్టి పెట్టాలని సూచించారు. పట్టణంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలు పన్ను చెల్లించడం లేదని అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. పన్ను చెల్లించని కార్యాలయాలకు తాళాలు వేస్తే డబ్బులు అవే వస్తాయన్నారు. కలెక్టర్ కార్యాలయం, ఎస్సీ కార్పొరేషన్, అటవీ శాఖ, రోడ్డు భవనాల శాఖ తదితర ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన పన్ను బకాయిలు పెండింగ్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆదిలాబాద్ మున్సిపల్కు ఆదాయం గతేడాది రూ.9 కోట్లు కాగా, నెలకు రూ.65 లక్షల ఖర్చు ఉందని, ఇందులో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు, విద్యుత్ బిల్లులు, ఇతరాత్ర ఉన్నాయని వివరించారు. అధికారులు పనులపై దృష్టి పెడితే తప్పక ముందుంటామని మంత్రి తెలిపారు. సమావేశంలో జేసీ సుందర్అబ్నార్, మున్సిపల్ కమిషనర్ అలివేలు మంగతయారు, అధికారులు జగదీశ్వర్గౌడ్, అయాజ్, సాయికిరణ్, భాస్కర్రావు, సుమలత, అనురాధ, ప్రియాంక, శోభ, మమత, లక్ష్మి, సిబ్బంది పాల్గొన్నారు. -
6 రోజుల్లో 5.5 కోట్ల మొక్కలు
రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమంగా సాగుతున్న హరితహారం - ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 71 లక్షల మొక్కలు నాటిన ప్రజలు - ఏరోజుకారోజు సమీక్షిస్తున్న సీఎస్... సీఎంకు నివేదిక సాక్షి, హైదరాబాద్ : ఆకుపచ్చ తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమస్ఫూర్తితో సాగుతోంది. సీఎం కె.చంద్రశేఖర్రావు ఇచ్చిన పిలుపునకు స్పందించి స్కూళ్లు, కాలేజీల విద్యార్థులు, యాజమాన్యాలు, ప్రభుత్వ, ప్రైవేటురంగ సంస్థల ఉద్యోగులు, అధికారులు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతున్నారు. ఈ నెల 8న కార్యక్రమం మొదలైనప్పటి నుంచి 12వ తేదీ (మంగళవారం) వరకు ప్రజలు 4.42 కోట్ల మొక్కలను నాటినట్లు అధికారిక లెక్కలు విడుదలవగా బుధవారం రాష్ట్రవ్యాప్తంగా కోటికిపైగా మొక్కలను నాటినట్లు అంచనా. అడవుల జిల్లాలోనే అత్యధికంగా... అటవీశాఖ మంత్రి జోగు రామన్న ప్రాతినిధ్యం వహిస్తున్న ఆదిలాబాద్ జిల్లాలో మంగళవారం నాటికి అత్యధికంగా 61.54 లక్షల మొక్కలను నాటారు. బుధవారం మరో పది లక్షల మొక్కలు నాటినట్లు జిల్లా యంత్రాంగం పేర్కొంది. అలాగే నిజామాబాద్ జిల్లాలో 50.84 లక్షల మొక్కలు రంగారెడ్డి జిల్లా పరిధిలో మంగళవారం నాటికి 2.65 కోట్ల మొక్కలు, జీహెచ్ఎంసీలో 19.36 లక్షలు, హెచ్ఎండీఏ పరిధిలోని ఇతర ప్రాంతాల్లో 2.55 లక్షల మొక్కలు నాటినట్లు తెలుస్తోంది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల కొన్ని జిల్లాల్లో హరితహారం లక్ష్యాల మేరకు సాగడం లేదు. కరీంనగర్, వరంగల్. ఖమ్మం జిల్లాల్లో గత మూడు రోజులుగా ఆశించిన స్థాయిలో మొక్కలు నాటే కార్యక్రమం జరగలేదని అధికారులు చెబుతున్నారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ‘తెలంగాణకు హరితహారం’లో ఈ ఏడాది 46 కోట్ల మొక్కలు నాటి కొత్త రికార్డు సాధించాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని అధిగమించేందుకు అధికార యంత్రాంగం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. జిల్లాల్లో హరితహారం సాగుతున్న తీరుపై ప్రభుత్వ సీఎస్ రాజీవ్శర్మ ఏరోజుకారోజు కలెక్టర్ల నుంచి నివేదికలు తెప్పించుకొని పర్యవేక్షిస్తున్నారు. అన్ని ప్రభుత్వ విభాగాలతో సమన్వయం చేసుకుంటూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. -
మొక్క నాటితే రూ. 5 ప్రోత్సాహకం
- కనీసం 50 మొక్కలు, అంతకన్నా ఎక్కువ నాటిన వారికే ఇది వర్తింపు - వార్డులు, పంచాయతీలు, మునిసిపాలిటీలకు సైతం ప్రోత్సాహకాలు - ‘సాక్షి’ ఇంటర్వ్యూలో రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగు రామన్న సాక్షి, హైదరాబాద్ : ‘తెలంగాణకు హరితహారం’ కార్యక్రమంలో భాగంగా నాటిన ప్రతి మొక్కకు 5 రూపాయల చొప్పున ప్రోత్సాహకం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కనీసం 50 మొక్కలు, అంతక ంటే ఎక్కువ సంఖ్యలో నాటే వ్యక్తులు, సంస్థలకు గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఈ ఆర్థిక సహకారాన్ని అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. రెండో విడత హరితహారం కార్యక్రమం రేపటి (జూలై 8వ తేదీ) నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో మంత్రి జోగు రామన్న ‘సాక్షి’తో మాట్లాడారు. రాష్ట్రాన్ని పచ్చని తోరణంలా తీర్చిదిద్దే లక్ష్యంతో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తెలంగాణలో హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, ఈసారి 46 కోట్ల మొక్కలు నాటి రికార్డు సాధిస్తామని చెప్పారు. ఇందులో భాగంగానే ప్రజలను, సంస్థలను భాగస్వాములను చేసేందుకు ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నట్లు వివరించారు. పెద్ద ఎత్తున మొక్కలు నాటే గ్రామ పంచాయతీలు, మునిసిపాలిటీలు, నగర పాలక సంస్థలకు ప్రత్యేకంగా నిధులను కేటాయించి ప్రోత్సహించాలని కూడా నిర్ణయించినట్లు చెప్పారు. ప్రజలందరినీ హరితహారంలో పాల్గొనేలా చేయడం కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను చేపట్టినట్లు ఆయన వివరించారు. మొక్కలు నాటే పౌరులతో పాటు యువజన, ప్రజా సంఘాలకు, ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులకు ప్రోత్సాహకాలు ఇవ్వడానికి ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. అవార్డుల ద్వారా మొక్కలు నాటే వారిని ప్రోత్సహించడమే గాకుండా, లక్ష్యాన్ని మించి మొక్కలు నాటే పంచాయతీలు, వార్డులు, మునిసిపాలిటీలకు రూ. 2 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు ప్రోత్సాహకాలు ఇస్తామన్నారు. గ్రామ హరిత రక్షణ కమిటీల ద్వారా మొక్కలను నాటే కార్యక్రమంతో పాటు వాటి సంరక్షణకూ చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. 4,213 నర్సరీల్లో 46.30 కోట్ల మొక్కలు సిద్ధం హరితహారం కోసం రాష్ట్రంలోని 4,213 నర్సరీల్లో 46.30 కోట్ల మొక్కలను సిద్ధం చేసినట్లు మంత్రి జోగు రామన్న వివరించారు. వీటిలో అటవీ శాఖ ఆధ్వర్యంలో 27.12 కోట్ల మొక్కలు, ఇతర శాఖల ద్వారా 19.17 కోట్ల మొక్కలు నర్సరీల్లో ఉన్నాయన్నారు. వీటిలో అటవీ శాఖ ద్వారా 7.96 కోట్ల మొక్కలు, పంచాయతీరాజ్ మొదలుకొని అన్ని ప్రభుత్వ శాఖలు, స్థానిక సంస్థల ఆధ్వర్యంలో 33.88 కోట్ల మొక్కలు నాటనున్నట్లు చెప్పారు. మిగతా 5 కోట్లకు పైగా మొక్కలను అవసరమైన వారికి అందిస్తామన్నారు. నల్లగొండలో 8న సీఎంతో ప్రారంభం వర్షాలు విస్తారంగా కురుస్తున్న నేపథ్యంలో ఈసారి హరితహారాన్ని ఉద్యమంగా చేపట్టనున్నట్లు మంత్రి రామన్న వివరించారు. ఈ నెల 8న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నల్లగొండ జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనుండగా, అదేరోజు రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం ప్రారంభ మవుతుందన్నారు. ప్రజలు, ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, కార్పొరేట్ సంస్థలు, స్వచ్ఛంద సంఘాలు, మహిళా సంఘాలు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని మంత్రి సూచించారు. నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యతను కూడా వీరు తీసుకోవాలన్నారు. -
అవకాశాలు కోల్పోతున్న రాష్ట్ర విద్యార్థులు
♦ కేంద్ర ఓబీసీ జాబితాలో 26 రాష్ట్ర బీసీ కులాలను చేర్చకపోవడంతో తీరని నష్టం ♦ ఇప్పటికే సిఫార్సులను కేంద్రానికి పంపామన్న బీసీ కమిషన్ చైర్మన్ సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ నిర్ణయంలో జాప్యం, జాతీయ బీసీ కమిషన్ నుంచి సత్వర ఉత్తర్వులు రాకపోవడంతో రాష్ట్రానికి చెందిన విద్యార్థులు విద్య, ఉద్యోగ రంగాల్లో విలువైన అవకాశాలను కోల్పోతున్నారు. తెలంగాణ ఏర్పడి రెండేళ్లు కావొస్తున్నా ఇంకా కేంద్ర ఓబీసీ జాబితాలో రాష్ట్రానికి చెందిన 26 బీసీ కులాలను చేర్చకపోవడంతో ఈ వర్గాల విద్యార్థులు నష్టపోతున్నారు. జాతీయ స్థాయిలో వివిధ కేంద్రప్రభుత్వ ఉద్యోగాలు, బ్యాంకు, ఎల్ఐసీ, ఇతర ప్రభుత్వ రంగాల పోటీ పరీక్షలకు హాజర య్యేందుకు, ఐఐటీ, ఇతర కోర్సుల్లో సీట్లు పొందడానికి ఇది అడ్డంకిగా మారుతోంది. రాష్ట్రంలో బీసీలుగా ఉన్నా కేంద్ర ఓబీసీ జాబితాలో లేకపోవడంతో జనరల్ కేటగిరిలోనే ఈ విద్యార్థులు పోటీ పడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ కులాలను ఓబీసీ జాబితాలో చేర్చడంపై ఆయా సంఘాలు, వ్యక్తుల నుంచి బీసీ కమిషన్ అభిప్రాయాలను, వినతిపత్రాలను స్వీకరించింది. అయితే ఏడాది దాటినా దానిపై ఏ నిర్ణయం వెలువడక పోవడంతో ఈ వర్గాల విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. కేంద్ర జాబితాలో తెలంగాణ ఓబీసీలను చేర్చాలని, ఈ 26 కులాలకు సంబంధించి కూడా నిర్ణయం తీసుకోవాలని గత అక్టోబర్లోనే జాతీయ బీసీ కమిషన్కు లేఖ రాశామని, మళ్లీ మరో లేఖ రాస్తామని ఇటీవలే బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న విలేకరులకు తెలిపారు. ఓబీసీ జాబితాను కేంద్రానికి పంపాం ‘‘పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న విధం గా రెండేళ్ల వరకు ఏపీ జాబితాలో పొందుపరిచి న ఓబీసీ తెలంగాణకూ వర్తిస్తుంది. యూపీఎస్సీ, ఇతర పరీక్షలన్నిం టికీ అర్హత ఉంటుంది. తెలంగాణ బీసీ కులాలకు సంబంధించి విడిగా ఓబీసీ జాబితాను కేంద్రానికి పంపించాం. బీసీ కమిషన్ పరిశీలన మేరకు ఆయా అంశాల ప్రాతిపదికన ఏయే కులాలను కలపాలి, వేటిని తీసేయాలి అన్న దానిపై సిఫార్సులు చేశాం. అయితే వాటిని బయటపెట్టలేను. దీనిపై కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవాలి.’’ - బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య -
పక్కాగా బీసీల కల్యాణలక్ష్మి: రామన్న
దరఖాస్తుల రిజిస్ట్రేషన్ కోసం వెబ్సైట్ ప్రారంభం సాక్షి, హైదరాబాద్: బీసీ, ఈబీసీల కల్యాణలక్ష్మి పథకాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. ఈ పథకం ద్వారా ఈ ఏడాది రూ.300 కోట్లతో 58,820 మందికి ప్రయోజనం చేకూర్చనున్నట్లు పేర్కొన్నారు. ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తుల పరిశీలన, ఇతరత్రా సమాచారాన్ని రెవెన్యూ యంత్రాంగం ద్వారా సరిచూడనున్నట్లు చెప్పారు. శుక్రవారం సచివాలయంలో బీసీల కల్యాణలక్ష్మి వెబ్సైట్ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఆన్లైన్లో http://epasswebsite.cgg.gov వెబ్సైట్ ద్వారా ఆయాపత్రాలను జత చేసి దరఖాస్తు చేసుకోవాలన్నారు. గత నెల 1వ(ఏప్రిల్) తేదీ తర్వాత వివాహం చేసుకున్నవారు ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు అర్హులను తెలిపారు. రాష్ట్రానికి చెందిన 32 బీసీ కులాలను జాతీయ ఓబీసీ జాబితాలో చేర్చాలని కోరుతూ గత అక్టోబర్లోనే బీసీ కమిషన్కు లేఖ రాశామని, ఈ విషయమై మరోసారి లేఖ రాస్తామని మంత్రి చెప్పారు. అనంతరం మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ గురుకుల విద్యాసంస్థల లోగోను మంత్రి ఆవిష్కరించారు. -
'సాక్షి' చలివేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి
ఆదిలాబాద్ టౌన్ : వేసవిలో ప్రజల దప్పిక తీర్చేందుకు 'సాక్షి' ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఎదురుగా ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సాక్షి చేస్తున్న సామాజిక కృషి అభినందనీయమని అన్నారు. వివిధ పనులపై జిల్లా కేంద్రానికి వచ్చేవారికి వేసవిలో దప్పిక తీర్చడం సమాజసేవ చేయడమేనని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని పేర్కొన్నారు. మంచిర్యాలలోని బస్టాండ్ ఎదుట ఏర్పాటు చేసిన చలి వేంద్రాన్ని మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ రంగినేని మనీషా, ఆదిలాబాద్ ఆర్టీసీ డీపో మేనేజర్ సాయన్న, టీఆర్ఎస్ నాయకులు జనగం సంతోష్, జహిర్ రంజానీ, సిరాజ్ఖాద్రి, కలాల శ్రీనివాస్, అక్షయ ఫౌండేషన్ చైర్మన్ కె. భూపతిగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
గ్రామాలాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
► పంచాయతీ భవన నిర్మాణానికి మంత్రి భూమి పూజ ► జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన మంత్రి రామన్న ఆదిలాబాద్ రూరల్ : గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. ఏళ్ల కిందట నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాలు శిథిలావస్థకు చేరుకున్నందున నూతన భవనాలను నిర్మిస్తున్నామని ఆయన తెలిపారు. నూతన భవనాల నిర్మాణం కోసం శుక్రవారం మండలంలోని బట్టిసావర్గాం గ్రామ పంచాయతీకి వచ్చిన మంత్రి ఉగాది పండుగను పురస్కరించుకొని జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 161 నూతన గ్రామ పంచాయతీ భవనలు నిర్మించ నున్నామాని, ఇందులో ఆదిలాబాద్ మండలంలో 8 గ్రామ పంచాయతీ భవనాలు మంజూరైన్నట్లు మంత్రి తెలిపారు. వీటిని రూ. 13లక్షల వ్యయంతో నిర్మించడం జరుగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం పేద ప్రజల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నట్లు ఆయన చెప్పారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను అర్హులైన ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం ఉగాది పండుగ సందర్భంగా గ్రామ పంచాయతీ సభ్యులు మంత్రి రామన్నను సన్మానించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు ఇజ్జగిరి అశోక్, గ్రామ పంచాయతీ సర్పంచ్ రామారావు, ఉప సర్పంచ్ ఏదుల్లా స్వామి, బట్టిసావర్గాం ఎంపీటీసీలు మెస్రం సంగీత, పవన్ కుమార్, తహ సీల్దార్ సుభాష్ చందర్, ఎంపీడీవో రవిందర్, టీఆర్ఎస్ పార్టీ పశ్చిమ జిల్లా అధ్యక్షుడు లోక భూమారెడ్డి, మండల అధ్యక్షుడు రాజన్న, గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు గణపతి రెడ్డి, వెంకట్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
బంగారు తెలంగాణకు పాటుపడాలి
► మంత్రి రామన్న ► టీఆర్ఎస్ పార్టీలో పలువురి చేరిక ఆదిలాబాద్ రూరల్ : బంగారు తెలంగాణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. మండలంలోని మావల గ్రామ పంచాయతీ పరిధి పిట్టల్వాడలో సీపీఐఏంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా నాయకుడు నారాయణ కుటుంబ సభ్యులు, పోలీసు అమరవీరుల కుటుంబాల సంఘం అధ్యక్షురాలు శివనందతోపాటు పలువురు టీఆర్ఎస్ పార్టీలో శుక్రవారం చేరారు. మంత్రి జోగు రామన్న పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు. బంగారు తెలంగాణ సాధన కోసం సీఏం కేసీఆర్ కృషి చేస్తున్నారని, అందుకోసం ప్రజల భాగస్వామ్యం అవసరమని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను దృష్టిలో ఉంచుకుని పలువురు వివిధ పార్టీలకు చెందిన నాయకులు పార్టీలో చేరుతున్నారని చెప్పారు. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ పశ్చిమ జిల్లా అధ్యక్షుడు లోక భూమారెడ్డి, మండల అధ్యక్షుడు రాజన్న, జెడ్పీటీసీ సభ్యుడు ఇజ్జగిరి అశోక్, గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉష్కం రఘుపతి, జిల్లా నాయకుడు బాలూరి గోవర్థన్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
'కోటి ఎకరాలకు సాగునీటి కోసం సీఎం కృషి'
హైదరాబాద్ : గోదావరి నదిపై పలు బ్యారేజీల నిర్మాణంతో తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరు అందించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగురామన్న అన్నారు. తెలంగాణలో నిర్లక్ష్యానికి గురైన సాగునీటి పథకాలను వేగవంతం చేయడంతో పాటు ప్రతి ఎకరాకు నీరందించేందుకు అపర భగీరథుడిలా కృషి చేస్తున్నారని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గోదావరి నదిపై బ్యారేజీల నిర్మాణాల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రి టి. హరీష్రావు, ఉన్నతాధికారుల బృందం ఈ నెల 7న ముంబైకి వెళ్లి, 8న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ తో ఒప్పందాలు చేసుకోనుండడం చారిత్రాత్మకమైనదన్నారు. ఆదిలాబాద్ జిల్లాలోనే నాలుగు బ్యారేజీల నిర్మాణాలు జరుగనున్నాయని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్కు జిల్లా వాసుల తరుపున ధన్యవాదాలు తెలిపారు. -
'ప్రతి ఇంటికి గ్యాస్ స్టవ్లు అందిస్తాం'
జైపూర్ (ఆదిలాబాద్ జిల్లా) : ప్రతీ ఇంటికి గ్యాస్ కనెక్షన్లు అందిస్తామని తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లాలోని జైపూర్ మండలంలో దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతో కలిసి ఆయన దీపం పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతి నియోజకవర్గానికి 5 వేల గ్యాస్ కనెక్షన్లు అందిస్తామని పేర్కొన్నారు. అనంతరం లబ్ధిదారులకు గ్యాస్ స్టవ్లు పంపిణీ చేశారు. -
నాగోబా దర్బార్లో నిరసన సెగ
గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు విద్యార్థి, ఆదివాసీ సంఘాల డిమాండ్ సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: నాగోబా జాతరను పురస్కరించుకుని బుధవారం ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్లో నిర్వహించిన గిరిజన దర్బార్ నిరసనలు, ఆందోళనల మధ్య సాగింది. గిరిజన యూనివర్సిటీ తరలింపుపై విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ సమితి, ఆదివాసీ సం ఘాల నాయకులు నిరసనకు దిగారు. దర్బార్కు వస్తున్న మంత్రులు జోగు రామన్న, ఇంద్రకరణ్రెడ్డిలను అడ్డుకున్నారు. దర్బార్లో కూడా వీరి ప్రసంగాలకు అడ్డు తగి లారు. నిరసన వ్యక్తం చేసినవారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గిరిజన యూనివర్సిటీని వరంగల్కు తరలించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉట్నూర్లో ఏర్పాటు చేయాల్సిన ఈ వర్సిటీని వరంగల్ జిల్లాకు తరలిస్తుంటే మంత్రులు, ఎమ్మెల్యేలు సీఎం వద్ద ఎందుకు నోరు మెదపడం లేదన్నారు. సమక్క-సారక్క జాతరకు రూ.100 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తిం చిన నాగోబా జాతరకు రూ.10లక్షలతో సరిపెట్టడం ఎంతవరకు సబ బని ప్రశ్నించారు. గిరిజనవర్సిటీని జిల్లాలోనే స్థాపించేలా సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని మంత్రి జోగు రామన్న అన్నారు. తమపై దండయాత్రలు చేస్తే సహించేది లేదని ఇంద్రకరణ్రెడ్డి మండిపడ్డారు. -
బీసీ సంక్షేమ వెబ్సైట్ ఆవిష్కరణ
ఇకపై సులువుగా సమగ్ర సమాచారం: మంత్రి జోగురామన్న సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ద్వారా చేపట్టే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల సమాచారాన్ని ప్రజలందరికీ తెలియజేసేందుకు బీసీ సంక్షేమ వెబ్సైట్ను రూపొందించామని ఆ శాఖ మంత్రి జోగు రామన్న చెప్పారు. శనివారం సచివాలయంలోని తన చాంబర్లో కొత్త వెబ్సైట్ను ఆయన ఆవిష్కరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లు, స్టడీ సర్కిళ్లు, ఆయా కేంద్రాల్లో లభించే శిక్షణ వివరాలను www.tsbcwd.cgg.gov.in వెబ్సైట్ ద్వారా ఇకపై తెలుసుకోవచ్చన్నారు. త్వరలోనే 3 జూనియర్ కళాశాలలు, ఒక మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. బీసీ స్టడీ సర్కిళ్ల పేరును తెలంగాణ ఉపాధి కల్పన, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలుగా మార్చామన్నారు. బీసీ ఫెడరేషన్ ద్వారా ఇచ్చే రుణాల్లో యూనిట్కు రుణపరిమితిని రూ.35 లక్షల వరకు, సబ్సిడీ పరిమితి రూ.15 లక్షల వరకు పెంచామన్నారు. నేడు (ఆదివారం) పదవీవిరమణ చేయనున్న బీసీ సంక్షేమశాఖ స్పెషల్ సీఎస్ టి.రాధను మంత్రి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ కమిషనర్ అరుణ, జాయింట్ డెరైక్టర్ అలోక్కుమార్, బీసీ కార్పొరేషన్ ఎండీ మల్లయ్య భట్టు, స్టడీసర్కిల్స్ డెరైక్టర్ చంద్రశేఖర్ ఉన్నారు. -
కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా ప్రభుత్వ వైద్య సేవలు
ఆదిలాబాద్: ఆదిలాబాద్ రిమ్స్ వైద్యులు ఓ చిన్నారికి అరుదైన చికిత్స అందించారు. నాలుగు నెలల క్రితం 650 గ్రాముల బరువుతో జన్మించిన పాపకు చికిత్సతో పునర్జన్మను ప్రసాదించారు. గత సెప్టెంబర్ 9న ఆదిలాబాద్లోని శాంతినగర్ కాలనీకి చెందిన రాకేశ్, విజయలక్ష్మి దంపతులకు 650 గ్రాముల బరువుతో పాప జన్మించింది. అతి తక్కువ బరువుతో జన్మించిన పాపను రిమ్స్ వైద్యులు నాలుగు నెలలు ఎస్ఎన్సీయూలో ఉంచి వైద్యమందించారు. బరువు 1.9 కిలోలకు చేరి మామూలు స్థితికి రావడంతో చిన్నారిని ఆదివారం అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న చేతుల మీదుగా డిశ్చార్జి చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... అతితక్కువ బరువుతో పుట్టిన పాపను మామూలు స్థితికి తీసుకు రావడంపై రిమ్స్ వైద్యులను అభినందించారు. వైద్యుల కొరత ఉన్నా రాష్ట్రంలోనే ఏ ఆస్పత్రిలో లేని విధంగా పాపను వైద్యంతో బతికించడం సంతోషకరమన్నారు. ఈ సమావేశంలో రిమ్స్ ఇన్చార్జి డెరైక్టర్ అశోక్, చిన్నపిల్లల వైద్య నిపుణులు సూర్యకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
బీసీ జాబితాలోకి ‘హిజ్రాలు’!
రాష్ట్ర ప్రభుత్వ యోచన..న్యాయశాఖ పరిశీలనకు ఫైల్ సాక్షి, హైదరాబాద్: సమాజంలో తిరస్కారానికి, ఏహ్యభావానికిగురవుతున్న హిజ్రాలను బీసీ జాబితాలో చేర్చే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇందుకు సంబంధించిన ఫైల్పై బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న సంతకం చేశారు. న్యాయపరమైన అంశాలు, ఇతర అంశాల పరిశీలనకు న్యాయ శాఖకు ఈ ఫైల్ను పంపించినట్లు సమాచారం. ప్రస్తుతం తమిళనాడు ప్రభుత్వం హిజ్రాలను బీసీ జాబితాలో చేర్చి గుర్తింపు కార్డులు, ఇతర సదుపాయాలను కల్పిస్తోంది. ఈ విషయంలో త మిళనాడు మోడల్ను అనుసరించాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. తమిళనాడులో హిజ్రాలను(తిరునంగై/ఆరావని) అత్యంత వెనుకబడిన తరగతుల్లో చేర్చుతూ ఆ రాష్ట్ర బీసీ కమిషన్ ఇచ్చిన నివేదికను ఆమోదించి, అక్కడి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హిజ్రాలను సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన పౌరులుగా గుర్తించి విద్యాసంస్థల్లో ప్రవేశం, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో అన్నిరకాల రిజర్వేషన్లను కల్పించాలని 2014 ఏప్రిల్లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పుకు అనుగుణంగా బీసీ కమిషన్ ఇచ్చిన నివేదికపై తమిళనాడు ప్రభుత్వం హిజ్రాలను ఎంబీసీలుగా చేర్చుతూ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం జిల్లా కలెక్టర్, సైకాలజిస్ట్, సెక్సాలిజిస్ట్, పోలీసు అధికారి తదితరులతో కూడిన కమిటీకి హిజ్రాలు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కమిటీ పరిశీలనలో హిజ్రాలుగా తేలిన వారికి ఒక గుర్తింపుకార్డును జారీ చేస్తున్నారు. వాటి ఆధారంగా వారికి ఆధార్ కార్డులు, ఓటరు కార్డులు, రేషన్ కార్డులను అందజేస్తున్నారు. తెలంగాణలో కూడా ఇటువంటి విధానాన్నే అనుసరించాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అక్కడి జీవోలు, బీసీ కమిషన్ నివేదిక, హిజ్రాల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను న్యాయ శాఖ ద్వారా తెలంగాణ ప్రభుత్వం అధ్యయనం చేయిస్తోంది. అనాథలకు సర్టిఫికెట్లు అందేలా చర్యలు.. రాష్ట్రంలో అనాథలను బీసీల్లో చేర్చుతూ ప్రభుత్వం గతంలోనే నిర్ణయం తీసుకున్నా.. అది ఆచరణలో సరిగ్గా ముందుకు సాగకపోవడంతో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో అనాథలకు ధ్రువీకరణ పత్రాలను ఇవ్వడంలో ఇబ్బందులు, దీనికి సంబంధించి విడిగా ఒక నమూనాను రూపొందించాల్సిన అవసరాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకునే విషయంలో సమస్యలు రాకుండా ఆ ప్రక్రియ సరళంగా పూర్తయ్యేలా చూడాలని భావిస్తోంది. అనాథ శరణాలయాలు, ఇతరత్రా గుర్తింపు పొందిన సంస్థలిచ్చే పత్రాలకు తగిన గుర్తింపునిస్తే ఎలా ఉంటుందన్న అంశాన్ని సైతం పరిశీలిస్తున్నారు. తమిళనాడులో గతంలోనే అనాథలను బీసీ జాబితాలో చేర్చడంతో పాటు వారికి ఆయా సౌకర్యాలను కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి విధానాన్ని అనుసరించే ఆలోచనలో బీసీ సంక్షేమ శాఖ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అనాథలు, హిజ్రాలకు సంబంధించి తమిళనాడు అనుసరిస్తున్న మోడల్ను ఇటీవల బీసీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి టి.రాధ చెన్నై వెళ్లి పరిశీలించి వచ్చారు. -
క్రీమీలేయర్ అమలు చేయాలా? వద్దా?
♦ ప్రభుత్వ స్పష్టత కోసం ఎదురుచూపులు ♦ డైలమాలో నియామక సంస్థలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల్లో బీసీ క్రీమీలేయర్ (సంపన్నవర్గాలు)ను అమలు చేయాలా? వద్దా? అన్న స్పష్టత లేకుండాపోయింది. బీసీ క్రీమీలేయర్ అమలును నిలిపివేస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న గతంలోనే ప్రకటించారు. అయితే ఇంతవరకు ఉత్తర్వులు మాత్రం జారీ కాలేదు. ఈక్రమంలో టీఎస్పీఎస్సీ ఏఈ, ఏఈఈ వంటి పోస్టుల భర్తీకి ఉద్యోగ పరీక్షలను నిర్వహించింది. అలాగే విద్యుత్ శాఖ కూడా పలు ఇంజనీర్ పోస్టులకు రాత పరీక్షలను నిర్వహించింది. కానీ ఫలితాలు ఇవ్వలేదు. ఈ పరిస్థితుల్లో అటు విద్యుత్ శాఖ, ఇటు టీఎస్పీఎస్సీ ఇంటర్వ్యూలు నిర్వహించడానికి ముందే క్రీమీలేయర్పై స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నోటిఫికేషన్లో మాత్రం అభ్యర్థులు క్రీమీలేయర్ సర్టిఫికెట్లు తెచ్చుకోవాలని ప్రకటించించింది. ఇంటర్వ్యూల నిర్వహణ కంటే ముందే అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సమయంలో క్రీమీలేయరా, నాన్ క్రీమీలేయరా అన్న సర్టిఫికెట్ను అందజేయాల్సి ఉంటుంది. వాటి ఆధారంగానే బీసీ రిజర్వేషన్ కోటాలో తీసుకురావాలా? ఓపెన్ కోటాలో పరిగణనలోకి తీసుకోవాలా? అన్న నిర్ణయం తీసుకుంటాయి. అభ్యర్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం రూ. 6 లక్షల లోపు ఉంటే వారిని నాన్ క్రీమీలేయర్ అభ్యర్థులుగా రిజర్వేషన్ కోటా లో, అదే రూ. 6 లక్షలకు పైగా ఉన్న వారిని వెనుకబడిన వర్గాల్లో సంపన్న శ్రేణులుగా గుర్తించి, ఓపెన్ కేటగిరీలోనే పరిగణనలోకి తీసుకుంటాయి. ప్రభుత్వం క్రీమీలేయర్ అమలును నిలిపివే స్తామని మౌఖి కంగా పలుమార్లు పేర్కొన్న నేపథ్యంలో నియామక సంస్థలు ఆలోచనలో పడ్డాయి. సర్కారు నుంచి దీనిపై స్పష్టత కోసం ఎదురుచూస్తున్నాయి. -
జీవవైవిధ్యంతోనే మానవాళికి మనుగడ
జీవ వైవిధ్యం కాపాడేందుకు 1010 కమిటీలు:జోగు రామన్న సాక్షి, హైదరాబాద్: జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవడంపైనే మానవాళి మనుగడ ఆధారపడి ఉందని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. జీవవైవిధ్య మండలి ముద్రించిన 5 కొత్త పుస్తకాలను సో మవారం సచివాలయంలో మంత్రి ఆవి ష్కరించారు. ఆయన మాట్లాడుతూ జీవవైవిధ్యానికి, మానవ జీవనానికి అవినాభావ సంబం ధం ఉందన్నారు. జీవవైవిధ్యం ధ్వంసమైతే మానవ మనుగడ కూడా ప్రశ్నార్థకంగా మా రుతుందన్నారు. రాష్ట్రంలో గ్రామ స్థాయిలో జీవవైవిధ్యాన్ని పెంపొందించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఇందులో భాగంగానే గ్రామాల్లో సర్పంచుల అధ్యక్షతన జీవవైవిధ్య యాజమాన్య కమిటీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టామని, ఇప్పటికే 1,010 కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణలో అంతరించిపోతున్న జీవరాశులను కాపాడుకునేం దుకు నిపుణుల సహకారంతో చర్యలు చేపట్టామన్నారు. బయోడైవర్సిటీ మండలి సభ్య కార్యదర్శి సువర్ణ, రీజనల్ కో-ఆర్డినేటర్ లింగారావు, సైంటిస్ట్ లివిశర్మ పాల్గొన్నారు. -
సీఎం చైర్మన్గా వైల్డ్లైఫ్ రాష్ట్ర మండలి ఏర్పాటు
వైస్ చైర్మన్గా అటవీ శాఖ మంత్రి జోగు రామన్న సాక్షి, హైదరాబాద్: అటవీ సంరక్షణ, వన్యప్రాణుల అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం ‘వైల్డ్లైఫ్’ రాష్ట్ర మండలిని ఏర్పాటు చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు చైర్మన్గా, అటవీ శాఖ మంత్రి జోగు రామన్న వైస్ చైర్మన్గా వ్యవహరించే ఈ కమిటీలో అటవీ ప్రాంతానికి చెందిన ముగ్గురు శాసనసభ్యులు, వన్యప్రాణుల కోసం కృషి చేస్తున్న ముగ్గురు ఎన్జీవో సభ్యులు, 10 మంది పర్యావరణ వేత్తలు, 12 మంది వివిధ శాఖలకు చెందిన అధికారులు సభ్యులుగా ఉంటారు. మూడేళ్ల కాల పరిమితితో ఈ వైల్డ్లైఫ్ బోర్డు పనిచేస్తుంది. రాష్ట్రంలో వన్యప్రాణుల సంరక్షణకు తీసుకోవలసిన చర్యలు, అటవీ విస్తీర్ణం పెంచేందుకు చేయాల్సిన కృషి తదితర అంశాలపై ప్రభుత్వానికి సూచనలు ఇస్తుంది. ఈ మేరకు మండలిని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి రాజేశ్వర్ తివారి ఉత్తర్వులు జారీ చేశారు. వైల్డ్లైఫ్ సభ్యులు వీరే.. ఎమ్మెల్యేలు రాథోడ్ బాపూరావు, కె.కనకయ్య, జి.బాలరాజ్, ఎన్జీవో సభ్యులు అనిల్ కుమార్ వి ఏపూర్, ఎం.షఫతుల్లా, ఎం. ఇందిరతో పాటు పర్యావరణ వేత్తలు డాక్టర్ కార్తికేయన్, వాసుదేవన్, కె.జగన్మోహన్ రావు (రిటైర్డ్ ఐఎఫ్ఎస్), అవినాశ్ విశ్వనాథన్, డాక్టర్ నవీన్కుమార్, డాక్టర్ వాసుదేవరావు, ఉస్మానియా యూనివర్సిటీ జువాలజీ హెచ్వోడీ, హైటికోస్ కార్యదర్శి ఇమ్రాన్ సిద్ధిఖీ, ఫరీదా టాంపాల్, రాథోడ్ జనార్దన్, కనక లక్కేరావు, 12 మంది అధికారులు సభ్యులుగా ఉన్నారు. -
అటవీశాఖాధికారులకు స్కూటీల పంపిణీ
ఆదిలాబాద్ (మంచిర్యాల) : ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల మండల కేంద్రంలో శుక్రవారం తెలంగాణ అటవీశాఖా మంత్రి జోగురామన్న.. అటవీ శాఖాధికారులకు స్కూటీలు పంపిణీ చేశారు. మంచిర్యాల, కాగజ్నగర్, బెల్లంపల్లి, జన్నారం డివిజన్లకు చెందిన అధికారులకు స్కూటీలను అందజేశారు. ఈ నాలుగు డివిజన్ల పరిధిలో 281 బైకులు మంజూరు అయినట్లు మంత్రి తెలిపారు. ఈ రోజు 20 స్కూటీలు పంపిణీ చేస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. -
అందరూ భాగస్వాములు కావాలి
మంత్రి, కలెక్టర్ పల్లెనిద్ర ఆదిలాబాద్ రూరల్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన గ్రామజ్యోతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న, జిల్లా కలెక్టర్ జగన్మోహన్ అన్నారు. గ్రామజ్యోతి కార్యక్రమంలో భాగంగా గురువారం మండలంలోని వాఘాపూర్, ఖండాల, చిచ్ధరి ఖానాపూర్లో నిర్వహించిన పల్లెనిద్రలో పాల్గొన్నారు. అంకోలి గ్రామ పంచాయతీ పరిధి కొలాంగూడలో కలెక్టర్ జగన్మోహన్ పల్లెనిద్రలో పాల్గొన్నారు. ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి రామన్న మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధిలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. దీని ద్వారా గ్రామాల్లో కల్పించాల్సిన మౌలిక వసతులపై, ప్రణాళికలు రూపొందించి దశల వారీగా పరిష్కరించనున్నట్లు చెప్పారు. అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రామాల్లో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకోవడం జరుగుతుందన్నారు. కలెక్టర్ జగన్మోహన్ అంకోలి గ్రామంలో వార్డు వార్డుకు తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామాల్లో ఏర్పాటు చేసిన సభల్లో మాట్లాడుతూ గ్రామజ్యోతి కార్యక్రమం ద్వారా అనేక సమస్యలు పరిష్కారం కానున్నాయని తెలిపారు. గ్రామాల్లో ప్రజలు మల, మూత్రవిసర్జన బహిరంగా ప్రదేశాల్లో చేయకుండా ప్రతి ఇంట్లో మరుగుదొడ్లను నిర్మించుకోవాలన్నారు. దీని నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.12వేలు అందిస్తున్నట్లు తెలిపారు. వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు పరిసరాల పరిశుభ్రత తప్పని సరిగా పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామ పంచాయతీల సర్పంచ్లు, ఎంపీటీసీలు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. -
అడవులను 33 శాతానికి పెంచుతాం: జోగు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 24 శాతం అటవీ ప్రాంతాన్ని 33 శాతానికి పెంచేందుకు వచ్చే నాలుగేళ్లలో 2.30 కోట్ల మొక్కలు నాటేలా ప్రణాళిక రూపొందించామని అటవీశాఖ మంత్రి జోగు రామన్న వెల్లడించారు. ఇప్పటివరకు 1.80 కోట్ల మొక్కలను నాటినట్లు తెలిపారు. రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం దూలపల్లి అటవీ అకాడమీలో అటవీశాఖకు కేటాయించిన నూతన వాహనాలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ అన్ని రకాల సమతుల్య వాతావరణం కలిగి ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తుందని తెలిపారు. అటవీశాఖలో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న సిబ్బంది, అధికారుల అవసరాల నిమిత్తం ప్రభుత్వం వాహనాలను అందిస్తోందని చెప్పారు. ప్రభుత్వం చేపట్టే వివిధ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో అమలుచేసేందుకు సిబ్బంది కృషిచేయాలని సూచించారు. రవాణాశాఖ మంత్రి పి.మహేందర్రెడ్డి మాట్లాడుతూ అటవీ భూములకు సమీపంలో ఉన్న ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా రోడ్ల విస్తరణకు అటవీశాఖ అధికారులు శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం 2014 జాతీయ అటవీశాఖ స్పోర్ట్స్ మీట్లో బంగారు, వెండి, కాంస్య పతకాలను సాధించిన సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నగదు బహుమతులను అందించారు. కార్యక్రమంలో ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యే వివేకానంద తదితరులు పాల్గొన్నారు. -
సమష్టి కృషితోనే గ్రామ‘జ్యోతి’
జిల్లాను అభివృద్ధిలో ముందు నిలపాలి అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తాం అవగాహన సమావేశంలో మంత్రులు ఐకే.రెడ్డి, రామన్న ఆదిలాబాద్ రూరల్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రా రంభిస్తున్న గ్రామజ్యోతి పథకం విజయవంతమయ్యేలా ప్రజాప్రతినిధులు, అధికారులతో పాటు ప్రజలు సహకరించాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న, దేవాదాయ ధర్మాదాయ, గృహ నిర్మాణ, న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కోరారు. మండలంలోని మావలలో గ్రామజ్యో తి మార్పు మార్గదర్శకాలపై శుక్రవారం అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో తొలు త మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ అక్షర క్రమంలోనే కాకుండా అభివృద్ధిలో కూడా ఆది లాబాద్ జిల్లాను ముందంజలో నిలిపేం దుకు ప్రతి ఒక్కరు కృషి చేయలన్నారు. మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామస్వరాజ్య సాధనే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ప్రవేశపెడుతున్నారని, గ్రామాల అభివృద్ధితోనే మండలాలు, ఆపై జిల్లాలు, రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. ఒక్కొక్కరు ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకుం టూ సంపూర్ణంగా అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దాలని సూచించారు. గ్రామాల్లో నెల కొన్న సమస్యల పరిష్కారం కోసం మన ఊరు మన ప్రణాళికలో గుర్తించిన పనులు చేపట్టేం దుకు ఆదిలాబాద్ జిల్లాకు ప్రభుత్వం రూ. 2,418 కోట్లు ఇవ్వనుందని వివరించారు. ఈ మేరకు ఈనెల 17 నుంచి 23వరకు ఏడు రోజు ల పాటు గ్రామాల్లో నిర్వహించనున్న గ్రామజ్యోతి కార్యక్రమంలో గ్రామస్తులు అధికారులకు సహకరించాలని మంత్రి జోగు రామన్న ఈ సందర్భంగా కోరారు. వసతుల కల్పనకే.. గ్రామాల్లో మౌళిక వసతులు కల్పించడం కోస మే రాష్ట్ర ప్రభుత్వం గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ప్రవేశపెడుతోందని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజ లను చైతన్య వంతులను చేయాలన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే అభివృ ద్ధి చెందిన గ్రామాలను ఆదర్శంగా తీసుకుని అన్ని గ్రామాలను తీర్చిదిద్దాలని కోరారు. సెప్టెంబర్లో రాష్ట్రవ్యాప్తంగా 50 వేల ఇండ్లు నిర్మించనుండగా, ప్రతీ నియోజకవర్గంలో రూ.5లక్షల చొప్పున వెచ్చించి 500 గృహాలు నిర్మిస్తామని తెలిపారు. ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు హేమాజీ మాట్లాడుతూ గ్రామజ్యోతి కార్యక్రమంలో ఎంపీపీలు, ఎంపీటీసీలకు భాగస్యావమ్యులు చేసి నిధులు మంజూరు చేయూలని కోరారు. దండేపల్లి ఎంపీపీ మం జుల మాట్లాడుతూ ప్రభుత్వం ఓ పక్క మరుగుదొడ్లు నిర్మించుకోవాలని చెబుతూనే, ఇప్పటికే నిర్మించిన వాటికి బిల్లులు చెల్లించడం లేదని మంత్రుల దృష్టికి తీసుకువెళ్లారు. అలాగే, ఇందిరమ్మ ఇండ్లకు కూడా బిల్లులు రాలేదని తెలిపారు. ఇలాంటి సమస్యలపై గ్రామజ్యోతి సదస్సులో ప్రజలు నిలదీస్తే ఏం సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. దీనికి స్పందించిన మంత్రి ఐకే.రెడ్డి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల పై సీబీఐడీ విచారణ కొనసాగుతున్నందున బిల్లులు చెల్లించలేకపోతున్నామని తెలిపారు. సమావేశంలో కలెక్టర్ జగన్మోహన్, చెన్నూర్, ముథోల్, సిర్పూర్ కాగజ్నగర్, బెల్లంపల్లి ఎమ్మెల్యేలు నల్లాల ఓదేలు, విఠల్రెడ్డి, చిన్న య్య, జేసీ సుందర్ అబ్నార్, సీపీవో షేక్ మీరా, జెడ్పీ సీఈవో జితేందర్రెడ్డి, డీపీవో పోచయ్య, ఏఎస్పీలు రాధికాశర్మ, పనస రెడ్డి, వివిధ శాఖల అధికారులు, ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు పాల్గొన్నారు. -
తెలంగాణ ప్రజలందరూ పుణ్యస్నానాలు చేయాలి : మంత్రి జోగు రామన్న
దండేపల్లి (ఆదిలాబాద్) : ఆదిలాబాద్ జిల్లా దండేపల్లిలోని గూడెం పుష్కరఘాట్ను మంత్రి జోగు రామన్న సోమవారం సందర్శించారు. పుష్కర ఘాట్ల వద్ద ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం భక్తులతో మాట్లాడి సౌకర్యాలపై అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... తెలంగాణలోని ప్రజలందరూ గోదావరిలో పుష్కర స్నానాలు ఆచరించి పుణ్యం పొందాలని సూచించారు. -
‘బ్లాక్ ప్లాంటేషన్’కు ప్రాధాన్యం
జిల్లా విద్యాశాఖ పరిధిలోని కేజీబీవీ, మోడల్ స్కూల్స్, రెసిడె న్షియల్స్లో ఖాళీ స్థలం అందుబాటులో ఉంటుందని.. వీటిలో బ్లాక్ ప్లాంటేషన్ ఏర్పాటు కోసం అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా నగరం పరిధిలో సుమారు 400 కు పైగా కాలనీ కమిటీలు ఉన్నాయని.. కమిటీల సహకారంతో మొక్కలు నాటాలని తెలిపారు. ఈ నెల 3 నుంచి 10వ తేదీ వరకు హరితహారం వారోత్సవాలు ఉంటాయని, విద్యార్థులతో ర్యాలీలు, నియోజకవర్గాల్లో కార్యక్రమాలు అధికారికంగా ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లాలో ప్రభుత్వ, అసైన్డ్ భూములు సుమారు 23 వేల హెక్టార్లు ఉంటే అటవీశాఖ అధికారులు కేవలం 100 ఎకరాల్లో హరితహారం కింద మొక్కలు నాటడంపై అసహనం వ్యక్తం చేశారు. పూర్తిస్థారుులో నర్సరీల్లో మెక్కలు అందుబాటులో లేవనే సమాచారం తనదగ్గర ఉందని, పరిస్థితులు చక్కదిద్దాలని ఆదేశించారు. గ్రామాల్లో దేవాలయాలు, ఎండోమెంట్ ఆలయాల్లో మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజా ఉద్యమంలా చేపట్టాలి.. : అటవీ శాఖ మంత్రి హరితహారం కార్యక్రమం ప్రజా ఉద్యమంలా చేపట్టాలని అటవీశాఖ మంత్రి జోగు రామన్న పిలుపునిచ్చారు. పూర్తి సమాచారం లేక పోవడంపై అటవీశాఖ అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు హరితహారం కార్యక్రమాన్ని మొక్కుబడిగా కాకుండా అంకితభావంతో చేపట్టాలన్నారు. రాష్ట్రంలో 33 శాతం అడవులు ఉండాల్సి ఉండగా 24 శాతం మాత్రమే ఉన్నాయని అన్నారు. పార్లమెంటరీ కార్యదర్శి దాస్యం వినయ్భాస్కర్ మాట్లాడుతూ.. నగరంలోని పార్కులు, శ్మశాన వాటికలు అభివృద్ధి చేయాలని, వాటిలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటించాలని అన్నారు. మొక్కల చుట్టూ కంచె ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. జెడ్పీ చైర్మన్ గద్దల పద్మ మాట్లాడుతూ.. హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కవాలని అన్నారు. ఎంపీ సీతారాం నాయక్ మాట్లాడుతూ.. మొక్కలు నాటినంత మాత్రాన సరిపోదని వాటి సంరక్షణ బాధ్యతలు చూసేలా చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్ కరుణ మాట్లాడుతూ.. జిల్లాలో ఉపాధి హామీ ఉద్యోగులు సమ్మెలో ఉన్నందున ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చే శామని తెలిపారు. 4.50 కోట్ల మొక్కలు నాటే కార్యక్రమం అక్టోబర్ ఆఖరు వరకు కొనసాగుతుందన్నారు. జిల్లాలో ఉద్యోగ సంఘాలు ఒక రోజు వేతనాన్ని, సర్పంచ్ల ఫోరం ఒక నెల వేతనాన్ని హరితహారం కార్యక్రమానికి విరాళంగా ఇచ్చారని తెలిపారు. ఎమ్మెల్యే కొండా సురేఖ మాట్లాడుతూ.. పార్కులను సుందరీకరణ చేయాలని, సామూహిక మరుగుదొడ్లు నిర్మించాలని, శ్మశాన వాటికల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరారు. పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి మాట్లాడుతూ.. పరకాల నిరయోజకవర్గంలోని కేనాల్వెంట, సంగెం మండలంలోని 18 ఎకరాల ఎస్ఆర్ఎస్పీ భూముల్లో ఎక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అన్నారు. ఎమ్మెల్యే శంకర్నాయక్ మాట్లాడుతూ.. మహబూబాబాద్లో వందల ఎకరాలు ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అవుతోందని దానిని గుర్తించి హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటాలని అన్నారు. సీపీ సురేంద్రబాబు మాట్లాడుతూ ధర్మసాగర్లోని సుమారు 80ఎకరాల స్థలంలో 40 ఎకరాలు హరితహారం కోసం సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఐనవోలు దేవాలయానికి సంబంధించి ఎనిమిదెకరాల్లో హరితహారం చేపట్టనున్నట్లు తెలిపారు. ఎస్పీ అంబర్కిషోర్ ఝా మాట్లాడుతూ జిల్లాలో 42 పోలీస్ స్టేషన్ల పరిధిలో 10 వేల మొక్కలు నాటుతామని, ప్రతి పోలీస్స్టేషన్ మండలంలోని ఒక గ్రామం దత్తత తీసుకుని హరితహారం చేపటడుతుందని పోషణ బాధ్యత కూడా తమదేనని అన్నారు. 200 మంది జిల్లా గార్డులు శ్రమదానం కార్యక్రమం ద్వారా మొక్కలు నాటుతామని తెలిపారు. సమావేశంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరితహారం పోస్టర్లు, కరపత్రాలు ఆవిష్కరించారు. -
ఈ ఏడాది నుంచి హాస్టళ్లలో బయోమెట్రిక్
మంత్రి జోగు రామన్న వెల్లడి సాక్షి , హైదరాబాద్: హాస్టళ్లల్లో బోగస్ అడ్మిషన్లను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. బయోమెట్రిక్ హాజరు పద్ధతిని ఈ ఏడాది నుంచి పాఠశాలలు, క ళాశాల హాస్టళ్లలోనూ తప్పనిసరి చేస్తోంది. అర్హులైన విద్యార్థులకు అన్యాయం జరగకుండా అడ్మిషన్లలో అవకతవకలను నివారించేందుకు బయోమెట్రిక్ విధానాన్ని వెంటనే అమల్లోకి తీసుకురావాలని రాష్ర్ట మంత్రి జోగు రామన్న అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారులు, డీడీలు, ఇంజనీరింగ్ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. స్కూళ్ల హాస్టల్ విద్యార్థుల మాదిరిగానే కళాశాల హాస్టళ్లలోనూ ఆన్లైన్ ద్వారా రిజస్ట్రేషన్లు నిర్వహించాలని అధికారులకు సూచించారు. -
శ్రీవారిని దర్శించుకున్న మంత్రి జోగు రామన్న
తిరుమల : తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న కుటుంబసభ్యులతో కలసి ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దేవస్థానం అధికారులు ఆయనకు ప్రత్యేక దర్శనం చేయించారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలికారు. -
ముస్లిం రిజర్వేషన్ల కేసులో ప్రతివాదిగా ఓకే
సాక్షి, హైదరాబాద్: ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ల (బీసీ-ఈ కింద) కేసులో సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం ప్రతివాదిగా చేరడానికి దరఖాస్తు చేసేందుకు మంత్రి జోగు రామన్న అంగీకరించారు. రాష్ర్టం తరఫున ఈ కేసును వాదించేందుకు మాజీ అటార్నీ జనరల్ కె.పరాశరన్ను నియమించేందుకు మంత్రి అంగీకరిస్తూ ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ర్ట బీసీ సంక్షేమశాఖ మంత్రి జోగు రామన్నతో బీసీ రిజర్వేషన్ల సలహాదారు, విశ్రాంత ఐఏఎస్ అధికారి డా. పీఎస్ కృష్ణన్ భేటీ అయ్యారు. బుధవారం మంత్రిని అధికార నివాసంలో కలుసుకున్న సందర్భంగా బీసీ రిజర్వేషన్ల అమలు తీరుతెన్నులు, ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ల అమలు వంటి అంశాలు చర్చకు వచ్చాయి. ముస్లింలకు బీసీ-ఈ కేటగిరీ కింద 4 శాతం రిజర్వేషన్లు అమలు విషయంలో చట్టపరంగా తీసుకోవాల్సిన అంశాలపై మంత్రితో ఆయన చర్చించారు. అందుకు ఢిల్లీ కేంద్రంగా విధులను నిర్వహిస్తున్న కృష్ణన్ హైదరాబాద్కు వచ్చిన సందర్భంగా మంత్రిని కలుసుకున్నారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమశాఖ ఇన్చార్జ్ డెరైక్టర్ కె.ఆలోక్కుమార్ పాల్గొన్నారు. -
1.20 కోట్ల మొక్కలు నాటుతాం
రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగు రామన్న ♦ ఆత్మహత్యలు ఆగాలంటే అడవులను కాపాడాలి ♦ ‘పోడు’ పదెకరాల కంటే ఎక్కువ ఉంటే స్వాధీనం ♦ రైతులు, పేదల సంతోషమే కేసీఆర్ లక్ష్యం మూడేళ్లలో 1.20 మొక్కలు నాటుతామని అటవీశాఖ మాత్యులు రామన్న అన్నారు. మిషన్ కాకతీయ పథకంలో భాగంగా భూపాలపల్లి మండలంలో పలు అభివృద్ధి పనులను స్పీకర్ మధుసూదనాచారితో కలిసి ఆయన ప్రారంభించారు. భూపాలపల్లి : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం పథకంలో భాగంగా మూడేళ్లలో 1.20 కోట్ల మొక్కలు నాటుతామని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. మిషన్ కాకతీయ పథకంలో భాగంగా నందిగామ, దీక్షకుంట, గొల్లబుద్ధారం, చికెన్పల్లి గ్రామాల శివారులోని చెరువుల్లో చేపట్టనున్న అభివృద్ధి పనులను మంత్రి రామన్న, స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నందిగామలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి రామన్న మాట్లాడారు. హరితహారం పథకం కింద ప్రభుత్వం పోడు భూములను లాక్కుంటుం దని రైతులు అపోహ చెందవద్దన్నారు. జానెడు పొట్ట నింపుకోవడం.. బతుకు దెరువు కోసం అటవీ భూములను పోడు చేసుకున్న రైతుల జోలికి తాము వెల్లబోమని ఆయన పేర్కొన్నారు. అడవులను కాపాడితే వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండుతాయని.. తద్వారా రైతుల ఆత్మహత్యలు ఆగుతాయని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. పదెకరాల లోపు సాగు చేసుకుంటున్న రైతులకు అడ్డు తగలవద్దని సీఎం కె.చంద్రశేఖర్రావు చెప్పాడన్నారు. పోడు చేసుకున్న రైతులు తమ భూమిలో కొంతభాగం ఉసిరి, తాటి, ఈత, నీలగిరి లాంటి పండ్లు, పూలనిచ్చే మొక్కలు పెంచాలని సూచించారు. దీంతో తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి సాధించడమేకాక మొక్కలను పెంచినట్లు అవుతుందన్నారు. జిల్లా భూవిస్తీర్ణం 12,80,100 హెక్టార్లు కాగా.. ఇందులో 2,36,128 హెక్టార్ల అటవీ విస్తీర్ణం ఉందన్నారు. అయితే ఇప్పటికే సుమారు 50 నుంచి 60 హెక్టార్లలో పోడు జరిగిందన్నారు. రాష్ట్ర సాధన కోసం అలుపెరుగని ఉద్యమం చేసిన రైతులు, పేదలు సంతోషంగా ఉండటమే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. ప్రతి ఒక్కరు అడవులను సంరక్షించి వాతావరణ సమతుల్యతను కాపాడాలని మంత్రి సూచించారు. నిధుల కేటారుుంపులో వివక్ష : స్పీకర్ సీమాంధ్ర పాలకులు నీటిపారుదల వ్యవస్థను మూడు ముక్కలుగా విడగొట్టి తెలంగాణ ప్రాంతంలోని చిన్ననీటి పారుదలపై వివక్ష చూపి తక్కువ నిధులు కేటాయించారని శాసన సభాపతి, ఎమ్మెల్యే సిరికొండ మధుసూదనాచారి అన్నారు. ఫలితంగా తెలంగాణ చెరువులు, కుంటలు 50 ఏళ్లుగా మరమ్మతుకు నోచుకోక సాగునీటికి రైతులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. పదెకరాల లోపు అటవీ భూమిని పోడు చేసుకున్న వారి జోలికి వెళ్లబోమని మంత్రి రామన్న ప్రకటించినందుకు స్పీకర్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే బొజ్జపెల్లి రాజయ్య, అటవీ శాఖ పీసీసీఎఫ్ ఎస్బీఎల్ మిశ్రా, అడిషనల్ పీసీసీఎఫ్ సునీల్కుమార్ గుప్తా, వరంగల్ సోషల్ ఫారెస్ట్రీ కన్జర్వేటర్ పీవీ రాజారావు, వివిధ డివిజన్ల డీఎఫ్ఓ, సబ్ డీఎఫ్ఓలు, ఐబీ ఎస్ఈ పద్మారావు, ఎంపీపీ కళ్లెపు రఘుపతిరావు, జెడ్పీటీసీ సభ్యురాలు జర్పుల మీరాబాయి, నాయకులు కుంచాల సదావిజయ్కుమార్, మందల రవీందర్రెడ్డి, కూచన వేణు, తాళ్లపెల్లి శశికాంత్, రాంపూర్ వెంకన్న పాల్గొన్నారు. హరితహారాన్ని విజయవంతం చేయూలి గణపురం : రాష్ట్రంలో హరితహారం విజయవంతానికి సమష్టిగా కృషి చేయూలని అటవీ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. చెల్పూరు శివారులోని కేటీపీపీలో గల గోదావరి అతిథి గృహంలో వరంగల్, కరీంనగర్ జిల్లాల అటవీ శాఖ ఉన్నతాధికారుల సమీక్షా సమావేశం గురువారం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ జూలైలో తొలకరి వర్షాలు పడగానే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమంలా మొక్కలు నాటుతామని అన్నారు. ప్రతి గ్రామంలో 40వేల మొక్కలు, నియోజకవర్గంలో పది లక్షల మొక్కలు లక్ష్యంగా నిర్ణరుుంచామన్నారు. ప్రతి వ్యక్తి పొలం, లేదా ఇంటి ఆవరణలో తప్పక మొక్కలు నాటాలని అన్నారు. పాఠశాలు, మసీదులు, చర్చిలు, చెరువులు, కట్టలు, బీడు భూములు ఉన్న చోట మొక్కల పెంపకాన్ని ప్రోత్సహిస్తామని అన్నారు. జిల్లాలో కలెక్టర్ అధ్యక్షతన సమావేశాలు నిర్వహించి అన్ని శాఖలను సమన్వయపరిచి హరితహారం పథకాన్ని అమలు చేస్తున్నామని వివరించారు. దీనికి అటవీ శాఖలోని కింది స్థాయి అధికారుల కృషి ముఖ్యమని అన్నారు. అలాగే మేడారంలో మొక్కల పెంపకానికి అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. సమావేశంలో ప్రిన్సిపల్ సీసీఎఫ్ ఎస్బీఎల్ మిశ్రా, అదనపు ప్రిన్సిపల్ సీసీఎఫ్ ఎస్కే గుప్తా, కలెక్టర్ వాకాటి కరుణ, సీఎఫ్ రాజారావు, డీఎఫ్ఓలు పి.రమేష్, భీమానాయక్, ముకుందరెడ్డి, గంగారెడ్డి, కిష్ణగౌడ్, వెంకటేశ్వర్లు, ఏసీఎఫ్లు, ఎఫ్ఆర్ఓలు, డిప్యూటీ రేంజర్లు పాల్గొన్నారు. -
అధికారులపై ఫైర్
•మంచిర్యాలలో సమీక్షకు కీలక శాఖల అధికారుల గైర్హాజరు •అధికారుల తీరును ఎండగట్టిన రాష్ట్ర మంత్రులు •దళితులకు భూసేకరణలో జాప్యమెందుకని నిలదీత •వాడీవేడిగా సమస్యలపై చర్చ సాక్షి, మంచిర్యాల :‘జిల్లాలో తాగునీటి పథకాల నిర్మాణం పూర్తయినా కరెంట్ సదుపాయం లేదని నిరుపయోగంగా వదిలేశారు.. పథకాల నిధులు ఏం చేశారు..? ఇదివరకే జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో నిరుపయోగంగా ఉన్న పథకాల జాబితా ఇవ్వమని చెప్పాం.. అయినా ఇంత వరకు ఇవ్వలేదు. ఇప్పుడూసమాచారం లేకుండానే వచ్చారు. కనీస బాధ్యత లేకుం డా ఎలా పని చేస్తున్నారు..? పని తీరు మార్చుకోండి..’ అని జిల్లా అటవీ శాఖ మంత్రి జోగురామన్న ఆర్డబ్ల్యూఎస్ అధికారులపై మండిపడ్డారు. శుక్రవారం మం చిర్యాల గార్డెన్స్లో గోదావరి పుష్కర ఏర్పాట్లు.. మిషన్ కాకతీయ, దళిత బస్తీ, వాటర్గ్రిడ్, ఆహార భద్రత, వై ద్యం, హరితహారం, కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాల అమలుపై అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డితో కలిసి సమీక్షించారు. సమావేశం ప్రారంభంకాగానే ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, దేవాదాయ శాఖ తరఫు నుంచి ఎవరెవరు వచ్చారని మంత్రి ఐకే రెడ్డి ప్రశ్నించ గా.. ఎవరూ రాలేదని సమాధానం రావడంతో పుష్కర ఏర్పాట్ల నిర్వహణలో కీలక శాఖ అధికారులు సమీక్షకు రాక పోవడం ఏంటని ఆర్డీవోను ప్రశ్నించారు. చివరకు ఆర్అండ్బీ అధికారికి ఆర్డీవో ఫోన్ చేసి పిలిపించారు. మిగతా రెండు శాఖల నుంచి ఎవరూ రాలేదు. సమావేశానికి పలు శాఖల అధికారులు అసంపూర్తి సమాచారం తో రావడంతో మంత్రులు వారిపై ఆగ్రహం వ్యక్తం చే శారు. ఆర్డీవో ఆయేషా మస్రత్ ఖానంపై మంత్రి రామ న్న ఆగ్రహం వ్యక్తం చేశారు. భూమి లేని నిరుపేద దళి తులకు ప్రభుత్వం మూడెకరాల భూమి ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని.. అవసరమైన నిధులున్నా అధికారులు క్షేత్రస్థాయిలో ప్రతిపాదనలు పంపడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. రెవెన్యూ డివిజన్ పరిధిలో ఇప్పటివరకు ఎన్ని మండలాల నుంచి ప్రతిపాదనలు పంపారని ఆర్డీవోను ప్రశ్నించగా.. పలు మండలాల్లో ప్రక్రియ కొనసాగుతోందని ఆమె జవాబిచ్చారు. సాధ్యమైనంత త్వరలో లబ్ధిదారులు.. భూమిని గుర్తించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. సమగ్ర కుటుంబ సర్వేలో ప్రభుత్వ ఉద్యోగులైన కొడుకులతో వేరుపడి ఉంటున్న వృద్ధుల కు ఆసరా పెన్షన్లు అందజేయాలని చెప్పినా ఇంకా పలు చోట్ల అధికారులు ఇవ్వడం లేదని మంత్రి రామన్న అన్నారు. అలాంటి వారికి వెంటనే పింఛన్లు ఇవ్వాల న్నారు. అలాగే.. కొందరు సింగరేణి కార్మికులకు రూ. 200 పెన్షన్ అందుతోందని.. వారికి ఆ పింఛన్తో పా టు ఆసరా పింఛన్ కూడా ఇవ్వాలని ఆదేశించారు. క్రమబద్ధీకరణపై ప్రజలకు అవగాహన కల్పించి ప్రభుత్వ భూమిలో ఇళ్లు నిర్మించుకున్న వారు ఆ భూములను క్రమబద్ధీకరించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. జెడ్పీ ైవె స్చైర్మన్ మూల రాజిరెడ్డి మాట్లాడుతూ.. ఓ కాంట్రాక్టర్ చె న్నూరు పెద్ద చెరువు మరమ్మతు పనులు దక్కించుకుని ఏడాదిన్నర క్రితమే పనులు నిలిపేశాడన్నారు. దీంతో ఆ ప్రాంత పరిధిలో వ్యవసాయ పొలాలకు నీరందక పంటలు ఎండిపోయి రైతులు ఇబ్బందులెదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చే శారు. అలాగే సోమనపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తయినా.. అటవీశాఖ అనుమతి లేదనే కారణంతో సాగు నీరివ్వడం లేదన్నారు. స్పందించిన మంత్రి ఇరిగేషన్ ఈఈపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టులు దక్కించుకుని పనులు చేయని గుత్తేదార్లను బ్లాక్ లిస్టులో పెట్టాలని ఆదేశించారు. లిఫ్ట్ ఇరిగేషన్కు సంబంధించి అటవీశాఖ అనుమతి ఇస్తానని హామీ ఇచ్చారు. డివిజన్ పరిధిలో నూరుశాతం కార్డులు ఇచ్చేశామని ఆర్డీవో ఆయేషా మస్రత్ఖానం జావాబివ్వడంతో దివాకర్రావు పలు ఉదాహరణలు మంత్రుల ముందు ఉంచారు. ఎమ్మెల్యే దివాకర్రావు మాట్లాడుతూ.. వర్షాలొస్తే లక్సెట్టిపేట మండలం దౌడపల్లి చెరువు ఉప్పొంగి దౌడపల్లితోపాటు వెంకట్రావ్పేట గ్రామాలు మునిగిపోతాయని అయినా.. చెరువు పునరుద్ధరణ జాబితాలో ఆ చెరువు లేకపోవడం శోచనీయమన్నారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ.. తనకు తెలియకుండానే తన పరిధిలోని తాండూరు, భీమిని మండలాల్లో దళితులకు భూపంపిణీ కి సంబంధించి స్థలాలు గుర్తించి ప్రతిపాదనలు పంపారని అధికారుల తీరుపై మంత్రికి ఫిర్యాదు చేశారు. ముందుగానే పుష్కరాల ఏర్పాట్లు.. దూర ప్రాంతాల నుంచి గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు అసౌకర్యాలు కలగకుండా ఇప్పట్నుంచే పనులు ప్రారంభించాలని మంత్రి ఐకే రెడ్డి అధికారులను ఆదేశించారు. తాగునీరు, విద్యుత్, పారిశుధ్యం, వైద్యం, రోడ్లు ఇతర సదుపాయాలపై మంత్రి అధికారులతో చర్చించారు. పలువురు అధికారులు మంచిర్యాల డివిజన్ పరిధిలోని గూడెం, లక్ష్మీకాంతాపూర్, ద్వారక (దండేపల్లి), లక్సెట్టిపేట, మంచిర్యాల, ముల్కల్ల, చెన్నూరు, వేలాలా (చెన్నూరు) ప్రాంతాల్లో స్నానఘట్టాలు, రేకుల షెడ్లు, పుష్కరఘాట్లు, రోడ్ల నిర్మాణాలను వివరించారు. పనులు ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. నిర్మల్ మండలం ముప్పారం గ్రామానికి చెందిన ఓ యువతి స్వైన్ఫ్లూ లక్షణాలతో అక్కడి ఏరియా ఆస్పత్రికి వస్తే.. సిబ్బంది పరీక్షించకుండానే స్వైన్ఫ్లూ వచ్చిందని భయపెట్టి వారిని గాంధీ ఆస్పత్రికి తరలించారని.. తీరా అక్కడ వెళితే స్వైన్ఫ్లూ కాదని తేలిందన్నారు. ఇలా రోగులను భయపెడితే సహించేది లేదని డీఎంహెచ్వో రుక్మిణమ్మను మందలించారు. అప్పుడు నాకే సిగ్గనిపించింది.. - కలెక్టర్ జగన్మోహన్ ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు తెలియడం లేదు.. ఇటీవల ఆదిలాబాద్ పక్కనే ఉన్న ఓ గ్రామానికి నేను, మంత్రి జోగు రామన్న వె ళ్లి కల్యాణలక్ష్మీపై ఆ ప్రాంత సర్పంచ్, ఎంపీటీసీ, ప్రజలను అడిగితే తమకే తెలియదన్నారు. జిల్లా కేంద్రం పక్కనే ఉన్న గ్రామంలో ఉన్న ఈ పరిస్థితిని విని అప్పుడు నాకే సిగ్గనిపించింది. పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించడంలో ఎందుకు వి ఫలమవుతున్నామో బేరీజు చేసుకోవాలి. క్షేత్రస్థాయిలో తహశీల్దార్లు చెప్పే సమాచారంపై నాకు నమ్మకం లేదు. తహశీల్దార్లకు ఆర్డీవో క్లాస్.. సమీక్షలో పలు సమస్యలపై ప్రజాప్రతినిధులు అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సందర్భంలో మంత్రి జోగు రామన్న ‘మినిట్స్’ రాస్తున్నారా..? అని ఆర్డీవో ఆయేషా మస్రత్ఖానంను ప్రశ్నించారు. ఆర్డీవో రాస్తున్నాం సార్ అని వేదిక ముందే కూర్చొని ఉన్న మంచిర్యాల తహశీల్దార్ కాశబోయిన సురేశ్ను చూపిం చారు. దండేపల్లి, చెన్నూర్ తహశీల్దార్లు కుమారస్వా మి, హన్మంతరావు కనిపించకపోవడంతో వారిద్దరినీ వేదికపై పిలిచి..‘ఏం..? తమాషా చేస్తున్నారా..? ఎక్కడికి వెళ్లారు..? ఇక్కడ కూర్చొండి.. మినిట్స్ నోట్ చేయండి.’ అని క్లాస్ తీసుకున్నారు. -
కుంభమేళా.. పనులెలా..!
•పుష్కరాలకు అరకొర నిధులే.. •మిగిలింది నాలుగు నెలలే.. •సకాలంలో పనులు పూర్తయ్యేదెలా..! •ఇప్పటికీ విడుదల కాని నిధులు •ప్రతిపాదనలకే పరిమితం మరో నాలుగు నెలల సమయం.. చేయాల్సిన పనులెన్నో.. చేసింది ఏమీ లేదు.. ఒక్క అడుగూ ముందుకు పడలేదు.. ఇదీ జిల్లాలో గోదావరి పుష్కరాల పరిస్థితి. 12 ఏళ్లకోసారి నిర్వహించే పుష్కరాలకు సమయం దగ్గరపడుతున్నా ఎక్కడా ఏర్పాట్లు కానరావడం లేదు. ఈసారి స్వరాష్ట్రంలో కుంభమేళా తరహాలో ఘనంగా పుష్కరాలు నిర్వహిస్తామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించినా ఇంతవరకు నిధుల విడుదలే లేదు. ఇంకా నిధులపై తర్జనభర్జన కొనసాగుతూనే ఉంది. రాష్ట్రం తరఫున కొద్దోగొప్పో నిధులు మంజూరు చేసినా.. కేంద్రం నిధుల కోసం వేచిచూడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో పుష్కరాలు ప్రారంభమయ్యే సమయానికి పనులు పూర్తయ్యేనా..! భక్తులకు ఈసారీ ఇబ్బందులు తప్పవా..! భైంసా : ఈ ఏడాది జూలై 15 నుంచి గోదావరి పుష్కరాలు ప్రారంభంకానున్నాయి. గడువు సమీపిస్తున్నా ఏర్పాట్లు ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి. పకడ్బందీ ప్రణాళిక సిద్ధం చేయకపోవడంతో జరగబోయే పనులపై తీవ్ర ప్రభా వం చూపే అవకాశం ఉంది. నాలుగు నెలల గడువులో ప్రతిపాదనల ఆమోదం, నిధుల విడుదలపై స్పష్టమైన ఆదేశాలు వెలువడడంలేదు. తీవ్ర జాప్యం చేస్తూ అటుతర్వాత నిధులు విడుదల చేసినా గడువులోగా పనులు పూర్తయ్యే అవకాశం లేదు. గోదావరి నదితీరానా పుష్కర ప్రాంతాల వద్ద తాగునీరు, రహాదారులు, స్నానఘట్టాల నిర్మాణం, షెడ్ల నిర్మాణం పనులు చేపట్టాల్సి ఉంది. ఇప్పటికీ అధికారులు పూర్తిస్థాయిలో దృష్టి సారించలేకపోతున్నారు. నాలుగు నెలలు గడిచింది.. గోదావరి పుష్కరాల విజయవంతానికి తొలి అడుగు వేస్తూ చదువుల తల్లి కొలువైన బాసరలో 2014 సెప్టెంబర్ 16న పుష్కరాల ఏర్పాట్లపై మంత్రి జోగు రామన్న అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆ సమావేశం జరిగి నాలుగు నెలల 22 రోజులు గడిచిపోయింది. నాటి సమీక్షలో కలెక్టర్ జగన్మోహన్తోపాటు ఆయా శాఖల అధికారులు జిల్లాలో పుష్కరాల సందర్భంగా చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. అభివృద్ధి పనులకు రూ.200 కోట్ల నిధులతో ప్రతిపాదనలను సిద్ధం చేశారు. దేవాదాయ, రహదారులు, భవనాలు, పోలీసు, విద్యుత్, పంచాయతీరాజ్, ఆర్టీసీ, రెవెన్యూ, పర్యాటక, ఇరిగేషన్ శాఖల అధికారులు వేర్వేరుగా ప్రతిపాదనలు పంపించారు. రహదారుల అభివృద్ధికి రూ.150 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించారు. భారీ ప్రతిపాదనలు సిద్ధ ంచేసిన అధికారులు పనులు చేపట్టే విషయంలో స్పష్టమైన వైఖరి వెల్లడించడం లేదు. బాసరకు రూ.2 కోట్లు... ఆ తర్వాత నిర్మల్ ఎమ్మెల్యే ఇంద్రకరణ్రెడ్డి మంత్రివర్గంలో చేరడం దేవాదాయ శాఖ అల్లోలకే కేటాయించడం జరిగింది. ఐకే రెడ్డి హైదరాబాద్లో ఆ శాఖ అధికారులు సహచర మంత్రులతో పుష్కర ఏర్పాట్లపై సమావేశం నిర్వహిం చారు. పుష్కరాలకు నిధులు పుష్కలంగా ఉన్నాయని కుంభమేళా తరహాలో నిర్వహిస్తామని తెలిపారు. ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ రాష్ట్ర బడ్జెట్లో పుష్కర మహోత్సవానికి రూ.100 కో ట్లు కేటాయించనున్నట్లు ప్రకటించారు. పుష్కరాల విజయవంతానికి రూ.200 కోట్లు అవసరమని జిల్లా అధికారులు ప్రతిపాదించారు. బాసర క్షేత్రానికి రూ.100 కోట్లు అవసరమని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. తెలంగాణలో బాసరలోనే అత్యధికంగా భక్తులు పుష్కర స్నానాలు ఆచరించే అవకాశం ఉంది. జిల్లాలో గోదావరి పరివాహాక ప్రాంతాల్లోని ఎనిమిది చోట్ల దేవాలయాల అభివృద్ధికి రూ.4.28 కోట్లు అవసరమవుతాయని ఆ శాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. తెలంగాణ ప్రభుత్వం దేవాదాయ శాఖ నుంచి బాసరకు రూ.2 కోట్ల నిధులు విడుదల చేస్తున్నట్లు ఆ శాఖ మంత్రి ప్రకటించారు. రెండు నెలల వరకు కేంద్రం నిధులు వచ్చే పరిస్థితి కనిపించడంలేదు. మిగిలిన రెండు నెలల్లో పుష్కర పనులు పూర్తవుతాయన్న సందేహాలు వెల్లడవుతున్నాయి. దీనిపై బాసర ఆలయ ఈవో ముత్యాలరావు స్పందిస్తూ.. త్వరలోనే పుష్కర ఏర్పాట్ల పనులకు ప్రభుత్వం టెండర్లు నిర్వహించనున్నట్లు చెప్పారు. అత్యవసర పనులను గుర్తించి టెండర్లు నిర్వహిస్తామన్నారు. ఇవి నిర్మించాలి.. దేశంలోనే రెండో సరస్వతీ అమ్మవారు కొలువుదీరిన క్షేత్రంగా బాసరకు పేరుంది. పక్కనే గోదావరి నది ప్రవహిస్తోంది. పుష్కరాల్లో ప్రధానంగా ఇక్కడికే భక్తులు వచ్చేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఇక్కడి స్నానఘట్టాలు అధ్వానంగా కనిపిస్తున్నాయి. రెండు చోట్ల స్నానఘట్టాలు ఉన్నా.. గోదావరి ఎండిపోవడంతో పుణ్యస్నానాలు ఆచరించేందుకు నీళ్లులేవు. •స్నానఘట్టాల ఆధునికీకరణ పనలపై అధికారులు దృష్టిపెట్టాలి. •గోదావరి నది ఒడ్డున ఉన్న శివాలయాన్ని ఆనుకుని షెడ్లను నిర్మించాలి. •భక్తులు దుస్తువులు మార్చుకునేందుకు ప్రత్యేక గదుల నిర్మాణంపై దృష్టిపెట్టాలి. •నిర్మల్ మండలం సోన్ గోదావరి పుష్కరఘాట్కు వెళ్లే రహదారి.. బ్రహ్మేశ్వర ఆలయానికి వెళ్లే రహదారి అధ్వానంగా ఉంది. •గూడెం గోదావరి వద్ద స్నానఘట్టాలు నిర్మించాలి. •సోన్లో స్నానఘట్టాల వద్ద అంతగా సౌకర్యాలు లేవు. •జిల్లాలో ఎనిమిదిప్రాంతాల్లో జరగబోయే పు ష్కరాల కోసం గోదావరి నది వద్ద భారీకేడ్లు, స్నానపుగదులు, మరుగుదొడ్లు అత్యవసరం. •పుష్కరాల్లో పిండప్రదాన మండపాలు, కేశఖండనశాలలు నిర్మించాలి. •భక్తుల కోసం అక్కడే తాగునీటి సౌకర్యం కల్పించాలి. •వేల సంఖ్యలో వచ్చే భక్తులకు అనువుగా నదిలో జారిపోకుండా దిగేందుకు, ఎక్కేందు కు సౌకర్యంగా ఉండేలా ఇంజనీయర్ల సూచనలతో మెట్లు నిర్మించాలి. •విద్యుత్ సౌకర్యం కల్పించాలి. తాత్కాలిక బస్టాండ్లు ఏర్పాటు చేయాలి. •భక్తులకు వసతి, తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యాలు కల్పించాలి. -
వనరులు గుర్తించండి..
ఆదిలాబాద్ టౌన్: ఆదిలాబాద్ జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు వనరులను గుర్తించాలని టీఆర్ఎస్ పార్టీ సెక్రెటరీ జనరల్, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు అన్నారు. గురువారం ఆదిలాబాద్కు వచ్చిన ఆయన స్థానిక ఆర్అండ్బీ విశ్రాంతి భవనంలో మంత్రి జోగు రామన్న, కలెక్టర్ జగన్మోహన్తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఉన్న వనరులను గుర్తించి పరిశ్రమలు ఏర్పాటు చేయడం వల్ల నిరుద్యోగ సమస్య తీరుతుందని అన్నారు. సీసీఐ సిమెంట్ ఫ్యాక్టరీ మూతపడడానికి గల కారణాలపై అడిగి తెలుసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయనున్న ఎయిర్పోర్టుకు సంబంధించిన వివరాలు కలెక్టర్ ద్వారా తెలుసుకున్నారు. నేరడిగొండ మండలం కుంటాల జలపాతంపై విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తే జిల్లాకు సరిపోయే విద్యుత్తోపాటు ఇతర జిల్లాలకు కూడా సరఫరా చేయవచ్చని అన్నారు. హైడల్ పవర్ ప్రాజెక్టు వల్ల ఎలాంటి కాలుష్యం ఉండదని తెలిపారు. ఇళ్లస్థలాల క్రమబద్ధీకరణ సబంధించి కలెక్టర్ను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారని, అర్హులైన వారికి న్యాయం చేయాలని అన్నారు. యాపల్గూడలో ఏర్పాటు చేయనున్న సిమెంట్ ఫ్యాక్టరీ వివరాలను మంత్రి రామన్న వివరించారు. అంతకుముందు కలెక్టర్ జగన్మోహన్, టీఆర్ఎస్ పశ్చిమ జిల్లా అధ్యక్షుడు లోక భూమారెడ్డి స్వాగతం పలికారు. -
వీఐపీ రిపోర్టర్ ఎఫెక్ట్.. నంబర్లేశారు..
ఆదిలాబాద్ రూరల్ : ప్రజా సమస్యల పరిష్కారానికి ‘సాక్షి’ నిర్వహించిన ‘వీఐపీ రిపోర్టర్’ కార్యక్రమానికి అధికార యంత్రాంగం స్పందించింది. నిరుపేదల ఆవాసాలకు గుర్తింపు లభించింది. ఎన్నో ఏళ్ల సమస్యకు పరిష్కారం లభించిందన్న ఆనందం పేదల్లో వ్యక్తమైంది. రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న ‘వీఐపీ రిపోర్టర్’గా ఆదిలాబాద్ సమీపంలోని భగత్సింగ్నగర్ కాలనీలో శనివారం పర్యటించి కాలనీవాసుల సమస్యలు తెలుసుకున్న విషయం విదితమే. తాము ఎదుర్కొంటున్న సమస్యలను కార్మిక కుటుంబాలు మంత్రికి ఏకరువు పెట్టాయి. పింఛన్లు అందడం లేదని, తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని, విద్యుత్ సౌకర్యం లేక చీకటల్లో కాలం వెళ్లదీస్తున్నామని వివరించారు. నివాసాలకు గతంలో పట్టాలు ఇచ్చినా ఇంటి నంబర్లు వేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి స్పందించి వెంటనే ఇళ్ల నంబర్లు వేయాలని పంచాయతీ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం గ్రామ సర్పంచు రాథోడ్రామారావు, కార్యదర్శి కలీమ్, పంచాయతీ సిబ్బంది కాలనీ లో పర్యటించి పట్టాలున్న ఇళ్లకు నంబర్లు వేశారు. గతంలో పట్టాలు మంజూరైన 440 ఇళ్లకు నంబర్లు వేస్తామని సర్పంచు రామారావు తెలిపారు.