Municipal chairperson
-
అధికార మదంతో రెచ్చిపోతున్నారు టీడీపీపై యనమల కృష్ణుడు ఫైర్
-
వైఎస్ఆర్ సీపీ నేతలపై కూటమి ప్రభుత్వం కక్షసాధింపు
-
బెదిరించారు.. బరితెగించారు
అసలు బలమే లేని మున్సిపాలిటీల్లో పాగా వేసేందుకు చంద్రబాబు సర్కారు సాగిస్తున్న కుట్రలు, కుతంత్రాలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశాయి. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల, కాకినాడ జిల్లా తుని, పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మున్సిపల్ వైస్ ఛైర్మన్ పదవుల కోసం టీడీపీ అధికార బలంతో బరితెగించింది. సంఖ్యా బలం లేకపోయినా వాటిని బలవంతంగా తమ ఖాతాలో వేసుకునేందుకు కుయుక్తులు పన్నింది.పిడుగురాళ్ల మున్సి పాల్టీ లో టీడీపీ తరఫున ఒక్క కౌన్సిలర్ కూడా గెలవకపోయినా సోమవారం జరిగిన ఎన్నికలో వైస్ ఛైర్మన్ పదవిని సొంతం చేసుకుందంటే ఏ స్థాయిలో అధికార దుర్వినియోగం జరిగిందో అర్థం చేసుకోవచ్చు. గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు కనుసైగ మేరకు పోలీసులు, రెవిన్యూ అధికారులు వేధించి, భయపెట్టి వైఎస్సార్సీపీ కౌన్సిలర్లకు బలవంతంగా పచ్చ కండువా కప్పి.. మాదే మెజార్టీ అని నిస్సిగ్గుగా ప్రకటించడం విస్తుగొలుపుతోంది. తుని, పాలకొండ మున్సిపల్ వైస్ ఛైర్మన్ పదవులను కూడా అదే రీతిలో సొంతం చేసుకునేందుకు ప్రయత్నిం చినా వైఎస్సార్సీపీ అడ్డుకోవడంతో అక్కడ ఎన్నికలు వాయిదా పడ్డాయి.సాక్షి, నరసరావుపేట/తుని/పాలకొండ: పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే ఖూనీ చేశారు. మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో తెలుగుదేశానికి ఒక్క కౌన్సిలర్ లేకపోయినా వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను భయపెట్టి అరాచకం çసృష్టించారు. పోలీసులు కూడా తమ కర్తవ్యాన్ని మరచి ఎమ్మెల్యే ఆదేశాలతో కౌన్సిలర్లను భయాందోళనకు గురిచేసి టీడీపీ గూటికి వెళ్లేలా తమవంతు సాయం చేశారు. వైస్ చైర్మన్ ఎన్నికకు పోటీ చేయడానికి టీడీపీ తరఫున కనీసం ఒక్క కౌన్సిలర్ సైతం లేకపోయినా పోటీలో నిలిచి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు.కౌన్సిలర్లను భయపెట్టి, బెదిరించి, ప్రలోభాలకు గురిచేసి పచ్చ కండువా కప్పి తెలుగుదేశంలో చేర్చుకున్నట్లు ప్రకటించి.. యరపతినేని ప్రజాస్వామ్యానికి కొత్త భాష్యం చెప్పారు. చంద్రబాబు, లోకేశ్ రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఇదేనా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గతంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పిడుగురాళ్ల మున్సిపాలిటీలో ఉన్న మొత్తం 33 స్థానాలకు 33 స్థానాలు వైఎస్సార్సీపీ అభ్యర్థులు గెలుపొందారు. వైస్ చైర్మన్గా ముక్కంటి అనే వ్యక్తిని ఎన్నుకోగా ఆయన అనారోగ్యంతో మృతి చెందడంతో ఆ స్థానం ఖాళీ అయింది. దీంతో మున్సిపల్ వైస్ చైర్మన్ని ఎంపిక చేసుకోవడానికి ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది.ఈ నెల 3వ తేదీన ఎన్నిక జరగాల్సి ఉండగా వైఎస్సార్సీపీ అభ్యర్థిని నామినేషన్ వేయకుండా టీడీపీ నేతలు అడ్డుపడటంతో మరుసటి రోజు.. అంటే ఈ నెల 4వ తేదీకి ఎన్నికను వాయిదా పడింది. అయితే రాత్రికి రాత్రే యరపతినేని ఆదేశాలతో పోలీసులు వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను పాత కేసులు పేరిట వేధించి ఎన్నికకు రానివ్వకుండా అడ్డుకున్నారు. దీంతో ఎన్నికల కమిషన్ ఈ నెల 17న సోమవారం మరోసారి వైస్ చైర్మన్ ఎన్నికలకు అవకాశం కల్పించింది. నాలుగో తేదీ నుంచి 17 వ తేదీ వరకు సుమారు రెండు వారాలు సమయం ఉండటంతో టీడీపీ నేతలు.. పోలీసు, రెవెన్యూ అధికారులను ఉపయోగించి వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను వేధించడం మొదలుపెట్టారు. తునిలోనూ టీడీపీ బల ప్రయోగం కాకినాడ జిల్లా తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికను మూడోసారి టీడీపీ అడ్డుకోవడంతో వాయిదా పడింది. టీడీపీ లొంగదీసుకున్న కౌన్సిలర్లను మున్సిపల్ కార్యాలయంలోకి అనుమతించి, వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను టీడీపీ గూండాలు అడ్డుకున్నారు. మున్సిపాలిటీలో 30 వార్డులకుగాను 30 మందీ వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు ఉన్నారు. వీరిలో ఒకరు మృతి చెందగా మరొకరు ఉద్యోగం రావడంతో రాజీనామా చేశారు. మిగిలిన 28 మంది వైఎస్సార్సీపీకి చెందినవారే. ఈ క్రమంలో ఈ నెల 3వ తేదీన వైస్ చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ ఇచ్చారు. టీడీపీ ముందస్తు వ్యూహంలో భాగంగా కౌన్సిల్ హాల్లోకి చొరబడి ఎన్నికను అడ్డుకుంది.మరుసటి రోజూ ఇదే సీన్ రిపీట్ అయ్యింది. దీంతో వైఎస్సార్ సీపీకి చెందిన కౌన్సిలర్ కాసే సుమతి హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు ఆదేశాల మేరకు సోమవారం ఎన్నిక జరగాల్సి ఉన్నా, టీడీపీ దౌర్జన్యం వల్ల మళ్లీ వాయిదా పడింది. మంగళవారం ఉదయం 11 గంటలకు వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతుందని ఆర్వో రవికుమార్ తెలిపారు. కాగా, మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక కోసం చైర్పర్సన్ సుధారాణి నివాసం వద్ద నుంచి వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లను బలవంతంగా తీసుకువెళ్లేందుకు టీడీపీ నాయకులు యత్నిం చారు. ఇదే సమయంలో అక్కడే ఉన్న మాజీ మంత్రి, కాకినాడ జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు దాడిశెట్టి రాజా అడ్డుకున్నారు.దీంతో టీడీపీ నాయకులు మోతుకూరి వెంకటేష్, పోలిశెట్టి రామలింగేశ్వరరావులు రాజాపై దాడికి దిగారు. వైఎస్సార్సీపీ, టీడీపీ నాయకుల మధ్య తోపులాట జరిగింది. టీడీపీ శ్రేణులను పోలీసులు అక్కడ నుంచి బయటకు పంపించి వేశారు. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లతో పోలీసులు సంప్రదింపులు జరిపారు. టీడీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలను పంపించేస్తే ఓటింగ్కు వస్తామని కౌన్సిలర్లు చెప్పారు. ఈ క్రమంలో మధ్యాహ్నం 12 గంటల వరకు మున్సిపల్ కార్యాలయానికి వెళ్లక పోవడంతో కోరం లేక ఎన్నిక వాయిదా పడింది.ఈ సందర్భంగా దాడిశెట్టి రాజా మాట్లాడుతూ.. టీడీపీకి సొంతంగా ఒక్క సీటు లేకపోయినా అధికార మదంతో వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను లొంగదీసుకోవాలని చూస్తోందని, సంతలో పశువుల్లా కొనాలనుకుంటోందని మండిపడ్డారు. అయినా మెజార్టీ లేకపోవడంతో పోలీసులను వినియోగించారన్నారు. వైఎస్సార్ సీపీకి చెందిన మున్సిపల్ చైర్పర్సన్ ఏలూరి సుధారాణి భర్త, కో ఆప్షన్ సభ్యుడు ఏలూరి బాలును హౌస్ అరెస్ట్ చేశారని, మరికొందరి నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి భయాందోళనలు సృష్టించారన్నారు.మహిళా కౌన్సిలర్లలో గర్భిణులు ఉన్నారని, వారికి రక్షణ కల్పించాల్సిన పోలీసులు టీడీపీ గూండాలు, రౌడీ షీటర్లకు సహకరించారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో మంగళవారం చలో తుని కార్యక్రమానికి జిల్లాకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని రాజా పిలుపునిచ్చారు. మున్సిపల్ కౌన్సిలర్ల రక్షణ బాధ్యతను తాను తీసుకుంటానని ప్రకటించారు.బెదిరింపుల పర్వం... వైఎస్సార్సీపీ కౌన్సిలర్ల ఇళ్లకు పోలీసులను పంపించి స్టేషన్కు రావాలని పిలిపించి టీడీపీకి అనుకూలంగా ఓటు వేయాలని బెదిరింపులకు దిగారు. మరికొంతమందికి కాంట్రాక్టులు, బిల్లుల పేరుతో తాయిలాలు ఆశచూపే ప్రయత్నం చేశారు. మరోవైపు తెలుగుదేశం నాయకులు రోజూ వైఎస్సార్సీపీ కౌన్సిలర్లకు ఫోన్ చేసి కచ్చితంగా మీరు పార్టీ మారాల్సిందేనని ఒత్తిడి చేశారు. యరపతినేని శ్రీనివాసరావు నిర్ణయించిన వైస్ చైర్మన్ అభ్యర్థికే మీరు ఓటు వేయాలంటూ బెదిరించారు. తెలుగుదేశం రౌడీల బెదిరింపులతో కౌన్సిలర్లు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.దీంతో పోలీసుల సహకారంతో వైఎస్సార్సీపీ కౌన్సిలర్ల బంధువులను బెదిరించి భయపెట్టి వాళ్ల శిబిరంలోకి బలవంతంగా తీసుకువెళ్లారు. ఇలా సుమారు 17 మందిని టీడీపీ వైపు లాగేశారు. వారితో వైస్ చైర్మన్ పదవిని దౌర్జన్యంగా లాగేసుకున్నారు. 30వ వార్డు కౌన్సిలర్ ఉన్నం భారతిని వైస్ చైర్మన్గా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో మున్సిపల్ చైర్మన్ కొత్త వెంకట సుబ్బారావు వ్యాపారాలను అడ్డుకుంటామని బెదిరించి పార్టీ మారేలా చేశారని పట్టణంలోని ఆర్య వైశ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పిడుగురాళ్ల 29వ వార్డు కౌన్సిలర్ మునీరా దంపతులు తెలుగుదేశం నాయకుల బెదిరింపులకు లొంగక పోవడంతో నిర్మాణంలో ఉన్న వాళ్ల ఇళ్లను పొక్లెయినర్తో నేలమట్టం చేశారు. ఇలా బెదిరించి బరితెగించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు.పాలకొండలోనూ అదే తీరు పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నగర పంచాయతీ చైర్మన్ కుర్చీ కోసం కూటమి నాయకులు వేస్తున్న ఎత్తులు పారడం లేదు. ముచ్చటగా మూడోసారి సోమవారం నిర్వహించిన చైర్మన్ ఎన్నికలో పదవి దక్కించుకోవాలని కూటమి నాయకులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఎన్నికల అధికారి, సబ్ కలెక్టర్ యశ్వంత్కుమార్ రెడ్డితో పాటు జేసీ శోభిక ఉదయం 11 గంటలకు ఎన్నిక ప్రక్రియ ప్రారంభించారు. కూటమికి చెందిన ముగ్గురు సభ్యులు, బలవంతంగా తీసుకెళ్లిన ఇద్దరు వైఎస్సార్సీపీ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. దీంతో కోరంలేక ఎన్నికను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్టు ఎన్నికల అధికారి ప్రకటించారు.కాగా, పాలకొండ నగర పంచాయతీలో మొత్తం 20 వార్డుల్లో 17 మంది వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు ఉన్నారు. వీరిలో 19వ వార్డు కౌన్సిలర్ ఉద్యోగ రీత్యా తన పదవికి రాజీనామా చేశారు. మరో ఇద్దరు కౌన్సిలర్లను టీడీపీ నేతలు బలవంతంగా వారి వైపు తిప్పుకున్నారు. ఈ లెక్కన టీడీపీ బలం ఐదుకు చేరిందనుకున్నా, వైఎస్సార్సీపీ బలం 14గా ఉంది. ఎలాగైనా సరే గెలవాలని మంత్రి సంధ్యారాణి ఎన్ని రకాలుగా ఒత్తిడి తెచి్చనప్పటికీ ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయి. -
దళిత ఎమ్మెల్యేకి ఘోర పరాభవం
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: నందిగామ ఎమ్మెల్యేకు టీడీపీ అధిష్టానం షాక్ ఇచ్చింది. దళిత ఎమ్మెల్యేకి ఘోర పరాభవం ఎదురైంది. రెండు సార్లు ఎమ్మెల్యే, ప్రస్తుతం ప్రభుత్వ విప్గా ఉన్నప్పటికీ సౌమ్య పట్ల తీవ్ర వివక్ష చూపించింది. మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నికల వేళ సౌమ్యను డమ్మీగా మార్చింది. నందిగామ మున్సిపల్ చైర్ పర్సన్గా 14వ వార్డు కౌన్సిలర్ సత్యవతిని ఎమ్మెల్యే సౌమ్య ప్రతిపాదించారు. ఎమ్మెల్యే చెప్పిన కౌన్సిలర్కు కాకుండా మరొకరికి అధిష్టానం బీ ఫామ్ ఇచ్చింది.తాను చెప్పిన కౌన్సిలర్కే ఛైర్మన్ ఇవ్వాలని సౌమ్య పట్టుబట్టారు. సౌమ్య ప్రతిపాదనలను చెత్తబుట్టలో వేసిన అధిష్టానం.. కృష్ణకుమారికి బీ ఫామ్ ఇచ్చింది. దీంతో అధిష్టానంపై ఎమ్మెల్యే సౌమ్య తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మరో గత్యంతరం లేక సభ్యులు.. కృష్ణకుమారిని ఛైర్మన్గా ఎన్నుకున్నారు. ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అధిష్టానం సూచించిన అభ్యర్ధికే ఓటేశారు. -
నేడు ఉమ్మడి ప్రకాశం జిల్లా నేతలతో వైఎస్ జగన్ సమావేశం
-
టీడీపీ దిగజారుడు రాజకీయం బాలకృష్ణ డైరెక్షన్ లో కౌన్సిలర్లకు ఎర
-
నీచ రాజకీయాలకు తెరతీసిన ఎమ్మెల్యే బాలకృష్ణ
శ్రీ సత్యసాయి జిల్లా: మున్సిపల్ ఛైర్మన్ పదవి కోసం హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ అడ్డదార్లు తొక్కుతున్నారు. నోరు తెరిస్తే బ్లడ్డు...బ్రీడు అంటూ తన గురించి తాను గొప్పగా చెప్పుకునే బాలకృష్ణ నీచ రాజకీయానికి తెరతీశారు. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను కొనుగోలు చేసి బెంగళూరులో క్యాంపు రాజకీయాలకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం బాలకృష్ణ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రెండున్నర నెలలుగా ఖాళీగా ఉన్న హిందూపురం మున్సిపల్ ఛైర్మన్ స్థానానికి ఎన్నిక నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. ఈ క్రమంలో మున్సిపల్ ఛైర్మన్ పదవిని దక్కించుకునేందుకు టీడీపీ ఎప్పటిలా తన కుటిల రాజకీయాలకు తెరతీసింది. ఇందుకోసం ఎమ్మెల్యే బాలకష్ణనే రంగంలో దిగారు. తనకు అనుకూలమైన వారిని చైర్మన్ పీఠంపై కూర్చోబెట్టేందుకు నానా తంటాలు పడుతున్నారు.ఇందులో భాగంగా ఖర్చుకు ఏమాత్రం వెనుకాడని ఎమ్మెల్యే బాలకృష్ణ వైఎస్సార్సీపీ ఒక్కో కౌన్సిలర్కు రూ.10 లక్షలు చొప్పున కొనుగోలు చేశారు. అలా మొత్తంగా 12మంది వైఎస్సార్సీపీ కౌన్సిలర్ను కొనుగోలు చేసింది. అనంతరం వారిని బస్సుల్లో బెంగళూరులో టీడీపీ ఏర్పాటు చేసిన క్యాంప్కు తరలించింది. మరింత మందిని ప్రలోభాలకు గురి చేసేందుకు ఎమ్మెల్యే బాలకృష్ణ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.ఇప్పటికే బెదిరింపులతో టీడీపీలో చేరిన వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు.. తిరిగి సొంతగూటికి చేరారు. అయితే ఎమ్మెల్యే బాలకృష్ణ చేస్తున్న పెడుతున్న ప్రలోభాలు, బెదిరింపులకు భయపడి టీడీపీలో చేరితో భవిష్యత్తు నాశనం అవుతుందని భావిస్తున్న కౌన్సిలర్లు వైఎస్సార్సీపీలోనే కొనసాగేలా తీర్మానించారు. కాగా, హిందూపురం మున్సిపాలిటీలో 38 మంది కౌన్సిలర్లు ఉండగా.. గత ఎన్నికల్లో 30 వార్డుల్లో వైఎస్సార్సీపీ జయకేతనం ఎగురవేసింది. టీడీపీ కేవలం ఆరు వార్డులకే పరిమితమైంది. కానీ టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను ప్రలోభాలకు గురి చేయడం గమనార్హం. -
తిట్టుకుని.. కొట్టుకుని
ఇల్లెందు: ఒకరు మున్సిపల్ చైర్మన్, మరొకరు వైస్ చైర్మన్.. సాక్షాత్తు కౌన్సిల్ సమావేశంలో బాహాబాహీకి దిగారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం దూషణలు, పరస్పర దాడులకు దారితీసింది. మూడు నెలల విరామం తర్వాత శనివారం కౌన్సిల్ సమావేశం నిర్వహించగా.. పట్టణంలో రోడ్లపై వెలసిన దుకా ణాలు, తోపుడు బండ్లను తొలగించేందుకు రూ.2 లక్షలు ఖర్చవుతుందంటూ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో తీర్మానం ప్రవేశపెట్టారు. అయితే ఆక్రమణలు తొలగిస్తున్నా ఎవరూ అడ్డు చెప్పడం లేదు కదా.. దీనికి కొత్తగా ఫీజు రూపంలో రూ.2లక్షలు ఎందుకంటూ వైస్ చైర్మన్ జానీపాషాతో పాటు పలువురు కౌన్సిలర్లు అభ్యంతరం తెలిపారు. ఆ తర్వాత కూడా ఇరు వర్గాల మధ్య వాదోపవాదాలు జరిగాయి. ఈ క్రమంలో చైర్మన్, వైస్ చైర్మన్ పరస్పరం అసభ్య పదజాలంతో వ్యక్తిగత దూషణలకు దిగారు. దీంతో కోపోద్రిక్తుడైన చైర్మన్ వెంకటేశ్వరరావు.. వైస్ చైర్మన్ జానీపాషాపైకి దూసుకొచ్చినట్టు కౌన్సిలర్లు, అధికారులు చెబుతున్నారు. ఆ తర్వాత మరోసారి ఘర్షణ జరగడంతో వైస్ చైర్మన్పై చైర్మన్ చేయి చేసుకున్నారు. ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఎదురుగానే ఈ ఘర్షణ జరగడం గమనార్హం. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పట్టణ వాసులకు సేవలందించాల్సిన పాలకవర్గ సభ్యులు ఇలా ఘర్షణ పడడం తగదని హితవు పలికారు. ఈ విషయంలో ఇద్దరిదీ తప్పేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైస్ చైర్మన్ జానీ పాషా మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై సమావేశంలో నిలదీస్తే ఇలా దాడులు చేయడమేంటని ఆవేదన వ్యక్తం చేశారు. తాను అధికారులను ప్రశ్నిస్తుండగా చైర్మన్ జోక్యం చేసుకుని దాడికి దిగారని ఆరోపించారు. దీనిపై చైర్మన్ వెంకటేశ్వరరావు వివరణ కోరగా.. తనను పలుమార్లు వ్యక్తిగతంగా దూషించినా సహించానని స్పష్టం చేశారు. -
నల్లగొండ మున్సిపల్ చైర్మన్పై నెగ్గిన అవిశ్వాసం
నల్లగొండ టూటౌన్: నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డిపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన చైర్మన్ సైదిరెడ్డిపై అవిశ్వాసం పెట్టాలని గత నెల 8వ తేదీన కాంగ్రెస్ కౌన్సిలర్లు జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేయగా.. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో ఇన్చార్జి కలెక్టర్ అధ్యక్షతన మున్సిపల్ సమావేశం నిర్వహించారు. ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి 50 మంది సభ్యులున్న కౌన్సిల్లో అవిశ్వాస సమావేశానికి 47 మంది హాజరయ్యారు. ఇద్దరు ఎక్స్ అఫీషియో సభ్యులు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అల్గుబెల్లి నర్సిరెడ్డితో పాటు బీజేపీ కౌన్సిలర్ బండారు ప్రసాద్ సమావేశానికి రాలేదు. 41 మంది కౌన్సిలర్లు అవిశ్వాసానికి అనుకూలంగా చేతులు పైకి ఎత్తారు. వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఐదుగురు కౌన్సిలర్లు చేతులు ఎత్తారు. కాగా, బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి సస్పెన్షన్కు గురైన పిల్లి రామరాజుయాదవ్ తటస్థంగా ఉన్నారు. కాంగ్రెస్ కౌన్సిలర్లు 35 మందితో పాటు బీజేపీ కౌన్సిలర్లు నలుగురు, గత ఎన్నికలకు ముందు బీజేపీ, ఎంఐఎం నుంచి బీఆర్ఎస్లో చేరిన ఇద్దరు కౌన్సిలర్లు కూడా అవిశ్వాసానికి అనుకూలంగా చేతులు ఎత్తడంతో 41 మంది మద్దతు లభించింది. ప్రభుత్వానికి నివేదిక నల్లగొండ మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డిపై అవిశ్వాసం నెగ్గిన నేపథ్యంలో దీనికి సంబంధించిన వివరాలతో జిల్లా ఇన్చార్జి కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ప్రభుత్వానికి నివేదిక పంపించారు. ఎన్నికల సంఘం నుంచి తదుపరి ఆదేశాలు రాగానే చైర్మన్ ఎన్నిక కోసం 50 మంది సభ్యులకు నోటీసులు అందించనున్నారు. ఆ తరువాత సమావేశం నిర్వహించి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. -
అసహనంతో అరాచకం.. పేట్రేగిపోతున్న జేసీ సోదరులు
రాజకీయాల్లో వివాదాలకు కేంద్రబిందువైన జేసీ బ్రదర్స్ (మాజీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి – మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి) టీడీపీ అధికారం లేకపోయే సరికి సహనం కోల్పోతున్నారు. ప్రతిపక్షంలో హుందాతనం కనబరచాల్సిన వీరు తద్భిన్నంగా వ్యవహరిస్తున్నారు. దిగజారుడు రాజకీయాలతో విమర్శలు మూటగట్టుకుంటున్నారు. తాడిపత్రి నియోజకవర్గంలో అరాచకాలకు పాల్పడుతూ ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. సాక్షి ప్రతినిధి, అనంతపురం: తాడిపత్రిలో 30 ఏళ్లకు పైగా అధికారంలో ఉండి దొరతనాన్ని వెలగబెట్టిన జేసీ సోదరులు ప్రతిపక్షంలోకి వచ్చాక ఉనికి కోసం పడరానిపాట్లు పడుతున్నారు. వీరు నిత్యం ఏదో ఒక వివాదంతో నియోజకవర్గంలో హైటెన్షన్ వాతావరణం సృష్టిస్తున్నట్టు విమర్శలొస్తున్నాయి. గత కొన్ని రోజులుగా జేసీ ప్రభాకర్రెడ్డి చేష్టలకు సామాన్యులకే కాదు పోలీసులకు సైతం కంటిమీద కునుకులేకుండా ఉంది. ఇప్పటికే పలు అవినీతి కేసుల్లో ఉన్న ప్రభాకర్రెడ్డి ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మరింతగా పేట్రేగిపోతున్నట్టు సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. అభివృద్ధి పనులను అడ్డుకుంటూ.. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక తాడిపత్రి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. వీటినెలాగైనా అడ్డుకోవాలనేది జేసీ ప్రభాకర్రెడ్డి ఆలోచన. ఇందులో భాగంగా ఆస్పత్రి నిర్మాణాలను అడ్డుకోవాలని కాంట్రాక్టర్ను బెదిరించారు. దీంతో ఈ నెల 23వ తేదీ వివాదం రాజుకుంది. జేసీ బెదిరింపులకు భయపడి కాంట్రాక్టర్ పనులు ఆపేసి వెళ్లినట్టు తెలిసింది. దీంతో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఫిర్యాదు చేసేందుకు స్టేషన్కు ర్యాలీగా వెళ్లడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఇది తొలిసారి కాదు... జేసీ ప్రభాకర్రెడ్డి ప్రభుత్వాస్పత్రి పనులను అడ్డుకోవడం మొదటి సారేమీ కాదు. మొన్నటికి మొన్న డ్రెయినేజీ పనులను అడ్డుకున్నారు. ఏకంగా మురికి కాలువలో కుర్చీ వేసుకుని కూర్చుని వివాదం రేపారు. అంతకుముందు ‘నాడు–నేడు’ పనుల కింద జూనియర్ కాలేజీకి ప్రహరీ నిర్మిస్తుంటే అడ్డుకున్నారు. అనుచరులతో కలిసి గొడవకు దిగారు. చివరకు పోలీసుల రక్షణలో ప్రహరీ పనులు చేపట్టాల్సి వచ్చింది. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేసినా అడ్డుకుని రాద్ధాంతం చేశారు. చావుతప్పి కన్ను లొట్ట పోయిన చందంగా మున్సిపల్ చైర్మన్గా ఎన్నికై... వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకు మున్సిపాలిటీలో అన్ని పనులకూ అడ్డు తగులుతున్నారు. అనుచరులను ఉసిగొలుపుతూ... గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలవలేకపోయేసరికి జేసీ ప్రభాకర్రెడ్డి తీవ్ర అక్కసుతో ఉన్నారు. తన అనుచరులతో కలిసి ఏదో ఒక వివాదాన్ని సృష్టించడం, ధర్నాలు, నిరసనలు చేపట్టడం, సామాన్యులను భయభ్రాంతులకు గురి చేయడం.. ఇదీ తాడిపత్రిలో రోజువారీ తీరు. గత నాలుగేళ్లుగా ప్రశాంతంగా ఉన్న తాడిపత్రిలో మళ్లీ పల్లెలకు వెళ్లి వివాదాలకు ఆజ్యం పోస్తున్నారు. ఇదిలా ఉండగా జేసీ ప్రభాకర్ చేష్టలతో విసిగిపోయిన తెలుగుదేశం పార్టీ నేతలు ఎవ్వరూ ఈయనకు అండగా నిలవని పరిస్థితి. జేసీ సోదరులు టీడీపీకి గుదిబండగా మారారని అనంతపురానికి చెందిన ఆ పార్టీ నాయకుడొకరు చెప్పారు. వీరిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే తప్ప తాడిపత్రిలో టీడీపీకి మనుగడ లేదంటున్నారు. జేసీ తీరుపై పోలీసుల మౌనం జేసీ ప్రభాకర్రెడ్డి అనుచరురాలు కమలమ్మ ఫిర్యాదుపై స్పందించి కేసు నమోదు చేసిన పోలీసులు.. జేసీ అనుచరుల ఆగడాలపై మాత్రం కనీస స్పందన లేదు. ఇన్ని వివాదాలు సృష్టిస్తున్నా సుమోటోగా కేసు నమోదు చేయలేదు. జేసీ బెదిరింపులను, వివాదాలను కనీసం పరిగణనలోకి తీసుకోవడం లేదన్న విమర్శలున్నాయి. పోలీసులు ఎందుకు భయపడుతున్నారని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. కేసు నమోదుకు ఆదేశం కాంట్రాక్టర్లను బెదిరించిన తీరుపై బాధితులనుంచి ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేయాలని తాడిపత్రి పోలీసులను ఆదేశించాం. ఎవరినైనా బెదిరించినా, ప్రభుత్వ కార్యకలాపాలకు అడ్డు తగిలినా తీవ్రంగా పరిగణిస్తాం. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటివారినైనా వదిలే ప్రసక్తే లేదు. – అన్బురాజన్, ఎస్పీ -
ఏమ్మా.. మీ ఎమ్మెల్యేను ఈ సారి గెలిపిస్తారా?
తాండూరు: ఏమ్మా.. మీ ఎమ్మెల్యేను ఈ సారి గెలిపిస్తారా? అని సీఎం కేసీఆర్ తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ స్వప్నపరిమళ్ను ప్రశ్నించారు. బుధవారం తాండూరులో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు వెళ్లిన ముఖ్యమంత్రికి చైర్పర్సన్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. ఈ సారి ఎమ్మెల్యే రోహిత్రెడ్డిని గెలిపిస్తారా అని చైర్పర్సన్ను అడగగా.. ఖచ్చితంగా గెలిపిస్తాం సార్ అని ఆమె సమాధానం ఇచ్చారు. కాగా గడిచిన మూడేళ్ల కాలంలో ఎమ్మెల్యే రోహిత్రెడ్డికి, చైర్పర్సన్ స్వప్నకు మధ్య గొడవ తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. వాటన్నింటిని పక్కనపెట్టి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పనిచేయాలని గతంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చైర్పర్సన్ను సముదాయించారు. దీంతో ఎమ్మెల్యే గెలుపే లక్ష్యంగా ఆమె ఎన్నికల ప్రచారం సైతం చేస్తున్నారు. -
బీఆర్ఎస్కు బిగ్ షాక్
వికారాబాద్ అర్బన్: కొంత కాలంగా వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్పై తీవ్ర అసంతృప్తితో ఉన్న మున్సిపల్ చైర్పర్సన్ దంపతులు మంజుల రమేష్ ఆదివారం బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. వారి రాజీనామాతో పట్టణంలో పార్టీకి గట్టి దెబ్బే అని చెప్పవచ్చు. మున్సిపల్ పరిధిలోని అన్ని వర్గాల్లో రమేష్ కుమార్కు మంచి పట్టు ఉంది. మాస్ నాయకుడిగా గుర్తింపు పొందారు. అనేక సార్లు స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారు. నాలుగు సార్లు ఇండిపెండింట్గా పోటీ చేసి కౌన్సిలర్గా విజయం సాధించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత 2015లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ తరఫున మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేసిన రమేష్కుమార్ అందరి ఊహలను తలకిందులు చేస్తూ ఏడుగురు కౌన్సిలర్లను గెలిపించుకున్నారు. దీంతో ఆయనకు పట్టణంలో మరింత పట్టు పెరిగింది. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి డాక్టర్ ఏ చంద్రశేఖర్కు మద్దతు ఇచ్చారు. చంద్రశేఖర్ సాధించిన 20వేల ఓట్లలో సుమారు మూడు వేల ఓట్లు పట్టణంలో పోలయ్యాయి. ఇందులో రమేష్ కుమార్ ప్రధాన భూమిక పోషించారనే ప్రచారం ఉంది. 2020లో బీఆర్ఎస్లోకి.. 2020లో జరిగిన మున్సిపల్ ఎన్నికల సమయంలో రమేష్ కుమార్ చైర్మన్ పదవి ఆశించి బీఆర్ఎస్కు దగ్గరయ్యారు. అయితే చైర్మన్ పదవి జనరల్ మహిళకు రిజర్వు రావడంతో అనూహ్యంగా తన సతీమణి మంజులను బీఆర్ఎస్ తరఫున 24వ వార్డు కౌన్సిరల్గా పోటీ చేయించారు. ఆమె ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో చైర్పర్సన్ పదవి దక్కింది. ఆ తరువాత చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు చైర్పర్సన్ దంపతులకు, ఎమ్మెల్యే ఆనంద్కు తీవ్రంగా గ్యాప్ పెంచింది. అప్పటి నుంచి ఎమ్మెల్యే ఆనంద్ అధికార పార్టీ కౌన్సిలర్లతో అనేక సార్లు కౌన్సిల్ సమావేశాల్లో చైర్పర్సన్కు వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలు చేయించారని చైర్పర్సన్ దంపతులే నేరుగా ఆరోపించారు. అధికార పార్టీ కౌన్సిలర్లు ఎవరూ కౌన్సిల్ సమావేశానికి హాజరు కాకుండా చేశారని మీడియా ముందు వాపోయారు. అంతటితో ఆగకుండా సొంత పార్టీ చైర్పర్సన్పై అవిశ్వాస తీర్మానం పెట్టించిన ఘనత ఎమ్మెల్యేకు దక్కుతుందని కూడా ఆరోపించారు. కౌన్సిల్ సమావేశంలో తోటి మహిళా కౌన్సిలర్ చేతిలో నుంచి మైక్ తీసుకున్నందుకు తనపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టించారని, పార్టీ పెద్దలు జోక్యం చేసుకోవడంతో కేసు వాపసు తీసుకున్నారని చైర్పర్సన్ అప్పట్లో ఆరోపించారు. అనేక అభివృద్ధి పనులకు ఆమోదం తెలపకుండా ఎమ్మెల్యే అడ్డుకున్నారని బహిరంగంగానే విమర్శించారు. ఎంత అవమానించినా భరిస్తూ పార్టీలో కొనసాగినట్లు తెలిపారు. తమకు సముచిత స్థానం లేని చోట ఉండటం ఇష్టం లేకనే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆమె తెలిపారు. మంజుల రమేష్కుమార్ దంపతుల బాటలోనే బీఆర్ఎస్ పార్టీకి చెందిన 6వ వార్డు కౌన్సిలర్ చందర్ నాయక్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు జే అరుణ్ కుమార్, విశ్రాంత ఇంజనీర్, జే ప్రదీప్ కుమార్, బీఆర్ఎస్ పట్టణ యువ నాయకుడు సాయికృష్ణ పార్టీకి రాజీనామా చేశారు. ఏది ఏమైనా ఎన్నికలు సమీపిస్తున్న వేళ మంజుల రమేష్కుమార్ దంపతులు బీఆర్ఎస్ను వీడడం గట్టి దెబ్బే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. -
TS Election 2023: జగిత్యాల అభ్యర్థిగా భోగ శ్రావణి
సాక్షిప్రతినిధి, కరీంనగర్: బీజేపీ అసెంబ్లీ స్థానం నుంచి మున్సిపల్ మాజీ చైర్పర్సన్ భోగ శ్రావణి పోటీ చేయనున్నారు. కొన్ని నెలల క్రితం అధికార పార్టీలో విభేదాల కారణంగా పదవికి, పార్టీకి రాజీనామా చేసిన ఆమె బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. వైద్యురాలు, విద్యావంతురాలు, బీసీ సామాజికవర్గానికి చెందిన మహిళ కావడం, జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్గా చేసిన అనుభవం ఉండటంతో పార్టీ ఆమెకు టికెట్ ఇచ్చే యోచనలో ఉందని కమలనాథులు చెబుతున్నారు. వాస్తవానికి శ్రావణి చేరిక సమయంలోనే ఆమెకు పార్టీ నుంచి టికెట్ హామీ దక్కిందని ప్రచారం జరిగింది. అధిష్టానం ఆమె పేరును దాదాపుగా ఖరారు చేసిందని సమాచారం. -
సమస్యలపై దద్దరిల్లిన కౌన్సిల్
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ఆయా వార్డుల్లో నెలకొన్న సమస్యలపై అధికారులను కౌన్సిలర్లు నిలదీయడంతో కౌన్సిల్ దద్దరిల్లింది. సోమవారం మధ్యాహ్నం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో అత్యవసర సమావేశం జరిగింది. చాలా వార్డుల్లో మిషన్ భగీరథ పథకం తాగునీరు సరిపోవడం లేదని, వీధిలైట్లు 24 గంటల పాటు వెలుగుతున్నాయని కౌన్సిలర్లు ఏకరువు పెట్టారు. వర్షాకాలం ఆరంభమైనందున పారిశుద్ధంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఎజెండాలోని వివిధ అంశాలపై వాడివేడీగా చర్చ సాగింది. ముందుగా 32వ వార్డు కౌన్సిలర్ సాదతుల్లా మాట్లాడుతూ చాలా గల్లీలలో వీధి దీపాలు, ముఖ్య కూడళ్లలో హైమాస్ట్ లైట్లు సరిగా పనిచేయడం లేదన్నారు. దోమల బెడద ఎక్కువగా ఉందని రసాయన మందులు పిచికారీ చేయించాలన్నారు. ఇవే విషయాలను 19వ వార్డు కౌన్సిలర్ షబ్బీర్ అహ్మద్ ప్రస్తావించారు. అంబేడ్కర్ చౌరస్తా సమీపంలోని ఎక్స్పో–ప్లాజా తొలగించినందున అక్కడి సామగ్రిని మున్సిపాలిటీ స్వాధీనం చేసుకోవాలన్నారు. 24వ వార్డు కౌన్సిలర్ అబ్దుల్ రషీద్ మాట్లాడుతూ లోతట్టు ప్రాంతం రామయ్యబౌలిలో వర్షపు నీరు నిల్వకుండా చూడాలన్నారు. బీజేపీ ఫ్లోర్ లీడర్ అంజయ్య మాట్లాడుతూ కాంట్రాక్టు పనులు అన్ని మహిళా సంఘాల గ్రూపులకు ఇవ్వాలన్నారు. తెలంగాణ ఏర్పడి పదేళ్లు పూర్తికాకుండానే దశాబ్ది ఉత్సవాలు నిర్వహించడం సమంజసం కాదన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు అందరినీ ఆహ్వానించాలన్నారు. అప్పన్నపల్లిలో రెండో ఆర్ఓబీ ప్రారంభమైనందున కింది భాగంలో అటు, ఇటువైపు వీధి దీపాలు ఏర్పాటు చేయాలన్నారు. వీధుల్లో కుక్కల బెడద ఎక్కువగా ఉందని, అంతర్గత రోడ్లు దెబ్బ తిన్నాయని 21, 37వ వార్డు కౌన్సిలర్లు అనంతరెడ్డి, స్వప్న సమావేశం దృష్టికి తెచ్చారు. కొందరు ఇంటి యజమానులు రోడ్డును ఆనుకొని ర్యాంపులు నిర్మించడంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, వాటిని తొలగించాలని 13, 21వ వార్డు కౌన్సిలర్లు లక్ష్మీదేవి, అనంతరెడ్డి డిమాండ్ చేశారు. పెద్దనాలాలలో మురుగును ఎప్పటికప్పుడు తొలగించాలని 33, 34వ వార్డు కౌన్సిలర్లు మునీరుద్దీన్, నర్సింహులు కోరారు. కొందరు వ్యక్తులు వాహనాల్లో కోయిల్కొండ ఎక్స్రోడ్డు సమీపంలో అర్ధరాత్రి చికెన్ వ్యర్థ పదార్థాలను పడేసిపోతున్నారని సభ దృష్టికి తెచ్చారు. వీరితో పాటు కౌన్సిలర్లు సంధ్య, శ్రీనివాసులు, ముస్కాన్ సుల్తానా, రామాంజనేయులు తమ వార్డుల్లోని సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చారు. వీలైనంత త్వరగా పరిష్కరిస్తాం.. – చైర్మన్, కమిషనర్ సభ్యులు ప్రస్తావించిన ఈ సమస్యలను వీలైనంతవరకు పరిష్కరిస్తామని మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, కమిషనర్ డి.ప్రదీప్కుమార్ బదులిచ్చారు. పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామని, అందుకు అందరూ సహకరించాలన్నారు. ఇదిలా ఉండగా ఎజెండాలోని కొన్ని పద్దుల్లో తప్పులు దొర్లడంతో అధికారులపై చైర్మన్ మండిపడ్డారు. ఇక ముందు ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించారు. సమావేశంలో వైస్చైర్మన్ తాటి గణేష్కుమార్, టీపీఓ లక్ష్మీపతి, డిప్యూటీ ఈఈ బెంజిమన్, శానిటరీ ఇన్స్పెక్టర్లు రవీందర్రెడ్డి, గురులింగం, ఏఓ ఉమాకాంత్, ఆర్ఓ నర్సింహ తదితరులు పాల్గొన్నారు. -
వైరా మున్సిపల్ చైర్మన్పై అవిశ్వాసం
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం జిల్లా వైరా మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్పై బీఆర్ఎస్ కౌన్సిలర్లు సోమవారం కలెక్టర్ వీపీ గౌతమ్కు అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చారు. ఇటీవల జైపాల్తోపాటు మరో ముగ్గురు కౌన్సిలర్లు మాజీ ఎంపీ పొంగులేటికి మద్దతు తెలిపారు. దీంతో బీఆర్ఎస్ నుంచి ఇప్పటికే ఆయనను సస్పెండ్ చేయగా, మరో ముగ్గురు కౌన్సిలర్లు పార్టీకి రాజీ నామా ప్రకటించారు. ఈ క్రమంలో సోమవారం 14 మంది బీఆర్ఎస్, ఇద్దరు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లతో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ మంతనాలు జరి పారు. అనంతరం వీరంతా ఎమ్మెల్యే నేతృత్వంలో అవిశ్వాస తీర్మానం నోటీసును కలెక్టర్కు అందజేశారు. పొంగులేటి వర్గం కావడంతో.. వైరా మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 20 వార్డులకుగాను బీఆర్ఎస్ 15, కాంగ్రెస్ రెండు, స్వతంత్రులు రెండు, సీపీఎం ఒక స్థానం గెలుచుకున్నాయి. ఆ తర్వాత ఇద్దరు స్వ తంత్ర అభ్యర్థులు, సీపీఎం కౌన్సిలర్ బీఆర్ఎస్లో చేరా రు. బీఆర్ఎస్పై అసంతృప్తిగా ఉన్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి నిర్వహించిన కార్యక్రమాలకు జైపాల్ హాజరయ్యారు. దీంతో ఆయనపై బీఆర్ఎస్ వేటువేసింది. ఆ తర్వాత మరో ముగ్గురు కౌన్సిలర్లు ఆ పార్టీకి రాజీనా మా చేసి పొంగులేటి నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో చైర్మన్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఎజెండా కాపీలను కౌన్సిల్ సమావేశాలకు ముందు అందజేయడంలేదని, అభివృద్ధిని పట్టించుకోవడంలేదని ఆయనపై మిగిలిన కౌన్సిర్లు అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇవ్వడం గమనార్హం. -
ఇల్లందులో వేడెక్కిన రాజకీయం
-
జనగామ మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్పై అవిశ్వాస నోటీసులు
జనగామ: జనగామ మున్సిపల్ చైర్పర్స పోకల జమున, వైస్ చైర్మన్ మేకల రాంప్రసాద్పై అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ సభ్యులు శుక్రవారం అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్కి అవిశ్వాస నోటీసులు అందజేశారు. తొమ్మిది రోజులపాటు క్యాంపు రాజకీయం నడిపించిన అధికార పక్షం ఆ ఇద్దరిని తొలగించాలని కోరుతూ 11 మంది బీఆర్ఎస్, 8 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు వేర్వేరుగా అవిశ్వాస నోటీసులు ఇచ్చారు. ఫ్లోర్లీడర్ మారబోయిన పాండును తొలగించాలని అధిష్టానాన్ని కోరినట్లు బీఆర్ఎస్ కౌన్సిలర్లు తెలిపారు. కాంట్రాక్టర్లు, ఇళ్లనిర్మాణ అనుమతులకు కమీషన్లు వసూలు చేస్తూ పార్టీని అప్రతిష్టపాలు చేస్తుండటంతో అవిశ్వాసం నోటీసులు ఇచ్చినట్లు చైర్పర్సన్ రేసులో ఉన్న 19వ వార్డు సభ్యురాలు బండ పద్మ తెలిపారు. కాగా, నలుగురు బీజేపీ సభ్యులు కూడా తమతో టచ్లో ఉన్నారని ఆమె చెప్పారు. -
హుజూరాబాద్లో హీటెక్కిన పాలిటిక్స్.. చేతులు కలిపిన బీజేపీ, బీఆర్ఎస్ నేతలు!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ రాజీనామా వ్యవహారం చల్లబడిందో లేదో మళ్లీ హుజూరాబాద్ మున్సిపల్ పాలకవర్గం పంచాయితీ తెరపైకి వచ్చింది. హుజూరాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధికపై బీఆర్ఎస్, బీజేపీ కౌన్సిలర్లు గురువారం ఏకంగా కలెక్టరేట్ ఏవో నారాయణకు ఫిర్యాదు ప్రతులను అందజేశారు. హుజూరాబాద్ నుంచి నేరుగా బీఆర్ఎస్కు చెందిన 22 మంది, బీజేపీకి చెందిన ముగ్గురు కౌన్సిలర్లు కొత్తకొండ వీరభద్రస్వామి దేవస్థానం వద్దకు చేరుకొని చైర్పర్సన్పై అవిశ్వాసం విషయంలో ఏకతాటిపై ఉండాలని ప్రతిజ్ఞ చేసిన అనంతరం కరీంనగర్కు చేరుకొని ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో హుజూరాబాద్ అవిశ్వాస వ్యవహారం అధికార బీఆర్ఎస్ పార్టీలో చర్చనీయాంశమైంది. ఇదే బాటలో జమ్మికుంట పాలకవర్గంలో కూడా అవిశ్వాస ముసలం పుట్టినట్లు సమాచారం. గతనెల 31వ తేదీన జమ్మికుంటలో భారీ బహిరంగ సభలో బీఆర్ఎస్ అగ్రనేతలంతా బీజేపీ విధానాలపై దుమ్మెత్తిపోసిన రెండురోజులకే అదే పార్టీ నేతలతో కలిసి అవిశ్వాసానికి వెళ్లడం గమనార్హం. ఏకపక్ష నిర్ణయాల వల్లే... హుజూరాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక భర్త గందె శ్రీనివాస్ వ్యవహార శైలి వల్లే అవిశ్వాసం వరకు అసమ్మతి రగడ రాజుకుందనే ప్రచారం మెండుగా ఉంది. గతంలో శ్రీనివాస్ వ్యవహారంపై అప్పటి మంత్రి ఈటల రాజేందర్, ప్రస్తుత మంత్రి గంగుల కమలాకర్కు, మరికొంత మంది పార్టీ ముఖ్యనేతలకు ఫిర్యాదు చేశారు. అయినా ఆయన వ్యవహార శైలిలో మార్పులేకపోవడం వల్లే అసమ్మతి గళాన్ని వినిపిస్తున్నట్లు సమాచారం. అభివృద్ధి పనుల విషయంలో తోటి కౌన్సిలర్లకు సమాచారం ఇవ్వకుండా, బినావీులతో కాంట్రాక్టు పనులు చేయిస్తూ మెజార్టీ కౌన్సిలర్ల మనోభావాలను పరిగణనలోకి తీసుకోకుండా, అధికారులను భయబ్రాంతులకు గురి చేయడం వల్లే ఈ నిర్ణయానికి మెజార్టీ సభ్యులు తోడైనట్లు తెలిసింది. పాలకవర్గంలో 30 మంది సభ్యులుండగా ఒకరు మృతి చెందారు. 25 మంది కౌన్సిలర్లు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. చైర్పర్సన్కు ముగ్గురు కౌన్సిలర్లు మాత్రమే మద్దతుగా మిగిలారు. ఎమ్మెల్సీ వద్దకు పంచాయితీ.. 25 మంది కౌన్సిలర్లు గురువారం సాయంత్రం హుజూరాబాద్లో ఉన్న ఎమ్మెల్సీ కౌశిక్రెడ్డిని కలిసి విషయాన్ని వివరించినట్లు సమాచారం. పార్టీ అధిష్టానం నిర్ణయించిన మేరకు నడుచుకోవాలని, సమస్యను పార్టీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని, ఎలాంటి తొందరపాటు నిర్ణయాలకు తావివ్వద్దని ఎమ్మెల్సీ వారికి సూచించినట్లు సమాచారం. అయినప్పటికీ మెజార్టీ కౌన్సిలర్లు పార్టీ నిర్ణయమే శిరోధార్యమని, తమ ఫిర్యాదును పరిగణలోకి తీసుకోవాలని, పార్టీకి చెడ్డ పేరు వచ్చే విధంగా తాము వ్యవహరించమని, మెజార్టీ సభ్యుల మనోభావాలను గుర్తించి నిర్ణయం తీసుకోవాల్సిందేనని మొరపెట్టుకున్నట్లు వినికిడి. దీంతో ఈ విషయాన్ని ఆయన ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్కుమార్ దృష్టికి తీసుకెళ్లారని తెలిసింది. హుజూరాబాద్ తరహాలోనే జమ్మికుంట మున్సిపల్ పాలకవర్గంలో కూడా ముసలం పుట్టినట్లు సమాచారం. వరుస పరిణామాలతో అధికార పార్టీలో గందరగోళం నెలకొంది. - గత పాలకవర్గంలోనూ ఇదే తరహాలో అర్ధంతరంగా అవిశ్వాసం ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈటల రాజేందర్ మంత్రిగా ఉన్న సమయంలో 2018 ఆగస్టులో అప్పుడు చైర్మన్గా ఉన్న విజయ్కుమార్తో రాజీనామా చేయించారు. అనంతరం ఆ స్థానంలో మందా ఉమాదేవి చైర్పర్సన్గా బాధ్యతలు చేపట్టగా.. ఆమె 10 నెలలపాటు పదవిలో కొనసాగారు. ఆ తరువాత ప్రత్యేకాధికారుల పాలన సాగింది. అనంతరం 2020 జనవరిలో మున్సిపల్ ఎన్నికలు జరగ్గా.. జనవరి 27న గందె రాధిక నేతృత్వంలో నూతన పాలకవర్గం కొలువుదీరింది. మూడేళ్లు పూర్తి చేసుకున్న క్రమంలో రాష్ట్రాల అవిశ్వాసాలకు తెరలేవగా.. ఆ మంటలు ఇక్కడ కూడా అంటుకున్నాయి. చైర్పర్సన్ రేసులో ముగ్గురు..! బీఆర్ఎస్–బీజేపీ కౌన్సెలర్లు అవిశ్వాస తీర్మానం ఇవ్వగా.. అన్నీ అనుకూలిస్తే అవిశ్వాసం విజయవంతమైతే చైర్పర్సన్ స్థానానికి ముగ్గురు పోటీలో ఉన్నారు. మందా ఉమాదేవి, దండ శోభ, వైస్ చైర్పర్సన్ కొల్లిపాక నిర్మల రేసులో ఉన్నట్లు తెలిసింది. ఈ విషయంలో అధిష్టానం నిర్ణయమే ఫైనల్ కానుంది. -
బీఆర్ఎస్లో తిరుగుబావుటా.. మంత్రి మల్లారెడ్డి ఆదేశాలు బేఖాతరు!
అధికార పార్టీ బీఆర్ఎస్లో తిరుగుబాటు జెండా ఎగురుతోంది. నగర పాలక సంస్థ, మున్సిపాలిటీల్లో సొంత పార్టీ మేయర్లు, చైర్మన్ల పైనే అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన నోటీసులు మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టర్కు అందజేయడం ఆ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. సాక్షి, మేడ్చల్ జిల్లా: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో 13 పురపాలక సంఘాలు ఉండగా, మంత్రి చామకూర మల్లారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు, మున్సిపల్ కౌన్సిలర్లు ఆయన ఆదేశాలను బేఖాతరు చేస్తూ.. కలెక్టర్కు అవిశ్వాసం నోటీసులు సమర్పించడంపై బీఆర్ఎస్ కేడర్ను తీవ్ర అయోమయానికి గురిచేస్తోంది. సొంత బంధువులు ప్రాతినిధ్యం వహిస్తున్న పురపాలక సంఘాల్లో కూడా కౌన్సిలర్లు మంత్రి మల్లారెడ్డి గీత దాటడంతో పాటు విపక్షాలతో చేతులు కలపడం వంటి విషయాలు రాజకీయ వర్గాలను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రాష్ట్రంలోనే అత్యధిక పురపాలక సంఘాలు కలిగిన శాసన సభా నియోజకవర్గంగా మేడ్చల్కు పేరుంది. ఇక్కడనే స్థానిక ఎమ్మెల్యే, మంత్రి మల్లారెడ్డి ఆదేశాలను బీఆర్ఎస్ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు పాటించక పోవడంతో పట్టును కోల్పోతున్నారన్న చర్చ పార్టీ వర్గాల్లో వ్యక్త మవుతోంది. అలాగే మేడ్చల్ నియోజకవర్గంలోని పలు పురపాలక సంఘాలకు చెందిన డిప్యూటీ మేయర్లు, వైస్ చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు కూడా అదే పార్టీకి చెందిన మేయర్లు, చైర్మన్లపై అవిశ్వాసం నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ విషయాన్ని పసిగట్టిన మంత్రి మల్లారెడ్డి వివిధ మార్గాల ద్వారా అసమ్మతి వాదులను బుజ్జగించే పనిలో నిమగ్నమైనట్లు సమాచారం. బుధవారం ‘మన ఊరు–మన బడి’ కింద మరమ్మతులు పూర్తయిన ప్రభుత్వ పాఠశాలల భవనాల ప్రారం¿ోత్సవానికి హాజరైన మంత్రి మల్లారెడ్డి పోచారం, పీర్జాదిగూడ, బోడుప్పల్ పురపాలక సంఘాల్లోని అసమ్మతి వాదులతో సమావేశమై.. బుజ్జగింపుల పర్వానికి తెర లేపినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా... మంత్రి మల్లారెడ్డిపై దాదాపు నెల రోజుల కిందట మల్కాజిగిరి ఎమ్మెల్యే, సీనియర్ బీఆర్ఎస్ నేత మైనంపల్లి హన్మంతరావు ఇంట్లో సమావేశమైన జిల్లాకు చెందిన ఆ పార్టీ ఎమ్మెల్యేలు పలు ఆరోపణలతో తిరుగుబావుటా ఎగురవేసిన విషయం తెల్సిందే. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాలను ఖాతరు చేయకుండా నామినేటెడ్ పదవులను మంత్రి మల్లారెడ్డి సొంత నియోజకవర్గం వారికి కట్టబెట్టారని ఎమ్మెల్యేలు ఆరోపించారు. అలాగే తమ నియోజక వర్గాల్లో అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపు విషయంలో కలెక్టర్ను మంత్రి పక్కదారి పట్టిస్తున్నారని ఎమ్మెల్యేలు విమర్శిస్తున్నారు. మంత్రి మల్లారెడ్డి వ్యవహార శైలిపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ల దృష్టికి తీసుకెళ్తామని ఎమ్మెల్యేలు అప్పట్లోనే మీడియా సమావేశంలో ప్రకటించారు. జవహర్నగర్ బాటలో మరికొన్ని.. మేడ్చల్ నియోజకవర్గంలోని జవహర్నగర్ కార్పొరేషన్ మేయర్ మేకల కావ్యపై 20 మంది కార్పొరేటర్లు ఇటీవల కలెక్టర్కు అవిశ్వాస నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే. మేడ్చల్ మున్సిపల్ చైర్మన్ మర్రి దీపికపై 15 మంది కౌన్సిలర్లు అవిశ్వాసం తీర్మానానికి సంబంధించిన నోటీసు కలెక్టర్ కార్యాలయంలో అందజేశారు. తెలంగాణ మున్సిపాలిటీ యాక్ట్ 2019 సె క్షన్ 37 అనుసరించి నో కాన్ఫిడెన్స్ మోషన్ పిటిషన్ చైర్మన్కు వ్యతిరేకంగా సమర్పిస్తున్నట్లు వారు నోటీసులో పేర్కొన్నారు. మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని మరో 4 పురపాలక సంఘాలకు చెందిన అధికార బీఆర్ఎస్కు చెందిన అ మ్మతి కార్పొరేటర్లు, కౌన్సిలర్లు అవిశ్వాసం నోటీసులు కలెక్టర్ కు అందజేసేందుకు సిద్ధమవుతున్నారు. -
జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ రాజీనామా ఆమోదం
జగిత్యాల: జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ బోగ శ్రావణి రాజీనామాను జిల్లా కలెక్టర్ రవి ఆమోదించారు. ఈ నెల 25న శ్రావణి మున్సిపల్ చైర్పర్సన్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ రవి సోమవారం ఆమెను కలెక్టరేట్కు పిలిపించారు. రాజీనామా నిర్ణయాన్ని ఎవరి ఒత్తిడితోనైనా తీసుకున్నారా ? లేక సొంతంగా నిర్ణయం తీసుకున్నారా? అని కారణాలు అడిగి తెలుసుకున్నారు. తన ఇష్టపూర్వకంగానే రాజీనామా చేశానని స్పష్టం చేసిన శ్రావణి.. మరోసారి లేఖ రాసివ్వడంతో కలెక్టర్ ఆమె రాజీనామా లేఖకు ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీచేశారు. అనంతరం వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్కు ఇన్చార్జి చైర్మన్గా బాధ్యతలు అప్పగించారు. కాగా, ఎన్నికల కమిషన్ నుంచి ఆదేశాలు రాగానే నూతన చైర్మన్ను ఎన్నుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. జగిత్యాల మున్సిపాలిటీలో కొందరు కౌన్సిలర్లు ఆమెపై అవిశ్వాసానికి ప్రయత్నించడంతో శ్రావణి తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. -
శ్రావణి రాజీనామాపై స్పందించిన ఎమ్మెల్యే సంజయ్.. ఏమన్నారంటే?
సాక్షి, జగిత్యాల: స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, తమ పనులకు అడ్డుపడుతున్నారని అవి భరించలేకనే పదవికి రాజీనామా చేస్తున్నట్టు జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ భోగ శ్రావణి ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాజీనామా చేసి మీడియా ఎదుటే శ్రావణి కన్నీరుపెట్టుకున్నారు. కాగా, ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే సంజయ్ కుమార్ స్పందించారు. శ్రావణి రాజీనామాపై ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. ‘మున్సిపల్ చైర్పర్సన్ రాజీనామా తన వ్యక్తిగతం. చైర్పర్సన్ వ్యాఖ్యలు చాలా బాధించాయి. నేను ఎలాంటి వేధింపులకు గురిచేయలేదు. శ్రావణి వెనుక ఎవరో వ్యక్తులు ఉన్నారు. రాజకీయ కారణాలతో రాజీనామా చేశారు. కౌన్సిలర్లను ఎలాంటి క్యాంపులకు పంపలేదు. అధిష్టానం అన్ని విషయాలు చూసుకుంటుంది. తన కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారని ఆమె కామెంట్స్ చేయడం సరికాదు. దీన్ని ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నాను. సమన్వయ లోపం ఉందని అవిశ్వాసం పెడతామని కౌన్సిలర్లు చెప్పినా వద్దని చెప్పాము. సమన్వయ సమావేశం ఏర్పాటు చేయాలనీ నిర్ణయించి చైర్పర్సన్కు కాల్ చేశాము. ఈలోపే ఆమె ప్రెస్ మీట్ పెట్టి వ్యాఖ్యలు చేయడం బాధించింది. కలిసి పనిచేస్తానంటే కౌన్సిలర్లను సముదాయించేందుకు ప్రయత్నం చేస్తాను. 50% బీసీ మహిళలకు పదవులు ఇచ్చామ’ని వ్యాఖ్యలు చేశారు. -
దొరగారూ.. మీకో దండం!
సాక్షి, కరీంనగర్: ‘దొరగారూ మీకో దండం. మూడేళ్లుగా అడుగడుగునా అవమానాలు, వేధింపులు భరించా. ఇక నా వల్ల కాదు, మీ గడీ సంకెళ్లు తెంపుకుని బయటికి వస్తున్నా..నా కుటుంబాన్ని, పిల్లల్ని కాపాడుకునేందుకే రాజీనామా చేస్తున్నా. మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత ఆశీస్సులతో మూడేళ్ల పాటు పదవిలో కొనసాగాను. ఇక ఈ నరకం నా వల్ల కాదు. దొరా మీరే గెలిచారు..’ అంటూ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ను ఉద్దేశించి మున్సిపల్ చైర్పర్సన్ భోగ శ్రావణి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కన్నీటి పర్యంతమవుతూ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. బు ధవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె ఉద్వేగంగా మాట్లాడారు. ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి.. ‘ఒక మహిళా బీసీ నేతగా జగిత్యాల ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో మూడు నెలల పసిగుడ్డును వదిలి రాజకీయాల్లోకి వచ్చాను. కేటీఆర్, కవిత ఆశీస్సులతో బలహీనవర్గాలకు చెందిన నేను మున్సిపల్ చైర్పర్సన్ పదవి పొందగలిగా. కానీ ప్రమాణ స్వీకారం చేసిన రెండోరోజు నుంచే విషం చిమ్మే కోరలు ఉన్న మనుషుల మధ్య పనిచేయాల్సి వచ్చింది. ‘మున్సిపల్ చైర్పర్సన్ పదవి అంటే ముళ్లకిరీటం’ అని ఎమ్మెల్యే సంజయ్కుమార్ చెబితే తన తండ్రిలాంటి వాడు, తన బాగు కోసం సలహాలు ఇస్తున్నాడని భావించానే తప్ప.. ఆయన రాక్షసత్వానికే బలవుతానని అనుకోలేదు..’ అని శ్రావణి అన్నారు. పేరుకే మున్సిపల్ చైర్పర్సన్ని.. ‘కరీంనగర్ రోడ్లో ఏర్పాటు చేసిన డివైడర్లు ఎందుకు చిన్నగా ఉన్నాయని ప్రశ్నిస్తే.. కాంట్రాక్టర్, కౌన్సిలర్ల ముందే అవమానించారు. పార్కులు అభివృద్ధి చేయాలని కోరితే అమరవీరుల స్తూపం సాక్షిగా తీవ్రంగా అవమానించారు. మున్సిపాలిటీ లో ఎలాంటి పర్యటనలు చేయకూడదు. కనీసం రూ.10 వేల విలువ గల పనికి కూడా కొబ్బరికాయ కొట్టలేని దయనీయస్థితి. పేరుకే మున్సిపల్ చైర్పర్సన్ని. పెత్తనం ఎమ్మెల్యేదే..’ అని చెప్పారు. చైర్పర్సన్ పదవిని అమ్ముకోవడానికి బేరం ‘నాలుగేళ్లలోపు అవిశ్వాసాలు పెట్టరాదని తెలిసినా ఎమ్మెల్యే కౌన్సిలర్లను బెదిరించి అవిశ్వాస తీర్మానం డ్రామా ఆడారు. చైర్పర్సన్ పదవిని అమ్ముకోవడా నికి ఓ మహిళా కౌన్సిలర్ భర్తతో బేరం కుదుర్చుకు న్నారు. కర్కశత్వం, మూర్ఖత్వం, క్రూరత్వం కలిపితే ఎమ్మెల్యే సంజయ్. ఆయనతో మాకు ఆపద పొంచి ఉంది. మా కుటుంబానికి ఏమైనా జరిగితే ఎమ్మె ల్యేనే కారణం. మాకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఎస్పీగారిదే’ అని శ్రావణి తెలిపారు. శ్రావణికి బీఫామ్ ఇచ్చిందే నేను చైర్పర్సన్ భోగ శ్రావణి ఆరోపణలు సమంజసం కాదు. ఆమెకు బీఫామ్ ఇచ్చిందే నేను. అలాంటిది నేను ఎందుకు ఆమెకు వ్యతిరేకంగా వ్యవహరిస్తాను. అవిశ్వాసం విషయంలో నా ప్రమేయం లేదు. ఈ విషయంలో ఇంతకుమించి స్పందించలేను. – ఎమ్మెల్యే సంజయ్కుమార్ -
కామారెడ్డి ‘మాస్టర్ప్లాన్’ వెనక్కి!
సాక్షి, కామారెడ్డి/కామారెడ్డి టౌన్: ‘భూమిని మింగే మాస్టర్ ప్లాన్ మాకొద్దు’అంటూ నెలన్నర కాలంగా రైతు ఐక్యకార్యాచరణ కమిటీ చేస్తున్న పోరాటం ఫలించింది. కామారెడ్డి మున్సిపల్ పాలకవర్గం మాస్టర్ప్లాన్ రద్దుకు ముందుకు వచ్చింది. ఈ నెల 20న మున్సిపల్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి ముసాయిదా రద్దు కోరుతూ తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపనున్నట్టు మున్సిపల్ చైర్పర్సన్ నిట్టు జాహ్నవి గురువారం విలేకరుల సమావేశంలో ప్రకటించారు. దీంతో గడచిన నెలన్నర రోజులుగా జరుగుతున్న ఆందోళనలకు ఫుల్స్టాప్ పడనుందని రైతులు భావిస్తున్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి రైతు ఐక్యకార్యాచరణ కమిటీ అనేక రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలు, బంద్లు నిర్వహించింది. విలీన గ్రామాల కౌన్సిలర్లు తొమ్మిది మంది రాజీనామా చేయాలని గురువారం సాయంత్రం వరకు డెడ్లైన్ విధించింది. ఈ క్రమంలో బీజేపీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు తమ రాజీనామా లేఖలను మున్సిపల్ కమషనర్కు అందించారు. దీంతో అధికార పార్టీ కౌన్సిలర్లపై ఒత్తిడి పెరిగింది. ముందు నుయ్యి, వెనక గొయ్యిలా వారి పరిస్థితి తయారైంది. శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఇంటిని ముట్టడించాలని పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు చర్చించి ఈ నెల 20న మున్సిపల్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి ముసాయిదా రద్దు కోరుతూ తీర్మానించాలని నిర్ణయించారు. ఎట్టకేలకు రైతుల పోరాటాల ఫలితంగా బల్దియా పాలకవర్గం మాస్టర్ప్లాన్ ముసాయిదా రద్దుకు సిద్ధమైంది. -
గుజరాత్ కేబుల్ బ్రిడ్జ్ ఘటన...మున్సిపల్ ఆఫీసర్పై వేటు
అక్టోబర్ 30న మచ్చు నదిపై మోర్బీ తీగల వంతెన కూలి 135 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఆ ఘటనకు సంబంధించి మున్సిపాలిటీ చీఫ్ ఆఫీసర్ సందీప్ సిన్హ్ జలాలను గుజరాత్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ ఘటనపై ఐదుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక కమిటీ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ఈ ఘటన జరిగినప్పుడూ సందీప్ జాలా ఛీఫ్ ఆఫీసర్గా ఉండటంతో వేటు విధించామని కమిటీ స్పష్టం చేసింది. దర్యాప్తుని నిష్పక్షపాతంగా జరిపేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఐతే ఆయనపై ఇంకా ఎలాంటి నిర్ధిష్ట అభియోగాన్ని మోపలేదని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు కమిటీ దర్యాప్తులో....మున్సిపాలిటీ బోర్డు అనుమతి పొందకుండానే సుమారు 15 ఏళ్ల పాటు ఒరెవా గ్రూపుతో ఒప్పందంపై మున్సిపాలిటీ సంతకం చేసిందని అధికారులు తెలిపారు. అదీగాక 139 ఏళ్ల నాటి బ్రిడ్జిని ప్రైవేట్ కంపెనీ అనుమతి లేకుండానే మళ్లీ తెరిచినప్పుడూ మున్సిపాలిటీ చేతులు దులుపుకుందనే విమర్శలు తలెత్తుతున్నాయి. బ్రిడ్జిని తిరిగి తెరిచేటప్పుడూ కూడా కంపెనీ ఫిట్నెస్ సర్టిఫికేట్ జారీ చేసిందా లేదా అనేది తెలియదని మున్సిపాలిటీ చీఫ్ సందీప్ జాలా అన్నారు. ఈ బ్రిడ్జిని ఒరెవా కంపెనీ మార్చి7 నుంచి మరమత్తుల నిర్వహణ విషయమై ఏడు నెలలపాటు మూసేసింది. న్యూయర్ వేడుకల నేపథ్యంలోనే అక్టోబర్ 26న వంతెనను తిరిగి ప్రారంభించింది. అయితే ఒరేవా మేనేజింగ్ డ్రైరెక్టర్ జయసుఖ్ పటేల్ మోర్బి జిల్లా కలెక్టర్ మధ్య 2008 ఒప్పందం ప్రకారం సుమారు 10 సవంత్సరాల పాటు వంతెనను నిర్వహించడానకి కాంట్రాక్టు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. ఐతే ఒరెవా కాంట్రాక్టుకు ఎలాంటి టెండర్లు నిర్వహించలేదని గుజరాత్ ప్రభుత్వ న్యాయవాది హెచ్ఎస్ పాంచల్ బుధవారం స్థానిక కోర్టుకు తెలిపారు. అంతేగాదు కేవలం బ్రిడ్జి ప్లాట్ఫాంని మాత్రమే ఒరెవా గ్రూప్ మార్చిందని, తెగిపడిన కేబుల్ విభాగం బలహీనంగా తుప్పుపట్టి ఉందని పాంచల్ ఆరోపణలు చేశారు. అయితే మరో ప్రభుత్వ అధికారి 2018లోనే ఒప్పందం ముగిసిన ఒరెవాతో అనబంధ సాగించిందని, రాజ్కోట్ కలెక్టర్ కార్యాలయం కొత్త ఒప్పందం కుదుర్చుకునే వరకు వంతెనను నిర్వహించడానికి ఒరేవా మేనేజింగ్ డైరెక్టర్ పటేల్కు అనుమతి ఉన్నట్లు తెలిపారు. అలాగే ఆగస్టులో టికెట్ పీజు పెంచాలన్న కంపెనీ ప్రతిపాదనను సైతం మున్సిపల్ బోర్డు తిరస్కరించిందని అధికారి తెలిపారు. ఈ ఏడాది ఒప్పందం ప్రకారం పెద్దలకు రూ.15, 12 సంవత్సారాల కంటే తక్కువ వయసు ఉన్నవారికి రూ. 10గా నిర్ణయించారు. ఈ మేరకు ఒరెవా గ్రూపుకు చెందని నలుగురు అధికారులను, మరమత్తులు కేటాయించిన కాంట్రాక్టర్లు ప్రకాశ్ పర్మార్, దేవాంగ్ పర్మార్లతో సహా తొమ్మిది మందిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీ ఈ ఘటనపై దర్యాప్తు చేసి నివేదికను సిద్ధం చేసి త్వరతగతిన ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంది. -
టీఆర్ఎస్లో అసమ్మతి సెగలు.. ‘పట్నం’ మున్సిపాలిటీలో ముదిరిన వైరం
సాక్షి, ఇబ్రహీంపట్నం(రంగారెడ్డి): ‘పట్నం’ పురపాలక సంఘం పాలక వర్గం వ్యవహారశైలి రోజుకో మలుపు తిరుగుతోంది. అధికార పార్టీ చైర్పర్సన్ కప్పరి స్రవంతితో అమీతుమీ తేల్చుకునేందుకు అదే పార్టీకి చెందిన కౌన్సిలర్లు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో మూకు మ్మడిగా మంత్రి సబితారెడ్డికి ఫిర్యాదు చేయడం జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మున్సిపాలిటీలో 24 మంది కౌన్సిలర్లకు ఆరుగురు కాంగ్రెస్, ఇద్దరు బీజేపీ కౌన్సిలర్లు ఉండగా మిగతా వారంతా అధికార టీఆర్ఎస్కు చెందిన వారే. చైర్ పర్సన్, అధికార పార్టీ కౌన్సిలర్ల మధ్య ఆరు నెలలుగా వైరం కొనసాగుతోంది. అదికాస్తా తీవ్రరూపం దాల్చింది. అక్రమ వసూళ్లతోపాటు మున్సిపాలిటీలో రూ.2 కోట్లకు పైగా తప్పుడు బిల్లులు, రికార్డులు సృష్టించి చైర్పర్సన్ అవినీతి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ మేరకు అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్కు ఫిర్యాదు చేయగా మే 26న మున్సిపల్ కార్యాలయానికి వచ్చిన ఆయన రికార్డులను సీజ్ చేసి వెంట తీసుకెళ్లారు. అవినీతి ఆరోపణలపై వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని చైర్ పర్సన్కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఏమైందో తెలియదుగానీ ఎలాంటి చర్యలు చేపట్టలేదు. అనంతరం చైర్పర్సన్పై చర్యలు తీసుకోవాలంటూ అధికార పార్టీ కౌన్సిలర్లు కలెక్టర్ అమయ్కుమార్, మున్సిపల్ మంత్రి కేటీఆర్, సీడీఎంఏ అధికారుల కార్యాలయాల చుట్టూ చక్కర్లు కొట్టినా ఫలితం కనిపించలేదు. దీంతో అధికార చైర్ పర్సన్ అధ్యక్షతన జరిగే కౌన్సిల్ సమావేశాలకు డుమ్మా కొట్టారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట చైర్పర్సన్ అవినీతిపై నిరసన వ్యక్తం చేశారు. అభివృద్ధి పనుల శంకుస్థానలు, ప్రారంభోత్సవాలకు ఎవరివారే అన్నట్లు వ్యవహరించారు. అధికార పార్టీ వైస్ చైర్మన్ ఆకుల యాదగిరితో కౌన్సిలర్లు జతకట్టారు. ఒకే పనిని చైర్పర్సన్, వైస్ చైర్మన్ వేర్వేరుగా చేపట్టడం ప్రారంభించారు. ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. అధికార పార్టీ కౌన్సిలర్ల మద్దతు లేకున్న చైర్ పర్సన్ ఒంటరిగా పలు కార్యక్రమాల్లో పాల్గొంటుండంతో కౌన్సిలర్లకు మింగుడు పడటం లేదు. రూటు మార్చిన కౌన్సిలర్లు చైర్పర్సన్పై ఎన్ని ఫిర్యాదులు చేసినా అధికారికంగా చర్యలు లేకపోవడంతో కౌన్సిలర్లు రూటు మార్చారు. కొత్త ఎత్తుగడలతో ముందుకు సాగుతున్నారు. చైర్పర్సన్పై చర్యలు తీసుకోకుంటే టీఆర్ఎస్ పార్టీకి, కౌన్సిలర్ల పదవులకు రాజీనామాలు చేస్తామని ఏకంగా మంత్రి సబితారెడ్డికి ఎమ్మెల్యే సమక్షంలోనే తెగేసి చెప్పారు. చైర్ పర్సన్ అవినీతి, అక్రమాలతో పార్టీకి, తమకు చెడ్డపేరు వస్తోందని మంత్రి దృష్టికి తెచ్చారు. ఒక్కసారిగా 15 మంది కౌన్సిలర్లు పార్టీకి, పదవులకు రాజీనామా చేస్తే ఆ ప్రభావం తీవ్రంగా ఉంటుందనే కోణంలో అధికార పార్టీ నేతలు ఆలోచనల్లో పడ్డట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే కిషన్రెడ్డి కనుసన్నల్లోనే..! ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డికి కనుసన్నల్లోనే ఈ వ్యవహారం సాగుతోందని పలువురు చర్చించుకుంటున్నారు. ఎమ్మెల్యే మాట కాదని చైర్పర్సన్పై ఫిర్యాదు చేసేంత సాహసానికి కౌన్సిలర్లు ఒడిగట్టరనే వాదన వినిపిస్తోంది. చైర్ పర్సన్ అవినీతి చిట్టా ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చిన తర్వాతే ఫిర్యాదుల పర్వానికి కౌన్సిలర్లు తెరలేపారని.. ఆమె వ్యవహారశైలి కూడా ఎమ్మెల్యేకు నచ్చడం లేదనే చర్చ కొనసాగుతోంది. ఇటీవల కాలంలో చైర్పర్సన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వెళ్లడం లేదని తెలుస్తోంది. రోజురోజుకూ ముదిరిపాకాన పడి తారాస్థాయికి చేరిన మున్సిపాలిటీ వ్యవహారం ఎంత వరకు వెళ్తుందో వేచి చూడాలి. -
ఎమ్మెల్యే రాలేదని జెండా ఆవిష్కరణలో గందరగోళం
కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీలో అధికార పార్టీలో నెలకొన్న విభేదాలు బట్టబయలయ్యాయి. కోదాడ మున్సిపాలిటీలో ఉదయం 8:30కు జెండా ఆవిష్కరణ ఉంటుందని మున్సిపాలిటీ అధికారులు, చైర్పర్సన్ పట్టణంలో ప్రముఖులకు ఆహ్వానాలు పంపారు. ఆ సమయానికే పలువురు మున్సిపాలిటీ కార్యాలయానికి చేరుకోగా ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మాత్రం 9గంటలై నా రాలేదు. దీంతో 9:10 నిమిషాలకు మున్సిపల్ చైర్పర్సన్ వనపర్తి శిరీష కార్యక్రమాన్ని ప్రారంభించగా..ఎమ్మెల్యే వచ్చే వరకు జెండా ఎగుర వేయవద్దని మున్సిపల్ కమిషనర్ అడ్డుతగిలారు. వాగ్వాదాల మధ్యే జెండాను ఆవి ష్కరించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మున్సిపాలిటీకి రాకుండానే పక్కనే ఉన్న గాంధీ పార్కుకు వెళ్లి జాతీయ జెండాను ఆవిష్క రించారు. ఇదే ఆవరణలో ఉన్న కోదాడ గ్రంథాలయం వద్ద జెండా ఆవిష్కరణకు ఎమ్మెల్యే వెళ్లగా అక్కడికి మున్సిపల్ చైర్ పర్సన్ శీరిష కూడా వెళ్లారు. అక్కడ ఆమెను కోదాడ ఎంపీపీ చింతా కవిత, మార్కెట్ చైర్పర్సన్ సుధారాణి నెట్టి వేశారు. దీంతో తనను వేధిస్తు న్నారంటూ మున్సిపల్ చైర్పర్సన్ గాంధీ విగ్రహం ముందు మౌన దీక్షకు దిగారు. -
చిచ్చుపెట్టిన బైక్ర్యాలీ!
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం/కొత్తగూడెం అర్బన్: కొత్తగూడెం గులాబీ పార్టీలో వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. మున్సిపాలిటీలోని రెండు వర్గాలు ఇప్పటివరకు మాటల తూటాలు, విమర్శలకే పరిమితమయ్యాయి. ద్విచక్రవాహన ర్యాలీలో చోటుచేసుకున్న ఘటనతో మరింత వివాదాస్పదంగా మారాయి. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర వైఖరికి నిరసనగా జిల్లావ్యాప్తంగా టీఆర్ఎస్నేతలు శుక్రవారంనాడు ఇళ్లపై నల్లజెండాలు ఎగురవేయడంతో పాటు బైక్ ర్యాలీలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించగా, మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మితో పాటు పాలకవర్గం, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ర్యాలీలో తన తనయుడితో కలిసి కాపు సీతాలక్ష్మి వెళ్తున్న బైక్ను, మాజీ కౌన్సిలర్ యూసుఫ్ వాహనం వెనుకనుంచి ఢీకొట్టడంతో సీతాలక్ష్మి కిందపడిపోయారు. యూసుఫ్ కావాలనే తన వాహనాన్ని ఢీకొట్టారంటూ సీతాలక్ష్మి రోడ్డుపై బైఠాయించారు. పార్టీ నాయకులు కొందరు యూసుఫ్తో వాగ్వాదానికి దిగగా.. ప్రమాదవశాత్తూ జరిగిందంటూ కొందరు యూసుఫ్కు మద్దతుగా నిలిచారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. టూటౌన్ సీఐ రాజు ఇరువర్గాలను సమదాయించి పంపించేశారు. కాగా, చైర్పర్సన్ను ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పరామర్శించారు. ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ ఆమెకు సంఘీభావం తెలిపారు. నేను మహిళను, దండం పెడతా అన్నా.. ‘నేను ప్రయాణిస్తున్న బైక్ను యూసుఫ్ అప్పటికే రెండుసార్లు ఢీకొట్టారు. ‘ఆగన్నా నేను మహిళను.. మీకు దండం పెడతా...’ అని చెప్పినా వినిపించుకోలేదు. అలాగే ముందుకొచ్చాడు. నా కుమారుడికి చెప్పి బండి పక్కకు ఆపి ఇంటికొచ్చేశా. మహిళనని చూడకుండా అగౌరవపరిచారు. చైర్పర్సన్కే రక్షణ లేకుంటే సాధారణ మహిళలు బయటికి ఎలా వస్తారు? యూసుఫ్పై చర్యలు తీసుకోవాలని పార్టీ అధిష్టానంతో పాటు ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లాను’ అంటూ కాపు సీతాలక్ష్మి శుక్రవారం సాయంత్రం ఓ వీడియో విడుదల చేశారు. అనంతరం కొత్తగూడెం టూటౌన్ పోలీస్స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేశారు. కాగా, ‘చైర్పర్సన్ డ్రైవర్ నాగరాజు బండి తొలుత నా వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో అదుపుతప్పి నా బండి చైర్పర్సన్ వాహనాన్ని ఢీకొంది. అంతే తప్ప దురుద్దేశంతో చేయలేదు’అంటూ యూసుఫ్ మరో వీడియోలో స్పందించారు. -
ఏపీలో కొలువుదీరిన పాలకవర్గాలు.. నెల్లూరు మేయర్గా పొట్లూరి స్రవంతి
సాక్షి, అమరావతి: ఇటీవల ఎన్నికలు జరి గిన నెల్లూరు నగరపాలక సంస్థ, 11 ముని సిపాలిటీలు, నగర పంచాయ తీల్లో పాలక వర్గాలు సోమవారం కొలువు దీరాయి. దర్శి మునిసిపాలిటీ మినహా మిగిలిన అన్నిచోట్ల వైఎస్సార్ సీపీ ఆయా పదవుల్ని గెల్చుకుంది. కొండపల్లి పురపాలకసంఘ సమావేశం వాయిదాపడింది. -
కుప్పం మున్సిపల్ చైర్మన్గా డాక్టర్ సుధీర్ ప్రమాణం
కృష్ణా జిల్లా ►జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్గా ఎన్నికైన రంగాపురం రాఘవేంద్ర ►జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్గా 32 ఏళ్ల రాఘవేంద్ర. ►వైస్ చైర్మన్లుగా తుమ్మల ప్రభాకర్, షేక్ హఫీజ్ ఉన్నిస ►చైర్మన్, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లను అభినందించిన ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను. పశ్చిమగోదావరి జిల్లా ►కొలువుదీరిన ఆకివీడు నగర పాలక సంస్థ తొలి పాలక వర్గం ►తొలి నగర పంచాయతీ చైర్ పర్సన్గా జామి హైమావతి ఎన్నిక ►వైస్ చైర్మన్లుగా పుప్పాల సత్యనారాయణ, వంగా జ్యోత్స్నాదేవిలను ఎన్నుకున్న కౌన్సిల్ సభ్యులు ►ఎన్నికకు ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించిన జేసీ హిమాన్షు శుక్లా తూర్పు గోదావరి జిల్లా ఇవాళ ఏజెన్సీ ఎటపాక ఎంపీపీ ఎన్నిక ►టాస్ పద్ధతిలో ఎంపిక నిర్వహించనున్న అధికారులు ►మొత్తం 12 ఎంపీటీసీ స్థానాలకు గాను 6 స్థానాలు గెలుచుకున్న వైఎస్సార్సీపీ, టీడీపీ 4, సీపీఎం 1, సీపీఐ ఒకస్థానం గెలుచుకున్నారు. ►వైఎస్సార్సీపీ, టీడీపీ కూటమికి సమాన స్థానాలు రావడంతో మధ్యాహ్నం మూడు గంటలకు టాస్ పద్ధతిలో ఎంపీపీ ఎంపిక కృష్ణాజిల్లా ►కొండపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నిక రేపటికి వాయిదా ►కేశినేని నాని కోర్డును మభ్యపెట్టి తనకు అనుకూలంగా తీర్పు తెచ్చుకున్నారు ►కోర్టుకు వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉంది ►డివిజన్ బెంచ్ తీర్పు మాకు అనుకూలంగా వస్తుందని ఆశిస్తున్నాం ►చైర్ పర్సన్ ఎన్నిక వాయిదా వేయాలని అధికారులను కోరాం ►మా విజ్ఞప్తి మేరకు అధికారులు ఎన్నికను వాయిదా వేశారు -ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ చిత్తూరు ►కుప్పం మున్సిపల్ చైర్మన్గా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన డాక్టర్ సుధీర్ ప్రమాణ స్వీకారం ►వైస్ చైర్మన్గా అఫీస్, మునిస్వామిలు ప్రమాణం సాక్షి, అమరావతి: ఇటీవల ఎన్నికలు జరిగిన నెల్లూరు నగరపాలకసంస్థ, 12 మునిసిపాలిటీలు/నగర పంచాయతీల్లో మేయర్, చైర్మన్ల ఎన్నిక సోమవారం జరగనుంది. నెల్లూరు కార్పొరేషన్లో 54 డివిజన్లకు ఎన్నికైన కార్పొరేటర్లు ఉదయం 11 గంటలకు సమావేశమై మేయరు, ఇద్దరు డిప్యూటీ మేయర్లను ఎన్నుకున్నారు. అకివీడు (పశ్చిమ గోదావరి జిల్లా), జగ్గయ్యపేట, కొండపల్లి (కృష్ణా), దాచేపల్లి, గురజాల (గుంటూరు), దర్శి (ప్రకాశం), బుచ్చిరెడ్డిపాలెం (నెల్లూరు), బేతంచెర్ల (కర్నూలు), కమలాపురం, రాజంపేట (వైఎస్సార్), పెనుకొండ (అనంతపురం), కుప్పం (చిత్తూరు జిల్లా) మునిసిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఎన్నికైన సభ్యులు ఎక్కడికక్కడ ఉదయం 11 గంటలకు సమావేశమై చైర్మన్, ఇద్దరు వంతున వైస్ చైర్మన్లను ఎన్నుకున్నారు. -
18న మేయర్ల ఎన్నిక
సాక్షి, అమరావతి: నగర పాలక సంస్థల్లో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులతో పాటు మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో చైర్ పర్సన్, వైస్ చైర్పర్సన్ పదవులకు ఈనెల 18న ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ఆ రోజు ఉ.11గంటలకు ఎక్కడికక్కడ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ నిర్ణయించారు. ఏలూరు మినహా 11 నగర పాలక సంస్థలు, 75 మున్సిపాలిటీల్లో పరోక్ష పద్ధతిలో ఈ ఎన్నికలు జరుగుతాయి. 14న జరిగే మున్సి‘పోల్స్’ ఓట్ల లెక్కింపు సందర్భంగా నగర పాలక సంస్థల్లో కార్పొరేటర్లుగా ఎన్నికైన వారు మేయర్, డిప్యూటీ మేయర్లను ఎన్నుకుంటారు. అలాగే, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో వార్డు సభ్యులుగా ఎన్నికైన వారు చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్లను ఎన్నుకుంటారు. ఈ ఎన్నికలను పురస్కరించుకుని ఎన్నికల కమిషన్ ప్రిసైడింగ్ అధికారులను నియమించింది. వీరు ముందుగా విజేతలతో ప్రమాణ స్వీకారం చేయించిన అనంతరం మేయర్, డిప్యూటీ మేయర్, చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ల ఎన్నికలను చేపడతారు. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ఓటు హక్కు ఈ ఎన్నికల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఎక్స్ అఫిషియో హోదాలో ఓటు హక్కు ఉంటుంది. వీరు ముందుగా తమ పేర్లు నమోదు చేసుకోవాలి. ► లోక్సభ సభ్యుడు లేదా ఎమ్మెల్యే తాము గెలిచిన నియోజకవర్గ పరిధిలో ఒకటి కంటే ఎక్కువ పట్టణాలు ఉంటే ఏదో ఒకచోట మాత్రమే ఎక్స్ అఫిషియో సభ్యునిగా తమ పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. వారి నియోజకవర్గ పరిధిలో ఒకటే పట్టణం ఉంటే అందులోనే అతను ఎక్స్ అఫిషియో సభ్యునిగా పరిగణిస్తారు. ► రాజ్యసభ సభ్యునికి మున్సిపాలిటీ ప్రాంతాల్లో ఎక్కడ ఓటు హక్కు కలిగి ఉంటుందో ఆ నగర పాలక సంస్థ లేదంటే మున్సిపాలిటీలో అతనిని ఎక్స్ అఫిషియో సభ్యునిగా గుర్తిస్తారు. ఇక ఎమ్మెల్సీలు కూడా తాము ఎన్నికయ్యే సమయంలో ఏ మున్సిపాలిటీ లేదా నగర పాలక సంస్థలో ఓటు హక్కు కలిగి ఉంటారో అక్కడే అతనిని ఎక్స్ అఫిషియో సభ్యునిగా గుర్తిస్తారు. కోరం ఉంటేనే ఎన్నిక నగర పాలక సంస్థలు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలోని ఓటు హక్కు ఉన్న మొత్తం సభ్యులలో కనీసం సగం మంది 18న జరిగే ప్రత్యేక సమావేశానికి హాజరైతేనే ఆయాచోట్ల మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ల ఎన్నికను నిర్వహిస్తారు. గంట వ్యవధిలో కనీసం సగం మంది సభ్యులు హాజరుకాని పక్షంలో కోరం లేని కారణంగా ఎన్నికను ప్రిసైడింగ్ అధికారి వాయిదా వేస్తారని ఎన్నికల కమిషన్ అధికారులు వెల్లడించారు. విప్ జారీచేసే అధికారం లేని జనసేన ఇదిలా ఉంటే.. ఈ ఎన్నికల్లో గెలుపొందిన తమ అభ్యర్థులకు విప్ జారీచేసే అధికారం ఆయా పార్టీలు కలిగి ఉంటాయి. అధికార వైఎస్సార్సీపీ, తెలుగుదేశంతో సహా జాతీయ స్థాయిలో, వివిధ రాష్ట్రాలలో గుర్తింపు పొందిన మొత్తం 18 రాజకీయ పార్టీలు ఈ ఎన్నికలో విప్ జారీ చెయ్యొచ్చు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆయా రాజకీయ పక్షాలకు లేఖలు రాసింది. కానీ, విప్ జారీచేసే అధికారం ఉన్న పార్టీల జాబితాలో జనసేన లేదు. కేంద్ర ఎన్నికల సంఘం వద్ద గుర్తింపు కలిగిన రాజకీయ పార్టీగా నమోదై ఉండి.. ఆ పార్టీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ వద్ద కూడా నమోదు చేసుకుని ఉంటే అలాంటి పార్టీలకు మాత్రమే ఈ ఎన్నికల్లో విప్ జారీచేసే అధికారం ఉంటుందని ఎన్నికల కమిషన్ వర్గాలు తెలిపాయి. కానీ, రాష్ట్రంలో జనసేన గుర్తింపు కలిగిన రాజకీయ పార్టీ కాదని.. కేవలం రాష్ట్ర ఎన్నికల కమిషన్ వద్ద ప్రత్యేక గుర్తు రిజర్వుడు చేయబడిన రిజిస్టర్డ్ పార్టీ మాత్రమే అయినందున ఆ పార్టీని విప్ జారీచేసే అధికారం ఉన్న పార్టీల జాబితాలో చేర్చలేదని ఆ వర్గాలు వివరించాయి. -
టీడీపీ మాజీ మంత్రి కాల్వ శ్రీనివాస్కు ఎదురుదెబ్బ
-
టీడీపీ మాజీ మంత్రి కాల్వ శ్రీనివాస్కు ఎదురుదెబ్బ
సాక్షి, అనంతపురం: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాయదుర్గంలో టీడీపీ మాజీ మంత్రి కాల్వ శ్రీనివాస్కు ఎదురుదెబ్బ తగిలింది. మున్సిపల్ మాజీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్లు సోమమల్లేషప్ప, నాగప్ప, అరుడప్పలు టీడీపీకి రాజీనామా చేశారు. ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి సమక్షంలో ఆదివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాయదుర్గం పట్టణ 2వవార్డు టీడీపీ అభ్యర్ధి అనుదీపిక కూడా వైఎస్ఆర్సీపీలో చేరారు. వలసలతో పరువు కాపాడుకునేందుకు మాజీ మంత్రి కాల్వ శ్రీనివాస్ పాట్లు పడుతున్నారు. దీంతో మాజీ మంత్రి కాల్వ.. టీడీపీ అభ్యర్ధులను కర్ణాటకకు తరలించారు. సుమారు 30 మందిని రహస్య ప్రాంతాలకు తరలించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్లు విత్డ్రా చేసుకోవద్దంటూ పలువురు టీడీపీ అభ్యర్థులను నిర్బంధించారు. చదవండి: జగన్ మోహన్ రెడ్డి వందశాతం ఉత్తమం: కొట్టేటి శిరీష -
పదవులు ఉండవ్
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 24 నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు ‘పట్టణ ప్రగతి’కార్యక్రమాన్ని.. ‘పల్లె ప్రగతి’పునాదిగా పేదలు ఎక్కువగా నివసించే దళితవాడల నుంచి ప్రారంభించాలని సీఎం కె. చంద్రశేఖర్రావు అధికారులను ఆదేశించారు. మూడు నెలల్లో అన్ని పట్ట ణాలు, నగరాల్లో పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణం, 8 నెలల్లో విద్యుత్ సమస్యలకు పరిష్కారం చూపని ఎమ్మెల్యేలు, మేయర్లు, చైర్పర్సన్లు, కమిషనర్లు బాధ్యత వహించి పదవుల నుంచి తప్పుకోవాల్సి ఉంటుందని తేల్చిచెప్పారు. పట్టణ ప్రగతి నిర్వహణపై ప్రగతి భవన్లో మంగళవారం జరిగిన రాష్ట్ర స్థాయి మున్సిపల్ సదస్సులో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. శాసనసభ్యులు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో పట్టణ ప్రగతిని నిర్వహించాల్సిన తీరుపై సీఎం దిశానిర్దేశం చేశారు. ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలు ఎక్కువగా ఉండే నివాస ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టడంతోపాటు వార్డులవారీగా పట్టణ ప్రగతి ప్రణాళికను రూపొందించుకోవాలన్నారు. నిధుల వినియోగంలో క్రమశిక్షణ పాటించి ప్రణాళికకు అనుగుణంగా ఖర్చు చేయాలన్నారు. పల్లె ప్రగతి సమీక్షలో భాగంగా గ్రామ పర్యటనలపై మండల పంచాయతీ అధికారుల్లో నిర్లక్ష్యంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు, కలెక్టర్లు తమ పరిధిలోని గ్రామాల్లో రాత్రి బస, పాదయాత్ర ద్వారా పల్లె ప్రగతి లక్ష్యాలను సాధించాలన్నారు. బల్దియా.. ఖాయా పీయా చల్దియా ‘మున్సిపాలిటీలు మురికి, చెత్త, అవినీతికి పర్యాయపదాలుగా మారాయి. బల్దియా.. ఖాయా.. పీయా.. చల్దియా అనే సామెతలు వచ్చాయి. పారదర్శక విధానాలతోనే చెడ్డపేరు పోతుంది. ప్రజాప్రతినిధులు డంబాచారాలు పలకొద్దు. అన్ని పనులు ఓవర్ నైట్లో చేసేస్తాం అని మాట్లాడొద్దు. ఫొటోలకు పోజులివ్వడం తగ్గించి పనులు చేయించడంపై దృష్టి పెట్టాలి. ప్రణాళికాబద్ధంగా ఆరు నెలలు కష్టపడితే పట్టణాలు అభివృద్ది సాధిస్తాయి. ఇతర దేశాల విజయగాథలు వినడమే కాదు... మనమూ విజయం సాధించాలి’అని కేసీఆర్ సూచించారు. మంగళవారం ప్రగతిభవన్లో రాష్ట్ర స్థాయి మున్సిపల్ సదస్సులో మాట్లాడుతున్న కేసీఆర్. సదస్సుకు హాజరైన ఎమ్మెల్యేలు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, అధికారులు ప్రతి పట్టణానికి వార్షిక, పంచవర్ష ప్రణాళిక... స్థానిక కౌన్సిలర్లు, కార్పొరేటర్ల భాగస్వామ్యంతో వార్డులు, పట్టణాలవారీగా వార్షిక, పంచవర్ష ప్రణాళికలు తయారు చేయాలని, వార్డులవారీగా నియమించే ప్రజాసంఘాల అభిప్రాయం కూడా తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ప్రతి వార్డుకు శాశ్వత ప్రాతిపదికన స్పెషల్ ఆఫీసర్ను నియమించి స్థానిక అవసరాలపై అంచనాకు రావాలన్నారు. పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, వీధి దీపాలు, గుంతలు లేని రహదారులు, పచ్చదనం, డంప్ యార్డులు, క్రీడా ప్రాంగణాలు, ఓపెన్ జిమ్, శ్మశానవాటికలు, పరిశుభ్రమైన కూరగాయలు, పండ్లు, పూలు, మాంసం మార్కెట్లు తదితరాలను ఆదర్శ పట్టణాలు, నగరాలకు ఉండే ప్రధాన లక్షణాలని సీఎం పేర్కొన్నారు. పట్టణాల్లో కనీస పౌర సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వడంతోపాటు పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణానికి ప్రభుత్వ స్థలాలను వినియోగించే అధికారాన్ని కలెక్టర్లకు కల్పిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. పట్టణ అవసరాలను దృష్టిలో పెట్టుకొని అనువైన స్థలాల ఎంపికతోపాటు అవసరమైన టాయిలెట్ల నిర్మాణాన్ని మూడు నెలల్లో పూర్తి చేయాలని గడువు విధించారు. వీధి వ్యాపారుల కోసం స్ట్రీట్ వెండింగ్ జోన్లు... వీధి వ్యాపారుల కోసం పట్టణాల్లో స్ట్రీట్ వెండింగ్ జోన్ల ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనతోపాటు ప్రత్యామ్నాయ స్థలం కేటాయించే వరకు వారికి ఇబ్బందులు కలగకుండా చూడాలని సీఎం ఆదేశించారు. ఆటోలు, ట్యాక్సీలు, ఇతర ప్రజారవాణా, సరుకు రవాణా వాహనాలకు నిర్దిష్ట ప్రాంతాల్లో పార్కింగ్ సదుపాయం కోసం అవసరమైతే ప్రభుత్వ స్థలాలను వినియోగించే అధికారాన్ని కలెక్టర్లకు ఇస్తున్నామన్నారు. ప్రమాదాలకు తావులేకుండా విద్యుత్ సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు వీలుగా ఒరిగిన, తుప్పు పట్టిన, రోడ్డు మధ్యలో ఉండే స్తంభాలు, ఫుట్పాత్లపై ఉండే ట్రాన్స్ఫార్మర్లను మార్చాలన్నారు. ఇళ్లపై వేలాడే వైర్లను సరిచేయడంతోపాటు పొట్టి స్తంభాలను తొలగించి పెద్ద స్తంభాలు వేసేందుకు అవసరమైన నిధులను బడ్జెట్లో కేటాయిస్తామన్నారు. స్తంభాలు, తీగలు, ట్రాన్స్ఫార్మర్లను విద్యుత్ అధికారులు ముందుగానే సమకూర్చి ఆయా పట్టణాలకు పంపించాలన్నారు. గ్రామాల తరహాలో పట్టణాల్లోనూ మొక్కల పెంపు బాధ్యతను కౌన్సిలర్లు, కార్పొరేటర్లుతీసుకోవాలని, పట్టణ అవసరాల కోసం నర్సరీలు ఏర్పాటు చేయాలన్నారు. ఇంటి నుంచి చెత్త సేకరణకు రాష్ట్రవ్యాప్తంగా 3,100 వాహనాలకుగాను ఇప్పటికే 600 వాహనాలు కొనుగోలు చేసినట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. డ్రైనేజీలు శుభ్రం చేసేందుకు అందుబాటులోకి వచ్చిన యంత్రాలను కొనుగోలు చేయాలన్నారు. పట్టణాలకు ప్రతినెలా నిధులు... ఇతర ఖర్చులను తగ్గించుకొని పట్టణాలకు ప్రతి నెలా రూ. 148 కోట్ల ఆర్థిక సంఘం నిధులు ఇస్తామని, వాటిని ఖర్చు చేసేందుకు ఆర్థిక ప్రణాళిక రూపొందించుకోవాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు. మున్సిపాలిటీల అప్పులకు సంబంధించిన కిస్తీ చెల్లింపు, ఉద్యోగుల జీతభత్యాలు, కరెంటు బిల్లులు, మంచినీటి బిల్లులను ప్రతి నెలా కచ్చితంగా చెల్లించే బాధ్యత కమిషనర్లు తీసుకోవడంతోపాటు పచ్చదనం కోసం 10 శాతం నిధులు కేటాయించాలన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అభివృద్ధి నిధులను కూడా పట్టణ ప్రగతికి వినియోగించాలన్నారు. కొత్త మున్సిపల్ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలని, అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలపై నమ్మకాన్ని పెడుతూ ఇళ్ల నిర్మాణం, లే అవుట్ల విషయంలో సులభతర అనుమతుల విధానం తెచ్చామన్నారు. అక్రమ నిర్మాణాలను నిర్ధాక్షిణ్యంగా కూల్చేస్తామని ప్రజలకు స్పష్టంగా చెప్పాలన్నారు. జీవో నంబర్ 58, 59 ద్వారా గతంలో పట్టణాల్లోని ప్రభుత్వ స్థలాల్లో నిర్మించిన ఇళ్లను క్రమబద్ధీకరించినట్లే అన్ని మున్సిపాలిటీల్లో మరో అవకాశం ఇచ్చే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని సీఎం వెల్లడించారు. సంపూర్ణ అక్షరాస్యత కోసం కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కూడా బాధ్యత తీసుకోవాలని సీఎం ఆదేశించారు. సదస్సులో భాగంగా మేయర్లు, చైర్పర్సన్లతో ముఖాముఖి నిర్వహించిన సీఎం కేసీఆర్.. వారి సందేహాలను నివృత్తి చేశారు. ఆదర్శ నగరాలుగా మార్చే బాధ్యత మీదే... రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, నగరాలను దేశంలోకెల్లా ఆదర్శంగా మార్చే బాధ్యత కొత్తగా ఎన్నికైన మేయర్లు, చైర్పర్సన్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లపై ఉందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు అన్నారు. ఒకప్పుడు కష్టం, త్యాగాలతో కూడిన రాజకీయాలు ఉండేవని, బ్రిటిష్ పాలన తర్వాత దేశంలో సౌకర్యవంతమైన రాజకీయాలు వచ్చాయన్నారు. ‘జాతి నిర్మాణంలో తమ పాత్రను గుర్తెరిగి పనిచేసే వారికి మంచిపేరు వస్తుంది. ప్రజానాయకులుగా ఎదిగితే అది జీవితానికి మంచి సాఫల్యం. అధికారం, హోదా వచ్చాక మనిషి మారకూడదు. లేని గొప్పతనాన్ని, ఆడంబరాన్ని తెచ్చుకోకూడదు’అని సీఎం హితవు పలికారు. ‘ఐదు కోట్ల మందిలో 140 మందికే మేయర్లు, చైర్పర్సన్లు అయ్యే అవకాశం వచ్చింది. దీన్ని ఒక ముందడుగుగా స్వీకరించి సానుకూలంగా మార్చుకోగలిగితే ప్రజాజీవితంలో ఎంత ముందుకైనా పోవచ్చు. ప్రజలు నన్ను రెండు సార్లు సీఎంను చేశారు. నా వరకైతే గెలిచేంత వరకే రాజకీయం. ఆ తర్వాత కాదు. ప్రభుత్వ పథకాల అమలు తీరు చూస్తే అది అర్థం అవుతుంది. ఒక్కసారి నాయకుడి మీద విశ్వాసం కలిగితే ప్రజలు సంపూర్ణంగా సహకరిస్తారు. సంకల్పం గట్టిగా ఉంటే 100 శాతం విజయం సాధిస్తారు’అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్రెడ్డి, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, పట్టణ పరిపాలన కమిషనర్ సత్యనారాయణ సైతం పాల్గొన్నారు. -
ఆ బాధ్యత మీదే : సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలోని అన్ని పట్టణాలు, నగరాలను దేశంలోకెల్లా ఆదర్శ పట్టణాలుగా మార్చే గురుతర బాధ్యత కొత్తగా ఎన్నికైన మేయర్లు, చైర్ పర్సన్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్ల పై ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. మంగళవారం ప్రగతి భవన్ లో జరిగిన రాష్ట్ర స్థాయి మున్సిపల్ సమ్మేళనంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాప్రతినిధులకు కర్తవ్యబోధ చేశారు. రాజకీయ నాయకుల ప్రవర్తన ఎలా ఉండాలో సోదాహరణంగా వివరించారు. సీఎం కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. హోదా వచ్చినాక మనిషి మారకూడదు ‘మీ కర్తవ్యాన్ని నిర్వహించడంలో మీరు విజయాన్ని సాధించాలి. ప్రజా జీవితంలో అనేక రకాల అనుభవాలుంటాయి. దేశంలో, రాష్ట్రంలో ప్రస్తుతమున్న పరిస్థితుల్లో రాజకీయాలు చాలా సులభం అయిపోయాయి. ఒకప్పుడు రాజకీయాలంటే కష్టంతో, త్యాగంతో కూడుకున్నటువంటివి. బ్రిటిష్ వారి వలస పాలన తర్వాత స్వతంత్ర భారతంలో సౌకర్యవంతమైన రాజకీయాలు వచ్చాయి. అప్పట్లో ఆత్మార్పణ, త్యాగం అయితే నేడు స్వేచ్ఛా భారతంలో ఉన్నాం. జాతి నిర్మాణ రంగంలో మనమంతా మమేకమైపోయాం. దీన్ని గుర్తెరిగి పనిచేసే వారికి మంచి పేరు వస్తుంది. ప్రజా నాయకులుగా ఎదిగితే, అది జీవితానికి మంచి సాఫల్యం. అధికారం, హోదా వచ్చినాక మనిషి మారకూడదు. లేని గొప్పతనాన్ని, ఆడంబరాన్ని తెచ్చుకోవద్దు. ఐదు కోట్ల మందిలో 140 మందికే మేయర్లు, చైర్ పర్సన్లు అయ్యే అవకాశం వచ్చింది. దీన్ని ఒక ముందడుగు స్వీకరించి, సానుకూలంగా మార్చుకోగలిగితే ప్రజా జీవితంలో ఎంత ముందుకైనా పోవచ్చు. అది మీ చేతుల్లోనే ఉంది. విధి నిర్వహణలో విఫలం కావద్దు. గెలిచేంత వరకే రాజకీయం, తర్వాత కాదు పదవి అసిధారావ్రతం (కత్తిమీద సాము) లాంటిది. ప్రజా జీవితం అంత సులభం కాదు. సోయి తప్పి పని చేయవద్దు. చాలా కష్టపడి రాష్ట్రం తెచ్చుకున్నాం. మన రాష్ట్రం వస్తే మనం బాగుపడతామని ప్రబలంగా పోరాడాం. ప్రజలు నన్ను రెండు సార్లు సిఎం చేశారు. నా వరకైతే గెలిచేంత వరకే రాజకీయం, తర్వాత కాదు. ప్రభుత్వ పథకాల అమలు చూస్తే అది అర్థం అవుతుంది. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ లాంటి పథకాలు అన్ని గ్రామాల్లో వివక్ష లేకుండా అమలు చేశాం. ప్రజలంతా మనవాళ్లే అనుకున్నాం. ఏ పని చేయాలన్నా తదేక దీక్షతో చేయాలి. ఇప్పటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులే రేపటి నాయకులు చాలా మందికి ఆత్మవిశ్వాసం తక్కువ ఉంటుంది. అలా ఉండకూడదు. అవగాహతో అర్థం చేసుకుని, చేయాలని అనుకుంటేనే బాధ్యత తీసుకోవాలి. పట్టుదల ఉంటేనే విజయం సాధిస్తారు. మీ మీద ప్రజలకు నమ్మకం కలగాలి. అలా ఒక్కసారి నాయకుడి మీద విశ్వాసం కలిగితే, ప్రజలు సంపూర్ణంగా సహకరిస్తారు. ప్రజాశక్తిని మనం సమీకృతం చేయగలిగితే మనం గొప్ప ఫలితాలు సాధిస్తాం. ఇప్పుడు ఎన్నికైన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులే రేపటి నాయకులు అవుతారు. మీరంతా ధీరులు కావాలి. సంకల్పం గట్టిగా ఉంటే వందశాతం విజయం సాధిస్తారు. మున్సిపాలిటీ అంటేనే అవినీతికి కేరాఫ్ అయింది మున్సిపాలిటీ అంటేనే మురికికి, చెత్తకు పర్యాయపదంగా మారింది. అవినీతికి మారుపేరు అయింది. బల్దియా .. ఖాయా పీయా చల్దియా అనే సామెతలు వచ్చాయి. ఆ చెడ్డ పేరు పోవాలంటే పారదర్శకమైన విధానాలు అవలంభించాలి. అవినీతి రహిత వ్యవస్థ ఉండాలి. పట్టణ ప్రగతి ప్రణాళికా బద్ధంగా ఉండాలి. అది మీ చేతుల్లో ఉంది. మన పట్టణాలను మనమే మార్చుకోవాలి ప్రజాప్రతినిధులు డంబాచారాలు పలకవద్దు. అన్ని పనులు ఓవర్ నైట్ లో చేసేస్తాం అని మాట్లాడవద్దు. ఏం చేయాలనే విషయంలో పక్కా ప్లానింగ్ వేసుకోవాలి. మంచి అవగాహన ఏర్పరచుకోవాలి. సమగ్ర కార్యాచరణను రచించుకుని రంగంలోకి దిగాలి. అందరినీ కలుపుకుని పోయి, ప్రజల భాగస్వామ్యంతో అనుకున్న విధంగా పట్టణాలను తీర్చిదిద్దాలి. ఫోటోలకు ఫోజులివ్వడం తగ్గించి, పనులు చేయించడంపై ఎక్కువ దృష్టి పెట్టాలి. సరిగ్గా అనుకుని ఆరు నెలలు కష్టపడితే పట్టణాలు మంచి దారి పడతాయి. ప్రగతి నిరోధక శక్తులు ఎప్పుడూ ప్రతిబంధకంగా ఉంటూనే ఉంటాయి. వాటిని అధిగమించాలి. ఎప్పుడూ ఇతర దేశాల విజయగాథలు వినడమే కాదు. మనమూ విజయం సాధించాలి. మన పట్టణాలను మనమే మార్చుకోవాలి’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. -
దాదాపు 30 ఏళ్ల తర్వాత తొలిసారిగా..
సాక్షి, హుస్నాబాద్: హుస్నాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ పీఠాన్ని మొట్ట మొదటిసారిగా బీసీ మహిళనే వరించింది. అందరి అంచనాలను తలకిందులయ్యాయి. మొదటి నుంచి చైర్ పర్సన్ మహిళకే దక్కుతుంది అనుకున్నప్పటికీ జనరల్ మహిళా స్థానంలో బీసీ మహిళకు కట్టబెట్టారు. వైస్ చైర్ పర్సన్ పదవిని పురుషుడికి అప్పగిస్తారని భావిస్తే అన్యూహంగా వైస్ చైర్ పర్సన్ పదవిని సైతం మహిళకు అప్పగించడం హుస్నాబాద్ చరిత్రలో ఇదే మొదటిసారి. దీంతో దాదాపు 30ఏళ్ల తర్వాత అతివలు పాలించే అవకాశం దక్కింది. 20 మంది వార్డు మెంబర్లకు ఇందులో 11 మంది మహిళలే కావడం, అందులో చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ పదవులు మహిళలనే వరించడంతో మున్సిపల్లో మహిళా సాధికారత వెళ్లివిరియనుంది. మున్సిపల్ నూతన పాలకవర్గం సోమవారం కొలువుదీరింది. ఇక ముందుగా టీఆర్ఎస్కు చెందిన 9 మంది, కాంగ్రెస్కు చెందిన 6 మంది, బీజేపీకి చెందిన ఇద్దరు సభ్యులు, ఇండిపెంటెండెంట్కు చెందిన ముగ్గురు సభ్యులచే ఆర్డీఓ జయచంద్రారెడ్డి ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నిక ప్రక్రియను ఆర్డీఓ ప్రారంభించారు. ఇంతలోనే బీజేపీ సభ్యులు దొడ్డి శ్రీనివాస్, మ్యాదరబోయిన వేణులు తమకు పూర్తి స్థాయి సంఖ్యా బలం లేదని, చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ ఎన్నిక సమావేశాన్ని బహిష్కరించారు. మున్సిపల్ చైర్ పర్సన్గా ఆకుల రజిత... మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నికలో భాగంగా కోరం ఉన్నందున ఎన్నికల ప్రక్రియను ఆర్డీఓ జయచంద్రారెడ్డి ప్రారంభించారు. టీఆర్ఎస్ నుంచి చైర్ పర్సన్ అభ్యర్థిగా ఆకుల రజిత, కాంగ్రెస్ నుంచి చిత్తారి పద్మకు భీపాంలు అందటంతో ఆల్ఫా బెటికల్ ప్రకారంగా కాంగ్రెస్ పార్టీకి బలం నిరూపించుకునేందుకు అవకాశం కల్పించారు. కాంగ్రెస్ పార్టీ చైర్ పర్సన్ అభ్యర్థిగా చిత్తారి పద్మను కాంగ్రెస్ సభ్యుడు మ్యాదరబోయిన శ్రీనివాస్ ప్రతిపాధించగా, వల్లపు రాజయ్య బలపరిచారు. అనంతరం టీఆర్ఎస్ చైర్ పర్సన్గా అభ్యర్థిగా ఆకుల రజితను టీఆర్ఎస్ సభ్యురాలు వాల సుప్రజ ప్రతిపాదించగా, మరో సభ్యుడు పెరుక భాగ్యరెడ్డి బలపరిచాడు. అలాగే ఇండిపెంటెండెంట్ చైర్పర్సన్ అభ్యర్థిగా జనగామ రత్నను కాంగ్రెస్ సభ్యురాలు పున్న లావణ్య ప్రతిపాదించగా, భూక్య స్వరూప బలపర్చారు. కాంగ్రెస్ అభ్యర్థి, ఇండిపెండెంట్ అభ్యర్థి చైర్ పర్సన్లుగా కాంగ్రెస్ సభ్యులే ప్రతిపాదించి బలపర్చగా, మొదటగా ప్రతిపాదించిన కాంగ్రెస్ అభ్యర్థి చిత్తారి పద్మనే పరిగణనలోకి తీసుకుంటామని ఆర్డీఓ స్ఫష్టం చేశారు. అనంతరం ఎన్నిక నిర్వహించారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ చైర్ పర్సన్గా ఆకుల రజితకు మద్దతుగా టీఆర్ఎస్కు చెందిన 9 మంది, ఇండిపెంటెండెంట్లు ఇద్దరు, ఎక్స్ అఫియోసభ్యుడు ఎమ్మెల్యే సతీష్కుమార్లు మొత్తం 12 సభ్యులు చేతులు లేపి మద్దతు తెలిపారు. అలాగే కాంగ్రెస్ అభ్యర్థి చిత్తారి పద్మకు కాంగ్రెస్కు చెందిన 6గురు, ఇండిపెంటెండెంట్ అభ్యర్థి జనగామ రత్నలు చేతులెత్తి మద్దతు పలికారు. దీంతో రజితకు 12 మంది మద్దతు పలుకగా, పద్మకు 7గురు మద్దతు తెలిపారు. దీంతో ఎన్నికల అధికారి ఆర్డీఓ అత్యధిక సభ్యులు రజితకు మద్దతు తెలుపడంతో మున్సిపల్ చైర్ పర్సన్గా ఆకుల రజిత ఎన్నికైనట్లు ప్రకటించారు. మున్సిపల్ వైస్ చైర్ పర్సన్గా అయిలేని అనిత మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ ఎన్నికలు నిర్వహించారు. ఇందులో ముందుగా పార్టీని ఆహ్వానించగా, వైస్ చైర్మన్ అయిలేని అనితను టీఆర్ఎస్ సభ్యురాలు కొంకట నళినీదేవి ప్రతిపాధించగా, బొజ్జహరీశ్ బలపర్చారు. అలాగే కాంగ్రెస్ నుంచి చైర్ పర్సన్గా కోమటి స్వర్ణలతను మ్యాదరబోయిన శ్రీనివాస్ ప్రతిపాధించగా, వల్లపు రాజయ్య బలపరిచారు. అనంతరం ఎన్నిక నిర్వహించగా, టీఆర్ఎస్కు చెందిన అయిలేని అనితకు 9 మంది టీఆర్ఎస్ సభ్యులు, ఇద్దరు ఇండిపెంటెండెంట్ సభ్యులు, ఒకరు ఎక్స్ అఫిషియో సభ్యుడు మొత్తం 12 మంది సభ్యులు చేతులేత్తి మద్దతు పలికారు. కోమటి స్వర్ణలతకు కాంగ్రెస్ 6గురు సభ్యులు, ఇండిపెంటెండెంట్ ఒకరు చేతుతెత్తి మద్దతు తెలిపారు. దీంతో టీఆర్ఎస్ అభ్యర్థి అయిలేని అనితకు 12 మంది, కాంగ్రెస్ అభ్యర్థి కోమటి స్వర్ణలతకు 7గురు మద్దతు తెలిపారు. అత్యధికంగా సభ్యులు మద్దతు ఉన్న అనిత మున్సిపల్ వైస్ చైర్ పర్సన్గా ఎన్నికైనట్లు ఆర్డీఓ ప్రకటించారు. అనంతరం మున్సిపల్ చైర్ పర్సన్గా ఆకుల రజిత, వైస్ చైర్పర్సన్గా అయిలేని అనితలచే ఆర్డీఓ ప్రమాణ స్వీకారం చేయించారు. వాల సుప్రజా నవీన్రావును అభినందిస్తున్న ఎమ్మెల్యే సతీశ్బాబు అత్యధిక మెజార్టీ సాధించిన వాల సుప్రజ.. హుస్నాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో మహిళా అభ్యర్థులు సత్తా చాటారు. ఇక మున్సిపాలిటీలోని 20వ వార్డు అభ్యర్థినిగా టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన వాల సుప్రజా నవీన్రావు భారీ మెజార్టీ సాధించారు. ప్రత్యర్థి అభ్యర్థిపై ఏకంగా 84.5 శాతం మెజార్టీ సాధించి సిద్దిపేట జిల్లాలోనే అత్యధిక మెజార్టీ సాధించిన అభ్యర్థినిగా నిలిచారు. టీఆర్ఎస్ చైర్ పర్సన్గా అభ్యర్థిగా ఆకుల రజితను టీఆర్ఎస్ సభ్యురాలు వాల సుప్రజ ప్రతిపాదించారు. -
వరంగల్ : అన్ని మున్సిపాలిటీలు గులాబీవే
సాక్షి, వరంగల్ : వరంగల్ ఉమ్మడి జిల్లాలో మరోసారి టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. అన్ని మున్సిపాలిటీల చైర్మన్, వైస్ చైర్మన్ స్థానాలు ఆ పార్టీ సొంతమయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల నుంచి మండల, జెడ్పీ ఎన్నికల వరకు విజయ పరంపర కొనసాగించిన టీఆర్ఎస్... ‘పుర’ ఎన్నికల్లోనూ అదే ఊపు కనబర్చింది. మొత్తం తొమ్మిది మున్సి పాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల ను సొంతం చేసుకోవడం ద్వారా అధికా ర టీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా ఎగురవేసింది. ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేష న్ వెలువడిన రోజు నుంచి టీఆర్ఎస్ అధి ష్టానం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యులకు ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేసింది. గెలుపే లక్ష్యంగా అమలుచేసిన వ్యూహప్రతివ్యూహా లు, తీసుకున్న జాగ్రత్తలతో ఉమ్మడి జిల్లాలో ఫలితాలు ఏకపక్షంగా వచ్చాయి. కొన్ని మార్పులు మినహా... మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్, నామి నేషన్ల ప్రక్రియ మొదలు.. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల వరకు అంతా ఊహించి నట్లుగానే జరిగింది. ఈ ఎన్నికలు ప్రధానంగా టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్యే ఉంటాయని ప్రచారం జరిగినప్పటికీ... టీఆర్ఎస్ పార్టీకి పూర్తిగా అనుకూలించాయి. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు, ముఖ్యులు, ఇన్చార్జీలు ఈ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించగా.. ఫలితాలు సానుకూలంగా వచ్చాయి. అయితే చైర్మన్, వైస్ చైర్మన్ల విషయంలో అక్కడక్కడ ఉత్కంఠ నెలకొన్నా మొదటి నుంచి ప్రయత్నాల్లో ఉన్న వారినే పదవులు వరించాయి. వరంగల్ రూరల్ జిల్లాలోని పరకాల మున్సిపల్ చైర్మన్గా సోదా అనిత ఎన్నిక కాగా, వైస్ చైర్మన్గా రేగూరి జైపాల్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వర్ధన్నపేట కొత్త మున్సిపాలిటీ తొలి చైర్మన్గా అంగోతు అరుణ, వైస్ చైర్మన్గా కొమండ్ల ఏలందర్రెడ్డికి అవకాశం దక్కింది. నర్సంపేట మున్సిపల్ చైర్మన్గా మాత్రం మొదటి నుంచి రుద్ర మల్లేశ్వరి, నాగిశెట్టి పద్మ పేర్లు వినపడగా, ఆది నుంచి ఉద్యమంలో కలిసి నడిచిన గుంటి కిషన్ భార్య గుంటి రజనికి ఆ పీఠం అప్పగించారు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా రజనికే అవకాశం కల్పించిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి మరోసారి ఉద్యమం నుంచి వచ్చిన నేతగా తన నేపథ్యాన్ని చాటుకున్నారు. వైస్ చైర్మన్గా మునిగాల వెంకటరెడ్డి ఎన్నికయ్యారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ చైర్మన్ గుగులోతు సింధూర, వైస్ చైర్మన్గా ముదిరెడ్డి బుచ్చిరెడ్డి, మహబూబాబాద్ మున్సిపల్ చైర్మన్గా డాక్టర్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్గా మహ్మద్ ఫరీద్ ఎన్నికయ్యారు. డోర్నకల్ మున్సిపాలిటీ చైర్మన్గా వాంకుడోతు వీరన్న, వైస్ చైర్మన్గా కేశబోయిన కోటిలింగం, తొర్రూరు మున్సిపాలిటీ చైర్మన్గా మంగళంపల్లి రామచంద్రయ్య, వైస్ చైర్మన్గా జీనుగ సురేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. భూపాలపల్లి మున్సిపల్ చైర్మన్గా సెగ్గం వెంకటరాణి ఎన్నిక కాగా, వైస్ చైర్మన్ గండ్ర హరీష్రెడ్డి పేరు వినిపించింది. చివరి నిముషంలో వైస్ చైర్మన్గా కొత్త హరిబాబుకు అవకాశం కల్పించారు. జనగామపై కొంత ఉత్కంఠ నెలకొన్నా.. ఆ మున్సిపాలిటీ నుంచి చైర్మ్న్గా టీఆర్ఎస్కు చెందిన పోకల జమున ఎన్నిక కాగా, వైస్ చైర్మన్గా మేకల రాంప్రసాద్ ఎన్నికయ్యారు. ప్రశంసల జల్లు ఒక్కటి ఓడినా పదవి ఊడుతుంది.. అని హెచ్చరికలు వచ్చినా, ఫలితాల తర్వాత వరంగల్ ఉమ్మడి జిల్లా టీఆర్ఎస్ నేతలకు అధిష్టానం నుంచి ప్రశంసలు దక్కాయి. ఒక్క జనగామ మున్సిపాలిటీ వార్డుల ఎన్నికల సందర్బంగా అక్కడి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించలేదని, అందువల్లే ఫలితాలు ‘హంగ్’ దిశగా వచ్చాయన్న అభిప్రాయం వ్యక్తం చేసిన అధిష్టానం సీనియర్లను రంగంలోకి దింపి చైర్మన్, వైస్ చైర్మన్ పదవులనుపార్టీ ఖాతాలో వేసుకుంది. ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ విడుదల నుంచి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల వరకు గెలుపు కోసం పని చేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యులను టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అభినందించారు. ఈ మేరకు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, సీనియర్ ఎమ్మెల్యేలు డీఎస్.రెడ్యానాయక్, చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి తదితరులతో ఫోన్లో మాట్లాడినట్లు తెలిపారు. ఈ ఎన్నికల్లో పని చేసిన ఇన్చారి్జలు, జెడ్పీ చైర్మన్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ కేడర్కు అభినందన పత్రాలు కూడా పంపిస్తామని పేర్కొన్నట్లు సమాచారం. కాగా తొమ్మిది మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికల సందర్భంగా సోమవారం పోలీసులు గట్టి బందోబస్తు, భద్రత ఏర్పాటు చేయగా, ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. -
సిద్దిపేట 'గులాబీ' పురం
సాక్షి, సిద్దిపేట : మున్సిపల్ ఎన్నికల్లోని చివరి ఘట్టం సోమవారం ముగిసింది. గజ్వేల్, హుస్నాబాద్, దుబ్బాక, చేర్యాల మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. దుబ్బాక, చేర్యాల పాలక మండలి ఎన్నిక ఏకగ్రీవం కాగా.. హుస్నాబాద్లో ఎమ్మెల్యే ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఓటు వేయడంతో చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు టీఆర్ఎస్ అభ్యర్థులకు దక్కాయి. గజ్వేల్లో చివరి నిమిషంలో చైర్మన్ అభ్యరి్థని మార్చడంతో ఆగ్రహించిన అభ్యర్థి ఒంటేరు నారాయణరెడ్డి మున్సిపల్ కౌన్సిలర్ పదవికి, టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. పలు నాటకీయ పరిణామాల మధ్య నాలుగు మున్సిపాలిటీల్లోనూ చైర్మన్, వైఎస్ చైర్మన్ పదవులు టీఆర్ఎస్ అభ్యర్థులు దక్కించుకున్నారు. అన్ని చోట్లా ఉదయం 10 గంటలకు స్థానిక ఎన్నికల అధికారి వార్డు సభ్యలతో ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకున్నారు. గజ్వేల్ మున్సిపాలిటీ చైర్మన్గా 18వ వార్డులో గెలుపొందిన నేతి చిన్న రాజమౌళిని 14వ వార్డు కౌన్సిలర్ అలువాల బాలేష్ ప్రతిపాదించారు. 1వ వార్డు కౌన్సిలర్ బొగ్గుల చందు మద్దతు తెలిపి బలపరిచారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో మొత్తం 20 మంది కౌన్సిలర్లకు గాను కాంగ్రెస్ అభ్యరి్థతోపాటు, 12వ వార్డు కౌన్సిలర్ ఒంటేరు నారాయణరెడ్డి ఓటింగ్లో పాల్గొనలేదు. దీంతో మిగిలిన 18 మంది మద్దతుతో చిన్నరాజమౌళిని చైర్మన్గా గెలుపొందినట్లు ఎన్నికల అధికారి కృష్ణారెడ్డి ప్రకటించారు. అదేవిధంగా వైస్ చైర్మన్గా 8వ వార్డు నుంచి గెలిచిన జకీరోద్దిన్ను 15వ వార్డు కౌన్సిలర్ ఉప్పల మెట్టయ్య ప్రతిపాదించగా 4వ వార్డు కౌన్సిలర్గా గెలుపొందిన స్వతంత్ర అభ్యర్థి పంబాల అర్చన బలపర్చారు. ఈయనకు కూడా 18 మంది మద్దతు తెలపడంతో వైఎస్ చైర్మన్గా ఎన్నికయ్యారు. దుబ్బాకలో ఏకగ్రీవం.. దుబ్బాక మున్సిపాలిటీ చైర్మన్గా 18వ వార్డు కౌన్సిలర్ గన్నె వనితను మూడో వార్డు కౌన్సిలర్ మట్ట మల్లారెడ్డి ప్రతిపాదించగా నాలుగో వార్డు కౌన్సిలర్ ఇల్లందుల శ్రీనివాస్ బలపరిచారు. అయితే ఇతర పారీ్టల నుంచి ఎవరూ పోటీ లేకపోవడంతో చైర్మన్, వైస్ చైర్మన్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. హుస్నాబాద్లో రసవత్తరం.. హుస్నాబాద్లో మొత్తం 20 వార్డులకు గాను తొమ్మిది టీఆర్ఎస్, ఆరు కాంగ్రెస్, రెండు బీజేపీ, ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు గెలిచారు. దీంతో చైర్మన్, వైఎస్ చైర్మన్ ఎన్నిక రసవత్తరంగా మారింది. టీఆర్ఎస్ చైర్మన్ అభ్యరి్థగా 15వ వార్డు నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన ఆకుల రజిత పేరును 20 వార్డు కౌన్సిలర్ వాలా సుప్రజ ప్రతిపాదించారు. 5వ వార్డు కౌన్సిలర్ పెరుక భాగిరెడ్డి బలపరిచారు. కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అభ్యరి్థగా ఏడో వార్డు కౌన్సిలర్ చిత్తారి పద్మ పేరును 8వ వార్డు కౌన్సిలర్ మ్యాదరబోయిన శ్రీనివాస్ ప్రతిపాదించగా 17వ వార్డు కౌన్సిలర్ వల్లపు రాజయ్య బలపర్చారు. అయితే టీఆర్ఎస్ కౌన్సిలర్లు 9 మందితోపాటు, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచిన కౌన్సిలర్లులకు తోడుగా స్థానిక ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ తన ఎక్స్అఫిషియో సభ్యునిగా ఓటు వేశారు. దీంతో 12 మంది మద్దతు టీఆర్ఎస్ చైర్మన్ అభ్యర్థికి లభించింది. బీజేపీ నుంచి గెలిచిన ఇద్దరు అభ్యర్థులు పోలింగ్లో పాల్గొనలేదు. దీంతో మెజార్టీ ఓట్లు పొందిన టీఆర్ఎస్ అభ్యర్థి ఆకుల రజితను చైర్మన్గా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి జయచంద్రారెడ్డి ప్రకటించారు. అదేవిధంగా వైఎస్ చైర్మన్గా టీఆర్ఎస్ అభ్యర్థి నాలుగో వార్డు కౌన్సిలర్ ఐలేని అనిత పేరును ఒకటో వార్డు కౌన్సిలర్ కొంకట నళినీదేవి ప్రతిపాదించారు. 19వ వార్డు కౌన్సిలర్ బొజ్జ హరీశ్ బలపరిచారు. కాంగ్రెస్ వైఎస్ చైర్మన్ అభ్యర్థి మూడో వార్డు కౌన్సిలర్ కోమటి స్వర్ణలత పేరును 8వ వార్డు కౌన్సిలర్ మ్యాదరబోయిన శ్రీనివాస్ ప్రతిపాదించగా, 17వ వార్డు కౌన్సిలర్ వల్లపు రాజయ్య బలపరిచారు. టీఆర్ఎస్ అభ్యర్థికి టీఆర్ఎస్ సభ్యులతోపాటు ఇద్దరు స్వతంత్ర అభ్యర్థుల మద్దతు లభించింది. వీరికి ఎక్స్అఫీíÙయో ఓటు ఎమ్మెల్యే వేయడంతో మొత్తం 12 మంది మద్దతుతో వైస్చైర్మన్ ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి తెలిపారు. చేర్యాలలో ఉత్కంఠకు తెర టీఆర్ఎస్, కాంగ్రెస్లు సముజ్జయిలుగా గెలిచిన చేర్యాల మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. అయితే స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచిన నిమ్మ రాజీవ్రెడ్డి, జుభేదా ఖతూంలు చైర్మన్ ఎన్నికకు ముందుగానే టీఆర్ఎస్లో చేరినట్లు ప్రకటించారు. దీంతో ఉత్కంఠకు తెరపడింది. టీఆర్ఎస్ చైర్మన్ అభ్యరి్థగా ఒకటవ వార్డు కౌన్సిలర్ అంకుగారి స్వరూపారాణి పేరును 12వ వార్డు కౌన్సిలర్ పచ్చిమడ్ల సతీష్ ప్రతిపాదించగా ఐదవ వార్డు కౌన్సిలర్ ఆడెపు నరేందర్ బలపరిచారు. వైస్ చైర్మన్గా నాలుగో వార్డు కౌన్సిలర్ నిమ్మ రాజీవ్రెడ్డి పేరును 12వ వార్డు కౌన్సిలర్ పచిమడ్ల సతీష్ ప్రతిపాదించగా ఐదో వార్డు కౌన్సిలర్ ఆడెపు నరేందర్ బలపరిచారు. కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనక పోవడంతో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు స్వరూపారాణి చైర్మన్గా రాజీవ్రెడ్డి వైస్ చైర్మన్గా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి శ్రవణ్కుమార్ ప్రకటించారు. ఆఖరి క్షణంలో మార్పు.. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో చైర్మన్ అభ్యర్థుల పేర్లు ఎప్పటికప్పుడు మార్పు చెందుతూ వచ్చాయి. నామినేషన్ల ప్రక్రియ మొదలైన నాటి నుంచి గజ్వేల్ మున్సిపాలిటీ చైర్మన్ అభ్యరి్థగా ఒంటేరు నారాయణరెడ్డి పేరు ప్రచారం జరిగింది. ఊహించినట్లుగానే గజ్వేల్ మున్సిపాలిటీలో అత్యధిక కౌన్సిలర్లు టీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారు. వీరికి ఐదుగురు స్వతంత్ర అభ్యర్థులు కూడా మద్దతు ప్రకటించారు. దీంతో ఒంటేరు నారాయణరెడ్డి చైర్మన్ పదవి ఖాయం అని అందరు భావించారు. అయితే ఎన్నిక జరిగిన సోమవారం మాత్రం అంతా తారుమారైంది. ఒక్కసారిగా చైర్మన్ అభ్యర్థిగా నేతి చిన్న రాజమౌళి పేరు తెరమీదికి వచి్చంది. పార్టీ అభ్యర్థిగా ప్రకటించడంతో అందరూ ఆయనకే మద్దతు తెలిపి రాజమౌళిని చైర్మన్గా ఎన్నుకున్నారు. దీంతో ఖంగుతిన్న నారాయణరెడ్డి, ఆయన అనుచరులు ఒక్కసారిగా నిరసన వ్యక్తం చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం తన కౌన్సిలర్ పదవికి, టీఆర్ఎస్ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మున్సిపల్ కమిషనర్ కృష్ణారెడ్డికి తన రాజీనామ పత్రాన్ని అందచేశారు. -
కొలువుదీరిన కొత్త పురపాలకులు
గ్రేటర్ పరిధిలోని మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో మున్సిపల్ ఎన్నికల పర్వం ముగిసింది. 7 కార్పొరేషన్లు, 21 మున్సిపాల్టీలకు ఎన్నికలు జరగ్గా...సోమవారం 7 కార్పొరేషన్లు, 20 మున్సిపాలిటీల్లో పాలకులు కొలువుదీరారు. మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్లు పదవీ స్వీకారం చేశారు. వీరిలో మెజార్టీ స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు పీఠాలు దక్కించుకున్నారు. కొత్త పొత్తులు, జంపింగ్ జిలానీలు, అనూహ్య పరిణామాల మధ్య కొన్నిచోట్ల పదవులు తారుమారయ్యాయి. మొత్తానికి మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఇక కొత్త పాలకుల ప్రొఫైల్ వివరాలు ఇలా.. ఇబ్రహీంపట్నం చైర్ పర్సన్: కప్పరి స్రవంతి వయస్సు: 29 విద్యార్హత: ఎంబీఏ(హెచ్ఆర్) కుటుంబం: భర్త కప్పరి చందు, ఇద్దరు కూతుళ్లు కుందనిక, వెరొనిక రాజకీయ నేపథ్యం: మామ కప్పరి లక్ష్మయ్య ఇబ్రహీంపట్నం చివరి సర్పంచ్గా పనిచేశారు. అప్పట్లో ఆయన చేసిన అభివృద్ధి గెలుపునకు కలిసొచ్చింది. వైస్ చైర్మన్: ఆకుల యాదగిరి వయస్సు: 59 విద్యార్హత: ఇంటర్ వృత్తి: వ్యవసాయం, రియల్ఎస్టెట్ వ్యాపారం కుటుంబం: భార్య వసంత, ఇద్దరు కూతుళ్లు క్రాంతి, నాగరాణి, కుమారుడు హరికాంత్ రాజకీయ నేపథ్యం: టౌన్ మున్సిపాలిటీగా ఇబ్రహీంపట్నం ఉన్నప్పుడు పెద్దనాన్న ఆకుల చంద్రయ్య కౌన్సిలర్, తదుపరి సొంత అన్నవదినలు శ్రీరాములు, సరోజలు సర్పంచ్లుగా పనిచేశారు. దుండిగల్ చైర్పర్సన్:సుంకరి కృష్ణవేణి పుట్టిన తేది: మే 14, 1990 కుటుంబం: భర్త శంభీపూర్ కృష్ణ, సంతానం: కుమార్తెలు మీనాక్షి, యామిని రాజకీయ నేపథ్యం: ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు సోదరుడి భార్య కృష్ణవేణి. భర్త, బావలు టీఆర్ఎస్లో క్రీయాశీలకంగా వ్యవహరిస్తుండగా ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో 25వ వార్డు నుంచి గెలుపొంది మున్సిపల్ చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్: తుడుం పద్మారావు పుట్టిన తేదీ: అక్టోబర్ 8, 1975 కుటుంబం: భార్య అన్నపూర్ణ, సంతానం: ప్రణీత్, ప్రణయ్ విద్యార్హత: పదవ తరగతి రాజకీయ నేపథ్యం: 1994లో బహదూర్పల్లి గ్రామ వార్డు సభ్యుడిగా ఎన్నికై 1999 వరకు ఉప సర్పంచ్గా పని చేశారు. 2014లో వార్డు సభ్యుడిగా ఎన్నికయ్యారు. బీజేపీలో జిల్లా దళిత మోర్చ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. మూడేళ్ల క్రితం టీఆర్ఎస్లో చేరారు. నాగారం మున్సిపాలిటీ చైర్మన్:కౌకుట్ల చంద్రారెడ్డి పుట్టిన తేదీ: జూలై 1963 చదువు: 7వ తరగతి. కుటుంబం: భార్య కౌకుట్ల లలిత, రాహుల్రెడ్డి, కొండల్రెడ్డి రాజకీయ జీవితం: 1997లో నాగారం పంచాయతీ వార్డు సభ్యుడు, 2002లో ఉపసర్పంచ్, 2007లో ఇన్చార్జి సర్పంచ్. 2014 నుంచి 2019వరకు నాగారం సర్పంచ్గా పనిచేశారు. మున్సిపల్ వైస్ చైర్మన్:బండారు మల్లేష్యాదవ్ పుట్టిన తేదీ : 1–7–74 విద్యార్హత : పదో తరగతి కుటుంబం : బి.రమాదేవి సంతానం : శ్రీయా యదవ్, శ్రీజన్ యాదవ్ రాజకీయ నేపథ్యం: కొత్తగా ఏర్పడిన నాగారం మున్సిపాలిటీలో 13వ వార్డు నుంచి 65 ఓట్ల తేడాతో గెలుపొందారు. తూంకుంట మున్సిపల్ చైర్మన్:కారింగుల రాజేశ్వరరావు పుట్టిన తేది: 08/07/1973 విద్యార్హత: 10వ తరగతి కుటుంబం: భార్య సుప్రియ, సంతానం: ప్రణవ్, భసంత్ రాజకీయ నేపథ్యం: ఏమీ లేదు మున్సిపల్ వైస్ చైర్ పర్సన్: పన్నాల వాణివీరారెడ్డి పుట్టిన తేది: 09/05/1972 విద్యార్హత: 10వ తరగతి కుటుంబం: భర్త పన్నాల వీరారెడ్డి సంతానం: సుష్మరెడ్డి, రిష్మారెడ్డి. రాజకీయ నేపథ్యం: ఏమీ లేదు జల్పల్లి మున్సిపాలిటీ చైర్మన్: అబ్దుల్లా బిన్ హామేద్ సాది. పుట్టిన తేది: 1992 ఫిబ్రరి 21. విద్యాభ్యాసం: బీకాం. కుటుంబ నేపథ్యం: భార్య,కుమారుడు సంతానం రాజకీయ నేపథ్యం: జల్పల్లి మున్సిపాలిటీ చైర్మన్గా ఎన్నికైన అబ్దుల్లా బిన్ హామెద్ సాది స్వయనా రెజ్లర్(మల్లయోధుడు). మజ్లిస్ పార్టీ జల్పల్లి మున్సిపాలిటీ ఇన్ఛార్జిగా కొనసాగుతున్న అతడి తండ్రి నుంచి రాజకీయాల్లో కూడా అడుగుపెట్టాడు. వైస్ చైర్మన్: ఫర్హానా నాజ్. పుట్టిన తేది: 1994 ఆగస్ట్ 7 విద్యాభ్యాసం: డిగ్రీ కుటుంబం: భర్తతో పాటు ముగ్గురు పిల్లలు సంతానం. రాజకీయ నేపథ్యం: గృహిణిగా ఉన్న ఓ ముస్లిం మహిళ ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చి వైస్ చైర్మన్ స్థానాన్ని దక్కించుకుంది. తన సోదరుడి(సయ్యద్ యూసుఫ్ పటేల్–టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు) రాజకీయాన్ని ఆదర్శంగా తీసుకొని టీఆర్ఎస్ తరపున టికెట్ పొంది మజ్లిస్ను మట్టి కరిపించింది. దమ్మాయిగూడ మున్సిపల్ చైర్ పర్సన్: వసుపతి ప్రణీతాగౌడ్ పుట్టిన తేదీ : 26–12–1988 విద్యార్హత : బీకాం. కుటుంబం: భర్త వసుపతి శ్రీకాంత్గౌడ్, సంతానం: హాసిని, శ్రీతేజ రాజకీయ నేపథ్యం: 2014 నుంచి 2019 వరకు వార్డుసభ్యురాలిగా బాధ్యతలు చేపట్టారు. కొత్తగా ఏర్పడిన దమ్మాయిగూడ మున్సిపాలిటీలో 14వ వార్డు నుంచి 216 ఓట్ల తేడాతో గెలుపొందారు. మున్సిపల్ వైస్ చైర్మన్: మాదిరెడ్డి నరేందర్రెడ్డి పుట్టిన తేదీ : 22–2–1975 విద్యార్హత : ఇంటర్ కుటుంబం : భార్య పావని రెడ్డి, రితీష్రెడ్డి, తనుష్రెడ్డి రాజకీయ నేపథ్యం: 2007 నుంచి 2012 వరకు ఉపసర్పంచ్గా, 2014 నుంచి 2019 వరకు వార్డు సభ్యుడిగా బాధ్యతలు చేపట్టారు. కొత్తగా ఏర్పడిన దమ్మాయిగూడ మున్సిపాలిటీలో 16వ వార్డు నుంచి 60 ఓట్ల తేడాతో గెలుపు. ఘట్కేసర్ మున్సిపల్ చైర్ పర్సన్: ముల్లి పావనిజంగయ్య యాదవ్ పుట్టిన తేది: 1979 జనవరి 10 విద్యార్హత: ఇంటర్ కుటుంబం: భర్త: జంగయ్యయాదవ్ సంతానం: మేఘన, సౌమ్య, అర్చన రాజకీయ నేపథ్యం: గృహిణి. నూతనంగా ఏర్పడిన ఘట్కేసర్ మున్సిపాలిటీ 16వ వార్డు నుంచి 281 ఓట్ల తేడాతో విజయం సాధించింది. వైస్ చైర్మన్: పలుగుల మాధవరెడ్డి పుట్టిన తేది: 1972 ఏప్రిల్ 4 విద్యార్హత: డిగ్రీ కుటుంబం: భార్య: మమత సంతానం: ప్రణయ్రెడ్డి, రణంత్రెడ్డి రాజకీయ నేపథ్యం: పార్టీలో పని చేసిన అనుభవంతో నూతనంగా ఏర్పడిన ఘట్కేసర్ మున్సిపాలిటీలో 9వ వార్డు నుంచి 270 ఓట్ల తేడాతో విజయం సాధించాడు. శంషాబాద్ చైర్ పర్సన్ః కొలను సుష్మారెడ్డి వయసుః 45 విద్యార్హతః ఇంటర్ కుటుంబంః భర్త మహేందర్రెడ్డి శంషాబాద్ పీఏసీఎస్ చైర్మన్, రియల్ ఎస్టేట్ వ్యాపారం ఓ కుమార్తె, కుమారుడు రుష్యేందర్రెడ్డి అఖిలారెడ్డి రాజకీయ నేపథ్యంః మాజీ ఎంపీటీసీ సభ్యురాలు, టీఆర్ఎస్ మహిళా నాయకురాలు, సిరీ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు. భర్త టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు. వైస్ చైర్మన్ః బండి గోపాల్యాదవ్ వయసు 33 విద్యార్హత: బీఏ కుటుంబంః భార్య పుష్పలత, కుమారులు సాత్విక్, మనీష్ రాజకీయ నేపథ్యంః ఎన్ఎస్యూఐ విద్యార్థి నాయకుడిగా.. యూత్ కాంగ్రెస్ నాయకుడిగా పనిచేశాడు. ఏడాది కిందటే టీఆర్ఎస్లో చేరారు. తుర్కయంజాల్ చైర్ పర్సన్ పేరు:మల్రెడ్డి అనురాధ భర్త పేరు: మల్రెడ్డి రాంరెడ్డి విద్యార్హత: ఇంటర్మీడియట్ (డిస్ కంటిన్యూ) రాజకీయ నేపథ్యం: 1995–2001 వరకు తొర్రూర్ సర్పంచ్గా పనిచేశారు. పిల్లలు: ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు (మల్రెడ్డి సాయితేజ్ రెడ్డి, కావ్య, దివ్య) ఇద్దరు కుమార్తెలు డాక్టర్లు. వైస్ చైర్ పర్సన్: గుండ్లపల్లి హరిత భర్త పేరు: గుండ్లపల్లి ధన్రాజ్గౌడ్ వయస్సు: 42 విద్యార్హత: బీకాం రాజకీయ నేపథ్యం: 2014–2019 వరకు ఎంపీపీగా పనిచేశారు. కుటుంబం: ఇద్దరు కుమారులు(ప్రీతమ్ రాజ్, ప్రణవ్ రాజ్) భర్త ధన్రాజ్గౌడ్ 2008–2013 వరకు ఉప సర్పంచ్గా పనిచేశారు. ఆదిబట్ల మున్సిపాలిటీ చైర్ పర్సన్: కొత్త ఆర్తిక వయస్సు : 28 సంవత్సరాలు చదువు : బీఎస్సీ భర్త :కొత్త ప్రవీణ్ వృత్తి : గృహిణి రాజకీయ నేపథ్యం : మామ కొత్త యాదగిరిగౌడ్, అత్త ప్రమీల కొంగర్కాలన్ మాజీ సర్పంచ్లు పిల్లలు : ఇద్దరు కుమారులు వైస్ చైర్పర్సన్ :కోరే కళమ్మ వయస్సు : 39 సంవత్సరాలు చదువు : పదవ తరగతి వృత్తి : గృహిణి రాజకీయ నేపథ్యంః ఈమె ఇంతుకుముందు ఆదిబట్ల ఎంపీటీసీగా పనిచేశారు. తుక్కుగూడ మున్సిపాలిటీ చైర్మన్ :కాంటేకర్ మధుమోహన్ వయస్సు : 32 సంవత్సరాలు తల్లిద్రండులు : జగత్, స్వరూప భార్య : మౌనిక వృత్తి : రియల్ ఎస్టేట్ వ్యాపారం రాజకీయ నేపథ్యం : రావిర్యాల గ్రామ బీజేపీ పార్టీ సామాన్య కార్యకర్త వైస్ చైర్మన్ : భవాని వెంకట్రెడ్డి వయస్సు : 50 భార్య : ఉదయ శ్రీ వృత్తి : రియల్ ఎస్టేట్ వ్యాపారం పిల్లలు :ఒక కుమారుడు, ఒక కుమారై రాజకీయ అనుభవం : గతంలో తుక్కుగూడ గ్రామ పంచాయతీ వార్డు సభ్యులుగా పని చేశారు. మణికొండ చైర్మన్: కస్తూరి నరేందర్ముదిరాజ్ భార్య: లావణ్య, మాజీ సర్పంచ్ కుటుంబం: ఇద్దరు కుమారులు చదువు: 10వ తరగతి గ్రామం: పుప్పాలగూడ రాజకీయ నేపథ్యంః రాజకీయం (కాంగ్రెస్) వైస్ చైర్మన్: కొండకళ్ల నరేందర్రెడ్డి భార్య: సుమతి పిల్లలు: ఇద్దరు కూతుర్లు చదవు: ఇంటర్ గ్రామం: మణికొండ రాజకీయ నేపథ్యంః రాజకీయం(బీజేపీ) నార్సింగి చైర్పర్సన్: దారుగుపల్లి రేఖ భర్త: డి.యాదగిరి పిల్లలు: ముగ్గురు కూతుర్లు, ఒక కుమారుడు చదువు: 6వ తరగతి గ్రామం: గౌలిదొడ్డి రాజకీయ నేపథ్యంః కొత్తగా రాజకీయ రంగ ప్రవేశం వైస్ చైర్మన్: గొర్ల వెంకటేశ్యాదవ్ భార్య: జి.అరుణజ్యోతి పిల్లలు: ఒక కుమారుడు, ఒక కూతురు చదువు: పదవ తరగతి గ్రామం: నార్సింగి రాజకీయ నేపథ్యంః రాజకీయం, ఒక సారి టీడీపీ నుంచి సర్పంచ్, ఆ తర్వాత టీఆర్ఎస్, రియల్ ఎస్టేట్. శంకర్పల్లి మున్సిపల్ చైర్పర్సన్ : సాత విజయలక్ష్మి వయస్సు: 35 కుటుంబం: భర్త సాత ప్రవీణ్కుమార్. సంతానం: కుమారుడు మణిరుద్రా„Š, కూతురు హన్సిక రాజకీయ నేపథ్యం: మామ సాత ఆత్మలింగం శంకర్పల్లి మాజీ సర్పంచ్, భర్త ప్రవీణ్కుమార్ శంకర్పల్లి మాజీ ఉప సర్పంచ్ పని చేశారు. నిత్యం ప్రజలతో అందుబాటులో ఉండటం, పేదలకు ఆర్థిక సాయం చేయడంతో పాటు ఆపదలో ముందుకు రావడం కలిసొచ్చింది. వైస్ చైర్మన్: భానురి వెంకట్రాంరెడ్డి వయస్సు: 64, విద్యార్హత: ఇంటర్ భార్యపేరు: ప్రభావతి సంతానం: శ్రీకాంత్రెడ్డి, శశికాంత్రెడ్డి రాజకీయ నేపథ్యం: శంకర్పల్లి వైస్ ఎంపీపీ, మార్కెట్ కమిటీ వైస్ ఎంపీపీ, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడిగా పని చేశారు. ప్రజాసమస్యలను పరిష్కరించడం, అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉండటం, నమ్మిన మనుషుల వెంబడి ఉండటం. ఆమనగల్లు చైర్మన్ః నేనావత్ రాంపాల్ వయసుః 42 విద్యార్హతః ఎస్ఎస్సీ కుటుంబంః భార్య నీల, కుమారుడు శివాజీనాయక్, కూతురు నిఖిత రాజకీయ నేపథ్యంః 2013లో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఆమనగల్లు రెండవ వార్డు సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఇటీవల బీజేపీలో చేరారు. ఆమనగల్లు 3వ వార్డు నుంచి కౌన్సిలర్గా ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్ః భీమనపల్లి దుర్గయ్య వయసుః 45 విద్యార్హతః ఇంటర్మీడియట్ కుటుంబంః భార్య శివలక్ష్మి, కుమారులు: పవన్కళ్యాణ్, ప్రణీత్కుమార్ రాజకీయ నేపథ్యంః 2006లో ఆమనగల్లు గ్రామ పంచాయితీ వార్డు సభ్యుడిగా ఎన్నిక, పదిహేనేళ్లుగా బీజేపీలో పనిచేస్తున్నారు. పద్మశాలీ సంఘంలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపల్ చైర్పర్సన్:మద్దుల లక్ష్మి పుట్టిన తేదీ: 1974 అక్టోబర్ 15 విద్యార్హత: ఇంటర్మీడియట్ కుటుంబం: భర్త: మద్దుల శ్రీనివాస్రెడ్డి, మద్దుల వికాస్రెడ్డి, మనీష రాజకీయ నేపథ్యం: కొత్తగా ఏర్పడిన గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ 15వ వార్డు నుంచి కౌన్సిలర్గా 259 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. భర్త మద్దుల శ్రీనివాస్రెడ్డి గతంలో గుండ్లపోచంపల్లి సర్పంచ్గా బాధ్యతలు నిర్వహించారు. వైస్ చైర్మన్: దమ్మన్నగారి ప్రభాకర్ పుట్టిన తేదీ: 1970 అక్టోబర్ 10 విద్యార్హత : ఎస్ఎస్సీ కుటుంబం: భార్య: వీరమణి, కుమారుడు: సందీప్ కూతుళ్లు: స్వాతి, శృతిప్రియ రాజకీయ నేపథ్యం: మేడ్చల్ పీఎస్సీఎస్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహించారు. కొత్తగా ఏర్పడిన గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ 10వ వార్డు నుంచి కౌన్సిలర్గా 254 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. పోచారం మున్సిపల్ చైర్మన్ :బోయపల్లి కొండల్రెడ్డి పుట్టిన సంవత్సరం: 1978 విద్యార్హత: ఇంటర్ (అన్నోజిగూడ) వృత్తి: రియల్ ఎస్టేట్ కుటుంబం: భార్య:శైలజ, కూతురు: జీవిక రాజకీయ నేపథ్యం:2016 నుంచి 2019 వరకు టీఆర్ఎస్ ఘట్కేసర్ మండల అధ్యక్షుడుగా బాధ్యతలు నిర్వర్తించారు. మున్సిపల్ వైస్ చైర్మన్:నానావత్ రెడ్యానాయక్ పుట్టిన తేది: 03–03–1979 విద్యార్హత: ఎస్ఎస్సీ (అన్నోజిగూడ) వృత్తి: వ్యాపారం కుటుంబం: భార్య: సరిత సంతానం: కుమారుడు: రిషి కిరణ్, కుమార్తె: భావన రాజకీయ నేపథ్యం: 2013 నుంచి 2018 వరకు పోచారం గ్రామ వార్డు సభ్యుడిగా, 2010–2013 రైతు సహకార సంఘ డైరెక్టర్గా, టీఆర్ఎస్లో గ్రామశాఖ అధ్యక్షుడుగా, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడిగా కొంత కాలం పనిచేశారు. పెద్ద అంబర్పేట చైర్పర్సన్:చెవుల స్వప్న వయస్సు: 28 విద్యార్హత:పదవ తరగతి కుటుంబం: ఇద్దరుకుమారులురాజకీయ నేపథ్యం:రాజకీయాల్లోకి కొత్తగా.. వైస్ చైర్పర్సన్: చామ సంపూర్ణరెడ్డి వయస్సు: 35 విద్యార్హత: డిగ్రీ కుటుంబం: ఇద్దరు సంతానం రాజకీయ నేపథ్యం: గత పాలకవర్గంలో కౌన్సిలర్గా, ఆమె భర్త చామ విజయశేఖర్రెడ్డి కో ఆప్షన్, భావ చామ రాంరెడ్డి కుంట్లూర్ సర్పంచ్గా, మరో బావ చామ కృష్ణారెడ్డి సింగిల్ విండో చైర్మన్గా పనిచేశారు. 30 ఏళ్లుగా వీరి కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉంది. షాద్నగర్ మున్సిపాలిటీ చైర్మన్: కొందూటి నరేందర్ విద్యార్హత: బీఏ వయస్సుః 54 సంవత్సరాలు కుటుంబంః భార్య కొందూటి మహేశ్వరీ, కొడుకు శక్తిసాయి చరణ్, కూతురు భావన రాజకీయ నేపథ్యంః షాద్నగర్ ఎంపీటీసీగా, గ్రామ పంచాయితీ సర్పంచ్గా, మార్కెట్ కమిటీ చైర్మన్గా పనిచేశారు. చిన్న నాటి నుంచి కాంగ్రెస్లో కొనసాగి, 2014లో టీఆర్ఎస్లో చేరారు. చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్ః ఎంఎస్ నట్రాజ్ వయస్సుః 50 సంవత్సరాలు విద్యార్హతః ఓపెన్ డిగ్రీ కుటుంబంః భార్య లలిత, కుమారుడు అనంత కౌషిక్ రాజకీయ నేపథ్యంః 32 ఏళ్ల రాజకీయ జీవితంలో 23 ఏళ్లు కాంగ్రెస్ పార్టీలో పని చేశారు. ఆ తర్వాత టీఆర్ఎస్లో చేశారు. ఎమ్మెల్యే అంజయ్య యాదవ్కు నమ్మిన బంటుగా కొనసాగుతున్నారు. ఎమ్మెల్యేకు వ్యక్తిగత కార్యదర్శిగా కూడా కొనసాగుతున్నారు. కొంపల్లి మున్సిపల్ చైర్మన్:సన్న శ్రీశైలం యాదవ్ పుట్టిన తేదీ: 1972 ఫిబ్రవరి 29 విద్యార్హత: ఇంటర్ డిస్కంటిన్యూ(మేడ్చల్) కుటుంబం: భార్య:కవిత, సంతానం:మల్లికార్జున్, మానస. రాజకీయ నేపథ్యం: 1996 నుంచి 2001 వరకు ఎంపీటీసీగా, 2006 నుంచి 2011 వరకు కొంపల్లి గ్రామ సర్పంచ్గా బాధ్యతలు చేపట్టారు. కొత్తగా ఏర్పడ్డ కొంపల్లి మున్సిపాలిటీలో 3వ వార్డు నుంచి ఒక్క ఓటు తేడాతో గెలుపొంది చైర్మన్గా ఎన్నికయ్యారు. -
క్లర్కుగా చేసిన చోటే.. చైర్పర్సన్గా..!
సాక్షి,భీమ్గల్ : అదృష్టమంటే ఇదేనేమో..! క్లర్కుగా పని చేసిన కార్యాలయంలోనే తొలి చైర్పర్సన్గా మల్లెల రాజశ్రీ ఎన్నికయ్యారు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మున్సిపాలిటీగా మారక ముందు గ్రామ పంచాయతీలో రాజశ్రీ క్లర్కుగా పని చేసేవారు. అయితే, 2006 నుంచి 2013 వరకు మల్లెల లక్ష్మణ్ వార్డు సభ్యుడిగా, 2013 నుంచి 2018 వరకు ఉప సర్పంచ్గా పని చేశారు. ఈ మధ్య కాలంలో రాజశ్రీ, లక్ష్మణ్ మధ్య పరిచయం పెరిగి ప్రేమగా మారింది. దీంతో ఇద్దరు వివాహం చేసుకున్నారు. జిల్లాల పునర్విభజనలో భాగంగా భీమ్గల్ మున్సిపాలిటీగా మారింది. చైర్పర్సన్ స్థానం బీసీ మహిళకు రిజర్వ్ అయింది. ఈ నెల 22న జరిగిన ఎన్నికల్లో రాజశ్రీ టీఆర్ఎస్ తరఫున తొమ్మిదో వార్డు నుంచి బరిలోకి దిగి.. భారీ మెజారిటీతో గెలిచారు. సోమవారం జరిగిన పరోక్ష ఎన్నికలో ఆమె చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. -
‘పేరుకు ఢిల్లీ పార్టీలు చేసేవి సిల్లీ పనులు’
-
నిజామాబాద్: బీజేపీకి టీఆర్ఎస్ చెక్
సాక్షి, నిజామాబాద్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీజేపీకి టీఆర్ఎస్ చెక్ పెట్టింది. నిజామాబాద్ నగర పాలక సంస్థతో పాటు ఆరు మున్సిపాలిటీలను టీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. ఎంఐఎం మద్దతుతో నిజామాబాద్ నగర పాలక సంస్థను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మేయర్గా 11వ వార్డు కార్పొరేటర్ దండు నీతు కిరణ్, డిప్యూటీ మేయర్గా 14వ వార్డు కార్పొరేటర్ మహ్మద్ ఇద్రీస్ఖాన్ ఎన్నికయ్యారు. మేయర్ పోటీలో నీతు కిరణ్పై పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి లావణ్యకు 29 మంది మద్దతు తెలపగా, నీతూ కిరణ్కు 38 మంది మద్దతు ప్రకటించారు. డిప్యూటీ మేయర్ పోటీలో ఎంఐఎం అభ్యర్థి ఇద్రీస్ఖాన్కు 38 మంది, బీజేపీ అభ్యర్థి మల్లేశ్ యాదవ్కు 29 మంది మద్దతు తెలిపారు. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల వివరాలు.. 1. ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్గా పండిత్ వనిత, వైస్ చైర్మన్గా షేక్ మున్నా ఎన్నిక 2. బోధన్ మున్సిపల్ చైర్మన్గా తూము పద్మ, వైస్ చైర్మన్గా మహ్మద్ ఏతేషామ్ ఎన్నిక 3. భీంగల్ మున్సిపల్ చైర్మన్గా మల్లెల రాజశ్రీ, వైస్ చైర్మన్గా గున్నాల బాల భగత్ ఎన్నిక. 4. కామారెడ్డి జిల్లా: కామారెడ్డి మున్సిపల్ చైర్మన్గా నీతు జాహ్నవి, వైస్ చైర్మన్గా గడ్డం ఇందుప్రియ ఎన్నిక. 5. ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్గా కుడుముల సత్యనారాయణ, వైస్ చైర్మన్గా మస్త్యాల సుజాత ఎన్నిక. 6. బాన్సువాడ మున్సిపల్ చైర్మన్గా జనగాం గంగాధర్, వైస్ చైర్మన్గా షేక్ జుబేర్ ఎన్నిక. మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు వీరే -
‘కారు’ జోరు; నేరేడుచర్లలో ఉత్కంఠ
సాక్షి, నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 18 మున్సిపాలిటీల్లో ఒక్కస్థానం మినహా అన్నింటిని టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. చండూరు మున్సిపాలిటీని కాంగ్రెస్ దక్కించుకుంది. కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ఎక్స్ ఎక్స్ అఫిషియో ఓటు వివాదంతో నేరేడుచర్లలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను మంగళవారానికి వాయిదా వేశారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు సమానంగా ఓట్లు రావడంతో నేరేడుచర్ల ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. మంగళవారం ఉదయం కౌన్సిలర్ల ప్రమాణస్వీకారం తర్వాత నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహిస్తామని ఎన్నికల సంఘం ప్రకటించింది. కాగా, పది మున్సిపాలిటీల్లోనే స్పష్టమైన ఆధిక్యం సాధించిన టీఆర్ఎస్.. ఎక్స్ అఫిషియో సభ్యులు, స్వతంత్రులు, సీపీఎం మద్దతుతో మిగిలి 16 స్థానాలను కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల వివరాలు.. 1. నల్గొండ మున్సిపల్ చైర్మన్గా మందడి సైదిరెడ్డి ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్ ఎన్నిర మంగళవారానికి వాయిదా పడింది. 2. మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్గా తిరునగరు భార్గవ్, వైస్ చైర్మన్గా కుర్ర కోటేశ్వరరావు ఎన్నిక 3. దేవరకొండ మున్సిపల్ చైర్మన్గా ఆలంపల్లి నర్సింహ్మ, వైస్ చైర్మన్గా ఎం.డీ రహాత్ అలీ ఎన్నిక 4. నందికొండ-సాగర్ మున్సిపల్ చైర్మన్గా కర్ణ అనూష వైస్ చైర్మన్గా మంద రఘువీర్ ఎన్నిక 5. హాలియా మున్సిపల్ చైర్మన్గా వెంపటి పార్వతమ్మ, వైస్ చైర్మన్గా సుధాకర్ ఎన్నిక 6. చిట్యాల మున్సిపల్ చైర్మన్గా కోమటిరెడ్డి చిన వెంకటరెడ్డి, వైస్ చైర్మన్గా కూరేళ్ల లింగస్వామి ఎన్నిక 7. చండూరు మున్సిపల్ చైర్మన్గా తోకల చంద్రకళ (కాంగ్రెస్), వైస్ చైర్మన్గా దోటి సుజాత ఎన్నిక 8. యాదాద్రి-భువనగిరి జిల్లా: భువనగిరి మున్సిపల్ చైర్మన్గా ఎనబోయిన ఆంజనేయులు, వైస్ చైర్మన్ చింతల కృష్ణయ్య ఎన్నిక 9. యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్మన్గా ఎరుకల సుధ ఎన్నిక 10. ఆలేరు మున్సిపల్ చైర్మన్గా వసపరి శంకరయ్య ఎన్నిక 11. చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్గా వెన్ రెడ్డి రాజు, వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం(సీపీఎం) ఎన్నిక 12. మోత్కూరు మున్సిపల్ చైర్మన్గా టిపిరెడ్డి సావిత్రి, వైస్ చైర్మన్గా బొల్లేపల్లి వెంకటయ్య ఎన్నిక 13. భూదాన్ పోచంపల్లి మున్సిపల్ చైర్మన్గా చిట్టిపోలు విజయలక్ష్మి, వైస్ చైర్మన్ బాత్క లింగస్వామి ఎన్నిక 14. సూర్యాపేట జిల్లా: సూర్యాపేట మున్సిపల్ చైర్మన్గా పెరుమాళ్ళ అన్నపూర్ణ, వైస్ చైర్మన్గా పుట్ట కిషోర్ ఎన్నిక 15. కోదాడ మున్సిపల్ చైర్మన్గ వనపర్తి శిరీష,వైస్ చైర్మన్గా వెంపటి పద్మ ఎన్నిక 16. హుజూర్నగర్ మున్సిపల్ చైర్మన్గా అర్చన రవి, వైస్ చైర్మన్గా జక్కుల నాగేశ్వరరావు ఎన్నిక 17. తిరుమలగిరి మున్సిపల్ చైర్మన్గా పోతరాజు రజిని ఎన్నిక 18. నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక మంగళవారం జరుగుతుంది. -
‘పేరుకు ఢిల్లీ పార్టీలు చేసేవి సిల్లీ పనులు’
సాక్షి, హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికల్లో ప్రతిపక్షాలు దిగజారుడు రాజకీయాలు చేశాయని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్, మంత్రి కేటీఆర్ విమర్శించారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్నే గెలిపించారని మంత్రి కేటీఆర్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్ చాలా చోట్ల కుమ్మక్కయ్యారని ఆరోపించారు. మక్తల్, మణికొండ, తుర్క యంజాల్లో బీజేపీ-కాంగ్రెస్ అపవిత్ర పొత్తు పెట్టుకున్నాయని విమర్శించారు. పేరుకు మాత్రం ఢిల్లీ పార్టీలని, చేసేవి గల్లీ పనులు అని ఎద్దేవా చేశారు. ఒక్క మున్సిపాలిటీ కోసం రెండు జాతీయ పార్టీలు పొత్తు పెట్టుకోవడం సిగ్గు చేటన్నారు. (చదవండి : తెలంగాణ: మున్సిపల్ చైర్మన్లు వీరే) 120 స్థానాల్లో 112 స్థానాలను టీఆర్ఎస్ సాధించిందని, పదికి పది కార్పొరేషన్లు గెలవడం అనితరసాధ్యమని మంత్రి అన్నారు. కరీనగర్లో కూడా టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మేడ్చల్, నేరేడుచర్లలోనూ తమకు సంపూర్ణ మెజార్టీ ఉందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు టీఆర్ఎస్నే గెలిపించారని, దేశానికే ఆదర్శవంతమైన పట్టణాలను తయారు చేస్తామని కేటీఆర్ స్పష్టం చాశారు. కొత్తగా ఎన్నికైన 130 మంది చైర్మన్లకు కొత్తగా తీసుకువచ్చిన మున్సిపల్ చట్టంపై శిక్షణ అందిస్తామన్నారు. పల్లె ప్రగతి మాదిరే త్వరలోనే పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపడతామని మంత్రి వెల్లడించారు. మున్సిపాలిటీలకు కేంద్రం నుంచి రూ.1037 కోట్లు వస్తే అంతే మొత్తంలో నిధులను రాష్ట్రం నుంచి కేటాయిస్తామన్నారు. కేంద్రం, రాష్ట్ర నిధులు కలిపి మొత్తంగా రూ.2074 కోట్లు వస్తాయని, దానిని ప్రతి నెల రూ.173 కోట్ల చొప్పున మున్సిపాలిటీలకు అందిస్తామన్నారు. మున్సిపాలిటీల్లో జవాబుదారీ తనాన్ని తీసుకొస్తామన్నారు. సక్రమంగా పనిచేయని వారిని పదవి నుంచి తొలగిస్తామని హెచ్చరించారు. అన్ని మున్సిపాలిటీల్లో డిజిటల్ డోర్ నెంబర్లు ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. -
తెలంగాణ: మున్సిపల్ చైర్మన్లు వీరే
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో అధికార తెలంగాణ రాష్ట్రీయ సమితి(టీఆర్ఎస్) దుమ్మురేపింది. 120 మున్సిపాటీలకు గానూ 112 దక్కించుకుని సత్తా చాటింది. 8 మున్సిపాలిటీలు మాత్రమే కాంగ్రెస్(4), బీజేపీ(2), ఎంఐఎం(2) దక్కించుకున్నాయి. అటు పది నగర పాలక సంస్థలనూ టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 18 మున్సిపాలిటీల్లో ఒక్కస్థానం మినహా అన్నింటిని టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. చండూరు మున్సిపాలిటీని కాంగ్రెస్ దక్కించుకుంది. కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ఓటు వివాదంతో నేరేడుచర్లలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను మంగళవారానికి వాయిదా వేశారు. 1. నల్గొండ మున్సిపల్ చైర్మన్గా మందడి సైదిరెడ్డి ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్ ఎన్నిర మంగళవారానికి వాయిదా పడింది. 2. మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్గా తిరునగరు భార్గవ్, వైస్ చైర్మన్గా కుర్ర కోటేశ్వరరావు ఎన్నిక 3. దేవరకొండ మున్సిపల్ చైర్మన్గా ఆలంపల్లి నర్సింహ్మ, వైస్ చైర్మన్గా ఎం.డీ రహాత్ అలీ ఎన్నిక 4. నందికొండ-సాగర్ మున్సిపల్ చైర్మన్గా కర్ణ అనూష వైస్ చైర్మన్గా మంద రఘువీర్ ఎన్నిక 5. హాలియా మున్సిపల్ చైర్మన్గా వెంపటి పార్వతమ్మ, వైస్ చైర్మన్గా సుధాకర్ ఎన్నిక 6. చిట్యాల మున్సిపల్ చైర్మన్గా కోమటిరెడ్డి చిన వెంకటరెడ్డి, వైస్ చైర్మన్గా కూరేళ్ల లింగస్వామి ఎన్నిక 7. చండూరు మున్సిపల్ చైర్మన్గా తోకల చంద్రకళ (కాంగ్రెస్), వైస్ చైర్మన్గా దోటి సుజాత ఎన్నిక 8. యాదాద్రి-భువనగిరి జిల్లా: భువనగిరి మున్సిపల్ చైర్మన్గా ఎనబోయిన ఆంజనేయులు, వైస్ చైర్మన్ చింతల కృష్ణయ్య ఎన్నిక 9. యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్మన్గా ఎరుకల సుధ ఎన్నిక 10. ఆలేరు మున్సిపల్ చైర్మన్గా వసపరి శంకరయ్య ఎన్నిక 11. చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్గా వెన్ రెడ్డి రాజు, వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం(సీపీఎం) ఎన్నిక 12. మోత్కూరు మున్సిపల్ చైర్మన్గా టిపిరెడ్డి సావిత్రి, వైస్ చైర్మన్గా బొల్లేపల్లి వెంకటయ్య ఎన్నిక 13. భూదాన్ పోచంపల్లి మున్సిపల్ చైర్మన్గా చిట్టిపోలు విజయలక్ష్మి, వైస్ చైర్మన్ బాత్క లింగస్వామి ఎన్నిక 14. సూర్యాపేట జిల్లా: సూర్యాపేట మున్సిపల్ చైర్మన్గా పెరుమాళ్ళ అన్నపూర్ణ, వైస్ చైర్మన్గా పుట్ట కిషోర్ ఎన్నిక 15. కోదాడ మున్సిపల్ చైర్మన్గ వనపర్తి శిరీష,వైస్ చైర్మన్గా వెంపటి పద్మ ఎన్నిక 16. హుజూర్నగర్ మున్సిపల్ చైర్మన్గా అర్చన రవి, వైస్ చైర్మన్గా జక్కుల నాగేశ్వరరావు ఎన్నిక 17. తిరుమలగిరి మున్సిపల్ చైర్మన్గా పోతరాజు రజిని ఎన్నిక 18. నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక మంగళవారం జరుగుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 9 మున్సిపాలిటీల్లో అధికార టిఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా ఎగురవేసింది. 9 చోట్ల కూడా టిఆర్ఎస్ పార్టీకి చెందిన అభ్యర్థులే చైర్మన్, వైస్ చైర్మన్ స్థానాలు దక్కించుకున్నారు. 1. వరంగల్ రూరల్ జిల్లా: పరకాల మున్సిపల్ చైర్మన్గా సోదా అనిత, వైస్ చైర్మన్గా రేగురి జైపాల్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక. 2. వర్ధన్నపేట నూతన మున్సిపాలిటి ఛైర్ పర్సన్గా అంగోత్ అరుణ, వైస్ చైర్మన్గా కొమండ్ల ఏలందర్ రెడ్డి ఎన్నిక. 3. నర్సంపేట మున్సిపల్ చైర్మన్గా గుంటి రజని కిషన్, వైస్ చైర్మన్గా మునిగాల వెంకట రెడ్డి ఎన్నిక. 4. మహబూబాద్ మున్సిపల్ చైర్మన్గా డాక్టర్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్గా మహ్మద్ ఫరిద్ ఎన్నిక. 5. మహబూబాద్ జిల్లా: మరిపెడ మున్సిపల్ చైర్మన్గా గుగులోతు సిందూర, వైస్ చైర్మన్గా ముదిరెడ్డి బుచ్చిరెడ్డి ఎన్నిక. 6. డోర్నకల్ మున్సిపాలిటీ చైర్మెన్గా వంకుడొతు వీరన్న, వైస్ చైర్మన్గా కేసబోయిన కోటి లింగం ఎన్నిక. 7. మహబూబాబాద్ జిల్లా: తొర్రూర్ మున్సిపాలిటీ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య, వైస్ ఛైర్మన్గా జినుగ సురేందర్ రెడ్డి ఎన్నిక. 8. భూపాలపల్లి జిల్లా: భూపాలపల్లి మున్సిపల్ చైర్మన్గా సెగం వెంకట రాణి, వైస్ చైర్మన్గా కొత్త హరిబాబు ఎన్నిక. 9. జనగామ జిల్లా: జనగామ మున్సిపల్ చైర్మెన్గా పోకల జమున, వైస్ చైర్మన్గా మేకల రాంప్రసాద్ ఎన్నిక. ఉమ్మడి మెదక్ జిల్లాలోని 15 మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ అభ్యర్ధులు చైర్మన్ పదవులను దక్కించుకున్నారు. బొల్లారంలో తప్ప అన్నిచోట్ల వైస్ చైర్మన్ పదవులను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. బొల్లారంలో కాంగ్రెస్ అభ్యర్థి అంతిరెడ్డిగారి అనిల్రెడ్డి వైస్ చైర్మన్గా ఎన్నికయ్యారు. 1. సంగారెడ్డి రెడ్డి జిల్లా: సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్గా బొంగుల విజయలక్ష్మి, వైస్ చైర్మన్గా లతారెడ్డి ఎన్నిక. 2. సదాశివపేట మున్సిపల్ చైర్మన్గా పిల్లోడి జయమ్మ, వైస్ చైర్మన్గా చింతా గోపాల్ ఎన్నిక. 3. ఆందోల్-జోగిపేట మున్సిపల్ చైర్మన్గా గూడెం మల్లయ్య, వైస్ చైర్మన్గా మాతరి ప్రవీణ్ కుమార్ ఎన్నిక. 4. నారాయణఖేడ్ మున్సిపల్ చైర్మన్గా రూబీనా బేగం, వైస్ చైర్మన్గా అయ్యర్ పరశురాం ఎన్నిక. 5. బొల్లారం మున్సిపల్ చైర్మన్గా కోలన్ రోజారాణి, వైస్ చైర్మన్గా అనిల్రెడ్డి (కాంగ్రెస్) ఎన్నిక. 6. అమీన్పూర్ మున్సిపల్ ఛైర్మన్గా తుమ్మల పాండు రంగారెడ్డి, వైస్ చైర్మన్గా నందారం నర్సింహగౌడ్ ఎన్నిక. 7. తెల్లపూర్ మున్సిపల్ చైర్మన్గా మల్లేపల్లి లలిత, వైస్ చైర్మన్గా బలాగౌని రాములు ఎన్నిక. 8. మెదక్ జిల్లా: మెదక్ మున్సిపల్ చైర్మన్గా తొడుపునూరి చంద్రపాల్, వైస్ చైర్మన్గా ఆరెల్ల మల్లికార్జున్ గౌడ్ ఎన్నిక. 9. నర్సాపూర్ చైర్మన్గా ఎర్రగొల్ల మురళి యాదవ్, వైస్ చైర్మన్గా ఎండీ నయీముద్దిన్ ఎన్నిక. 10. తూప్రాన్ చైర్మన్గా బొంది రవిందర్ గౌడ్, వైస్ చైర్మన్గా నందాల శ్రీనివాస్ ఎన్నిక. 11. రామాయంపేట చైర్మన్గా పల్లె జితేంద్ర గౌడ్, వైస్ చైర్మన్గా పుట్టి విజయలక్ష్మి ఎన్నిక. 12. సిద్ధిపేట జిల్లా: దుబ్బాక చైర్మన్గా గన్నె వనిత, వైస్ చైర్మన్గా సుగుణ బాలకిషన్ గౌడ్ ఎన్నిక. 13. చేర్యాల చైర్మన్గా అంకుగారి స్వరూప రాణి, వైస్ చైర్మన్గా నిమ్మ రాజీవ్కుమార్ రెడ్డి ఎన్నిక. 14. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ చైర్మన్గా నేతిచిన్న రాజమౌళి, వైస్ చైర్మన్గా ఎండీ జకీరుద్దీన్ ఎన్నిక. 15. హుస్నాబాద్ చైర్మన్గా ఆకుల రజిత, వైస్ చైర్మన్గా అయిలేని అనిత ఎన్నిక. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 17 మున్సిపాలిటీల్లో 16 చోట్ల టీఆర్ఎస్ పాగా వేసింది. కొల్లాపూర్, అయిజ, భూత్పూర్, కోస్గిలో మెజారిటీ సీట్లు లేకపోయినా చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను టీఆర్ఎస్ దక్కించుకోవడం విశేషం. మక్తల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ మద్దతుతో కమలం వికసించింది. అమరచింత వైస్ చైర్మన్గా సీపీఎం అభ్యర్థి గోపి ఎన్నికయ్యారు. 1. మహబూబ్నగర్ మున్సిపల్ చైర్మన్గా కోరమోని నర్సింహులు, వైస్ చైర్మన్గా గణేష్ ఎన్నిక. 2. భూత్పూర్ మున్సిపల్ చైర్మన్గా బస్వరాజ్ గౌడ్, వైస్ చైర్మన్గా కెంద్యాల శ్రీనివాస్ ఎన్నిక 3. వనపర్తి జిల్లా: అమరచింత మువ్సిపల్ చైర్మన్గా మంగమ్మ, వైస్ చైర్మన్గా గోపి (సీపీఎం) ఎన్నిక. 4. ఆత్మకూర్ మున్సిపల్ చైర్మన్గా గాయత్రి, వైస్ చైర్మన్గా విజయ్ భాస్కర్ రెడ్డి ఎన్నిక. 5. కొత్తకోట మున్సిపల్ చైర్మన్గా పొగాకు సుకేషిని, వైస్ చైర్మన్గా బీసం జయమ్మ ఎన్నిక. 6. వనపర్తి మున్సిపల్ చైర్మన్గా గాలి యాదవ్, వైస్ చైర్మన్గా వాకాటి శ్రీధర్ ఎన్నిక. 7. పెబ్బేరు మున్సిపల్ చైర్మన్గా కరుణశ్రీ, వైస్ చైర్మన్గా మేకల కర్రెస్వామి ఎన్నిక. 8. నాగర్ కర్నూల్ జిల్లా: కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్గా ఎడ్మ సత్యంరెడ్డి, వైస్ చైర్మన్గా షాహీద్ ఎన్నిక. 9. కొల్లాపూర్ మున్సిపల్ చైర్మన్గా విజయలక్ష్మి, వైస్ చైర్మన్గా మహదాబేగం ఎన్నిక. 10. నాగర్ కర్నూల్ మున్సిపల్ చైర్మన్గా కల్పనా భాస్కర్ గౌడ్, వైస్ చైర్మన్గా భాస్కరరావు ఎన్నిక. 11. జోగులాంబ గద్వాల జిల్లా: వడ్డేపల్లి మున్సిపల్ చైర్మన్గా కరుణ, వైస్ చైర్మన్గా సుజాత ఎన్నిక. 12. అలంపూర్ మున్సిపల్ చైర్మన్గా మనోహరమ్మ, వైస్ చైర్మన్గా శేఖర్ ఎన్నిక. 13. అయిజ మున్సిపల్ చైర్మన్గా దేవన్న, వైస్ చైర్మన్గా మాల నర్సింహులు ఎన్నిక. 14. గద్వాల మున్సిపల్ చైర్మన్గా బి.ఎస్ కేశవ్, వైస్ చైర్మన్గా బాబర్ ఎన్నిక. 15. నారాయణపేట జిల్లా: మక్తల్ మున్సిపల్ చైర్మన్గా పావని(బీజేపీ), వైస్ చైర్మన్గా అఖిలారెడ్డి(బీజేపీ) ఎన్నిక. 16. కోస్గి మున్సిపల్ చైర్మన్గా శిరీష, వైస్ చైర్మన్గా అన్నపూర్ణ ఎన్నిక 17. నారాయణపేట మున్సిపల్ చైర్మన్గా అనసూయ, వైస్ చైర్మన్గా హరినారాయణ్ బట్టడ్ ఎన్నిక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఆరు మున్సిపాలిటీలను టీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. నిజామాబాద్ నగర పాలక సంస్థను ఎంఐఎం మద్దతుతో టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. 1. ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్గా పండిత్ వినీత్, వైస్ చైర్మన్గా మున్నాభాయ్ ఎన్నిక. 2. బోధన్ మున్సిపల్ చైర్మన్గా తూము పద్మ, వైస్ చైర్మన్గా ఏతేషామ్ ఎన్నిక. 3. భీంగల్ మున్సిపల్ చైర్మన్గా మల్లెల రాజశ్రీ, వైస్ చైర్మన్గా భగత్ ఎన్నిక. 4. కామారెడ్డి మున్సిపల్ చైర్మన్గా జాహ్నవి, వైస్ చైర్మన్గా ఇందుప్రియ ఎన్నిక. 5. ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్గా సత్యనారాయణ, వైస్ చైర్మన్గా సుజాత ఎన్నిక. 6. బాన్సువాడ మున్సిపల్ చైర్మన్గా జంగం గంగాధర్, వైస్ చైర్మన్గా షేక్ జుబేర్ ఎన్నిక. ఉమ్మడి ఖమ్మం జిల్లా: సత్తుపల్లి మునిసిపల్ చైర్మన్గా కూసంపూడి మహేష్, వైఎస్ చైర్మన్ తోట సుజలారాణి ఎన్నిక. 1. వైరా మున్సిపల్ చైర్మన్గా సూతకాని జైపాల్, వైస్చైర్మన్గా ముళ్లపాటి సీతారాములు ఎన్నిక. 2. మధిర మున్సిపల్ చైర్మన్గా మొండితోక లత, యరమల విద్యాలత ఎన్నిక. 3. భద్రాది-కొత్తగూడెం జిల్లా: ఇల్లందు మున్సిపల్ చైర్మన్గా దమ్మలపాటి వెంకటేశ్వరరావు, వైస్ చైర్మన్గా ఎస్డీ జానీ పాషా ఎన్నిక. 4. కొత్తగూడెం మున్సిపల్ చైర్మన్గా కాపు సీతామహాలక్ష్మి, వైస్ చైర్మెన్గా వేల్పుల దామోదర్ ఏకగ్రీవ ఎన్నిక. -
జనరల్ సీట్లో గెలిచినా అర్హులే
సాక్షి, హైదరాబాద్: ఎస్టీ, ఎస్సీ, బీసీలతోపాటు మహిళలకు రిజర్వ్ చేసిన మేయర్, మున్సిపల్ చైర్మన్ పదవులకు ఆయా వర్గాలకు రిజర్వ్ స్థానం నుంచే కాకుండా జనరల్ సీటు నుంచి గెలిచిన వారు కూడా పోటీకి అర్హులే. జనవరిలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ అంశం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీనిపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇదివరకే స్పష్టతనిస్తూ సర్క్యులర్ను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఎస్టీ, ఎస్సీ, బీసీలకు, మహిళలకు రిజర్వ్ చేసిన చైర్మన్, మేయర్ పదవులకు సంబంధిత రిజర్వేషన్ స్థానం నుంచి కాకుండా జనరల్ స్థానం నుంచి సదరు కేటగిరికి చెందిన వ్యక్తి గెలిచినా ఆయా పదవులకు పోటీ చేసేందుకు అర్హులని స్పష్టతనిచ్చింది. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మహిళలకు రిజర్వ్ చేసిన మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, మున్సిపల్ చైర్మన్ పదవులకు ఆయా కేటగిరీల వారు జనరల్ సీటు నుంచి పోటీచేసి గెలిచినా ఆయా పదవులకు పోటీ పడవచ్చునని పేర్కొన్నారు. -
పుర పోరు.. పారాహుషారు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో మళ్లీ ఎన్నికల హడావుడి మొదలైంది. పురపాలక ఎన్నికలకు త్వరలోనే నగారా మోగుతుందన్న ఊహాగానాల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో కదలిక షురూ అయింది. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆశిస్తున్న పట్టణ స్థాయి ఔత్సాహికులు గతంలోనే రంగంలోకి దిగినా.. తాజా పరిణామాల నేపథ్యంలో తమ కసరత్తును ముమ్మరం చేశారు. హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టేలతో కొంత వెనక్కు తగ్గినా.. ఇటీవల ధర్మాసనం ఎన్నికల నిర్వహణకు గ్రీన్సిగ్నల్ ఇవ్వడం, ఇందుకు అనుగుణంగా పురపాలక శాఖ, ఎన్నికల కమిషన్లు ఏర్పాట్లు చేసుకుంటుండడంతో వారంతా వార్డుల బాట పట్టారు. రాష్ట్రంలో మొత్తం 129 మున్సిపాలిటీలకు ఎన్నికలకు జరగాల్సి ఉండగా.. 77 మున్సిపాలిటీల విషయంలో సింగిల్ బెంచ్ స్టే ఇచ్చింది. అయితే, వీటిపై సానుకూల తీర్పు వెలువడి, త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందనే అంచనాలతో ఆశావహులు తమ పని తాము చేసుకుంటూ వెళ్లిపోతున్నారు. రిజర్వేషన్లు, స్టేలపైనే ఉత్కంఠ.. ఓటర్ల జాబితాలో అవకతవకలు, కొత్త మున్సిపల్ చట్టం ప్రకారం వార్డుల పునర్విభజన అంశాల్లో గతంలో స్టేలు వచ్చిన మున్సిపాలిటీలపై సోమవారం హైకోర్టు విచారించనుంది. విచారించాల్సిన కేసుల జాబితాలో దీనిని కూడా చేర్చినా.. సోమవారం విచారణకు వస్తుందా.. లేదా మళ్లీ వాయిదా పడుతుందా.. ఒకవేళ విచారణ జరిగితే ఏం తీర్పు వస్తుంది అనే లెక్కల్లో స్థానిక రాజకీయ యంత్రాంగం నిమగ్నమైంది. దీనికి తోడు కోర్టు గ్రీన్సిగ్నల్ ఇస్తే రిజర్వేషన్లు రెండు, మూడు రోజుల్లోనే ప్రకటిస్తారనే ప్రచారం నేపథ్యంలో ఏ వార్డు ఎవరికి రిజర్వ్ అవుతుందన్న దానిపైనా రాజకీయ నాయకుల్లో ఉత్కంఠ కనిపిస్తోంది. ముఖ్యంగా కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీలపై ఈ రిజర్వేషన్ల అంచనాలు ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. పాత మున్సిపాలిటీల విషయానికి వస్తే గతంలో ఎప్పుడు ఏ వర్గానికి రిజర్వ్ అయింది? ఈసారి ఎవరికి అవకాశం ఉందన్న దానిపై మాజీ కౌన్సిలర్లు, కొత్తగా కౌన్సిలర్లు కావాలనుకుంటున్న వారు లెక్కలు వేసుకుంటున్నారు. తమ వర్గానికే రిజర్వ్ అవుతుందా లేదా తమ వర్గానికి చెందిన మహిళకు రిజర్వ్ అవుతుందా.. అలా అయితే తాను కాకుండా తన భార్య లేదా ఇతర కుటుంబ సభ్యులను రంగంలోకి దింపాలా అనే తర్జనభర్జనలు పడుతున్నారు. ఒకవేళ తాము ఆశించిన వార్డులో రిజర్వేషన్ రాకపోతే తమకు అనుకూల రిజర్వేషన్ వచ్చే వార్డులు ఏమున్నాయి.. అక్కడ పోటీ చేయాలా వద్దా అనే అంశాలపై కూడా నేతలు చర్చోపచర్చలు జరుపుతున్నారు. అప్పుడే వార్డుల బాట కోర్టు తీర్పులు, రిజర్వేషన్లు ఎలా ఉన్నా స్థానిక ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు ఔత్సాహికులు అప్పుడే వార్డుల బాట పట్టారు. తమకు అందుబాటులో ఉన్న ఓటరు జాబితాలను తీసుకుని పార్టీ పరంగా, వ్యక్తిగతంగా తమకు అనుకూలంగా ఉన్న ఓట్ల లెక్కలు వేసుకుంటున్నారు. ఫలానా వార్డులో ఏ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువగా ఉన్నారు? గతంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? వార్డుల పునరి్వభజన జరిగిన తర్వాతి పరిస్థితేంటి? తమకు కలిసి వచ్చే అంశాలేంటి? ఇతర పారీ్టల నుంచి టికెట్లు ఆశిస్తున్నావారెవరు? ఎవరికి టికెట్ దక్కే అవకాశం ఉందన్న దానిపై సన్నిహితులతో చర్చలు జరుపుతున్నారు. ఇక, ఇతర స్థానిక సంస్థలతో పోలిస్తే నిధులకు ఇబ్బంది లేని నగర, పట్టణ స్థానిక సంస్థల్లో పోటీ చేసేందుకు చాలా మంది ముందుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక ప్రధాన రాజకీయ పక్షాలకు తలనొప్పి కలిగించబోతోందని అంటున్నారు. ప్రసన్నం చేసుకుందాం.. పద ఈసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇప్పటికే కౌన్సిలర్లు, కార్పొరేటర్లుగా పనిచేసిన వారిలో 80 శాతం మంది మళ్లీ సిద్ధపడుతున్నట్టు సమాచారం. వీరికి తోడు కొత్తగా పోటీ చేయాలనుకుంటున్న వారి జాబితా కూడా పెద్దగానే ఉండడంతో ఒక్కో వార్డులో వివిధ పారీ్టల నుంచి ఇద్దరు నుంచి 8 మంది వరకు అభ్యర్థులు పోటీ పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ నుంచి పోటీ చేసేందుకు ఎక్కువ మంది పోటీ పడుతున్నారు. అలాంటివారంతా రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు పార్టీ అగ్రనాయకత్వం వద్ద తమ అభ్యరి్థత్వం కోసం అప్పుడే పైరవీలు కూడా మొదలుపెట్టారు. స్థానికంగా అందుబాటులో ఉన్న నాయకత్వం వద్దకు వెళ్లి తమకు ఈసారి టికెట్ ఇప్పించాలంటూ ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రతిపక్ష పారీ్టలైన కాంగ్రెస్, బీజేపీల నుంచి కూడా టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే కనిపిస్తోంది. వీరితో పాటు స్వతంత్రులు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నారు. వీరంతా నోటిఫికేషన్ ఎప్పుడొస్తుందా అని ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఈసారి పురపోరు రసవత్తరంగా సాగబోతోందని స్థానిక రాజకీయ పరిస్థితులు చెబుతున్నాయి. తప్పులు సవరిస్తే బాగుంటుంది మున్సిపాలిటీ ఎన్నికల కోసం అందరం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. గతంలో స్టేలు వచ్చిన మున్సిపాలిటీల్లో జరిగిన తప్పులు సవరించాల్సి ఉంది. అలాగే వార్డులను ఎల్ ఆకారంలో, జెడ్ ఆకారంలో నిర్ధారించారు. దీంతో కొంత గందరగోళం ఏర్పడింది. అంతా సర్దుబాటు అయితే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని చాలా మంది ఎదురుచూస్తున్నారు. స్టేలు వచి్చన మున్సిపాలిటీలపైప్రభుత్వం సరైన రీతిలో కౌంటర్ వేయాలి. – బుర్రి శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ మాజీ వైస్చైర్మన్, నల్లగొండ -
ప్రత్యక్షమా...పరోక్షమా..?
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్ మేయర్లను నేరుగా ఎన్నుకునే విధానాన్ని తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందా..? ఈ విషయంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించడంతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఈ ఎన్నికలు జరుగుతున్న విధానాన్ని అధ్యయనం చేయాలని సీఎం కేసీఆర్ పురపాలక శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారా..? వారి నివేదిక సానుకూలంగా వస్తే ఈ ఎన్నికను ప్రత్యక్షంగా నిర్వహించేలా కొత్త మున్సిపల్ చట్టంలో పొందుపర్చనున్నారా..? అంటే అవుననే అంటున్నాయి ఉన్నతస్థాయి వర్గాలు. తుది నిర్ణయం దశకు ఇంకా రానప్పటికీ ప్రత్యక్ష పద్ధతిలో పురపాలక సంఘాలకు ఎన్నికలు జరిపితే ఎలా ఉంటుందనేది మాత్రం రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందని తెలుస్తోంది. ఇటీవల మున్సిపల్ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చిందని సమాచారం. ఏకపక్షంగా వ్యవహరిస్తే ఎలా.. ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తే గెలుపొందిన ప్రజాప్రతినిధులు ఏకపక్షంగా వ్యవహరించే అవకాశముంటుందని, రాజ్యాంగ పరంగా అవసరం అయినప్పుడు పదవి నుంచి తప్పించడం కష్టమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అదే సమయంలో ప్రత్యర్థి పార్టీ కార్పొరేటర్లు/కౌన్సిలర్లు ఎక్కువ సంఖ్యలో గెలిస్తే ఆధిపత్య పోరుతో ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అభివృద్ధి ఆగిపోయే అవకాశం ఉందని కూడా భావిస్తోంది. ప్రస్తుత విధానంలో పరోక్ష పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తే పార్టీ ఫిరాయిం పులు, క్యాంపు రాజకీయాలకు అవకాశం ఇచ్చినవారమవుతామనే కోణాన్నీ పరిశీలిస్తోంది. మున్సిపల్ వర్గాల సమాచారం ప్రకారం మహారాష్ట్రలో ఇటీవల జరిగిన ఎన్నికలు మినహా దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో మున్సిపల్ చైర్మన్లు, మేయర్ల ఎన్నికను పరోక్ష పద్ధతిలోనే నిర్వహిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ప్రత్యక్ష పద్ధతిని తీసుకువస్తే బాగుంటుందా..? ప్రస్తుత విధానంలోనే ఎన్నికలకు వెళ్దామా అన్న దానిపై త్వరలోనే సీఎం కేసీఆర్కు ఉన్నతాధికారులు ఓ నివేదిక ఇవ్వనున్నారు. దీన్ని పరిశీలించిన అనంతరం కేసీఆర్ తుది నిర్ణయం తీసు కున్న తర్వాతే కొత్త చట్టంలో పెడతారని, నూతన మున్సిపల్ చట్టం పూర్తయిన తర్వాతే పురపాలక సం ఘాల ఎన్నికల కసరత్తు ప్రారంభిస్తారని తెలుస్తోంది. చట్టం తర్వాతే ఎన్నికలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 142 మున్సిపల్ పాలకవర్గాల పదవీకాలం జూన్తో ముగియనుంది. ఆ తర్వాత కొత్త చట్టానికి రాజముద్ర వేయించుకొని ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. చట్టం మనుగడలోకి వచ్చిన అనంతరం వార్డుల పునర్విభజన చేసిన తర్వాత మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం ముందడుగు వేసే సూచనలు కనిపిస్తున్నాయి. జూన్ నాటికి రెడీ పురపాలక చట్టం ముసాయిదాను చకచకా రూపొందిస్తున్న మున్సిపల్ శాఖ జూన్ నాటికి తుదిరూపు ఇచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఆలోపు వివిధ రాష్ట్రాలు, దేశాల్లో అమలవుతున్న చట్టాలను అధ్యయనం చేస్తోంది. కొత్త చట్టంలో ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలులో ఉద్యోగులు, పాలకవర్గం సభ్యులకు సమష్టి బాధ్యతను అప్పగించాలనే అంశాన్ని పెట్టాలని దాదాపు నిర్ణయించింది. అదే సమయంలో నిధుల దుర్వినియోగం, విధి నిర్వహణలో ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా పాలకవర్గ సభ్యులపై వేటు వేసేలా చట్టంలో ప్రత్యేక సెక్షన్ను పొందుపరుస్తోంది. -
సీటు.. ఫైటు...
తూర్పుగోదావరి, అమలాపురం టౌన్: పట్టణ మున్సిపల్ చైర్మన్ పదవికి జరిగిన జెంటిల్మన్ ఒప్పందం అమలు పట్టణ టీడీపీకి తలకు మించిన భారమైంది. ఆ ఒప్పందం అమలుకు వెసులుబాటు కల్పిస్తూ అప్పటి దాకా పదవుల్లో ఉన్న చైర్మన్, వైస్ చైర్మన్లు రాజీనామాలు చేయడం.. ఈనెల 11న కొత్త చైర్మన్ అభ్యర్థి, నాలుగో వార్డు కౌన్సిలర్ యాళ్ల నాగ సతీష్ చైర్మన్ పీఠం ఎక్కేందుకు ఎన్నికల సంఘం తేదీ ప్రకటించడంతో అక్కడితో కథ సుఖాంతమైందని అందరూ అనుకున్నారు. అయితే వైస్ చైర్పర్సన్ ఎంపిక పట్టణ టీడీపీలోనే కాదు.. మున్సిపల్ కౌన్సిల్లో కూడా తలనొప్పి వ్యవహారంగా తయారైంది. జెంటిల్మన్ ఒప్పందం అమలు నేపథ్యంలో ఇప్పటికే పట్టణ టీడీపీ, కౌన్సిల్లో రెండు వర్గాలు అనివార్యమయ్యాయి. తాజాగా ఆ రెండు వర్గాలు వైస్ చైర్పర్సన్ ఎంపికపై మల్లగుల్లాలు పడుతున్నాయి. ఈ ఎంపికలో తమ పట్టు నిలబెట్టు కోవాలని రెండు వర్గాలూ పావులు కదుపుతున్నాయి. ఎవరి వాదన వారిది కాబోయే చైర్మన్ అభ్యర్థి నాగ సతీష్ వర్గం వైస్ చైర్పర్సన్ అభ్యర్థిగా జెంటిల్మన్ ఒప్పందం అమలు కోసం తొలుత రాజీనామా చేసిన వైస్ చైర్పర్సన్ పెచ్చెట్టి విజయలక్ష్మినే ప్రకటించాలని నిర్ణయించుకుంది. అలాగే మాజీ చైర్మన్ గణేష్ వర్గం 23వ వార్డు కౌన్సిలర్ దంగేటి విజయగౌరిని వైస్ చైర్పర్సన్ చేయాలని పట్టుబడుతోంది. వీరినే ఎందుకు వైస్ చైర్పర్సన్ చేయాలనే అంశంపై ఇరు వర్గాలకు చెందిన నాయకులు ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు. అసలు జెంటిల్మన్ ఒప్పందం అమలుకు వెసులబాటు కల్పిస్తూ ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయకుండా స్వచ్ఛందంగా తన వైస్ చైర్పర్సన్ పదవికి రాజీనామా చేసిన పెచ్చెట్టి విజయలక్ష్మిని మళ్లీ అదే పదవిలో కూర్చోబెట్టడం సమంజసమని నాగ సతీష్ వర్గం స్పష్టం చేస్తోంది. పైపెచ్చు కౌన్సిల్ తొలి చైర్మన్ యాళ్ల మల్లేశ్వరరావు మరణం తర్వాత వైస్ చైర్పర్సన్గా ఉన్న ఆమె ఇన్ఛార్జి చైర్పర్సన్గా బాధ్యతలు కూడా కొన్ని నెలల పాటు చేపట్టారు. ఇదే కౌన్సిల్లో ఇన్చార్జి చైర్పర్సన్గా, వైస్ చైర్పర్సన్గా రెండు పదవులు చేపట్టిన ఆమెకు అంతే గౌరవం ఇస్తూ తిరిగి వైస్ చైర్పర్సన్ పదవి ఇవ్వడం సముచితమని నాగ సతీష్ వర్గం పేర్కొంటోంది. గణేష్ వర్గం మరో వాదన వినిపిస్తోంది. విజయలక్ష్మి ఇప్పటికే ఇదే కౌన్సిల్లో చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ పదవులు చేపట్టారు. ఇప్పుడు ఆమె సామాజిక వర్గానికి చెందిన 23వ వార్డు కౌన్సిలర్ విజయగౌరికి కొత్తగా అవకాశం ఇస్తే పార్టీలో మహిళా కౌన్సిలర్లకు తగిన ప్రాధాన్యం ఇచ్చినట్టు ఉంటుందని గణేష్ వర్గం అంటోంది. ఈ రెండు వర్గాలు వైస్ చైర్పర్సన్ ఎన్నికలో పైకి ఎవరి వాదన వారు వినిపిస్తున్నా ఆధిపత్య పోరు కోసం.. తమ మాటే చెల్లుబాటు కావాలన్న తాపత్రయంతో పావులు కదుపుతున్నాయన్నది వాస్తవం. ప్యానల్ చైర్మన్ ఎంపికలా కాకూడదని ప్రతివ్యూహం చైర్మన్ పదవికి గణేష్ రాజీనామా చేసిన తర్వాత ఆయన రాజీనామాను ఆమోదించేందుకు గత నెల 27న నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో ప్యానల్ చైర్మన్ కమిటీలో ఉన్న నలుగురులో ఒకరిని ప్యానల్ చైర్మన్గా చేయాల్సి వచ్చినప్పుడు గణేష్ వర్గం మాటే చెల్లుబాటైంది. ఆ ప్యానల్ కమిటీలో ప్రాధాన్య క్రమ సంఖ్యలో రెండో స్థానంలో ఉన్న 12వ వార్డు కౌన్సిలర్ వెలిగట్ల రామలక్ష్మణరావు పేరు ఉన్నా నాలుగో సంఖ్యలో ఉన్న 27వ వార్డు కౌన్సిలర్ గంపల నాగలక్ష్మికి ప్యానల్ చైర్పర్సన్గా ఆమెను చైర్మన్ పీఠంపై కూర్చోబెట్టడంలో గణేష్ వర్గం సఫలీకృతమైంది. అప్పుడు కూడా కౌన్సిల్, పట్టణ టీడీపీలో భిన్నాభిప్రాయాలు, అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈనెల 11న జరిగే వైస్ చైర్పర్సన్ ఎన్నిక ప్యానల్ చైర్మన్ ఎంపికలా కాకూడదని.. కానివ్వబోమని నాగ సతీష్ వర్గం బలమైన నిర్ణయానికి వచ్చింది. అందుకు ప్రతి వ్యూహ రచనలో ఉంది. ఈ విషయంలో మాజీ చైర్మన్ గణేష్ వర్గం మాటకు పట్టణ టీడీపీ మద్దతు పలుకుతుందా? నాగ సతీష్ వర్గం ప్రతిపాదనకు విలువ ఇస్తుందా? అనేది వేచి చూడాల్సిందే. అయితే ఆది నుంచి జెంటిల్మన్ ఒప్పందం అమలు బాధ్యతను ఉప ముఖ్యమంత్రి చిన రాజప్ప సూచనతో భుజాన వేసుకున్న రాష్ట్ర గిడ్డంగుల సంస్థ డైరెక్టర్ మెట్ల రమణబాబు మాటే వైస్ చైర్పర్సన్ ఎన్నికలో శిరోధార్యం కానుంది. ఆయన వర్గ పోరుకు ప్రాధాన్యం ఇచ్చి ఓ వర్గానికి కొమ్ము కాసినట్టు వ్యవహరిస్తారో, వాస్తవ పరిస్థితులకు విలువ ఇచ్చి తనకు అప్పగించిన బాధ్యతలను విజ్ఞతతో నిర్వర్తిస్తారో ఎదురు చూడాల్సిందే. -
కడప చైర్మన్కు చుక్కెదురు
మున్సిపల్ చైర్మన్కు సొంత పార్టీ కౌన్సిలర్ల నుంచే రెండో సారి చుక్కెదురైంది. కౌన్సిల్ సమావేశానికి హాజరు కాకపోవడం, అటు వైఎస్సార్సీపీ కౌన్సిర్లు గైర్హాజరు కావడంతో కోరం లేక సమావేశం వాయిదా వేశారు. సమావేశానికి హాజరైన వరదవర్గ కౌన్సిలర్లు, అధికారులు సమావేశం నుంచి వెళ్లి పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికార పార్టీలో మరోసారి వర్గ విభేదాలు బయటపడ్డాయి. ప్రొద్దుటూరు టౌన్ : ప్రొద్దుటూరు మున్సిపల్ కౌన్సిల్లో శుక్రవారం ఉదయం 11 గంటలకు మున్సిపల్ చైర్మన్ ఆసం రఘురామిరెడ్డి అధ్యక్షతన సమావేశం ప్రారంభమైంది. మున్సిపల్ కమిషనర్ చంద్రమౌళీశ్వర్రెడ్డితోపాటు అధికారులందరూ సమావేశానికి హాజరయ్యారు. అయితే ఎంపీ రమేశ్ వర్గానికి చెందిన కౌన్సిలర్లు వీఎస్ ముక్తియార్, వైస్ చైర్మన్ జబీవుల్లా, ఉండేల గురివిరెడ్డి, సీతారామిరెడ్డిలతో పాటు 16 మంది గైర్హాజరయ్యారు. అలాగే ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి, వైఎస్సార్సీపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వంగనూరు మురళీధర్రెడ్డితోపాటు 9 మంది కౌన్సిలర్లు గైర్హాజరయ్యారు. క్యాంటీన్ నిర్మాణంపై రగడ పాత బస్టాండ్లో అన్న క్యాంటీన్ నిర్మాణ విషయంపై గత కొంత కాలంగా కౌన్సిల్లో రగడ జరుగతోంది. 50 ఏళ్ల కిందట నిర్మించిన పాత బస్టాండ్ను తొలగించడంతోపాటు రెండు మున్సిపల్ గదులు, 40 మందికి పైగా చిరు వ్యాపారులు అన్న క్యాంటీన్ నిర్మిస్తే తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ విషయంపై ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి తొలి నుంచి ఆందోళన చేస్తున్నారు. త్రీటౌన్ పోలీస్స్టేషన్ పక్కన నిర్మించాలని ఎమ్మెల్యే చెప్పారు. పేదలకు అన్నం పెడతామంటూ పేదల కడుపుకొట్టడాన్ని వైఎస్సార్సీపీ వ్యతిరేకిస్తోందన్నారు. 21 మంది టీడీపీ కౌన్సిలర్లు మద్దతు ఎంపీ రమేశ్ వర్గ కౌన్సిలర్లు కూడా అక్కడి చిరువ్యాపారులకు మద్దతు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే మల్లేల లింగారెడ్డితోపాటు 21 మంది కౌన్సిలర్లు త్రీటౌన్పోలీస్స్టేషన్ పక్కన ఉన్న మున్సిపల్ స్థలంలోనే అన్నక్యాంటీన్ నిర్మించాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రత్యేక రిక్విజియేషన్ సమావేశం ఏర్పాటు చేసి తీర్మానం చేశారు. ఈ సమావేశానికి వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు, ఎమ్మెల్యే మద్దతు తెలపడంతో 31 మంది తీర్మానం చేశారు. అయితే మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి కొద్ది రోజుల కిందట రెండు జేసీబీలను తీసుకొచ్చి దగ్గరుండి పాత బస్టాండ్ను కూల్చి వేశారు. వ్యాపారుల బంకులను రోడ్డుపైకి నెట్టివేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అప్పటి నుంచి వ్యాపారులను ఖాళీ చేయాలంటూ బెదిరిస్తూనే ఉన్నారు. అజెండాలో 78వ అంశంగా... శుక్రవారం మున్సిపల్ కౌన్సిల్ సమావేశపు అంజెండాలో పాత బస్టాండ్లో అన్నక్యాంటీన్ నిర్మించాలని 78వ అంశంగా చేర్చారు. రిక్విజియేషన్ సమావేశం తీర్మానం ఉండగా ఎలా ఈ అంశాన్ని అజెండాలోకి తెచ్చారని ఎమ్మెల్యేతోపాటు ఎంపీ రమేశ్ వర్గ కౌన్సిలర్లు ప్రశ్నించారు. దీనికి నిరసనగా కౌన్సిల్ సమావేశానికి గైర్హాజరయ్యారు. అయితే వరద వర్గానికి చెందిన 11 మంది కౌన్సిలర్లు సమావేశానికి హాజరైనా కోరం లేకపోవడంతో సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు మున్సిపల్ చైర్మన్ ప్రకటించారు. చైర్మన్ మాట్లాడుతూ సొంత టీడీపీ కౌన్సిలర్లు సమావేశానికి రాకపోవడం చాలా దారుణమని అన్నారు. -
‘నేను పోటీలో ఉంటా’
సాక్షి, కోదాడ : కోదాడ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా ఉంటానని నియోజకవర్గ ఇన్చార్జి కన్మంతరెడ్డి శశిధర్రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ టికెట్ మల్లయ్యకు ఇస్తున్నారనే సమాచారం మేరకు ఆదివారం ఆయన అనుచరులతో కలిసి సూర్యాపేటలోని మంత్రి ఇంటి ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ మెరకు మంత్రి తనకు ఎటువంటి సంబంధం లేదని, పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుందని చెప్పడంతో వారు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. అనంతరం కోదాడ వచ్చి ఆయన పార్టీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి పార్టీ తనకే టికెట్ ఇస్తుందని, సోమవారం నామినేషన్ వేస్తానని ప్రకటించారు. కానీ సాయంత్రానికి పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కోదాడ టికెట్ను బొల్లం మల్లయ్యకు ఇస్తున్నట్లు ప్రకటించడంతో టీఆర్ఎస్ కార్యాలయంలో విషాదం నెలకొంది. చందర్రావు నివాసంలో సంబరాలు.. టికెట్ బొల్లం మల్లయ్య యాదవ్కు ప్రకటించడంతో ఆయన చందర్రావు ఇంటికి వెళ్లి అక్కడ మిఠాయిలు పంచుకున్నారు. కోదాడ మున్సిపల్ చైర్పర్సన్ వంటిపులి అనిత తదితరులు స్వీట్లు పంచారు. అనంతరం మల్లయ్య పార్టీ కార్యాలయంలో ఉన్న శశిధర్రెడ్డి వద్దకు రావడంతో పలువురు కార్యకర్తలు టికెట్ వద్దని చెప్పాలని మల్లయ్యను పట్టుబట్టారు. ఆస్తులు ఆమ్ముకొని పార్టీని బతికించాను. కోదాడ నియోజకవర్గంలో 2010 నుంచి పార్టీ కోసం ఆస్తులను ఆమ్మి కష్టపడ్డానని చెప్పారు. రెండు రోజుల క్రితం బొల్లం మల్లయ్యను పార్టీలో చేర్చుకోవాలని పార్టీ చెపితే నాలుగు లక్షల రూపాయల ఖర్చు పెట్టి హైదరాబాద్కు తీసుకెళ్లానన్నారు. తనకు సమాచారం ఇవ్వకుండా ఇతరులకు టికెట్ ఇస్తామనడం అన్యాయమన్నారు. తాను సోమవారం నామినేషన్ దాఖలు చేస్తానని, జరిగిన అన్యాయం ఇంటింటికి తిరిగి చెపుతానని నియోజకర్గ ప్రజలు తనను ఆదరిస్తారనే నమ్మకం తనకు ఉందని తెలిపారు. -
బాలాజీ నాయుడు: 32 కేసులు.. 21 సార్లు జైలుకు!
రాజకీయ నేతలనే లక్ష్యంగా నేరాలకు పాల్పడుతున్న ఘరానా మోసగాడు తోట బాలాజీ నాయుడు మరోసారి పోలీసులకు చిక్కాడు. తాజాగా సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ భర్తను మోసగించిన కేసులో సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఇప్పటి దాకా వివిధ ప్రభుత్వ పథకాల పేరు చెప్పి 30 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలను బురిడీ కొట్టించిన ఇతగాడిపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని 29 పోలీస్ స్టేషన్లలో 32 కేసులు నమోదవగా 21 సార్లు జైలుకు వెళ్లాడు. సాక్షి, సిటీబ్యూరో: అతను తూర్పుగోదావరి జిల్లాలో పుట్టాడు... కరీంనగర్, ఖమ్మం, విశాఖ జిల్లాల్లో పని చేశాడు... గుంటూరు జిల్లాలో స్థిరపడ్డాడు.రాజకీయ నేతలనే లక్ష్యంగా చేసుకొని వివిధ ప్రభుత్వ పథకాల పేరు చెప్పి 30 మంది ఎంపీ, ఎమ్మెల్యేలను బురిడీ కొట్టించాడు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని 29 పోలీస్ స్టేషన్లలో అతనిపై 32 కేసులు ఉండగా... 21 సార్లు జైలుకు వెళ్లాడు. ఇదీ ఘరానా మోసగాడు తోట బాలాజీ నాయుడి నేర చరిత్ర . తాజాగా సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ భర్తను మోసగించిన కేసులో సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులకు చిక్కినట్లు డీసీపీ పి.రాధాకిషన్రావు ఆదివారం వెల్లడించారు. ఏసీబీకి చిక్కి... తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడికి చెందిన తోట బాలాజీ నాయుడు కాకినాడలోని జేఎన్టీయూలో బీటెక్ పూర్తి చేశాడు. 2003లో ఎన్టీపీసీలో జూనియర్ ఇంజినీర్గా చేరి రామగుండం, పాల్వంచ, విశాఖపట్నం ప్రాంతాల్లో పని చేశాడు. విశాఖలో విధులు నిర్వహిస్తుండగా 2008లో అప్పటి తణుకు ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడు ఆనంద్ నుంచి రూ.25 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కి, ఆ కేసు రుజువై ఉద్యోగం కోల్పోయాడు. విశాఖ జైలులో ఉండగా పాత నేరగాళ్లతో జట్టుకట్టి బయటకు వచ్చిన ఇతను మోసాలనే వృత్తిగా మార్చుకున్నాడు. విజయనగరంతో పాటు వివిధ ప్రాంతాల ప్రజాప్రతినిధుల వ్యక్తిగత కార్యదర్శులకు ఫోన్లు చేసి ఎన్టీపీసీలో ఉద్యోగాలంటూ, వారి నియోజకవర్గం నుంచి యువతను సిఫార్సు చేయాలని సంబంధిత ఎమ్మెల్యేలకు సూచించాలని ఎర వేసి, డిపాజిట్ పేరుతో కొంత మొత్తం దండుకొని మోసం చేశాడు. దీంతో విజయనగరం పోలీసులు 2009లో అరెస్టు చేసి జైలుకు పంపారు. నల్గొండ జిల్లాలోనూ ఇదే తరహాలో మోసం చేయడంతో 2010లో యాదగిరిగుట్ట పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. తూర్పుగోదావరి జిల్లా నర్సాపురం పోలీస్స్టేషన్ పరిధిలో రాజీవ్ ఆరోగ్యశ్రీలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నేతల నుంచే రూ.1.5 లక్షలు వసూలు చేసి జైలుకు వెళ్లాడు. ఈ నేపథ్యంలోనే సత్యనారాయణ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి ముఠా కట్టి కొన్ని నేరాలు చేశాడు. బీఎస్ఎన్ఎల్ నుంచి ఫోన్ నెంబర్లు... బీఎస్ఎన్ఎల్ సంస్థకు చెందిన ఎంక్వైరీ నెం.197ను సంప్రదించి అవనిగడ్డ, విజయనగరం, చిలకలూరిపేట, బొబ్బిలి, నర్సాపురం, బెంగళూరు, అంబర్పేట, యాదగిరిగుట్ట, సాలూరు, చీపురుపల్లి, పొన్నూరు, కారంచేడులకు చెందిన ప్రజా ప్రతినిధుల ఫోన్ నెంబర్లు తెలుసుకుని 2013లో వారిని టార్గెట్ చేశాడు. రాజీవ్ యువకిరణాల ప్రాజెక్ట్ డైరెక్టర్నంటూ ఎర వేశాడు. వారి పీఏల ద్వారా ఒక్కో అభ్యర్థికి రూ.1,060 వంతున డిపాజిట్ పేరిట రూ.3.50 లక్షలు రాబట్టాడు. కొందరు నిరుద్యోగులను సైతం ముంచాడు. వీటిపై బీజేపీ నేత రాంజగదీష్ ఫిర్యాదు మేరకు కాచిగూడ పోలీసులు 2013 ఫిబ్రవరిలో అతడిని అరెస్టు చేశారు. ముగ్గురు ఎంపీలకూ.. బెయిల్పై బయటకు వచ్చిన బాలాజీ అప్పటి ఎంపీలు వి.హనుమంతరావు (వీహెచ్), దేవేందర్గౌడ్, పాల్వాయి గోవర్థన్లను టార్గెట్ చేశాడు. వీహెచ్ రూ.1,09,500, దేవేందర్గౌడ్ నుంచి రూ.66,000, గోవర్థన్ రూ.1,32,00 డిపాజిట్ చేశారు. తర్వాత వారికి అనుమానం వచ్చి ఫిర్యాదు చేయడంతో అరెస్టయ్యాడు. 2015లో మల్కాజ్గిరి ఎమ్మెల్యేకు రూ.90 వేలు టోకరా వేసి చిక్కాడు. కేంద్ర పథకం పేరుతో ఎమ్మెల్సీని... బాలాజీ నాయుడిని హైదరాబాద్ పోలీసులు గతేడాది జనవరిలో పీడీ చట్టం కింద ఏడాది పాటు జైలుకు పంపారు. ఈ ఏడాది జనవరిలో విడుదలైన ఇతను సిటీతో పాటు ఏపీ, తెలంగాణల్లో పలు మోసాలు చేశాడు. సెప్టెంబర్ 12న తెలంగాణ ఎమ్మెల్సీ ఆకుల లలితకు ఫోన్చేసి తనను కేంద్ర ప్రభుత్వ ఉన్నతోద్యోగిగా పరిచయం చేసుకున్నాడు. కేంద్ర పథకాలకు చెందిన రూ.2 కోట్లు పెండింగ్లో ఉన్నాయని, ఐదు శాతం చెల్లిస్తే ఆ మొత్తం విడుదల చేయిస్తానంటూ చెప్పాడు. దీంతో ఆమె తన కుమారుడు దీపక్ ద్వారా బాలాజీ చెప్పిన బ్యాంకు ఖాతాలో రూ.10 లక్షలు వేయించారు. తాజాగా సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ భర్త ప్రకాశ్కు ఫోన్ చేసి వారి మున్సిపాలిటీకి చెందిన రూ.2 కోట్ల కేంద్ర నిధులు పెండింగ్లో ఉన్నాయనీ, రూ.30 వేలు చెల్లిస్తే క్లియర్ చేస్తానంటూ నమ్మించాడు. ఈ మోసంపై సూర్యాపేట టూటౌన్ ఠాణాలో కేసు నమోదైంది. బాలాజీ నాయుడి కదలికలపై సమాచారం అందుకున్న హైదరాబాద్ సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ సాయిని శ్రీనివాసరావు నేతృత్వంలో ఎస్సై కె.శ్రీనివాసులు వలపన్ని ఆదివారం పట్టుకున్నారు. నిందితుడు మనోహర్, లక్ష్మణ్, మల్లేశ్ పేర్లతోనూ చెలామణీ అయినట్లు గుర్తించారు. -
బెల్లంపల్లి మున్సిపల్ చైర్పర్సన్ రాజీనామా
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: బెల్లంపల్లి మున్సిపల్ చైర్పర్సన్ సునీతారాణి పదవికి రాజీనామా చేశారు. సునీతారాణిపై 29 మంది సభ్యులు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై గురువారం ఓటింగ్ జరగాల్సి ఉంది. దీనికి ఒక రోజు ముందే బుధవారం సాయంత్రం ఆమె తన రాజీనామాను కలెక్టర్ ఆర్వీ కర్ణన్కు అందజేశారు. వ్యక్తిగత కారణాలతో చైర్పర్సన్ పదవికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. చైర్పర్సన్పై అవిశ్వాస తీర్మానం రాకుండా చూసేందుకు, క్యాంపులో ఉన్న కౌన్సిలర్లను వెనక్కి రప్పించేందుకు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మంత్రుల స్థాయిలో ప్రయత్నాలు చేసినా సఫలం కాలేదు. అవిశ్వాస తీర్మా నంపై ప్రత్యేకంగా కౌన్సిల్ను సమా వేశపరిచే అర్హత కలెక్టర్కు లేదని హైకోర్టును ఆశ్రయించారు. 28 మంది సభ్యులు కలసి ఒక కౌన్సిలర్ ను కిడ్నాప్ చేశారని కోర్టుకు నివేదిస్తూ తనపై అవిశ్వాసం పెట్టిన తీర్మానాన్ని తిరస్కరించాలని కోరారు. అయితే, కోర్టులో కూడా ఆమెకుచుక్కెదురైంది. పిటిషన్ను కోర్టు కొట్టేయడంతో గురువారం జరిగే కౌన్సిల్ సమావేశంలో ఓటమి తప్పదని నిర్ణయించుకున్న ఆమె కలెక్టర్ కార్యాలయంలో రాజీనామా అందజేశారు. -
పక్కా స్కెచ్తో..
పెద్దాపురం: పట్టణ ప్రథమ పౌరుడు, పెద్దాపురం మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజును హత్య చేసే కుట్ర విఫలమైంది. గుర్తు తెలియని దుండగులు చైర్మన్ను హత్య చేసేందుకు పన్నిన కుట్రను పెద్దాపురం పోలీసులు భగ్నం చేశారు. 15 రోజులుగా ఆయనను హత్య చేసేందుకు స్థానికంగా ఓ లాడ్జిలో ఉంటూ సూరిబాబు రాజు ఏ సమయానికి ఎక్కడ వెళతారన్న పూర్తి సమాచారాన్ని తెలుసుకుంటూ రెక్కీ నిర్వహిస్తున్నట్టు తెలిసింది. పట్టణంలోని ఆరో వార్డులో ఓ స్థల వివాదానికి సంబంధించి సూరిబాబు రాజు వద్దకు కొందరు వచ్చారు. వారికి మద్దతుగా ఆయన ఇచ్చిన తీర్పు నచ్చకపోవడంతో వ్యతిరేక వర్గీయులు ఆయనపై హత్యాయత్నానికి కుట్రపన్నారన్న వార్తలు శుక్రవారం మధ్యాహ్నం పట్టణంలో దావణంలా వ్యాపించాయి. గురువారం రాత్రి క్రికెట్ బెట్టింగ్ల కోసం దాడులు నిర్వహించిన పోలీసులకు నలుగురు వ్యక్తులు మారణాయుధాలతో కనిపించారు. అనుమానం వచ్చిన పోలీసులు వారిని విచారిస్తుండగా.. ఈలోపు ఇద్దరు వ్యక్తులు అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో పోలీసులు మిగిలిన ఇద్దరిని విచారించగా.. చైర్మన్ సూరిబాబు రాజును హత్య చేసేందుకు వచ్చినట్టుగా వారు పోలీసుల వద్ద అంగీకరించినట్టు తెలిసింది. గతంలో టెన్నిస్ కోర్టు, వాకింగ్ వెళుతున్నప్పుడు, ఓ వివాహ వేడుకలో కూడా చైర్మన్ సూరిబాబు రాజుపై అటాక్ చేసే ప్రయత్నం చేశారని తెలుస్తోంది. రాజమండ్రి, ఏలూరు, పెద్దాపురం ప్రాంతాలకు చెందిన వారే ఆయనపై హత్య చేసే కుట్ర పన్నినట్టు చైర్మన్ వర్గీయులు చెబుతున్నారు. పోలీసులు అప్రమత్తం కావడంతో ఇరువురు వ్యక్తులను అదుపులోకి తీసుకోగా, మరో ఇరువురు పరారీలో ఉన్నారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తులను సామర్లకోట క్రైం స్టేషన్లో విచారిస్తున్నట్టు తెలిసింది. -
మదనపల్లె టీడీపీ మున్సిపల్ చైర్మన్ పై దాడి
మదనపల్లె : చిత్తూరు జిల్లా మదనపల్లె టీడీపీ మున్సిపల్ చైర్మన్ కొడవలి శివప్రసాద్పై ఆదివారం మున్సిపల్ కార్యాలయ ఆవరణలో కమిషనర్ భవానీప్రసాద్, సహచర కౌన్సిలర్లు, పార్టీ నాయకులు అందరూ చూస్తుండగానే టీడీపీ నాయకుడు బోయపాటి సురేష్ దాడి చేశారు. టీడీపీ పార్టీలో అంతర్గతంగా ఉన్న గ్రూపులు, వివాదాలకు ఈ ఘటన మరింత బలాన్ని చేకూర్చినట్లయింది. తాను బీసీని కావడంతోనే టీడీపీలోని ఓ వర్గం నాయకులు దాడి చేశారని చైర్మన్ కన్నీటి పర్యంతమయ్యారు. టీడీపీ సీనియర్ నాయకుడు గంగారపు రాందాస్చౌదరి నుంచి తనకు ప్రాణహాని ఉందని, తనకు జరిగిన ప రాభవంపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించాల ని విజ్ఞప్తి చేశారు. జరిగిన సంఘటనపై ఇరువర్గాలు పో లీస్ స్టేషన్లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. అసలు ఏమి జరిగిందంటే.. బెంగళూరు బస్టాండులోని బడేమకాన్ భూములకు సంబంధించి చాలా రోజులుగా టీడీపీ నాయకుల మద్య అంతర్ యుద్ధం కొనసాగుతోంది. స్థలానికి సం బంధించి కోర్టు తమకు అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చిందని, తమకు స్థలాన్ని స్వాధీనం చేయాలని టీడీపీలోని ఓ వర్గం నాయకులు మున్సిపల్ కార్యాలయం చుట్టూ చాలాకాలంగా తిరుగుతున్నారు. చైర్మన్ను కలి సి తమకు సహకరించాలని కోరినట్టు తెలిసింది. అందుకు ఆయన సహకరించలేదు. పైగా వారికి స్థలం దక్కకుండా చేసేందుకు శివప్రసాద్ ప్రయత్నించినట్లు సమాచారం. అంతేకాకుండా స్థలంలో తనకు ఐదు కుం టలు ఇస్తే పని సజావుగా జరగనిస్తానని, లేకుంటే తాను పదవిలో ఉండేంత వరకు స్థలాన్ని స్వాధీనం చేసుకోలేరని చెప్పినట్లు తెలిసింది. ఈ విషయమై తిరుపతి, చిత్తూరు పార్టీ కార్యాలయాలు, ఇన్చార్జ్ మంత్రుల సమక్షంలోనూ అనేకమార్లు పంచాయితీలు కూడా జరిగినట్లు సమాచారం. ఈ క్రమంలో స్థానిక ఆర్అండ్ బీ అతిథి గృహంలో ఆదివారం ఎమ్మెల్సీ రాజసింహులు(దొరబాబు) నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా బడేమకాన్ భూముల వ్యవహారాన్ని ఎమ్మెల్సీకి చెప్పుకునేందుకు సంబంధిత వ్యక్తులు అక్కడికి వచ్చారు. వారి గురించి దొరబాబుకు చైర్మన్ శివప్రసాద్ తప్పుడు సమాచారం ఇవ్వడంతోపాటు వారిని కలవనీయకుండానే పంపేశారని ప్రత్యర్థుల ఆరోపిస్తున్నారు. ఈ విషయమై అడిగేం దుకు మున్సిపాలిటీకి వచ్చి మాటామాటా పెరగడంతో చైర్మన్ శివప్రసాద్పై దాడికి పాల్పడినట్లు సమాచారం. పరస్పరం సవాళ్లు తనపై జరిగిన దాడిపై ఫిర్యాదు చేసేందుకు చైర్మన్ శివప్రసాద్, కౌన్సిలర్లు, పార్టీ నాయకులతో కలిసి వన్టౌన్ పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. అలాగే కమిషనర్ భవానీప్రసాద్, మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ కూడా వచ్చారు. తమకు జరిగిన అన్యాయంపై సీఐ నిరంజన్కుమార్కు వివరిస్తుండగానే మరో వర్గానికి చెందిన గంగారపు రాందాస్ చౌదరి, సీడ్ మల్లికార్జున నాయుడు, బోడిపాటి శ్రీనివాస్ అక్కడికి వచ్చారు. ఈ క్రమంలో ఇరు వర్గాల వారు పరస్పరం సవాళ్లు విసురుకున్నారు. విస్తుపోయిన సీఐ బలప్రదర్శనలకు సమయం కాదని వారించారు. అధికార పార్టీకి చెందిన నాయకులు భూఆక్రమణల విషయమై మున్సిపాలిటీ కార్యాలయంలో గొడవ పడడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
సంచలన కేసు.. నల్లగొండ సీఐ అదృశ్యం
నల్లగొండ క్రైం: సంచలనం సృష్టించిన మున్సిపల్ చైర్పర్సన్ భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసు విచారణాధికారి, నల్లగొండ టూటౌన్ సీఐ వెంకటేశ్వర్లు అదృశ్యమవ్వడం కలకలం సృష్టించింది. పాలకూరి రమేశ్ హత్య కేసు నిందితులను శుక్రవారం కోర్టులో హాజరుపరిచిన అనంతరం సీఐ వెంకటేశ్వర్లు కనిపించకుండా పోయారు. ఈయన మున్సిపల్ చైర్పర్సన్ భర్త హత్య కేసు విచారణ అధికారి కావడంతో రాజకీయ వర్గాల్లో హాట్టాపిక్గా మారింది. శ్రీనివాస్, పాలకూరి రమేశ్ హత్యలతో సీఐపై పనిభారం పెరిగిపోయింది. శాంతిభద్రతల పరిరక్షణలో అలసత్వం ప్రదర్శించారని ఉన్నతాధికారులు మందలించినట్టు తెలిసింది. అయితే సీఐ తన సన్నిహితుల వద్ద ఇదే విషయాన్ని వెల్లడించి తీవ్ర మనోవేదనకు గురైనట్టు సమాచారం. శ్రీనివాస్ హత్య కేసులో కొందరు నిందితులకు బెయిల్ రావడంతో ఉన్నతాధికారులు సీఐపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. మాడ్గులపల్లి పీఎస్లో సిమ్ కార్డు ఇచ్చి... మానసిక ఒత్తిడిలో ఉన్న సీఐ తన వద్దనున్న ఆయుధాన్ని డ్రైవర్కు, మాడ్గులపల్లి పోలీస్స్టేషన్లో సిమ్కార్డును అప్పగించి వెళ్లిపోయారని తెలిసింది. ఉదయం ఓ సీఐ ఫోన్ చేసినా సీఐ వెంకటేశ్వర్లు రిసీవ్ చేసుకోలేదని సమాచారం. ఇదే విషయాన్ని ఉన్నతాధికారులకు తెలపడంతో సీఐ అదృశ్యమయ్యాడనే వార్త పట్టణంలో దావానలంలా వ్యాపించింది. సీఐ వ్యక్తిగత ఫోన్కూడా స్విచ్చాఫ్ చేసుకోవడం అనుమానాలకు తావిస్తోంది. 30 రోజులు సెలవు కావాలని.. తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్న సీఐ వెంకటేశ్వర్లు.. తనకు నెల రోజులు సెలవు కావాలని డీఎస్పీకి విన్నవించారు. అయితే ప్రస్తుతం సెలవులు ఇవ్వలేమని, మరో వారం తర్వాత పరిశీలిస్తామని ఉన్నతాధికారులు తెలిపినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే సీఐ మనస్తాపం చెంది చెప్పాపెట్టకుండా వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. సంచలన హత్య కేసుల విచారణాధికారి అదృశ్యం కావడంతో రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, సీఐ క్షేమంగా ఉన్నట్లు బంధువులు జిల్లా ఎస్పీని కలసి చెప్పినట్లు తెలిసింది. -
శ్రీనివాస్ హత్య కేసులో నిందితుల గుర్తింపు
సాక్షి, నల్గొండ : నల్గొండలో సంచలనం కలిగించిన కాంగ్రెస్ నేత బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యకేసులో పోలీసులు విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా శ్రీనివాస్ హత్యలో ఏడుగురు పాల్గొన్నట్లు ప్రాధమిక నిర్ధారణకు వచ్చారు. వారిలో లొంగిపోయిన నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. హత్య అనంతరం లొంగిపోయిన వారిలో కత్తల చక్రి, దుర్గయ్య, మాతంగి, మోహన్, గోపి ఉన్నారు. మరో ముగ్గురు రాంబాబు, మల్లేష్, శరత్లు పరారీలో ఉన్నారు. వారివల్లే భర్తను కోల్పోయా శ్రీనివాస్ భార్య, నల్గొండ మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మిని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, జాయింట్ కలెక్టర్ నారాయణ రెడ్డి పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన లక్ష్మి పోలీసుల తీరుపై మండిపడ్డారు. రాత్రి ఫోన్ రాగానే శ్రీనివాస్ బయటకు వెళ్లారని, కాసేపటికే హత్య జరిగిందన్న విషయం తెలిసిందన్నారు. శ్రీనివాస్కు ప్రాణహాని ఉందని చెప్పినా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గన్ లైసెన్స్ ఇవ్వమని అడిగినా పోలీసులు స్పందించలేదని అన్నారు. తమ అభ్యర్థనలను పోలీసులు ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. పోలీసులు నిర్లక్ష్యం కారణంగానే భర్తను పోగొట్టుకున్నానని లక్ష్మి రోదించారు. -
కన్నీరుమున్నీరైన కోమటిరెడ్డి
సాక్షి, నల్గొండ : మున్సిపల్ చైర్ పర్సన్ లక్ష్మీ భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యపై సీనియర్ కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. తమ అనుచరుడు, శ్రీనివాస్ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నేరుగా ఎదుర్కొనే దమ్ము లేకనే దొంగచాటుగా కుట్ర పన్ని శ్రీనివాస్ ప్రాణం తీశారని మండిపడ్డారు. ఒంటరిగా చేసి చంపడం పిరికిపందల చర్య అని పేర్కొన్నారు. 2016 ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలోనే తనకు, తన అనుచరులకు ప్రాణహాని ఉందని ప్రభుత్వానికి ఫిర్యాదు చేశామని, అయినా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని కోమటిరెడ్డి విమర్శించారు. గ్యాంగ్స్టర్ నయీమ్ మనుషులు నాలుగుసార్లు తుపాకీతో బెదిరించారని, భద్రత కల్పించాలని సీఎం కేసీఆర్ను కోరినా స్పందించలేదని ఆరోపించారు. రాష్ట్రంలో నేతల ప్రాణానికే భద్రత లేకుండాపోతోందని, ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. సమాజంలో శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులు అధికార నేతలకు కొమ్ముకాస్తున్నారని మండిపడ్డారు. స్థానిక డీఎస్పీ అధికార పక్షానికి వత్తాసు పలుకుతూ, టీఆర్ఎస్ నేతల రౌడీయిజాన్ని పెంచి పోషిస్తున్నారని, శ్రీనివాస్ హత్యలో డీఎస్పీ పాత్ర ఉందని కోమటిరెడ్డి ఆరోపించారు. కేసు విచారణకు ప్రత్యేక విచారణ కమిటీ వేయాలని ఆయన డిమాండ్ చేశారు. హత్య వెనుక పెద్ద రాజకీయ నాయకుల హస్తం ఉందనే అనుమానం వ్యక్తం చేశారు. తనకు శ్రీనివాస్ లోని లోటు తీర్చలేనిదన్నారు. హత్యకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం శ్రీనివాస్ కుటుంబానికి తగిన న్యాయం, పరిహారం అందించాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. కన్నీరుమున్నీరైన కోమటిరెడ్డి శ్రీనివాస్ హత్య సమాచారం అందుకున్న కోమటిరెడ్డి హుటాహుటిన హైదరాబాద్ నుంచి నల్గొండ చేరుకున్నారు. నిన్నటి వరకూ తనతో పాటు ఉన్న అనుచరుడిని కోల్పోయినందుకు ఆయన కన్నీరుమున్నీరయ్యారు. ఎన్ని ఒత్తిడులు ఎదురైనా శ్రీనివాస్ తనతోపాటు నడిచాడని ఆయన గుర్తు చేసుకున్నారు. కోమటిరెడ్డి బాధపడుతూనే శ్రీనివాస్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. మీకు నేనున్నానంటూ వారికి భరోసా ఇచ్చారు. క్లాక్టవర్ వద్ద బైఠాయింపు ముఖ్య అనుచరుడు శ్రీనివాస్ హత్యపై కోమటిరెడ్డి తీవ్ర ఆవేదనలో ఉన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే శ్రీనివాస్ హత్యకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. హత్యను ఖండిస్తూ ఆయన నల్గొండలో నిరసనకు దిగారు. హత్య కేసులో అసలు దోషులను దాచేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని ఆరోపించారు. హత్యకు కారకులైన అసలు నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని క్లాక్ టవర్ వద్ద బైఠాయించారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రక్తత ఏర్పడింది. అంతేకాకుండా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు భారీగా మొహరించారు. నిరసన కారణం భారీ ట్రాఫిక్జామ్ ఏర్పడిందని, వెంటనే విరమించాలని కోమటిరెడ్డిని కోరారు. -
కోమటి రెడ్డి అనుచరుడి దారుణ హత్య
-
కోమటి రెడ్డి ముఖ్య అనుచరుడి దారుణ హత్య
సాక్షి, నల్గొండ : మున్సిపల్ చైర్పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మీ భర్త శ్రీనివాస్ దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు, శ్రీనివాస్ తలపై బండరాయితో మోది హత మార్చారు. ఆయన ఇంటి సమీపంలోనే జరిగిన హత్య నగరంలో తీవ్ర కలకలం సృష్టించింది. శ్రీనివాస్ నివాసం ఉంటున్న సావర్కర్ నగర్లో రాత్రి 11 గంటల సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు గొడవ పడ్డారు. ఈవిషయంలో స్థానిక కౌన్సిలర్ కుమారుడు మెరగు గోపి సర్దిచెప్పే ప్రయత్నం చేసినట్లు సమాచారం. అయినా గొడవ సద్దుమనకపోవడంతో గోపీ, శ్రీనివాస్కు ఫోన్ చేసి విషయం చెప్పాడు. దీంతో బయటకు వచ్చిన శ్రీనివాస్ వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అయితే క్రమంలో ఇరువర్గాల మధ్య మాటకు మాట పెరగటంతో శ్రీనివాస్ను హత్య చేసి మురికి కాలువలో పడేసినట్లు భావిస్తున్నారు. హత్య అనంతరం నిందితులు నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయారు. శ్రీనివాస్ హత్యపై ఎటువంటి అల్లర్లు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. మృతుడు కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి ముఖ్యఅనుచరుడు. విషయం తెలుసుకున్న కోమటి రెడ్డి హుటాహుటిన హైదరాబాద్ నుంచి నల్గొండ చేరుకొని శ్రీనివాస్ కుటుంబాన్ని ఓదార్చుతున్నారు. -
‘ఎన్ని కుట్రలు చేసినా న్యాయమే గెలిచింది’
సాక్షి, జగ్గయ్యపేట : కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికలో ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా చివరకు న్యాయమే గెలిచిందని వైఎస్ఆర్ సీపీ నేత సామినేని ఉదయభాను అన్నారు. మున్సిపల్ ఛైర్మన్గా వైఎస్ఆర్సీపీ సభ్యుడు ఇంటూరి రాజగోపాల్ ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. అనంతరం సామినేని ఉదయభాను మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికను వాయిదా వేసేందుకు టీడీపీ ఎన్నో కుట్రలు చేసిందని, ప్రలోభాలకు లొంగనివారికి, బెదిరింపులకు గురి చేసిందన్నారు. వైఎస్ఆర్ సీపీకి స్పష్టమైన మెజార్టీ ఉందని, అయితే టీడీపీ సభ్యులను కిడ్నాప్ చేశారంటూ ఆ పార్టీ కొత్త డ్రామాకు తెరలేపిందన్నారు. టీడీపీ అప్రజాస్వామికంగా వ్యవహరించినప్పటికీ... వైఎస్ఆర్ సీపీ సభ్యులు క్రమశిక్షణతో సహనంగా వ్యవహరించారన్నారు. -
జగ్గయ్యపేట మున్సిపల్ ఛైర్మన్ గా రాజగోపాల్
-
జగ్గయ్యపేట మున్సిపల్ ఛైర్మన్ గా రాజగోపాల్
సాక్షి, జగ్గయ్యపేట : కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మున్సిపల్ ఛైర్మన్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇంటూరి రాజగోపాల్ ఎన్నికయ్యారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి శనివారం ఉదయం ఇంటూరి రాజగోపాల్లో మున్సిపల్ ఛైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయించారు. మొత్తం 27 మంది కౌన్సిలర్లలో వైఎస్ఆర్సీపీకి 16, టీడీపీకి 10, ఇతరులు ఒకటి ఉన్నారు. చైర్మన్ ఎన్నిక వాయిదా వేయాలని టీడీపీ నేతలు ఒత్తిడి తెచ్చారు. అయితే ఎన్నిక వాయిదాకు ససేమిరా అనడంతో టీడీపీ సభ్యులు వాకౌట్ చేశారు. కోరం ఉండటంతో ఇంటూరి రాజగోపాల్ ప్రమాణం చేశారు. టీడీపీ నేతల దౌర్జన్యంతో ఛైర్మన్ ఎన్నిక నిన్న వాయిదా పడిన విషయం తెలిసిందే. ఓ వైపు ప్రలోభాలు, మరోవైపు బెదిరింపులకు టీడీపీ పాల్పడినా...వైఎస్ఆర్ సీపీ కౌన్సిలర్లు ఏమాత్రం లెక్కచేయలేదు. దీంతో నాటకీయ పరిణామాల మధ్య జగ్గయ్యపేట మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక ప్రక్రియ పూర్తయింది. మున్సిపల్ ఛైర్మన్గా రాజగోపాల్ ప్రమాణ స్వీకారం -
జగ్గయ్యపేటలో మరో కుట్రకు తెరలేపిన టీడీపీ
సాక్షి, జగ్గయ్యపేట : జగ్గయ్యపేట మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక వాయిదా పడటంతో టీడీపీ మరో కుట్రకు తెరలేపింది. ప్రలోభాలకు లొంగని వైఎస్ఆర్ సీపీ నేతల బెదిరింపులతో అదుపులోకి తెచ్చుకునేందుకు యత్నిస్తోంది. తమకు మద్దతు ఇవ్వకుంటే కేసులు తిరగదోడతామంటూ లీకులు ఇస్తోంది. పార్టీ ఫిరాయించి మద్దతిస్తే కేసులు మాఫీ చేస్తామని టీడీపీ సంకేతాలు పంపిస్తోంది. తాము చెప్పినట్లు వినకుంటే నలుగురు కౌన్సిరల్లను అరెస్ట్ చేస్తామని టీడీపీ నేతలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇక టీడీపీ నేతల హైడ్రామా నేపథ్యంలో జగ్గయ్యపేట మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా పడిన విషయం తెలిసిందే. ఎన్నిక వాయిదాపై రిటర్నింగ్ అధికారి హరీశ్ మాట్లాడుతూ.....‘కౌన్సిల్లో చోటుచేసుకున్న పరిణామాలను ఈసీ దృష్టికి తీసుకెళ్తాం. ఈ రోజు కోరం ఉన్నా ఎన్నిక నిర్వహించే పరిస్థితి లేదు. సర్దిచెప్పినా కొంతమంది సభ్యులు వినిపించుకోలేదు. రేపు ఉదయం ఎన్నిక నిర్వహిస్తాం.’ అని తెలిపారు. మరోవైపు వైఎస్ఆర్ సీపీ నేత సామినేని ఉదయభాను మాట్లాడుతూ... మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక వ్యవహారంలో కావాలనే టీడీపీ నేతలు రాద్ధాంతం చేశారని అన్నారు. టీడీపీ నేతలు రిటర్నింగ్ అధికారిపై ఒత్తిడి తెచ్చి ఎన్నిక వాయిదా వేయించారని ఆయన ఆరోపించారు. కోరం ఉన్నా వాయిదా వేయడంలోని మతలబు ఏంటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. నెల రోజుల నుంచి ప్రలోభాలు, బెదిరింపులకు గురి చేస్తున్నా... తమ కౌన్సిలర్లు లొంగలేదన్నారు. అందుకే టీడీపీ నేతలు విధ్వంసం చేశారని మండిపడ్డారు. తమ పార్టీ కౌన్సిలర్లకు ఏం జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలని సామినేని ఉదయభాను డిమాండ్ చేశారు. కాగా ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంటూ వైఎస్ఆర్ సీపీ నేతలు అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళనకు దిగడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. నిరసనలో పాల్గొన్న సామినేని ఉదయభాను సహా పలువురు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీపీ నేతల అరాచకం.. వైఎస్ఆర్సీపీకి మెజార్టి సభ్యులు ఉండటంతో ఎలాగైనా మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికను అడ్డుకోవాలని టీడీపీ నేతలు అరాచకానికి ఒడిగట్టారు. అధికారులు, ప్రతిపక్ష సభ్యులపై దౌర్జన్యం ప్రదర్శిస్తూ మున్సిపల్ కార్యాలయంలో బీభత్సం సృష్టించారు. ఇద్దరు టీడీపీ మహిళ నాయకులను కౌన్సిలర్గా చూపిస్తూ మున్సిపల్ హాలులోకి టీడీపీ నేతలు తీసుకెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో టీడీపీ నేతల అసలు రంగు బయటపడటంతో కౌన్సిల్ హాలులోని టేబుళ్లను పడేశారు. వైఎస్ఆర్సీపీ ఇచ్చిన ఎన్నికల మెమోరండం పేపర్లను చించిపారేశారు. అలాగే మున్సిపల్ ఆఫీసు ముందు పార్క్ చేసిన బైక్ను టీడీపీ నేతలు పెట్రోల్ పోసి తగులబెట్టారు. ఈ తతంగం అంతా సీసీ ఫుటేజ్లో రికార్డవడంతో తమ కౌన్సిలర్లు ఇద్దరు మాయమయ్యారంటూ ఎన్నిక వాయిదా వేయాలని పట్టుపట్టారు. ఈ గందరగోళంలో అధికారులు చైర్మన్ ఎన్నిక కాసేపు వాయిదా వేసినప్పటికి వ్యవహారం సద్దుమణగపోవడంతో ఎన్నికను రేపటికి వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఛైర్మన్ ఎన్నికల వాయిదా వేయడంపై వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రలోభాలతో మా కౌన్సిలర్లను టీడీపీ నేతలు కొనాలని చూశారని...కుదరకపోవడంతో ఎన్నిక వాయిదా వేయించారని మండిపడ్డారు. రేపు ఉదయం 11 గంటలకు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరుగుతుంది. -
జగ్గయ్యపేట మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక వాయిదా
సాక్షి, జగ్గయ్యపేట : తీవ్ర ఉద్రిక్తతల నడుమ కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మున్సిపల్ చెర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా పడింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఉండటంతో ఎలాగైనా మున్సిపల్ చైర్మన్ ఎన్నికను వాయిదా వేయించేందుకు టీడీపీ నేతలు ఈరోజు ఉదయం నుంచి కుట్ర పన్నారు. పైపెచ్చు టీడీపీ కౌన్సిలర్లను వైఎస్ఆర్ సీపీ నేతలు కిడ్నాప్ చేశారంటూ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్యల నేతృత్వంలో హైడ్రామాకు తెరలేపి చైర్మన్ ఎన్నిక హాల్లో బారికేడ్లను తొలగించి పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అంతటితో ఆగకుండా పోలీసులపైనే దౌర్జన్యానికి దిగారు. మెజార్టీ లేకపోవడంతో ఓడిపోతామనే భయంతో ఎన్నిక నిలిపివేయాలని ఆందోళనకు దిగారు. టీడీపీ నేతలు కౌన్సిల్ హాల్లోని టేబుళ్లను ఎత్తిపడేశారు. ఎన్నిక జరపాలంటూ వైఎస్ఆర్ సీపీ ఇచ్చిన మెమోరాండంను చించివేశారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు యత్నించినా టీడీపీ నేతలు బరితెగించి విధ్వంసానికి దిగారు. దీంతో చేసేదేమీ లేక రిటర్నింగ్ అధికారి...ఎన్నికను రేపటికి వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. రేపు ఉదయం 11 గంటలకు ఎన్నిక నిర్వహిస్తామని ప్రకటన చేశారు. మరోవైపు టీడీపీ కార్యకర్తలు కార్యాలయం ఎదుట బైక్ను తగులబెట్టారు. దీంతో మున్సిపల్ కార్యాలయం వద్ద పోలీసులు 144 సెక్షన్ విధించారు. టీడీపీ నేతల తీరుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు మండిపడ్డారు. ప్రలోభాలతో తమ కౌన్సిలర్లను కొనాలని చూశారని, ఫలించకపోవడంతో ఎన్నిక వాయిదా వేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా మొత్తం 27 కౌన్సిలర్ స్థానాలకు వైఎస్ఆర్ సీపీ 16 కైవసం చేసుకోగా, టీడీపీ 10 స్థానాలకే పరిమితమైంది. -
జగ్గయ్యపేట మున్సిపల్ ఛైర్మన్ రేపటికి ఎన్నిక వాయిదా
-
నేడే వైఎస్ జగన్ రాక
♦ కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారానికి ఆయన రాకతో మరింత జోష్ ♦ ఇప్పటికే రాష్ట్రనేతలతో విస్తృత ప్రచారం ♦ నేటి రోడ్ షో, సభలకు వైఎస్సార్సీపీ పకడ్బందీ ఏర్పాట్లు కాకినాడ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచార హోరుకు ఆదివారంతో తెర పడనున్న నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రచారానికి వస్తున్నందున ప్రతిపక్ష పార్టీ అభ్యర్థుల్లో మరింత ఊపు పెంచనుంది. 12 రోజులపాటు సాగిన ప్రచార పర్వంలో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులు హోరా హోరా హోరీగా తలపడ్డారు. అధికార దర్పం, అర్థ బలాన్ని ప్రధానంగా ప్రదర్శించడంతోపాటుగా అందుబాటులోఉన్న అధికార యంత్రాంగాన్ని భారీ ఎత్తున దుర్వినియోగం చేస్తూ టీడీపీ ప్రచారం చేస్తూ ఉంటే ప్రజాభిమానం, వారి ఆదరణతోనే వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులు ముందుకెళుతున్నారు. ముఖ్యమంత్రిగా గద్దెనెక్కి మూడేళ్లు పూర్తయిన తరుణంలో జరుగుతున్న ఈ ఎన్నికల్లో చంద్రబాబునాయుడు మళ్లీ పాత హామీలనే కాకినాడ వాసులపై గుప్పిస్తున్నాడు. ఏ ఊరెళితే ఆ ఊరును ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తానని ఈ మూడేళ్లలో కాలక్షేపం చేసిన చంద్రబాబు మళ్లీ కాకినాడ ప్రజలను హామీలతో నమ్మించే యత్నం చేస్తున్నారు. చంద్రబాబు మంత్రివర్గంలోని సీనియర్ మంత్రి యనమల రామకృష్ణుడు, కీలక మంత్రి నిమ్మకాయల చినరాజప్ప కొద్ది రోజులుగా ఇక్కడే తిష్ట వేసి అధికార పార్టీ వ్యూహాన్ని రచిస్తున్నారు. ప్రచారం ముగియడానికి రెండు రోజుల ముందు కాకినాడకు వచ్చిన చంద్రబాబు తొలి రోజున తన సుడిగాలి పర్యటనలో ఈ మూడేళ్లలో తానెందుకు చెప్పింది చేయలేక పోయారో అనే అంశంపై వివరణ ఇవ్వకపోగా పాతవాటినే వల్లెవేశారు. ఇక ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ తరపున ఎన్నికల సంరంభం మొదలైన నాటి నుంచీ ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి, ముఖ్య నేతలు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ ఇక్కడే ఉంటూ పకడ్బందీగా ప్రచారాన్ని నడిపిస్తున్నారు. చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి నినాదంలోని డొల్ల తనాన్ని వారు ఎండగడుతున్నారు.మూడేళ్లలో చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చలేదని సభల్లో నిలదీస్తున్నారు. విభజన తరువాత అన్ని విధాలా నష్ట పోయిన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ఏ రకమైన అవినీతి, అసమర్థ పాలనను అందిస్తున్నారో కూడా వైఎస్సార్ కాంగ్రెస్ విమర్శిస్తోంది. పార్టీ నేత ప్రచారానికి తోడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం ఉదయం నుంచీ నగరంలో సుడిగాలి పర్యటన చేయనున్నారు. టీడీపీ పాలన ఎంత అప్రజాస్వామికమైందో ఆయన కాకినాడ ప్రజలకు తెలియ జేయనున్నారు. రాజధాని మొదలు పట్టిసీమ వరకూ ఏ విధంగా అవినీతికి పాల్పడుతున్నారో చెప్పడంతో పాటుగా ఎన్నికలపుడు ప్రజలకు చంద్రబాబు ఇచ్చిన హామీలను ఏ విధంగా తుంగలో తొక్కారో వివరించనున్నారు. వాస్తవానికి జగన్ పర్యటన రెండు రోజుల పాటు శని, ఆదివారాల్లో జరుగాల్సి ఉంది.అయితే నంద్యాల ఉప ఎన్నికల పర్యటనలో ఏకబిగిన 13 రోజుల పాటు విస్తృతంగా పర్యటించిన తరువాత ఆయన అనారోగ్యానికి గురయ్యారు. పూర్తి స్వస్థత చేకూరక పోవడంతో శనివారం నాటి పర్యటన మాత్రం రద్దయింది. జగన్ ఇంకా కోలుకోనప్పటికి చివరి రోజున ప్రచారానికి వెళ్లాల్సిందేనన్న కృత నిశ్చయంతో ఆయన కాకినాడకు వస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. చివరి రోజున ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత ఇద్దరూ ప్రచార సమరంలో పాల్గొంటూ ఉండటంతో కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం మరింత వాడిగా వేడిగా ఉండటంతో పాటుగా పతాకస్థాయికి చేరుకోనుంది. -
చంద్రబాబు చిల్లర కూడా విదల్చలేదు
-
చంద్రబాబు చిల్లర కూడా విదల్చలేదు
నంద్యాల: వైఎస్ జగన్ బహిరంగ సభకు ప్రజలు వెల్లువెత్తారు. వేలాది మందితో సభ కిటకిటలాడింది. ఈసందర్భంగా నంద్యాల మున్సిపల్ ఛైర్మెన్ సులోచన ముఖ్యమంత్రి చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. నంద్యాల అభివృద్ధికి చిల్లర కూడా విదల్చలేదని విమర్శించారు. రోడ్ల విస్తరణకు నిధులు కావాలని ఎన్నిసార్లు కోరినా పట్టించుకోలేదన్నారు. మున్సిపల్ నిధులతోనే వెడల్పు చేసుకోవాలని సూచించారని మండిపడ్డారు. కానీ ఇప్పుడు అభివృద్ధి అనే మాయమాటలు చెప్తున్నారని విమర్శించారు. దీంతో విసిగెత్తిన తాము సుమారు రూ.40 కోట్లలతో రోడ్ల విస్తరణ చేపట్టినట్టు ఆమె తెలిపారు. ఈ ఉప ఎన్నికల్లో శిళ్పామోహన్ రెడ్డిని గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. నంద్యాల ఎన్నికలను శిల్పామోహన్ రెడ్డని గెలిపించి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కానుకగా ఇద్దామన్నారు. వచ్చే ఎన్నికలకు ఇవి సెమీ ఫైనల్ లాంటివన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ను ముఖ్యమంత్రిని చేద్దాం అంటూ సులోచన పిలుపునిచ్చారు. -
మంత్రితో వేగలేం
తాడేపల్లిగూడెం : పశ్చిమ గోదావరి జిల్లాలోని 15 అసెంబ్లీ సీట్లను జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు కలిసి పోగొడతారేమోనన్న అనుమానం వస్తోందని తాడేపల్లిగూడెం మున్సిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు 15వ వార్డులో టీడీపీ అధికారిక కౌన్సిలర్ను కాదని ప్రతిపక్ష పార్టీవారికి ప్రాధాన్యత ఇస్తున్నందుకు నిరసనగా పదవికి రాజీనామా చేస్తున్నట్టు చుక్కా కన్నమనాయుడు రాజీనామా పత్రాన్ని మున్సి పల్ చైర్మన్కు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. 15వ వార్డులో మంత్రి మాణిక్యాలరావు ఓటమికి పనిచేసిన వారికి మంత్రి ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపిస్తూ కౌన్సిలర్ రాజీనామా చేస్తున్నారన్నారు. కౌన్సిలర్కు తెలియకుండా మంత్రి అనుచరులు ప్రతిపక్ష పార్టీ వ్యక్తి ద్వారా అధికారులను వెంటబెట్టుకుని ఇళ్ల లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారని ఇది ఎంత వరకు సమంజసమన్నారు. కౌన్సిలర్ నుంచి రాష్ట్రపతి వరకు ఎన్నిక విధానం ఒకటేనన్నారు. ఎవ్వరికైనా ప్రజలు ఓట్లేసి నెగ్గించాలి్సందేనన్నారు. ఎంపీ సీట్లో మంత్రి కూర్చోలేరు. మంత్రి సీట్లో ఎంపీ కూర్చోలేరు. నా సీట్లో ఎమ్మెల్యే వచ్చి కూర్చోలేరని బొలిశెట్టి అన్నారు. స్థానిక సంస్థల ప్రతినిధులకు ఇవ్వాల్సిన గౌరవం వారికి ఇవ్వాలన్నారు. మంత్రిని గౌరవిస్తూ వస్తున్నామన్నారు. ప్రతీ అభివృద్ధి పనికి మంత్రి మాణిక్యాలరావుకు సహకరిస్తున్నామని ఆయన అన్నారు. కౌన్సిలర్లు కలిసిఉండటం మంత్రికి ఇష్టంలేదన్నారు. గతంలో నలుగురు బీజేపి కౌన్సిలర్లకు 40 లక్షల రూపాయల నిధులు ఇచ్చారు. ఇటీవల సీఎం ఇచ్చిన కోటి రూపాయల నిధులను ఆరుగురు కౌన్సిలర్లకు మంత్రి ఇచ్చారన్నారు. కనీసం మునిసిపల్ చైర్మన్కు, అధికారులకు తెలియకుండా మంత్రి ఇలా నిధులు ఇవ్వడం ఎంతవరకు సమంజసమన్నారు. మంత్రి ఈ విధంగా పంచుకుంటూ వెళితే మిగిలిన కౌన్సిలర్లకు ఏం సమాధానం చెప్పాలన్నారు. సీఎం గూడెంకు సంబంధించిన పనులు, నిధులు నాకు అప్పగిస్తే మంత్రి ఎలా ఫీలవుతారో.. తనకు తెలియకుండా మున్సిపాలిటీలో నిధులు, పనులు చేస్తే తాను కూడా అదేవిధంగా ఫీలవుతానన్నారు. అవసరమైతే సామూహిక రాజీనామా మంత్రి మాణిక్యాలరావు వైఖరిపై ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దే తేల్చుకుంటామని బొలిశెట్టి చెప్పారు. ఈ మేరకు కౌన్సిలర్లతో కలిసి విజయవాడ బయలుదేరి వెళ్లారు. సీఎం కనుక మాణిక్యాలరావు కరెక్టు అని చెబితే ఆయన చేతికే రాజీనామా సమర్పించి వస్తానని చైర్మన్ స్పష్టం చేశారు. మంత్రి వైఖరికి నొచ్చుకొని రాజీనామా చేసిన చుక్కా కన్నమనాయుడు రాజీనామాను ఆమోదిస్తే. ఆయనకు మద్దతుగా సామూహిక రాజీనామా చేస్తామని బొలిశెట్టి చెప్పారు. సమావేశంలో వైస్చైర్మన్ కిల్లాడి ప్రసాద్ , టీడీపీ కౌన్సిలర్లు పాల్గొన్నారు. -
పేకాటాడుతూ పట్టుపడిన టీడీపీ ముఖ్యనేత
► పూర్ణ చంద్రరావు సహా 11 మంది అరెస్టు ఇచ్ఛాపురం: శ్రీకాకుళం జిల్లా పలాస మున్సిపల్ చైర్మన్, తెలుగుదేశం పార్టీకి చెందిన కోత పూర్ణ చంద్రరావు జూదమాడుతూ పోలీసులకు పట్టుపడ్డాడు. ఆయనతో సహా 11 మందిని నిందితులను సోంపేట పోలీసులు అరెస్టు చేశారు. సోంపేట మండలంలోని బారువ రీసార్ట్స్లో పూర్ణచంద్రరావుతో సహా మరికొంతమంది జూదమాడుతుండగా దాడి చేసి అరెస్టు చేసినట్టు సోంపేట ఇన్చార్జి సీఐ సన్యాసి నాయుడు వెల్లడించారు. బారువ రీసార్ట్స్లో పేకాటాడుతున్నట్లు పక్కా సమాచారం అందడంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పలాస మున్సిపల్ చైర్మన్ కోత పూర్ణచంద్రరావు తో పాటు కాశీబుగ్గకు చెందిన బి.మధు, ఎస్.మోహనరావు, గణేష్ మహాంతి, బి.శ్రీనివాసరావు, వి.శ్రీనివాసరావు, పలాసకు చెందిన బి.బల్లయ్య, పి.ముకుందరావు, కంచిలికి చెందిన వి.శ్రీనివాసరావు, డి.రవికుమార్, కె.శేఖర్, మందసకు చెందిన ఎం.ఉదయ్ కుమార్లను అరెస్టు చేశారు.. వారి వద్ద నుంచి 45 వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
శివాజీ ఛత్రం కింద..సెకండ్ క్యా‘డర్’!
♦ మున్సిపల్ చైర్మన్ కోత పూర్ణచంద్రరావుపై మరో కేసు ♦ కేసుల్లో ఇరుక్కున్న ముకుందరావు, బుల్లు ప్రధాన్ ♦ ద్వితీయ శ్రేణి నాయకులకు ఎక్కడికక్కడ చెక్? ♦ ‘గౌతు’ కుటుంబ వ్యతిరేకుల్లో తీవ్ర అలజడి రాజకీయాల్లో జెండా మోసేవారెవ్వరికైనా అధికార పీఠం ఒక్కసారైనా అధిరోహించాలనే ఆశ సహజం! అధికార పీఠంపై ఉన్నవారికి చేజారిపోకూడదనే ఆరాటం అంతే సహజం! ఇది రాజకీయాల్లో సహజసూత్రం! కానీ పలాస నియోజకవర్గంలో మాత్రం టీడీపీ శ్రేణుల్లో ఎవ్వరికైనా పదవులపై అలాంటి ఆశలుంటే వదులుకోవాల్సిందే! ఎందుకంటే సుదీర్ఘకాలం పలాస రాజకీయాలను శాసిస్తున్న గౌతు కుటుంబాన్ని కాదని ఎదురేగిన ద్వితీయ శ్రేణి నేతలు ఒక్కొక్కరూ పోలీసు కేసుల్లో చిక్కుకుపోతున్నారు! వారిలో పలాస మున్సిపల్ చైర్మన్ కోత పూర్ణచంద్రరావు ముందున్నారు. టీడీపీ కౌన్సిలర్లు పాతాళ ముకుందరావు, బుల్లు ప్రధాన్లపై కూడా ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. అలాగే గౌతు కుటుంబాన్ని కాదన్న కొర్ల కవితా కన్నారావు మందస ఎంపీపీ పదవిని వదులుకోవాల్సి వచ్చింది! మొత్తంమీద ఈ కేసుల వ్యవహారంతో పలా స టీడీపీ శ్రేణుల్లో అలజడి రేగుతోంది. సాక్షి ప్రతినిధి–శ్రీకాకుళం: జిల్లాలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, పలాస ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర శివాజీ తన కుమార్తె టీడీపీ జిల్లా అధ్యక్షురాలైన శిరీషను వచ్చే ఎన్నికలలో ఎమ్మెల్యే చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు చాలారోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పలాస, లేదంటే తమ సొంతూరు సోంపేట కలిసిఉన్న ఇచ్ఛాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయిస్తారనే వాదనలు ఉన్నాయి. ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ సహా టీడీపీ నాయకులెవ్వరైనా సరే శివాజీ అనుమతి లేకుండా సోంపేటలో అడుగు పెట్టడానికి సాహసం చేయరనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కొన్నాళ్లుగా శివాజీతో ఢీ అంటే ఢీ అంటున్న కోత పూర్ణచంద్రరావు మంగళవారం సోంపేట గడ్డపై అడుగుపెట్టడం వల్లే మరో కేసులో ఇరుక్కుపోయారనే వాదనలు జోరుగా సాగుతున్నాయి. వాస్తవానికి శివాజీ ఇటీవల రాష్ట్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో బెర్త్ ఆశించారు. కానీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడైన మరో సీనియర్ నాయకుడు కిమిడి కళావెంకటరావుకే చంద్రబాబు చాన్స్ ఇచ్చారు. 2019 ఎన్నికలలో తాను పోటీ చేయబోనని, తనకు చివరి అవకాశంగా మంత్రిమండలిలో చోటు కల్పించాలని శివాజీ కోరినా ఫలితం లేకపోయింది. ఈ విషయమై ఆయన కన్నీంటిపర్యంతమైన సంగతి జిల్లా ప్రజలకు తెలిసిందే. అయితే శివాజీ చెబుతున్నట్లుగా మరో రెండేళ్లలో రాజకీయాల విరమణ చేస్తే... తమకు ఎమ్మెల్యేగా పోటీచేసే అవకాశం వస్తుందని పలాస టీడీపీ శ్రేణుల్లో కొంతమంది నేతలు ఆశలు పెట్టుకున్నారు. అంతేకాదు ఆయన గత రెండేళ్లలో తరచుగా అనారోగ్య కారణాల వల్ల సమావేశాలకు హాజరుకాలేకపోతున్నారు. దీంతో పలు కార్యక్రమాలను ఎంపీపీలు, మున్సిపల్ చైర్మన్ నిర్వహిస్తూ వచ్చారు. అదే సమయంలో కొర్ల కన్నారావు, కోత పూర్ణచంద్రరావు కాస్త ముందుకెళ్లి... వచ్చే ఎన్నికలలో పలాస సీటు తమకు వస్తుందని అనుచరుల వద్ద ధీమా వ్యక్తం చేస్తున్నారనే ప్రచారం జరిగింది. దీంతో శివాజీ అప్రమత్తమయ్యారు. తన కుమార్తె శిరీషను పలాస నియోజకవర్గంలో రాజకీయ కార్యక్రమాలకే గాకుండా అధికారిక కార్యక్రమాలకు పంపడం ప్రారంభించారు. ఈ విషయంలో ప్రోటోకాల్ నిబంధనలను సైతం ఉల్లంఘించడానికీ వెనుకాడలేదు. మరోవైపు టీడీపీలో ద్వితీయ శ్రేణి నేతలకు సెగ మొదలైంది. ఇది ముదురుపాకాన పడి పోలీసు కేసుల వరకూ వెళ్లింది! మొదలైన గుండె ‘కోత’.... పలాస మున్సిపల్ చైర్మన్గా కోత పూర్ణచంద్రరావు ఎన్నికైనప్పటి నుంచి ఆయనకు ప్రత్యేకంగా అనుచర గణం ఏర్పడింది. పలాస, కాశీబుగ్గ పట్టణాల్లోని కార్యకర్తలు ఆయన వెంటే ఎక్కువ మంది చేరిపోయారు. అప్పటి నుంచి కోతను ఎమ్మెల్యే శివాజీ దూరం పెట్టడం మొదలెట్టారు. పలాసలో రైతుబజారు ఏర్పాటు కోసం స్థలం విషయంలో ఇరువురి మధ్య భేదాభిప్రాయాలు రావడంతో ప్రత్యక్ష పోరు ప్రారంభమైంది. వివాదంలో ఉన్న అగ్నిమాపక కేంద్రం స్థలాన్ని కొంతమంది వ్యాపారులకు అప్పగించేందుకు జరిగిన వ్యవహారంలో శివాజీ అల్లుడు వెంకన్న చౌదరి హస్తం ఉందనే ఆరోపణలు వినిపించాయి. ఈ వ్యవహారం సాగకుండా కోత అడ్డుకున్నారు. ఈ తర్వాత ఏఎంసీ సమావేశ మందిరంలో జరిగిన విత్తనాల పంపిణీ కార్యక్రమంలో శివాజీ, పూర్ణచంద్రరావుల మధ్య మాటామాటా పెరిగింది. ఈ నేపథ్యంలోనే ఈవోపీఆర్డీగా పనిచేస్తున్న పిళ్లా జగన్మోహన్రావును ప్రత్యేక జీవోతో పలాస మున్సిపల్ కమిషనర్గా శివాజీ తీసుకొచ్చారు. ఇక కమిషనర్కు, చైర్మన్కు మధ్య తరచూ చెక్లపై సంతకాల్లో వివాదం రేగుతూ వచ్చింది. చివరకు వారిద్దరి మధ్య దాడి ఘటన చోటు చేసుకుంది. కమిషనర్ కేసు పెట్టడంతో కోత చాలారోజులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ సందర్భంలోనే 24వ వార్డు కౌన్సిలర్ పాతాళ ముకుందరావు, మరో కౌన్సిలర్ బళ్ల రేవతి భర్త శ్రీనివాసరావులపై సైతం కేసులు నమోదయ్యాయి. ఇటీవలే బెయిల్ మంజూరవ్వడంతో జనాల్లోకి కోత వచ్చారు. కొద్దిరోజులకే మళ్లీ పేకాట కేసులో ఇరుక్కుపోవడం గమనార్హం. టీడీపీ కౌన్సిలర్పై రౌడీషీట్... పలాస మున్సిపల్ సమావేశాల్లో పాతాళ ముకుందరావు చైర్మన్ కోతకు అండగా నిలబడేవారు. ఇటీవల సర్వసభ్య సమావేశంలో కమిషనర్ను నిలదీశారు. కమిషనర్కు శివాజీ మద్దతుగా నిలిచారు. అయితే మూడు రోజులకే ముకుందరావుపై పాత కేసులను తిరగేసి పోలీసులు రౌడీషీట్ తెరిచారు. గత ఎన్నికల సమయంలో ఎన్నికల బూత్ వద్ద గలాటా చేశాడని, అంబులెన్స్లో నాటుసారా రవాణా కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్నాడంటూ పోలీసులు చెప్పుకొచ్చారు. టీడీపీలోనూ సోషల్ మీడియా కేసు... పలాస–కాశీబుగ్గ మున్సిపల్ కోఆప్షన్ సభ్యురాలు లక్ష్మీ ప్రధాన్ భర్త బుల్లు ప్రధాన్. హుదూద్ ఇళ్లకు లబ్ధిదారుల జాబితాను బహిరంగం చేయాలని సర్వసభ్య సమావేశంలోనే ఎమ్మెల్యే శివాజీని ఆయన ప్రశ్నించడం అప్పట్లో చర్చనీయాంశమైంది. అదే సమయంలో బుల్లు ప్రధాన్ స్థానిక సమస్యలపై వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా పోస్టులు పెట్టడం మొదలెట్టారు. చివరకు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో శివాజీ, ఆయన అల్లుడు వెంకన్న చౌదరిలకు వ్యతిరేకంగా వచ్చిన కథనాలను తరచుగా పోస్టు చేస్తుండేవారు. దీంతో ప్రధాన్పై కేసు నమోదైంది. కొర్ల కవిత పదవీ త్యాగం.... మందస మండల అభివృద్ధికి ఎమ్మెల్యే శివాజీ అడ్డుపడుతున్నారనే తీవ్ర ఆరోపణలు చేస్తూ టీడీపీకే చెందిన కొర్ల కవితా కన్నారావు తన ఎంపీపీ పదవికి ఇటీవల రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అసలు విషయమేమిటంటే గత ఎన్నికలలో పలాస సీటు కోసం ఆమె భర్త కన్నారావు కూడా పోటీపడ్డారు. శివాజీ సీటు దక్కించుకొని ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా ఆయనకు కన్నారావుకు మధ్య ఎడముఖం పెడముఖంగానే ఉండేది. ఈ నేపథ్యంలో మందసలో టీడీపీ రెండు వర్గాలు విడిపోయింది. ఈ పోరులో కవిత తన ఎంపీపీ పదవిని వదులుకోవాల్సి వచ్చింది. -
మునిసిపల్ చైర్పర్సన్ను దించేద్దాం!
► నంద్యాలలో టీడీపీ యత్నాలు ► కార్పొరేటర్లను కొనేందుకు మంతనాలు ► నేరుగా రంగంలోకి దిగిన ముఖ్యమంత్రి ► భారీగా తాయిలాలు, లొంగదీసుకునే ప్రయత్నాలు ► ఉప ఎన్నికల కోసం అధికార పార్టీ బరితెగింపు సాక్షి ప్రతినిధి, కర్నూలు: నంద్యాల ఉప ఎన్నికల బరిలో పరువు నిలుపుకునేందుకు అధికార పార్టీ ప్రయత్నాలు ప్రారంభించింది. ఇప్పటికే మాజీ మంత్రి శిల్పా మోహన్రెడ్డి టీడీపీని వీడటంతో ఆ పార్టీకి పెద్ద దెబ్బ తగిలింది. శిల్పాతోపాటు మున్సిపల్ చైర్పర్సన్ దేశం సులోచన, అత్యధిక మంది కార్పొరేటర్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో నంద్యాల మునిసిపాలిటీపై వైఎస్సార్సీపీ జెండా ఎగిరింది. ఈ నేపథ్యంలో చైర్పర్సన్ సులోచనను తొలగించేందుకు టీడీపీ పావులు కదపడం ప్రారంభించింది. వైఎస్సార్సీపీలో చేరిన పలువురు కార్పొరేటర్లను బెదిరించి, ప్రలోభపెట్టి తిరిగి టీడీపీలోకి చేర్చుకునేందుకు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగి మంతనాలు సాగిస్తున్నారని తెలుస్తోంది. కానీ అధికార పార్టీ తాయిలాలకు లొంగితే తమకు రాజకీయ భవిష్యత్ ఉండదని పలువురు కార్పొరేటర్లు పేర్కొంటున్నట్టు సమాచారం. భారీగా తాయిలాలు నంద్యాల ఎమ్మెల్యేగా ఉన్న భూమా నాగిరెడ్డితో రాజీనామా చేయించకుండానే పార్టీలోకి చేర్చుకోవడం ద్వారా వలసలను ప్రారంభించిన సీఎంకు అక్కడి నుంచే గట్టి షాక్ తగిలింది. మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డితోపాటు 25 మంది కార్పొరేటర్లు వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకోవడం టీడీపీకి ఏ మాత్రమూ మింగుడుపడటం లేదు. మునిసిపాలిటీలో వైఎస్ఆర్సీపీ హవా సాగితే ఉప ఎన్నికల్లో తమకు ఎదురుదెబ్బ తగులుతుందనేది అధికార పార్టీకి ఆందోళనగా ఉంది. ఈ నేపథ్యంలో కార్పొరేటర్లకు భారీగా తాయిలాలు ఇచ్చి నయానో, భయానో లొంగదీసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకోసం నేరుగా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి నంద్యాలలో ఉండి ప్రణాళికలు రచించడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మాజీ మంత్రి ఫరూఖ్కు ఎటువంటి పదవి ఇవ్వకపోవడంతో పాటు మంత్రివర్గంలో ఒక్క ముస్లిం కూడా లేకపోవడంపై ముస్లిం వర్గంలో వ్యతిరేకత నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో ఫరూఖ్ను మండలి చైర్మన్ను చేయాలని ఇఫ్తార్ విందు సాక్షిగా సీఎం వద్ద పలువురు నినదించారు. అయినా ఆయన నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో వారంతా నిరాశకు గురయ్యారు. మరోవైపు మంత్రి అఖిలప్రియ ఏకపక్షంగా వ్యవహరిస్తూ... సీఎం పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలల్లో ఎక్కడా ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డి ఫోటో వేయకపోవడం మరింత అగ్గి రాజేసింది. దీంతో ఇరువర్గాల నేతల మధ్య నెలకొన్న విభేదాలు సమసిపోయి కలిసి ఎన్నికల్లో పనిచేసే పరిస్థితి లేదు. ఈ వైఫల్యాలన్నింటినీ కప్పిపుచ్చుకునేందుకే అధికారపార్టీ కార్పొరేటర్ల భారీ కొనుగోళ్లకు తెరలేపినట్లు తెలుస్తోంది. -
‘చంద్రబాబు కనుసన్నల్లోనే జరిగింది’
-
‘చంద్రబాబు కనుసన్నల్లోనే ప్రజాస్వామ్యం ఖూనీ’
వైఎస్ఆర్ జిల్లా: ప్రొద్దుటూరులో ప్రజాస్వామ్యాన్ని మానభంగం చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కనుసన్నల్లోనే ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని ఆయన ధ్వజమెత్తారు. టీడీపీ నేతల దౌర్జన్యాన్ని పోలీసులు చూస్తు ఉండిపోయారని ఎమ్మెల్యే రాచమల్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కో కౌన్సిలర్ను రూ.50 లక్షలకు కొనేందుకు జిల్లా మంత్రి సిద్ధపడ్డారని ఆరోపించారు. అయితే ఆ ప్రలోభాలకు కౌన్సిలర్లు లొంగకపోవడంతో ఎన్నికను వాయిదా వేయించారన్నారు. మున్సిపల్ కౌన్సిల్ హాలులో టీడీపీ నేతలు రౌడీయిజం చేశారని, తమపై దాడికి యత్నించారన్నారు. ఎమ్మెల్యేలకు కూడా రక్షణ లేకుండా పోయిందని రాచమల్ల అన్నారు. టీడీపీ నేతల పన్నాగాలు తీవ్రంగా బాధించాయని, ప్రజాస్వామ్యం ఏమవుతుందో అర్థం కావడం లేదని ఆవేదన చెందారు. కాగా అధికార టీడీపీ నేతలు తీవ్ర దౌర్జన్యపూరితంగా వ్యవహరించడంతో ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికను వరుసగా రెండోరోజూ (ఆదివారం) కూడా వాయిదా పడిన విషయం తెలిసిందే. మున్సిపల్ చైర్మన్ పదవిని చేజిక్కించుకునేందుకు కావాల్సిన బలం తమకు లేకపోవడంతో అధికార టీడీపీ మరోసారి హైడ్రామాకు తెరతీసింది. చైర్మన్ పదవిని సొంతం చేసుకునేందుకు కావాల్సినంత కౌన్సిలర్ల బలమున్న ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అడ్డుకోవడానికి రౌడీయిజానికి, దౌర్జన్యానికి దిగింది. ఎన్నికను అడ్డుకోవడమే లక్ష్యంగా వరుసగా నిన్న కూడా టీడీపీ కౌన్సిలర్లు విధ్వంసాలకు దిగారు. -
చెప్పుతో కొట్టుకొని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే నిరసన!
టీడీపీ దౌర్జన్యంపై తీవ్ర ఆగ్రహం.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా ఆయన ఓ ప్రజాప్రతినిధి.. ఎమ్మెల్యే. పట్టపగలు ప్రజాస్యామ్యాన్ని ఖూనీ చేస్తుంటే తట్టుకోలేకపోయారు. అధికార పార్టీ నేతలు, అధికారులు అంతా కలిసి వ్యవస్థను నాశనం చేస్తుంటే.. తీవ్ర ఆగ్రహానికి, ఆవేదనకు గురయ్యారు. ఈ దుర్మార్గాన్ని ఆపేందుకు శాయశక్తులా ప్రయత్నించారు. అధికారుల తీరుపై మండిపడ్డారు. ఈ దుర్మార్గాన్ని ఖండిస్తూ తనను తాను చెప్పుతో కొట్టుకొని నిరసన తెలిపారు. ఆయనే ప్రొద్దుటూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్రెడ్డి. ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికను వాయిదా వేయడానికి మరోసారి టీడీపీ డ్రామా ఆడటం, అధికారులు అందుకు వత్తాసు పలుకడంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతల దౌర్జన్యానికి అధికారులు లొంగిపోవడాన్ని తప్పుబట్టారు. పోలీసులు, అధికారుల తీరును తప్పుబడుతూ.. తనను తాను చెప్పుతో కొట్టుకొని నిరసన తెలిపారు. ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో ప్రభుత్వ కుటిల ప్రయత్నాలను తీవ్రంగా ఎండగట్టిన ఆయన.. ఈ ఎన్నిక నిర్వహించకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. టీడీపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని ఆయన మండిపడ్డారు. చైర్మన్ పదవికి కావాల్సిన మెజారిటీ వైఎస్ఆర్సీపీకి ఉన్నా కావాలనే ఎన్నికను టీడీపీ వాయిదా వేయించిందని ఆరోపించారు. టీడీపీ నేతల కుట్రలకు అధికారులు మద్దతు పలుకడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. గెలిచే దమ్ములేకే టీడీపీ రౌడీయిజానికి దిగిందని మండిపడ్డారు. తమకు 26మంది కౌన్సిలర్ల బలముందని తెలిపారు. ‘అసలు మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా? అధికారులు ప్రభుత్వానికి తొత్తులుగా మారారు.. ఇవాళ ప్రజాస్వామ్యాన్ని మానభంగం చేశారు’ అని ఆయన మండిపడ్డారు. -
ప్రొద్దుటురులో పేట్రేగిన ‘పచ్చ’ రౌడీయిజం!
-
ప్రొద్దుటురులో పేట్రేగిన ‘పచ్చ’ రౌడీయిజం!
మరోసారి ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా తీవ్ర నిరసన తెలిపిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాచమల్లు వైఎస్ఆర్ జిల్లా: అధికార టీడీపీ నేతలు తీవ్ర దౌర్జన్యపూరితంగా వ్యవహరించడంతో ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికను వరుసగా రెండోరోజూ వాయిదా పడింది. మున్సిపల్ చైర్మన్ పదవిని చేజిక్కించుకునేందుకు కావాల్సిన బలం తమకు లేకపోవడంతో అధికార టీడీపీ మరోసారి హైడ్రామాకు తెరతీసింది. చైర్మన్ పదవిని సొంతం చేసుకునేందుకు కావాల్సినంత కౌన్సిలర్ల బలమున్న ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అడ్డుకోవడానికి రౌడీయిజానికి, దౌర్జన్యానికి దిగింది. ఎన్నికను అడ్డుకోవడమే లక్ష్యంగా వరుసగా రెండోరోజు ఆదివారం కూడా టీడీపీ కౌన్సిలర్లు విధ్వంసాలకు దిగారు. కౌన్సిలర్లకు మద్దతుగా ఏకంగా మంత్రులు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో అధికారులతో టీడీపీ నేతలు విస్తృత మంతనాలు జరిపారు. వారి ఒత్తిళ్లకు, రౌడీయిజానికి తలొగ్గిన అధికారులు మరోసారి ఎన్నికను వాయిదా వేశారు. పట్టపగలు పచ్చనేతల రౌడీయిజానికి తలొగ్గి అధికారులు ఇలా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండిపడింది. ఈ దారుణంపై ప్రొద్దుటూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం ఎన్నిక జరపాల్సిందేనంటూ కౌన్సిల్ హాల్లో అధికారులకు అడ్డంగా పడుకొని నిరసన తెలిపారు. ప్రసాద్రెడ్డిని పక్కకు తోసేసి మరీ అధికారులను పోలీసులు బయటకు తీసుకెళ్లారు. అధికారులు, పోలీసులు, టీడీపీ నేతల తీరుపై ఎమ్మెల్యే ప్రసాద్రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. -
ముక్తియార్తో ఆది చర్చలు
ప్రొద్దుటూరు టౌన్: మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎంపీ రమేష్నాయుడు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి వీఎస్ ముక్తియార్తో చర్చించేందుకు శనివారం రాత్రి ఆయన స్వగృహానికి వెళ్లారు. సాయంత్రం 7 గంటల నుంచి అర్ధరాత్రి వరకు చర్చలు జరిగాయి. సీఎం వద్దకు రావాలని, విషయం అక్కడ తేలుస్తామని ముక్తియార్ను తీవ్ర ఒత్తిడికి గురి చేశారు. ముక్తియార్ వద్ద ఉన్న 14 మంది కౌన్సిలర్లు ఆదివారం చైర్మన్ ఎన్నిక జరిగిన వెంటనే నేరుగా సీఎం వద్దకు వెళ్లవచ్చని చెప్పారు. ఇందుకు వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. ముక్తియార్ గంటల కొద్దీ వారితో చర్చలు జరుపుతుంటే తట్టుకోలేకపోయిన కౌన్సిలర్లు ఒక్క సారిగా తామంతా ఎమ్మెల్యే వద్దకు వెళుతున్నామని కారు ఎక్కారు. వెళ్లాలనుకుంటే మీరు ఒక్కరే వెళ్లొచ్చని, తమదారి తాము చూసుకుంటామన్నారు. కాగా, ముక్తియార్కు టీడీపీ ఇన్చార్జి బాధ్యతలు అప్పగిస్తామని మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎంపీ సీఎం రమేష్ హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఈ విషయంపై స్పష్టత రాకపోవడంతో చర్చలను ఆదివారానికి వాయిదా వేశారు. ఆదివారం ఉదయం జరిగే చర్చలను బట్టి ముక్తియార్ వైఖరి స్పష్టం కానుంది. -
టీడీపీ కౌన్సిలర్లపై ఫిర్యాదు
ప్రొద్దుటూరు టౌన్: ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా శనివారం కౌన్సిల్ హాల్లో జరిగిన విధ్వంసంపై మున్సిపల్ కమిషనర్ వెంకటశివారెడ్డి వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్కు వచ్చిన 27వ వార్డు టీడీపీ కౌన్సిలర్ తలారి పుల్లయ్య, 31వ వార్డు కౌన్సిలర్ గణేష్బాబు, మున్సిపల్ వైస్ చైర్మన్ వైఎస్ జబీవుల్లా అధికారుల విధులకు ఆటంకం కలిగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కౌన్సిల్ హాల్లోకి వచ్చి వీరు టేబుళ్లను, కుర్చీలను పగులగొట్టారని వివరించారు. తలారి పుల్లయ్య కౌన్సిల్ మినిట్స్ పుస్తకాన్ని ఎన్నికల అధికారి టేబుల్ పైనుంచి తీసుకుని దానిని చించే ప్రయత్నం చేయగా పోలీసులు పట్టుకుని మున్సిపల్ కమిషనర్కు అప్పగించారని తెలిపారు. ఇందులో కొన్ని పేజీలు చినిగిపోయాయని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఎన్నికల అధికారి రాష్ట్ర ఎన్నికల అధికారికి, జిల్లా కలెక్టర్కు, ఎస్పీకి ఫిర్యాదు చేశారన్నారు. వీరి వల్ల శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడిందని తెలిపారు. ఆదివారం జరిగే చైర్మన్ ఎన్నికకు భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని కోరారు. కౌన్సిలర్లపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఫిర్యాదును డీఎంఏ, ఆర్డీ, ఎన్నికల అధికారి, జిల్లా ఎన్నికల అధికారులకు పంపారు. -
వరద దౌర్జన్యం
► పోలీసు అధికారుల సమక్షంలో టీడీపీ నేతల దురుసుతనం ► ప్రజాసమస్యలపై పోరాటం చేస్తే అర్ధంతర అరెస్టులు ► ఎన్నికల అధికారి చేతిలో ప్రజాస్వామ్యం అపహాస్యం ► అధికారపార్టీ నేతల కనుసైగల మేరకే చైర్మన్ ఎన్నిక వాయిదా ప్రజాస్వామ్యం మరోమారు మంటగలిసింది. అండగా నిలవాల్సిన యంత్రాంగం ఏకపక్షంగా నిలిచింది. ఏకంగా పోలీసు అధికారులే గొడవకు ఆస్కారం ఇవ్వగా, ఆ కారణంగా ఎన్నిక వాయిదా వేశారు. నవ్విపోదురుగాక...నాకేటి సిగ్గు అన్నట్లుగా తెరవెనుక డైరెక్షన్ అధికార యంత్రాంగం అమలు చేసింది. వెరసి ప్రొద్దుటూరు చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. సాక్షి ప్రతినిధి, కడప: ప్రొద్దుటూరు పట్టణ ప్రజానీకం తాగునీటికి అవస్థలు పడుతున్నారు. తక్షణమే సమస్య పరిష్కరించండి, ప్రజల తాగునీటి కష్టాలకంటే ప్రాణాలు లెక్కకాదంటూ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్రెడ్డి ఆమరణదీక్షకు సన్నద్ధమయ్యారు. అనుమతులు లేవంటూ పోలీసు అధికారులు అర్ధంతర అరెస్టుకు తెరలేపారు. తాగునీటి సమస్య కోసం శాంతియుతంగా ఆందోళన చేయాలని భావించినా అడ్డుకున్నారు. అదేవిధంగా గండికోట నిర్వాసితులకు పరిహారం దక్కలేదని, వారంతా ఏకమై ఆందోళన చేసేందుకు సిద్ధమైతే, ఆ కార్యక్రమానికి హాజరవుతారనే ఉద్దేశంతో ప్రొద్దుటూరు పోలీసులు పలుమార్లు మానవహక్కుల వేదిక జిల్లా కన్వీనర్ కె జయశ్రీని హౌస్ అరెస్టు చేశారు. ఆందోళనలతో అలజడి నెలకొంటుందని ముందస్తు జాగ్రత్తలు పాటిస్తూ, నిబద్ధత కల్గిన ప్రొద్దుటూరు పోలీసు అధికారులు 40మంది సభ్యులు ఎన్నుకునే చైర్మన్ ఎన్నికను చేపట్టలేకపోయారని పలువురు పేర్కొంటున్నారు. సభ్యులను తప్ప...ఇతరుల ప్రవేశాన్ని అడ్డుకోవాల్సిన యంత్రాంగం వందల సంఖ్యలో అనుమతించడంతో ఘర్షణ తలెత్తిందని ప్రత్యక్ష సాక్షులు వివరిస్తున్నారు. ఎలాంటి అనుమతి లేకపోయినా ఏకంగా కౌన్సిల్హాల్లోకి టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి ప్రవేశించారు. పోలీసు అధికారులు చేష్టలుడిగి చూస్తుండిపోవడంతో, తర్వాత మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి వందల సంఖ్యలో అనుచరగణాన్ని వెంటబెట్టుకొని వచ్చారని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఆమేరకే టీడీపీ నేతలు ఒక్కమారుగా చెలరేగిపోయి విధ్వంసం సృష్టించారని విశ్లేషకులు భావిస్తున్నారు. తిరగబడిన టీడీపీ వ్యూహం...: ప్రొద్దుటూరు మున్సిపాలిటిలో తెలుగుదేశం వ్యూహాం తిరగబడింది.ఛేర్మెన్ గురివిరెడ్డిని తప్పించి ఆ స్థానంలో ఆసం రఘురామిరెడ్డి చేయాలని మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి తలచారు. రఘురామిరెడ్డి అభ్యర్థిత్వాన్ని పలువురు టీడీపీ సభ్యులు వ్యతిరేకిస్తున్నారు. వైఎస్సార్సీపీ ఫిరాయింపు కౌన్సిలర్లు సైతం ఈ పరిణామాన్ని తీవ్రంగా ప్రతిఘటించారు. ఈక్రమంలో కౌన్సిలర్ ముక్తియార్ను చైర్మన్ చేయాలని భావించారు. వీరికి వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు జతకట్టారు. వైఎస్సార్సీపీ ఫిరాయింపు కౌన్సిలర్ల తోపాటు వరద వర్గీయులను వ్యతిరేకిస్తున్న 6 మంది టీడీపీ కౌన్సిలర్లు జట్టుగా క్యాంపునకు వెళ్లారు. 15మంది సభ్యులు చైర్మన్ ఎన్నికకు తరలివచ్చారు. వీరికి తోడుగా 10మంది వైఎస్సార్సీపీ సభ్యులు నిలవడంతో కోరం ఏర్పడింది. చైర్మన్ ఎన్నికలో వ్యూహం తిరగబడడంతో ఎలాగైనా వాయిదా వేయాలనే తలంపుతో టీడీపీ నేతలు రభస సృష్టించారు. అనుకున్నదే తడువుగా టీడీపీ నేతలకు అటు పోలీసు, ఇటు రెవెన్యూ అధికారులు వత్తాసుగా నిలచి వాయిదా వేశారు. తెరవెనుక డైరెక్షన్ మేరకే...: మున్సిఫల్ చైర్మన్ ఎన్నిక విషయమై మంత్రి ఆదినారాయణరెడ్డి ప్రొద్దుటూరులో తిష్టవేసి పర్యవేక్షించసాగారు. స్వయంగా కౌన్సిలర్ ముక్తియార్కు లేఖరాశారు. దీనిని మాజీ చైర్మన్ గురివిరెడ్డి ద్వారా కౌన్సిల్హాల్లో అందజేశారు. అయినా ఫలితం లేకపోవడంతో తెరవెనుక మంత్రాంగం నిర్వహించి చైర్మన్ ఎన్నిక వాయిదా వేయాలని కనుసైగల మేరకు వ్యవహారాన్ని అధికారులు చక్కబెట్టారని పరిశీలకులు ఆరోపిస్తున్నారు. ఈక్రమంలో ఘర్షణ సాకుగా చూపి ఎన్నికల అధికారి జమ్మలమడు గు ఆర్డీఓ వినాయకం వాయిదా వేశారు. కాగా 40 మంది సభ్యులచే చైర్మన్ ఎన్నిక చేపట్టలేని దుస్థితిలో జిల్లా యంత్రాం గం ఉండిపోవడాన్ని పలువురు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఆదివారమైనా చైర్మన్ ఎన్నికను సజావుగా నిర్వహించేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా ప్రజానీకం కోరుతోంది.