Monitoring
-
ఏఐ చిప్లపై అమెరికా ఆంక్షల ప్రభావం
అమెరికా ఇటీవల ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై ఆంక్షలు విధిస్తామని ప్రకటించింది. భారత్ అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్స్ ఎగుమతికి సంబంధించి అమెరికా ఆంక్షలను నిశితంగా పరిశీలిస్తోంది. ఈ నెల ప్రారంభంలో దిగుమతులపై అమెరికా ఆంక్షలు విధించబోతున్నట్లు ప్రకటించింది. ఈ నిబంధనలు చైనా, రష్యా వంటి దేశాల్లో సాంకేతిక పురోగతిని నిరోధించడమే లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిసింది. అయితే ఇతర దేశాలపైనా వీటి ప్రభావంపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈనేపథ్యంలో ఏఐ చిప్ ఎగుమతుల పరిణామాలను భారత్ నిశితంగా గమనిస్తోంది.అమెరికా ఆంక్షల పరిధిఅమెరికా ఎగుమతులపై విధించిన ఆంక్షలకు సంబంధించి వివిధ దేశాలను భద్రత, మానవ హక్కుల ప్రమాణాల ఆధారంగా మూడు అంచెలుగా వర్గీకరించింది. టైర్ 1లో యూకే, జపాన్, ఆస్ట్రేలియా వంటి మిత్ర దేశాలు ఉన్నాయి. ఇవి ఎటువంటి ఆంక్షలను ఎదుర్కోవు. భారతదేశం, సింగపూర్, ఇజ్రాయెల్ టైర్ 2 దిగుమతులపై కొన్ని పరిమితులను ఎదుర్కొంటాయి. ఇందులో భాగంగా అధునాతన ఏఐ చిప్లకు లైసెన్సింగ్ అవసరం. టైర్ 3లో చైనా, రష్యా వంటి దేశాలు ఉన్నాయి. ఈ దేశాలు తయారు చేసిన చిప్లను కొనుగోలు చేయకుండా పూర్తిగా నిషేధించాయి.ఇదీ చదవండి: మార్కెట్ ఆధారిత సంస్కరణలు అవసరంభారత్ ఏఐ మౌలిక సదుపాయాలపై ప్రభావంసమీప భవిష్యత్తులో 10,000 జీపీయూ(Graphics Processing Unit)లతో ఏఐ కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రతిష్టాత్మక జాతీయ ఏఐ మిషన్ ఈ ఆంక్షల కారణంగా అడ్డంకులను ఎదుర్కొనుంది. 2027 వరకు 50,000 జీపీయూలను సిద్ధం చేయాలనే భారత ప్రణాళికలు ఈ ఆంక్షల వల్ల ప్రభావితం చెందే అవకాశం ఉంది. అయితే భారత్ యూఎస్ ఆంక్షల పరంగా టైర్2 విభాగంలో ఉండడంతో ఏఐ చిప్ల లైసెన్సింగ్ సదుపాయాలు మరింత మెరుగుపడాల్సి ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఆంక్షల వల్ల కంపెనీల నిర్వహణ ఖర్చులు పెరిగే ప్రమాదం ఉందని ఇండియా ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీకండక్టర్ అసోసియేషన్ (ఐఈఎస్ఏ) ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్లకు కీలకమైన జీపీయూలకు మార్కెట్ తగ్గే అవకాశం ఉందని తెలిపింది. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం తగిన మార్గాలను అన్వేషించాలని కోరింది. -
తిరుమలలో సిఫారసు లేఖల దుర్వినియోగంపై టీటీడీ నిఘా
-
కన్నవారి ఆరోగ్యంపై బెంగ.. ఎన్ఆర్ఐల కోసం ఏఐ పరిష్కారం
ఉద్యోగాలు, వ్యాపారాల రీత్యా చాలా మంది భారతీయులు విదేశాల్లో ఉంటున్నారు. అయితే వారి బెంగ అంతా భారత్లో ఉంటున్న తమ తల్లిదండ్రుల ఆరోగ్యంపైనే ఉంటుంది. ఇలాంటి ఎన్ఆర్ఐల కోసమే డోజీ అనే కంపెనీ డోజీ శ్రవణ్ పేరుతో క్లినికల్-గ్రేడ్ ఏఐ ఆధారిత రిమోట్ పేరెంట్ మానిటరింగ్ సర్వీస్ను ఆవిష్కరించింది.డోజీ శ్రవణ్తో విదేశాలలో ఉన్న ఎన్ఆర్ఐలు భారత్లోని తమ తల్లిదండ్రుల ఆరోగ్యాన్ని క్రమం తప్పకుండా ట్రాక్ చేయొచ్చు. డోజీ ఏఐ ఆధారిత, కాంటాక్ట్లెస్ రిమోట్ హెల్త్ మానిటరింగ్ టెక్నాలజీ వృద్ధులకు ఎటాంటి ఇబ్బంది లేకుండా వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనించి కుటుంబ సభ్యులకు, వైద్యులకు చేరవేస్తుంది.ఏఐ ఆధారిత బలిస్టోకార్డియోగ్రఫీతో రూపొందించిన ఈ సిస్టమ్ బయోమార్కర్లను విశ్లేషించడానికి, ఏవైనా వ్యత్యాసాలుంటే సకాలంలో హెచ్చరికలను అందించడానికి అధునాతన ఏఐ అల్గారిథమ్లను ఉపయోగిస్తుంది. ఆరోగ్య అత్యవసర పరిస్థితుల ప్రమాదాన్ని తగ్గించి సకాలంలో వైద్య సేవలు పొందేలా చేస్తుంది. ఈ సాంకేతికత యూఎస్ ఎఫ్డీఏ ఆమోదం పొందింది. డేటా గోప్యత విషయంలో అంతర్జాతీయ ప్రమాణాలకు కట్టుబడి ఉంది. -
Lok Sabha Elections 2024: ఈసీ ‘మెనూ కార్డు’
చాయ్కి పంజాబ్లోని జలంధర్లో రూ.15. అదే మధ్యప్రదేశ్లోని మాండ్లాలో అయితే రూ.7. సమోసా కూడా పంజాబ్లో రూ.15 అయితే మధ్యప్రదేశ్లో రూ.7.5. ఏమిటీ ధరలంటారా? లోక్సభ ఎన్నికల ప్రచార నిమిత్తం అభ్యర్థులకు ఎన్నికల సంఘం నిర్ధారించిన ధరలివి. వీటిని జిల్లా ఎన్నికల విభాగాలు స్థానికంగా నిర్ధారిస్తుంటాయి. దాంతో అవి ఒక్కో ప్రాంతానికి ఒక్కోలా ఉంటాయి. అభ్యర్థుల ఎన్నికల వ్యయంపై గరిష్ట పరిమితి ఉందన్నది తెలిసిందే. లోక్సభ ఎన్నికల్లో ఒక్కో అభ్యరి్థకి ఈసీ నిర్ధారించిన పరిమితి రూ.95 లక్షలు. అరుణాచల్, గోవా, సిక్కిం రాష్ట్రాల్లో మాత్రం రూ.75 లక్షలు. కేంద్రపాలిత ప్రాంతాల్లో రూ.75–95 లక్షల మధ్య ఉంది. నామినేషనల్ దాఖలు చేసిన నాటి నుంచి ఫలితాలు వెల్లడించే తేదీ దాకా అభ్యర్థులు చేసే ఎన్నికల వ్యయం ఈ పరిమితిని దాటకుండా ఈసీ డేగ కళ్లతో గమనిస్తూ ఉంటుంది. ఇందుకోసం బ్యానర్లు, ఫ్లెక్సీలు, సభా వేదికలు మొదలుకుని కార్యకర్తలు, అభిమానులకు ఆహారం దాకా ప్రతిదానికీ రేటును ఫిక్స్ చేస్తుంది. అయితే వాటికీ, వాస్తవ ధరలకూ చాలాసార్లు పొంతనే ఉండదు. దాంతో ఈసీ ‘మెనూ కార్డు’పై మీడియాలో, సోషల్ మీడియాలో జోకులు పేలుతుండటం పరిపాటి. మరోవైపు, ఎన్నికల వ్యయంపై అభ్యర్థులకు పరిమితి ఉన్నా పార్టీలు చేసే ఖర్చుకు మాత్రం అలాంటిదేమీ లేకపోవడం విశేషం! చాయ్ రూ.5 నుంచి 15 దాకా... చాయ్ ధరను దేశవ్యాప్తంగా ప్రాంతాన్ని బట్టి రూ.5 నుంచి రూ.15 దాకా ఈసీ నిర్ధారించింది. మధ్యప్రదేశ్లోని బాలాఘాట్లో కప్పు చాయ్ రూ.5, సమోసా రూ.10. ఇడ్లీ, సాంబార్ వడా, పోహా–జిలేబీ ప్లేటు రూ.20. దోసా, ఉప్మా మాత్రం ప్లేటు రూ.30. మణిపూర్లో జాతుల హింసకు కేంద్రాల్లో ఒకటైన తౌబల్ జిల్లాలో చాయ్, సమోసా, కచోరీ, ఖజూర్, గాజా ఒక్కోటీ రూ.10. రాష్ట్రంలోని తెంగ్నౌపాల్ జిల్లాలో బ్లాక్ టీ రూ.5, సాదా టీ రూ.10. మణిపూర్లో బాతు మాంసం రూ.300. పంది మాంసం రూ.400. ఇక్కడి ఈసీ మెనూలో చికెన్తో పాటు చేపలు కూడా ఉన్నాయి. జలంధర్లో ప్లేటు చోలే భటూరేకు ఈసీ నిర్ధారించిన ధర రూ.40. కిలో చికెన్కు రూ.250, మటన్కు రూ.500. మిఠాయిల్లో ధోడా రూ.450, ఘీ పిన్నీ రూ.300. గ్లాసు లస్సీ రూ.20, నిమ్మరసం రూ.15. చెన్నైలో తగ్గిన చికెన్ బిర్యానీ రేటు చెన్నైలో 2019 లోక్సభ ఎన్నికలతో పోలిస్తే చాయ్ ధరను రూ.10 నుంచి రూ.15కు ఈసీ పెంచింది. కాఫీ కూడా రూ.15 నుంచి రూ.20కి పెరిగింది. కానీ చికెన్ బిర్యానీ ధరను మాత్రం రూ.180 నుంచి రూ.150కి తగ్గించడం విశేషం! ఢిల్లీ శివార్లలో నోయిడా పరిధిలోని గౌతంబుద్ధ నగర్లో వెజ్ భోజనం రూ.100. సమోసా, చాయ్ రూ.10. కచోరీ రూ.15, శాండ్విచ్ రూ.25, జిలేబీ కిలో రూ.90. ఉత్తర గోవాలో బటాటా (ఆలూ) వడ, సమోసా రూ.15. చాయ్ రూ.15, కాఫీ రూ.20. హరియాణాలోని జింద్లో దాల్ మఖానీ, మిక్స్డ్ వెజ్ కర్రీ రూ.130. మటర్ పనీర్ రూ.160. ఇక్కడ ఈసీ మెనూలో బటర్ నాన్, మిస్సీ రోటీ, ప్లెయిన్ రోటీలతో పాటు కాజూ కట్లీ, గులాబ్జామ్ వంటివి కూడా ఉన్నాయి. వీటికీ రేట్లు ఫిక్స్... ► ఖరీదైన హెలీప్యాడ్లు, లగ్జరీ వాహనాలు, ఫామ్హౌజ్లతో పాటు పూలు, కూలర్లు, టవర్ ఏసీలు, సోఫాల వంటివాటికి కూడా ఈసీ రేట్లు నిర్ధారించింది. ► సభలు, సమావేశాలకు జనాన్ని తరలించేందుకు బస్సులు మొదలుకుని టాటా సఫారీ, స్కార్పియో, హోండా సిటీ, సియాజ్... ఇలా బ్రాండ్లవారీగా కూడా ఒక్కో వాహనానికి ఒక్కో రేటు నిర్ణయించింది. ► దండల్లో కూడా గులాబీ, బంతి... ఇలా పూలను బట్టి రేట్లు నిర్ణయమయ్యాయి. పార్టీల జెండాలు, టోపీలకూ అంతే. ► సభలు, సమావేశాలకు వేదికలు, నేతలకు బస తదితరాలతో పాటు ప్రకటనలు, హోర్డింగులు, కరపత్రాలు, ఫ్లెక్సీలు, ఇతర ప్రచార సామగ్రికి కూడా ఇంత అని ఈసీ ముందే రేట్లు ఫిక్స్ చేసి పెట్టింది. కొసమెరుపు: ఎన్నికల వేళ కార్యకర్తలకు పారీ్టలు, అభ్యర్థులు మద్యం అందుబాటులో ఉంచడం బహిరంగ రహస్యమే. కానీ ఈసీ మెనూలో మద్యానికి మాత్రం చోటులేకపోవడం విశేషం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Iceland volcano: భూగర్భంలో భుగభుగలు
అనగనగా ఒక చిన్న పల్లెపట్టు. అంతా సజావుగా సాగిపోతున్న వేళ. ఉన్నట్టుండి ఎటు చూస్తే అటు భూమిపై పగుళ్లు. చూస్తుండగానే అందులోంచి ఫౌంటేన్లా విరజిమ్ముతూ లావా ప్రవాహాలు. బిక్కచచి్చపోయి కకావికలమవుతున్న జనం. ఏదో హాలీవుడ్ సినిమాలా ఉంది కదూ! ఐస్లాండ్లో పశ్చిమ రెగ్జానెస్ ద్వీపకల్పంలోని గ్రెంతావిక్ అనే బుల్లి బెస్త గ్రామం, దాని పరిసర ప్రాంతాలు ఇప్పుడు అచ్చం అలాంటి భయానక పరిస్థితినే ఎదుర్కొంటున్నాయి. అక్కడ భూగర్భంలో 800 ఏళ్లుగా నిద్రాణంగా ఉన్న అపారమైన లావా రాశి కొన్నాళ్లుగా ఒళ్లు విరుచుకుంటోంది. భారీ ప్రవాహంగా మారి భయపెడుతోంది...! ఐస్లాండ్ అగ్నిపర్వతాలకు పెట్టింది పేరు. అక్కడి రెగ్జానెస్ ద్వీపకల్పమైతే అందమైన అగ్నిపర్వతాలకు నిలయం. పెద్ద టూరిస్టు స్పాట్ కూడా. గత 800 ఏళ్లలో ఈ ప్రాంతంలో ఒక్క అగ్నిపర్వతం కూడా బద్దలవలేదు. అలాంటిది గతేడాది నుంచి ఇక్కడ పరిస్థితులు మారుతున్నాయి. కొద్ది రోజులుగా భయానక స్థాయికి చేరాయి. ముఖ్యంగా గ్రెంతావిక్, పరిసర ప్రాంతాల్లో గత నెల రోజుల్లోపే ఏకంగా మూడుసార్లు అగ్నిపర్వతాలు బద్దలయ్యాయి. లావా ప్రవాహాలు ఉవ్వెత్తున ఎగజిమ్మి భయభ్రాంతులను చేశాయి. దాంతో ఆ ప్రాంతాలవారిని ఖాళీ చేయించాల్సి వచి్చంది. ఇదంతా టీజర్ మాత్రమేనని అసలు ముప్పు ముందుందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. గ్రెంతావిక్ కింద భూగర్భంలో మాగ్మా (శిలాద్రవం) పూర్తిగా కరిగి అపార లావా ప్రవహంగా మారిందని తేల్చారు! దాని పరిమాణం రికార్డు స్థాయిలో ఏకంగా 65 లక్షల క్యూబిక్ మీటర్లని లెక్కగట్టారు! అంతేకాదు, ఈ లావా భూగర్భంలో ఏకంగా సెకనుకు 7,400 క్యుబిక్ మీటర్ల వేగంతో ప్రవహిస్తోందట. ఇది డాన్యుబ్ వంటి భారీ నదుల ప్రవాహ వేగం కంటే కూడా చాలా ఎక్కువ. 2021–23 మధ్య ఇక్కడ భూగర్భంలో నమోదైన లావా ప్రవాహ రేటు కంటే ఇది 100 రెట్లు ఎక్కువని అధ్యయన సారథి యూనివర్సిటీ ఆఫ్ ఐస్లాండ్లోని నోర్డిక్ వోల్కెనోలాజికల్ సెంటర్కు చెందిన ప్రొఫెసర్ ఫ్రెస్టెనిన్ సిగ్మండ్సన్ లెక్కగట్టారు. ఈ లావా ప్రవాహం ఉజ్జాయింపుగా 15 కిలోమీటర్ల పొడవు, నాలుగు కిలోమీటర్ల ఎత్తు, కేవలం కొన్ని మీటర్ల వెడల్పున్నట్టు తేల్చారు. ఈ గణాంకాలు, హెచ్చరికలతో కూడిన అధ్యయనం జర్నల్సైన్స్లో గురువారం ప్రచురితమైంది. అందుకు కేవలం కొన్ని గంటల ముందే ఆ ప్రాంతమంతటా అగ్నిపర్వతం బద్దలవడంతో పాటు భూగర్భం నుంచి కూడా లావా ఎగజిమ్మిన ఉదంతాలు నమోదయ్యాయి! ఇలా జరగడం గత రెండు నెలల్లో మూడోసారి. గతేడాది డిసెంబర్ 18 నుంచి ఈ ప్రాంతాల్లో మూడు రోజుల పాటు లావా ఎగజిమ్మింది. మళ్లీ ఈ ఏడాది జనవరి 14న కూడా రెండుసార్లు లావా పెల్లుబికింది. దాంతో ప్రభుత్వం హుటాహుటిన రంగంలోకి దిగింది. ఈ ద్వీపకల్పమంతటా ఎమర్జెన్సీ ప్రకటించింది. భవిష్యత్తుపై ఆందోళన తాజా పరిస్థితుల నేపథ్యంలో రెగ్జానెస్ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. కొద్ది రోజులుగా గ్రెంతావిక్తో పాటు ఇక్కడి పలు ఆవాస ప్రాంతాల్లో భూగర్భంపై ఒత్తిడి తీవ్రతరమవుతున్న సూచనలు ప్రస్ఫుటమవుతున్నాయి. భూమిలోంచి లావా ప్రవాహాలు ఎగజిమ్ముతుండటమే గాక ఎక్కడ పడితే అక్కడ పెద్ద పెద్ద పగుళ్లు కనిపిస్తున్నాయి. భారీ సంఖ్యలో భూ ప్రకంపనలూ నమోదవుతున్నాయి. ఒక పెద్ద క్రీడా మైదానంలో సగానికి పైగా భారీ పగులు ఏర్పడటం వణికిస్తోంది. ప్రస్తుతానికైతే మొత్తం ద్వీపకల్పం భవిష్యత్తుపైనే నీలినీడలు కమ్ముకున్నాయని ప్రొఫెసర్ సిగ్మండ్సన్ ఆవేదనగా చెబుతున్నారు. రోజులు గడుస్తున్న కొద్దీ లావా ప్రవాహం మరింతగా పెరిగేలా ఉందని కూడా ఆయన హెచ్చరించారు. అగ్నిపర్వతాల పుట్టిల్లు ప్రపంచంలోకెల్లా అత్యధిక సంఖ్యలో చురుకైన అగ్నిపర్వతాలు ఉన్న దేశంగా ఐస్లాండ్కు పేరుంది. అందుకే దాన్ని లాండ్ ఆఫ్ ఫైర్ అండ్ ఐస్ అని చమత్కరిస్తుంటారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 30కి పైగా అగ్నిపర్వతాలు చురుగ్గా ఉన్నాయి. ఇవి భారీ పర్యాటక ఆకర్షణలు కూడా. వీటిని చూసేందుకు ఏటా విదేశీయులు వస్తుంటారు. ఐస్లాండ్ మిడ్ అట్లాంటిక్ రిడ్జ్ ప్రాంతంలో ఉండటమే అక్కడ ఇన్ని అగ్నిపర్వాతల పుట్టుకకు ప్రధాన కారణమన్నది సైంటిస్టుల అభిప్రాయం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పసికందులు ఎందుకు ఏడుస్తున్నారో ఠక్కున చెప్పేసే డివైజ్!
ఇంకా మాటలు రాని వయసులో కేరింతలు, ఏడుపులు మాత్రమే పసికందుల భాష. పసిపిల్లలు సంతోషంగా ఉన్నప్పుడు బోసినవ్వులొలికిస్తూ కేరింతలు కొడతారు. ఆకలేసినప్పుడు, ఏదైనా బాధ కలిగినప్పుడు ఏడుస్తారు. పసిపిల్లల ఏడుపును అర్థం చేసుకోవడం ఒక్కోసారి కష్టంగా ఉంటుంది. ఆకలితోనే ఏడుస్తున్నారా, మరే కారణం వల్ల ఏడుస్తున్నారా తెలుసుకోవడం అంత సులువు కాదు. గుక్కతిప్పుకోకుండా ఏడ్చే పసిపిల్లలతో తల్లులు నానా తంటాలు పడుతుంటారు. పసిపిల్లలు ఏడ్చేటప్పుడు ఇకపై అంతగా ఇబ్బంది పడాల్సిన పనిలేదు. ఇదిగో ఈ బుల్లిపరికరం పసికందుల ఏడుపును మనకు బోధపడే భాషలోకి అనువదిస్తుంది. ఇది ఇరవై నాలుగు గంటలూ పసికందులను కంటికి రెప్పలా కనిపెడుతూ ఉంటుంది. వారు ఏడుస్తున్నట్లయితే, ఎందుకు ఏడుస్తున్నారో ఇట్టే తెలియజెబుతుంది. అమెరికన్ కంపెనీ ‘మాక్సికోసీ’ పిల్లల ఏడుపును అనువదించే ఈ బుల్లిరోబోను ఇటీవల రూపొందించింది. దీనికి అనుబంధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసే బేబీ మానిటర్ కూడా ఉంటుంది. పిల్లలు ఏడుస్తున్నట్లయితే, వారు ఆకలికి ఏడుస్తున్నారో, నిద్రవస్తున్నందుకు ఏడుస్తున్నారో, భయం వల్ల ఏడుస్తున్నారో, గందరగోళం వల్ల ఏడుస్తున్నారో ఇది ఇట్టే చెప్పేస్తుంది. దీని ధర 61.99 డాలర్లు (రూ.5,154) మాత్రమే!. (చదవండి: కాస్మెటిక్ ఆక్యుపంక్చర్ గురించి విన్నారా?) -
పోలీస్ స్పందన 7 నిమిషాల్లో..
సాక్షి, హైదరాబాద్: ఏదైనా సంఘటన చోటుచేసుకున్న వెంటనే బాధితులు లేదా అక్కడ ఉన్నవారు వెంటనే డయల్ 100కు కాల్ చేస్తారు. ఆ కాల్ రిసీవ్ చేసుకున్నాక ఎంత తక్కువ సమయంలో పోలీసులు ఆ స్థలానికి చేరుకుంటే అంత మెరుగైన ఫలితాలు వస్తాయి. దీనినే సాంకేతికంగా ‘పోలీస్ రెస్పాన్స్ టైమ్’అంటారు. గస్తీ విధానంలో జవాబుదారీతనం పెంచడం, నేరాలు చోటు చేసుకునే ప్రాంతాల్లోనే పెట్రోలింగ్ జరిగేలా చూడటం తదితర లక్ష్యాలతో ఓ యాప్ అందుబాటులోకి తీసుకొచ్చారు. దీని ద్వారా 2023కు సంబంధించి రెస్పాన్స్ టైమ్ను లెక్కించారు. ప్రస్తుతం రాష్ట్రంలో సరాసరిన ఈ సమయం ఏడు నిమిషాలుగా ఉండగా, ఈ ఏడాది మరింత తగ్గించాలనేది పోలీసులు టార్గెట్గా పెట్టుకున్నారు. ఒకప్పుడు ఇలా... ఎవరైనా ‘100’కు కాల్ చేస్తే, అది నేరుగా ‘డయల్–100’కమాండ్ సెంటర్కు చేరుతుంది. వెంటనే వారు బాధితుడు ఏ ఠాణా పరిధిలోకి వస్తాడో వాకబు చేస్తారు. ఆ తర్వాత సదరు ఫోన్ కాల్లోని అంశాలను సంక్షిప్త సందేశంగా (టెక్ట్స్) మార్చి బాధితుడున్న ఏరియాలోకి వచ్చే ఠాణాతో పాటు జోన్ కార్యాలయం, కమిషనరేట్కు చెందిన ప్రధాన కంట్రోల్ రూమ్లోని కంప్యూటర్లకు పంపించేవారు. దీంతో పాటు వాకీటాకీ ద్వారానూ సమాచారం ఇచ్చి గస్తీ వాహనాలను అప్రమత్తం చేసేవారు. ఈ సమాచారం అందుకునే గస్తీ వాహనం ఎక్కడ ఉంది? బాధితుడికి ఎంత దూరంలో ఉంది? తదితర అంశాలు తెలుసుకునే అవకాశం ఉండేదికాదు. ఫలితంగా గస్తీ వాహనం బాధితుడి వద్దకు చేరే సమయం చాలా ఎక్కువగా ఉండేది. ఘటనాస్థలికి చేరిన తర్వాత పెట్రోలింగ్ సిబ్బంది చెప్పే అంశాల ఆధారంగా ఫిర్యాదుగా పరిగణించే ఫోన్ కాల్ను క్లోజ్ చేసేవారు. ఇప్పుడు...ట్యాబ్నే ‘జీపీఎస్’ బాధితుడు ‘100’కు ఫోన్ చేసి సçహాయం కోరిన వెంటనే అక్కడి సిబ్బంది సదరు ఫిర్యాదుదారుడు ఉన్న ప్రాంతాన్ని అడిగి తెలుసుకుంటున్నారు. సిటీలోని ప్రతి గస్తీ వాహనం, బ్లూకోల్ట్స్లకు పోలీసు విభాగం ట్యాబ్స్ అందించింది. ఇవే జీపీఎస్ పరికరంగా పనిచేస్తుండటంతో దాని ఆధారంగా ‘డయల్–100’సిబ్బందికి ఏ వాహనం ఏ ప్రాంతంలో ఉందో కంప్యూటర్ తెర/ట్యాబ్/ప్రత్యేక యాప్ ద్వారా కచి్చతంగా తెలుస్తుంది. దీంతో బాధితుడు ఉన్న ప్రాంతానికి సమీపంలో ఉన్న వాహనానికే నేరుగా ఆ ఫోన్ కాల్ డైవర్ట్ చేస్తున్నారు. ఈ తతంగం మొత్తం కేవలం కొన్ని సెకన్ల వ్యవధిలో పూర్తయ్యేలా ఏర్పాట్లు చేశారు. పెట్రోలింగ్ వాహనాల్లో ఉండే సిబ్బంది ఫోన్లకు ‘100’నుంచి డైవర్డ్ అయిన కాల్ వస్తే.. ప్రత్యేక రింగ్టోన్ ద్వారా ట్యాబ్లో రింగ్ వస్తుంది. ఫోన్ ఎక్కడ నుంచి అనేది తేలిగ్గా తెలియడానికి అన్ని వాహనాల్లోని సిబ్బందికీ ఇలాంటి రింగ్టోన్ ఏర్పాటు చేశారు. ఆ సిబ్బంది ఫోన్ ఎత్తిన వెంటనే ఆ ట్యాబ్లో తెరపై ఓ నోటిఫికేషన్ ప్రత్యక్షమవుతుంది. అందులో బాధితుడు/ఫిర్యాదుదారుడికి సంబంధించిన అంశాలు, ఫిర్యాదు ఏమిటన్నవి కనిపిస్తాయి. వీటిని చూసిన వెంటనే గస్తీ వాహనంలోని సిబ్బంది ‘రిసీవ్డ్’అనే బటన్ నొక్కడం ద్వారా ఫిర్యాదు అందుకున్నట్టు ధ్రువీకరిస్తున్నారు. అలా...గణన షురూ.. పెట్రోలింగ్ వాహనం, బ్లూకోల్ట్స్ సిబ్బంది ఒకసారి ఫిర్యాదు అందుకున్నట్టు ట్యాబ్లో ఉండే ‘100 యాప్’ద్వారా ధ్రువీకరించిన వెంటనే ‘రెస్పాన్స్ టైమ్’లెక్కింపు ప్రారంభమవుతోంది. ఘటనాస్థలికి చేరుకునే గస్తీ వాహనాలు ఫిర్యాదు తీరును బట్టి అవసరమైన రీతిలో స్పందించే విధంగా సాంకేతిక చర్యలు తీసుకున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే క్షతగాత్రులకు అవసరమైన సహాయం అందించడంతో పాటు, ఆధారాల కోసం ఫొటోలు తీసుకుంటున్నారు. పబ్లిక్ ప్లేస్లో జరిగే గొడవలు, ఇతర నేరాలకు సంబంధించిన ఫిర్యాదు అయితే స్థానిక పోలీసులను అప్రమత్తం చేస్తారు. దీంతో ఘటనాస్థలాల్ని వీడియోలో చిత్రీకరించి భద్రపరుస్తున్నారు. సహాయక చర్యలు, తదుపరి యాక్షన్స్ తీసుకోవడం పూర్తయిన వెంటనే సదరు ఫొటోలు, వీడియోలు ఆన్లైన్ ద్వారానే సంబంధిత స్టేషన్ హౌస్ఆఫీసర్కు పంపిస్తున్నారు. ‘క్లోజ్’చేసే వరకు ‘టైమ్ రన్నింగ్’... గస్తీ బృందాలు ఘటనాస్థలికి చేరుకోవడం వంటి చర్యలు పూర్తయిన తర్వాత మొదట వచ్చిన నోటిఫికేషన్ మళ్లీ ఓపెన్ చేయాలి. అందులో ఉండే ‘కాల్ క్లోజ్’బటన్ నొక్కడంతో ఈ వ్యవహారం పూర్తవుతుంది. అప్పటి వరకు సమయం లెక్కింపు జరుగుతూ ఉంటుంది. ఈ సమయాన్నే ‘పోలీసు రెస్పాన్స్ టైమ్’గా పరిగణిస్తున్నారు. ఫోన్కాల్ వచ్చిన దగ్గర నుంచి జరిగే ప్రతిదీ ‘డయల్–100’తో పాటు కమిషనరేట్ కంట్రోల్ రూమ్, జోనల్ కార్యాలయాలకు చేరుతూ పర్యవేక్షణకు దోహదం చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ రెస్పాన్స్ టైమ్ పట్టణాల్లో తక్కువగా, గ్రామాల్లో ఎక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది అన్ని ప్రాంతాల్లోనూ తగ్గేలా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. -
ఆస్పత్రుల వ్యర్థాలపై నిఘా
లబ్బీపేట (విజయవాడ తూర్పు): ఆస్పత్రులలోని వ్యర్థాల (బయో మెడికల్స్) సేకరణ, నిర్వీర్యంపై ప్రభుత్వం నిబంధనల్ని కఠినతరం చేసింది. ఆస్పత్రి నుంచి సేకరించిన వ్యర్థాలు కంపెనీకి తీసుకెళ్లి నిర్వీర్యం చేసేవరకూ నిరంతరం నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఎక్కడా బయో మెడికల్ వ్యర్థాలను బయట వేయకుండా.. కచ్చితంగా వాటిని నిర్వీర్యం చేసేలా వ్యవస్థను పటిష్టం చేశారు. వాహనాలకు జీపీఎస్ సిస్టమ్ అమర్చారు. ఆస్పత్రిలో వ్యర్థాలను సేకరించినప్పుడు, కంపెనీకి తరలించిన తర్వాత బ్యాగ్లను స్కాన్ చేసేలా బార్ కోడింగ్, కంపెనీ వద్ద ఆన్లైన్ ఎమిషన్ మోనిటరింగ్ సిస్టమ్ ఏర్పాటు వంటి విధానాలను అమలు చేస్తున్నారు. ప్రస్తుతం ఉమ్మడి కృష్ణాజిల్లాలో 17,200 బెడ్స్ ఉండగా.. నిత్యం 5 వేల బెడ్స్పై రోగులు చికిత్స పొందుతుంటారని కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) లెక్కలు చెబుతున్నాయి. ప్రతి రోజూ 1.20 టన్నుల నుంచి 1.40 టన్నుల బయో మెడికల్ వ్యర్థాల సేకరణ, నిర్వీర్యం జరుగుతున్నట్టు పీసీబీ అధికారులు చెపుతున్నారు. తరలింపు.. నిర్వీర్యంపై నిఘా బయో మెడికల్ వ్యర్థాలను సంబంధిత కంపెనీకి ఖచ్చితంగా తరలించేలా ప్రభుత్వం నిఘా పటిష్టం చేసింది. ప్రతి బ్యాగ్కు బార్ కోడింగ్ ఏర్పాటు చేశారు. ఆస్పత్రి నుంచి సేకరించేటప్పుడు బార్ కోడింగ్ను స్కాన్ చేయడంతో పాటు కంపెనీకి తరలించిన తర్వాత దానిని స్కాన్ చేయాల్సి ఉంది. అప్పుడే దానిని నిర్వీర్యం చేసేందుకు తరలించినట్టు నిర్థారణ అవుతుంది. ఆస్పత్రి యాజమాన్యాలకు మొబైల్ యాప్ ప్రవేశ పెట్టారు. ఈ యాప్లో ప్రతిరోజూ ఆస్పత్రిలో ఎన్ని పడకలపై రోగులు ఉన్నారు. ఆ రోజు వ్యర్థాలు ఎంత ఉన్నాయి అనే విషయాలను యాప్లో అప్లోడ్ చేయాల్సి ఉంది. బయో మెడికల్ వ్యర్థాలను తరలించే ప్రతి వాహనానికి జీపీఎస్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. ఆస్పత్రి నుంచి సేకరించిన వ్యర్థాలు కంపెనీ వద్దకు వెళ్లాయా లేదా ఇతర ప్రాంతాలకు వెళ్లాయా అనే దానిపై నిఘా వేస్తారు. జగ్గయ్యపేట సమీపంలో బయో వ్యర్థాల నిర్వీర్యం ప్లాంట్ ఉంది. ఆ ప్లాంట్లో వ్యర్థాల నిర్వీర్యం ప్రక్రియను నిరంతరం ఆన్లైన్ ఎమిషన్ మోనిటరింగ్ సిస్టమ్ ద్వారా పరిశీలిస్తుంటారు. అక్కడ ఎంత డిగ్రీల్లో నిర్వీర్యం చేస్తున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వీర్యం సమయంలో వచ్చే పొగలో ఏమైనా రసాయనాలు ఉన్నాయా, హానికర కాలుష్యం వస్తోందా అనే అంశాలను పరిశీలిస్తారు. వ్యర్థాలకు కలర్ కోడింగ్ ఆస్పత్రిలోని వ్యర్థాలకు కలర్ కోడింగ్ను ఏర్పాటు చేశారు. పసుపు, ఎరుపు, బ్లూ, తెలుపు నాలుగు రంగుల్లో ఉన్న బ్యాగుల్లో నిర్ధేశించిన వ్యర్థాలను ఆస్పత్రి సిబ్బంది వేసేలా ఇప్పటికే అవగాహన కల్పించారు. పసుపు బ్యాగుల్లో మానవ శరీర సంబంధమైన వ్యర్థాలు, జంతు శరీర సంబంధమైన వ్యర్థాలు, మాయ, కలుషిత దూది, డ్రెస్సింగ్ క్లాత్, విషపూరిత వ్యర్థాలు, గడువు ముగిసిన మందులు, మాస్్కలు వేస్తారు. వీటిని కంపెనీకి తరలించి 1,200 డిగ్రీల వద్ద నిర్వీర్యం చేస్తారు. ఎరుపు బ్యాగుల్లో సిరంజీలు, ఐవీ సెట్, కాథెటర్, గ్లౌజులు, బ్లడ్ బ్యాగ్స్, యూరిన్ బ్యాగ్స్, డయాలసిస్ కిట్, ఐవీ బాటిల్స్ వేసేలా ఏర్పాట్లు చేశారు. తెలుపు బ్యాగ్స్లో సూదులు, స్థిర సూదులు, సిరంజిలు, బ్లేడ్లు, శస్త్ర చికిత్స బ్లేడ్లు వేస్తారు. బ్లూ బ్యాగ్స్ గ్లాసుతో చేసిన ఇంజెక్షన్ బాటిల్స్, గాజు సీసాలు, ల్యాబ్ స్లైడ్స్, ఇంప్లాంట్స్, కత్తెరలు వేసేలా అవగాహన కల్పించారు. అవగాహన కలిగిస్తున్నాం ప్రతి ఆస్పత్రిలో వ్యర్థాలను నిబంధనల మేరకు కలర్ కోడింగ్ ఆధారంగా వేరు చేయాలని యాజమాన్యాలకు అవగాహన కల్పిస్తున్నాం. వ్యర్థాల తరలింపు, నిర్వీర్యం వంటి వాటిపై నిరంతర నిఘా ఏర్పాటు చేశాం. – పి.శ్రీనివాసరావు, ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్, కాలుష్యనియంత్రణ మండలి -
ఖరీఫ్ ధాన్యం సేకరణకు సన్నాహాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఖరీఫ్ ధాన్యం సేకరణకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ సీజన్లో దాదాపు 40 లక్షల టన్నుల ధాన్యం సేకరణకు విస్తృత ఏర్పాట్లుచేస్తోంది. కల్లంలో పంట కొనుగోలు దగ్గర నుంచి మిల్లుకు తరలించే వరకు ఎక్కడా జాప్యం లేకుండా రైతుకు సంపూర్ణ మద్దతు ధర అందించడమే లక్ష్యంగా ప్రత్యేకంగా రోడ్ మ్యాప్ను సిద్ధంచేస్తోంది. రైతుభరోసా కేంద్రం (ఆర్బీకే) స్థాయిలో ధాన్యం రవాణాకు దాదాపు 30వేలకు పైగా వాహనాలను అందుబాటులో ఉంచనుంది. ప్రైవేటు కాంట్రాక్టు వాహనాలతో పాటు రైతుల సొంత వాహనాలకు భాగస్వామ్యం కల్పిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే ఆర్బీకేల్లో వాహనాల రిజిస్ట్రేషన్లను ప్రారంభించింది. నిజానికి.. వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈ ఖరీఫ్లో పంట ఆలస్యంగా సాగైంది. ఫలితంగా నవంబర్ రెండో వారం తర్వాత కోతలు పూర్తిస్థాయిలో ప్రారంభమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఒక్కో ఆర్బీకే క్లస్టర్లో పది వాహనాలు.. రాష్ట్రవ్యాప్తంగా 3,500కు పైగా ఆర్బీకే క్లస్టర్లలో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను నిర్వహిస్తోంది. సీజన్లో ఒక్కో ఆర్బీకే క్లస్టర్లో దాదాపు 10 వాహనాలను కేటాయించనుంది. కాంట్రాక్టర్ల నుంచి ముందస్తుగా కొంత సెక్యూరిటీ డిపాజిట్లు సేకరించిన అనంతరం వారికి ధాన్యం తరలింపు కాంట్రాక్టును ఇస్తోంది. రైతుల నుంచి సేకరించిన ధాన్యం పక్కదారి పట్టకుండా ప్రభుత్వం నిర్దేశించిన మిల్లుకు మాత్రమే అవి చేరేలా ప్రతి వాహనానికి జీపీఎస్ ట్రాకర్ అమర్చి పర్యవేక్షించనుంది. ఆ తర్వాత బఫర్ గోడౌన్లకు తరలిస్తారు. ఆర్బీకేల వారీగా వివరాల సేకరణ.. ధాన్యం సేకరణలో ఎటువంటి టార్గెట్లు లేకుండా రైతుల నుంచి పూర్తిస్థాయిలో పంట కొనుగోలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పౌరసరఫరాల సంస్థ ఆర్బీకేల వారీగా పంట ఎంత ఉంది? రైతులు బహిరంగ మార్కెట్లో అమ్ముకోగా ఎంతమేరకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వస్తుంది? అన్నదానిపై జిల్లాల వారీగా సమగ్ర నివేదికను సిద్ధంచేస్తోంది. దీని ఆధారంగా ముందస్తుగానే గోతాలు, రవాణా, హమాలీలను సమకూర్చనుంది. అలాగే, 10వేల మందికిపైగా టెక్నికల్ అసిస్టెంట్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, హెల్పర్లను తాత్కాలిక ప్రాతిపదికపైన నియమిస్తోంది. ఖరీఫ్, రబీ రెండు సీజన్లలో కలిపి సుమారు 4–5 నెలల పాటు యువతకు ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది. ఆయా జిల్లాల వారీగా జేసీల ఆధ్వర్యంలో ఎంపిక ప్రక్రియను చేపట్టింది. ఎంపికైన వారికి శిక్షణ ఇవ్వనుంది. ముందస్తు ఏర్పాట్లలో నిమగ్నం ఇక గతంలో పంట దిగుబడి అంచనా ఆధారంగా ఒక ఎకరాకు ఎన్ని ధాన్యం బస్తాలు వస్తాయో లెక్కించేవారు. అనంతరం..ఈ–క్రాప్లో రైతు నమోదు చేసిన పంట విస్తీర్ణ వివరాలను, దిగుబడి అంచనాను బేరీజు వేసుకుని పౌరసరఫరాల సంస్థ రైతు నుంచి నిర్దేశించిన సంఖ్యలో ధాన్యం బస్తాలను సేకరించేది. దీంతో కొనుగోలు కేంద్రాల పరిధిలో అవసరౖమెన గోనె సంచులు, రవాణా వాహనాలు, హమాలీలను వంటి మౌలిక సదుపాయాల కల్పనలో జాప్యం జరిగేది. ప్రస్తుతం పంట దిగుబడి అంచనాతో సంబంధంలేకుండా గడిచిన ఐదేళ్లలో ఏ సంవత్సరం ఎక్కువ దిగుబడి వచ్చిందో ఆ సంఖ్యను ప్రస్తుత సీజన్కు అన్వయించుకుని కొనుగోళ్లకు ముందస్తుగానే ఏర్పాట్లుచేస్తోంది. ప్రభుత్వం రైతుకు మద్దతు ధర కల్పించడంతో పాటు గోనె సంచులు, రవాణా, హమాలీ ఖర్చులను సైతం అందిస్తోంది. టన్నుకు గోనె సంచుల వినియోగానికి రూ.85, హమాలీల కూలి రూ.220, సగటున 25 కిలోమీటర్ల ధాన్యం రవాణాకు రూ.468 చొప్పున మొత్తం జీఎల్టీ (గన్నీ లేబర్ ట్రాన్స్పోర్టు) కింద టన్నుకు రూ.2,523 లబ్ధిచేకూరుస్తోంది. రైతులు మిల్లుకు వెళ్లొద్దు.. రైతులు ఆర్బీకేలో ధాన్యం అప్పగించిన అనంతరం ఎఫ్టీఓ (ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్) అందిస్తాం. అందులో రైతు కొనుగోలు కేంద్రానికి ఇచ్చిన ధాన్యం బరువు, ప్రభుత్వ నుంచి వచ్చే మద్దతు ధర మొత్తం ఉంటుంది. ఒక్కసారి ఎఫ్టీఓ ఇచ్చిన తర్వాత రైతుకు ధాన్యం బాధ్యత ఉండదు. మిల్లుకు ఆర్బీకే సిబ్బందే తరలిస్తారు. ఏదైనా సమస్య వస్తే మిల్లు వద్ద డెప్యూటీ తహసీల్దార్ స్థాయి అధికారిని కస్టోడియన్ ఆఫీసర్గా నియమించి పరిష్కరిస్తాం. ఆర్బీకేలో పరీక్షించిన తేమ శాతాన్ని ఫైనల్ చేస్తాం. దీనిపై రైతులకు అవగాహన కల్పించేలా వీడియోలను రూపొందిస్తున్నాం. – హెచ్. అరుణ్కుమార్, కమిషనర్, పౌరసరఫరాల శాఖ మిల్లర్లు గోనె సంచులు ఇవ్వాల్సిందే.. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, చౌకదుకాణాలతో పాటు మిల్లర్ల నుంచి పెద్దఎత్తున గోనె సంచులు సేకరిస్తున్నాం. వీటిని ముందస్తుగా ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచుతాం. ధాన్యం కేటాయింపులకు తగినన్ని గోనె సంచులను ముందుగానే ఆర్బీకేలకు సమకూర్చేలా మిల్లర్లకు ఆదేశాలిచ్చాం. ఇప్పటికే జిల్లా జాయింట్ కలెక్టర్లు దీనిపై దృష్టిసారించారు. మిల్లర్లు సహకరించకుంటే వారిని కస్టమ్ మిల్లింగ్ నుంచి తొలగిస్తాం. – వీరపాండియన్, పౌరసరఫరాల సంస్థ ఎండీ -
చిన్న క్లిప్పులా ఉంటుంది.. కానీ పనితీరు అమోఘం
పాతకాలం నాటి పాదరసం బీపీ మానిటర్లు ఇప్పటికీ చాలాచోట్ల వాడుకలో ఉన్నాయి. ఇటీవలి కాలంలో అందుబాటులోకి వచ్చిన డిజిటల్ బీపీ మానిటర్లు కూడా విరివిగా వాడుకలో ఉన్నాయి. ఇవేవి వాడాలన్నా, చేతికి పట్టీని చుట్టి నానా ప్రయాస పడాల్సి ఉంటుంది. అమెరికాకు చెందిన బయోమెట్రిక్ టెక్నాలజీ కంపెనీ ‘వాలెన్సెల్’ ఇటీవల ఎలాంటి పట్టీలు లేని, అతిచిన్న కఫ్లెస్ బీపీ మానిటర్ను రూపొందించింది. ఇది చూడటానికి పల్సాక్సి మీటర్లాగానే చిన్న క్లిప్పులా ఉంటుంది. ఇందులో వేలుపెడితే చాలు. దీని పైభాగంలో ఉన్న మానిటర్ మీద కచ్చితంగా బీపీ ఎంత ఉందో కనిపిస్తుంది. దీనిని ఈ ఏడాది జరిగిన సీఈఎస్–2023 ప్రదర్శనలో ‘వాలెన్సెల్’ ప్రదర్శించింది. త్వరలోనే దీనిని మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఇది విరివిగా అందుబాటులోకి వస్తే, బీపీ మానిటర్ను ఇంచక్కా జేబులో వేసుకుని వెళ్లొచ్చు. ఎక్కడ కావాలనుకుంటే అక్కడ బీపీని తెలుసుకోవచ్చు. -
మార్చిలో 3 నెలల గరిష్టానికి ‘నిరుద్యోగం’
ముంబై: దేశంలో నిరుద్యోగ సమస్య మార్చిలో తీవ్రమైంది. మూడు నెలల గరిష్ట స్థాయిలో 7.8 శాతంగా నమోదయినట్లు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియా ఎకానమీ (సీఎంఐఈ) గణాంకాలు వెల్లడించాయి. 2022లో డిసెంబర్లో 8.30 శాతానికి పెరిగి న నిరుద్యోగితా రేటు జనవరిలో 7.14 శాతానికి తగ్గింది. అయితే మరుసటి రెండు నెలల్లో మళ్లీ పెరుగుదల ప్రారంమైంది. ఫిబ్రవరిలో 7.5 శాతం అన్ఎంప్లాయ్మెంట్ రేటు నమోదయితే, మార్చితో మరింత పెరిగి 7.8 శాతానికి ఎగసింది. మార్చిలో పట్టణ ప్రాంతాల్లో అన్ఎంప్లాయ్మెంట్ రేటు 8.4 శాతం ఉంటే, గ్రామీణ ప్రాంతాల్లో 7.5 శాతంగా నమోదయ్యింది. మరిన్ని ముఖ్యాంశాలు చూస్తే.. ► మార్చిలో నిరుద్యోగం విషయంలో హర్యానా 26.8%తో అగ్ర స్థానంలో ఉంది. రాజస్తాన్ (26.4%), జమ్మూ, కశ్మీర్ (23.1%), సిక్కిం (20.7%), బీహార్ (17.6%), జార్ఖండ్ (17.5%) తరువాతి స్థానాల్లో నిలిచాయి. ► తక్కువ నిరుద్యోగితా రేటు (0.8 శాతం) ఉత్తరాఖండ్, ఛత్తీస్గడ్లో నమోదయితే, అటుపైన పుదుచ్చేరి (1.5 శాతం), గుజరాత్ (1.8 శాతం), కర్ణాటక (2.3 శాతం), మేఘాలయ, ఒడిస్సా (2.6 శాతం) ఉన్నాయి. పండుగ సీజన్ తర్వాత డౌన్ అక్టోబర్–జనవరి పండుగ సీజన్ తర్వాత రిటైల్, సప్లై చైన్, లాజిస్టిక్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఈ–కామర్స్ రంగాల్లో ఉపాధి తగ్గింది. ఐటీ, టెక్నాలజీ, స్టార్టప్ల్లో క్రియాశీలత తగ్గింది. ఇది తాజా నియామకాలలో మందగమనానికి దారితీసింది. ఇక మార్చి ఆర్థిక సంవత్సరాంతము, పరీక్షల నెల కావడంతో ప్రమాణాలు, పర్యాటకం, వినోదం, ఆతిథ్య రంగాల్లో అధిక డిమాండ్ కనిపించ లేదు.ఇది నిరుద్యోగితా శాతం పెరుగుదలకు దారితీసింది. తయారీ, ఇంజనీరింగ్, నిర్మాణం, మౌలిక సదుపాయాల రంగాల్లో కూడా ఉపాధి కల్పన అంతంతమాత్రంగానే ఉంది. ఆయా అంశాలు ఉద్యోగ మార్కెట్ వేగాన్ని తగ్గించాయి. అయితే ఏప్రిల్లో పురోగమనం ఉంటుందని భావిస్తున్నాం. – ఆదిత్య మిశ్రా, సీఐఈఎల్ హెచ్ఆర్ సర్వీసెస్ సీఈఓ, డైరెక్టర్ తాత్కాలికమే కావచ్చు... నిరుద్యోగ డేటా ప్రస్తుత ఆర్థిక అనిశ్చితి వాతావరణానికి అద్దం పడుతోంది. భారత్ కార్పొరేట్ రంగం వ్యయాల విషయంలో చాలా విచక్షణతో వ్యవహరిస్తోంది. ప్రతి అడుగును జాగ్రత్తగా బేరీజు వేసుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి భారత్నూ ప్రభావం చూస్తుంది కాబట్టి, దేశంలో కార్కొరేట్ రంగం నియామకాలను తాత్కాలికంగా తగ్గించింది. అయితే భారత్ సవాళ్లను అధిగమించే పరిస్థితిలో ఉంది కాబట్టి, తాజా నిరుద్యోగ సమస్య తాత్కాలికమే అని నేను భావిస్తున్నాను. – రితుపర్ణ చక్రవర్తి, టీమ్లీజ్ సర్వీసెస్ కో–ఫౌండర్ -
ఆన్లైన్ గేమింగ్కు ఎస్ఆర్వో ఏర్పాటు చేస్తాం
న్యూఢిల్లీ: ఆన్లైన్ గేమింగ్పై పర్యవేక్షణకు సంబంధించి స్వీయ నియంత్రణ సంస్థను (ఎస్ఆర్వో) ఏర్పాటు చేసేందుకు పరిశ్రమ సమాఖ్య ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఐఏఎంఏఐ ముందుకొచ్చింది. ఇందుకు అవసరమైన సామరŠాధ్యలు, అనుభవం తమకు ఉందని ఒక ప్రకటనలో పేర్కొంది. నైపుణ్యాల ఆధారిత పలు ఆన్లైన్ గేమింగ్ సంస్థలకు ఐఏఎంఏఐలో సభ్యత్వం ఉండటం కూడా ఇందుకు తోడ్పడగలదని పేర్కొంది. ఇప్పటికే కేంద్ర సమాచార, ప్రసార శాఖ నిర్దేశించినట్లుగా ఆన్లైన్ క్యూరేటెడ్ కంటెంట్ కంపెనీస్ మొదలైన వాటికి సంబంధించిన ఎస్ఆర్వోలను నిర్వహిస్తున్నామని తెలిపింది. సమాజంపై ప్రభావం చూపే ఆన్లైన్ గేమింగ్పై కేంద్రం తగు విధానాలు లేదా కొత్త చట్టం తీసుకువస్తుందని ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఇటీవల వెల్లడించిన నేపథ్యంలో ఐఏఎంఏఐ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. -
CMIE: నవంబర్లో మూడు నెలల గరిష్టానికి నిరుద్యోగం!
ముంబై: దేశంలో నిరుద్యోగం రేటు నవంబర్లో మూడు నెలల గరిష్టం ఎనిమిది శాతానికి పైగా పెరిగింది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) గణాంకాల ప్రకారం– పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం 8.96 శాతానికి చేరితే, గ్రామీణ ప్రాంతాల్లో ఈ రేటు 7.55 శాతంగా ఉంది. అక్టోబర్లో దేశంలో నిరుద్యోగం రేటు 7.77 శాతం. పట్టణ ప్రాంతాల్లో ఇది 7.21 శాతంగా ఉంటే, గ్రామీణ ప్రాంతాల్లో 8.04 శాతంగా ఉంది. ఇక దేశ వ్యాప్తంగా సెప్టెంబర్లో నిరుద్యోగిత రేటు 6.43 శాతంగా ఉంది. నవంబర్లో 30.6 శాతంతో హర్యానా నిరుద్యోగంలో మొదటి స్థానంలో నిలిచింది. తరువాతి స్థానంలో రాజస్తాన్ (24.5 శాతం), జమ్మూ,కశ్మీర్ (23.9 శాతం) బీహార్ (17.3 శాతం), త్రిపుర (14.5)లు ఉన్నాయి. అతి తక్కువ నిరుద్యోగం రేటు విషయంలో చత్తీస్గఢ్ (0.1 శాతం), ఉత్తరాఖండ్ (1.2 శాతం), ఒడిస్సా (1.6 శాతం), కర్ణాటక (1.8 శాతం), మేఘాలయ (2.1 శాతం)లు ఉన్నాయి. -
చీతాల పర్యవేక్షణ కోసం ప్రత్యేక టాస్క్ఫోర్స్
సాక్షి, న్యూఢిల్లీ: ఇటీవల నమీబియా నుంచి తీసుకొచ్చి మధ్యప్రదేశ్లోని కునో అంతర్జాతీయ పార్కులో వదిలిన చీతాల పర్యవేక్షణకు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ ఓ టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేసింది. పార్క్తోపాటు సమీప ఇతర అనువైన నిర్దేశిత ప్రాంతాల్లో చీతాలను ఈ బృందం పర్యవేక్షిస్తుంది. మధ్యప్రదేశ్ అటవీ, పర్యాటక శాఖల ముఖ్య కార్యదర్శులతో కూడిన ఈ తొమ్మిది మంది సభ్యుల బృందానికి నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ సహకరిస్తుంది. కొత్త ప్రాంతాన్ని చీతాలు ఏ మేరకు సొంతస్థలంగా భావిస్తాయి, చీతా ఆరోగ్య స్థితి సమీక్షించడం, వేట నైపుణ్యాలను పరీక్షించడమే లక్ష్యంగా ఈ టాస్క్ఫోర్స్ ఏర్పాటైంది. బృందం చేపట్టాల్సిన ఇతరత్రా పనులను మంత్రిత్వశాఖ నిర్ధేశించింది. రెండేళ్లపాటు టాస్క్ఫోర్స్ ఈ ప్రత్యేక విధుల్లో నిమగ్నమై ఉంటుంది. చదవండి: థాక్రే వర్గానికి ఎన్నికల సంఘం డెడ్లైన్ -
సీఎం జగన్ ఆలోచనలకు కార్యరూపం.. ఆస్పత్రుల పర్యవేక్షణకు యాప్
సాక్షి, అమరావతి: ప్రజలకు ఆస్పత్రుల్లో మెరుగైన, నాణ్యమైన సేవలు అందించాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకాంక్ష. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వాస్పత్రుల నిర్వహణ, పర్యవేక్షణకు వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఆస్పత్రుల నిర్వహణను నిత్యం పర్యవేక్షించి, సమస్యలను పరిష్కరించడం, సౌకర్యాలను మెరుగు పరచడం ద్వారా నాణ్యమైన సేవలు అందించేందుకు ప్రత్యేక యాప్ను రూపొందించింది. ఆస్పత్రుల్లో సెక్యూరిటీ, శానిటేషన్, పెస్ట్ కంట్రోల్, బయోమెడికల్ పరికరాల నిర్వహణ, ఈ–హెచ్ఆర్ తదితర అంశాలపై పర్యవేక్షణకు ఏపీ వైద్య విధాన పరిషత్ ఈ యాప్ను రూపొందించింది. వైద్య విధాన పరిషత్ పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా 175 సామాజిక ఆరోగ్య కేంద్రాలు (సీహెచ్సీలు), 53 ప్రాంతీయ (ఏరియా) ఆస్పత్రులు, 17 జిల్లా ఆస్పత్రులు, రెండు ఎంసీహెచ్, ఒక చెస్ట్ డిసీజెస్ ఆస్పత్రి ఉన్నాయి. వీటిలో 16,340 పడకల సామర్థ్యం ఉంది. ఈ ఆస్పత్రుల నిర్వహణ, సౌకర్యాల పర్యవేక్షణకు ‘ఏపీ హెల్త్ సెకండరీ కేర్’ యాప్ను రూపొందించారు. ఈ యాప్లో ప్రతి ఆస్పత్రికి ఒక లాగిన్ను కేటాయించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ లేదా ఆర్ఎంవో ఈ యాప్లో లాగిన్ అయి అందులోని మాడ్యూల్స్ ఆధారంగా వివరాలను నమోదు చేయాలి. ఆస్పత్రిలో సెక్యూరిటీ విధానం, సెక్యూరిటీకి స్కోరింగ్, శానిటేషన్, పెస్ట్ కంట్రోల్ తదితర అంశాలపై స్కోరింగ్ ఇవ్వాలి. అనుబంధ ప్రశ్నలకు ఎస్/నో రూపంలో సమాధానాలివ్వాలి. వాటికి సంబంధించిన ఫొటోలను అప్లోడ్ చేయాలి. ఉదాహరణకు ఆస్పత్రిలో రోగుల రక్షణకు సంబంధించిన సెక్యూరిటీ విజిట్ మాడ్యూల్లో.. సెక్యూరిటీ గార్డ్ 24 గంటలు అందుబాటులో ఉంటున్నాడా... అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వాలి. గార్డ్ అందుబాటులో ఉన్నాడని ‘ఎస్’ అని పెడితే వెంటనే లైవ్ ఫొటో అప్లోడ్ చేయాలని యాప్ అడుగుతుంది. విధుల్లో ఉన్న సెక్యూరిటీ గార్డ్ లైవ్ ఫొటోను అప్లోడ్ చేయాలి. ఎన్ఏబీహెచ్ ప్రమాణాలకు అనుగుణంగా యాప్ నేషనల్ అక్రిడిటేషన్ ఫర్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ (ఎన్ఏబీహెచ్) ప్రమాణాలకు అనుగుణంగా యాప్లో ప్రశ్నావళిని రూపొందించాం. యాప్పై సూపరింటెండెంట్లు, ఆర్ఎంవోలకు శిక్షణ ఇచ్చాం. యాప్లో ఉండే వివరాలన్నీ రాష్ట్ర డ్యాష్ బోర్డుకు అనుసంధానం చేశాం. ఎక్కడైనా సెక్యూరిటీ, శానిటేషన్ ఇతర అంశాల నిర్వహణలో లోపాలున్నట్లు యాప్లో నమోదు చేస్తే డ్యాష్ బోర్డులో కనిపిస్తుంది. దాని ఆధారంగా సమస్యలు పరిష్కరిస్తాం. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్న సీఎం జగన్ ఆలోచనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవడంలో భాగంగా యాప్ను తీసుకువచ్చాం. – డాక్టర్ వినోద్కుమార్, కమిషనర్, ఏపీ వైద్య విధాన పరిషత్ -
AP: హైరిస్క్ గర్భిణులపై ప్రత్యేక పర్యవేక్షణ
సాక్షి, అమరావతి: గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం, మెరుగైన వైద్యం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం తొలినుంచీ అధిక ప్రా«ధాన్యతనిస్తోంది. ప్రసవం సమయంలో తల్లి, బిడ్డ మరణాలకు ప్రధాన కారణమైన హైరిస్క్ ప్రెగ్నెన్సీలను (ప్రసవ సమయంలో ఎక్కువ సమస్యలు) నియంత్రించేందుకు చర్యలు చేపడుతోంది. ఇటువంటి వారిపై వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక పర్యవేక్షణను కొనసాగిస్తోంది. ఎలాగంటే.. ►గర్భం దాల్చిన 10–12 వారాల్లో మహిళ వివరాలను ఆర్సీహెచ్ పోర్టల్లో నమోదు చేస్తున్నారు. ►వైద్య పరీక్షలు నిర్వహించి గతంలో అబార్షన్, సిజేరియన్లు జరిగి ఉండటం, రక్తహీనత, రక్తపోటు, మధుమేహం సహా 12 రకాల అంశాలను పరిగణలోకి తీసుకుని ప్రారంభ దశలోనే గర్భిణుల్లో హైరిస్్కను గుర్తిస్తున్నారు. ►ఇలా ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 8,04,226 మంది గర్భిణులు రిజిస్ట్రర్ కాగా వీరిలో 15 శాతం అంటే 1,23,839 మంది హైరిస్క్లో ఉన్నట్లు తేలింది. ►వీరందరి పర్యవేక్షణ బాధ్యతలను సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని హెల్త్ సూపర్వైజర్లకు అప్పగించారు. ► ప్రసవం అయ్యేవరకూ హైరిస్క్ గర్భిణుల వెంట ఉండి ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించడం వీరి బాధ్యత. ప్రతినెలా వైద్య పరీక్షలు ప్రసవానికి ముందు గర్భిణులకు నాలుగు యాంటినేటల్ చెకప్స్ (ఏఎన్సీ), ప్రసవానంతరం ఒక పోస్ట్నేటల్ చెకప్ (పీఎస్సీ) వైద్య శాఖ నిర్వహిస్తుంది. అయితే, హైరిస్్కగా గుర్తించిన నాటి నుంచి సంబంధిత మహిళకు ప్రసవానికి ముందు ప్రతినెలా వైద్య సేవలు అందేలా చూస్తున్నారు. గైనకాలజిస్ట్లు అందుబాటులో ఉండే సీహెచ్సీ, ఏరియా, జిల్లా, బోధనాసుపత్రుల్లోనే వీరికి వైద్య పరీక్షలు చేపడుతున్నారు. వీరు నెలనెలా ఆస్పత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారా? ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? అనే అంశాలను హెల్త్ సూపర్వైజర్, ఆశా, ఏఎన్ఎంలు ఎప్పటికప్పుడు వాకబు చేస్తున్నారు. అదే విధంగా ఏ ఆస్పత్రిలో వీరికి ప్రసవాన్ని నిర్వహించాలి అని ముందే ప్రణాళిక సిద్ధంచేసుకుంటున్నారు. సమగ్ర వైద్య సేవలు అందుబాటులో ఉండే ఆసుపత్రికే నేరుగా తరలించేలా చర్యలు తీసుకుంటున్నారు. తద్వారా ప్రసూతి, శిశు మరణాల కట్టడికి కృషిచేస్తున్నారు. దేశంలోనే తొలి స్థానంలో ఏపీ గర్భిణుల్లో హైరిస్క్కు ప్రధాన కారణం రక్తహీనత. తర్వాతి స్థానాల్లో 35 ఏళ్ల తర్వాత గర్భం దాల్చడం, 18 ఏళ్ల కంటే ముందే గర్భం దాల్చడం వంటి ఇతర కారణాలూ ఉంటాయి. రక్తహీనతను నియంత్రించడంలో దేశంలోనే ఏపీ తొలిస్థానంలో ఉంటోంది. ఈ విషయం ఇటీవల కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. రక్తహీనత నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్రంలోని 91.9% మంది గర్భిణులు, 80.9% మంది పాలిచ్చే తల్లులకు 2021–22 ఏడాదిలో వైద్య శాఖ ఫోలిక్ యాసిడ్ (ఐరన్) మాత్రలను పంపిణీ చేసింది. అదే విధంగా 6 నుంచి 59 నెలల చిన్నారులకు 86.1%, 5–9 ఏళ్ల పిల్లలకు 76.1%, 10–19 ఏళ్ల పిల్లలు, యువతకు 79.3% ఐరన్ సిరప్, మాత్రలు పంపిణీ చేపట్టారు. ఇలా అన్ని విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఏపీ దేశంలోనే తొలి ర్యాంక్ను కైవసం చేసుకుంది. సేవలు వినియోగించుకోవాలి గర్భిణులు, బాలింతల సంరక్షణకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోంది. ఇందులో భాగంగా హైరిస్క్ గర్భిణులకు ప్రసవం సమయంలో ఇబ్బందులు ఎదురుకాకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఈ సేవలను గర్భిణులు వినియోగించుకోవాలి. ఎక్కడైనా సేవలు అందడంలో ఇబ్బందులు ఎదురైతే మాకు తెలియజేయాలి. – డాక్టర్ కేవీఎన్ఎస్ అనిల్ కుమార్, అడిషనల్ డైరెక్టర్ (ఎంసీహెచ్) -
ఆగస్టులో 16 లక్షల మంది ఉపాధి గల్లంతు
సాక్షి, న్యూఢిల్లీ: ఆగస్టులో దేశవ్యాప్తంగా 15 లక్షల మంది ఉపాధి కోల్పోయారని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ నివేదిక వెల్లడించింది. ఆగస్టులో నిరుద్యోగిత రేటు 8.32 శాతంగా ఉందని వివరించింది. గ్రామీణ నిరుద్యోగిత రేటు 7.64 శాతం ఉండగా, పట్టణ నిరుద్యోగిత రేటు 9.78 శాతం ఉంది. జులైలో ఉపాధి పొందిన వారి సంఖ్య 399.38 మిలియన్లు ఉండగా.. ఆగస్టు నాటికి 397.78 మిలియన్లకు తగ్గింది. అంటే 16 లక్షల మంది ఉపాధి కోల్పోయారు. అత్యధికంగా హరియాణాలో 35.7 శాతం నిరుద్యోగిత రేటు నమోదైంది. తరువాత స్థానాల్లో వరుసగా రాజస్థాన్ (26.7 శాతం), జార్ఖండ్ (16 శాతం), త్రిపుర (15.6 శాతం), బిహార్ (13.6 శాతం) నిలిచాయి. -
కరోనా యాప్ రాబోతుంది
సాక్షి, విజయవాడ: కరోనా కట్టడికి ప్రభుత్వం సూచనలు విస్మరిస్తున్న వారిని నిలవరించేందుకు పోలీస్ యంత్రాంగం ఓ ప్రత్యేక యాప్ను రూపొందిస్తోంది. ప్రధానంగా విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో అనుమానితులను క్వారంటైన్ చేసినప్పటికీ పలువురు నిర్దేశిత ఇంటిని, ఆసుపత్రిని దాటి వచ్చేస్తున్నారు. తప్పించుకుని పారిపోయిన సంఘటనలూ వెలుగులోకి వచ్చాయి. అలాంటి వారిని గుర్తించి తిరిగి క్వారంటైన్ చేయాల్సి వస్తోంది. ఈలోగా జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. దీన్ని కట్టడి చేయడానికి కరోనా యాప్ను సిద్ధం చేస్తున్నట్లు గుంటూరు ఐజీ ప్రభాకరరావు చెప్పారు. (కరోనా సోకిందేమోనని దంపతుల ఆత్మహత్య) అనుసంధానం ఇలా.. క్వారంటైన్ ఉన్న వారి ఆండ్రాయిడ్ ఫోన్లో ఈ యాప్ను డౌన్లోడ్ చేసి జీపీఎస్తో అనుసంధానం చేస్తారు. నిరీ్ణత ప్రాంతాన్ని అధిగమించగానే సంబంధిత పోలీస్ ఉన్నతాధికారికి అలర్ట్ మెసేజ్ వస్తుంది. తక్షణం ఆ ప్రాంత బాధ్యులైన అధికారికి సూచనలు పంపి క్వారంటైన్ను కొనసాగింపజేయడానికి వీలవుతుంది. తొలుత పది మీటర్ల పరిధిలోనే ఉంచాలని భావించినప్పటికీ దాన్ని యాభై లేదా వంద మీటర్ల పరిధి వరకు విస్తరించాలనే ఆలోచన చేస్తున్నారు. ఐ ఫోన్లలో ఈ యాప్ను డౌన్లోడ్ చేయడానికి కూడా పరిశీలనలు చేస్తున్నారు ఏదైనా నిర్దేశిత ప్రాంతం వరకే ప్రత్యేకంగా మెసేజ్ (గ్రూప్ మెసేజ్ తరహాలో) పంపేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉదాహరణకు ఓల్డ్ గుంటూరులో 5000 మందికి అలెర్ట్ మెసేజ్లు పంపాలనుకుంటే అక్కడికే పరిమితమయ్యేలా డేటా మైగ్రేషన్ ద్వారా పరిశీలిస్తున్నారు. కరోనా సమాచారమే కాకుండా ప్రజలకు నిత్యం అవసరమైన సమాచారాన్ని కూడా పంపాలనేది ఆలోచనగా ఉంది. గుంటూరు అర్బన్ ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణకు బాధ్యతలు అప్పగించినట్లు ఐజీ తెలిపారు. వాట్సాప్లలో తప్పుడు సమాచారంతో మెసేజ్లు పెడుతున్న వారిపై చర్యలు తీసుకునేలా వ్యవస్థ ఏర్పాటవుతోందన్నారు. క్వారంటైన్లో ఉండకుండా బయటకు వచ్చిన వారిపైన, విదేశాల నుంచి ఇతర దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారి సమాచారం ఇవ్వకుండా దాచినట్లయితే వారిపైన కేసులు నమోదు చేయనున్నామన్నారు. వైద్య పరిరక్షణలో భాగంగా నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై ఐపీసీ 269, 270, 271 సెక్షన్ల కింద కేసులు నమోదవుతున్నాయని ఐజీ ప్రభాకరరావు వివరించారు. -
ప్రాణవాయువుపైనా సాయి ప్రాభవం
ఏ దైవానికి సంబంధించిన ఒక లీలని (మహిమని చూడగల ఒక సంఘటన) విన్నా, ఏ భక్తునికి సంబంధించిన ఒక అనుభవాన్ని తెలుసుకున్నా వాటిని ‘అవి ఎవరికో జరిగినవి’ అనుకోకూడదు. ‘మనకి కూడా ఆ దైవానుగ్రహం గనుక ఉంటే ఇలాంటి సంఘటనలే జరిగే అవకాశముందన్నమాట’ అని అర్థం చేసుకోవాలి. ఇలాంటి అవగాహన కలగాలంటే సద్గురువు (నిస్వార్థంగా జ్ఞానబోధని చేసి కళ్లు తెరిపించేవాడు) లభించాలి. ఓ చిన్న ఉదాహరణని గమనించుకుని లోపలికి వెళ్తాం! చిలుక ఉంది. అది చక్కగా మాట్లాడుతోంది. అందంగా.. ఆకర్షణీయంగా.. ఉందనే ఆలోచనతో మనం దాన్ని తెచ్చి ఓ పంజరంలో ఉంచి, దానికి కావలసినవన్నీ సకాలంలో పెడుతూ ఉంటాం. అది కూడా వాటిని తింటూ.. మనతో ఆడుకుంటూ.. మనల్ని ఆనందపరుస్తూ ఉంటుంది. ఎక్కడికీ ఎగరాల్సిన అవసరం లేకుండా తనకి ఇష్టమైన పళ్లూ తినుబండారాలూ తన దగ్గరికే వస్తున్నాయని మహా ఆనందపడిపోతూ ‘ఈ జీవితం ఇలాగే జరిగిపోతే చాలునురా భగవంతుడా!’ అనుకుంటుంది. ఎవరో ఒక పిల్లవాడో లేక ఇంట్లో ఎవరో ఆ చిలుకకి ఆహారాన్ని పెట్టి పొరపాటున పంజరపు తలుపుని వేయకుండా ఉన్నారనుకుందాం! ఆ చిలుక కాస్త ఎగిరి ఆ చెట్టు మీదా ఈ చెట్టు మీదా వాలుతూ విశాలవిశ్వాన్ని తన ఆటస్థలంగా భావిస్తూ తన రెక్కల సత్తువ కొద్ది దూరదూరాలు వెళ్తూ విన్యాసాలు చేసుకుంటూ తన జాతి చిలుకలతో ఆడుతూ పాడుతూ గంతులేస్తూ అడవులకీ తోటలకీ వెళ్తూ అనుకుంటుంది ‘అయ్యో! ఎంత జీవితకాలాన్ని నష్టపోయాను. ఆ పంజరంలో బంధింపబడి ఇంత విశాలవిశ్వముంటే నేను ఓ చిన్న పంజరంలోనే ఉంటూ.. దాన్నే గొప్పగా భావిస్తూ.. అందరూ నన్ను ఆదరిస్తున్నారనుకున్నాను గానీ ఇంత స్వతంత్రతనీ, ఇంతటి ఆనందాన్నీ కోల్పోయానా ఇంతవరకూ!?’ అని తీవ్రంగా బాధపడుతుంది. ‘ఇప్పటివరకూ నన్ను చూడదలిచినవారి ఇష్టాలకి అనుగుణంగా ఉంటూ దానికి అలవాటుపడి అదే నిజమైన ప్రపంచం అనేసుకున్నానా? నిజమైన ఆనందమంటే.. ఎవరి సంతోషానికో నేను అనుగుణంగా ఉండటం కాదు. నా ఆనందాన్ని నేను పొందడానికి అనుగుణంగా నేనెలా ఉండాలో, ఉంటే బాగుంటుందో అలా ఉండటం మాత్రమే!’ఇదంతా ఎందుకంటే జీవుడు (ప్రతివ్యక్తీ) కూడా అంతే! ఈ కోరికలు, ఆ కోరికలు, ఆ ధనం, ఈ ఐశ్వర్యం (ఈశ్వరస్య భావరి – అధికారం హోదా అనేది సరైన అర్థం), సంతానం, సౌకర్యాలూ... అనే ఈ పంజరంలో బంధింపబడి ఎంతగొప్పగా ఉన్నాను అనుకుంటాడు. పై ఉదాహరణలో పంజరపు తలుపుని ఎవరో తీస్తే బాహ్య ప్రపంచాన్ని చూసి తానెంత నష్టపోయిందో ఆ చిలుక గమనించినట్లే ఇక్కడ కూడా జీవునికి సరైన గురువు (సద్గురువు) గాని దొరికితే నిజమైన మానసిక ఆనందాన్ని (హ్లాదం అంటారు. అలాంటి హ్లాదం యొక్క అతీతస్థితే ప్రహ్లాదం. అది కలిగినవాడే ప్రహ్లాదుడు) పొందుతూ జీవితాన్ని ఎంత నష్టపోయిందీ, నష్టపోగొట్టుకుందీ తెలుసుకోగలుగుతాడు. అలా హ్లాదాన్ని పొందిన సాయి భక్తులందరికీ సాయి తన జీవితాలని ఎలా రక్షించి ఒడ్డున పడేసిందీ స్పష్టంగా తెలుసు. ఉదాహరణతో చూద్దాం! ప్రాణవాయువు మీద ఆధిపత్యం మన శరీరంలో (పిండ అండంలో) 5 వాయువులున్నాయి. వాటిలో మొదటిది మన ప్రాణాలని నిలిపి ఉంచే వాయువు. అదే ప్రాణవాయువు. ‘హృదిప్రాణః’ అన్నారు కాబట్టి ఈ ప్రాణవాయువు ప్రతి జీవునిలోనూ (జీవించి ఉన్నవారు) హృదయంలో ఉంటుంది. ఆ హృదయం నుండి ప్రాణవాయువు తొలిగిపోయిన క్షణంలో ఆ జీవుడు నిర్జీవుడు అవుతాడు. ఆ ప్రాణం– సామాన్యులమైన మన అందరి భావనలోనూ ఎప్పుడుపోతుందో – తెలియదు. అయితే సాయికి స్పష్టంగా తెలుసు ఎవరి ప్రాణం ఎప్పటికి గతిస్తుందో! అందుకే ఫలానవాని ప్రాణాలు నిలిచి ఉండాలని తనకి అనిపించినప్పుడు ఆ పోబోయే ప్రాణవాయువుని కూడా పోకుండా ఆపుచేసి ఆ జీవుడ్ని మరికొంతకాలం జీవింపజేశాడు. ఇలా ప్రాణవాయువుని ఆపి ఉంచగలిగాడంటే తనకి ప్రాణవాయువు మీద ఆధిపత్యం ఉన్నట్లే కదా! శ్యామాని పాము కరిచింది! పైన అనుకున్న చిలుక కథలోని చిలుకలా పంజరం నుంచి బయటపడి సద్గురువు పర్యవేక్షణలో స్వతంత్ర జీవనాన్నీ హ్లాదాన్ని పొందుతున్న వాడు శ్యామా(మాధవరావు శ్యామా అనేది పూర్తి పేరు). బాబాకి నీడలాగా ఉంటూ ఉండేవాడు. సాయి కూడా శ్యామాని అంతగానూ దగ్గరగా ఉంచుకుని చూసుకుంటూ ఉండేవాడు. సాయి నిత్యం చేసే అగ్నిహోత్ర కార్యక్రమం (ధుని) కోసం కట్టెలని తేవాలనే ఉద్దేశ్యంతో శ్యామా కట్టెలన్నీ పెద్ద ఎత్తున ఉండే ఆ ప్రదేశానికి వెళ్లి కట్టెల్ని లాగుతూ ఉంటే ఆ పెద్ద ఎత్తు మోపులా ఉండే కట్టెల సమూహం నుండి ఓ పొడవాటి పాము(మరాఠీలో బవా అంటారు) శ్యామా చిటికెనవేలి మీద బలంగా పడగ ఎత్తి మరీ కాటేసింది. క్షణాల్లో శ్యామా చిటికెన వేలంతా విషాగ్నితో నిండిపోయి తీవ్రమైన మంటనీ నొప్పినీ కలుగజేసాయి శ్యామాకి. ఎప్పుడూ అలాంటి పాముకాటు అనుభవం లేని కారణంగానూ, తాను ఒంటరిగా వచ్చి ఉన్న కారణంగానూ శ్యామా భయాందోళనలతో వణికిపోసాగాడు. బాధా భయమూ ఆందోళనా నిస్సహాయతా వంటివి ఆవరించినప్పుడు దైవాన్ని స్మరించుకోవాలనే విషయాన్ని అందరూ చెప్పే మాట నిజమే గాని, ఆ బాధలో ఆందోళనలో అంతటి సాయి భక్తునికీ నిరంతరం సాయితో మెలిగేవానికీ కూడా సాయి గుర్తు రానూ లేదు. సాయి జపం చేయాలనే ఆలోచన కలగనూ లేదు. ఇది సర్వసాధారణం. ఒకవేళ ఏ ధ్యానమో చేద్దామని ఏ క్షణంలోనో అనిపించినా అది సాధ్యమయ్యే విషయమేనా ఆ బాధలో ఆందోళనలో ప్రాణభయంలో ఉన్న సమయంలో? పెద్దగా అరిచిన అరుపులకి దగ్గరగా ఉన్న బంధువులూ కొందరు మిత్రులూ అతని వద్ద కొచ్చారు. శరీరమంతా క్రమంగా ఎర్రని రంగుతో నిండిపోతూ కనిపిస్తోంది. అతని ప్రాణాలు ఇక పోతాయేమోననే భయం శ్యామాతో పాటు అందరికీ దాదాపుగా కలిగింది. ఆ ఎర్రగా మారుతున్న శరీరపు రంగూ, విషబాధతో శ్యామా మెలికలు తిరిగిపోతున్న దృశ్యమూ చూడగానే. షిర్డీలో పాముల సంచారం ఎక్కువనే చెప్పాలి. ఓ సారి సాయిని భక్తులు కొందరు ‘బాబా! పాముల సంచారం ఎక్కువగా ఉంటోంది. దీనికి ఏదైనా నివారణోపాయం – పరిష్కారమార్గం నువ్వే చెప్పాలి’ అనడిగితే ఆయన నవ్వి.. ‘షిర్డీ ఒక అడవి ప్రాంతం. అడవి అనేది పాములు స్వేచ్ఛగా భయం లేకుండా తిరిగే ప్రదేశం. మనం మెల్లిగా ఇక్కడి కొచ్చి ఇళ్లు కట్టుకున్నాం. ఉంటున్నాం. అంటే ఏమన్నమాట? అవి ఉన్న ప్రదేశానికి మనం వచ్చాం గానీ, మనమున్న ప్రదేశానికి అవి రావడం లేదు. ఆ కారణంగా వాటిని చంపకూడదు’ అన్నారు. అంచేత ఎవరైనా పాములు కనిపించినా దూరంగా తొలిగిపోతూ ఉండేవారు. ఎప్పుడైనా ఎవరికైనా పాము కాటు సంభవిస్తే షిర్డీలోనే విఠోబా మందిరం (అది ఒక శివాలయానికున్న పేరు) అని ఒకటుంది. అక్కడికి తీసుకెళ్లేవారు బాధితుడ్ని. అక్కడ ఉండే ఒక అర్చకుడు మంత్రాన్ని వేస్తే బతుకుతూ ఉండేవారు సాధారణంగా. అలాగే గడుస్తూ ఉండేవి రోజులు. షిర్డీ వాసులకి పాముల విషయంలో ధైర్యం ఉండటానికీ, రాత్రయినా తెల్లవారుజామైనా ఎక్కడికైనా వెళ్తూ ప్రజలుండగలగడానికీ ఆ విఠోబా మందిరముందనే నమ్మకమే కారణం. ఆ ధైర్యాన్నిచ్చే విఠోబా మందిరానికి తీసుకెళ్లబోతుంటే శ్యామా స్నేహితుడు ‘నిమోణ్కర్’ అనే ఆయన ‘ఇదంతా ఎందుకు? ముందు బాబా దగ్గర కెళ్లి ఆయనిచ్చే ఊదీ (ధునిలో కట్టెలు మండగా వచ్చిన బూడిద– విభూతి అన్నమాట) తీసుకో: అని సూచించాడు. ఆ మాటని వింటూనే శ్యామా ఆ సాయి ఉండే మందిరానికి పరుగులాంటి నడకతో ఎలాగో ఓపిక కూడగట్టుకుని వెళ్లాడు. ఫో! ఫో! మేడమీద బాబా ఉన్నాడని తెలిసిన శ్యామా.. ఆ బాబా సన్నిధికి వెళ్లి పామువిషం దిగిపోయి తాను బతకగలననే ధైర్యంతో విశ్వాసంతో ఉన్నాడో లేదో ఆ సమయంలో బాబా ఈ శ్యామాని చూస్తూనే తీవ్రకోపంతో ... భతుర్ధ్యా(హేయమైన ప్రవర్తన అథమనీచ లక్షణాలు కలిగిన బ్రాహ్మణుడా!) మేడమెట్లు ఎక్కావో ఊరుకోను! పైకెక్కావో జాగ్రత్త! దిగిఫో! ఫో! ఫో!’ అంటూ పెద్ద గొంతుతో అరిచాడు. శ్యామాకే కాదు అతడ్ని అనుసరించి వెళ్లిన అందరికీ ఆశ్చర్యమనిపించింది! విడ్డూరంగా సాయి అలా అనడమేమి? అనే సంశయంతో భక్తులందరూ ఆలోచనలో పడిపోయారు. శ్యామాకయితే మతిపోయింది. ఏం చేయాలో ఆలోచించగల స్థితిలో తన బుద్ధి లేనే లేదు. తీవ్ర శారీరక బాధా, దానికి తోడు సాయిబాబా కంఠస్వరం దాని నిండుగా నిందలూ తిట్లూ కారణం! ఎక్కడికీ వెళ్లలేని స్థితిలో శారీరకంగానూ మానసికంగానూ కుంగిపోయి నిరాశతో కుప్పకూలిపోయిన శ్యామా గట్టిగా ఎగశ్వాస పీల్చసాగాడు. బలంగా గాలిని పీల్చడమంటే విష తీవ్రత ఊపిరితిత్తుల దాకా వెళ్లి గాలిని సుఖంగా పీల్చుకోలేని స్థితికి రోగిని తీసుకెళ్తోందన్నమాట. సాయి భక్తులందరూ ఈ పరిస్థితిని ఏ తీరుగానూ విశ్లేషించుకోలేక ఉంటూ ఉంటే, కన్నబిడ్డ చనిపోవడానికి సిద్ధంగా ఉన్న దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూస్తూ కూడా పోతే పోనీ! అన్నట్లుగా ప్రవర్తిస్తుంటే ఏం చేయాలి? అనే తీరు నిరాశా నిస్పృహలతో ఆ సాయి మందిరాన్ని వెర్రివానిలా చూస్తూ ఉండిపోయాడు. ఈ మసీదు(ద్వారకామాయి) నా పుట్టిల్లు. నేను సాయి కన్నబిడ్డని. సాయి దర్శనానికొచ్చే అందరూ నా సోదరసమానులు. ఏనాడూ అధర్మంగా ప్రవర్తించి ఎరుగను... అనుకుంటూ గుండెనిండుగా దుఃఖాన్ని అనుభవిస్తూ మౌనంగా లోలోపలే కుతకుతలుడికిపోయాడు శ్యామా. బతికే ఆశని వదులుకుని తన జీవితం ముగియబోతోందని గ్రహించుకుని మెల్లగా మేడ దిగేసాడు శ్యామా. ఎప్పుడైతే తాను మేడ దిగేసి సాయికి కనిపించకుండా ఉన్నాడో అప్పుడు సాయి గొంతు అరవడం మానింది. ఆయన శాంతించినట్లుగా శ్యామాకి తోచింది. ప్రాణాలు పోతే పోనీ! అదేదో సాయి సన్నిధిలోనే సాగనీ! తన జీవిత సర్వస్వమూ సాయే అయ్యున్నప్పుడు ఈ మేడ కింద శరీరాన్ని త్యజించడమెందుకు? అనుకుంటూ ఓపిక కూడగట్టుకుని మళ్లీ మేడపైకి వెళ్లాడు. సాయికి కనిపిస్తూ ఆయన దర్శనాన్నే చేస్తూ కింద కూర్చున్నాడు. సాయినే చూస్తూ ఉండిపోయాడు. సాయి శ్యామాని చూస్తూ .. ‘ఈ ఫకీరు నిన్ను రక్షిస్తాడు! ధైర్యంగా ఉండు! నా మీద నమ్మకం ఉంచుకో! ప్రశాంతంగా ఉండు! నీకేమీ కాదు! కలవరపడకు! ఇంటికి వెళ్లు! ఇంటి బయటికి మాత్రం వెళ్లకు!’ అన్నాడు మెత్తని కంఠ స్వరంతో అనుగ్రహిస్తున్నాడనే నమ్మకాన్ని అదే కంఠస్వరంతో కలిగిస్తూ. శ్యామా బాబామాటనే విశ్వసిస్తూ త్రోవలో’ పాముకాటుకి గురైన బాధితులు వెళ్లే విఠోబా మందిరం మీదుగానే వెళ్తూ కూడా ఆ మందిరానికి వెళ్లకుండా తన ఇంటికే చేరాడు. శ్యామా తన ఇల్లు చేరాడో లేదో ‘తాత్యా’ అనే భక్తుడు ఇంటి వద్ద కనిపించాడు శ్యామాకి. ‘శ్యామా! సాయే నన్ను పంపిస్తే వచ్చాను! నిన్ను నిద్రపోవద్దని చెప్పాడు. నీకు నిద్ర రాబోతే నిద్రపోనీయకుండా చూడాల్సిందిగా చుట్టూ ఉన్నవారిని చూడవలసిందన్నాడు. తిండి విషయమా? ఇష్టమైన వేటినైనా సరే తినమన్నాడు! ఒక వేళ నిద్రమత్తుగాని వస్తే పచార్లు చేయవలసిందే తప్ప నిద్ర పోనే పోరాదన్నాడు’ అని చెప్పాడు బాబా మాటలని. కాకా(కాకా సాహెబ్ దీక్షిత్)ని ధైర్యం కోసం రక్షణకోసం ఉండవలసిందని సాయే చెప్తే వచ్చాడు! గమనించు! అని కూడా చెప్పాడు ‘తాత్యా’. సాయి చెప్పినట్లు నచ్చినది తిని – నిద్ర వస్తున్నా కూడా నిద్రపోకుండా నిద్ర వస్తోందన్న అనుమానం వస్తే ‘కాకా’ సహాయంతో పచార్లు చేస్తూ ఎలాగో రాత్రిని నిద్రలేకుండా నిద్రరాకుండా చూసుకుని గడిపేసాడు శ్యామా.తెల్లారేసరికి అతని బాధ తగ్గిపోయింది గానీ ఆ పాము కరిచినచోట మాత్రం కొద్దిగా మంట ఉంది. అప్పుడప్పుడు చురుక్కుమంటూ తానున్నానంటోంది. కొంత పొద్దెక్కేసరికే పూర్తిగా తగ్గిపోయింది. ఎలా తగ్గింది? ఏ మందూ మాకూ వాడలేదు. పైగా బాబానే నమ్ముకున్న శ్యామాని బాబా ఆదరించలేదు సరికదా బిగ్గరగా అరుస్తూ ‘దిగిఫో!’ అన్నాడు కూడా. విఠోబా మందిరంలో ప్రవేశించలేదు కూడా. ఎలా తగ్గినట్టు? బాబా ప్రవర్తనకి లో అర్థమేమిటి?బాబా తన వద్దకొచ్చిన శ్యామాని తిట్టలేదు. ‘భతుర్ధ్యా!’ ‘దిగిఫో’ అన్నాడు. పాముల్లో నాలుగు వర్ణాలు ఉంటాయి. ఏదో తప్పు చేసిన కారణంగా ఓ బ్రాహ్మణునికి మహర్షి ఎవరో ఇచ్చిన శాపం కారణంగా పాముగా జన్మనెత్తిన ఆ పాము ఈ రోజున శ్యామాని కరిచింది. జన్మజన్మల సంబంధాన్ని తెలుసుకోగల జ్ఞాని బాబా. ఈ విషయం రాబోయే కొన్ని భాగాల్లో ఓ భాగంలో ఉదాహరణ పూర్వకంగా తెలుసుకోబోతున్నాం. అందుకని ఓ బ్రాహ్మణ సర్పమా! అప్పుడు తప్పు చేసి పాముగా అయి మళ్లీ నీచకార్యాన్ని (శ్యామాని కరవటం) చేస్తావా? విషరూపంగా ఉన్న నువ్వు దిగిఫో! అని ఆ పాముని మందలించాడు సాయి. ఇది వినడానికీ చదువుకోవడానికీ బాగుండచ్చేమో గానీ నమ్మవీలులేనిదిగా ఉందనిపించవచ్చు. మరి అదే నిజమైతే ‘భతుర్ధ్యా!’ అని ఎందుకు సంబోధించాడు సాయి? మళ్లీ ఆ సాయే శ్యామా మేడమీదికి రాగానే తగ్గిపోతుందనీ శాంతపడతావనీ నిద్రపోవద్దనీ ఎందుకన్నాడు శాంతస్వరంతో. పైగా దీక్షిత్ని శ్యామా ఇంటికెందుకు పంపాడు? అందరూ తన నుంచి వెళ్లిపో యేలా చేసుకునీ చూసుకునీ ‘అల్లాహ్(అల్లా అనే పేరుండి విశ్వమంతా నిండిన) హో(అతడు మాత్రమే) మాలిక్! (నాకు సర్వస్వం) అనే తన మంత్రాన్ని శ్యామా కోసం మననం చేస్తూ ఉండిపోయాడు సాయి. వాక్కుకి ఓ శక్తి అనేది రావాలంటే తాను నమ్మిన మంత్రాన్ని మననం చేసినప్పుడే అది సాధ్యం. అంతకుముందే ఉన్న మంత్రశక్తితో శ్యామాకున్న ప్రాణవాయువుని పోకుండా నిరోధించి, తాను చేస్తున్న మంత్ర మనన శక్తితో శ్యామా బాధనీ ఆందోళననీ విషతీవ్రతనీ తగ్గించాడు సాయి. అందుకే సాయికి ఈ విషతీవ్రతని నిరోధించడానికి ఓ రాత్రి రాత్రంతా పట్టింది. వాక్కులో మంత్ర మననశక్తి ప్రవేశిస్తే అది అనుగ్రహం కారణంగా వరంగా ఆగ్రహం కారణంగా శాపంగా మారుతుంది. అందుకే తమ సంతానాన్ని ఆశీర్వదించవలసిన అవసరం వచ్చినప్పుడు తల్లులు కొంతసేపైనా మంత్రమననాన్ని చేసి ‘బాగా పరీక్షలు వ్రాయి!’ సుఖంగా ప్రయాణం సాగాలి! అంటూ ఇలా ఆశీర్వదిస్తే అవి నెరవేరతాయి. ఒట్టిగా ‘విష్యూ ఆల్ ది బెస్ట్’ వంటి మాటలు గాలిలో కలిసి ఏ ప్రయోజనాన్ని కలిగించవు. ప్రాణవాయువు మీద ఆధిపత్యమున్న సాయి కొందరి ప్రాణవాయువుని తొలగించిన సందర్భాలనీ చూద్దాం! –సశేషం -
‘సామాజిక’ ప్రభావంపై ఈసీ విశ్లేషణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో సామాజిక మాధ్యమాలకు ఎన్నికల ఫివర్ పట్టుకుంది. ఫేస్బుక్, ట్వీట్టర్, వాట్సాప్, యూ ట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాల్లో ఎన్నికల ప్రచారం ఉధృతంగా సాగుతోంది. ఎన్నికల ప్రచారం, ప్రత్యర్థులపై ఆరోపణలు ప్రత్యారోపణల కోసం అధికార, విపక్ష పార్టీల ముఖ్య నేతలు, కార్యకర్తలు, ఆయా పార్టీల ఐటీ విభాగాలు సామాజిక మాధ్యమాలను విస్తృతంగా వినియోగించుకుంటున్నాయి. గత సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుతం ఈ మాధ్యమాల వాడకం భారీగా పెరిగి ఎన్నికలను ప్రభావితం చేసే స్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో ఎన్నికలపై సామాజిక మాధ్యమాల ప్రభావాన్ని విశ్లేషించేందుకు వాటి ద్వారా జరుగుతున్న ఎన్నికల ప్రచార సరళిపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారించింది. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో భాగంగా సోషల్ మీడియా పర్యవేక్షణ కోసం ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. ఈసీ ఆదేశాలతో తొలిసారిగా ఎన్నికల నిర్వహణలో భాగంగా సామాజిక మాధ్యమాల పర్యవేక్షణ విభాగం ఏర్పాటైంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) కార్యాలయం కేంద్రంగా పని చేస్తున్న ఈ విభాగం ఈ మాధ్యమాల్లో ఎన్నికల ప్రచార సరళిని విశ్లేషించి రోజువారీ నివేదికలు అందజేస్తుంది. సమాచార విశ్లేషణ (డేటా అనలిటిక్స్) టెక్నాలజీ రంగంలో నైపుణ్యం కలిగిన ఓ ప్రైవేట్ ఐటీ కన్సల్టెన్సీకి ఈసీ ఈ బాధ్యతను అప్పగించింది. 15 రోజుల నివేదిక సమర్పణ... ఎన్నికల ప్రచార విశ్లేషణలో భాగంగా రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, మంత్రులు, 31 జిల్లాల కలెక్టర్లకు సంబంధించిన అధికారిక సామాజిక మాధ్యమాల ఖాతాలపై సైతం ఈ విభాగం దృష్టి పెట్టింది. ఈ ఖాతాల ద్వారా జరుగుతున్న ప్రచార కార్యక్రమాలు, వాటికి లభిస్తున్న లైక్లు, షేర్ల సంఖ్య, కామెంట్ల ఆధారంగా ప్రచార సరళిని కన్సల్టెన్సీ రోజువారీగా విశ్లేషిస్తోంది. పార్టీల సామాన్య కార్యకర్తలు పెడుతున్న రాజకీయ పోస్టుల్లో కొన్నింటిని ప్రింట్ తీసి రోజువారీ నివేదికలతో జత చేసి సీఈఓ కార్యాలయానికి సమర్పిస్తోంది. గత నెల 27న కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర శాసనసభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి 15 రోజుల వరకు ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ మాధ్యమాల వేదికగా రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ప్రచార సరళిపై ఇప్పటికే ఈ కన్సల్టెన్సీ నివేదికను సమర్పించింది. ప్రజలకు అవుతున్న చేరువ ఆధారంగా ఎన్నికలపై ట్విట్టర్ 60 శాతం, ఫేస్బుక్ 30 శాతం, యూట్యూబ్ 1 శాతం ప్రభావం చూపుతున్నాయని పేర్కొన్నట్లు సమాచారం. శాసనసభ ఎన్నికలకు సంబంధించి ట్వీట్టర్, గూగుల్ ట్రెండ్స్లో రోజువారీగా ఏఏ అంశాలకు అధిక ప్రాచుర్యం లభిస్తోంది అన్న సమాచారాన్ని సేకరించి సీఈఓ కార్యాలయానికి సమర్పించే నివేదికల్లో పొందుపరుస్తోంది. ఎన్నికల నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో ప్రచార సరళిని విశ్లేషించడానికే ఈ విభాగం పని చేస్తోందని అధికారవర్గాలు పేర్కొన్నాయి. సామాజిక మాధ్యమాల్లో జరిగే అభ్యంతరకర, అసభ్యకర ఎన్నికల ప్రచార కార్యక్రమాలన్నింటినీ గుర్తించి చర్యలు తీసుకోవడం సాధ్యం కాదని తెలిపాయి. ఇలాంటి పోస్టులపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తేనే చర్యలు తీసుకోగలమని, ఫిర్యాదులపై సైబర్ పోలీస్ విభాగం దర్యాప్తు చేయనుందని ఓ అధికారి తెలిపారు. -
తెలంగాణ, ఏపీలో ‘పోషకాహార పర్యవేక్షణ’
న్యూఢిల్లీ: ‘చిన్నారులకు అంగన్వాడీలు అందజేస్తున్న పోషకాహారంపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉంచేందుకు ఏర్పాటు చేసిన కొత్త సాఫ్ట్వేర్ 7 రాష్ట్రాల్లో అమలవుతోంది. త్వరలో దేశవ్యాప్తంగా దాన్ని విస్తరిస్తాం. దీంతో 10 కోట్ల మంది చిన్నారులకు లబ్ధి చేకూరుతుంది’ అని మహిళా శిశు సంక్షేమ శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్–కామన్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ (ఐసీడీఎస్–సీఏఎస్) మే నెలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, బిహార్, జార్ఖండ్లోని 57 జిల్లాల్లో అమల్లోకి వచ్చింది. ప్రతి గ్రామానికి ప్రత్యేకంగా నూట్రిషన్ ప్రొఫైల్ తయారు చేసేందుకు, శాశ్వత ప్రాతిపాదికన పోష్టికాహార లోపాన్ని నివారించేందుకు ఈ సాఫ్ట్వేర్ సాయపడుతుంది. చిన్నారులకు సంబంధించిన సమాచారాన్ని అంగన్వాడీలు ఆఫ్లైన్లో నమోదు చేయవచ్చని మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి రాకేశ్ శ్రీవాస్తవ వెల్లడించారు. -
తెలంగాణ, ఏపీలో ‘పోషకాహార పర్యవేక్షణ’
న్యూఢిల్లీ: ‘చిన్నారులకు అంగన్వాడీలు అందజేస్తున్న పోషకాహారంపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉంచేందుకు ఏర్పాటు చేసిన కొత్త సాఫ్ట్వేర్ 7 రాష్ట్రాల్లో అమలవుతోంది. త్వరలో దేశవ్యాప్తంగా దాన్ని విస్తరిస్తాం. దీంతో 10 కోట్ల మంది చిన్నారులకు లబ్ధి చేకూరుతుంది’ అని మహిళా శిశు సంక్షేమ శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్–కామన్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ (ఐసీడీఎస్–సీఏఎస్) మే నెలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, బిహార్, జార్ఖండ్లోని 57 జిల్లాల్లో అమల్లోకి వచ్చింది. ప్రతి గ్రామానికి ప్రత్యేకంగా నూట్రిషన్ ప్రొఫైల్ తయారు చేసేందుకు, శాశ్వత ప్రాతిపాదికన పోష్టికాహార లోపాన్ని నివారించేందుకు ఈ సాఫ్ట్వేర్ సాయపడుతుంది. చిన్నారులకు సంబంధించిన సమాచారాన్ని అంగన్వాడీలు ఆఫ్లైన్లో నమోదు చేయవచ్చని మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి రాకేశ్ శ్రీవాస్తవ వెల్లడించారు. -
ప్రతీ రైతుకు రూ.5 లక్షల బీమా
సాక్షి, జెడ్పీసెంటర్(మహబూబ్నగర్) : జిల్లాలోని రైతులందరికీ రూ.5 లక్షల జీవిత బీమా సౌకర్యం కల్పించనున్నట్లు కలెక్టర్ రొనాల్డ్రోస్ తెలిపారు. స్థానిక జెడ్పీ హాల్లో మహబూబ్నగర్, జోగులాంబ గద్వాల జిల్లాలకు చెందిన ఏఓలు, ఏఈఓలకు రైతు బీమా పథకంపై మంగళవారం అవగాహన సదస్సు ఏర్పాటుచేశారు. ఈ సదస్సులో కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ఏదైని కారణంలో మరణిస్తే వారి కుటుంబాలకు ఉపశమనం కోసం బీమా పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. ఈ పథకం ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీ నుంచి వచ్చే ఏడాది ఆగస్టు 14వ తేదీ వర్తిస్తుందన్నారు. ఈ పథకం అమలులో వ్యవసాయ అధికారులు కీలకపాత్ర పోషించాలన్నారు. ఆధార్ కార్డుల్లో పుట్టిన తేదీ లేకుంటే జూలై 1వ తేదీగా నమోదు చేయాలన్నారు. రైతు కుటుంబ సభ్యుల పేర్లు, నామినీ పేర్లు నమోదు చేయాలన్నారు. నామినేషన్ వివరాలతో పాటు అర్హులైన రైతుల వివరాలు ఏఈఓలు నామినేషన్ ఫారంలో సేకరించాల్సి ఉంటుందన్నారు. డీఏఓ, ఏడీఏ, ఏఓల పర్యవేక్షణలో ఏఈఓ రైతుల వివరాలు సేకరించాలన్నారు. సమావేశంలో డీఏఓలు సుచరిత, గోవింద్నాయక్ పాల్గొన్నారు. -
ఇక స్మార్ట్ పాలన..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పరిపాలన కొత్త పుంతలు తొక్కనుంది. క్షేత్రస్థాయి అధికారుల నుంచి రాష్ట్ర స్థాయి వరకు ‘స్మార్ట్’గా పరిపాలన నిర్వహించేందుకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన శైలేంద్ర కుమార్ జోషి ఈ దిశగా సరికొత్త ప్రయత్నాలు ప్రారంభించారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ తరహాలో సచివాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసేందుకు త్వరలోనే శ్రీకారం చుట్టనున్నారు. రాష్ట్రంలో జరిగే పరిణామాలన్నీ ఎప్పటికప్పుడు తెలుసుకోవడంతోపాటు గ్రామస్థాయి వరకు ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలు, వాటి అమలు తీరును పర్యవేక్షించేందుకు వీలుగా ఈ కంట్రోల్ సెంటర్ను అభివృద్ధి చేస్తారు. ఇందులో భాగంగా గ్రామస్థాయిలో మౌలిక సదుపాయాలు మొదలు రాష్ట్రస్థాయి వరకు ప్రతి సమాచారం అందుబాటులో ఉండేలా డేటాబేస్ను రూపొందిస్తున్నారు. తదుపరి ప్రక్రియలో గ్రామ, జిల్లాస్థాయి నుంచి ప్రజల సమస్యలు, క్షేత్రస్థాయిలో పథకాల అమలు, ప్రభుత్వ పనితీరును సచివాలయం నుంచే ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తారు. నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు, పనుల పురోగతి, నీటి నిల్వలు, నీటి విడుదల తదితర వివరాలన్నీ సచివాలయం నుంచే పర్యవేక్షించే వీలుంటుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇందులో భాగంగా డిజిటల్ మానిటరింగ్ విధానంలో జిల్లాల కలెక్టరేట్లు, జిల్లా స్థాయి అధికారుల కార్యాలయాలను సచివాలయం నుంచే అనుసంధానిస్తారు. ఇంటిగ్రేటేడ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ పేరుతో కొత్త పరిపాలన విధానానికి అవసరమైన పరిజ్ఞానాన్ని ప్రభుత్వం సమకూర్చుకుంటోంది. సిమ్ కార్డులు.. స్మార్ట్ ఫోన్లు స్మార్ట్ పరిపాలనలో భాగంగా అధికారులందరికీ స్మార్ట్ఫోన్లు, శాశ్వత సిమ్ కార్డులు అందించనున్నారు. సీఎస్, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, అన్ని విభాగాల హెచ్వోడీలు మొదలు కలెక్టర్లు, జిల్లాల్లో అన్ని విభాగాల అధికారులంద రూ ఒకే నెట్వర్క్లో ఉండేలా ఏర్పాట్లు చేశారు. అందరికీ ఐడియా సిమ్ కార్డులను అందజేయాలని నిర్ణయించారు. 711 సిరీస్తో ఈ నంబర్లు ప్రారంభమవుతాయి. అధికారులు బదిలీపై వెళ్లినా ఆ హోదాలో ఉన్న అధికారికి తిరిగి అదే నంబర్ ఉండేలా ఏర్పాట్లు చేస్తారు. దీంతో ప్రజలకు అధికారుల నంబర్లు తెలియడంతోపాటు ఎప్పటికప్పుడు సమాచారం పంచుకునే వీలుంటుందని భావిస్తున్నారు. వేగంగా సమాచార మార్పిడి జరిగేందుకు ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొం దించాలని నిర్ణయించారు. స్మార్ట్ఫోన్లను సచివాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానిస్తారు. అత్యవసరమైతే నేరుగా సీఎస్ సంబంధిత అధికారితో వీడియో కాల్లో మాట్లాడేలా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. -
ప్రాణాలు పోతున్నా పట్టదా?
సాక్షి, హైదరాబాద్ :ప్రజల ప్రాణాలను తీసే ప్రమాదకర ఔషధ ప్రయోగాల (క్లినికల్ ట్రయల్స్)పై రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శలు వస్తున్నాయి. పేద ప్రజల ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని కొన్ని ప్రయోగ కేంద్రాలు నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయి. ఇష్టారాజ్యంగా చేస్తున్న ఔషధ ప్రయోగాలతో పేదలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఔషధ ప్రయోగాలపై నియంత్రణ కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిదని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. ప్రమాదకర ప్రయోగాల కారణంగా కొందరు మృత్యువాతపడటంతోపాటు పలువురు పేదలు తీవ్ర అనారోగ్యానికి గురైన సంఘటనలు ఇటీవల కాలంలో వెలుగు చూసినప్పటికీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కనీస మాత్రంగా స్పందించడంలేదనే విమర్శలు పెరుగుతున్నాయి. బాధితులకు చట్ట ప్రకారం అండగా నిలవాల్సిన వైద్య, ఆరోగ్య శాఖ ఇవేమీ చేయడంలేదు. 2017 జూన్లో కరీంనగర్ జిల్లాలో ఔషధ ప్రయోగాల కారణంగా యువకులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కలకలం సృష్టించాయి. అప్పట్లో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఔషధ ప్రయోగాలపై రాష్ట్ర స్థాయిలో నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో సూచించేందుకు 2017 జూలై 5న ఏడుగురు సభ్యులతో ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. 30 రోజులలోపు నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించింది. కమిటీ ఏర్పాటై ఏడు నెలలు గడిచింది. అయితే కమిటీ ఇప్పటికీ నివేదిక రూపొందించలేదు. కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు చేపట్టడం ఇప్పట్లో జరిగే పనిగా కనిపించడంలేదని వైద్య శాఖ వర్గాలే చెబుతున్నాయి. మరోవైపు రాష్ట్రంలో ఔషధ ప్రయోగాల బాధితులు పెరుగుతూనే ఉన్నారు. రాష్ట్ర స్థాయిలోనూ చర్యలకు వీలు.. ఔషధ ప్రయోగాల నియంత్రణ అంశం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ కారణంగా ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నామని పేర్కొంటున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వ వైద్య, ఆరోగ్య శాఖలోని పలు విభాగాలు ఇచ్చిన ఆదేశాల ప్రకారం రాష్ట్ర స్థాయిలోనూ ప్రయోగాలపై చర్యలు తీసుకునే వెసులుబాటు ఉంది. సహేతుక మార్గంలోనే ఔషధ ప్రయోగాలు నిర్వహించాలని నిబంధనలు చెబుతున్నాయి. ప్రయోగాలకు అంగీకరిస్తున్నట్లుగా... ఆయా వ్యక్తులనుంచి రాత పూర్వకంగా, వీడియో రూపంలో సమ్మతిని తీసుకోవాలని నిబంధనల్లో పేర్కొన్నారు. ప్రయోగాలకు అంగీకరించిన వ్యక్తుల పేర్లు, ఇతర వివరాలను కచ్చితంగా ఆన్లైన్లో నమోదు చేయాలి. జోనల్ కార్యాలయాల పరిధిలో ఔషధ ప్రయోగాలు నిర్వహించే కేంద్రాల వివరాలను నమోదు చేయాలి. ఉన్నత స్థాయి కమిటీలను నియమించి ప్రయోగాలపై ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలని నిబంధనలు చెబుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ డ్రగ్ కంట్రోలర్ జనరల్ కార్యాలయం 2013 ఏప్రిల్ 26న అన్ని జోనల్ కార్యాలయాలకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్లో కూడా కేంద్ర ప్రభుత్వ డ్రగ్ కంట్రోలర్ జోనల్ కార్యాలయం ఉంది. అయితే మన రాష్ట్రంలోనే అనుమతిలేని ఔషధ ప్రయోగాలు ఎక్కువగా జరుగుతున్నాయి. పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఇలా జరుగుతున్నాయా? లేక తెలిసీ అధికారులు పట్టించుకోవడంలేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. నిబంధనలు బేఖాతరు.. ఫార్మసీ కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్తగా ఔషధాలను తయారు చేసి వీటిని ప్రయోగించే కాంట్రాక్టును పరీక్ష కేంద్రాలకు ఇస్తుంటాయి. ఆయా పరీక్ష కేంద్రాలు వ్యక్తులపై వాటిని ప్రయోగించి తుది ఫలితాలను క్రోడీకరిస్తాయి. దేశ వ్యాప్తంగా 84 ప్రయోగ కేంద్రాలు ఉండగా, తెలంగాణలో తొమ్మిది ప్రయోగ కేంద్రాలు ఉన్నాయి. వీటికి కేంద్ర ప్రభుత్వ ఔషధ నియంత్రణ సంస్థ అనుమతి ఉంది. ఔషధ ప్రయోగ కేంద్రాలు... డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్), డ్రగ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (డీసీవో) నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. అయితే ఈ కేంద్రాలు అనేక సందర్భాల్లో నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయి. ప్రభుత్వ నియంత్రణ లేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి నెలకొందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆయా వ్యక్తుల ఆరోగ్య పరిస్థితి, వయసు, ప్రయోగించే ఔషధానికి శరీరం తట్టుకుంటుందా లేదా అనే అంశాలను పట్టించుకోకుండానే ఇష్టారాజ్యంగా ప్రయోగాలు చేస్తున్నారు. వ్యక్తుల వివరాలను నమోదు చేయకపోవడంతో ప్రాణాలు పోయే పరిస్థితి ఉన్నా ఎవరు బాధితులో తెలియడంలేదు. రాష్ట్రంలో ఔషధ ప్రయోగాల బాధితులు పెరుగుతున్నా.. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఇంకా నివేదిక ఇవ్వకపోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. -
లెక్క తప్పింది!
⇒మ్యాథ్స్లో ఎక్కువగా ఫెయిలవుతున్న విద్యార్థులు ⇒ఏటా పడిపోతున్న ఉత్తీర్ణత శాతం ⇒లెక్కల మాస్టార్లు ఉన్నా ఫలితం శూన్యం ⇒పర్యవేక్షణ లేమి, ప్రభుత్వ తీరుపై విమర్శలు ⇒నెరవేరని ‘మహా సంకల్పం’ ⇒ఇకనైనా మేల్కొంటారో..లేదో? లెక్క తప్పింది. ఈ సారీ పది ఫలితాల్లో జిల్లా అట్టడుగునే నిలిచింది. దీనికి లెక్కల సబ్జెక్టే ప్రధాన కారణమైంది. మాస్టార్లు ఉన్నా ఫలితం లేకుండా పోయింది. తరచూ అధికారులను మార్చేయడం, ఇన్చార్జ్ అధికారులతోనే నెట్టుకురావడం.. పర్యవేక్షణ లేకపోవడమే పెద్ద పొరబాటని ఉపాధ్యాయ సంఘాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. చిత్తూరు, సాక్షి: పది ఫలితాల్లో జిల్లా అట్టడుగు స్థానంలో నిలి చింది. గత ఏడాదితో పోలిస్తే ఉత్తీర్ణత శాతమూ తగ్గిపోయింది. గత ఏడాది 90.11 శాతం ఉత్తీర్ణత వస్తే.. ఈసారి 80.55 శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. దీనిపై ఇప్పటికే విద్యాశాఖ సమీక్ష నిర్వహిస్తోంది. ముఖ్యమంత్రి జిల్లా వరుసగా మూడోసారి చివరిస్థానంలో నిలవడంపై కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న అసంతృప్తికి లోనయ్యారు. చీటికీమాటికీ అధికారులను మార్చడం వల్లే ఇలాంటి ఫలితాలు వస్తున్నాయని ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. మూడు ముక్కలాట విద్యాశాఖకు కొంతకాలంగా పూర్తిస్థాయిలో అధికారి లేరు. గత ఏడాది డిసెంబర్ నుంచి ఇన్చార్జ్ డీఈవోతోనే నెట్టుకురావాల్సి వస్తోంది. ఆయనకు (తిరుపతి డీవైఈవో, ఇన్చార్జ్ డీఈవో, ఇన్చార్జ్ పీవో) మూడు పదవులుండడంతో పనిభారం ఎక్కువైపోయింది. విద్యాశాఖపై పూర్తిస్థాయిలో దృష్టిసారించలేకపోయారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పది ఫలితాల్లో వెనుకబడటానికి కారణాలివే ⇒పరీక్షలకు సన్నద్ధం చేయాల్సిన తరుణంలో డీఈవోను మార్చివేశారు ⇒ఉపాధ్యాయుల పనితీరుపై పర్యవేక్షణ లేకుండా పోయింది ⇒ఎంఈవో పోస్టులను విద్యా సంవత్సరం చివరలో చేపట్టారు ⇒గత ఫలితాలపై విశ్లేషించుకోలేకపోయారు ⇒సిలబస్ నిర్ణీత కాలంలో పూర్తి చేయలేకపోయారు లెక్క తప్పింది ఇలా.. ఆరేళ్ల నుంచి జిల్లా విద్యార్థులు గణితంలో అధికంగా ఫెయిలవుతున్నారు. దీనిపై అధికారులు శ్రద్ధ చూపలేకపోయారు. లెక్కల మాస్టార్లు 1,900 మంది ఉన్నా ఫలితాల్లో ఎలాంటి ప్రభావం కనిపించడం లేదు. ఒక్కో పాఠశాలలో కనీసం ఇద్దరు లెక్కల టీచర్లు ఉన్నారు. అయినా ఉత్తీర్ణత సాధించడంలో వెనకబడి పోతున్నారు. ఈ ఏడాది పదిలో లెక్కల పరీక్ష 27,464 మంది విద్యార్థులు రాశారు. అందులో 20,699 మంది విద్యార్థులు మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. వీరిలో ఏ1 గ్రేడు సాధించనవారు వందల మంది మాత్రమే. ‘మహా’ వృథా పది ఫలితాల్లో మొదటి స్థానంలో నిలిపేందుకు గత కలెక్టర్ సిద్ధార్థ్జైన్ మహాసంకల్పం పేరుతో విద్యార్థులకు వారానికో పరీక్ష జరిపించారు. ఎక్కడ వెనుకబడ్డారో గమనించి వారికి ప్రత్యేక తర్ఫీదు ఇచ్చే విధంగా ప్రణాళిక రూపొందించారు. పరీక్షల్లో వచ్చిన మార్కులను ఎప్పటికప్పుడు డీఈవో ఆఫీసుకు పంపేలా చర్యలు తీసుకున్నారు. దీనిపై పర్యవేక్షణ లేకుండా పోయింది. ఇదే అదునుగా ఉపాధ్యాయులు విద్యార్థులకు వచ్చే మార్కులను ఎక్కువ చేసి పంపడం నేర్చుకునేశారు. మహా సంకల్పం వృథాగా మారిపోయింది. రాజకీయ జోక్యం ఎక్కువ విద్యారంగంపై రాజకీయ జోక్యం ఎక్కువ. శాఖల్లో ఉన్నత స్థానం ఖాళీ అయితే వాటిని అధికార పార్టీ నాయకుల ఇష్టులకే వదిలేయడం రివాజుగా మారుతోంది. అనర్హులు ఉన్నత స్థానాలను అ«ధిరోహిస్తున్నారని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. అధికార పార్టీ వారి మాట వినకుంటే నిర్ధాక్షణ్యంగా వేటు వేయడం పరిపాటిగా మారిపోయింది. డీఈవో నాగేశ్వరరావు ఉదంతాన్నే దీనికి ఉదాహరణగా చూపుతున్నారు. -
ఉక్కిరిబిక్కిరి
పరిశ్రమల నుంచి ఘాటు వాసనలు ఊపిరాడక జనం సతమతం రోగాల బారిన పడుతున్న స్థానికులు పట్టించుకోని అధికారులు తూప్రాన్:పరిశ్రమల నుంచి రాత్రి వేళల్లో వెలువడుతున్న ఘాటు వాసనలకు ఈ ప్రాంత ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పారిశ్రామిక ప్రాంతాల్లో నివసించే వారు ఊపిరి పీల్చుకోలేక సతమతమవుతున్నారు. మండలంలోని రంగాయిపల్లి, కాళ్లకల్, కూచారం, ముప్పిరెడ్డిపల్లి, జీడిపల్లి తదితర ప్రాంతాల్లో సుమారు వందకుపైగా పరిశ్రమలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో కాలుష్య సమస్య తీవ్రంగా ఉంది. సదరు పరిశ్రమల నుంచి నిత్యం ఘాటు వాసనలతో ముక్కుపుటా లు అదిరిపోతున్నాయి. పారిశ్రామిక ప్రాంతాల నుంచి సుమారు 10 కిలోమీటర్ల దూరం వరకు వాసనలు వస్తున్నాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పచ్చని పంట పొలాలు, ప్రశాంతమైన వాతావరణం గల పల్లెల్లో పరిశ్రమలు చిచ్చుపెడుతున్నాయి. ఉదయం వేళల్లో కంటే రాత్రి వేళల్లోనే పరిశ్రమల నుంచి ఘాటైన వాసనలు వెలువడుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో పరిశ్రమల యాజమాన్యాలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎవరైనా అధికారులకు ఫిర్యాదు చేస్తే ఆ విషయాన్ని అధికారులు ముందస్తుగా పరిశ్రమల యాజమాన్యాలకు ఉప్పందిస్తున్నారు. మొక్కుబడి దాడులతో అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. ఈ వాసనలు భరించలేక చిన్నారులు రోగాల బారిన పడుతున్నారు. ఈ వాసనలను పీల్చుకోవడం వల్ల తలనొప్పి, కడుపులో తిప్పినట్లు, వాంతులు కావడం, చర్మ వ్యాధుల బారిన పడుతున్నారు. రాత్రి సమయాల్లో వ్యర్థ రసాయనాలు వదిలే పరిశ్రమలపై నిఘా పెట్టాల్సిన అధికారులు తూతూమంత్రంగా చర్యలు తీసుకోవడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని రంగాయిపల్లి, చెట్ల గౌరారం వాసుల ఇబ్బందులు వర్ణనాతీతం. స్టీల్ పరిశ్రమ వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు సమీప గ్రామాల వారు చెబుతున్నారు. పలుమార్లు జిల్లా అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదన్నారు. సంబంధిత పీసీబీ అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు లేవంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఈ విషయమై పీసీబీ అధికారి నరేందర్ను ‘సాక్షి’ ఫో¯Œన్లో సంప్రదించగా స్పందించలేదు. రోగాలబారిన పడుతున్నాం.. రాత్రి వేళల్లో పరిశ్రమల నుంచి ఘాటు వాసనలు వెలువడుతున్నాయి. ఈ వాసనను పీల్చుకుంటే రోగాలు వస్తున్నాయి. రాత్రి సమయాల్లో చాలా దూరం వరకు ఈ వాసనలు వస్తున్నాయి. ఈ సమస్యను అధికారులు పట్టించుకోవడం లేదు. – మహేష్, రంగాయిపల్లి ఇబ్బందులు పడుతున్నాం.. పరిశ్రమల నుంచి వదులుతున్న వ్యర్థ రసాయనాల ఘాటు వాసనలు పీల్చుకోలేక ఇబ్బందులు పడుతున్నాం. పలు రోగాలు వస్తున్నాయి. వాసనకు రాత్రి వేళల్లో నిద్రపట్టడం లేదు. ఇలాంటి పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలి. – శ్రీకాంత్, చెట్ల గౌరారం సమస్య పట్టని అధికారులు.. వాయు కాలుష్యన్ని నియంత్రించాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు. ఫలితంగా పరిశ్రమల నుంచి ఇష్టానుసారంగా వ్యర్థ రసాయన వాయువులు బయటకు వదులుతున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న దాఖలాలు లేవు. – గణేశ్, రంగాయిపల్లి పరిశ్రమలను తరలించాలి.. కాలుష్యాన్ని వదిలే రసాయన పరిశ్రమలను గ్రామాలకు దూరంగా తరలించాలి. అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించడం వల్ల పరిశ్రమల యాజమాన్యాలు నిర్లక్ష్యంగా కాలుష్యాన్ని బయటకు వదులుతున్నాయి. ఫలితంగా జనం రోగాల బారిన పడుతున్నారు. – రవి, చెట్ల గౌరారం -
మరో అంతరిక్ష పర్యవేక్షణ బెలూన్!
న్యూజిల్యాండ్ః అనేక ప్రతికూల వాతావరణ పరిస్థితులను అధిగమించి ఎట్టకేలకు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా 'నియర్ స్పేస్ మానిటరింగ్ బెలూన్' ను విజయవంతంగా ప్రయోగించింది. ఈ బెలూన్ ను సూపర్ ప్రెజర్ టెక్నాలజీతో రూపొందించారు. రోదసినుంచి నిఘా నేత్రంగా పనిచేసే ఈ బెలూన్ కు కాంప్లన్ స్పెకోట్రమీటర్ అండ్ ఇమేజర్.. గామా రే టెలిస్కోపును కూడ జోడించి ప్రయోగించారు. ఇప్పటిదాకా భూమినుంచి రోదసిని పర్యవేక్షిస్తున్న నాసా సైంటిస్టులు.. రోదసినుంచీ భూమిని పర్యవేక్షించే మరో ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. న్యూజిల్యాండ్ లోని వనకా ఎయిర్ పోర్టు నుంచి ప్రయోగించిన నియర్ స్సేస్ మానిటరింగ్ బెలూన్ బరువు... 5,32,000 క్యూబిక్ మీటర్లు. కొత్తగా ప్రయోగించిన ఈ బెలూన్ ప్రతి ఒకటినుంచి మూడు వారాల మధ్యలో స్ట్రాటో ఆవరణలోని గాలి వేగాన్ని బట్టి, గ్లోబును చుట్టి వస్తుందని నాసా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇంతకు ముందు ఎదురైన ఎన్నో వాతావరణ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని చివరికి ఈ అంతరిక్ష సమీప పర్యవేక్షణ బెలూన్ ను నాసా ఐదోసారి ప్రయోగించి విజయవంతమైంది. కొలంబియా సైంటిఫిక్ బిలూన్ ఫెసిలిటీ, నాసా వాలప్స్ ఫ్లైట్ ఫెసిలిటీ, వర్జీనియా అంతరిక్ష బెలూన్ విమానంలోని మిషన్ కార్యకలాపాలన్నింటినీ నాసా నిపుణులు నియంత్రిస్తారు. ఇప్పటివరకూ నాసా సృష్టిలోని సూపర్ ప్రెజర్ బెలూన్ ఫ్లైట్ రికార్డు 54 రోజులు కాగా... తాజాగా వనకా నుంచి రెండో సూపర్ ప్రెజర్ బెలూన్ మిషన్ ను నాసా శాస్త్రవేత్తలు ప్రయోగించారు. -
రక్షణ, పర్యవేక్షణ లేకే ప్రమాదం
మంచిర్యాల సిటీ (ఆదిలాబాద్) : శాంతిఖని గని ప్రమాదంలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతోంది. రక్షణ చర్యలు చేపట్టకపోవడమే కాకుండా పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఈ దారుణం జరిగింద నే ఆరోపణలు వెల్లువెత్తుతున్నారుు. ప్రస్తుతం గనిలో పనిచేస్తున్న ఓవర్మెన్, సర్దార్, అండర్ మేనేజర్, సంబంధిత అధికారులు, సూపర్వైజర్లలో చాలా మంది జూనియర్లే కావడంతో ప్రమాదాన్ని పసిగట్ట లేక పోయారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జంక్షన్లో రక్షణ ప్రమాదం జరిగిన 52 లెవల్, ఒకటో డీప్ జంక్షన్లో క్రాస్బార్లో కనీసం మూడు దిమ్మలైనా బండ, సిమెంటుతో కట్టాలి. సరైన కొలతలతో ైసైడుల్లో రంధ్రాలు చేసి 5ఁ10 లేదా 6ఁ12 ఇంచుల సైజు గలిగిన గడ్డర్లు ఎక్కించి వాటిపై లైటుబార్లు లేదా 4ఁ8 బార్లు పెట్టి వాటిపై దిమ్మెలు కట్టి లాగింగ్ చేయాలి. సైడ్వాల్లు బలహీనంగా ఉంటే సైడుల లో మేసనరీ లై నింగ్ లేద పిన్నులు బిగించి వాటిపై బార్లు లేద గర్డర్లు పెట్టి సపోర్లు చేయాలి. నాలుగు మూలలకు నాలుగు దిమ్మెలు కట్టి వాటిపై గర్డర్లతో సపోర్డు ఏర్పాటు చేస్తే పైకప్పు కూలకుండా ఉం టుంది. దిమ్మెల నిర్మాణం సుమారు 30 టన్నుల బరువును ఆపుతుంది. పది చదరపు మీటర్ల ఏరియా ను సపోర్టు చే స్తుంది. ర క్షణ చర్యలు చేపట్టినప్పటికీ నిత్యం సంబంధిత అధికారులు పర్యవేక్షించాల్సి ఉం టుంది. ప్రస్తుతం ప్రమాదం జరిగిన జంక్షన్లో ఏ ఒక్క ర క్షణ నిర్మాణం చేపట్టకపోవడం వల్లే కార్మికు లు ప్రాణాలను కోల్పోయారని తెలుస్తోంది. ప్రాణం పోసిన హెచ్చరిక ప్రమాదం జరిగిన బుధవారం మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు ఐదు నిమిషాల ముందు రక్షణ అధికారి హెచ్చరిక తోటి కార్మికులకు ప్రాణం పోసింది. జంక్షన్ వద్దకు సుమారు 25 మంది కార్మికులు నీరు తాగడానికి వచ్చారు. ఆ స్థలంలో చల్లని గాలి వస్తుండడంతో కొద్దిసేపు సేదతీరుతామని అనుకున్నారు. ఇంతలోనే గని రక్షణ అధికారి సంతోష్రావు అటు వైపుగా వచ్చి ‘ఇక్కడ ఏం చేస్తున్నారు.. పనికి వెల్లండి’.. అంటూ హెచ్చరించారు. దీంతో కార్మికులు పనులకు వెళ్లిపోయూరు. తర్వాత కొద్ది నిమిషాల్లోనే అక్కడ పైకప్పు(బండ) కూలింది. వచ్చిన అధికారి కార్మికులతో మాట్లాడుకుంటూ నిలబడినా 26 మంది ప్రాణాలు పోయేవి. ఒక వేళ ఆ అధికారి రాకపోరుునా 25 మంది ప్రాణాలు బండ కింద నలిగిపోయేవి. -
ఈ ఏడాది 100
♦ ఆరు క్వారీల నుంచి ఇసుక రవాణా ♦ సీసీ కెమెరాలతో పర్యవేక్షణ ♦ భవన నిర్మాణ పన్ను ఎగవేస్తే చర్యలు ♦ ‘సాక్షి’తో మైనింగ్ ఏడీ ఎస్ సురేందర్ మైనింగ్ శాఖ ఆదాయం 24 ఏళ్లలో తొలి రికార్డు సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : పట్టాభూముల్లో ఇసుక తవ్వకాలకు తెరవేసిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్ఎండీసీ) పర్యవేక్షణలో సాగిస్తోంది. ఈ నేపథ్యంలో ఎనిమిది క్వారీలకు అనుమతి వచ్చినా ఆరు చోట్లనే తవ్వకాలు సాగిస్తున్నారు. మైనింగ్శాఖ ఆదాయం 24 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా నూరు శాతం వసూలు చేయడం... భవన నిర్మాణదారుల నుంచి పన్నుల వసూలుకు మైనింగ్ శాఖ స్పెషల్డ్రైవ్ చేస్తోంది. ఈ సందర్భంగా ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ఇసుక తవ్వకాల్లో అక్రమాలకు పాల్పడితే అసలుకే ఎసరు అంటున్న మైనింగ్శాఖ అసిస్టెంట్ డెరైక్టర్ సింగం సురేందర్ వెల్లడించిన విషమాలు ఆయన మాటల్లోనే.... ఆరుచోట్ల... జనవరి 12న జిల్లా వ్యాప్తంగా 10 ప్రాంతాల్లో పట్టాభూముల్లో ఇసుక తవ్వకాలకు డీఎల్ఎస్సీ అనుమతి ఇచ్చింది. ఆందులో ఎనిమిది అగ్రిమెంట్ కుదుర్చుకోగా.. ప్రస్తుతం ఆరు చోట్లనే తవ్వకాలు సాగుతున్నాయి. బిచ్కుంద మండలం వాజిద్నగర్, పుల్కల్, గుండెనెమ్లిలలో మొత్తం ఆరు క్వారీలు నడుస్తున్నాయి. కోటగిరి మండలం కారెగాంలో తహసీల్దారు నివేదిక అనంతరం తవ్వకాలకు అనుమతించనున్నారు. టీఎస్ఎండీసీ పర్యవేక్షణలో... మీ-సేవ కేంద్రాలలో అన్లైన్ ద్వారా డబ్బులు చెల్లించిన వారు ఆ రశీదులతో వస్తే నేరుగా ఇసుక తీసుకెళ్లే విధంగా రవాణా జరుగుతోంది. ప్రతి ఇసుక క్వారీ వద్ద సీసీ కెమెరాలు, టీఎస్ఎండీసీ పర్యవేక్షణలో నిబంధనల ప్రకా రం ఇసుక మేటల తొలగింపు ప్రక్రియ సాగుతుంది. ఇసుక నింపడం, రవాణా తదితర అంశాలను రెవెన్యూ, పోలీసు అధికారులు పర్యవేక్షిస్తారు. ఈ ఆరు క్వారీల నుంచి 10 వేల క్యూబిక్ మీటర్ల నుంచి 40 వేల క్యూబిక్ మీటర్ల మేరకు అనుమతులు ఉన్నాయి. 1.50 మీటర్లమ లోతు వరకే తవ్వే అవకాశ ఉంది. నెలాఖరు లోపు.. 1992లో ఈ జిల్లాలో మైనింగ్శాఖ అసిస్టెంట్ డెరైక్టర్ కార్యాలయం ఏర్పడింది. 24 ఏళ్లలో మొదటిసారిగా పన్ను ల రూపేణా ఆదాయం సేకరణలో రికార్డు సాధించబోతున్నాము. ఈ ఏడాది రూ.25.67 కోట్లు పన్నుల రూపేణా వసూలు లక్ష్యం కాగా గురువారం నాటికి రూ.23.65 కోట్లు వచ్చింది. ఈ నెలాఖరులోపు నూటికి నూరు శాతం ఆదాయం వస్తుంది. 24 ఏళ్లలో లక్ష్యాన్ని సాధించడంలో తొలి రికార్డు కాబోతుంది. పన్నులు ఎగవేస్తే చర్యలు.. పదివేల చదరపు అడుగులకు పైగా నిర్మించిన భవనాలపై పన్నులు ఎగవేస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటాము. ఇప్పటికే జిల్లాలో సుమారు 25 మందికిపైగా నోటీసులు ఇచ్చాము. ఈ నెలాఖరులోగా చెల్లించకపోతే చర్యలుంటాయి. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవోఎమ్మెస్ నంబర్ 8 ప్రకారం 10,000 చదరపు అడుగులకు పైబడి నిర్మించిన భవనాలపై చదరపు ఒక్కంటికి రూ.3 చొప్పున పర్యావరణ ప్రభావ రుసుమును సంబంధిత గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ, నగర పాలకసంస్థలకు చెల్లించాల్సి ఉంది. ఈ ఉత్తర్వులు నిర్మాణం జరుగుతున్న భవనాలు, వెంచర్లు, ఇటీవల పూర్తి కాబడిన భవనాలకు కూడ వర్తిస్తుంది. అసలుకే ఎసరు.. ఇసుక తవ్వకాల విషయంలో కలెక్టర్ ఆధ్వర్యంలోని జిల్లా కమిటీ సీరియస్గా ఉంది. ఇసుక త వ్వకాల్లో నిబంధనలు ఉల్లంఘిస్తే అసలుకే ఎసరు వ స్తుంది. పట్టాభూముల్లో ఇసుక మేటల తొలగింపు పేరిట అనుమతులు ఇవ్వడంతో పాటు ఏ పరిణామంలో, ఎంత లోతులో తీయాలనేది డీఎల్ఎస్సీ అనుమతుల సందర్భం గా స్పష్టం చేస్తున్నది. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుని ఇసుక తవ్వకాలు, తరలింపులు ఉండాలి. మై నింగ్ నిబంధనలను ఉల్లంఘిస్తే అనుమతుల రద్దుతో పాటు శాఖాపరమైన చర్యలు కూడా ఉంటాయి. -
సరిహద్దును ఎందుకు మూసేయలేదు?
గురుదాస్పూర్ ఘటనపై పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాల్పుల సమాచారం తెలిసిన వెంటనే తన సంగత్ దర్శన్ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. రాష్ట్ర డీజీపీ సుమేధి సింగ్ సహా, మిగిలిన ఉన్నతాధికారులు గురుదాస్పూర్ జిల్లాలోని దీనానగర్కు వెళ్లాలని ఆదేశించారు. తీవ్రంగా గాయపడి అమృతసర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. మరోవైపు ఈ ఘటనపై ఆయన కేంద్రంపై ఆరోపణలు గుప్పించారు. ఉగ్రవాదం ఒక రాష్ట్ర సమస్య కాదని, దాన్ని ఎదుర్కొనేందుకు జాతీయ విధానం కావాలంటూ పరోక్షంగా కేంద్రంపై విమర్శలు గుప్పించారు. అంతర్జాతీయ సరిహద్దులను ఎందుకు మూసేయలేదంటూ ప్రశ్నించారు. మరోవైపుర దీనానగర్ ప్రాంతంలో ఉగ్రవాదులకు, భద్రతాదళాలకు మధ్య భీకరంగా ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి సర్వేష్ కౌశల్, ఇతర ముఖ్య అధికారులతో సీఎం అత్యవసరంగా సమావేశం నిర్వహించారు. పరిస్థితిని ఎప్పటికపుడు సమీక్షిస్తున్నారు. హోం మంత్రి రాజ్నాథ్ సింగ్కు పరిస్థితిని వివరిస్తున్నారు. కాగా సోమవారం ఉదయం జరిగిన భారత్ పాక్ సరిహద్దులో ఉగ్రదాడితో దేశ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కేంద్ర హోంశాఖ అన్ని భద్రతా దళాలను అప్రమత్తం చేసింది. దేశంలోని ప్రధాన నగరాల్లో హై అలర్ట్ ప్రకటించారు. -
పాతబస్తీలో ‘ఆపరేషన్ లేట్నైట్’
- 282 మంది యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు - తల్లిదండ్రులకు డీసీపీ కౌన్సెలింగ్ చాంద్రాయణగుట్ట: పాతబస్తీలో ఇటీవల జరిగిన స్ట్రీట్ ఫైట్ ఘటనలో ఓ యువకుడు మృతి చెందడంతో పోలీసులు మేల్కొన్నారు. దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారాయణ పర్యవేక్షణలో శుక్రవారం రాత్రి 10 ప్రత్యేక బృందాలు 17 పోలీస్స్టేషన్ల పరిధిలో ‘ఆపరేషన్ లేట్ నైట్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. అర్ధరాత్రి రోడ్లపై ఆవారాగా తిరిగే యువకులతో పాటు హుక్కా సెంటర్లు, స్విమ్మింగ్ పూళ్లు, స్మోకింగ్ ఏరియాలు, టిఫిన్ సెంటర్లు, బస్తీ చబుత్రాల్లో మంతనాలు చేస్తున్న 282 మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తీగలకుంట, తలాబ్కట్ట, చాంద్రాయణగుట్ట, బాబానగర్, సంతోష్నగర్ బస్తీలకు చెందిన యువకులు పెద్ద సంఖ్యలో పట్టుబడ్డారు. కాగా పట్టుబడిన వారిలో 30 మంది 16-17 ఏళ్ల వయసున్న మైనర్లు కాగా మిగతా వారు 18-25 ఏళ్ల వయసున్న వారు. వారి తల్లిదండ్రులను పిలిపించి దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారాయణ తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. నెలలోపు పిల్లలు ప్రవర్తన మార్చుకోకపోతే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సమాజంలో మంచిగా మెలుగుతామని పట్టుబడిన యువకులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో దక్షిణ మండలం అదనపు డీసీపీ కె.బాబురావు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. క్రమశిక్షణ అలవర్చేందుకే : డీసీపీ సత్యనారాయణ ఆవారాగా తిరుగుతున్న యువకుల్లోక్రమశిక్షణ అలవర్చేందుకు నగర పోలీస్ కమిషనర్ మహేందర్రెడ్డి ఆదేశానుసారం ఆపరేషన్ లేట్నైట్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారాయణ తెలిపారు. తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపంతో స్ట్రీట్ ఫైట్ ఘటన జరిగి నబీల్ అనే విద్యార్థి మృతి చెందాడని అన్నారు. చాంద్రాయణగుట్ట పరిసరాల్లో అర్ధరాత్రి స్విమ్మింగ్ పూళ్ల వద్ద బెట్టింగ్లు నిర్వహిస్తున్నట్లు తేలిందన్నారు. కొందరు యువకులు రౌడీషీటర్లతో కూడా స్నేహాన్ని పెంచుకుంటున్నారని తెలిపారు. -
ఇసుకాసురులు
⇒ నదులు, గెడ్డలకు తూట్లు ⇒ అనధికారిక తవ్వకాలు ⇒ దొడ్డిదారిన అమ్మకాలు ⇒ మామూళ్ల మత్తులో అధికారులు ⇒ కానరాని నిఘా.. కొరవడిన పర్యవేక్షణ ⇒ లూటీ చేస్తున్న ‘దేశం’ నేతలు సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో సర్ప, పెద్దేరు, శారదా, తాండవ నదులతో పాటు రైవాడ, కోనాం, కల్యాణపులోవ , మేఘాద్రిగెడ్డ, గంభీరం,బొడ్డేరు,తాచేరు రిజర్వాయర్లలో ఆయా సాగునీటి వనరులకు ఇబ్బంది లేని ప్రాంతాల్లో మాత్రమే అందుబాటులో ఉన్న ఇసుకను దృష్టిలో పెట్టుకుని రీచ్లను గుర్తించారు. అధికారికంగా గుర్తించిన రీచ్ల కంటే అనధికారికంగా ఇసుకతవ్వకాలు జరిగే ప్రాంతాలే ఎక్కువగా ఉన్నాయి. అనుమతులిచ్చిన రీచ్ల్లో ఎక్కడా సీసీ కెమేరాలు లేవు. రవాణా చేసే వాహనాలకు జీపీఎస్ సిస్టమ్తో అనుసంధానించలేదు. ఒకరిద్దరు డ్వాక్రామహిళలు, నోరు వాయ లేని కిందిస్థాయి సిబ్బంది తప్ప ఏరీచ్లలోనూ చెప్పుకో తగ్గస్థాయి అధికారులు లేరు. డ్వాక్రామహిళలకు తవ్వకాలు, అమ్మకాలపై కనీస అవగాహన ఉన్నట్టుగా కన్పించదు. రీచ్ల కోసం ఏ సమాచారం అడిగినా వారు చెప్పే పరిస్థితులో లేరు. మీ సేవ..ఆన్లైన్లో జరిగే రిజిస్ట్రేషన్ మేరకు సాగే తవ్వకాలు, అమ్మకాల కంటే అనధికారికంగా సాగే అమ్మకాలే ఎక్కువగా ఉన్నాయి. ఇష్టమొచ్చిన చోటల్లా ఇష్టమొచ్చినట్టు తవ్వకాలు సాగిస్తూ నదులు, గెడ్డలకు తూట్లు పొడిచేస్తున్నారు. ఈ ప్రాంతాల్లో నుంచి సుమారు 500కు పైగా ట్రాక్టర్లు, వెయ్యికిపైగా టైరు బండ్లపై ఇసుకను ధర్జాగా తరలించు కుపోతున్నట్టుగా గుర్తించారు. అనధికారిక తవ్వకాలు జరిగే ప్రాంతాలు.. ఏజెన్సీలో మత్స్యగెడ్డ పరిసర ప్రాంతాలైన మత్స్యగెడ్డవంతెన, బొకెల్లు కాజ్వే, రాయగడ హాస్టల్, పరదానిపుట్టుకాజ్వే, పాతరపుట్టు, రాళ్లగెడ్డ పరిసర ప్రాంతాలైన చెరుకుంపాలెం, భీమసింగ్, దేవారాపల్లి మండలం కిమరాం, బి.చంతాడ, వేచలం, మాడుగులమండలం వీరవల్లి, ఎస్.రాయవరం మండలం పెనుగల్లు, ధర్మవరం, పెదఉప్పలం, పాయకరావుపేట మండలం మంగవరం, సత్యవరం, అరట్లకోట, మోసయ్యపేట, ముటాఆనకట్టలు, అనకాపల్లిమండలం దిబ్బపాలెం, వెంకుపాలెం, సీతా నగరం, మూలపేట,చోడవరం మండలం విజయరామరాజు పేట, వడ్డాది, గౌరవరం, గజపతినగరం, జెన్నవరం తదితర ప్రాంతాల్లో అనధికారికంగా రోజూ వందలాది ట్రాక్టర్లు, టైరుబండ్లపై టన్నుల కొద్ది ఇసుక తరలి పోతున్నట్టుగా ‘సాక్షి’ పరిశీలన లో వెలుగుచూసింది. సముద్ర ఇసుకను వదలడం లేదు వ్యాపారులు సముద్రపు ఇసుకను కూడా వదలడం లేదు. నక్కపల్లి మండలంలో రాజయ్యపేట, డిఎల్.పురం, బోయిపాడు,పెదపీనర్ల, చినపీనర్ల, బంగారయ్యపేట, రేవుపోలవరం, పెంటకోట, కేశవరం,పాల్మన్పేటల్లో సముద్రపుఇసుకను తవ్వేస్తున్నారు. ఈసుకను నదుల్లోని ఇసుకతో కలిపేసి గుట్టుచప్పుడు కాకుండా అమ్మేస్తున్నారు. ’ఇలా చెప్పుకుంటూ పోతే క్షేత్ర స్థాయిలో జరుగు తున్న అక్రమాలు లెక్కకు మించే సాగుతున్నాయి. తాండవ నదిలో తుని-పాయకరావుపేట సరిహద్దు గ్రామాల్లో ఏకంగా పొక్లెయినర్లను ఉపయోగించి తవ్వకాలు సాగిస్తున్నారు. పగటి పూట డ్వాక్రా మహిళల మాటున సాగుతున్న తవ్వకాలు రాత్రిళ్లు మాత్రం అడ్డూ అదుపూ లేకుండా జరుగుతున్నాయి. రాత్రిపూట అనధికారిక రీచ్లలో వందల కొద్ది లారీలు, టైర్ల బండ్లపై తరలిస్తున్నా అధికారులు మాత్రం ఎక్కడా ఒక్క ట్రాక్టర్ కూడా పట్టుకున్న దాఖలాలు లేవు. -
ఇసుకపై టీఎస్ఎండీసీ పర్యవేక్షణ
సాక్షి, హైదరాబాద్: నాణ్యమైన ఇసుకను సులభమైన పద్ధతిలో ప్రజలకు చేరవేసేలా కొత్త విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం రూపొందించింది. ఈ మేరకు ఇసుక, గనులపై నూతన పాలసీని ప్రకటిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యా యి. ఈ పాలసీ ప్రకారం ఇకపై స్టాక్ యార్డుల ద్వారా ఇసుకను విక్రయిస్తారు. తెలంగాణ రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(టీఎస్ఎండీసీ) ఆధ్వర్యంలో ఇసుక రీచ్లకు వేలం పాటలు నిర్వహిస్తారు. ఇసుక రీచ్లను ప్రభుత్వం ఐదు కేటగిరీలుగా వర్గీకరించింది. మొదటి విభాగం లో వాగులు, వంకలను చేర్చింది. వీటిపై అధికారాన్ని పంచాయతీలకే కట్టబెట్టింది. స్థానిక గృహా వసరాలకు, ప్రభుత్వ గృహ నిర్మాణ పథకాలకు సీనరేజీ ఫీజు లేకుండానే ఇక్కడి ఇసుకను వినియోగించుకోవచ్చు. ఇసుక తోడేందుకు, రవాణాకు యంత్రాలను వినియోగించకూడదు. అలాగే ఆ గ్రామ పరిధి దాటి ఇసుకను రవాణా చేయకూడదు. ఐదో విభాగంలో కృష్ణా, గోదావరి వంటి పెద్ద నదులను చేర్చారు. ఇసుక లభ్యమయ్యే రీచ్లను ఇరిగేషన్, రెవెన్యూ శాఖల సహకారంతో గనులు, భూగర్భ వనరుల శాఖ గుర్తిస్తుంది. ప్రాథమికంగా గుర్తించిన తర్వాత సాధ్యాసాధ్యాల నివేదికను జాయింట్ కలెక్టర్ సారథ్యంలోని జిల్లా స్థాయి కమిటీ సిద్ధం చేస్తుం ది. సాధ్యమయ్యే రీచ్ల్లో ఇసుక తవ్వకాలు, నియంత్రణ, రవాణాను టీఎస్ఎండీసీ పర్యవేక్షిస్తుంది. నీటి పారుదల విభాగం సూచనల మేర కు పూడిక పేరుకుపోయిన రిజర్వాయర్లలో లభ్యమయ్యే ఇసుకను సైతం తవ్వి తోడేందుకు అవకాశముంది. ఈ ఇసుకను టీఎస్ఎండీసీ ఆధ్వర్యంలోని స్టాక్ యార్డులకు తరలించాల్సి ఉం టుంది. రీచ్కు దగ్గరలో గానీ పట్టణ ప్రాంతాలు, కార్పొరేషన్ల శివార్లలోగానీ ఈ యార్డులను ఏర్పా టుచేస్తారు. యార్డుల్లో ఇసుక విక్రయాలను సీసీ టీవీల ద్వారా పర్యవేక్షిస్తారు. ఇసుక రవాణా చేసేందుకు స్టాంపు, తేదీతో పాటు సెక్యూరిటీ సీల్తో ఉన్న వేబిల్లులను టీఎస్ఎండీసీ జారీ చేస్తుంది. ఇసుక రవాణా చేసే వాహనాలను జీపీఎస్ విధానంలో పర్యవేక్షిస్తారు. పట్టా భూముల్లోనూ తవ్వకాలకు ప్రభుత్వం అనుమతివ్వనుంది. తవ్వకాల సమయంలో సరిహద్దులు మీరకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టనుంది. సీనరేజీ ఫీజు ఇబ్బడి ముబ్బడిగా విధించకుండా టీఎస్ఎండీసీ నిర్ణయించిన రేటు పాటించాల్సి ఉంటుంది. దీంతో పాటు రాతి ఇసుక వినియోగాన్ని పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాతి ఇసుక వాడకం పెరిగితే సాధారణ ఇసుకకు డిమాండ్ తగ్గిపోతుందని అంచనా వేసింది. అందుకే రాతి ఇసుక యూనిట్లను పరిశ్రమల కేటగిరీలో చేర్చి.. వాటిని స్థాపించేందుకు వాట్ మినహాయింపు, విద్యుత్తు సబ్సిడీ తదితర రాయితీలు కల్పిస్తామని ప్రకటించింది. -
‘ఉపాధి’కి ఊతం వచ్చేనా!
* ఈజీఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లుగా ఎంపీడీఓలు * వందరోజుల పని లక్ష్యంగా.. * మండల స్థాయిలో చురుకైన పాత్ర పోషించాలి * ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ఉపాధి హామీ పథకం అమలు బాధ్యతలను మండల పరిషత్ అభివృద్ధి అధికారుల(ఎంపీడీఓ)కు బదలాయిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. పథకం విజయవంతం కోసం గ్రామ, మండల స్థాయి ల్లో ఇకపై ఎంపీడీఓలు చురుకైన పాత్ర పోషిం చాలని ఉత్తర్వుల్లో పేర్కొన్న సర్కారు.. ఈవోపీఆర్డీ, సూపరింటెండెంట్ సహా 11 కేటగిరిలకు చెందిన అధికారులు, ఉద్యోగుల విధి విధానాలను కూడా అందులో సూచించింది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని 9 జిల్లాలు, 443 మండలాల్లో జాబ్కార్డున్న ప్రతికూలీకి కనీ సం 100 రోజుల పని లక్ష్యంగా నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి జె.రేమండ్ పీటర్ శుక్రవారం కలెక్టర్, జడ్పీ సీఈఓ, డ్వామా పీడీలకు జారీ చేసిన ఉత్తర్వులో పేర్కొన్నారు. ఇక జిల్లాలోని 36 మండలాలకు ఎంపీడీఓలే ‘ఉపాధి’ ప్రోగ్రాం ఆఫీసర్లుగా వ్యవహరించనున్నారు. కూలీలకు భరోసా ఇవ్వని పథకం ఉపాధి హామీ చట్టం-2005 ప్రకారం జిల్లాలో నమోదు చేసుకున్న కూలీలకు కనీసం వంద రోజుల పాటు పని కల్పించాల్సి ఉంది. అయితే అధికారులు లక్ష్యసాధనకు అనేక ప్రతికూల పరిస్థితులను కారణాలుగా చూపుతూ కూలీల కు వందరోజులు పని కల్పించలేకపోయారు. ఉ పాధి హామీ పథకం అమలులో రాష్ట్రస్థాయిలో జిల్లా ఐదో స్థానంలో ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నా.. గతేడాది 14,578 కుటుంబాలకే వంద రోజుల పని దొరకడం గమనార్హం. ఈ నేపథ్యం లో ఉపాధి హామీతో భరోసా పొందని కూలీలు మళ్లీ వలసబాట పట్టిన సందర్భాలున్నాయి. మద్నూర్, పిట్లం, జుక్కల్, నిజాంసాగర్, కోట గిరి, బాన్సువాడ తదితర మండలాల్లో పలువురు కూలీలు వలస వెళ్లారు. చిత్తశుద్ధి ఏది? ఉపాధి హామీ పథకం కింద ఖర్చు చేసేందుకు బోలెడన్ని నిధులున్నా.. క్షేత్రస్థాయిలో సరైన పర్యవేక్షణ, పనుల ఎంపిక, కూలీలకు పని కల్పించే విషయంలో చాలాచోట్ల చిత్తశుద్ధి కరువైందన్న విమర్శలున్నాయి. 2013-14 సంవత్సరంలో జాబ్కార్డులు పొందిన 4,45,117 మంది కూలీలకు ఉపాధి కల్పించేందుకు రూ. 557.62 కోట్ల విలువ గల పనులు గుర్తించినా.. రూ. 203.50 కోట్లు ఖర్చు చేసి 50,149 పనులు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. అయినా కేవలం 14,578 కుటుంబాలకు మాత్రమే వంద రోజుల పని కల్పించగలిగారు. శుక్రవారం నాటికి ఉపాధి హామీలో పాల్గొన్న కూలీకి రోజుకు సగటున రూ. 108.54 లకు మించి కూలి డబ్బులు లభించలేదు. ప్రణాళిక ఇదీ.. ఉపాధి హామీ పథకం కింద జిల్లాలో 2014-15 ఆర్థిక సంవత్సరానికిగాను రూ. 881.34 కోట్లతో 53,690 పనులు చేపట్టేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. 4,48,001 మంది కూలీలకు జాబ్కార్డులు అందజేసిన అధికారులు 25,669 శ్రమ శక్తి సంఘాల ద్వారా 6,26,495 మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కూలీలకు ఉపాధి కల్పించడం ద్వారా రూ. 557.62 కోట్లు ఖర్చు చేసేందుకు ప్రణాళిక సిద్ధమైనా.. అందులో ఇప్పటికే 20,801 పనులు పూర్తి చేసి రూ. 129.92 కోట్లు ఖర్చు చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. అయితే పథకం అమలు కోసం ప్రణాళికలు బాగానే ఉన్నా... క్షేత్రస్థాయిలో ఆచరించడం మాత్రం సాధ్యం కావడం లేదు. ఇదిలా ఉంటే ఇప్పటికీ 45 శాతం గ్రామాలలో ఉపాధి పనులు ఇంకా మొదలవలేదు. శివారు గ్రామాల్లోనైతే ఉపాధి హామీ పనులను మొక్కుబడిగా ప్రారంభించారు. 2012-13 ఆర్థిక సంవత్సరంలోనూ జనవరి, ఫిబ్రవరి మాసాల వరకు నిధులను ఖర్చు చేయకుండా మార్చిలో హడావుడి చేశారన్న ఆరోపణలున్నాయి. అయితే కొత్తగా కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల మేరకు ఉపాధి హామీ పథకం పనుల పర్యవేక్షణ పూర్తిస్థాయి బాధ్యతలను ఎంపీడీఓలకు అప్పగించనుండగా.. 2015- 16 ప్రణాళికతో పాటు ప్రస్తుతం నడుస్తున్న పనుల విషయంలో ఏ విధంగా వ్యవహరిస్తారనే అంశం చర్చనీయాంశంగా మారింది. ప్రోగ్రాం ఆఫీసర్లుగా అవతారమెత్తనున్న ఎంపీడీఓలు.. కూలీలకు ఏ విధంగా భరోసా కల్పిస్తారో వేచి చూడాలి. -
ఆన్లైన్లో ఆరా
* పాఠశాలల పనితీరు పరిశీలనకు కొత్త పద్ధతి * ప్రత్యేక ఫార్మాట్ రూపొందించిన విద్యా శాఖ * డీఈఓ కార్యాలయం నుంచే పర్యవేక్షణ ఖమ్మం : సర్కారు పాఠశాలల పనితీరును ఇక ఇట్టే పసిగట్టొచ్చు. విద్యార్థుల సంఖ్య, ఉపాధ్యాయుల విధులు, పాఠశాల ప్రగతి, సౌకర్యాలు, అవసరాలు తదితర అంశాలను తెలుసుకునేందుకు జిల్లా ఉన్నతాధికారులు కొత్త విధానాన్ని అవలంబించనున్నారు. విద్యా శాఖ కార్యాలయం నుంచే అన్ని పాఠశాలల పరిస్థితులు ఆన్లైన్ ద్వారా తెలుసుకోనున్నారు. రాష్ట్రం లోనే మొదటిసారిగా జిల్లాలో ఈ విధానానికి శ్రీకారం చుడుతున్నారు. నమోదు చేసే అంశాలు ఇవే... ప్రతి పాఠశాల రిపోర్టును ఆన్లైన్లో పొందుపర్చాల్సి ఉంటుంది. దీనిని జిల్లా విద్యాశాఖ అధికారి వెబ్సైట్కు అనుసంధానం చేస్తారు. ఇందుకు ఖమ్మం : సర్కారు పాఠశాలల పనితీరును ఇక ఇట్టే పసిగట్టొచ్చు. విద్యార్థుల సంఖ్య, ఉపాధ్యాయుల విధులు, పాఠశాల ప్రగతి, సౌకర్యాలు, అవసరాలు తదితర అంశాలను తెలుసుకునేందుకు జిల్లా ఉన్నతాధికారులు కొత్త విధానాన్ని అవలంబించనున్నారు. విద్యా శాఖ కార్యాలయం నుంచే అన్ని పాఠశాలల పరిస్థితులు ఆన్లైన్ ద్వారా తెలుసుకోనున్నారు. రాష్ట్రం లోనే మొదటిసారిగా జిల్లాలో ఈ విధానానికి శ్రీకారం చుడుతున్నారు. నమోదు చేసే అంశాలు ఇవే... ప్రతి పాఠశాల రిపోర్టును ఆన్లైన్లో పొందుపర్చాల్సి ఉంటుంది. దీనిని జిల్లా విద్యాశాఖ అధికారి వెబ్సైట్కు అనుసంధానం చేస్తారు. ఇందుకు ముఖ్యంగా పాఠశాలల్లో విద్యార్థులు, బడిబయట ఉన్న పిల్లలు, ఈ ఏడాది బడిలో చేరిన విద్యార్థుల సంఖ్య, ఉపాధ్యాయుల వివరాలు, వారి అర్హత, వారు ఎంతకాలంగా పనిచేస్తున్నారు, పాఠశాల అభివృద్ధిలో యాజమాన్యం కమిటీ భాగస్వామ్యం ఎంత, పాఠశాలల్లో సమకూర్చాల్సిన సౌకర్యాలు, ఇప్పటి వరకు ఉన్న సౌకర్యాలు తదితర అంశాలను ఆన్లైన్లో పొందుపరుస్తారు. అదేవిధంగా విద్యార్థుల ప్రగతి నివేదిక, యూనిట్, సమ్మెట్ పరీక్షల్లో సాధించిన గ్రేడ్లు కూడా ఆన్లైన్లో ఉంచుతారు. ప్రయోజనమిలా... ప్రభుత్వ పాఠశాలల వివరాలు ఆన్లైన్ చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని విద్యాశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయుల సంఖ్య, వారి సర్వీస్ విషయంలో తలెత్తే పొరపాట్లు సవరించొచ్చని, పదోన్నతులు పాదర్శకంగా చేపట్టొచ్చని, ఉపాధాయులు పనితీరును కూడా పసిగట్టొచ్చని అంటున్నారు. విద్యార్థుల ప్రగతిని అంచనా వేస్తూ ప్రత్యేక కార్యాచరణతో బోధించొచ్చని పేర్కొంటున్నారు. సర్వశిక్ష అభియాన్, మాధ్యమిక విద్యామిషన్, పాఠశాల అభివృద్ధి నిధులు, ఇతర గ్రాంట్స్ వినియోగం విషయాలను వెనువెంటనే తెలుసుకునే అవకాశం కూడా ఉంటుందని అంటున్నారు. పాఠశాలల్లోని తాగునీరు, విద్యుత్, అదనపు తరగతి గదులు తదితర సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోవడంతోపాటు మంజూరైన నిధులతో ప్రాధాన్యత క్రమంలో పనులు చేపట్టొచ్చని వివరిస్తున్నారు. ఉపాధ్యాయులు విధులు సక్రమంగా నిర్వర్తిస్తున్నారా.. మధ్యాహ్న భోజనం విద్యార్థులకు సరిగా అందుతోందా..? అనే విషయాన్ని ఆన్లైన్ ద్వారా తెలుసుకోవచ్చని చెబుతున్నారు. బడికి సక్రమంగా వెళ్లని ఉపాధ్యాయులపై చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుందని అంటున్నారు. అయితే.. కంప్యూటర్లు ఉన్న పాఠశాలల్లో ఈ విధానం సత్ఫలితాలు సాధించే అవకాశం ఉంది. కంప్యూటర్లు లేని పాఠశాలల వివరాలు ఎలా తెలుసుకోవాలన్నదే విద్యా శాఖ అధికారులకు అంతుపట్టడం లేదని తెలుస్తోంది. పర్యవేక్షణ ఇక సులభం: రవీంద్రనాథ్రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల వివరాలను ఆన్లైన్లో ఉంచబోతున్నాం. దీంతో పర్యవేక్షణ సులభతరం కానుంది. సమాచార హక్కు వివరాలు అడిగిన వారికి ఇచ్చేందుకు కూడా ఇది ఉపకరిస్తుంది. ఆన్లైన్ ప్రక్రియ కోసం అన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు, డివిజన్, మండల విద్యాశాఖ అధికారులకు ఇప్పటికే ప్రత్యేక ఫార్మట్ తయారు చేసి పంపించాం. -
పర్యవేక్షణకు ‘జన్మభూమి కమిటీలు’
తుపాను సాయంపై సీఎం చంద్రబాబు ప్రకటన రేపు సాయంత్రానికల్లా చిట్ట చివరి బాధితుడికి కూడా సాయం అందిస్తాం రేపే విశాఖ బీచ్లో ‘తుపానును జయిద్దాం’ ర్యాలీ వాకతిప్ప పేలుళ్ల మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల పరిహారం ప్రకటన హైదరాబాద్: తుపాను ప్రభావిత ప్రాంతా ల్లో బాధితులకు అందించే పరిహారం పంపిణీ పర్యవేక్షణ అధికారాలను.. ‘జన్మభూమి- మా ఊరు’ సందర్భంగా ఏర్పాటు చేసిన కమిటీలకే అప్పగిస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. న్యాయ సమ్మతంగా బాధితులకు పరిహారాన్ని పంపిణీ చేసేందుకు ఈ కమిటీలు పర్యవేక్షణ బాధ్యతలు నిర్వర్తిస్తాయన్నారు. బాబు సోమవారం సచివాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. పంటల నష్టం, ఇళ్ళు నష్టం తదితరాల అంచనాకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన 400 బృందాలు పనిచేస్తున్నాయని చెప్పారు. నష్టం అంచనా వివరాల్ని ఎన్ఆర్ఎస్ఏ డేటాతో అనుసంధానం చేసి నిజమైన అర్హుల్ని గుర్తిస్తామన్నారు. రేపటికల్లా బాధితులందరికీ సాయం... ఈ నెల 22 సాయంత్రానికి తుపాను కారణంగా నష్టపోయిన చిట్ట చివరి బాధితుడికి సాయం అందేలా అన్ని ఏర్పాట్లు చేశామని సీఎం చెప్పారు. బాధితులకు అందించే సాయం పరిమాణాన్ని రెండు విభాగాలుగా విభజించామని.. తీవ్రంగా నష్టపోతే ఒక కేటగిరీ కింద, మిగిలిన నష్టానికి మరో కేటగిరీ కింద సాయం అందిస్తామని తెలిపారు. తుపాను బాధిత ప్రజలకు ఏ ఏ సరుకులు ఇస్తున్నామో.. ఫ్లెక్సీలు రూపొందించి చౌక ధరల దుకాణాల ఎదుట ఉంచుతున్నామని, అంతేకాకుండా ఆటోల, కరపత్రాల ద్వారా విస్తృతంగా ప్రచారం నిర్వహించేందుకు ఆదేశాలిచ్చామన్నారు. ముందుగా ప్రకటించిన తేదీ కంటే ఒక రోజు అంటే 22వ తేదీ (బుధవారం) విశాఖలోని ఆర్కే బీచ్లో కొవ్వొత్తులు, కాగడాలతో ‘తుపానును జయిద్దాం’ పేరుతో ర్యాలీని నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 78 సార్లు తుపాన్లు వచ్చాయని.. వాటిని ఇతర ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు నిపుణులతో కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చెప్పారు. రుణవిముక్తికి ఇక బ్యాంకులదే ఆలస్యం... రైతుల్ని రుణ విముక్తి చేసేందుకు విజయవాడలో మంగళవారం రైతు సాధికారత సంస్థను ప్రారంభిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. డ్వాక్రా సంఘాలకు ఇసుక రీచ్లుడ్వాక్రా మహిళల రుణాల మాఫీకి త్వరలో ఓ సాధికారిత సంస్థను ఏర్పాటు చేస్తామని బాబు చెప్పారు. ఇసుక పాలసీపై కేంద్రం నుంచి అనుమతులు వచ్చాయని, డ్వాక్రా సంఘాల ద్వారా ఈ నెలాఖరు నుంచి రాష్ట్రంలో ఇసుక రీచ్లు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. యూనిట్ ఇసుకను రూ. వెయ్యికే అందిస్తామన్నారు. ఎర్రచందనం, బెరైటీస్ ద్వారా ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను అన్వేషిస్తున్నామన్నారు. పేలుడు ఘటనపై సమగ్ర విచారణ తూర్పుగోదావరి జిల్లా వాకతిప్పలో బాణా సంచా తయారీ కేంద్రంలో సంభవించిన పేలుడులో 11 మంది మృతి చెందటం ఎంతో బాధాకరమని, దీనిపై సమగ్ర విచారణ చేయాల్సిందిగా జిల్లా కలెక్టరును ఆదేశించానని సీఎం చెప్పారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ.. కుటుంబానికి రూ. 2 లక్షల చొప్పున ప్రభుత్వ పరిహారం ప్రకటించారు. సాధికారిక సంస్థకు 5 వేల కోట్లు విడుదల రైతు రుణ విముక్తి కోసం కొత్తగా ఏర్పాటు చేసిన రైతు సాధికార సంస్థ(ఆర్ఎస్ఎస్)కు రూ. 5 వేల కోట్లను విడుదల చేస్తూ ఏపీ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కార్పొరేట్ సంస్థలకు తుపాను ప్రాంతాల దత్తత... తుపాను బాధిత ప్రజల్ని ఆదుకునేందుకు కార్పొరేట్ సంస్థలు ముందుకొస్తున్నాయని, అయితే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కిందకు ఈ విపత్తు సాయం రానందున కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తామని, కార్పొరేట్ సంస్థలకు ఇబ్బంది లేకుండా చేస్తామని సీఎం చెప్పారు. తుపాను ప్రాంతాలను కార్పొరేట్ సంస్థలకు దత్తతకు ఇస్తామని, వారిచ్చే డబ్బుకు, ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి అన్ని వసతులతో, కాలనీలు నిర్మిస్తామని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో టౌన్షిప్పులు, గ్రామాల్లో ఆదర్శ కాలనీలు నిర్మిస్తామన్నారు. -
కృష్ణా బోర్డు కర్నూలులో లేనట్టే
కర్నూలు రూరల్: కృష్ణా బేసిన్లోని సాగునీటి ప్రాజెక్టుల పర్యవేక్షణకు సంబంధించిన బోర్డు ఏర్పాటులో ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోంది. కర్నూలులో ఏర్పాటుకు కేంద్ర జల సంఘం సానుకూలంగా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం రాజధానివైపే మొగ్గుచూపుతోంది. కృష్ణానది వరద జలాలపై నిర్మించిన హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టుకు, కృష్ణా డెల్టాకు నీటి ఇబ్బందులు వస్తాయంటూ అధికార పార్టీ నేతలు బోర్డును కోస్తాకు తరలించేందుకు కుట్రపన్నారు. అందులో భాగంగా గత నెల 12న డిల్లీలో ఏర్పాటైన సమావేశంలో తప్పుడు నివేదికలను అందజేసి బోర్డు రాష్ట్ర రాజధానిలోనే ఏర్పాటు చేస్తామని నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వర్లుచే ప్రకటించడం పట్ల సీమ ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకటే నదీ పరీవాహక పరిధిలోని ప్రాజెక్టుల పర్యవేక్షణకు ఏర్పాటు చేసే బోర్డు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలకు తిలోదకాలిస్తోంది. సాగునీటి ప్రాజెక్టుల నీటి వినియోగ పర్యవేక్షణకు నిబంధనల ప్రకారం నదీ పరీవాహక ప్రాంతంలోని ప్రాజెక్టులకు ఎగువ ప్రాంతంలో బోర్డు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇందుకు అనుగుణంగానే తుంగభద్ర బోర్డు ఏర్పాటైన విషయాన్ని ప్రభుత్వం విస్మరిస్తోంది. కొత్త బోర్డు ఏర్పాటు సందర్భంగా గతంలో ఏర్పాటు చేసిన బోర్డుల పనితీరును అధ్యయనం చేయాల్సి ఉన్నా ఆ దిశగా ఆలోచించకపోవడం గమనార్హం. నిబంధనల ప్రకారం కృష్ణా బేసిన్లోని జలాశయాలను పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేస్తున్న బోర్డును ఈ బేసిన్లో ప్రధాన ప్రాజెక్టు అయిన శ్రీశైలం ఎగువన కాకుండా.. విజయవాడలో ఏర్పాటుకు ప్రభుత్వం సుముఖత చూపడం వివాదాస్పదమవుతోంది. నీటి లభ్యత ఆధారంగా కృష్ణా బేసిన్లోని తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రాజెక్టులకు నీటిని కేటాయించడం, వినియోగాన్ని పర్యవేక్షించడం కృష్ణా బోర్డు పని. 10 ప్రాజెక్టులతో ముడిపడిన బోర్డు విషయంలో పార్టీలకు అతీతంగా నేతలు మేల్కొనకపోతే సీమలో సిరుల పంటలు పండించేందుకు నిర్మించిన వరద ఆధారిత ప్రాజెక్టులకు నీరందడం గగనమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బోర్డు ఏర్పాటుకు కర్నూలు అనువైన ప్రాంతమని కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నీటి పారుదల శాఖ అధికారులు నివేదిక ఇచ్చినా ప్రభుత్వం పెడచెవిన పెట్టడం గమనార్హం. ఇప్పటికైనా నేతలు స్పందించి బోర్డు జిల్లాలోనే ఏర్పాటు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
నేటి నుంచి ఊరూరికి
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ‘మన గ్రామం-మన ప్రణాళిక’ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం వేగవంతం చేసింది. ప్రణాళికల తయారు, పర్యవేక్షణ, ప్రజాభిప్రాయ సేకరణ కోసం అధికారులను పరుగులు పెట్టిస్తోంది. గ్రామాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా శ్రీకారం చుట్టిన ఈ కార్యక్రమంపై ఇది వరకే జిల్లా ఉన్నతాధికారులతో మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి సమీక్ష నిర్వహించారు. తాజాగా ఈనెల 13 నుంచి 28వ తేదీ వరకు అధికారులు గ్రామాలలో పర్యటించాలని ప్రభుత్వం శని వారం జిల్లా కలెక్టర్కు ఉత్తర్వులు జారీ చేసింది. పర్యటన సందర్భంగా ప్రాధాన్యం కలిగిన అన్ని సమావేశాలలో అధికారులు పాల్గొనాలని సూచించింది. పర్యటన నివేదికలను అధికారులు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలకు అందజేయాలని ప్రభుత్వం ఆ ఉత్తర్వులో ఆదేశించింది. ఈ కార్యక్రమం అమలు కోసం సీనియర్ ఐఏఎస్ అధికారి బి.జనార్దన్రెడ్డిని జిల్లాకు ప్రత్యేకాధికారిగా నియమించారు. మరోవైపు తాజా ఉత్తర్వులతో అధికారులు పల్లెలకు పరుగులు పెట్టనున్నారు. ముందస్తుగా శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరం లో వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి, జిల్లా ఇన్చార్జి కలెక్టర్ డి.వెంకటేశ్వర్రావు ఆధ్వర్యం లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిం చారు. ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలతో అధికారులకు పల్లెబాట తప్పనిసరిగా మారింది. ఊరులో సందడి అధికారుల పర్యటనలతో గ్రామాలలో సందడి నెలకొననుంది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పల్లెల్లో పర్యటించే అధికారులు ప్రాధాన్యత గల ప్రతి సమావేశంలో పాల్గొనాలి. ప్రాధాన్యాంశాలను నివేదికగా రూపొందించి పంచాయతీరాజ్, గ్రామీణాభివృ ద్ధిశాఖల ద్వారా ప్రభుత్వానికి సమర్పించాలి. అంతేగాకుండా జిల్లాలోని గ్రామాల అధికారులు, సిబ్బంది గ్రామం యూనిట్గా ‘మన గ్రామం మన ప్రణాళిక’ కోసం నివేదికలు సిద్ధం చేయడంలో నిమగ్నమయ్యారు. జిల్లాలోని 718 గ్రా మ పంచాయతీల పరిధిలో కార్యక్రమం ప్రారంభం కానుంది. గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్న ప్రభుత్వ సంకల్పానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. విద్య, వైద్యం, సంక్షేమం, వ్యవసాయం తదితర రంగాల్లో గ్రామం, మండలం, జిల్లా స్థాయిలో వివరాలు సేకరించాల్సిన ప్రక్రియ పూర్తి చేసి ఈ నెల 28 తర్వాత ఆ నివేదికలను ప్రభుత్వానికి పంపే విధంగా సిద్ధం కావాలని కలెక్టర్ వెంకటేశ్వర్రావు అధికారులకు సూచించారు. విద్య, వ్యవసాయానికి పెద్దపీట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమంలో మొదటగా విద్య, వైద్య, సంక్షేమ, వ్యవసాయరంగాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. కార్యాచరణను రూపొం దించిన అధికారులు గ్రామస్థాయి ప్రణాళికలు ఈనెల 13 నుంచి 18 వరకు, ఈనెల 19 నుంచి 23 వరకు మండల ప్రణాళికలు, ఈ నెల 24 నుంచి 28 వరకు జిల్లా ప్రణా ళికలను సిద్ధం చేస్తారు. ఇది వరకే అన్నిస్థాయిల్లో రిసోర్సు పర్సన్లను నియమించారు. గ్రామస్థాయిలో వివరాలు సేకరించి మండలానికి, మండలంలో పంచాయతీల వారీగా క్రోడీకరించి జిల్లా కేంద్రానికి నివేదికల రూపేణా పంపుతారు. ఆ తర్వాత జిల్లా యూనిట్గా ప్రభుత్వానికి నివేదిక అందజేస్తారు. గ్రామ పంచాయతీ పేరు, కుటుంబాల సంఖ్య, ప్రజాప్రతినిధులు, గ్రామ పంచాయతీ సిబ్బంది, కార్యాలయ వివరాలు, ఇతర సంస్థలు, గ్రామ స్థాయి అధికారులు, గ్రామ పంచాయతీ ఆస్తులు, ఖర్చు, సంక్షేమం, అభివృద్ధి, విద్య, అవాస ప్రాధాన్యతలు.. ఇలా ముందుగా రూపొందించిన 14 కేటగిరిలపై వివరాలు సేకరించే పనిలో అధికారులు నిమగ్నం కానున్నారు. -
ఇరాక్ సంక్షోభంపై సుష్మా సమీక్ష
న్యూఢిల్లీ: భారత విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ ఇరాక్ సంక్షోభంపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఇరాక్లో ఉన్న భారతీయులను కాపాడటానికి విదేశాంగ శాఖ అధికారులు ఇరాక్తో నిరంతరం సంప్రదిస్తున్నారు. ఇరాక్లో సైనికులకు, తీవ్రవాదులకు మధ్య పోరు జరుగుతున్న సంగతి తెలిసిందే. తీవ్రవాదుల చెరలో ఉన్న టిక్రిట్ నగరంలో 44 మంది కేరళ నర్సులు పనిచేస్తున్నారు. వీరందరూ భద్రంగానే ఉన్నారని అక్కడి భారత రాయబార కార్యాలయం తెలిపింది. ఓ ఆస్ప్రత్రిలో పనిచేస్తున్న భారతీయ నర్సులను అంతర్జాతీయ రెడ్ క్రిసెంట్ సొసైటీ వలంటీర్లు వెళ్లి చూశారని, వాళ్లంతా గత వారం రోజులుగా అక్కడ చిక్కుకున్నారని బాగ్దాద్లోని భారత రాయబారి అజయ్ కుమార్ తెలిపారు. -
‘మార్పు’ ఎక్కడ!
నిజామాబాద్ అర్బన్ ,న్యూస్లైన్: ల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే గర్భిణులు నరకం చూస్తున్నారు. వైద్యులు అందుబాటులో లేకపోవడంతో నానా తంటాలు పడుతున్నారు. మంగళవారం అనితకు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. సాయంత్రం ఐదు గం టలకు అనిత భర్త రాజేశ్ కలెక్టర్ను కలిసి పరిస్థితి వివరించినా ఫలితం లేకుండా పోయింది. కలెక్టర్ ఆసుపత్రి సూపరిండెంట్కు ఫోన్చేసి తక్షణమే వైద్యసహాయం అందించాలని కోరారు. అయినా మహిళా వైద్యులు లేరంటూ వైద్యాధికారులు అనితను హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రికి రిఫర్ చేశారు. ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న ఒక్క గైనాకాలజిస్టు సెలవుల్లో వెళ్లడంతో ఈ పరిస్థితి దాపురిచిం చింది. మొఖంచాటేసిన వైద్యులు జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఎనిమిదంతస్తుల నూతన భవనాలు ఆసుపత్రిని నిర్మించారు. ఇందులో వైద్యులను కూడా కేటాయించారు. కళా శాలకు అనుబంధం ఉండడంతో 121 మంది వివిధ విభాగాల ప్రొఫెసర్లు, 38 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు నియమితులయ్యారు. ఎనిమిది మంది గైనాకాలజిస్టులు ఇం దులో ఉన్నారు. వీరు ఆసుపత్రికి వైద్యసేవలు అందించాల్సి ఉంది. కానీ గత ఏడాదిగా వీరంతా హైదరాబాద్కే పరిమితమయ్యారు. రిజిష్టర్లో సంతకాలు చేస్తు వేత నాలు తీసుకుంటూ ఆసుపత్రికి మాత్రం మొఖం చాటేశారు. ప్రస్తుతం ఆసుపత్రికి 11 మంది ప్రొఫెసర్లు, ఎనిమిది మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు మాత్రమే అందుబాటు లో ఉన్నారు. ఎనిమిదిమంది గైనాకాలజిస్టుల్లో ఇద్దరు మాత్రమే ఉన్నారు.వీరు గత ఆరు రోజులుగా సెలవులో ఉన్నారు. మిగితా ఆరుగురు జిల్లా కేంద్ర ఆసుపత్రిలో పనిచేసేందుకు నిరాకరించి హైదరాబాద్కే వెళ్లిపోయారు. దీంతో ఆసుపత్రిలో స్త్రీ వైద్యనిపుణురాళ్ల కొరత తీవ్రంగా ఏర్పడింది. ఫలితం లేని మార్పు జిల్లాలో ‘మార్పు’ పథకం ఏమాత్రం ఫలితాన్ని ఇవ్వడం లేదు. ప్రతి గర్భిణీ సర్కారు ఆస్పత్రిలోనే ప్రసవించాలన్న ఉద్దేశంతో అమలు చేస్తున్న ఈ పథకం చివరకు వారి పాలిట శాపంగా మారింది. ఆశ వర్కర్లు, ఎఎన్ఎంలు గర్భిణీలను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకవస్తున్నారు. తీరా అక్కడ సౌకర్యాలు, వైద్యులు లేక వారు నరకం అ నుభవిస్తున్నారు. జిల్లాలో 44 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 3 ఏరియా ఆసుపత్రులు ఉండగా, 29 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో 3 ఏరియా ఆసుపత్రుల్లో మార్పు కింద ప్రసవాలు చేసేందుకు నిర్ణయించారు. కానీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఎక్కడ కూడా ఆపరేషన్ థియేటర్లు అందుబాటులో లేవు. ఉన్నా సౌకర్యాలు లేవు. ముఖ్యం గా 29 ఆరోగ్య కేంద్రాలకు కేవలం అందుబాటులో ముగ్గురు మహిళా వైద్యనిపుణులు మాత్రమే ఉన్నారు. మూడు ఏరియా ఆసుపత్రులకు సంబంధించి కేవలం ముగ్గు రు మాత్ర మే స్త్రీ వైద్యనిపుణులు అందుబాటులో ఉన్నారు. జిల్లా ఆసుపత్రిలో ప్రతి రోజు 15 నుంచి 20 ప్రసవాల కేసులు నమోదు అవుతుంటాయి. వైద్యులు అందుబా టులో లేక పోవడంతో ప్రసవానికి వచ్చేవారు , ఆసుపత్రులో చికిత్స పొందుతున్న బాలింతలు వైద్యులు లేక ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొంది. -
‘కస్తూర్బా’లో పర్యవేక్షణ కరువు
‘కస్తూర్బా’లో పర్యవేక్షణ కరువు విద్యాలయాలలో సిబ్బంది ఇష్టారాజ్యం స్థానికంగా ఉండని ఉద్యోగులు ఎప్పుడో అటకెక్కిన వైద్యసేవలు నిర్వహణ లోపం.. విద్యార్థులకు శాపం ‘పిట్లం’ ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్ నిజామాబాద్ అర్బన్, న్యూస్లైన్: జిల్లాలోని కస్తూర్బాగాంధీ విద్యాల యాల నిర్వహణలో నిండా నిర్లక్ష్యం పేరుకుపోయింది. అధికారుల పర్యవేక్షణ కూడా సక్రమం గా లేకపోవడంతో అనుకోని దారుణాలు జరుగుతున్నాయి. పిట్లం కస్తూర్బా విద్యాలయంలో ఒక విద్యార్థిని ప్రసవించిన వైనం ఇందుకు నిదర్శంగా నిలుస్తోంది. బడికి దూరంగా ఉన్న ఆడ పిల్లలకు వసతి ఏర్పాటు చేసి విద్యనందించే ఉద్దేశంతో ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి ఈ విద్యాలయాలను నెలకొల్పింది. పేద కుటుంబాలకు చెందిన పిల్లలు, వివక్షకు గురైన పిల్లలు ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారు. అయితే, నిర్వహణ లోపాలు వారి పాలిట శాపాలుగా మారుతున్నాయి. ఇదీ పరిస్థితి జిల్లాలో 36 కస్తూర్బా విద్యాలయాలు ఉన్నా యి. ఇందులో రాష్ట్రీయ విద్యామిషన్ పరిధిలో 19, ఏపీ రెసిడెన్షియల్ పరిధిలో తొమ్మిది, గిరి జన సంక్షేమ శాఖ పరిధిలో ఐదు, సాంఘిక సం క్షేమ శాఖ పరిధిలో మూడు నడుస్తున్నాయి. వీటన్నింటిలో మొత్తం 5,891 మంది విద్యార్థినులు చదువుతున్నారు. ఒక్కో విద్యాలయంలో ఒక ప్రత్యేక అధికారి, ఏడుగురు అధ్యాపకులు, పీఈటీ, ఏఎన్ఎంతో పాటు నలుగురు సిబ్బం ది ఉంటారు. నిబంధనల ప్రకారం ప్రత్యేక అధికారి, అధ్యాపకులు, పీఈటీ, ఏఎన్ఎం విద్యాలయంలోనే ఉంటూ సేవలందించాలి. ఉద్యోగ నియామకం సమయంలోనే అధికారులు వీరికి ఈ విషయాన్ని స్పష్టం చేస్తారు. కాగా తర్వాత ఉద్యోగులు ఏవో కారణాలు చెబుతూ విద్యాల యాలలో ఉండకుండా రాకపోకలు సాగిస్తున్నా రు. దీంతో పర్యవేక్షణ లేక అవాంఛనీయ ఘట నలు చోటు చేసుకుంటున్నాయి. గతంలో కూడా ఇటీవల రెంజల్, బాన్సువాడ కస్తూర్బా విద్యాలయాలలో పలువురు విద్యార్థినులు తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిలో చేరారు. కలుషిత ఆహారం, పారిశుధ్య లోపంతోనే విద్యార్థినులు వాంతు లు, విరోచనాలు చేసుకున్నట్లు అధికారులు తర్వాత తేల్చారు. ప్రస్తుతం పిట్లంలో విద్యార్థిని ప్రసవం విద్యాలయాల నిర్వహణ లోపాలకు అద్దం పడుతోంది. విద్యాలయం నుంచి బాలిక ఇంటికి వెళ్లి రెండు నెలలు గడిచినా ఎవరూ ప్రశ్నించలేదు. ఆ తర్వాత వచ్చిన బాలికను నిరభ్యంతరంగా చేర్చుకున్నారు. -
ప్రభుత్వ పథకాల పర్యవేక్షణకు జిల్లాకో ఐఏఎస్
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు, కార్యక్రమాల అమలు పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా జిల్లాకో ఐఏఎస్ను ప్రత్యేకాధికారిగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రత్యేక అధికారులు చేయాల్సిన పనులను ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ప్రతి నెల ఒకసారి వీరంతా ఆయా జిల్లాల్లో పర్యటించాల్సి ఉంటుంది. జిల్లా అధికారులతో సమావేశమై పథకాలు, కార్యక్రమాల అమలు తీరు ఎలా ఉందో మండల, గ్రామస్థాయివరకు సమీక్షించాలి. లక్ష్యంమేరకు పథకాలను, కార్యక్రమాలను జిల్లా అధికారులు అమలు చేస్తున్నారా లేదా అనే విషయంపై ప్రతినెలా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను ఆన్లైన్లో పంపించాలి. క్షేత్రస్థాయిలో పర్యటించి పథకాలు, ప్రాజెక్టులు, కార్యక్రమాల అమలుతీరు ఏవిధంగా ఉందో పరిశీలించి ప్రతి నెలా సంబంధిత శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులకు నివేదికలను పంపించాలి. ఆ నివేదికల ప్రతులను కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపించాలి. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల అమలు తీరును సమీక్షించడానికి ఇప్పటికే జిల్లా ఇన్చార్జి మంత్రులున్నారు. పథకాల అమలును పర్యవేక్షించడానికి ప్రతి జిల్లాకు రెండో జాయింట్ కలెక్టర్ను కూడా నియమించారు. తాజాగా ఐఏఎస్లను ప్రత్యేక అధికారులుగా నియమించడంలో ఆంతర్యం ఏమిటో అర్థం కావడంలేదని అధికారవర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి.