Narayan Rane
-
మామా అల్లుళ్ల సవాల్, నువ్వా..నేనా? అంటూ కూతురు, చివరికి!
మహారాష్ట్రలో ఇటీవల 288 అసెంబ్లీ నియోజక వర్గాలకు జరిగిన ఎన్నికల్లో అనేక చోట్ల వివిధ రాజకీయ పార్టీలకు చెందిన బడా నాయకులు తమ కుటుంబ సభ్యులను బరిలోకి దింపారు. వార్డుల పునర్విభజన తరువాత తమకు ఓటు బ్యాంకు ఉన్న నియోజక వర్గాలు పక్కనున్న నియోజక వర్గాల్లోకి వెళ్లిపోవడం, కొన్ని నియోజక వర్గాలు వివిధ కులాలకు, మహిళలకు రిజర్వుడు కావడంతో రాజకీయ అనుభమున్న సీనియర్ నేతలకు పోటీచేసే అవకాశం లేకుండా పోయింది. దీంతో గత్యంతరం లేక అనేక మంది నేతలు, మాజీ మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమ భార్యలను లేదా కుటుంబ సభ్యులను బరిలోకి దింపాల్సి వచ్చింది. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన పలువురు అభ్యర్ధులు విజయ ఢంకా మోగించారు.అనేక చోట్ల భార్యలు, కూతుళ్లు, సొంత సోదరులు, సోదరీమణులు, మామా, అల్లుడు, కోడళ్లు ఇలా దగ్గరి బంధువులు వివిధ పార్టీల టికెట్లపై లేదా ఇండి పెండెంట్లుగా బరిలోకి దిగారు. కొన్ని చోట్ల ఓడిపోయినప్పటికీ అనేక చోట్ల గెలిచారు. ఓటమి బాధించినా కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు ఎమ్మెల్యే కావడం వారిలో సంతోషాన్ని నింపింది. మహాయుతి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత జరిగే మంత్రివర్గ విస్తరణలో వీరిలో కొంతమందికి చోటు దక్కే అవకాశముండటంతో తమ కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు ప్రభుత్వంలో కొనసాగుతారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బారామతిలో మామా అల్లుళ్ల పోటీకాంగ్రెస్ తరఫున బరిలోకి దిగిన ఇద్దరు అన్నదమ్ముల్లో అమిత్ దేశ్ముఖ్ విజయం సాధించగా, లాతూర్ రూరల్ నియోజక వర్గంలో పోటీచేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే ధీరజ్ దేశ్ముఖ్ ఓటమి పాలయ్యారు. అదేవిధంగా ముంబై రీజియన్ బీజేపీ అధ్యక్షుడు ఆశీష్ శేలార్ పశ్చిమమ బాంద్రా నియోజక వర్గంలో గెలిచారు. కానీ ఆయన సోదరుడు వినోద్ శేలార్ పశ్చిమ మలాడ్ నియోజక వర్గంలో ఓడిపోయారు. మాజీ మంత్రి అనీల్ దేశ్ముఖ్ తనయుడు సలిల్ దేశ్ముఖ్ కాటోల్ నియోజక వర్గం నుంచి పోటీచేసి ఓడిపోయారు. కానీ ఆయన సోదరుడి కొడుకు ఆశీష్ దేశ్ముఖ్ సావనేర్ నియోజక వర్గంలో గెలిచారు. అనీల్ దేశ్ముఖ్ సొంత మేనల్లుడు, ఎంపీ అమర్ కాళే సతీమణి మయురా కాళే ఆర్వీ నియోజక వర్గంలో ఓటమిని చవిచూశారు. మంత్రి ఛగన్ భుజబల్ యేవలాలో గెలిచారు. కానీ ఆయన మేనల్లుడు సమీర్ భుజబల్ నాంద్గావ్లో పరాజయం పాలయ్యారు. బహుజన్ వికాస్ ఆఘాడి నేత, సిట్టింగ్ ఎమ్మెల్యే హితేంద్ర ఠాకూర్ వసాయ్లో, ఆయన తనయుడు క్షితిజ్ ఠాకూర్ నాలాసోపారాలో ఓడిపోయారు. అదేవిధంగా అజిత్ పవార్ వర్గానికి చెందిన ఇంద్రనీల్ నాయిక్ పుసద్ నియోజక వర్గంలో గెలిచారు. కానీ ఆయన సోదరుడు యయాతీ (ఇండిపెండెంట్) కారంజాలో ఓడిపోయారు. ఇక బారామతిలో మేనమామ, మేనల్లుడు మధ్య పోరు జరిగింది. వీరిలో మామ అజిత్ పవార్ గెలుపొందగా, మేనల్లుడు యుగేంద్ర పరాజయం పాలయ్యారు. న్యూ ముంబైలోని ఏరోలీలో తండ్రి, కొడుకుల మధ్య పోరు జరిగింది. వీరిలో తండ్రి, మాజీ మంత్రి గణేశ్ నాయిక్ (బీజేపీ) గెలుపొందగా, తనయుడు సందీప్ నాయిక్ బేలాపూర్లో ఎస్పీ వర్గం టికెట్పై పోటీచేసి ఓడిపోయారు. ఆయన్ని బీజేపీ అభ్యర్ధి మందా మాత్రే ఓడించారు. బోకర్లో తండ్రిపై కుమార్తె విజయంగడ్చిరోలీ జిల్లా అహేరీ నియోజక వర్గం ఎన్సీపీ(ఏపీ) అభ్యర్థి, మంత్రి ధర్మరావ్బాబా ఆత్రం తన సొంత కూతురు భాగ్యశ్రీ ఆత్రంను ఓడించారు. భాగ్యశ్రీ ఇండిపెండెంట్గా, తండ్రికి ప్రత్యర్ధిగా పోటీ చేశారు. భాగశ్రీతోపాటు ఆయన మేనల్లుడైన అంబరీష్ రాజే ఆత్రం కూడా ఇండిపెండెంట్గా పోటీచేసి ఓడిపోయారు. అయినప్పటికీ కుటుంబంలో ఒకరు ఎమ్మెల్యే కావడం విశేషం. మరోవైపు నాందేడ్ జిల్లా లోహా నియోజక వర్గం నుంచి ఎన్సీపీ(ఏపీ) తరపున పోటీచేసిన మాజీ ఎంపీ ప్రతాప్రావ్ పాటిల్ చిఖిలీకర్ స్వయాన తన సోదరి ఆశా శిందేను ఓడించారు. మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ను ఆయన సొంత కూతురు శ్రీజయ బోకర్ నియోజక వర్గంలో ఓడించారు. ఆమె బీజేపీ టికెట్పై పోటీ చేశారు. బోకర్ నియోజక వర్గం అశోక్ చవాన్కు గట్టిపట్టున్న ప్రాంతంగా పేరు పొందింది. పారంపర్యంగా వస్తున్న గెలుపును మళ్లీ చేజిక్కించుకునేందుకు ఆయన ఎంతో ప్రయత్నం చేశారు. కానీ కూతురు చేతిలో చవాన్ ఓడిపోక తప్పలేదు. అయినప్పటికీ కుటుంబంలో ఒకరు ఎమ్మెల్యే అయ్యారు. ఎన్సీపీ(ఏపీ) ప్రదేశ్ అధ్యక్షుడు, ఎంపీ సునీల్ తట్కరే కుమార్తై, రాష్ట్ర క్యాబినెట్ మంత్రి అదితీ తట్కరే శ్రీవర్ధన్ నియోజక వర్గంలో ఆయన్ని ఓడించారు. చదవండి: ఈవీఎంలపై కట్టలు తెంచుకున్న జనాగ్రహం.. కరెక్టేనా?కాగా బోకర్, శ్రీవర్ధన్ రెండు చోట్ల కుమార్తైలు తండ్రులను ఓడించడం విశేషం. మరోవైపు ఆదివాసి సంక్షేమ శాఖ మంత్రి విజయ్కుమార్ గావిత్ నందుర్బార్ నియోజక వర్గంలో భారీ మెజారిటీతో గెలిచారు. కాని ఆయన ఇద్దరు సొంత సోదరులైన రాజేంద్రకుమార్ గావిత్ (కాంగ్రెస్) శహదా నియోజక వర్గంలో, శరద్ గావిత్ (ఇండిపెండెంట్) నవాపూర్ నియోజక వర్గంలో ఓడిపోయారు. అదేవిధంగా విజయ్కుమార్ గావిత్ కుమార్తై హినా గావిత్ అక్కల్కువా నియోజక వర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. దీంతో గావిత్ కుటుంబంలో ఒక్కరికే ఎమ్మెల్యే అయ్యే అవకాశం దక్కింది. ఇక మాజీ కేంద్ర సహాయ మంత్రి, బీజేపీ సీనియర్ నేత రావ్సాహెబ్ దానవే తనయుడు సంతోష్ దానవే బోకర్ నియోజక వర్గంలో మరోసారి గెలిచారు. కన్నడ్ నియోజక వర్గం నుంచి శివసేన ఏక్నాథ్ శిందే వర్గం టికెట్పై పోటీచేసిన రావ్సాహెబ్ కుమార్తై సంజనా విజయకేతనం ఎగురవేశారు. కాగా లోక్సభ ఎన్నికల్లో స్వయంగా రావ్సాహెబ్ ఓటమి పాలయ్యారు. కానీ పిల్లలిద్దరూ ఎమ్మెల్యేలుగా ఎన్నికవడంతో ఆయనకు డబుల్ గిఫ్ట్ లభించినట్లైంది. లాతూర్లో మాజీ ముఖ్యమంత్రి దివంగత విలాస్రావ్ దేశ్ముఖ్ ఇద్దరు తనయుల్లో ఒకరు ఓడిపోయారు.తండ్రి ఎంపీ.. కుమారులిద్దరూ ఎమ్మెల్యేలుగా ఎన్నిక మహారాష్ట్ర చరిత్రలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు కొడుకులు, తండ్రి ఇలా ముగ్గురూ అధికారంలో కొనసాగడం చర్చనీయాంశమైంది. మాజీ కేంద్ర మంత్రి నారాయణ్ రాణే ఇద్దరు కొడుకుల్లో ఒకరైన నితేష్ రాణే కంకావలి అసెంబ్లీ నియోజక వర్గం నుంచి, రెండో కొడుకు నిలేష్ రాణే కుడాల్ నియోజక వర్గం నుంచి పోటీ చేసి భారీ మెజారీ్టతో గెలిచారు. దీంతో వారిద్దరూ శాసనసభలో అడుగుపెట్టనున్నారు. ఇప్పటికే నారాయణ్ రాణే ఎంపీగా కొనసాగుతున్నారు. అదేవిధంగా పరిశ్రమల శాఖ మంత్రి ఉదయ్ సామంత్ రత్నగిరి నియోజక వర్గం నుంచి పోటీచేసి గెలిచారు. ఆయన సోదరుడు కిరణ్ సామంత్ రత్నగిరి జిల్లా రాజాపూర్ నియోజక వర్గం నుంచి గెలిచారు. ఇరువురూ ఏక్నాథ్ శిందే వర్గం తరపున పోటీ చేశారు. అలాగే తూర్పుబాంద్రా నియోజక వర్గంలో వరుణ్ సర్దేశాయ్ విజయఢంకా మోగించారు. వరుణ్ సర్దేశాయ్, ఉద్ధవ్ ఠాక్రే సతీమణీ రష్మీ ఠాక్రేకు స్వయానా చెల్లెలి కుమారుడు. మరోవైపు ఉద్ధవ్ ఠాక్రే తనయుడు ఆదిత్య ఠాక్రే వర్లీ నియోజక వర్గం నుంచి గెలిచారు. దీంతో వరుస సోదరులిద్దరూ అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు. అదేవిధంగా రాష్ట్ర సహకార శాఖ మంత్రి దిలీప్ వల్సే పాటిల్ ఎన్సీపీ(ఏపీ) తరపున పుణేలోని అంబేగావ్ నియోజక వర్గం నుంచి పోటీచేసి గెలిచారు. ఆయన సోదరి సాయితాయి డహాకే కరాంజ నియోజక వర్గంలో బీజేపీ టికెట్పై పోటీ చేసి గెలిచారు. దీంతో ఒకే కుటుంబానికి చెందిన సోదరుడు, సోదరి అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. -
పీఎం విశ్వకర్మ పథకానికి 1.4 లక్షల దరఖాస్తులు
న్యూఢిల్లీ: పీఎం విశ్వకర్మ పథకాన్ని ప్రధాని మోదీ ఈ నెల 17న ప్రారంభించగా, పది రోజుల్లోనే 1.4 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఈ విషయాన్ని కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) మంత్రి నారాయణ్ రాణే తెలిపారు. భారీ సంఖ్యలో దరఖాస్తులు రావడం పథకం విజయానికి నిదర్శనమన్నారు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన విశ్వకర్మ సోదరులు, సోదరీమణుల సమగ్రాభివృద్ధికి పీఎం విశ్వకర్మ పథకం మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. కోల్పోయిన వారి గుర్తింపు తిరిగి పూర్వపు స్థతికి చేరుకుంటుందన్నారు. చేతి పనివారి సామర్థ్యాన్ని పెంచడం, వారి ఉత్పత్తులను దేశీయ, అంతర్జాతీయ మార్కెట్ల కు తీసుకెళ్లడం ఈ పథ కం లక్ష్యాలుగా పేర్కొన్నారు. ఈ పథకం కింద 18 విభాగాల చేతివృత్తుల పనివారు, కళాకారులు ప్రయోజనం పొందుతారని చెప్పారు. వీరికి ఈ పథకం కింద శిక్షణ ఇవ్వడంతోపాటు, శిక్షణాకాలంలో రోజుకు రూ.500 చొప్పున స్టైఫెండ్ కూడా లభిస్తుందన్నారు. టూల్కిట్స్ కొనుగోలుకు రూ. 15,000 అందజేస్తామన్నారు. లబి్ధదారులు హామీ లేని రూ.3 లక్షల రుణానికి అర్హులని చెప్పారు. -
'ఆ విషయం తెలిస్తే రౌత్ను ఉద్ధవ్ థాక్రే చెప్పుతో కొడతారు'
ముంబై: కేంద్రమంత్రి నారాయణ రాణే సంచలన వ్యాఖ్యలు చేశారు. శివసేన(ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ గురించి తనకు తెలిసిన రహస్యాలు చెబితే ఉద్ధవ్ థాక్రే, ఆయన భార్య రష్మి.. రౌత్ను చెప్పుతో కొడతారని వ్యాఖ్యానించారు. త్వరలోనే ఉద్ధవ్ను కలిసి రౌత్ తనతో చెప్పిన విషయాలు వెల్లడిస్తానని పేర్కొన్నారు. అప్పుడు రౌత్ నిజస్వరూపం ఆయనకు తెలుస్తుందన్నారు. 'నేను రాజ్యసభ సభ్యుడినయ్యాక.. సంజయ్ రౌత్ నా దగ్గరకు వచ్చి పక్కనే కూర్చునేవారు. ఉద్ధవ్, ఆయన భార్య రష్మి గురించి నాతో చెప్పేవారు. ఆ రహస్యాలు ఎంటో ఉద్ధవ్, రష్మికి చెబితే వారు రౌత్ను చెప్పుతో కొడతారు' అని నారయణ్ రాణె చెప్పారు. శివసేనను ఖతం చేసేందుకు రౌత్ సుపారీ తీసుకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు రాణె. శివసేన స్థాపించిన 1969 నుంచి తాను పార్టీ కోసం పనిచేసినట్లు వివరించారు. సంజయ్ రౌత్ వల్లే శివసేన(ఉద్ధవ్) ఎమ్మెల్యేల సంఖ్య 56 నుంచి 12కు పతనమైందని విమర్శించారు. నారాయణ రాణె కేంద్రమంత్రి హోదాలో కాకుండా సాధారణ వ్యక్తిలా వచ్చి తనను కలవాలని రౌత్ శుక్రవారం సవాల్ చేశారు. ఆ మరునాడే రాణె తీవ్రంగా స్పందించారు. తనకు ఎలాంటి రక్షణ అవసరం లేదని, రౌత్ ఎక్కిడికి రమ్మంటే అక్కడకు వెళ్లి కలిసేందుకు సిద్దమని సవాల్ను స్వీకరించారు. చదవండి: మోదీ హయాంలో రెండు రకాల భారత్లు -
థాక్రేకు బిగ్ షాక్.. బీజేపీలోకి ఆ నలుగురు ఎమ్మెల్యేలు!
ముంబై: ఏక్నాథ్ షిండే తిరుగుబాటుతో మహారాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్న వేడి ఇప్పట్లో తగ్గేలా కనిపించటం లేదు. శివసేన అధినేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే వర్గానికి షాక్ మీద షాక్ తగులుతూనే ఉంది. ఇప్పటికే అధికారం కోల్పోయి.. శివసేన గుర్తును కాపాడుకునేందుకే ఇబ్బందులు పడుతున్న థాక్రే వర్గానికి మరో దెబ్బ తగలనుంది. నలుగురు ఎమ్మెల్యేలు అధికార పక్షంలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారటా! ఉద్ధవ్ థాక్రే వర్గానికి చెందిన నలుగురు శివసేన ఎమ్మెల్యేలు అధికార వర్గంలో చేరేందుకు తమతో టచ్లో ఉన్నారని కేంద్ర మంత్రి నారాయణ్ రాణే శనివారం వెల్లడించారు. అంధేరీ అసెంబ్లీ ఉప ఎన్నికల వేళ ఎమ్మెల్యేలు అధికారపక్షంలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని తెలపటం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఎవరనేది బయటకు వెల్లడించలేదు రాణే. ‘మొత్తం 56 మంది ఎమ్మెల్యేల్లో కేవలం 6-7 ఎమ్మెల్యేలు ఉన్నారు.(ఉద్ధవ్ థాక్రే వర్గంలో) వారు కూడా బయటకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. నలుగురు ఎమ్మెల్యేలు నాతో టచ్లో ఉన్నారు. కానీ, వారి పేర్లు నేను వెల్లడించను.’ అని తెలిపారు. పుణెలో నిర్వహించిన ‘రోజ్గార్ మేళా’ కార్యక్రమంలో ఈ మేరకు వెల్లడించారు. ఉద్ధవ్ థాక్రేపై విమర్శలు గుప్పించారు రాణే. ఆయన రాజకీయం కేవలం మాతోశ్రీ వరకే పరిమితమైందని ఎద్దేవా చేశారు. అయితే, ఈ విషయంపై ఉద్ధవ్ థాక్రే వర్గం ఇప్పటి వరకు ఎలాంటి కామెంట్ చేయలేదు. కేంద్ర మంత్రి నారాయణ్ రాణే ఇదీ చదవండి: ‘బ్రిటన్ ప్రధానిగా బోరిస్ సరైన వ్యక్తి’.. భారత సంతతి ఎంపీ మద్దతు -
కేంద్ర మంత్రి నారాయణ్ రాణెకు భారీ షాక్
ముంబై: కేంద్ర మంత్రి నారాయణ్ రాణెకు షాక్ ఇచ్చింది ముంబై హైకోర్టు. జుహు ప్రాంతంలోని రాణెకు చెందిన భవనం పరిధిలో అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని ముంబై అధికారులను ఆదేశించింది. ఆ నిర్మాణాలు ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్(ఎఫ్ఎస్ఐ), కోస్టల్ రెగ్యులేషన్ జోన్(సీఆర్జడ్) నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు స్పష్టం చేసింది జస్టిస్ ఆర్డీ ధనుక, జస్టిస్ కమల్ ఖాటాలతో కూడిన ధర్మాసనం. నిర్మాణాలను రెగ్యులరైజ్ చేయాలంటూ రాణా కుటుంబం నిర్వహిస్తున్న సంస్థ దాఖలు చేసిన రెండో దరఖాస్తును పరిగణనలోకి తీసుకోవద్దని బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ)ని ఆదేశించింది ధర్మాసనం. అక్రమ నిర్మాణాలను రెగ్యులరైజ్ చేయటం ద్వారా అలాంటి వాటిని ప్రోత్సహించినట్లు అవుతుందని స్పష్టం చేసింది. రెండు వారాల్లోపు అక్రమ నిర్మాణాలను కూల్చి వేయాలని బీఎంసీకి సూచించింది కోర్టు. ఆ తర్వాత వారం లోపు నివేదికను సమర్పించాలని తెలిపింది. అక్రమ నిర్మాణాలను కూల్చి వేయాలని ఆదేశించటంతో పాటు కేంద్ర మంత్రి నారయణ్ రాణెకు రూ.10 లక్షల జరిమానా విధించింది కోర్టు. రెండు వారాల్లోగా మహారాష్ట్ర లీగల్ సర్వీసెస్ విభాగంలో డిపాజిట్ చేయాలని ఆదేశించింది. మరోవైపు.. ఈ అంశంపై ఆరు వారాలు స్టే ఇవ్వాలని, దాంతో సుప్రీం కోర్టులో అప్పీల్ చేస్తామని రాణె తరఫు న్యాయవాది కోరగా.. అందుకు ధర్మాసనం నిరాకరించింది. సివిక్ బాడీ గతంలో ఇచ్చిన ఆదేశాలపై తాము దాఖలు చేసిన రెండో దరఖాస్తును పరిశీలించేలా ఆదేశించాలని రాణెకు చెందిన కాల్కా స్థిరాస్తి సంస్థ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది. అంతకు ముందు ఈ ఏడాది జూన్లో అదనపు నిర్మాణాలను రెగ్యులరైజ్ చేయాలని కోరగా బీఎంసీ తిరస్కరించింది. దీంతో హైకోర్టును ఆశ్రయించింది సంస్థ. ఇదీ చదవండి: ఆ చీతాల రక్షణ విధుల్లోకి గజరాజులు.. రేయింబవళ్లు గస్తీ! -
ఎంఎస్ఎంఈలకు మరింత ప్రోత్సాహం!
న్యూఢిల్లీ: సూక్ష్మ, లఘు, మధ్య చిన్న తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) పురోగతి లక్ష్యంగా కేంద్రం జెడ్ఈడీ (జీరో డిఫెక్ట్ జీరో ఎఫెక్ట్) సర్టిఫికేషన్ కార్యక్రమాన్ని ఆవిష్కరించింది. కేంద్ర మంత్రి నారాయణ్ రాణే ఈ పథకాన్ని ప్రారంభించారు. ఎంఎస్ఎంఈ పారిశ్రామిక ఉత్పత్తుల నాణ్యతను మెరుగుపరచడం, లాభాలను పెంచడం, పర్యావరణంపై హానికరమైన పద్దతులను నియంత్రించడం, ఇంధన సామర్థ్యాన్ని పెంపొందించడం వంటి అంశాలకు సంబంధించి తాజా పథకం ప్రయోజనకరంగా ఉంటుంనది మంత్రి రాణే తెలిపారు. ఎంఎస్ఎంఈ ఛాంపియన్స్ పథకంలో భాగమైన జెడ్ఈడీ ధృవీకరణ పథకం ద్వారా వ్యర్థాలను గణనీయంగా తగ్గించవచ్చని, ఉత్పాదకతను మెరుగుపరచవచ్చని, పర్యావరణ స్పృహపై అవగాహన పెరుగుతుందని, సహజ వనరులను అత్యుఉత్తమంగా ఉపయోగించుకోవచ్చని, మార్కెట్ విస్తరించుకోవచ్చని మంత్రి వెల్లడించారు. బహుళ ప్రయోజనం... అధికార వర్గాల సమాచారం ప్రకారం, ఈ పథకం కాంస్య, వెండి, బంగారంతో సహా మూడు ధృవీకరణ స్థాయిలను కలిగి ఉంటుంది. ఎంఎస్ఎంఈలు ఏదైనా ధృవీకరణ స్థాయికి దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే అందుకు తగిన ప్రమాణాలను పాటించడానికి సిద్ధంగా ఉండాలి. పథకం కింద దాదాపు 20 మార్గదర్శకాలను పాటించాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ తర్వాత ఎంఎస్ఎంఈలు జెడ్ఈడీ మార్గర్శకాల దిశగా చర్యలు తీసుకోవాలి. జెడ్ఈడీ ధృవీకరణ వ్యయంపై ఎంఎస్ఎంఈలు సబ్సిడీని పొందుతాయి. మైక్రో ఎంటర్ప్రైజెస్కు ధృవీకరణ ఖర్చులో 80 శాతం వరకు సబ్సిడీ మొత్తం ఉంటుంది, అయితే చిన్న, మధ్యస్థ యూనిట్లకు ఇది వరుసగా 60 శాతం, 50 శాతంగా ఉంటుంది. మహిళలు, ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల యాజమాన్యంలోని ఎంఎస్ఎంఈలకు 10 శాతం అదనపు సబ్సిడీ ఉంటుంది. పైన పేర్కొన్న వాటికి అదనంగా మంత్రిత్వ శాఖ యొక్క స్పూర్తి లేదా మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ – క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (ఎంఎస్ఈ–సీడీపీ) భాగమైన ఎంఎస్ఎంఈలకు 5 శాతం అదనపు సబ్సిడీ ఉంటుంది. ఇంకా, జెడ్ఈడీ మార్గదర్శకాలు, ప్రమాణాలు పాటించడం ప్రారంభించిన తర్వాత ప్రతి ఎంఎస్ఎంఈకి పరిమిత ప్రయోజనం చేకూర్చే విధంగా రూ. 10,000 రివార్డు ప్రదానం జరుగుతుంది. జీరో డిఫెక్ట్ జీరో ఎఫెక్ట్ సొల్యూషన్స్ వైపు వెళ్లేందుకు ప్రోత్సాహకరంగా వారికి జెడ్ఈడీ సర్టిఫికేషన్ కింద హ్యాండ్హోల్డింగ్, కన్సల్టెన్సీ మద్దతు కోసం ఎంఎస్ఎంఈకి రూ. 5 లక్షల వరకూ కేటాయింపు అందుబాటులో ఉంటుంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, ఆర్థిక సంస్థలు మొదలైన వాటి ద్వారా జెడ్ఈడీ సర్టిఫికేషన్ కోసం అందించే అనేక ఇతర ప్రోత్సాహకాలను కూడా పొందవచ్చు. ఎంఎస్ఎంఈ కవచ్ (కోవిడ్–19 రక్షణ నిమిత్తం) చొరవ కింద ఉచిత ధృవీకరణ కోసం కూడా దరఖాస్తు కూడా చేసుకోవచ్చు. -
కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు.. ‘వచ్చే మార్చి నాటికి బీజేపీ చేతికి అధికారం’
Narayan Rane BJP Government In Maharashtra By March: బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో మహారాష్ట్రలో త్వరలో రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయని.. వచ్చే ఏడాది నాటికి మహారాష్ట్రలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఓ కేంద్ర మంత్రి బాంబు పేల్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు మహారాష్ట్రలో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. బీజేపీ నాయకుడు, కేంద్ర మంత్రి నారాయణ్ రాణె శుక్రవారం రాజస్తాన్ జైపూర్లో ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. ‘‘మహారాష్ట్రలో 2022, మార్చి నాటికి బీజేపీ అధికారంలోకి వస్తుంది. త్వరలోనే మీరు భారీ మార్పులు చూడబోతున్నారు. అధికారంలోకి రావడం.. ప్రభుత్వాన్ని కూల్చడం ఇవ్వన్ని రహస్యంగా జరిగే పనులు’’ అన్నారు నారాయణ్ రాణె. (చదవండి: ‘ముందు జైల్లో పెట్టేది తిను.. నీ వల్ల కాకపోతే అప్పుడు చూద్దాం’) #WATCH | "Change will be seen in Maharashtra very soon. The change will be seen by March. To form a government, to break a govt, some things have to be kept secret," Union Minister Narayan Rane in Jaipur (25.11) pic.twitter.com/GAlDtDr1xO — ANI (@ANI) November 26, 2021 2019 అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీకి భారీ ఎదురుదెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. 2019కి ముందు మిత్రపక్షం శివసేనతో కలిసి రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది. కానీ 2019 ఎన్నికల ఫలితాల తర్వాత సమీకరణాలు మారాయి. శివసేన, కాంగ్రెస్ పార్టీ, నేషనల్ కాంగ్రెస్ పార్టీలు కలిసి మహా వికాస్ అఘాడి(ఎంవీఏ) పేరుతో కూటమిగా ఏర్పడి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. (చదవండి: పెట్రో ధరల తగ్గింపు: శరద్పవార్ స్పందన) పదవిలోకి వచ్చిన ప్రారంభంలో.. సంకీర్ణ ప్రభుత్వం ఎక్కువ కాలం అధికారంలో ఉండదని.. చీలికలు చోటు చేసుకుని.. బీజేపీ చేతికి తిరిగి అధికారం దక్కుతుందని విశ్లేషకులు భావించారు. కానీ వారి అంచనాలు తలకిందులు చేస్తూ.. ఎంవీఏ రెండేళ్ల పదవీ కాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంది. చదవండి: మహారాష్ట్రలో బీజేపీకి భారీ ఎదురు దెబ్బ.. -
రాణె యాత్ర పునఃప్రారంభం త్వరలో
సాక్షి, ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేనుద్దేశించి చేసిన వ్యాఖ్యల దుమారం తరువాత కేంద్ర మంత్రి నారాయణ్ రాణె తన జన్ ఆశీర్వాద్ యాత్రను మళ్లీ ప్రారంభించనున్నారని బుధవారం ఆయన అనుచరులు తెలిపారు. త్వరలోనే యాత్ర ప్రారంభం అవుతుందని వారు పేర్కొన్నారు. ఎప్పుడు ప్రారంభించేది త్వరలో తెలియజేస్తామని రాణె అనుచరుడు రజన్ తెలి తెలిపారు. గతంలో ప్రకటించిన మార్గంలోనే యాత్ర కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. చదవండి: Shiv Sena-Narayan Rane: రెచ్చిపోయిన శివసేన.. కేంద్ర మంత్రి ఆస్తులు ధ్వంసం, పరిస్థితి ఉద్రిక్తం ఇటీవలే కేంద్ర కేబినెట్లోకి చేరిన రాణె ఆగస్ట్ 19వ తేదీన ముంబైలో తన జన్ ఆశీర్వాద్ యాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఏడు రోజులు పాటు సాగే ఈ యాత్ర సింధుదుర్గ్లో ముగియాల్సి ఉంది. అయితే, సోమవారం రాయ్గఢ్లో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్య్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుందో కూడా తెలియనందుకు ఉద్ధవ్ చెంప పగలకొడతానని వ్యాఖ్యానించారు. ఇది రాష్ట్రంలో రాజకీయ దుమారం లేపింది. ఆయనపై నాలుగు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. శివసేన కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు చేపట్టారు. మంగళవారం ఆయనను అరెస్టు చేశారు. అయితే, అదే రోజు రాత్రి ఆయనకు మహాడ్లోని కోర్టు బెయిల్ మంజూరు చేసింది. చదవండి : నేనెవరికీ భయపడను: కేంద్ర మంత్రి రాణె -
నేనెవరికీ భయపడను: కేంద్ర మంత్రి రాణె
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేనుద్దేశిస్తూ తాను చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి నారాయణ్ రాణె మరోసారి గట్టిగా సమర్థించుకున్నారు. బుధవారం ఆయన ముంబైలో మీడియాతో మాట్లాడారు. ‘‘నేనెవరికీ భయపడను. నా వ్యాఖ్యలపై వెనక్కి తగ్గేదే లేదు. దేశానికి స్వాతంత్యం ఏ సంవత్సరంలో వచ్చిందో కూడా గుర్తుపెట్టుకోలేని ఒక ముఖ్యమంత్రిపై నేను చేసిన వ్యాఖ్యలు.. నాలోని ఆగ్రహానికి అక్షరరూపాలు. నేనేమన్నానో మీడియా మిత్రులకూ తెలుసు. చదవండి: చిన్న పార్టీల జోరు..అధిక సీట్ల కోసం బేరసారాలు అదెలా నేరమవుతుంది?. నిజానికి ఠాక్రే.. కేంద్ర మంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్లను ఇంతకంటే దారుణమైన మాటలతో విమర్శించారు. అమిత్ షాను ‘సిగ్గులేని వాడు’ అని, సీఎం యోగిని చెప్పులతో కొట్టాలని ఠాక్రే గతంలో దుర్భాషలాడారు’’ అని రాణె విమర్శించారు. శివసేన పార్టీ ప్రధాన కార్యాలయంపై దాడి చేయాలని చూసే వారి దవడలు పగలగొట్టాలని పార్టీ కార్యకర్తలకు ఠాక్రే గతంలో ఆదేశించారని రాణె గుర్తుచేశారు. నాసిక్ కేసులో అరెస్ట్ చేయబోం నాసిక్లో నమోదైన ‘రాణె వ్యాఖ్యల’ కేసులో ఆయనపై సెప్టెంబర్ 17తేదీ వరకు అరెస్ట్ లాంటి ఎలాంటి తీవ్రమైన చర్యలు తీసుకోబోమని బాంబే హైకోర్టుకు బుధవారం మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కేసుల నుంచి రక్షణ కల్పించాలంటూ రాణె పెట్టుకున్న పిటిషన్ను హైకోర్టు బుధవారం విచారించిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమిత్ దేశాయ్ హాజరయ్యారు. కాగా, అరెస్ట్ సమర్థనీయమేనని మంగళవారం రాత్రి బెయిల్ సందర్భంగా మహాడ్ కోర్టు జడ్జి ఎస్ఎస్ పాటిల్ వ్యాఖ్యానించారు. కాగా, విచారణ నిమిత్తం సెప్టెంబర్ రెండున తమ ముందు హాజరవ్వాలని రాణెను నాసిక్ పోలీసులు నోటీసులు జారీచేశారు. చదవండి: అమెరికాలో ఆర్జనలో మన వారే టాప్ -
రెచ్చిపోయిన శివసేన.. కేంద్ర మంత్రి ఆస్తులు ధ్వంసం
సాక్షి,ముంబై: కేంద్రమంత్రి నారాయణ్ రాణే వ్యాఖ్యలతో రేగిన దుమారం మరింత తీవ్రమవుతోంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై వ్యాఖ్యలకు నిరసనగా శివసేన కార్యకర్తలు బీభత్సం సృష్టించారు. కేంద్ర మంత్రికి సంబంధించిన ఆస్తులపై దాడిచేశారు. అలాగే నాసిక్లోని బీజేపీ కార్యాలయంపై కూడా రాళ్లు రువ్వారు. ఘర్షణకు దారి తీసింది. దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీంతో బీజేపీ-శివసేన కార్యకర్తల వార్ మరింత ముదురుతోంది. ముఖ్యంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై సూక్ష్మ, చిన్న, మధ్యతరహా శాఖా మంత్రి నారాయణ్ రాణే వివాదాస్పద వ్యాఖ్యలు రాష్ట్రంలో ప్రకంపనలు రేపుతున్నాయి. ఈ వ్యవహారంపై శివసేన కార్యకర్తలు దూకుడుమీద ఉన్నారు. ముంబైతోపాటు రాష్ట్రంలో పలుచోట్ల ఆందోళనలు , ప్రదర్శనలు చేపట్టారు. అనంతరం పూణేలోని ఆర్ డెక్కన్ మాల్పై రాళ్లు రువ్వారు. దీంతో తీవ్ర నష్టం సంభవించినట్టు తెలుస్తోంది. యువ నేత వరుణ్ దేశాయ్ నాయకత్వంలో, కొంతమంది శివసేన కార్యకర్తలు నినాదాలు చేస్తూ ముంబైలోని జుహులోని రాణే బంగ్లాలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో, రాణే మద్దతుదారులు ప్రతిఘటించడంతో జుహు ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ముఖ్యంగా ముంబై, నాసిక్, చిప్లూన్, సాంగ్లీ, ఔరంగాబాద్ లలో శివ సైనికులు రెచ్చిపోయారు. వీరి ఆందోళనలు, ఘర్షణలు తీవ్ర ఉద్రిక్తత రాజేశాయి. దీంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా దేశ స్వాతంత్య్ర దిన సంవత్సరాన్ని మరచిపోయారని, అదే తానైతే ఆయనను చెంపదెబ్బ కొట్టి ఉండేవాడినంటూ కేంద్రమంత్రి రాణే మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేపై చేసిన అనుచిత వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. దీంతో నాసిక్ పోలీసులు రాణేను అరెస్టు చేయడం, చివరకు కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. -
సీఎంపై అనుచిత వ్యాఖ్యలు.. కేంద్ర మంత్రి నారాయణ రాణె అరెస్ట్
ముంబై: స్వాతంత్య్ర దినోత్సవం రోజున మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే చేసిన ప్రసంగంపై కేంద్ర మంత్రి నారాయణ్ రాణె సోమవారం చేసిన వ్యాఖ్యలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. మహారాష్ట్రలో బీజేపీ, శివసేన నేతలు, కార్యకర్తల మధ్య ఘర్షణలకు దారి తీసిన ఈ వ్యాఖ్యలతో రాష్ట్ర పోలీస్ యంత్రాంగం రంగంలోకి దిగింది. రాణెపై మహారాష్ట్రలో పలు చోట్ల కేసులు నమోదవడంతో.. జన్ ఆశీర్వాద్ యాత్రలో భాగంగా మహారాష్ట్రలో పర్యటిస్తున్న రాణెను పోలీసులు అరెస్ట్చేశారు. ఏకంగా కేంద్ర మంత్రిని అరెస్ట్ చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ అంశం చర్చనీయాంశమైంది. సంవత్సరం గుర్తులేకపోవడం సిగ్గుచేటు జన్ ఆశీర్వాద్ యాత్రలో భాగంగా మహారాష్ట్రలోని రాయ్గఢ్ జిల్లాలోని రత్నగిరిలో రాణె పర్యటించారు. ఈ సందర్భంగా ఆనాడు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్ర ప్రజలనుద్దేశిస్తూ ఆగస్ట్ 15న సీఎం ఠాక్రే చేసిన ప్రసంగాన్ని రాణె ప్రస్తావించారు. ‘ఏ ఏడాదిలో దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిందో సాక్షాత్తూ సీఎంకు తెలీకపోవడం నిజంగా సిగ్గుచేటు. ప్రసంగాన్ని మధ్యలో ఆపి ఆయన వెనక వైపున్న సిబ్బందిని ఏడాది గురించి అడిగి తెల్సుకున్నారు. ఆ రోజు నేనే అక్కడ ఉండి ఉంటే గట్టిగా సీఎం చెంప పగలగొట్టేవాడిని’అని రాణె వ్యాఖ్యానించారు. దీంతో రాణె వ్యాఖ్యలు మహారాష్ట్ర వ్యాప్తంగా శివసేన పార్టీ శ్రేణుల్లో ఆగ్రహం తెప్పించాయి. ముంబై, పుణె, నాగ్పూర్, థానె, అమరావతిసహా రాష్ట్రంలోని పలు పట్టణాల్లో శివసేన కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. బీజేపీ కార్యాలయాలను ధ్వంసంచేశారు. మరోవైపు, నాసిక్ సిటీలో, రత్నగిరి జిల్లాసహా పలు పట్టణాల్లో శివసేన, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు జరిగాయి. ముంబైలోని రాణె నివాసం వద్ద బీజేపీ, శివసేన కార్యకర్తలు రాళ్లు రువ్వుకుంటూ ఘర్షణకు దిగారు. దీంతో పోలీసులు వారందరినీ చెదరగొట్టారు. 50 మంది కార్యకర్తలపై కేసులు పెట్టారు. రాణెను కేబినెట్ నుంచి తొలగించాలంటూ ప్రధాని మోదీకి శివసేన ఎంపీ వినాయక్ రౌత్ లేఖ రాశారు.. వెనువెంటనే అరెస్ట్ రాణెపై పుణె, నాసిక్, మహాడ్ సహా పలు చోట్ల ఎఫ్ఐఆర్లు నమోదవడంతో రాణెను అరెస్ట్చేయాల్సిందిగా నాసిక్ పోలీస్ కమిషనర్ ఆదేశాలిచ్చారు. దీంతో ముందస్తు బెయిల్ ఇవ్వాలని రాణె రత్నగిరిలోని సెషన్స్ కోర్టును కోరారు. నాసిక్లోని కేసు.. తమ పరిధిలోది కాదంటూ పిటిషన్ను సెషన్స్ కోర్టు తిరస్కరించింది. కమిషనర్ ఆదేశాలతో పోలీసులు రాణెను మంగళవారం మధ్యాహ్నం గోల్వాలీలో అరెస్ట్చేసి సంగమేశ్వర్ పోలీస్స్టేషన్కు తీసుకొచ్చి విచారించారు. తర్వాత కోర్టులో ప్రవేశపెట్టేందుకు రాయ్గఢ్ జిల్లాలోని మహాడ్కు తీసుకొచ్చారు. దీంతో రాణె బాంబే హైకోర్టును ఆశ్రయించారు. అరెస్ట్, తీవ్రమైన చర్యలు తీసుకోకుండా రక్షణ కల్పించాలంటూ రాణె తరపు న్యాయవాది అనికేత్ నికమ్ హైకోర్టును కోరారు. పిటిషన్ను అత్యవసరంగా విచారించబోమని, ముందుగా రిజిస్ట్రీ ముందు కేసు ఫైల్ చేయండంటూ జస్టిస్ ఎస్ఎస్ షిండే, జస్టిస్ ఎన్జే జమదార్ల డివిజన్ బెంచ్ రాణె లాయర్ను ఆదేశించింది. తనపై పలుచోట్ల దాఖలైన ఎఫ్ఐఆర్లను కొట్టివేయాలంటూ రాణె హైకోర్టులో మరో పిటిషన్ దాఖలుచేసే ప్రయత్నంచేయగా... సాంకేతిక కారణాల వల్ల మంగళవారం అది సాధ్యపడలేదు. నేనంటే భయం.. అరెస్ట్ తర్వాత రాణె ఇండియాటుడేతో మాట్లాడారు. ‘‘వారు (మహారాష్ట్ర ప్రభుత్వం) నన్ను చూసి భయపడుతున్నారు. అందుకే ఇదంతా చేస్తున్నారు. నేనేమీ తీవ్రమైన వ్యాఖ్యలేవీ చేయలేదు. ‘నేనక్కడ ఉంటే చెంప మీద కొట్టేవాడిని’అని అన్నాను. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం వివాదంలో సీఎం కుమారుడు ఆదిత్య ఇరుక్కున్నారు. అయినా అరెస్ట్ చేయలేదు. నన్ను ఎందుకు అరెస్ట్చేశారు?అని వ్యాఖ్యానించారు. ఓర్వలేకే ఈ అరెస్ట్: నడ్డా బీజేపీ జన్ ఆశీర్వాద్ యాత్రకు ప్రజల నుంచి అపూర్వ స్పందన వచ్చిందని, అందుకే ఓర్వలేక శివసేన ప్రభుత్వం ఇలా అరెస్ట్లకు పాల్పడుతోందని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. రాత్రికి బెయిల్ మహాడ్ కోర్టు నారాయణ్ రాణెకు మంగళవారం రాత్రి బెయిల్ మంజూరు చేసింది. పోలీసులు ఏడు రోజుల కస్టడీ కోరినా మహాడ్ కోర్టు జడ్జి షేక్బాబాసో పాటిల్ నిరాకరించారు. ముఖ్యమంత్రి ప్రతిష్టను దెబ్బతీయడానికి కుట్ర జరిగిందేమోననే కోణంలో దర్యాప్తు చేయాల్సి ఉందని, రాణెను పోలీసు కస్టడీకి ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాది భూషణ్ సాల్వి కోరారు. దీనిని రాణె లాయర్లు గట్టిగా వ్యతిరేకించారు. రాణె వయసు 69 ఏళ్లని, షుగర్, బీపీ సమస్యలు ఉన్నాయని కోర్టును నివేదించారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 41ఏ కింద రాణెకు ఎలాంటి సమన్లు ఇవ్వలేదని, అందువల్ల అరెస్టు చట్టవిరుద్ధమని రాణె న్యాయవాది అనికేత్ నికమ్ వాదించారు. కస్టడీ అనవసరమన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న జడ్జి పాటిల్ కేంద్రమంత్రిని పోలీసు కస్టడీకి అప్పగించానికి నిరాకరించారు. రూ.15 వేల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేశారు. చదవండి: చీరకట్టులో కుందనపు బొమ్మలా ‘పీవీ సింధు’ -
శివసైనికులు చేసింది ముమ్మాటికీ తప్పే: ఫడ్నవీస్
సాక్షి, ముంబై: కేంద్ర మంత్రి నారాయణ్ రాణే ప్రారంభించిన జన్ ఆశీర్వాద్ యాత్ర రాష్ట్రంలో రాజకీయ రగడకు కారణం అవుతోంది. గురువారం మహరాష్ట్రలో తన యాత్రను ప్రారంభించడానికి ముందు ఆయన దాదర్లోని శివాజీ పార్క్ మైదానంలోని దివంగత బాల్ ఠాక్రే స్మృతి స్థలాన్ని సందర్శించి నివాళులర్పించిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయన నగరంలోని పలు వీధుల్లో తిరుగుతూ తన యాత్రను కొనసాగించారు. అయితే, బాల్ ఠాక్రే స్మతి స్థలాన్ని రాణే సందర్శించడం పట్ల మండిపడిన కొందరు శివసైనికులు, శుక్రవారం బాల్ ఠాక్రే స్మృతి స్థలాన్ని శుద్ధి చేశారు. కేంద్ర మంత్రి నారాయణ్ రాణే బాల్ ఠాక్రే స్మృతి స్థలాన్ని సందర్శించడంతో అది అపవిత్రమైందని శివసైనికులు ఆరోపించారు. స్మృతి స్థలాన్ని తొలుత గోమూత్రంతో శుభ్రం చేసి, తరువాత పాలతో అభిషేకం చేశారు. బాల్ ఠాక్రే రాణేను ఎంతో ప్రోత్సహించారని, అండగా నిలిచారని, రాజకీయాల్లో ఉన్నత పదవులివ్వడంతో పాటు ముఖ్యమంత్రిని చేశారని శివసైనికులు పేర్కొన్నారు. అలాంటి వ్యక్తిపై, ఆయన కుటుంబంపై రాణే వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పాటు అనేక ఆరోపణలు చేశారని శివసైనికులు మండిపడ్డారు. రాణే సందర్శనతో స్మృతి స్థలం అపవిత్రమైందని శివసేన ఎమ్మెల్యే మనీషా కాయందే ధ్వజమెత్తారు. పాలతో అభిషేకం చేసిన శివసైనికులను ఆమె ప్రశంసించారు. ‘రాణేకు నచ్చింది ఆయన చేశారు. మాకు నచ్చింది మేం చేశాం’అని మనీషా స్పష్టం చేశారు. ‘2005లో శివసేన నుంచి బయటకు వచ్చిన నారాయణ్ రాణేకు ఇప్పటివరకు బాల్ ఠాక్రే గుర్తుకు రాలేదు. ఆయన ఇప్పటివరకు బాల్ ఠాక్రే స్మృతి స్థలాన్ని సందర్శించలేదు. ఇప్పుడు జన్ ఆశీర్వాద్ యాత్ర పేరుతో రాజకీయంగా లబ్ధి పొందేందుకు రాణేకు బాల్ ఠాక్రే గుర్తుకొచ్చారు’అని మనీషా కాయందే ఎద్దేవా చేశారు. ‘బాల్ ఠాక్రేపై అంత అభిమానం ఉంటే ఆయన కుటుంబంపై ఎందుకు నిప్పులు కక్కుతున్నారు? ఘాటైన ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు?’అని ఆమె ప్రశ్నించారు. చదవండి: నాన్ పార్కింగ్ జోన్: మనిషితో సహా బైక్ని ఎత్తి వ్యాన్లో వేశారు శివసైనికులు చేసింది తప్పు: ఫడ్నవీస్ నాగ్పూర్: రాణే సందర్శనతో బాల్ ఠాక్రే స్మృతి స్థలం అపవిత్రమైందని పేర్కొంటూ శివసైనికులు ఆ స్థలాన్ని శుద్ధి చేయడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఖండించారు. స్మృతి స్థలం శుద్ధి సంఘటన గురించి కొందరు విలేకరులు నాగ్పూర్లో ఫడ్నవీస్ను ప్రశ్నించగా.. ఆయన స్పందిస్తూ ఇది సంకుచిత మనస్తత్వం గల వాళ్లు చేసే పని అని విమర్శించారు. ఆ పని చేసిన శివసైనికులకు అసలు శివసేన అంటే ఏంటో తెలియదన్నారు. అప్పట్లో బాల్ ఠాక్రేను జైలుకు పంపించాలని అనుకున్న పార్టీలతోనే ఇప్పుడు శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని ఫడ్నవీస్ ధ్వజమెత్తారు. అలాంటి పారీ్టలతో శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా లేనిది, ఒక పాత శివసైనికుడు వెళ్లి నివాళులు అర్పిస్తేనే అపవిత్రం అవుతుందా అని ప్రశ్నించారు. శివసైనికులు చేసింది ముమ్మాటికీ తప్పేనని ఈ సందర్భంగా దేవేంద్ర ఫడ్నవీస్ స్పష్టం చేశారు. -
సుశాంత్ మాజీ మేనేజర్ మరణంపై సంచలన ఆరోపణలు
ముంబై : బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మాజీ మేనేజర్ దిశా సలియన్ది ఆత్మహత్య కాదని ఆమెపై లైంగిక దాడి జరిపి హత్య చేశారని మహారాష్ట్ర బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి నారాయణ రాణే ఆరోపించారు. దిశా అటాప్సీ రిపోర్ట్లో ఆమె ప్రైవేట్ భాగాలపై గాయాల మరకలున్నాయని వెల్లడైందని పేర్కొన్నారు. దిశా, రాజ్పుత్ల మరణాల కేసుల్లో దోషులను కాపాడేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బీజేపీ నేత రాణే ఆరోపించారు. దిశా కుటుంబంపై ఒత్తిడి తెస్తుండటంతో వారు ఆమె మృతిపై విచారణ కోరడం లేదని రాణే పేర్కొన్నారు. జూన్ 13 రాత్రి నటుడు దినోమోరియా నివాసంలో పార్టీ జరిగిందని, ఆ తర్వాత పార్టీకి హాజరైన వారు సుశాంత్ ఇంటికి వెళ్లారని రాణే చెప్పారు. ఈ పార్టీకి ఓ రాజకీయ నేత కూడా హాజరయ్యారని పేర్కొన్నారు. కాగా విశ్వసనీయ సమాచారం ఉండటంతోనే తన తండ్రి ఈ ఆరోపణలు చేసి ఉంటారని ఆయన కుమారుడు, బీజేపీ నేత నితీష్ రాణే అన్నారు. త్వరలోనే తాము ఈ వివరాలను సంబంధిత అధికారుల ఎదుట వెల్లడిస్తామని చెప్పారు. సుశాంత్ మృతిపై వాస్తవాలు వెలుగులోకి రాకుండా కొందరు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. కాగా జూన్ 14న సుశాంత్ విషాదాంతానికి ముందురోజు సుశాంత్ ఇంట్లో పార్టీ జరిగిందనే ఆరోపణలను ముంబై పోలీస్ చీప్ పరంవీర్ సింగ్ గతంలో తోసిపుచ్చారు. మరోవైపు సుశాంత్ మృతిపై అతడి గర్ల్ఫ్రెండ్ రియా చక్రవర్తిపై ఆరోపణలు వెల్లువెత్తాయి. సుశాంత్ తండ్రి ఫిర్యాదుపై ముంబై చేరుకున్న బిహార్ పోలీసులు ఈ దిశగా దర్యాప్తు ముమ్మరం చేశారు. చదవండి : సుశాంత్ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం -
గవర్నర్తో మాజీ సీఎం రాణే భేటీ
ముంబై : మహారాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ ఎంపీ నారాయణ్ రాణే రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీతో సోమవారం రాజ్భవన్లో సమావేశమయ్యారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్ను కోరారు. కరోనా వైరస్ను కట్టడి చేయడంలో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని రాణే ఆరోపించారు. మహారాష్ట్రలో అత్యధిక కేసులు, మరణాలు నమోదవడంతో పాటు భవిష్యత్లోనూ మహమ్మారిని ప్రస్తుత ప్రభుత్వం కట్టడి చేయలేదని అన్నారు. కరోనా వైరస్ సంక్షోభంపై చర్చించేందుకు గత కొద్దిరోజులుగా బీజేపీ నేతలు గవర్నర్తో భేటీ అవడం గమనార్హం. బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సైతం ఇటీవల గవర్నర్తో సమావేశమై కరోనా కట్టడి సహా పలు అంశాలపై చర్చించారు. ఇక మహారాష్ట్రలో ఇప్పటివరకూ 50,231 కరోనా కేసులు నమోదవగా 1635 మంది మరణించారు. చదవండి : మహా కలకలం -
‘కాంగ్రెస్లో చేరడం పొరపాటో లేక తప్పిదమో చెప్పలేను’
సాక్షి, ముంబై : మహారాష్ట్ర మాజీ సీఎం నారాయణ్రాణెపై ఎన్సీపీ అధినేత శరద్పవార్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శివనేన నుంచి రాణె కాంగ్రెస్లో చేరడాన్ని పొరపాటు అనాలో లేక ఘోర తప్పిదం అనాలో చెప్పలేనని వ్యాఖ్యానించారు. నారాయణ్రాణె ఆటోబయోగ్రఫీ ఆవిష్కరణ కార్యక్రమంలో పవార్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘2005లో రాణె శివసేన నుంచి బయటికి వద్దామనుకున్నారు. అప్పుడాయనకు రెండే అవకాశాలున్నాయి. ఒకటి ఎన్సీపీ. రెండోది కాంగ్రెస్. అయితే, ఆయన కాంగ్రెస్ను ఎంచుకున్నారు. అది పొరపాటు నిర్ణయమో. లేక తప్పిదమో చెప్పలేను’అన్నారు. ‘కాంగ్రెస్లో చేరితే సీఎం పదవి ఇస్తానన్నారని రాణె చెప్పారు. కానీ, అప్పుడే చెప్పాను. ఇచ్చిన హామీలు నిలుపుకోవడం కాంగ్రెస్ నైజంలో లేదు అని. వినలేదు. ఎందుకంటే నా రాజకీయ జీవితంలో ఎక్కువ భాగం కాంగ్రెస్లోనే గడిపాను కదా’అన్నారు. శుక్రవారం జరిగిన కార్యక్రమంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, తదితరులు పాల్గొన్నారు. ఆవేశపరుడిగా పేరున్న రాణె కొంకణ్ ప్రాంతానికి చెందిన వారు. శివసేన పార్టీలోనారాయణ్రాణె చాలాకాలం పనిచేశారు. బీజేపీ-శివసేన సంకీర్ణ ప్రభుత్వంలో బాల్ థాకరే ఆయనకు 1999లో మహారాష్ట్ర సీఎంగా అవకాశమిచ్చారు. అయితే, రాజ్థాకరేకి పార్టీలో ప్రాధాన్యం పెరగడంతో నారాయణ్రాణె అసమ్మతి గళం వినిపించారు. దాంతో ఏడాది కాలానికే రాణె సీఎం పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. 2005లో కాంగ్రెస్లో చేరి 12 ఏళ్లపాటు పనిచేశారు. అయితే, కాంగ్రెస్లో నాయకులతో ఆయనకు పొసగక పోవడంతో పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేసి సస్పెండ్ అయ్యారు. సోనియా కనికరించడంతో తిరిగి పార్టీలో చేరారు. చివరికి ‘మహారాష్ట్ర స్వాభిమాన్ పక్ష’ పేరుతో 2018లో పార్టీ పెట్టారు. -
మరాఠాలకు రిజర్వేషన్లు ఎందుకు ?
సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో తమకూ రిజర్వేషన్లు కావాలంటూ అన్ని రంగాల్లో అగ్రస్థానాల్లో ఉన్న మరాఠాలు ఎందుకు ఆందోళన చేస్తున్నారు? వారు నిజంగా సామాజికంగా, రాజకీయంగా, విద్యాపరంగా వెనకబడి ఉన్నామని భావిస్తున్నారా? వారు ఉద్యమ బాట పట్టడానికి మరేమైన కారణాలు ఉన్నాయా? మహారాష్ట్రలో మంగళవారం, బుధవారాల్లో మరాఠాలు నిర్వహించిన ఆందోళన విధ్వంసకాండకు దారి తీసిన విషయం తెల్సిందే. మహారాష్ట్రలో మరాఠాలు 33 శాతం మంది ఉన్నారు. వారికీ రిజర్వేషన్లు కల్పించాలంటే ప్రధానంగా రెండు ప్రతిబంధకాలు ఉన్నాయి. ఒకటి రిజర్వేషన్లు అన్నీ కలిపి యాభై శాతం మించరాదంటూ సుప్రీం కోర్టు ఇప్పటికే ఇచ్చిన తీర్పు. సుప్రీం కోర్టు నిర్దేశించిన దానికన్నా ఇప్పటికే రెండు శాతం ఎక్కువ అంటే, 52 శాతం రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి. రెండోది సామాజికంగా, విద్యాపరంగా వెనకబడిన వర్గాలకే రిజర్వేషన్లు కల్పించాలి. మరాఠాలు వెనకబడిన వర్గాల కేటగిరీ కిందకు రారని, వారు ఫార్వర్డ్ కులమని మండల కమిషన్ ఎప్పుడో స్పష్టం చేసింది. రాజకీయంగా కూడా ఎంతో ఎదిగిన మరాఠా కులాన్ని ఓబీసీ క్యాటగిరీలో చేర్చలేమని జాతీయ వెనకబడిన వర్గాల కమిషన్ 2003లో స్పష్టం చేసింది. ఆ తర్వాత 2008లో మహారాష్ట్ర వెనకబడిన వర్గాల కమిషన్ తన 22వ నివేదికలో కూడా మరాఠాలను ఓబీసీ కేటగిరీలో చేర్చలేమంటూ చేతులెత్తేసింది. ఆ నివేదికపై అసెంబ్లీలో చర్చ జరగాల్సి ఉండగానే మహారాష్ట్ర ప్రభుత్వం మరాఠాల రిజర్వేషన్ల అంశంపై జస్టిస్ సరాఫ్ నాయకత్వాన ఓ కమిషన్ వేసింది. ఆ కమిషన్ మనుగడలో ఉండగానే మహారాష్ట్ర ప్రభుత్వం నారాయణ రాణె నాయకత్వాన మరో కమిషన్ వేసింది. 2014లో రాష్ట్ర ఎన్నికలకు కొంత కాలం ముందు నారాయణ రాణె కమిషన్ మరాఠాలకు రిజర్వేషన్లు సిఫార్సు చేస్తూ నివేదిక సమర్పించింది. అప్పటి కాంగ్రెస్-ఎన్సీపీ ప్రభుత్వం ఆదరాబాదరా సమావేశమై మరాఠాలకు ప్రభుత్వ ఉద్యోగ, విద్యావకాశాల్లో 16 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించింది. ఆ మేరకు ఆర్డినెన్స్ను కూడా జారీ చేసింది. దాన్ని నిలిపివేస్తు అదే సంవత్సరం నవంబర్ నెలలో బాంబే హైకోర్టు స్టే ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ-శివసేన ప్రభుత్వం మరాఠాలకు 16 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టమే తీసుకొచ్చింది. ఆ చట్టాన్ని కూడా బాంబే హైకోర్టు అడ్డుకుంది. మరాఠాలు రిజర్వేషన్లకు అర్హులు కారని అన్ని కమిషన్లు, కోర్టులు ఎందుకు తేల్చాయి? 1960లో మహారాష్ట్ర ఏర్పడిన నాటి నుంచి రాష్ట్రానికి సీఎం పదవిని 18 మంది నిర్వహించగా, వారిలో పది మంది మరాఠాలే. 1962 నుంచి 2004 మధ్య 2,430 మంది శాసన సభ్యులు ఎన్నిక కాగా వారిలో సగానికన్నా ఎక్కువ అంటే 1,366 మంది మరాఠాలే ఎన్నికయ్యారు. జిల్లా సహకార బ్యాంకుల్లో, విద్యా సంస్థల్లో, వైద్య, ఇంజనీరింగ్ యూనివర్శిటీల్లో వారిదే పైచేయి. వారికే ఎక్కువ షుగర్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. పాల సహకార సంఘాలపై వారిదే ఆధిపత్యం. అన్నింటికంటే వారి చేతుల్లో వ్యవసాయ భూములు ఎక్కువగా ఉన్నాయి. ఒక విధంగా గ్రామీణ సామ్రాజ్యం వారిదే. అందుకే ప్రధానంగా వారి వృత్తి వ్యవసాయం అయింది. ఈ కారణాల వల్లనే వివిధ కమిషన్లు వారి డిమాండ్ను తిరస్కరిస్తూ రాగా, ఓట్ల రాజకీయాల కోసం నాడు దిగిపోతున్న కాంగ్రెస్-ఎన్సీపీ ప్రభుత్వం, నేటి బీజేపీ-శివసేన ప్రభుత్వాలు రిజర్వేషన్లను అనుమతించాయి. మారుతున్న సామాజిక పరిస్థితుల కారణంగా మరాఠా యువకులు వ్యవసాయ రంగానికి దూరం అవుతూ వచ్చారు. వారికి చదువుకునే స్థోమత ఎక్కువగా ఉన్నా చదువులో పెద్దగా రాణించలేక పోయారు. సామాజికంగా వెనకబడిన వర్గాల వారు ముందుకు దూసుకెళుతుంటే తాము విద్యా సంస్థల్లో, ప్రభుత్వ ఉద్యోగాల్లో వెనకబడి పోయామన్న భావం యువతలో పేరుకుపోయింది. అసహనం పెరిగిపోయింది. కేవలం రిజర్వేషన్ల కారణంగానే బీసీలు, ఓబీసీలు, దళితులు ముందుకు తీసుకుపోతున్నారన్న అక్కసు వారిలో పుట్టింది. ఇలాంటి పరిస్థితుల్లో అహ్మద్ నగర్ జిల్లా కోపర్ది నగర్లో 2016, సెప్టెంబర్ 20వ తేదీన 11 ఏళ్ల మరాఠా బాలికపై సామూహిక అత్యాచారం జరిపి దారుణంగా చంపేశారు. దోషులు దళితులు కావడంతో మరాఠాలు నాడు పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. నేరస్థులకు ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేశారు. సకాలంలోనే పోలీసులు దళితులను అరెస్ట్ చేయగా, ఫాస్ట్ట్రాక్ కోర్టు ఆ కేసును త్వరితగతిన విచారించి ఏడాదిలోగానే ముగ్గురు దోషులను మరణ శిక్ష విధించింది. అయినా మరాఠాల కోపం చల్లరలేదు. ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టాన్ని రద్దు చేయాలంటూ ఆందోళనలు చేశారు. తమకు రిజర్వేషన్లు కావాలనే డిమాండ్ను మరింత ముందుకు తీసుకొచ్చారు. -
బాల్ఠాక్రేను వేధించడం కళ్లారా చూశా
సాంగ్లి: శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే నోరు మూసుకోపోతే ఆయన బండారం మొత్తం బయటపెడతానని మాజీ ముఖ్యమంత్రి నారాయణ్ రాణె హెచ్చరించారు. తాను బాల్ఠాక్రేను వేధించినట్టు ఉద్ధవ్ చేసిన ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. మహారాష్ట్రలోని సాంగ్లిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బాల్ఠాక్రే బతికుండగా ఆయనకు తాను తాను ఎటువంటి సమస్యలు సృష్టించలేదన్నారు. ఉద్ధవ్, ఆయన కుటుంబమే ‘పెద్దాయన’పై వేధింపులకు పాల్పడిందని ఆరోపించారు. ‘బాబాసాహెబ్ను ఉద్ధవ్, ఆయన కుటుంబ సభ్యులు వేధించడం నా కళ్లారా చూశాను. ఉద్ధవ్ నోరుమూసుకుని, నాపై కుట్రలు కట్టిపెట్టకపోతే ఆయన బండారం బయటపెట్టేందుకు వెనుకాడను. బాబాసాహెబ్ బతికుండగా ఆయనకు నేను ఏవిధంగానూ కష్టం కలిగించలేదు. బాల్ఠాక్రే నివాసంలో మాతృశ్రీలో జరిగిన అన్నింటికీ నేను ప్రత్యక్షసాక్షిని. వీటన్నింటినీ కచ్చితంగా వెల్లడిస్తా. నాపై చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదు. గతంలోనూ ఇదే చెప్పాన’ని నారాయణ్ రాణె పేర్కొన్నారు. మహారాష్ట్రలోని ఫడ్నవీస్ ప్రభుత్వం.. రాణెకు మంత్రి పదవి ఇచ్చేందుకు సిద్ధమవుతోందని వార్తలు వస్తున్న నేపథ్యంలో శివసేన నాయకులు ఆయనను లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేస్తున్నారు. బాల్ఠాక్రేకు అత్యంత సన్నిహితుడైన రాణె గత సెప్టెంబర్లో కాంగ్రెస్ పార్టీని వీడి మహారాష్ట్ర స్వాభిమాన్ పేరుతో సొంత పార్టీ పెట్టారు. తర్వాత కేంద్రం, మహారాష్ట్రలో ఎన్డీఏ ప్రభుత్వంతో చేతులు కలిపారు. -
ముందు నొయ్యి వెనుక గొయ్యి!
ఇటీవలే కాంగ్రెస్ నుంచి రాజీనామా చేసిన నారాయణ రాణే మంత్రివర్గంలో సీటు కాదు కదా.. ఎమ్మెల్సీగా ఎన్నిక అవడం కూడా కష్టమయ్యే పరిస్థితుల్లో చిక్కుకు పోయారు. మాతృ సంస్థ శివసేన ఆయనపై పగ సాధింపుకు సిద్ధమైంది. నారాయణ్ రాణే ఉల్లాసకరమైన స్థితిలో కాలం గడుపుతున్నారు. బీజేపీకి తానిచ్చిన మాట ప్రకారం తాను కాంగ్రెస్కు రాజీనామా చేసి, తన శాసనమండలి సభ్యత్వాన్ని కూడా వదిలేశారు. కొత్త మిత్రురాలి సహాయంతో ఆ స్థానాన్ని వెనువెంటనే దక్కించుకుంటానని తప్పుగా అంచనా వేశారు. కానీ అలా జరగలేదు. ఎందుకంటే, బీజేపీ రాణేపట్ల ఆసక్తి ప్రదర్శిస్తే దేనికైనా తెగిస్తానని రాణే మాజీ పార్టీ లేదా అతడి తొలి ప్రేమికురాలు అయిన శివసేన తీవ్రంగా హెచ్చరించింది. బీజేపీ సాధించిన 122 స్థానాలతో పోలిస్తే 63 స్థానాల్లో మాత్రమే గెలిచిన శివసేన మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవిస్ నేతృత్వంలోని ప్రభుత్వంలో భాగస్వామి. శివసేన ఎప్పటికైనా తన కాళ్లకింది తివాచీని లాగేస్తుందన్న బీజేపీ భయాన్ని అర్థం చేసుకోవలసిందే. శివసేన నమ్మదగిన భాగస్వామి కాదు. ఒకవైపు బీజేపీతో అధికారం పంచుకుంటూనే కాంగ్రెస్, ఎన్సీపీల కంటే సమర్థంగా ప్రతిపక్షపాత్ర పోషిస్తోంది. ప్రభుత్వంలో ఉంటూ వచ్చే అన్ని ప్రయోజనాలనూ అందుకుంటూనే దానిపై నాలుగు రాళ్లు వేస్తూ ఉండటం దాని లక్షణం. రాణేపై శివసేనకు ఉన్న పట్టు చాలా గట్టిది. ఆ పార్టీకి చెందిన మనోహర్ జోషి స్థానంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన రాణేపై దాని పగ ప్రబలంగానే ఉంది. బహిరంగంగా అలా చెబుతోంది కూడా. ప్రజలు, రాజ కీయ వాదుల అవగాహన కూడా అదే మరి. రాణే తన ఎమ్మెల్సీ స్థానాన్ని తిరిగి పొందడానికి ప్రయత్నిస్తే, కాంగ్రెస్, బీజేపీ రెండూ శివసేనకు మద్దతు ఇవ్వవచ్చు, లేదా దాని మద్దతును అవి అంగీకరించవచ్చు. మాజీ శివసైనికుడు, ప్రస్తుతం మాజీ కాంగ్రెస్ వాది అయిన రాణే తనను సభ్యుడిగా చేర్చుకున్న పార్టీకి పెద్ద తలనొప్పిగా తయారవుతాడని చాలామంది వర్ణిస్తుంటారు. పార్టీలో ఉన్నత స్థానాల్లో ఉన్న అశోక్ చవాన్ను లేదా పృథ్వీరాజ్ చవాన్ను తొలగించి తాను వారి స్థానాన్ని చేజిక్కించుకోవడంలో కాంగ్రెస్ అధిష్టానం మద్దతును పొందడం చాలా సులువైన విషయమని రాణే భావించారు. అది బాల్ ఠాక్రేను ఒప్పించడమంత సులువైన అంశమని భావించారు. ఆయన అసహనం, పార్టీకిమించి తన స్వార్థాన్ని మాత్రమే చూసుకునే వైఖరి వల్లే రాజకీయాల్లోనే కాకుండా సొంత నియోజకవర్గంలో కూడా అనేక సమస్యలు తనను చుట్టుముడుతూ వచ్చాయి. అందుకే 2014 ఎన్నికల్లో రాణే ఆయన కుమారుడు తమ కంచుకోటలను కోల్పోయారు. ఆ తర్వాత ముంబైలో అసెంబ్లీ స్థానాన్ని కూడా రాణే గెల్చుకోలేకపోయారు. ఇప్పుడు తన సంరక్షణలోని కొంకణ్ ప్రాంతంకోసం పోరాడుతున్నారు. ఇతరుల మద్దతుతో కాకుండా స్వయంగా దీనికి ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ గెలిస్తే, అప్పుడు బీజేపీ అభినందనలను అందుకోవచ్చు. రాణేను తన చెంత చేర్చుకునే విషయమై బీజేపీ చాలా అప్రమత్తతతో ఉంది. రాణే ఆగ్రహ ప్రవృత్తి, ఉన్నట్లుండి ఆకస్మిక దాడిగా మారి తాను సొంత పార్టీ పెట్టుకుని చిన్న మిత్రపక్షంలా మారే అవకాశం ఉందని కూడా బీజేపీకి బాగా తెలుసు. నరేంద్ర మోదీ, అమిత్ షా పట్ల విశ్వాసం ప్రకటించేటట్లయితే ఎలాంటి భావజాలం నుంచి వచ్చిన వారికైనా సభ్యత్వం ఇవ్వడానికి బీజేపీ సిద్ధంగా ఉంది. రాణే బీజేపీలో చేరడానికి గట్టిగానే లాబీయింగ్ చేశారు. కానీ తనకు కేబినెట్లో స్థానం ఇవ్వాలంటే బీజేపీకి మద్దతు ఇస్తున్న శివసేన ఆమోదం తప్పనిసరిగా మారింది. రాణే సభ్యుడిగా ఒకే మంత్రివర్గంలో తన సరసన కూర్చోవడానికి శివసేన నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. రాణేను బీజేపీలో చేర్చుకునే ప్రక్రియ ప్రారంభమైనప్పటినుంచీ దానివల్ల కలిగే పర్యవసానాల గురించి ఉద్దవ్ ఠాక్రే పదే పదే హెచ్చరిస్తూ వచ్చారు. తన మాజీ శత్రువు (శివసేన నుంచి బయటకు వచ్చేటప్పుడు రాణే ఆ పార్టీని అత్యంత పరుషమైన రీతిలో దూషించాడు) ట్రంప్ కార్డును గట్టిగా పట్టుకోవడంతో రాణేకి చేదుమాత్ర మింగినట్లయింది. తన, తన కుటుంబ భవిష్యత్ అవకాశాలకు సంబంధించి రాణే సొంత చొరవతో చేయగలిగిందేమీ లేకుండా పోయింది. ఎక్కువ సీట్లు ఖాళీగా ఉండే శాసన మండలి ఎన్నికలలాగా కాకుండా, ఎమ్మెల్యేల నుంచి ఓట్ల కోటాలు చాలా తక్కువగా ఉంటాయి. కానీ ఉపఎన్నికలో పరిస్థితి అలాంటిది కాదు. రాణే తన స్థానాన్ని తిరిగి పొందాలంటే, ప్రస్తుతం శాసనసభలో ఉన్న మొత్తం సభ్యులలో సగంకంటే ఎక్కువ ఓట్లను తాను సాధించాల్సి ఉంటుంది. కానీ ఉన్నట్లుండి ఆయన మొత్తం ప్రతిపక్షాన్ని తనకు వ్యతిరేకంగా ఐక్యం చేసిపడేశారు. అందులోనూ శివసేన ఆయనపై పగ సాధించడానికి పొంచుకుని ఉంటోంది. ఈ మొత్తం దృశ్యాన్ని పరిశీలించినట్లయితే నారాయణ్ రాణే భారతీయ జనతాపార్టీకి ఇప్పటికయితే పెద్ద ఆస్తిగా కనిపించడం లేదు. - మహేష్ విజాపృకర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్ :mvijapurkar@gmail.com -
రాణే.. వేరు కుంపటి
సాక్షి, న్యూఢిల్లీ : మహారాష్ట్ర రాజకీయాల్లో మరో కొత్త పార్టీ పురుడు పోసుకుంది. గత నెల్లో కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై కొట్టిన మాజీ ముఖ్యమంత్రి నారాయణ్ రాణే.. నేడు ’మహారాష్ట్ర స్వాభిమాన్ పక్ష‘ పేరుతో కొత్త పార్టీ ప్రకటన చేశారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాక కొత్త పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. కాంగ్రెస్లోనూ, ఇతర పార్టీల్లొనూ కొనసాగుతున్న మిత్రులు, మరికొందరు తన పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు. పార్టీ యాక్షన్ ప్లాన్ను త్వరలో ప్రకటిస్తానని రాణే ప్రకటించారు. నారాయణ్ రాణే కాంగ్రెస్ పార్టీనుంచి వైదొలిగాక.. ఆయన బీజేపీలో చేరతారనే ఊహాగానాలు భారీగా వెల్లువెత్తాయి. బీజేపీకి 2019 లోక్సభ ఎన్నికల్లో రాణే చేరిక లాభిస్తుందని అందరూ అంచనాలు వేశారు. రాణే స్వస్థలమైన కొంకణ్ ప్రాంతంలో విస్తరించాలని బీజేపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే రాణే బీజేపీలో చేరతారని అనుకున్నారు. -
‘కాంగ్రెస్, శివసేన అంతుచూస్తాను’
ముంబయి : కాంగ్రెస్ పార్టీ, శివసేన అంతు చూస్తానని ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నేత నారయణ్ రాణే అన్నారు. ఇది వరకు శివసేన పార్టీలో సైతం ఉన్న ఆయన గురువారం కాంగ్రెస్ పార్టీకి గుడ్బై చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తనను తీవ్రంగా అవమానించిందని, అశోక్ చవాన్ దుర్యోదనుడిలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి టాటా చెప్పిన ఆయన త్వరలోనే బీజేపీలోకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఆయన ఇద్దరు కుమారులను కూడా బీజేపీలోకి చేర్పించే ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. అయితే, ఆయన బీజేపీలోకి అడుగుపెట్టడం శివసేనకు ఏ మాత్రం ఇష్టం లేనట్లు తెలుస్తోంది. నారాయణ్ రాణే కాంగ్రెస్ పార్టీని వీడినట్లు ప్రకటించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘నేను నా రాజీనామా లేఖను సోనియాగాంధీకి మధ్యాహ్నం 2.30గంటల ప్రాంతంలో పంపించాను. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైంది. అందుకే నేను పార్టీని వీడుతున్నాను. నేను కాంగ్రెస్ పార్టీని, శివసేనను అంతం చేస్తాను’ అని చెప్పారు. -
బీజేపీలోకి మరో కీలక నేత!
మహారాష్ట్రలో అనూహ్య రాజకీయ పరిణామం ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ శుక్రవారం రాత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత నారాయణ్ రాణే ఇంటిని సందర్శించడం.. ఆసక్తికర రాజకీయ పరిణామాలకు తెరలేపింది. వినాయక చవితి సందర్భంగా రాణే ఇంటిలో పూజకు మర్యాదపూర్వకంగా హాజరైనట్టు సీఎం ఫడ్నవిస్ మీడియాకు చెప్తున్నా.. రాణే బీజేపీ గూటికి చేరేందుకు రంగం సిద్ధమైందన్న సంకేతాలు ఇది ఇస్తోందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. సీఎం ఫడ్నవిస్ రాణే ఇంటిని సందర్శించిన ఫొటోను రాణే తనయుడు, ఎమ్మెల్యే నితేష్ ట్విట్టర్లో షేర్ చేసుకున్నారు. అంతకుముందు ఆయన ట్విట్టర్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ వినాయక చవితి శుభాకాంక్షలను కూడా రీట్వీట్ చేసుకోవడం గమనార్హం. రాణే ఇంటికి తాను వెళ్లడం రాజకీయ పర్యటన కాదని, తాము రాజకీయాల గురించి చర్చించలేదని ఫడ్నవిస్ మీడియాకు చెప్పారు. రాణే బీజేపీలో చేరుతున్న సంగతి కూడా తనకు తెలియదన్నారు. కానీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షాను ఆదివారం నారాయణ్ రాణే కలువబోతున్నట్టు వినిపిస్తోంది. అయితే, బీజేపీ అధికారికంగా దీనిని ధ్రువీకరించడం లేదు. గత కొన్నాళ్లుగా బీజేపీలో చేరేందుకు రాణే ప్రయత్నిస్తున్నారని, కానీ, ఇందుకు బీజేపీ షరతులు పెడుతోందని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. -
ఆయన దారే వేరు
విశ్లేషణ నారాయణ రాణేది ఒక విచిత్రమైన పరిస్థితి. ఎన్నికల ద్వారా లభించగల అత్యు న్నత పదవిౖయెన ముఖ్య మంత్రిగా పని చేసినా, ఆయన చుక్కాని లేని నావలా ఎటుపడితే అటు కొట్టుకుపోతున్న రాజకీయ వేత్త. శివసేనను వదిలిపెట్టే శాక ఆయన కాంగ్రెస్ను ఎంచుకున్నారు. కానీ ఆ పార్టీలో ఇమడలేక పోతున్నారు. శివసేన ఆయన తిరిగి పార్టీలోకి రావాలని కోరుకోవడమూ లేదు. రాణే స్వతం త్రంగా, సూటిగా వ్యవహరించే మనిషి. విలాస్రావ్ దేశ్ముఖ్ ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగాల్సి వచ్చినప్పుడు కాంగ్రెస్ అశోక్ చవాన్కు ఆ పదవిని కట్టబెట్టింది. అసమ్మతిని వ్యక్తంచేసిన రాణేను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. తన స్వభావానికి విరుద్ధంగా ఆయన కాళ్లావేళ్లా పడి తిరిగి పార్టీలోకి ప్రవేశించారు. కానీ ఆ పార్టీలోని ఇతరులకు పెద్ద తలనొప్పిగా మారారు, ఆయనా సౌఖ్యంగా ఉన్నది లేదు. అయినా కాంగ్రెస్ ఆయనను పార్టీలోనే ఉంచుకోవాలని ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్లో అసౌకర్యంగా ఉండటంతో రాణే భార తీయ జనతా పార్టీ వాకిటికి చేరారు లేదా దగ్గరయ్యారు. అయితే తలుపులు ఇంకా పూర్తిగా తెరుచుకోలేదు. ఆయన ప్రవేశానికి ఆ పార్టీలో కొంత విముఖత ఉన్న దనిపిస్తోంది. పూర్తిగా ‘ఎన్నికలపరమైన ప్రతిభ’ లేదా ఎన్నికల్లో గెలవగల సామర్థ్యం ఉన్నవారినే పార్టీలోకి తీసుకుంటామంటున్నా... అభ్యంతరకరమైన నేపథ్యా లున్న ఎందరికో బీజేపీ దేశవ్యాప్తంగా తలుపులు తెరి చింది. రాణేను అనుమతించడం జరిగి, ఒక్కసారి ఆయన పార్టీలోకి ప్రవేశించారూ అంటే క్రమశిక్షణకు కట్టుబడరనీ, తిరిగి అత్యున్నతమైన ముఖ్యమంత్రి పద విని చేజిక్కించుకోవడానికి సమయం కోసం వేచి చూçస్తూ నిరంతరం ప్రకంపనాలను సృష్టిస్తుంటారనీ రాష్ట్ర బీజేపీలోని అత్యున్నతస్థాయి నాయకత్వ శ్రేణు లకు భయం ఉంది. మనోహర్ జోషి స్థానంలో బాల్ ఠాక్రే, రాణేను మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా నియమిం చారు. అయితే 1999 ఎన్నికల్లో శివసేనను తిరిగి అధికా రంలోకి తేవటంలో ఆయన విఫలమయ్యారు. రాణే దేన్నీ లెక్కచేయని దురుసు మనిషి. తాను ఏమైనా మాట్లాడాలని నిర్ణయించుకుంటే చాలు, నీళ్లు నమలకుండా సూటిగా చెప్పేస్తారు. ఉద్ధవ్ ఠాక్రే శివ సేనను నడుపుతున్న తీరును చూసి నిరాశచెంది ఆయన ఆ పార్టీ నుంచి బయటపడ్డారు. ఆ సమయంలో ఆయన తనపై భౌతిక దాడులు జరుగుతాయనే భయం లేదన్నారు. శివసేన అత్యున్నత నాయకత్వంతో ఘర్షణ పడి, పార్టీని వీడే తిరుగుబాటుదార్లకు తరచుగా పట్టే గతి అదే.‘‘సేనలో ఉన్నప్పుడు పార్టీ వీధి కార్య కలాపాలను నడిపినది నేనే’’ అన్నారు రాణే. కాంగ్రెస్ లోనూ ఆయన తనకు పరిస్థితి కాస్త సౌఖ్యంగా ఉండేలా చేసుకుంటున్నది లేదు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్ సీపీ)తో ఎన్నికల అనంతరం చెలిమి చేస్తున్న కాంగ్రెస్ ప్రస్తుతం రైతులను కలుసుకునే కార్యక్రమాన్ని చేప ట్టింది. ఆ కార్యక్రమం సజావుగా సాగడం లేదని, దయ నీయస్థితిలోని రైతులు దాని పట్ల స్పందించడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. తృణీకారంతో ఆయన దానికి దూరంగా ఉన్నారు. ఆయన తనకు తోచిందే చేసే స్వతంత్ర వ్యక్తిత్వంగల మనిషి. తనకు మేలు చేసినందుకు ఆయన ఎవరికీ ఏవిధం గానూ రుణపడి లేరు. వీధుల్లోని శివ సైనికుని స్థాయి నుంచి ఆయన ముఖ్యమంత్రి స్థానానికి చేరారంటే అందుకు కారణం ఆయన నేర్పరితనమే. ముఖ్య మంత్రిగా విజయవంతమౌతూ వినమ్ర ప్రియభాషిగా పేరు తెచ్చుకుంటున్న జోషితో బాల్ ఠాక్రే అసౌకర్యంగా ఉన్నారని పసిగట్టడంతోనే ఆయన ఆ స్థానం కోసం కృషి మొదలెట్టేశారు. బహుశా ఆయన ఎవరితోనైనా ఒప్పందం అంటూ కుదుర్చుకుని ఉంటే అది ఒక్కసారే కావచ్చు. ఈ వైచిత్రి, రాణే వృద్ధిలో భాగమే. నేడు దారి తెన్నూ లేకుండా కొట్టుకుపోతున్నా, ఆయన తన సొంత జిల్లా సింధుదుర్గ్లో సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. ఆయన ఎంత ఆత్మవిశ్వాసం గల మనిషంటే శివసేనను వీడిన వెంటనే ఆయన ఒక ఉప ఎన్నికలో శాసనసభకు గెలిచి, తాను ముఖ్యుడిననే అంశాన్ని రుజువుచేసి చూపారు. ఆయన సామ్రాజ్యం కేవలం వ్యాపారానికే పరి మితం కాలేదు, ఒక రాజకీయ కుటుంబం ప్రారం భమైంది. ఆయన ఒక కుమారుడు నీలేష్ 2009లో రత్నగిరి–సింధుదుర్గ్ నియోజకవర్గం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. మరో కుమారుడు నితేష్ రాష్ట్ర శాసన సభ సభ్యునిగా ఉన్నారు. నితేష్ కార్మిక సమస్యలను కొంత మేరకు పట్టించుకునే ఒక ఎన్జీఓను నడు పుతున్నారు. అది కూడా శివసేనలాగే మాట్లాడుతుంది, అదే పద్ధతులను అనుసరిస్తుంది. రాణే తన ప్రయోజనా లను, కుటుంబ ప్రయోజనాలను కాపాడుకోడానికి ఒక మరాఠీ దినపత్రిక ‘ప్రహార్’ను (మృత్యు ఘాతం) ప్రారంభించారు. ఆ పత్రిక పేరే ఆయన శైలి రాజ కీయాలను సూచిస్తుంది. ఆ పత్రిక వృత్తినైపుణ్యంతోనే పని చేయాలని యత్నిస్తోంది. అయితే చాలా మంది రాజకీయవేత్తలు, రాజకీయపార్టీలు ఎంచుకున్న మార్గ మైన టెలివిజన్ రంగంలోకి రాణే ప్రవేశించలేదు, సమీప భవిష్యత్తులో అది జరిగేట్టూ లేదు. అయితేనేం, ఆయన సమరశీలత నిత్యం కనబడుతుంటూనే ఉంటుంది. మహేష్ విజాపృకర్ సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్: mvijapurkar@gmail.com -
సీఎం ఫడ్నవిస్కు అంత సీన్ లేదు..
సాక్షి, ముంబై: ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ వ్యక్తిగతంగా మంచివాడే అయినా, ఆయనకు రాష్ట్రాన్ని పాలించే సామర్థ్యం, అనుభవం లేదని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నారాయణ్ రాణే ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తర్వాత మొదటిసారి ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఫడ్నవిస్ మంత్రివర్గంలో ఖడ్సే మినహా సమర్థులైన ఒక్కరూ లేరన్నారు. ఆ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చే సామర్థ్యం ఫడ్నవిస్ నాయకత్వంలోని మంత్రివర్గానికి లేదని వ్యాఖ్యానించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయానికి ప్రచార కమిటీ చైర్మన్గా తాను నైతిక బాధ్యత వహిస్తున్నానని స్పష్టం చేశారు. త్వరలోనే ఈ ప్రభుత్వ పనితీరును ప్రజలు గుర్తిస్తారన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతామని పేర్కొన్న ఫడ్నవిస్ సీఎం పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే మాటమార్చారని దుయ్యబట్టారు. ఒకవేళ ఆయన ప్రత్యేక విదర్భకు కట్టుబడి ఉంటే వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అధికారం కోసం శివసేన పడుతున్న పాట్లు చూస్తే జాలేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో అఫ్జల్ ఖాన్ సేన అంటూ బీజేపీని ఎద్దేవా చేసిన ఉద్ధవ్ ఇప్పుడు అధికారం కోసం ఆదే సేనలో చేరాలని ఆరాట పడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇలాంటి సమయంలో బాల్ ఠాక్రే ఉంటే అధికారాన్ని లాగి తన్నేవారని వ్యాఖ్యానించారు. అనంతరం ఎమ్మెన్నెస్, ఎంఐఎం పార్టీలపై కూడా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
తండ్రి ఓడాడు.. కొడుకు గెలిచాడు..
నారాయణ్ రాణే కుటుంబానికి మిశ్రమ ఫలితం సాక్షి, ముంబై: కొన్ని దశాబ్ధాలుగా రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన నారాయణ్ రాణే ఓడిపోతే... అతడి కుమారుడు మాత్రం మొదటిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతున్నాడు. కుడాల్-మాల్వాణ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసిన నారాయణ్ రాణే ఓడిపోగా, కొంకణ్ నుంచి పోటీచేసిన అతడి తనయుడు నితేష్ రాణే సమీప ప్రత్యర్థి బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రమోద్ జఠార్పై విజయఢంకా మోగించాడు. దాంతో కుమారుడిని అభినందించేందుకు రాణే ఎన్నికల కేంద్రానికి రాగా, నితేష్ కన్నీటిపర్యంతమయ్యాడు. ఈ సందర్భంగా రాణే కార్యకర్తల నుద్దేశించి మాట్లాడుతూ.. తన రాజకీయ జీవితం చరమదశకు చేరినా నితేష్ రాజకీయ జీవితంలో వెలుగు మొదలైందని అన్నారు. కాగా, తండ్రి ఓటమిని జీర్ణించుకోలేకపోయిన నితేష్ తన విజయోత్సవ ర్యాలీని రద్దు చేసుకోవడం గమనార్హం. -
తండ్రీ కొడుకులకు సవాల్
సింధుర్గ్ జిల్లాలో ‘రాణే’కు కష్టకాలం? కంకావ్లి: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నారాయణ్ రాణే, అతని కుమారుడు నితేష్ రాణేలకు సింధుర్గ్ జిల్లా సవాల్గా నిలిచింది. కుడాల్ నియోజకవర్గం నుంచి నారాయణ్ రాణే, కంకావ్లి నుంచి నితేష్లు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. రాణే పెద్ద కుమారుడు నీలేష్ ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో రత్నగిరి-సింధుర్గ్ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక రాణేకు అత్యంత సన్నిహితులైన గణపత్ కదమ్, సుభాస్ బాణే, రాజన్ తేలీ, రవీంద్ర ఫాఠక్లు అతడిని వీడి బీజేపీ, శివసేనల్లో చేరడంతో ఈసారి తండ్రీకొడుకులు గెలుపుకోసం తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు. పట్టణాభివృద్ధి శాఖ మాజీ సహాయ మంత్రి, ఎన్సీపీ ఎమ్మెల్యే ఉదయ్ సామంత్ రాణేతో విభేదాల కారణంగా శివసేనలో చేరి రత్నగిరి నుంచి పోటీ చేస్తున్నారు. ముఖ్యమంత్రి పదవిపై తన ఆశలను అనేకసార్లు వెల్లడించిన రాణే కుడాల్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. స్వాభిమాన్ అనే స్వచ్ఛంద సంస్థను నడుపుతున్న రాణే చిన్న కుమారుడు నితేష్ రాణే ప్రాథమికంగా కాంగ్రెస్ పార్టీ సభ్యుడు కాదు. అయినప్పటికీ అదే పార్టీ అభ్యర్థిగా కంకావ్లి నుంచి బరిలోకి దిగారు. దీనిపై కాంగ్రెస్ కార్యకర్తలు కాస్త సణుగుకున్నప్పటికీ బహిరంగంగా ఎవరూ ఆయన నామినేషన్ను వ్యతిరేకించలేదు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీకి నేతృత్వం వహిస్తున్న నారాయణ్ రాణేకు ఈ అసెంబ్లీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఈసారి దాదాపు అన్ని నియోజకవర్గాల్లో బహుముఖ పోటీ జరుగుతున్న నేపథ్యంలో గెలుపు ఎవరినైనా వరించవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. రాణేపై పోటీ చేసి గత ఎన్నికల్లో ఓడిపోయిన శివసేన అభ్యర్థి వైభవ్ నాయక్ మరోసారి కుడాల్లో రంగంలోకి దిగారు. మొన్నటి లోక్సభ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో శివసేనకు 22వేల ఓట్ల ఆధిక్యత లభించిందని, అందువల్ల గెలుపు తనదేనని నాయక్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నప్పటికీ రాణే చేసిందేమీ లేదని ఆయన ప్రచారం చేస్తున్నారు. ఇక నితేష్పై సిట్టింగ్ బీజేపీ ఎమ్మెల్యే ప్రమోద్ జాతర్ పోటీ చేస్తున్నారు. జాతర్ గత ఎన్నికల్లో కేవలం 34 ఓట్లతో గట్టెక్కారు. మాజీ ఎన్సీపీ నాయకుడు సుభాష్ మాయేకర్కు శివసేన ఇక్కడి నుంచి టికెట్ ఇవ్వడంతో ఆ పార్టీ కార్యకర్తలు ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. కాంగ్రెస్ రెబెల్గా బరిలోకి దిగిన సిట్టింగ్ ఎమ్మెల్సీ విజయ్సావంత్ నితేష్ ఓట్లకు గండి కొట్టవచ్చని భావిస్తున్నారు. -
షరతులతో పొత్తు కష్టమే: సీఎం
ముంబై: సాధ్యం కాని షరతులు విధిస్తే ఇక ఎన్సీపీతో పొత్తు కొనసాగించటం కష్టంగా మారగలదని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ అభిప్రాయపడ్డారు. మతోన్మాద శక్తులను దూరంగా ఉంచేందుకు గాను ఎన్సీపీతో పొత్తును కొనసాగించాలన్నదే కాంగ్రెస్ వైఖరి అని ఆయన స్పష్టం చేశారు. అయితే అసాధ్యమైన షరతులు విధించడం వల్లనే పరిస్థితులు కఠినంగా మారుతున్నాయని అన్నారు. షరతులు లేకండా చర్చలు ప్రారంభించి ఉంటే ఇప్పటికి అన్ని సమస్యలూ పరిష్కారమై ఉండేవని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కరద్లో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. తిరిగి అధికారంలోకి వస్తే సగం కాలం పాటు ముఖ్యమంత్రి పదవిని ఎన్సీపీ కోరిందన్న వార్తలపై వ్యాఖ్యానించేందుకు చవాన్ నిరాకరించారు. అయితే ఈ అంశాన్ని మరో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు నారాయణ్ రాణే ధ్రువీకరించారు. ఎన్సీపీ డిమాండ్పై ముఖ్యమంత్రి చవాన్ కాంగ్రెస్ అధిష్టానంతో చర్చిస్తున్నారని చెప్పారు. కరద్లో తన మద్దతుదారులతో మాట్లాడిన చవాన్, తాను పోటీ చేయాలనుకుంటున్న నగరాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పారు. కరద్ తన స్వస్థలమని, ఈ పట్టణాన్ని తాను ఎంతో రుణపడి ఉన్నానని అన్నారు. -
ఆర్బీఐని తరలించే కుట్ర
ముంబై: కేంద్ర ప్రభుత్వం భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ)ని న్యూఢిల్లీకి తరలించేందుకు కుట్ర పన్నుతోందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి నారాయణ్ రాణే ఆరోపించారు. దేశ వాణిజ్య రాజధానిగా ఉన్న ముంబై ప్రతిష్టను దిగజార్చేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఆర్బీఐని ఢిల్లీకి తరలించే ప్రక్రియ ప్రారంభమైందని, ఇప్పటికే మూడు విభాగాలను రెండు నెలల క్రితమే ముంబై దాటించారని చెప్పారు. దేశ వాణిజ్య రాజధానిగా ముంబైకి ఉన్న ప్రాముఖ్యతను, ఈ నగరానికి ఉన్న ప్రపంచస్థాయి గుర్తింపును దిగజార్చేందుకు జరిగే ఎటువంటి ప్రయత్నాన్నైనా తీవ్రంగా వ్యతిరేకిస్తామని రాణే అన్నారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని తాను ఇప్పటికే ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్కు, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్కు లేఖలురాశానని చెప్పారు. బుధవారం రాణే ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ, కేంద్రంలో వచ్చిన అనేక ప్రభుత్వాలు ముంబై దీవిపై కన్నేశాయని అన్నారు. కొన్ని దశాబ్దాల క్రితం ముంబైని గుజరాత్తో అనుసంధానం చేసేందుకు దివంగత మొరార్జీ దేశాయ్ కూడా ప్రయత్నించారని అన్నారు. 1956 అనంతరం జరిగిన భారీ ఆందోళనలు, 105 మంది ప్రాణ త్యాగం ఫలితంగా ముంబై (అప్పట్లో బొంబాయి)ని మహారాష్ట్ర వాసులు దక్కించుకున్నారని చెప్పారు. అలాగే మరాఠీ మాట్లాడేవారితో మహారాష్ట్ర గుజరాత్తో వేరుపడిందని తెలిపారు. అప్పట్లో బొంబాయి ద్విభాషా రాష్ట్రంగా ఉండేదన్నారు. రిజర్వు బ్యాంకును ముంబై నుంచి తరలించడంతో పాటు నగరాన్ని మహారాష్ట్ర నుంచి వేరుచేసి కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చేందుకు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని రాణే ఆరోపించారు. ఈ ప్రతిపాదన గతంలో అనేకసార్లు వచ్చిందని, అయితే మహారాష్ట్రలోని అన్ని రాజకీయ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించారని చెప్పారు. ముంబై నౌకాశ్రయంలో సాగుతున్న కంటెయినర్ వ్యాపారాన్ని గుజరాత్కు తరలించాలని కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని రాణే తెలిపారు. ఈ నిర్ణయం వల్ల సుమారు 1,800 ఎకరాల భూమి వృథాగా మారుతుందని అన్నారు. రూ.75వేల కోట్ల విలువైన ఆ భూమిని అధికార బీజేపీకి సన్నిహితుడైన పారిశ్రామికవేత్తకు అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారని రాణే ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ఈ ప్రయత్నాలన్నింటినీ అడ్డుకుంటుందని రాణే స్పష్టం చేశారు. -
ఘోర పరాభవం తప్పదు
ముంబై: సీట్ల పంపకంపై కాంగ్రెస్, ఎన్సీపీల మధ్య చోటు చేసుకున్న ప్రతిష్టంభన నేపథ్యంలో ఆ రెండు పార్టీలకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం తప్పదని శివసేన జోస్యం చెప్పింది. శాసనసభ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు ఓటమి తప్పదని పేర్కొంది. ఒకవైపు ఆ రెండు పార్టీలు సీట్ల పంపకంపై గొడవ పడుతూనే, పొత్తు లేకుండా విజయం సాధిస్తామని గొప్పలు చెప్పుకుంటున్నాయని శివసేన తన దినపత్రిక సామ్నా సంపాదకీయంలో ఎద్దేవా చేసింది. వారి కలిసి పోటీ చేసినా, విడి విడిగా బరిలోకి దిగినా ఓటమి ఖాయమని స్పష్టం చేసింది. సీట్ల కోసం కాంగ్రెస్, ఎన్సీపీల మధ్య జరుగుతున్న కుమ్ములాటలు మహారాష్ట్ర ప్రజలకు వినోదాన్ని పంచి పెడుతున్నాయని పేర్కొంది. ఆ రెండు పార్టీలు అవకాశం లభించినప్పుడల్లా ఒకదాని పుట్టి ముంచేందుకు మరొకటి ప్రయత్నిస్తూనే ఉంటాయని, అయినప్పటికీ పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించడం విస్మయం కలిగిస్తోందని సేన పేర్కొంది. కాంగ్రెస్, ఎన్సీపీల నుంచి చాలా మంది నాయకులు ఇటీవలి కాలంలో శివసేనలో చేరారని తెలిపింది. శివసేనలోకి వలస వెళుతున్న నాయకులను ఎలా నియంత్రించాలో ఆ పార్టీలకు తెలియడం లేదని ఎద్దేవా చేసింది. లోక్సభ ఎన్నికల మాదిరిగానే ఆ రెండు పార్టీలు మరోసారి ఘోరంగా ఓడిపోక తప్పదని ధీమా వ్యక్తం చేసింది. పృథ్వీరాజ్ చవాన్, మాణిక్రావ్ ఠాక్రే, నారాయణ్ రాణే, అజిత్ పవార్, జయంత్ పాటిల్, ఆర్ఆర్ పాటిల్ వంటి పెద్ద నాయకులు తప్పకుండా ఎన్నికల్లో పోటీ చేయాలని పిలుపునిచ్చింది. అప్పుడే వారికి ఓటమిని రుచి చూపించే అవకాశం మహారాష్ట్రకు దక్కుతుందని సామ్నా పేర్కొంది. -
ఎన్నికలకు సన్నద్ధం
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ అధిష్టానం పార్టీని సమాయత్తం చేస్తోంది. రాష్ట్రంలో పార్టీ ప్రచార, సమన్వయ కమిటీలకు నారాయణ్ రాణే, అశోక్ చవాన్ పేర్లను ప్రకటించింది. అలాగే కేంద్ర మాజీ హోం మంత్రి సుశీల్కుమార్ షిండేను మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్గా నియమించింది. పై అన్ని కమిటీల్లోనూ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, పీసీసీ అధ్యక్షుడు మాణిక్రావ్ ఠాక్రే సభ్యులుగా ఉంటారు. లోక్సభ ఎన్నికల్లో పార్టీ బాగా దెబ్బతినడంతో కాంగ్రెస్ కార్యకర్తలు డీలాపడిపోయారు. దీనికి తోడు అంతర్గత కుమ్ములాటలతో పార్టీ ప్రతిష్ట రోజురోజుకూ దెబ్బతింటోంది. ఈ నేపథ్యంలో డీలాపడిన కార్యకర్తల్లో నూతనోత్సాహం నింపేందుకు, తద్వారా అసెంబ్లీ ఎన్నికల సమయానికి పార్టీని పటిష్టపరిచేందుకు అధిష్టానం కార్యాచరణ చేపట్టింది. అందులో భాగంగానే రాణే, అశోక్ చవాన్ వంటి అసంతృప్తివాదులను బుజ్జగించి వారికి సముచిత పదవులు ఇవ్వడం ద్వారా పార్టీలో అసంతృప్తిని తగ్గించేందుకు యత్నిస్తోందని పరిశీలకులు అంటున్నారు. రాణే, అశోక్చవాన్లకు ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్తో సత్సంబంధాలు లేవనే విషయం అందరికీ తెలిసిందే. లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో పార్టీ ఘోరపరాజయం తర్వాత ముఖ్యమంత్రిని మార్చాలన్న డిమాండ్కు వీరిద్దరూ వంతపాడారు. అలాగే నెల రోజుల కిందట నారాయణ్ రాణే సీఎం పనితీరుపై ఆరోపణలు చేస్తూ తన మంత్రిపదవికి రాజీనామా చేశారు. పార్టీని సైతం విడుస్తున్నట్లు ప్రకటనలు ఇచ్చారు. అయితే అధిష్టానం అతడిని బుజ్జగించి పార్టీని గాడిలో పెట్టే బాధ్యత అప్పగించడం గమనార్హం. కాగా, కాంగ్రెస్ ప్రచార కమిటీలో 33 మంది సభ్యులుంటారు. వీరిలో మాజీ మంత్రులు అనంత్రావ్ థోప్డే, రోహిదాస్ పాటిల్, ఎంపీలు రజ్నీ పాటిల్, అవినాష్ పాండే, మాజీ ఎంపీ మిలింద్ దేవరా వంటివారు ఉన్నారు. ఇదిలా ఉండగా, సమన్వయ కమిటీలో షిండే, ముకుల్ వాషిక్, రాణే, మురళీ దేవరా, గురుదాస్ కామత్, జనార్ధన్ చందూర్కర్, పతంగ్రావ్ కదమ్, హుస్సేన్ దల్వాయీ, కమల్తాయి వ్యవహరే, శరద్ రన్పిసే వంటి వారు సభ్యులుగా ఉన్నారు. అలాగే 39 మంది సభ్యులతో మ్యానిఫెస్టో కమిటీని ఏర్పాటుచేసింది. ఇందులో రాష్ట్ర మంత్రులు బాలా సాహెబ్ థరోట్, హర్షవర్ధన్ పాటిల్, రాధాకృష్ణ విఖే పాటిల్, నితిన్ రావుత్, పార్టీ ఎంపీ, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజీవ్ సతవ్, పార్టీ అధికారి ప్రతినిధి అనంత్ గాడ్గిల్ తదితరులున్నారు. పీసీసీ అధ్యక్షుడి నాయకత్వంలో ప్రదేశ్ ఎన్నికల కమిటీని ఏర్పాటుచేశారు. ఇందులో ముఖ్యమంత్రితోపాటు సీనియర్ నాయకులు షిండే, వాస్నిక్, కామత్, అశోక్ చవాన్, రాణే, విలాస్ ముత్తెంవార్ సతావ్, ప్రియాదత్ సభ్యులుగా ఉంటారు. అలాగే మీడియా, ప్రచార కమిటీకి హర్షవర్ధన్ పాటిల్ చైర్మన్గా ఉంటారు. ఇందులో సభ్యులుగా కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ శుక్లా, సంజయ్ నిరుపమ్, అమిత్ దేశ్ముఖ్, రాష్ట్ర హోం సహాయ మంత్రి సతేజ్ పాటిల్ ఉంటారు. కాగా ఈ కమిటీకి సంజయ్ దత్, సచిన్ సావంత్, ఆశిష్ కులకర్ణి సమన్వయ కర్తలుగా వ్యవహరిస్తారు. -
గెలుపుగుర్రాలకే టికెట్లు
సాక్షి, ముంబై: అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ సన్నద్ధమవుతోందని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ తెలిపారు. ఈసారి గెలుపుగుర్రాలకే టికెట్లు లభిస్తాయని, వారిలో నాయకుల బంధువులు ఉండొచ్చు... ఉండకపోవచ్చునని సీఎం వ్యాఖ్యానించారు. ఆగస్ట్ క్రాంతి దినాన్ని పురస్కరించుకుని శనివారం సీఎం,పలువురు నాయకులు ఆగస్ట్ క్రాంతి మైదానంలో అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలపై స్పందించారు. టికెట్ల కేటాయింపులో గెలుపు గుర్రాలకే పెద్దపీట వేస్తున్నామని ప్రకటించారు. ‘అన్ని నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ తరఫున అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్న వారు చాలామంది ఉన్నారు.. వారిలో పలువురు మంత్రుల, బడానేతల కుమారులు, బంధువులు కూడా ఉన్నారు.. అయితే పోటీచేస్తానంటోంది నాయకుడి కుమారుడా, బంధువా అని చూడటం లేదు.. టికెట్ ఇస్తే సదరు వ్యక్తి గెలవగలడా..లేదా అనేది మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని అధిష్టానం నిర్ణయించింది.. అటువంటి వ్యక్తులకే టికెట్ కేటాయించాలని స్పష్టం చేసింది..’ అని తెలిపారు. కాగా, ఇటీవల మంత్రి పదవికి రాజీనామా చేసిన నారాయణ్ రాణేపైనే సీఎం పరోక్షంగా వ్యాఖ్యలు చేసినట్లు భావిస్తున్నారు. తనకు తగిన గుర్తింపునివ్వడం లేదని, ముఖ్యమంత్రి పనితీరు బాగాలేదని ఇటీవల మంత్రి పదవికి నారాయణ్ రాణే రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తర్వాత పార్టీని కూడా వీడి వెళ్లనున్నట్లు ప్రకటించి చివరి నిమిషంలో మనసు మార్చుకున్నారు. కాగా అసెంబ్లీ ఎన్నికల్లో తనకు పోటీచేయాలని లేదని, పార్టీ అధిష్టానం ఆదేశాలనుసరించి పనిచేస్తానని ప్రకటించిన రాణే తన కుమారుడు అసెంబ్లీకి పోటీచేస్తాడని ప్రకటించారు. రాణే ప్రకటన తర్వాత సీఎం శనివారం పై విధంగా స్పందించడంపై పలురకాల వ్యాఖ్యలు వినవస్తున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల్లో రాణే సహా నాయకులెవరూ తమ పిల్లలు, బంధువులకు టికెట్ల కోసం సిఫారస్ చేయొద్దని సీఎం పరోక్షంగా హెచ్చరించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు. గెలుపు గుర్రాల వేటలో ఎటువంటి విధివిధానాలు పాటించనున్నారోననే విషయమై కాంగ్రెస్ వర్గాల్లో ఇప్పటికే చర్చ మొదలైంది. -
‘చేయి’జారలే..!
సాక్షి ముంబై: మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మాణిక్రావ్ ఠాక్రే చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ పనితీరుపై అంసతృప్తి వ్యక్తం చేస్తూ మంత్రి పదవికి రాజీనామా చేసిన నారాయణ్ రాణే కాంగ్రెస్ పార్టీని కూడా వీడనున్నట్లు వచ్చిన ఊహాగానాలకు మాణిక్రావ్ మంత్రాంగంతో తెరపడింది. నారాయణ రాణే జులై 21న మంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. రాజీనామా అనంతరం ఢిల్లీలో రాహుల్ గాంధీతో కూడా భేటీ అయ్యారు. అధిష్టానం నుంచి సరైన స్పందన రాలేదని, దీంతో రాణే పార్టీని వీడనున్నారంటూ మీడియాలో కథనాలు ప్రసారమయ్యాయి. అయితే రాణేను బుజ్జగించేందుకు అధిష్టానం మాణిక్రావ్ ఠాక్రేను రంగంలోకి దించింది. వీరిమధ్య మంగళవారం సుదీర్ఘంగా జరిగిన చర్చల అనంతరం రాణే తన రాజీనామాను వెనక్కితీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీలోనూ, మంత్రిపదవిలోనూ కొనసాగుతానని స్వయంగా రాణే ప్రకటించారు. ఎంపీసీసీ అధ్యక్షులు మాణిక్రావ్ ఠాక్రేతో చర్చల అనంతరం మంగళవారం సాయంత్రం ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ముంబైలోని ధ్యానేశ్వరి నివాసస్థానంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాణే మాట్లాడుతూ... మంత్రి పదవిని చేపట్టి పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. తన డిమాండ్లను నెరవేరుస్తామని పార్టీ అధిష్టానం నుంచి హామీ లభించిందని చెప్పారు. ఈసారి మాట తప్పబోమంటూ పార్టీ చెప్పడంతో తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నాన్నారు. మంత్రిపదవికి చేసిన తన రాజీనామాను ముఖ్యమంత్రి పృధ్వీరాజ్ చవాన్ ఇంత వరకు స్వీకరించలేదన్నారు. దీంతో తాను మంత్రి పదవిలో కొనసాగడంతోపాటు పార్టీలో క్రియశీలంగా వ్యవహరించనున్నట్టు స్పష్టం చేశారు. మూడు నెలలు అధ్యక్ష పదవి కావాలి... రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మూడునెలపాటు తనను అధ ్యక్షుడిగా కొనసాగించాలని అధిష్టానాన్ని కోరానని, బుధవారం నుంచి ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రారంభిస్తానని చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేసే విషయమై రాణే వివరణ ఇస్తూ... రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయకూడదని భావించానని, విషయాన్ని అధిష్టానానికి తెలిపానన్నారు. అయితే ఈసారి పోటీ చేయాల్సిందిగా అధిష్టానం కోరిందని, దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని రాణే స్పష్టం చేశారు. అయితే అంతకు ముందు తన కుమారుడు నితేశ్ రాణే పోటీ చేయడానికే తాను తొలి ప్రాధాన్యతనిస్తానని చెప్పారు. ఉద్దవ్పై మండిపాటు... శివసేన అధ్యక్షులు ఉద్ధవ్ ఠాక్రేతోపాటు శివసేనలో చేరిన దీపక్ కేసర్కర్పై రాణే తీవ్రంగా మండిపడ్డారు. ఘాటైన పదజాలంతో ఉద్ధవ్ ఠాక్రేపై విమర్శలు గుప్పించారు. కేవలం శివసేన అధినేత దివంగత బాల్ఠాక్రే కారణంగా ఉద్ధవ్కు రాజకీయాల్లో చోటు దక్కిందనే విషయం మరచిపోవద్దని విమర్శించారు. లోకసభ ఎన్నికల్లో గెలిచినంత మాత్రానా అసెంబ్లీలో కూడా అలాంటి ఫలితాలే పునరావృతమవుతాయని కలలు కంటున్న ఉద్ధవ్కు భంగపాటు తప్పదన్నారు. ఎన్సీపీని వీడి, శివసేన పార్టీలో చేరి దీపక్ కేసర్కర్పై కూడా రాణే విమర్శలు కొనసాగించారు. ఎమ్మెల్యేగా విఫలమైన కేస్కర్ శివసేనలో చేరారని, అసలు కేస్కర్ ఎవరని ప్రశ్నించారు. అభివృద్ధి పనులే మా ఎజెండా... రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అభివృద్ది పనులే ఎజెండాగా కాంగ్రెస్ ముందుకెళ్తుందన్నారు. మంచిరోజులు వస్తాయంటు ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ప్రజలను మోసగించారని, ఆయన పాలనలో ధరలు మరింతగా పెరుగుతున్నాయనే విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని, ఈసారి రాష్ట్ర ప్రజలు మోడీకి బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. -
రాణే..కు పిలుపు రాలే!
సాక్షి, ముంబై: మంత్రి పదవికి రాజీనామా చేసి వారంరోజులు దాటినా నారాయణ్ రాణేకు కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఎలాంటి ఆఫర్లు రాలేదు. కనీసం అధిష్టానం నుంచి పిలుపు కూడా రాకపోవడంపై రాణే వర్గీయుల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి పనితీరుతోపాటు రాష్ట్ర కాంగ్రెస్పై తిరుగుబాటు ప్రకటించిన రాణే వారంరోజుల క్రితం మంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసింది. రాజీనామా చేయడం ద్వారా ముఖ్యమంత్రి పథ్వీరాజ్ చవాన్తోపాటు రాష్ట్ర కాంగ్రెస్పై ఒత్తిడి తీసుకువచ్చేందుకు నారాయణ్ రాణే వ్యూహం ఫలించినట్టు కన్పించడంలేదు. పైగా బెడిసికొట్టిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజీనామా అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాణే తన డిమాండ్లను వినిపించిన సంగతి కూడా తెలిసిందే. అయితే అదే రోజు రాత్రి వర్షా బంగ్లాలో ఎంపీసీసీ అధ్యక్షులు మాణిక్రావ్ ఠాక్రే, ముఖ్యమంత్రి పథ్వీరాజ్ చవాన్, రాణే సమావేశం కావడం, ఆ సమావేశంలో కూడా రాణే తన డిమాండ్లను వారి ముందుంచినట్లు వార్తలు వెలువడ్డాయి. రాణే డిమాండ్లను పార్టీ అధిష్టానానికి తెలియజేస్తామని చెప్పడంతో అప్పటికి సంతృప్తి వ్యక్తం చేసిన రాణేకు నిరాశే ఎదురైంది. రాణే డిమాండ్లపై అధిష్టానం నుంచి స్పందన కరువైంది. పరిస్థితిని ముందే గమనించిన రాణే స్వయంగా గురువారం ఢిల్లీ బాటపట్టారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ అయ్యేందుకు వెళ్లిన ఆయన రాహుల్ గాంధీతో భేటీ అయిన అనంతరం వెనుతిరగాల్సివచ్చింది. ముఖ్యంగా రెవెన్యూశాఖ మంత్రి పదవితోపాటు , పార్టీ రాష్ట్రాధ్యక్ష పదవి కావాలని రాహుల్ గాంధీని కోరారని, అప్పటికి రాహుల్ నుంచి ఎటువంటి హామీ లభించకపోయినా సోనియాతో మాట్లాడతానని మాత్రమే రాహుల్ సమాధానమిచ్చి తిప్పి పంపినట్లు ఢిల్లీ కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఇది జరిగి కూడా అయిదు రోజులు పూర్తయింది. అయినప్పటికీ రాణే డిమాండ్లపై కాంగ్రెస్ అధిష్టానం ఇంత వరకు నోరు విప్పలేదు. దీంతో రాణే వర్గీయుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. దీనిపై రాణే కూడా మరో ఆలోచన చేస్తున్నట్లు ఆయన సన్నిహితులు చెప్పుకుంటున్నారు. -
144 సీట్లు ఇవ్వాల్సిందే
సాక్షి, ముంబై : ఎన్సీపీకి 144 సీట్లు ఇవ్వాల్సిందేనని మహారాష్ట్ర ఎన్సీపీ అధ్యక్షులు సునీల్ తట్కరే స్పష్టం చేశారు. సీట్ల పంపకాల అంశంపై ఎన్సీపీ, కాంగ్రెస్ల మధ్య చర్చలు కొలిక్కిరావడం లేదు. ఈ నేపథ్యంలో సీట్ల పంపకాల అంశం తీవ్రస్థాయికి చేరుకుంది. ఈ విషయమై గురువారం ఎన్సీపీ భవనంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీట్ల పంపకాల అంశంపై సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించిందని తెలిపారు. ఈ సమావేశంలో 144 సీట్లు కేటాయించాల్సిందేనని పట్టుబట్టినట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి పథ్వీరాజ్ చవాన్, ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్, ఎంపీసీసీ అధ్యక్షులు మాణిక్రావ్ ఠాక్రే తదితర ప్రముఖులు పాల్గొని, తమ ప్రతిపాదనలు, డిమాండ్లను ఎన్సీపీ ముందుంచినట్లు చెప్పారు. ఈ విషయాలపై కాంగ్రెస్ మహారాష్ట్ర ఇంచార్జీ మోహన్ప్రకాష్ ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్టానంతో చర్చిస్తారు. ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ ఎన్సీపీ అధ్యక్షులు శరద్ పవార్తో చర్చిస్తారు. వీరిద్దరి చర్చల అనంతరం మరో రెండు మూడు రోజుల్లో సీట్ల పంపకాల విషయంపై మళ్లీ సమావేశం జరగనుందని చెప్పారు. ఆ సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని సునీల్ తట్కరే తెలిపారు. మరోవైపు రమేష్ కదం ఎన్సీపీలో చేరికతో కోంకణ్లో ముఖ్యంగా చిప్లూన్లో ఉత్సాహమైన వాతవరణం నెలకొందన్నారు. ఇక రాణే విషయంపై మాత్రం ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారమని చెప్పారు. ఢిల్లీ మహారాష్ట్ర సదన్లోని సంఘటనపై మాత్రం రాష్ట్ర సంస్కతి, సాంప్రదాయలకు వ్యతిరేకమైన సంఘటనగా పేర్కొంటూ శివసేనపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. సమాజ్వాదీ పార్టీ ప్రజాసామ్య కూటమిలో జతకట్టనుందన్న విషయంపై ఇంత వరకు ఎలాంటి ప్రస్తావన రాలేదని స్పష్టం చేశారు. -
రాణేకు సోనియా పిలుపు
సాక్షి, ముంబై: కొద్ది రోజులుగా పార్టీలో అసంతృప్తితో కొనసాగుతున్న కాంగ్రెస్ నాయకుడు నారాయణ్ రాణేకు ఎట్టకేలకు హై కమాండ్ నుంచి పిలుపు వచ్చింది. ఆ మేరకు రాణే గురువారం మధ్యాహ్నం ముంబై నుంచి ఢిల్లీకి బయలుదేరారు. సాయంత్రం కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో భేటీ అయ్యే అవకాశాలున్నాయి. గత సోమవారం రాణే తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో రాణేని బుజ్జగించేందుకు ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షుడు మాణిక్రావ్ ఠాక్రే మంగళవారం వర్షా బంగ్లాలో రెండు గంటలపాటు రాణేతో సమావేశం నిర్వహించారు. బుజ్జగించే ప్రయత్నాలు చేశారు. చివరకు అవి కూడా విఫలం కావడంతో ఈ విషయాన్ని హై కమాండ్ దృష్టికి తీసుకెళతామని, రెండు, మూడు రోజుల్లో సోనియాతో ముగ్గురం భేటీ అవుతామని చవాన్ వెల్లడించిన సంగతి తెలిసిందే. కాని రాణే ఒక్కరే ఢిల్లీకి వెళ్లడం పలు అనుమానాలకు తావిస్తోంది. రాణేతో ఒంటరిగానే చర్చలు జరుపుతారా..? లేక ఢిల్లీలో ఉన్న నాయకులను ఆహ్వానించి నచ్చజెప్పే ప్రయత్నమేదైనా చేస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇదిలాఉండగా తిరుగుబాటుపై రాణే కొంత శాంతించినప్పటికీ పరువును కాపాడుకునేందుకు మాత్రం సోనియాతో తప్పకండా భేటీ కావాల్సిందే. కాగా ఆయన పార్టీలోనే కొనసాగుతారని. బహుశా రాజీనామా కూడా ఉపసంహరించుకుంటారని బుధవారం సాయంత్రం విడుదల చేసిన ఒక ప్రకటనలో పీసీసీ అధ్యక్షుడు మాణిక్రావ్ ఠాక్రే అభిప్రాయపడ్డారు. ఏదేమైనా, కొన్ని నెలలుగా క్రమంగా తరిగిపోతున్న తన ప్రాభవాన్ని మళ్లీ పుంజుకోవడానికి రాణే ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు యత్నించవచ్చని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. రాహుల్తో సమావేశం న్యూఢిల్లీ : మహారాష్ర్ట కాంగ్రెస్ అసమ్మతి నాయకుడు నారాయన్ రాణే గురువారం తమ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాహుల్గాంధీకి నాయకత్వ మార్పు అవసరంపై చర్చించారు. శుక్రవారం మహారాష్ర్ట సీఎం పృథ్వీరాజ్ చవాన్, పీసీసీ రాష్ర్ట అధ్యక్షుడు మాణిక్రావ్ థాక్రేతో కలిసి ఆయన కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీని కలిసే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీకి లోక్సభ ఎన్నికల్లో ఎదురైన పరాజయం, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పునరావృతం కాకుండా ఉండేందుకు నాయకత్వం మార్పు, తదితర అంశాలపై చర్చించనున్నారు. -
పంచాయితీ ఢిల్లీకి..
సాక్షి, ముంబై: కొంతకాలంగా పార్టీపై అసంతృప్తితో ఉన్న కాంగ్రెస్ నాయకుడు నారాయణ్ రాణేను బుజ్జగించేందుకు ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. వర్షా బంగ్లాలో మంగళవారం మధ్యాహ్నం సుమారు రెండు గంటలపాటు చర్చలు జరిగాయి. ఈ సమావేశానికి రాణే, చవాన్తోపాటు మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఎంపీసీసీ) అధ్యక్షుడు మాణిక్రావ్ ఠాక్రే, మరికొందరు సీనియర్ నాయకులు హాజరయ్యారు. తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని రాణే ఈ సందర్భంగా పట్టుబట్టినట్లు తెలిసింది. రాజీనామాను ఉపసంహరించుకొని, తమతోపాటు పార్టీ అభివృద్ధి కోసం పనిచేయాలని చవాన్, ఠాక్రే విజ్ఞప్తి చేసినప్పటికీ ఆయన అంగీకరించలేదు. తనను సంతృప్తి పరిచేందుకు చవాన్ కూడా ఎలాంటి హామీ ఇవ్వలేదని రాణే స్పష్టం చేశారు. దీంతో ఎటువంటి పరిష్కారం లేకుండానే సమావేశం ముగిసింది. మంగళవారం నాటిచర్చల సారాంశాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళతామని ముఖ్యమంత్రి చవాన్ స్పష్టం చేశారు. రెండు, మూడు రోజుల్లో తనతోపాటు రాణే, ఠాక్రే ఢిల్లీ వెళ్లి సోనియా గాంధీతో భేటీ అవుతామని ప్రకటించారు. ఆమె ఆపాయింట్మెంట్ కోసం ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లు సమావేశం అనంతరం చవాన్ వెల్లడించారు. సోనియాగాంధీ దృష్టికి రాణే డిమాండ్లను తీసుకెళ తామని అన్నారు. ఈ సమావేశంలో రాణే రాజీనామా అంశంతోపాటు వచ్చే శాసనసభ ఎన్నికల విషయంపైనా చర్చించినట్లు చవాన్ తెలిపారు. ఇదిలా ఉండగా సోనియాతో భేటీ అనంతరం రాణే ఎంత వరకు శాంతిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. మీకు ఎంపీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే సమస్యకు పరిష్కారం దక్కుతుందని భావిస్తున్నారా అన్న విలేకరుల ప్రశ్నకు రాణే బదులిస్తూ ‘నాకు అలాంటి అవకాశం ఇస్తామని ఎవరూ చెప్పలేదు. నేను లేవనెత్తిన అంశాలకు పరిష్కారం చూపిస్తే రాజీనామా ఉపసంహరణ గురించి ఆలోచిస్తానని చెప్పాను’ అని వివరించారు. ఈ సందర్భంగా చవాన్ మీడియాతో మాట్లాడుతూ చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకుంటామని అన్నారు. 2005లో శివసేనను వీడిన రాణే కాంగ్రెస్లో చేరడం తెలిసిందే. తమ పార్టీలోకి వచ్చిన ఆరు నెలల్లోపు ముఖ్యమంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధిష్టానం.. ఇప్పటికీ ఆ పని చేయకపోవంతో ఆగ్రహానికి గురైన రాణే రాజీనామా బాట పట్టారని రాష్ట్ర కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. -
కాంగ్రెస్లో తిరుగుబాటు సెగలు
మహారాష్ట్రలో నారాయణ్ రాణే, అస్సాంలో హిమంత శర్మ రాజీనామా ముంబై/గువాహటి: లోక్సభ ఎన్నికల్లో ఇప్పటికే చావుదెబ్బ తిన్న కాంగ్రెస్ పార్టీకి తాజాగా రెండు రాష్ట్రాల్లో స్వపక్ష నేతలు పెద్ద షాకిచ్చారు. ఆ పార్టీ పాలనలోని మహారాష్ట్ర, అస్సాంలలో ఇద్దరు అసమ్మతి సీనియర్ మంత్రులు ముఖ్యమంత్రులపై తిరుగుబాటు చేశారు. మహారాష్ట్ర పరిశ్రమల మంత్రి నారాయణ్ రాణే, అస్సాం ఆరోగ్య, విద్యా మంత్రి హిమంత బిశ్వాస్ శర్మలు తమ సీఎంల పనితీరుపై అసంతృప్తితో సోమవారం మంత్రి పదవులకు రాజీనామా చేశారు. కొన్ని నెలల కింద కూడా రాజీనామా చేసిన వీరు.. అప్పుడు అధిష్టానంఒత్తిడితో ఉపసంహరించుకున్నారు. అయితే ఈసారి ఉపసంహరించుకోనని, శర్మ స్పష్టం చేశారు. నారాయణ్ రాణే ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ను కలుసుకుని రాజీనామా అందజేశారు. తర్వాత విలేకర్లతో మాట్లాడుతూ.. ‘2005లో కాంగ్రెస్లో చేరినప్పుడు తనను ఆరు నెలల్లో ముఖ్యమంత్రిని చేస్తామని హామీ ఇచ్చిన అధిష్టానం తొమ్మిదేళ్లవుతున్నా దాన్ని నెరవేర్చలేదంటూ మండిపడ్డారు. తాను పార్టీని వీడనని స్పష్టం చేశారు. మరోపక్క తనకు మద్దతిస్తున్న 38 మంది ఎమ్మెల్యేలతో కలసి గవర్నర్ వద్దకు వెళ్లానని, సీఎం గొగోయ్ నాయకత్వంపై అవిశ్వాసం వ్యక్తం చేశానని హిమంత శర్మ తెలిపారు. తాము పార్టీ కోసం పోరాడుతున్నామని, గొగోయ్ సారథ్యంలో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తే ఘోరంగా దెబ్బతింటుందన్నారు. -
సీఎం పదవి ఇస్తామన్నారు..
సాక్షి, ముంబై: అధిష్టానం ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదని, దీంతో తాను తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు పేర్కొంటూ పరిశ్రమల శాఖ మంత్రి నారాయణ్ రాణే సోమవారం తన మంత్రిపదవికి రాజీనామా చేశారు. అయితే పార్టీకి మాత్రం రాజీనామా చేయలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ వార్త రాష్ట్ర రాజకీయాల్లో పెనుదుమారాన్ని లేపింది. ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్తో నారాయణ్ రాణే సోమవారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో భేటీ అయ్యారు. అనంతరం తన కు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ పార్టీపై, పార్టీ నేతృత్వంపై నిరసన వ్యక్తం చేస్తూ రాజీనామా పత్రాన్ని ముఖ్యమంత్రికి అందచేశారు. అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శివసేనను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన సమయంలో ఆరు నెలల్లో ముఖ్యమంత్రి పదవి కట్టబెడతామని చెప్పారు కాని తొమ్మిదేళ్లైనప్పటికీ ఇంతవరకు కాంగ్రెస్ అధిష్టానం తన మాట నిలబెట్టుకోలేదన్నారు. తనతోపాటు వచ్చిన సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఒక్కరికి కూడా ఎలాంటి మంత్రి పదవి ఇవ్వలేదని, అనంతరం తన మద్దతుదారులకు టిక్కెట్ ఇవ్వడంలో కూడా మోసం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం పనితీరు నచ్చలేదు... ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ మచ్చలేని రాజకీయనాయకుడే అయినప్పటికీ అతడి పనివిధానం మాత్రం సరిగా లేదని నారాయణ రాణే విమర్శించారు. ప్రజల సంక్షేమంతోపాటు రాష్ట్ర అభివృద్ధి కోసం కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నప్పటికీ వాటిని అమలుచేయలేకపోయారన్నారు. దీంతో ప్రభుత్వంపై ప్రజలతోపాటు కార్యకర్తల్లోనూ తీవ్ర అసంతృప్తి నెలకొందని ఆరోపిం చారు. దీని ప్రభావం ఇటీవల జరిగిన లోకసభ ఎన్నికలపై పడిందని.. ఫలితం ఘోర పరాజయమని ఆయన చవాన్పై విరుచుకుపడ్డారు. అయినప్పటికీ ముఖ్యమంత్రి పనితీరులో మార్పురాలేదని ఆయన ఎద్దేవా చేశారు. అందుకే తాను మంత్రిపదవికి రాజీనామా చేసినట్టు రాణే పేర్కొన్నారు. అధిష్టానం నిర్ణయం తర్వాతే... తాను మంత్రి పదవికి చేసిన రాజీనామాపై కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం ప్రకటించిన అనంతరమే భవిష్యత్ ప్రణాళికలపై నిర్ణయం ప్రకటించనున్నట్టు నారాయణ్ రాణే చెప్పారు. తాను పార్టీలో తిరుగుబాటు చేయలేదని, కేవలం తన అభిప్రాయాలను వ్యక్తం చేశానన్నారు. అదే విధంగా పార్టీ, ప్రభుత్వం గురించి నారాయణ్ రాణే ఏమనుకుంటున్నారన్నది ప్రధానం కాదని, ప్రజలేమనుకుంటున్నారన్నది ముఖ్యమన్నారు. సోనియాతో సీఎం చర్చలు... రాజీనామా అంశంపై పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో చర్చిస్తానని సీఎం పృథ్వీరాజ్చవాన్ చెప్పారని రాణే తెలిపారు. చర్చల అనంతరం సోనియాగాంధీ నిర్ణయం తీసుకుంటారని, ఇది జరిగిన తర్వాత మరోసారి తాను ముఖ్యమంత్రితో భేటీ అయ్యే అవకాశాలున్నాయన్నారు. రాణే పయనం ఎటువైపో... నారాయణ రాణే పార్టీని వీడినట్టయితే ఆయన పయనం ఎటువైపు వెళ్లనుందనే విషయంపై ఉత్కంఠత కొనసాగుతోంది. శివసేనను వీడి తొమ్మిదేళ్ల కిందట నారాయణ్ రాణే కాంగ్రెస్లో ప్రవేశించారు. అప్పటినుంచి శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రే, రాణేల మధ్య తీవ్ర విభేదాలున్నాయి. ఇప్పటికే ఒకరిపై మరొకరు ఘాటైన ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రాణేకు శివసేన గేట్లు మూసుకుపోయినట్లే. మరోవైపు ఎన్సీపీలోకి కూడా వెళ్లే అవకాశాలు పెద్దగా కన్పించడంలేదు. దీంతో ఆయనకు కేవలం బీజేపీ, ఎమ్మెన్నెస్ పార్టీలే ప్రత్యామ్నాయంగా ఉన్నాయి. బీజేపీలో చేరే అవకాశాలున్నప్పటికీ మిత్రపక్షమైన శివసేన దీనికి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశాలున్నాయి. అయితే శివసేనను కాదని రాణేను పార్టీలో చేర్చుకుని ఎమ్మెన్నెస్తో బీజేపీ జతకట్టే అవకాశాలు కూడా ఉన్నాయని కొందరు రాజకీయ విశ్లేషకులు తెలుపుతున్నారు. ఇదిలా ఉండగా మరోవైపు రాజ్ ఠాక్రేతో ఉన్న సత్సంబంధాల కారణంగా రాణే ఎమ్మెన్నెస్లో చేరే అవకాశాలను కూడా రాజకీయ నిపుణులు కాదనలేకపోతున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెన్నెస్ నాయకులు రాణే పార్టీలో చేరితే స్వాగతిస్తామని ప్రకటించారు. ఇలాంటి తరుణంలో రాణే మరో ప్రత్యామ్నాయంపై ఆలోచన చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఆయన కుమారుడు స్థాపిం చిన స్వాభిమాని సంఘటనను రాజకీయ పార్టీగా మార్చి దాని ద్వారా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో దిగేందుకు అవకాశాలున్నాయి. ఇలా కొంకణ్, ముంబైతోపాటు పట్టున్న ప్రాంతాల్లో సుమారు 15 నుంచి 20 సీట్లకుపైగా గెలుచుకుని ఒక బలమైన శక్తిగా అవతరించేందుకు రాణే వర్గీయులు ఆలోచిస్తున్నట్టు సమాచారం. -
మంత్రి నారాయణ్ రాణే రాజీనామా
-
అసోం, మహారాష్ట్రలో కాంగ్రెస్ కుదేలు
కాంగ్రెస్ పార్టీకి వరుసపెట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అసోం, మహారాష్ట్రలలో ఆ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. అసోంలో అక్కడి ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్కి వ్యతిరేకంగా చిన్నపాటి విప్లవమే చెలరేగింది. దాదాపు 30 మంది ఎమ్మెల్యేలు గొగోయ్ నాయకత్వంపై అసమ్మతి వ్యక్తం చేస్తూ అసెంబ్లీ స్పీకర్ను కలిశారు. వీళ్లను బుజ్జగించడానికి కాంగ్రెస్ పార్టీ ఒకవైపు ప్రయత్నిస్తుండగానే.. మహారాష్ట్రలో పరిశ్రమల శాఖ మంత్రి నారాయణ్ రాణే తన మంత్రిపదవికి రాజీనామా చేశారు. అయితే ఈ రాజీనామాను ఇంకా ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఆమోదించాల్సి ఉంది. ముఖ్యమంత్రిని మార్చి తీరాల్సిందేనంటూ నారాయణ్ రాణే గట్టిగా పట్టుబడుతున్నారు. మార్చని పక్షంలో లోక్సభ ఎన్నికల కంటే, రాబోయే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఏమంత భిన్నంగా ఉండబోవని ఆయన రెండు రోజుల క్రితం కన్కావలి ప్రాంతంలో జరిగిన సభలో చెప్పారు. 2005లో శివసేన నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన రాణే, తన రాజకీయ భవితవ్యంపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. 'రాణే లాంటివాళ్లకు కాషాయ పార్టీలో స్థానం లేదు' అంటూ శుక్రవారం నాడు ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యానించగా, దమ్మున్న నాయకులకు ఎక్కడైనా ఖాళీ ఉంటుందని రాణే అన్నారు. అసలే కాంగ్రెస్- ఎన్సీపీ సంబంధాలు అంతంతమాత్రంగా ఉన్న ఈ సమయంలో రాణే కూడా రాజీనామా చేయడం కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బే అవుతుంది. -
‘ఉద్ధ’రించిందేమీ లేదు..!
సాక్షి, ముంబై: ఉద్ధవ్ ఠాక్రేకు నాయకత్వ లక్షణాలు లేవు..అసలు శివసేనకు అతడు చేసిందేమీ లేదు.. దివంగత శివసేన అధినేత బాల్ ఠాక్రేను అత్యధికంగా ఇబ్బంది పెట్టింది ఉద్ధవ్ ఠాక్రేనే.. ఈ నిజాన్ని ఆయన ఇంట్లో పనిచేసే నౌకర్లను అడిగినా చెబుతారని కాంగ్రెస్ నాయకుడు నారాయణ్ రాణే విమర్శించారు. కొంకణ్ పర్యటనలో భాగంగా నారాయణ్ రాణే సింధుదుర్గ్ జిల్లాకు బయలుదేరారు. అంతకు ముందు హాత్ఖంబా ప్రాంతంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఉద్ధవ్ను లక్ష్యంగా చేసుకుని ఘాటుగా విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో నిష్టతో పనిచేసేవారికి, సమర్థవంతులకు అన్యాయం జరుగుతోందన్నారు. తను ముందుగా ప్రకటించిన ప్రకారం సోమవారం తన పదవికి రాజీనామా చేస్తున్నానని చెప్పారు. ందులో ఎటువంటి మార్పూ లేదని, రాజీనామాకు గల కారణాలను అప్పుడే స్పష్టం చేస్తానని తెలిపారు. ‘ఉద్ధవ్ ఠాక్రే నన్ను లక్ష్యంగా చేసుకుని తరుచూ విమర్శలు చేస్తున్నారు.. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన విమర్శలు, దూకుడుతనం మరింత ఎక్కువైంది.. ఇతరులపై ఆరోపణలు చేయడానికి బదులు బాల్ ఠాక్రే ఆదర్శాలను, సిద్ధాంతాలను కాపాడేందుకు కృషిచేస్తే మంచిది..’ అని రాణే వ్యాఖ్యానించారు. తనకు వ్యతిరేకంగా మరోసారి ఆరోపణలు చేస్తే ఇక ఊరుకునేది లేదని, మొత్తం వారి కుటుంబంలో, పార్టీలో ఏం జరుగుతుందో బహిర్గతం చేస్తానని హెచ్చరించారు. ‘కొంకణ్వాసులను భయాందోళన నుంచి పూర్తిగా విముక్తి కల్పిస్తానని ఉద్ధవ్ అంటున్నారు.. నేను నెలకు మూడుసార్లు కొంకణ్లో పర్యటిస్తుంటాను.. ఇక్కడ ఎలాంటి ఉగ్రవాదుల దాడులు, భయానక వాతావరణం, నేరాల కేసులు నమోదు కావడం లాంటి సంఘటనలు నాకు ఎక్కడా కనిపించడం లేదు.. మరి ఆయనకు మాత్రమే కనిపిస్తున్న ఆ భయాందోళనలు ఏమిటో. .’నని చమత్కరించారు. ఎన్నికలు సమయంలో ఒకసారి చుట్టపు చూపుగా వచ్చి వెళ్లడం తప్ప ఆయనకు కొంకణ్ గురించి ఏం తెలుసని ఎద్దేవా చేశారు. ఇక్కడి ప్రజలు రైళ్ల గురించి పడుతున్న ఇబ్బందులు, సమస్యలు ఉద్ధవ్కు తెలుసా అని ప్రశ్నించారు. ‘ప్రస్తుతం పెరిగిన రైలు చార్జీలు, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు మీకు కనిపించడం లేదా.. లేకుంటే ఇవన్నీ చూసి మీకు భయమేస్తోందా.. అలా అయితే కొంకణ్ రావద్దు’ అని ఉద్ధవ్కు రాణే సలహా ఇచ్చారు . లోక్సభ ఎన్నికల్లో శివసేన ఎంపీలు గెలవడంలో వారి గొప్పతనమేమీ లేదన్నారు. కేవలం మోడీ ప్రాబల్యం వల్లే వారంతా గెలిచి గట్టేక్కారని వ్యాఖ్యానించారు.‘శివసేనకు నాయకుడు లేడు.. అది నేతృత్వం లేని పార్టీ. అందులో ఉద్ధవ్ ఠాక్రే నిర్వహిస్తున్న పాత్ర ఏమీ లేద’ని రాణే దుయ్యబట్టారు. ‘ 39 సంవత్సరాలు శివసేనలో కొనసాగాను.. అందులో ఆఖరు 15 సంవత్సరాలు బాల్ ఠాక్రేకు దగ్గరగా ఉన్నాను.. వాస్తవానికి శివసేన నుంచి బయటపడిన వారందరి కంటే బాల్ ఠాక్రేను ఎక్కువగా వేధించింది ఉద్ధవ్ ఠాక్రేనే..’అని ఘాటుగా విమర్శించారు. ‘బాల్ ఠాక్రే అప్పట్లో కుటుంబ సభ్యుల్ని, ఇంటిని వదిలి రెండుసార్లు బయటపడ్డారు. ఆయన ఎందుకు వెళ్లారు..? ఎక్కడ ఉంటుండేవారు...? మాకు తెలుసు.. ఇంటి వాతావరణం గురించి నౌకర్లను అడిగితే వారే చెబుతారు’ అని రాణే వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. రాణే ఎందుకు రాజీనామా చేస్తున్నారో తెలియదు : మాణిక్రావ్ నాగపూర్: మంత్రిపదవికి నారాయణ్ రాణే ఏ కారణం చేత రాజీనామా చేస్తున్నారో తనకు తెలియదని మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మాణిక్రావ్ ఠాక్రే శనివారం తెలిపారు. పార్టీ అధిష్టానం ఇచ్చిన హామీ మేరకు రాణేకు ప్రభుత్వంలో సముచితం కల్పించిందన్నారు. కాంగ్రెస్ అధిష్టానం తనను నిర్లక్ష్యం చేస్తోందన్న రాణే వాదనను ఆయన తోసిపుచ్చారు. ఏమైనా ఇబ్బందులుంటే అధిష్టానంతో ఆయన చర్చించవచ్చని ఠాక్రే సూచించారు. -
శివసేనలో ఏడుగురు కాంగ్రెస్ కార్పొరేటర్ల చేరిక
సాక్షి, ముంబై: ఠాణేకి చెందిన కార్పొరేటర్ రవీంద్ర పాఠక్ సహా ఏడుగురు కార్పొరేటర్లు శనివారం శివసేనలో చేరారు. పాఠక్ కాంగ్రెస్ నాయకుడు, పరిశ్రమల శాఖ మంత్రి నారాయణ్ రాణేకు అత్యంత సన్నిహితుడు కావడం విశేషం. దీంతో రాణే ఏకాకిగా మిగిలిపోయారని రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో కుమారుడి ఓటమి, కాంగ్రెస్ అధిష్టానం నిర్లక్ష్యంతో మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి న పరిస్థితి రావడం లాంటి సమస్యలతో రాణే ఇప్పటికే ఇబ్బందుల్లో పడిపోయారు. దీనికి తోడు తనకు అత్యంత సన్నిహితుడైన పాఠక్ మరో ఆరుగురు కార్పొరేటర్లతో శివసేనలో చేరడం రాణేకు గట్టి దెబ్బ తగిలినట్లు భావిస్తున్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత రాణే రాజకీయ భవిత తలకిందులైంది. కుమారుడు నిలేష్ రాణే పరాజయంతో ఆయన ప్రాబల్యానికి గండిపడినట్లయ్యింది. మరోపక్క పార్టీలో ఆయన పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. నిప్పుకు గాలి తోడయినట్లు ఫాటక్తోసహా ఇతని భార్య, దీపక్ వేత్కర్, రాజా గవారి, కాంచన్ చింద్కర్, మన్ప్రీత్ కౌర్, మీనల్ సంఖ్యే ఇలా ఏడుగురు శివసేనలో చేరారు. దీంతో అత్యంత సన్నిహితులైన వీరంతా రాణేకు దూరం కావడం దెబ్బమీద దెబ్బ తగిలినట్లయింది. వీరందరికీ శనివారం మాతోశ్రీ బంగ్లాలో ఉద్ధవ్ ఠాక్రే స్వాగతం పలికారు. ఇదిలాఉండగా అప్పట్లో నారాయణ్ రాణే శివసేనతో తెగతెంపులు చేసుకుని బయటపడిన సమయంలో రవీంద్ర పాఠక్ కూడా ఆయన వెంట వచ్చేశారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని గత శాసన సభ ఎన్నికల్లో కాంకావ్లీ నుంచి పాఠక్కు రాణే కాంగ్రెస్ టికెట్ ఇప్పించారు. అయితే స్వల్ప ఓట్ల తేడాతో ఆయన ఓడిపోయారు. అయినప్పటికీ పాఠ్ ఇప్పటివరకు రాణేతోనే కొనసాగుతున్నారు. కాని ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల తర్వాత వీరిద్దరి మధ్య విభేదాలు పొడసూపినట్లు తెలిసింది. రాణేలో పాఠక్కు రాజకీయంగా మంచి పట్టు ఉంది. ఆయన శివసేనలో చేరడంవల్ల ఠాణేలో ఆ పార్టీ మరింత బలపడనుంది. పాఠక్ పార్టీ మారడంపై రాణే మాట్లాడుతూ. తనతో ఉండాలనుకునేవారు ఉండవచ్చు, వెళ్లాలనుకునేవారు వెళ్లిపోవచ్చని స్పష్టం చేశారు. ఇలా మిత్రద్రోహం చేసినవారు త్వరలోనే ప్రతిఫలం అనుభవిస్తారని రాణే వ్యాఖ్యానించారు. కాగా, ఇప్పుడు రాణే ఓపిగ్గా, సమయస్పూర్తితో మెలగాల్సిన అవసరమచ్చిందని ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యానించారు. ఏదో ఒక పార్టీలో చిత్తశుద్ధితో కొనసాగితే మంచిదని హితవు పలికారు. -
చిక్కుల్లో నితేశ్ రాణే
ముంబై: పరిశ్రమలశాఖ మంత్రి నారాయణ్ రాణే తనయుడు, స్వాభిమాన్ సంఘటన సంస్థ అధ్యక్షుడు నితేశ్ రాణే చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. స్వాభిమాన్ సంఘటన కార్యాలయంలో చింటూ షేక్పై కాల్పులు జరిపిన కేసులో రాణే నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. కాగా ఈ హత్యాయత్నం కేసుకు సంబంధించి ఫైలును మూసివేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ సీబీఐ రెండోసారి చేసిన అభ్యర్థనను స్థానిక మేజిస్ట్రేట్ కోర్టు తిరస్కరించింది. ఆగస్టు, 2013లో కూడా నితేశ్ రాణే కేసును మూసివేసేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును కోరింది. అప్పుడు తిరస్కరించిన కోర్టు తాజాగా మరోసారి కూడా తిరస్కరించింది. దీంతో కేసు దర్యాప్తును కొనసాగించక తప్పని పరిస్థితి నెలకొంది. ఈ విషయమై నితేశ్ తరఫు న్యాయవాది పర్వేజ్ మీనన్ ఓ వార్తాసంస్థతో మాట్లాడుతూ... ‘కేసు మూసివేసేందుకు అనుమతిని ఇవ్వాలంటూ సీబీఐ చేసిన అభ్యర్థనను తిరస్కరించడానికిగల రెండు కారణాలను కోర్టు తెలిపింది. సీబీఐ సమర్పించిన నివేదికను తాము అంగీకరించకపోవడం మొదటి కారణమైతే కేసు బాంబే హైకోర్టులో పెండింగ్లో ఉన్నందున మూసివేతకు అంగీకరించలేమని తెలిపింద’న్నారు. ఆగస్టు, 2013లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి చింటూ షేక్ సెప్టెంబర్ 23న పొవాయి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు దాఖలు చేశారు. ఖార్లోని స్వాభిమాన్ సంఘటన కార్యాలయంలో తనపై నితేశ్ రాణే రెండుసార్లు కాల్పులు జరిపారని, అందులో ఓ బుల్లెట్ తన చెంపను చీల్చుకుంటూ వెళ్లిందన్నారు. దీంతో తాను తీవ్రంగా గాయపడ్డానని పిటిషన్లో ఆరోపించారు. దీంతో భారత శిక్షాస్మృతి, సెక్షన్ 307 ప్రకారం నితేశ్ రాణేపై పొవాయి పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. కేసులో పొవాయి పోలీసుల దర్యాప్తు అనుమానాస్పదంగా ఉందని పేర్కొంటూ బాంబే హైకోర్టు 2011, మార్చిలో సీబీఐకి అప్పగించింది. కేసును దర్యాప్తు చేసిన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నితేశ్ రాణేకు వ్యతిరేకంగా ఎటువంటి సాక్ష్యాధారాలు లేవని మార్చి 2012లో ఓ నివేదికను కోర్టుకు సమర్పించింది. ఈ నివేదికను సవాలు చేస్తూ చింటూ షేఖ్ కోర్టులో పిటిషన్ వేశారు. మళ్లీ దర్యాప్తు చేయాలని పిటిషన్లో కోరారు. దీంతో కోర్టు ఆదేశాల మేరకు మళ్లీ దర్యాప్తు ప్రారంభించి ఆగస్టులో కేసును మూసివేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరింది. అందుకు కోర్టు తిరస్కరించడంతో మళ్లీ ఈ ఏడాది మే 20వ తేదీన తుది నివేదికనిచ్చిన సీబీఐ కేసును మూసివేసేందుకు అనుమతిని ఇవ్వాలని మంగళవారం కోరింది. రెండోసారి కూడా కోర్టు తిరస్కరించింది. -
రాణే.. పరిస్థితి...
తన పరిస్థితి ఏంటో తనకే తెలియని దుస్థితి మాజీ మంత్రి నారాయణ్ రాణేకు దాపురించింది. లోక్సభ ఎన్నికల్లో తన కొడుకు ఘోర పరాభవంతో మంత్రి పదవికి రాజీనామా చేసిన ఆయన అడుగులు బీజేపీవైపు పడుతున్నట్లు కనిపిం చాయి. అందుకు ముండే మధ్యవర్తిత్వం వహిస్తున్నారనే వార్తలు వినిపించాయి. ఇప్పుడు ముండే మరణంతో రాణే పరిస్థితి అగమ్యగోచరంగా త యారైంది. బీజేపీ సీనియర్ నాయకుడు గోపినాథ్ ముండే అకాల మరణంతో కాంగ్రెస్ నాయకుడు నారాయణ్ రాణే పరిస్థితి ముందు అగమ్యగోచరంగా తయారైంది. తాను బీజేపీలో చేరాలని చేసిన ప్రయత్నాలు ముండే లేకపోవడంతో దాదాపుగా ఆవిరైపోయాయి. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో కొడుకు నితేష్ రాణే దారుణంగా ఓడిపోవడంతో నారాయణ్ రాణే తీవ్ర ఆందోళనలో పడిపోయారు. ఈ లోక్సభ ఎన్నికల్లో తన కుమారుడు నితేష్ ఓడిపోతే తన పదవికి రాజీనామ చేస్తానని ఎన్నికలకు ముందు రాణే బహిరంగంగా సవాల్ చేశారు. నితేష్ ఓడిపోవడంతో అన్నట్లుగా పదవికి రాజీనామ చేసిన రాణే కాంగ్రెస్తో తెగతెంపులు చేసుకోవాలనే నిర్ణయానికొచ్చారని ఆయన సన్నిహితులు తెలిపారు. రాణే కాంగ్రెస్ను వీడాలనే నిర్ణయం వెనుక బీజేపీలో చేరాలనే అభిప్రాయం దాగుందనే కథనాలు అప్పట్లో మీడియాలో ప్రసారమయ్యాయి. ఇందుకోసం గోపీనాథ్ ముండేతో తరచూ సంప్రదింపులు జరుపుతున్నాడని కూడా ప్రచారం జరిగింది. అయితే గోపీనాథ్ ముండే నుంచి రాణేకు ఎటువంటి హామీ లభించకపోయినా త్వరలో బీజేపీలో చేర్చుకునే విషయమై పార్టీ సీనియర్లతో మాట్లాడతాననే హామీ ముండే నుంచి లభించినట్లు రాణే సన్నిహితులు చెప్పుకొచ్చారు. ఇప్పుడు గోపీనాథ్ ముండే మరణించడంతో తనను బీజేపీ నావలోకి చేర్చే నాథుడెవరని రాణే ఆందోళనలో పడిపోయినట్లు చెప్పుకుంటున్నారు. ఇటు కాంగ్రెస్ను వీడుతున్నట్లు ప్రచారం జరగడంతో పార్టీలో ఆయనకు ప్రాధాన్యత తగ్గిందని, అటు బీజేపీలో చోటు దక్కకపోవడం, దక్కే అవకాశాలు గోపీనాథ్ ముండే మరణంతో ఆవిరికావడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో రాణే పడిపోయారని రాజకీయ విశ్లేషకులు చెప్పుకుంటున్నారు. శివసేన అడ్డుపడే అవ కాశం... ఒకవేళ రాణేను బీజేపీలో చేర్చుకుంటే శివసేనతో బీజేపీకి ఉన్న తత్సంబంధాలు దెబ్బతింటాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ముండే లేకపోయినా మరెవరితోనైనా బీజేపీ సీనియర్ నేతలను రాణే కలిసే ప్రయత్నం చేసినా అందుకు శివసేన అడ్డుపడే అవకాశముందంటున్నారు. ఒకవేళ గోపీనాథ్ ముండే బతికుంటే శివసేనను ఒప్పించే అవకాశముండేదని, ఇప్పుడు అంతటి స్థాయి ఉన్న నాయకుడు రాష్ట్రంలో బీజేపీకి ఎవరూ లేరని చెబుతున్నారు. సర్దుకుపోదామనే ధోరణిలో రాణే.. బీజేపీలో చేరేందుకు ఉన్న ఒక్క దారీ మూసుకుపోవడంతో రాణే ఇక కాంగ్రెస్లోనే సెటిలైపోదామనే అభిప్రాయంతో ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్ నేతలు తనకు ప్రాధాన్యమివ్వకున్నా కొన్నిరోజులు సర్దుకుపోదామనే ధోరణిలో ఆయన కనిపిస్తున్నట్లు చెబుతున్నారు. ముఖ్యమంత్రి పదవి ఇవ్వనందుకేనా? లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ను తొలగిస్తారనే వార్తలు వెలువడిన వెంటనే రాణే ఢిల్లీకి పయనమయ్యారు. ముఖ్యమంత్రి పదవి ఇస్తానన్న హామీతోనే రాణే కాంగ్రెస్లోకి వచ్చినా ఇప్పటిదాకా ఇవ్వకపోవడంతో కనీసం ఇప్పుడైనా సీఎం పోస్టు తనకు ఇవ్వాలని సోనియాను కోరాలనుకున్నారు. అయితే సోనియాగాంధీ రాణేకు అపాయింట్మెంట్ ఇవ్వకుండానే తిప్పిపంపడంతో ఆయన ముండేతో సమావేశమయ్యారనే ప్రచారం జరిగింది. -
నేతృత్వ బాధ్యతలపై రాణే, అశోక్ చవాన్ దృష్టి
సాక్షి, ముంబై: రాష్ట్ర కాంగ్రెస్లో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. లోక్సభ ఎన్నికల్లో చావుదెబ్బ తినడంతో రాబోయే రోజుల్లో పలు కీలక మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం ఇప్పటికే మంత్రులు నారాయణ రాణే, విజయ్ రావుత్ రాజీనామాలు చేశారు. ఈ ఎన్నికల్లో ఓటమిపై ఇప్పటికే జరుగుతున్న సమీక్ష సమావేశాల్లో పదాధికారులు, కార్యకర్తల అభిప్రాయాలు స్వీకరిస్తున్న ఎంపీసీసీ నేతలు తదనుగుణంగా పార్టీని పటిష్టపరిచేందుకు మార్పులు చేసే అవకాశముందని తెలుస్తోంది. ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ లోక్సభ ఎన్నికలలో పరాజయానికి నైతికబాధ్యత వహిస్తున్నట్టు ప్రకటించినప్పటికీ రాజీనామాకు మాత్రం ససేమిరా అన్నారు. ఆయన రాజీనామాపై పార్టీ అధిష్టానమే నిర్ణయం తీసుకుంటుందని ఎంపీసీసీ తీర్మానించిన సంగతి తెలిసిందే. అయితే దాదాపు పృథ్వీరాజ్ చవాన్ను తప్పించే అవకాశాలు కనబడుతున్నాయి. దీంతో అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని మళ్లీ రాష్ట్ర కాంగ్రెస్లో కీలకంగా వ్యవహరించేందుకు ఇద్దరు మాజీ సీఎంలు సిద్ధమవుతున్నారు. నారాయణ రాణే, అశోక్ చవాన్ ఎవరికి వారుగా తమ ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ నేతృత్వ బాధ్యతలు అప్పగించాలని నేరుగా ఎలాంటి ప్రకటనలు చేయకున్నా, తెరవెనుక తమ పనులు చకచకా చేసుకుంటూ వెళుతున్నారని పార్టీ వర్గాల్లో వినబడుతోంది. మళ్లీ సీఎం పీఠం దక్కించుకునేందుకు ఎవరికివారుగా పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. రాణే దూకుడు... కొంకణ్లో తన కుమారుడైన నీలేష్ రాణే పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేసిన నారాయణ రాణే తనదైన శైలిలో ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ తప్పుకోవాలని పార్టీపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఇది నిజమేననట్టుగా కాంగ్రెస్ నేతృత్వ బాధ్యతలు నారాయణ రాణేకు అప్పగించాలని సింధుదుర్గా జిల్లా కాంగ్రెస్ తీర్మానించింది. దీంతో రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందు పలు మార్పులు జరిగే అవకాశాలున్నాయనే వాదనకు బలం చేకూర్చినట్టైంది. లోక్సభ ఎన్నికల పరాజయంపై సమీక్ష సమావేశంలో కూడా నారాయణ రాణే పొల్గొనలేదు. ఇలాచేసి పృథ్వీరాజ్ చవాన్ కూడా నైతిక బాధ్యత వహిస్త్తూ తనలాగే రాజీనామా చేయాలని సంకేతాలు ఇచ్చారని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత సమయంలో ఓ ప్రణాళిక ప్రకారం దూకుడుగా ముందుకువెళ్లి పార్టీ పగ్గాలు చేజిక్కించుకోవాలనుకుంటున్న రాణే అందుకు తగ్గట్టుగానే చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ను గట్టెక్కించాలంటే దూకుడుగా ఉండే నాయకుడు అవసరమని అందరికీ తెలియజేసేలా ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ విషయాలపై మాత్రం అటు పార్టీ, ఇటు రాణే ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు. మళ్లీ కీలకపాత్రపై అశోక్ దృష్టి... ఆదర్శ్ కుంభకోణం కేసు కారణంగా ముఖ్యమంత్రి పదవిని కోల్పోయి దాదాపు అజ్ఞాతంలోకి వెళ్లిన అశోక్ చవాన్కు లోక్సభ ఎన్నికలు ఊపిరిని పోశాయి. ఆదర్శ్తోపాటు పేయిడ్ న్యూస్ అంశం ఇంకా ఆయనను వెంబడిస్తున్నా లోక్సభ ఎన్నికల ఫలితాలు అశోక్చవాన్ వర్గీయుల్లో మాత్రం ఓ కొత్త ఆశ చిగురించేలా చేశాయి. తన పరిధిలోని నాగపూర్, హింగోలి ఎంపీ స్థానాలు కాంగ్రెస్ దక్కించుకోవడంలో కీలక పాత్ర పోషించిన అశోక్ చవాన్ మళ్లీ రాష్ట్ర రాజకీయాల్లో దూకుడు పెంచాలనుకుంటున్నారు. ఆదర్శ్ కుంభకోణం దర్యాప్తు నివేదికను మంత్రి మండలి తోసిపుచ్చడంతో ఆయన కీలకంగా వ్యవహరించేందుకు ఆస్కారాలున్నాయని అందరూ భావించారు. ఇందుకు తగ్గట్టుగానే లోక్సభ ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్లో కూడా పరిస్థితులు మారాయి. ఇప్పటివరకు పృథ్వీరాజ్ చవాన్, మాణిక్రావ్ ఠాక్రేలకు అభయమిస్తు వస్తున్న అధిష్టానం కూడా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో నేతృత్వాన్ని మార్చాలా? అనే దిశగా ఆలోచిస్తున్నట్టు తెలిసింది. కాగా, మరో ఐదు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కు విజయం లభించేందుకు మాస్ను ఆకర్షించడంతో పాటు అందరినీ కలుపుకుపోయే నేత అవసరం ఉందని భావిస్తున్నారు. మరాఠ్వాడా నాయకుడు, దివంగత మాజీ సీఎం విలాస్రావ్ దేశ్ముఖ్ అనంతరం ఆయన స్థానాన్ని భర్తీ చేసే నాయకులెవరూ కాంగ్రెస్కు లభించలేదని చెప్పవచ్చు. ముఖ్యమంత్రి పథ్వీరాజ్ చవాన్ పరిపాలన క్లీన్గా ఉన్నప్పటికీ లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపించలేకపోయారు. మరోవైపు అశోక్ చవాన్కు బాధ్యతలు అప్పగించిన రెండు లోక్సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. రాష్ట్రంలో మోడీ ప్రభంజనం లేదని, సరైన నేతృత్వం లేకపోవడంతోనే మిగతా ప్రాంతాల్లో పరాజయం పాలైందని అశోక్ చవాన్ పేర్కొంటున్నారు. దీన్నిబట్టి ఆయన మళ్లీ రాష్ట్రంలో పార్టీ పగ్గాలు అప్పగిస్తే చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు సంకేతాలిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు తెలుపుతున్నారు. -
‘పాల’కులపై కేసు
ముంబై: కాంగ్రెస్ నాయకులు అవినీతికి కేరాఫ్ అడ్రస్గా మారిపోతున్నారు. ఇప్పటికే ఆదర్శ్ కుంభకోణంలో నలుగురు మాజీ ముఖ్యమంత్రులు ఇరుక్కపోగా...తాజాగా రాష్ట్ర పాల కుంభకోణంలో మరో ఇద్దరు మాజీ ముఖ్య నేతలపై కేసు నమోదవడం సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. జల్గావ్ పాల ఉత్పాదక సంఘానికి రూ.3.18 కోట్ల నష్టాన్ని మిగిల్చారని 144 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిలో రాష్ర్ట పరిశ్రమల శాఖ మంత్రి నారాయణ్ రాణే, కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే, తొమ్మిది మంది మంత్రులు, 12 మంది రాష్ట్ర కార్యదర్శులు ఉన్నారు. జల్గావ్కు చెందిన రైతు నాగరాజ్ జనార్ధన్ పాటిల్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. ఆరు నెలలు లేదా ఏడాదిలోపు జల్గావ్ పాల ఉత్పాదక సంఘం బోర్డు డెరైక్టర్లకు అప్పగించాల్సి ఉన్న జాతీయ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు(ఎన్డీడీబీ)తోనే కొనసాగేలా 118 మంది గూడుపుఠాణి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనివల్ల ఎన్డీడీబీకి రూ.3.18 కోట్లు లాభం వచ్చిందన్నాడు. ఈ మేరకు చూసుకుంటే జల్గావ్ పాల ఉత్పాదక సంఘానికి ఆ మేరకు నష్టం కలిగించినట్టేనని అందులో పేర్కొన్నాడు. అయితే ఈ కుంభకోణంపై ఈ ఏడాది జూన్లోనే పాటిల్ కోర్టును ఆశ్రయించగా కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించిన సంగతి తెలిసిందే. కాగా, ఇటీవల ముగిసిన అసెంబ్లీ సమావేశాల్లో పాల కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు పట్టుబట్టిన సంగతి తెలిసిందే. -
రెండోరోజూ రభస
నాగపూర్: రెండోరోజు కూడా అదే దృశ్యం పునరావృతమైంది. ప్రతిపక్షంతోపాటు అధికార పక్షం కూడా సభలో తీవ్ర గందరగోళం సృష్టించడంతో అనేక పర్యాయాలు వాయిదాపడింది. చివరికి సభాపతి బుధవారానికి వాయిదా వేశారు. సభా కార్యకలాపా లు ప్రారంభమైన అనంతరం 48వ నిబంధన కింద సభకు వివరణ ఇచ్చేందుకు తొలుత పరిశ్రమల శాఖ మంత్రినారాయణ్ రాణే పైకి లేవగానే ప్రతిపక్ష సభ్యులు రాణేతోపాటు కళంకిత మంత్రులను పదవులను తప్పించాలంటూ నినదించడం ప్రారంభించారు. దీంతో సభ గంటపాటు వాయిదాపడింది. తిరిగి సభా కార్యకలాపాలు మొదలవగానే సభాపతి స్థానంలో ఆశీసునుడైన నవాబ్ మాలిక్... ఒకసభ్యుడు 48వ నిబంధనను వినియోగించుకుంటే మరో సభ్యుడు 22వ నిబంధనను వాడుకునేందుకు కుదరదంటూ ప్రతిపక్ష నాయకుడు ఏక్నాథ్ ఖడ్సేను మాట్లాడనీయకుండా అడ్డుకున్నారు. అనంతరం పరిశ్రమల శాఖ మంత్రినారాయణ్ రాణే మాట్లాడుతూ జల్గావ్ పాల సహకార సంఘం అంశం అత్యంత పురాతనమైనదన్నారు. ఈ కుంభకోణానికి సంబంధించి నగ్రే పాటిల్ అనే భద్రతా అధికారిని తొలుత సస్పెండ్ చేశామని, ఆ తర్వాత కర్తవ్య నిర్వహణలో నిర్లక్ష్యం వహించాడనే ఆరోపణలు రావడంతో ఉద్యోగం నుంచి తొలగించామన్నారు. 1995 నాటి ఈ ఆర్థిక అక్రమాల కేసులో తాను మోసగాడిన ని, దొంగనంటూ ఏక్నాథ్ఖడ్సే నిందించారని అన్నారు. తాను ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో ఖడ్సే తన మంత్రివర్గ సహచరుడని గుర్తుచేశారు. తనను ఇలా పిలవడమంటే అతనిని అతనే ఆవిధంగా పిలుచుకున్నట్టవుతుందన్నారు. కుంభ కోణంలో నిందితుడనే పదం ఖడ్సేకి కూడా వర్తిస్తుందన్నారు. అందువల్ల ఖడ్సే తనకు క్షమాపణ చెప్పాలని రాణే డిమాండ్ చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఎంతో బాగా విశ్వసించే లెఫ్టినెంట్లు ఆనందిబెన్ పటేల్, పురుషోత్తం సోలంకిలపై నేరాభియోగాలు నమోదయ్యాయని, అందువల్ల ఇక్కడి మంత్రుల గురించి ఖడ్సే ఎట్టి పరిస్థితుల్లోనూ మాట్లాడకూడదన్నారు. చివరికి బీజేపీ మాజీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ లంచం తీసుకుంటూ కెమెరాకి దొరికిపోయారన్నారు. అనంతరం అధికార ప్రజాస్వామ్య కూటమిలోని భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్, ఎన్సీపీలు ప్రతిపక్షంపై ఒత్తిడి తీసుకురావడమే కాకుండా వెల్లోకి దూసుకుపోయాయి. బాబా సిద్ధిఖి, అమీన్ పటేల్, విజయ్ వడ్డెటివార్, వీరేంద్ర జగ్తాప్ (కాంగ్రెస్), జితేంద్ర అవాడ్లు ప్రతిపక్షానికి వ్యతిరేకంగా సభలో గట్టిగా నినదించారు. ఇదే సమయంలో ప్రతిపక్ష సభ్యులైన గిరీష్ మహాజన్, యోగేష్ సాగర్, తారాచంద్ సింగ్ (బీజేపీ), ఏక్నాథ్ ఖడ్సే (శివసేన) పోడియంపైకి ఎక్కారు. దీంతో సభాపతి స్థానంలో ఉన్న నవాబ్మాలిక్ సభను మరో పది నిమిషాలపాటు వాయిదా వేశారు. మరలా సభాకార్యకలాపాలు ప్రారంభమైనప్పటికీ అనిశ్చితి తొలగిపోలేదు. దీంతో మరోసారి 30 నిమిషాలు వాయిదా వేశారు. తిరిగి మరోసారి సభ ప్రారంభం కాగానే సదాశివ్ పాటిల్ సభాపతి స్థానంలో ఆశీనులయ్యారు. ఆ తర్వాత పైకిలేచిన పరిశ్రమల శాఖ మంత్రి నారాయణ్ రాణే 22వ నిబంధనను ప్రస్తావించడంద్వారా ప్రతిపక్ష నాయకుడు ఏక్నాథ్ ఖడ్సేని మాట్లాడకుండా అడ్డుకున్నారు. దీనిని సభాపతి స్థానంలో ఉన్న సదాశివ్ సమర్థించారు. దీంతో అటు ప్రతిపక్షంతోపాటు ఇటు అధికార పక్ష సభ్యులు కూడా వెల్లోకి దూసుకుపోవడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. పరిస్థితిని మెరుగుపరిచేందుకు సభాపతి స్థానంలో ఉన్న సదాశివ్ ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో ఆయన రోజంతా సభను వాయిదా వేశారు. -
మంత్రి గారి సుపుత్రుడి కండకావరం
టోల్ గేట్ రుసుం చెల్లించాలని స్నేహితులతో కలసి కారులో వెళ్తున్న మంత్రి గారి కుమారుడిని చెక్పోస్ట్ సిబ్బంది కోరారు. అంతే ఆ మంత్రిగారి పుత్రరత్నం అగ్గిమీద గుగ్గిలమైయ్యారు. తన ప్రతాపాన్ని ఆ టోల్ గేట్ సిబ్బందిపై ప్రదర్శించాడు. అంతేకాకుండా ఆ టోల్ కార్యాలయంపై దాడి చేసి ఫర్నిచర్ను ధ్వంసం చేశాడు. దాంతో టోల్ సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ మంత్రిగారి కుమారుడిని శ్రీకృష్ణ జన్మస్థానానికి తరలించిన సంఘటన మంగళవారం గోవాలో చోటు చేసుకుంది. గోవా పోలీసుల కథనం ప్రకారం.... మహారాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి నారాయణ రాణె కుమారుడు నితీష్ రాణెను తన స్నేహితులతో కలసి గోవా పయనమైయ్యాడు. ఆ క్రమంలో గోవా సమీపంలో టోల్గెట్ వద్ద వారు ప్రయాణిస్తున్న వాహనానికి ట్యాక్స్ చెల్లించాలని కోరారు. దాంతో నితీష్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది.దాంతో టోల్ సిబ్బందిపై దాడి చేశారు. అతడి స్నేహితులు కూడా తామేమి తక్కువ తినలేదని కార్యాలయంలో ఫర్నిచర్ ధ్వంసం చేశారు. దాంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి మంత్రిగారి సుపుత్రుడితోపాటు మరో ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని ప్రినం పోలీస్ స్టేషన్కు తరలించారు. నితీష్ ,అతడి స్నేహితులపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే మంత్రి గారి పుత్రరత్నం అరెస్ట్ వార్త తెలియడంతో ఆయన అనుచరులు ప్రినం పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. నితీష్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దాంతో నితీష్ తోపాటు అతడి స్నేహితులను మరో పోలీసు స్టేషన్కు తరలించారు. గోవా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మోడీపై రాణే విమర్శనాస్త్రాలు
ముంబై: గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ అబద్ధాలకోరు అంటూ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి నారాయణ్ రాణే విమర్శించారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ అభివృద్ధి అంతా ఉత్తిత్తిదేనన్నారు. గుజరాత్ అన్నిరంగాల్లో అభివృద్ధి చెందిందంటూ మోడీ చెబుతున్నారని, అయితే మహారాష్ట్రతో పోలిస్తే అది ఏ రంగంలోనూ ముందులేదన్నారు. మహారాష్ర్ట జీడీపీ రూ. 12 లక్షల కోట్లని, గుజరాత్లో అది రూ. 6 లక్షల కోట్లు మాత్రమేనన్నారు. ఇక వచ్చే లోక్సభ ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థి విషయంలో బీజేపీ గుంభనంగా వ్యవహరిస్తోందని, అయితే ప్రతి ఎన్నికల సమయంలోనూ వారు ప్రధాని అభ్యర్థి విషయంలోనే తీవ్రంగా పోటీపడతారన్నారు. అరుణ్జైట్లీ, సుస్మాస్వరాజ్లు కూడా ప్రధాని అభ్యర్థి రేసులో ఉన్నారన్నారు. గోపీనాథ్ ముండేని అడిగినా తాను బరిలో లేననే చెబుతారన్నారు. బీజేపీ అంతర్గత పోరు తమ పార్టీకి లాభి స్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అంతఃకలహాలను విడనాడి సమష్టిగా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. 2014 లోక్సభ, శాసనసభ ఎన్నికల్లో అత్యధికస్థానాలను కైవసం చేసుకునేందుకు పాటుపడాలన్నారు. బీఎంసీలో శివసేన పనితీరు ఎంతమాత్రం బాగాలేదన్నారు. ముంబైని షాంఘై న గరంగా మార్చడం వారి తరం కాదన్నారు.