neha dhupia
-
సిడ్నీలో భారత మాజీ క్రికెటర్కు అరుదైన గౌరవం.. మామగారి ‘స్వెటర్’తో వచ్చిన కోడలు(ఫొటోలు)
-
నేహా ధూపియా అనుసరించే గ్లూటెన్-ఫ్రీ డైట్ అంటే..!
బాలీవుడ్ నటి నేహా ధూపియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె మోడల్, ఫెమినా మిస్ ఇండియా టైటిల్ విన్నర్ కూడా. అలాగే 2002లో మిస్ యూనివర్స్ అందాల పోటీల్లో భారతదేశానికి ప్రాతినిధ్య వహించింది. బాలీవుడ్లో అనేక బ్లాక్బాస్టర్ మూవీలతో మంచి సక్సెస్ని అందుకోవడమే గాక అనేక రియాలిటీ షోల్లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ..విమర్శకుల ప్రశంసలను కూడా అందుకుంది. ఆమె అంగద్ బేడీని 2018లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు పిల్లకు జన్మనివ్వడంతో లావుగా అయిపోయారు. అయితే అనుకోకుండా ఒక రోజు మీడియా కంట పడటంతో..ఒక్కసారిగా ఆమె అధిక బరువు గురించి సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఏకంగా 23 కిలోలు బరువు తగ్గి ఇదివరకటి నేహాలా నాజుగ్గా కనిపించి.. అందర్నీ ఆశ్చర్యపరిచింది.పైగా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడమే గాక..పలు ఆఫర్లను కూడా అందుకున్నట్లు చెప్పుకొచ్చింది. అంతేగాదు తన అభిమానుతో తన వెయిట్ లాస్ జర్నీ గురించి, అందుకు సంబంధించిన చిట్కాలను కూడా షేర్ చేస్తుంటుంది. ఎప్పటికప్పుడు తన ఫిట్నెస్కి సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఆరోగ్య స్ప్రుహ కలిగించే నేహా తాజాగా డైట్కి సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం షేర్ చేసుకుంది. అదేంటంటే..డైట్ పాటించేటప్పుడూ కేవలం బరువు తగ్గేందుకే ప్రాధాన్యత ఇవ్వడమే గాక ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకోవాలని నొక్కి చెబుతోంది. ముఖ్యంగా గ్లూటెన్ ఫ్రీ డైట్ని అనుసరించమని చెబుతోంది. మంచి శరీరాకృతి తోపాటు ఎలాంటి దీర్ఘకాలిక వ్యాధుల బారినపడమని ధీమాగా చెబుతోంది నేహా. దీన్ని అత్యంత రుచికరమైన రీతిలో తయారు చేసుకుంటే గ్లూటెన్ ఫ్రీ ఫుడ్ని ఇష్టంగా తినగలుగుతారని అంటోంది. తాను అరటిపండ్లతో చేసిన పాన్కేక్, తాజా బెర్రీలు, లావెండర్ జామ్ వంటివి తీసుకుంటానని చెబతుతోంది. గ్లూటెన్ ఫ్రీ ఆహారపదార్థాలను ఎంపిక చేసుకుని మరీ డైట్ని ప్రారంభిస్తే మంచి ఫలితం ఉండటమే గాక బరువు కూడా అదుపులో ఉంటుందని తెలిపింది. గ్లూటెన్ డైట్ అంటే..గ్లూటెన్ రహిత ఆహారంమే తీసుకోవడం. అందుకోసం గ్లూటెన్ లేని పండ్లు, కూరగాయలు, మాంసం, గుడ్లు వంటిఆహారాలనే తీసుకుంటారు. అలాగే గ్లూటెన్ ఫ్రీ బ్రెడ్ లేదా పాస్తా వంటివి కూడా తీసుకుంటారు. ఎవరికి మంచిదంటే..గ్లూటెన్ ఉన్న ఆహార పదార్థాలు పడని వాళ్లకు, గోధుమ పిండితో చేసిన వంటకాలు తింటే ఎలెర్జీ లేదా జీర్ణశయాంతర సమస్యలతో ఇబ్బంది పడేవారికి ఈ డైట్ మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణుల. అలాగే బరువు తగ్గాలనుకునే వారికి కూడా మంచిదే. ఇక్కడ గ్లూటెన్ ఫ్రీకి ప్రత్యామ్నాయంగా మంచి ఆరోగ్యకరమైనవి తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. పూర్తి వివరాల కోసం వ్యక్తిగత ఆరోగ్య నిపుణులు లేదా వైద్యులను సంప్రదించి పాటించటం ఉత్తమం.(చదవండి: కాకర : చక్కెరకు చెక్ పెడుతుందా?) -
అప్పుడే దీపావళి షాపింగ్ షురూ చేసిన నటి (ఫొటోలు)
-
నేహా ధూపియా వెయిట్ లాస్ జర్నీ!..ఏకంగా 14 గంటలు..!
మహిళలు ప్రసావానంతరం బరువు తగ్గడం అంత ఈజీ కాదు. ముఖ్యంగా ఇద్దరు పిల్లలు తల్లికి మహాకష్టం. వారు తమ పనులు తాము చేసుకునే స్థాయికి చేరుకునేంత వరకు కూడా పిలల సంరక్షణ తల్లిదే భాద్యత. అందువల్ల ఏ మహిళైన తన ఫిట్నెస్పై దృష్టిసారిండం కాస్త ఇబ్బందిగా ఉంటుంది. అయినా కొందరూ తగ్గగలుగుతారు. అదేమంతా అసాధ్యమైన విషయం కాదని బరువు తగ్గి మరి చూపించింది బాలీవుడ్ నటి నేహా ధూపియా. ఇద్దరు పిల్లల తల్లి అయినా ఆమె ప్రసవానంతరం విపరీతమైన బరువు పెరిగిపోయింది. అయితే జస్ట్ ఒక్క ఏడాదిలోనే తన ఫిట్నెస్పై దృష్టిసారించి మరీ కిలోలు కొద్ది బరువు తగ్గింది. అంతేగాదు తన వెయిట్ లాస్ జర్నీ ఎలా సాగిందో కూడా నెటిజన్లతో షేర్ చేసుకుంది.బరువు తగ్గడం అనేది అంత సులభమైనది కాదు. అందులోనూ ప్రసవానంతర బరువు తగ్గడం అంటే ఇంకా కష్టం. కానీ నేహా తన సంకలప్పంతో బరువు తగ్గి మరీ చూపించింది. అలా ఆమె ఏకంగా 23 కిలోల వరకు బరువు తగ్గిపోయింది. 43 ఏళ్ల ధూపియా ఇదంతా అంత సులభమైనది కాదంటూ తన వెయిట్ లాస్జర్నీ గురించి చెప్పుకొచ్చింది. ముందుగా బరువు తగ్గేందుకు చేసిన వర్కౌట్లు వంటి వాటితో విపరీతమైన అలసట, వొళ్లు నొప్పులు వచ్చేసేవి. ఆ తర్వాత తీసుకునే డైట్పై ఫోకస్ పెట్టానంటు చెప్పుకొచ్చింది. తీసుకునే ఆహారంలో గ్లూటెన్ లేకుండా జాగ్రత్త పడింది. దాదాపు 14 గంటలు ఉపవాసం వంటివి చేసి 23 కిలోలు మేర బరువు తగ్గినట్లు తెలిపింది. అయితే ఒక ఏడాదిపాటు క్రమం తప్పకుండా వ్యాయామం,డైట్ విషయంలో నియమాలు పాటించినట్లు వివరించింది. అందువల్ల సులభంగా బరువు తగ్గి, మంచి ఫిట్గా ఉండగలిగానని చెప్పింది నేహా. ఇక్కడ ఒక్కోసారి డైట్ లేదా వ్యాయామాలు స్కిప్ అయిన నిరాశపడొపోకుండా..తర్వాత రోజు నుంచి కొనసాగించడమే గాకుండా బరువు తగ్గుతాను అనే పాజిటివ్ ఆటిట్యూడ్ని డెవలప్ చేసుకుంటుంటే ఆటోమేటిగ్గా చక్కగా బరువు తగ్గిపోతారని చెబుతోంది నెహా ధూపియా. అంతేగాదు వాకింగ్, జిమ్కి వెళ్లకుండా ఇంట్లోనే ఈజీగా బరువు తగ్గాలనుకుంటే ఈ స్ట్రాటజీ ఫాలో అవ్వమంటూ పలు ఆసక్తికర విషయాలు ూడా చెప్పుకొచ్చింది.అవేంటంటే..సమతుల్య ఆహారం తీసుకోండిఅతిగా తినకుండా కొలత ప్రకారం తీసుకునేలా మైండ్ సిద్ధం చేసుకోండిలీన్ ప్రోటీన్లు, తృణధాన్యాలకు ప్రాధాన్యత ఇవ్వండినీరు బాగా త్రాగండిచక్కెర పానీయాలు నివారించండిజంపింగ్, రన్నింగ్ లేదా డ్యాన్స్ వంటివి చేయండిపుష్ అప్స్, స్క్వాట్ల, ప్లాంక్లు వంటి వ్యాయామాలు చేయండికాస్త విరామం ఇచ్చి ఇంటి పనుల్లో నిమగ్నం అవ్వండి. మైండ్ఫుల్ ఈటింగ్ వంటి టెక్నీక్లతో ఆకలిని నియంత్రించండి. తగినంత నిద్రపోండి.ఇవన్నీ క్రమం తప్పకుండా ఫాలో అయితే ఇంట్లోనే సులభంగా బరువు తగ్గొచ్చని చెబుతోంది నేహా ధూపియా.(చదవండి: వర్షాకాలం..వ్యాధుల కాలం..తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..!) -
23 కిలోలు తగ్గా.. అప్పటినుంచే ఎక్కువ ఆఫర్లు: బాలీవుడ్ నటి
బాలీవుడ్ నటి, మోడల్ నేహా ధూపియా.. ఇద్దరు పిల్లల తల్లయినా ఫిట్నెస్లో అందరినీ అబ్బురపరుస్తోంది. ప్రెగ్నెన్సీ తర్వాత పెరిగిన బరువును తగ్గించుకుని మరింత ధృడంగా తయారైంది. గర్భం దాల్చిన రెండుసార్లు 23-25 కిలోల దాకా బరువు పెరిగినట్లు తెలిపింది. నేహా మాట్లాడుతూ.. మెహర్ పుట్టాక లాక్డౌన్ వచ్చిపడింది. ఇంటిదగ్గరే ఉన్నాం కాబట్టి డైట్ పాటించి బరువు తగ్గాను. ఇంతలో మూడేళ్లకే మళ్లీ ప్రెగ్నెంట్ అయ్యా.. అలా బరువు పెరిగాను.23 కిలోలు తగ్గా..డెలివరీ తర్వాత నేనెంత లావు అవుతాను? ఎలా కనిపిస్తాననేది ఆలోచించలేదు. నా పిల్లలిద్దరికీ ఏడాది వయసొచ్చేదాకా పాలిచ్చాను. గతేడాది వరకు శరీరంపై ఫోకస్ పెట్టలేదు. ఎప్పుడైతే ఫిట్నెస్ ఆలోచన వచ్చిందే వెంటనే ఎక్సర్సైజ్, డైట్ వంటివి పాటించడం మొదలుపెట్టాను. అలా 23 కిలోలు తగ్గిపోయాను. అయినా ఇంకా నేను అనుకున్నంత బరువు తగ్గలేదు. త్వరలోనే ఆ లక్ష్యాన్ని చేరతాను.ఆఫర్లు తగ్గిపోయాయిసంతోషకరమైన విషయం ఏంటంటే.. ఈ బరువు తగ్గడమనేది నా కెరీర్కు ఎంతగానో ఉపయోగపడింది. వెయిట్ లాస్ అయినప్పటినుంచే నాకు ఆఫర్లు రావడం ఎక్కువయ్యాయి. బరువు తగ్గడం కోసం నేను మరీ అంత కఠిన ఎక్సర్సైజ్లు పాటించలేదు. రన్నింగ్ చేస్తాను, అప్పుడప్పుడు జిమ్కు వెళ్తాను. చక్కెర, గ్లుటెన్, ఫ్రై చేసిన పదార్థాలను తీసుకోవడం మానేశాను. రాత్రి ఏడింటికే డిన్నర్ ముగిస్తాను. ఇవన్నీ నాకు ఎంతగానో ఉపయోగపడ్డాయి అని చెప్పుకొచ్చింది.సినిమాలుకాగా నేహా ధూపియా తెలుగులో నిన్నే ఇష్టపడ్డాను, విలన్, పరమవీరచక్ర సినిమాల్లో నటించింది. హిందీలో ఖయమత్, జూలీ, ఫైట్ క్లబ్, గరం మసాలా, ఢిల్లీ హైట్స్, చుప్ చుప్కే, రష్, బ్యాడ్ న్యూస్ వంటి చిత్రాల్లో యాక్ట్ చేసింది.చదవండి: ప్రభాస్ కల్కి.. వారం రోజుల్లో ఎన్ని కోట్లంటే? -
‘కిల్’ ప్రీమియర్ షోలో మెరిసిన బాలీవుడ్ భామలు (ఫొటోలు)
-
ధోని షాట్లకు ఫిదా.. భయపెట్టేసింది! ఈమె ఎవరో గుర్తుపట్టారా?
ఐపీఎల్-2024.. చెన్నై సూపర్ కింగ్స్తో ముంబై ఇండియన్స్ మ్యాచ్.. మహేంద్ర సింగ్ ధోని బ్యాట్ పట్టుకుని మైదానంలో దిగగానే వాంఖడే స్టేడియం హోరెత్తిపోయింది. ముంబై ఇండియన్స్ అభిమానులు సైతం ఈ సీఎస్కే స్టార్ హిట్టింగ్ బాదితే చూడాలని తహతహలాడిపోయారు. వారి అంచనాలను నిజం చేస్తూ ధోని ఆఖరి ఓవర్లో వరుసగా మూడు సిక్స్లు బాదాడు. వింటేజ్ ధోనిని గుర్తు చేస్తూ విధ్వంసకర బ్యాటింగ్తో విరుచుకుపడ్డాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్లో (చివరి ఓవర్ మూడు, నాలుగు, ఐదో బంతికి) హ్యాట్రిక్ సిక్సర్లతో ధోని కనువిందు చేశాడు. దీంతో అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి. DO NOT MISS MSD 🤝 Hat-trick of Sixes 🤝 Wankhede going berserk Sit back & enjoy the LEGEND spreading joy & beyond 💛 😍 Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #MIvCSK | @msdhoni | @ChennaiIPL pic.twitter.com/SuRErWrQTG — IndianPremierLeague (@IPL) April 14, 2024 కూర్చున్న సీట్ల నుంచి లేచి నిలబడి.. గంతులేస్తూ ‘తలా’ ఇన్నింగ్స్ను సెలబ్రేట్ చేసుకున్నారు. వీరిలో సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా ఉండటం విశేషం. దివంగత క్రికెటర్ బిషన్ సింగ్ బేడి కోడలు, బాలీవుడ్ నటి నేహా ధుపియా అయితే ధోని బాదిన షాట్లకు ఫిదా అయింది. సంతోషం పట్టలేక పెద్దగా అరుస్తూ వైల్డ్గా సెలబ్రేట్ చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను నేహా సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. ఇక నెటిజన్లు.. ‘‘వామ్మో.. నీ రియాక్షన్ భయపెట్టేలా ఉంది. మరీ అంత ఆనందమా?’’ అంటూ తమదైన శైలిలో నేహాను సరదాగా ట్రోల్ చేస్తున్నారు. కాగా ముంబై- చెన్నై మ్యాచ్కు నేహా ధుపియా తన భర్త అంగద్ బేడి, స్నేహితులు కరీనా కపూర్, జాన్ అబ్రహంలతో కలిసి హాజరైంది. కాగా అంగద్ బేడి అండర్-19 స్థాయిలో ఢిల్లీ తరఫున క్రికెట్ ఆడాడు. ఆ తర్వాత మోడల్గా మారి నటుడిగానూ ఎదిగాడు. ముంబై వర్సెస్ చెన్నై స్కోర్లు ►వేదిక: వాంఖడే, ముంబై- ఆదివారం ►టాస్: ముంబై.. బౌలింగ్ ►చెన్నై స్కోరు: 206/4 (20) ►ముంబై స్కోరు: 186/6 (20) ►ఫలితం: 20 పరుగుల తేడాతో ముంబైపై చెన్నై విజయం ►ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: మతీశ పతిరణ(4/28). చదవండి: #Hardik Pandya: అతడిదంతా నటన! ధోని సిక్సర్లు కొడుతుంటే అలా.. View this post on Instagram A post shared by Neha Dhupia (@nehadhupia) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
Merry Christmas Movie Premiere: 'మెర్రీ క్రిస్మస్' సినిమా ప్రీమియర్లో మెరిసిన తారలు (ఫొటోలు)
-
ఎవరూ నమ్మలేరు ఈ హీరోయిన్లు పాక్ సినిమాల్లో నటించారంటే
బాలీవుడ్ సెలబ్రిటీలు భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో కూడా మంచి అభిమానులను కలిగి ఉన్నారు మరియు భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య సంబంధాలు స్నేహపూర్వకంగా ఉన్నప్పుడు, చాలా మంది బాలీవుడ్ తారలు పాకిస్తాన్ చిత్రాలలో పనిచేశారని చాలా కొద్ది మందికి తెలుసు. మరోవైపు, పాకిస్థానీ నటలు కూడా బాలీవుడ్లో పనిచేసిన సుదీర్ఘ చరిత్రను కలిగి ఉన్నారు. పాకిస్థాన్ సూపర్ హిట్ చిత్రాలలో పనిచేసిన కొంతమంది ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్స్ ఎవరో మీరు తెలుసుకోండి. నేహా ధూపియా బాలీవుడ్ నటి నేహా ధూపియా బీ టౌన్లో పరిచయం అక్కర్లేని పేరు. 2002లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్ గెలుచుకున్న భామ ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో తరుణ్ హీరోగా నటించిన నిన్నే ఇష్టపడ్డాను చిత్రం ద్వారా పరిచయమైంది. ఆ తర్వాత బాలీవుడ్లో పలు చిత్రాల్లో కనిపించింది. తెలుగులో విలన్, పరమవీర చక్ర సినిమాల్లో కనిపించింది. ఇండియాలో ఆమెకున్న పాపులారిటీ వల్ల పాకిస్థాన్ సినిమాల్లో కూడా నటించే అవకాశం వచ్చింది. పాకిస్థానీ చిత్రం 'కభీ ప్యార్ నా కర్ణా'లో ఆమె ఐటెం సాంగ్లో కనిపించింది. ఈ చిత్రంలో పాకిస్థానీ నటీనటులు వీణా మాలిక్, మోఅమర్ రాణాతో పాటు జారా షేక్ ముఖ్య పాత్రలు పోషించారు. కిరణ్ ఖేర్ ‘కిరణ్ ఖేర్’ అనే పేరు అందరికీ సుపరిచితమే. ఆమె 1985లో బాలీవుడ్ ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ను వివాహం చేసుకుంది. ఆమె నాటకరంగం, టెలివిజన్, సినిమా రంగాలలో తనదైన ప్రతిభ చాటుకున్న నటి. శ్యామ్ బెనగల్ ‘సర్దారీ బేగమ్’లో ఆమె నటన గురించి ఇప్పటికీ గొప్పగా చెప్పుకుంటారు. జాతీయ అవార్డ్ కూడా అందుకుంది. మరోవైపు రాజకీయాల్లోనూ రాణిస్తోంది. ప్రస్తుతం ఆమె బీజేపీ పార్టీ నుంచి చంఢీగఢ్ పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నారు. 2003లో పాకిస్థాన్లో విడుదలైన చిత్రం 'ఖామోష్ పానీ'లో ఆమె అద్భుతమైన నటనను కనబరిచింది. స్విట్జర్లాండ్లోని లోకర్నో ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ నటితో సహా ఈ చిత్రానికి కిరణ్ ఖేర్ అనేక అవార్డులను కూడా గెలుచుకున్నారు శ్వేతా తివారీ బాలీవుడ్ 'బిగ్ బాస్ 4' విజేత, ప్రసిద్ధ టీవీ షో 'కసౌతి జిందగీ కి' స్టార్ అయిన శ్వేతా తివారీ 2014లో విడుదలైన పాకిస్థానీ యాక్షన్ రొమాన్స్ చిత్రం 'సుల్తానాత్'లో పనిచేసింది ఈ హాట్ బ్యూటీ. ఇది పాకిస్థానీలో అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా ఇప్పటికీ చెప్పబడుతోంది. రూ. 22 కోట్ల బడ్జెట్తో అప్పట్లో ఈ సినిమాను నిర్మించారు. గతేడాది శ్వేతా తివారీ దేవుడిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. తాను నటిస్తున్న ఓ వెబ్ సిరీస్ వివరాలను వెల్లడిస్తూ తన లోదుస్తులకు, దేవుడికి ముడిపెడుతూ ఓ వ్యాఖ్య చేశారు. శ్వేత వ్యాఖ్యలు హిందూ దేవుళ్లను కించపరిచేలా ఉన్నాయంటూ నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో ఆమె క్షమాపణులు కూడా కోరింది. అమృత అరోరా ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ మలైకా అరోరా సోదరినే అమృతా అరోరా బాలీవుడ్లో నటిగా రాణించలేకపోయింది, అందుకే ఆమె హిందీ చిత్ర పరిశ్రమను విడిచిపెట్టింది. అయితే అమృత ఓ పాకిస్థానీ సినిమాలో పని చేసిందని తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. అమృతా అరోరా 'గాడ్ఫాదర్: ది లెజెండ్ కంటిన్యూస్' చిత్రంలో చిన్న పాత్రలో కనిపించింది. ఆ తర్వాత లండన్లో పుట్టి పెరిగిన పాకిస్తానీ ఉస్మాన్ అఫ్జల్ అనే క్రికెటర్తో డేటింగ్ చేసి 2009లో షకీల్ లడక్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. శిల్పా శుక్లా షారుఖ్ ఖాన్ బ్లాక్ బస్టర్ చిత్రం 'చక్ దే ఇండియా' సినిమాతో తనకు భారీగా గుర్తింపు దక్కింది. అప్పట్లో అందరి దృష్టిని ఆకర్షించిన శిల్పా శుక్లా పాకిస్థానీ సినిమాలో కూడా నటించింది. ఆమె పాకిస్థానీ చిత్రం 'ఖామోష్ పానీ'లో కిరోన్ ఖేర్తో కలిసి నటించింది. బాలీవుడ్లో చేసిన సినిమాలు తక్కువే అయినా 2014లో వచ్చిన B.A PASS సినిమాకు నేషనల్ అవార్డ్ను అందుకుంది. ఉత్తమ నటిగా రెండు ఫిల్మ్ఫేర్ అవార్డులను గెలుచుకుంది. -
పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ.. 72 గంటలే డెడ్ లైన్: స్టార్ హీరోయిన్
బాలీవుడ్ నటి నేహా ధూపియా బీ టౌన్లో పరిచయం అక్కర్లేని పేరు. 2002లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్ గెలుచుకున్న భామ ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో తరుణ్ హీరోగా నటించిన నిన్నే ఇష్టపడ్డాను చిత్రం ద్వారా పరిచయమైంది. ఆ తర్వాత బాలీవుడ్లో పలు చిత్రాల్లో కనిపించింది. తెలుగులో విలన్, పరమవీర చక్ర సినిమాల్లో కనిపించింది. గతేడాది ఏ థర్స్డే అనే చిత్రంలోనూ నటించింది. అయితే తాజాగా ఓ ఆన్ లైన్ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె తన పెళ్లికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. (ఇది చదవండి: రామ్ గోపాల్ వర్మ నన్ను మోసం చేశాడు: బాలీవుడ్ నటుడు) అయితే బాలీవుడ్ నటుడైన అంగద్ బేడీని మే 2018లో నేహా ధూపియా ప్రేమ పెళ్లి చేసుకున్నారు. కానీ పెళ్లయిన కొద్ది నెలలకే ఓ బిడ్డకు కూడా జన్మినిచ్చారు. దీంతో తమపై చాలా సార్లు ట్రోల్స్ వచ్చినా కూడా వాటిని పట్టించుకోలేదని తెలిపింది. అయితే ఈ విషయాన్ని పెళ్లికి ముందే తమ కుటుంబ సభ్యులకు చెప్పినట్లు వెల్లడించింది. (ఇది చదవండి: నాగార్జున మేనకోడలితో యంగ్ హీరో అడివి శేష్ పెళ్లి..!) 72 గంటల్లోనే పెళ్లి: నేహా గర్భం ధరించిన విషయం కుటుంబ సభ్యులకు తెలపడంతో పెళ్లికి కేవలం 72 గంటల సమయమే ఇచ్చారని నేహా తెలిపింది. దీంతో ముంబయిలో కేవలం సన్నిహితులు, బంధువుల సమక్షంలో పెళ్లి చేసుకున్నట్లు వివరించింది. అయితే ప్రెగ్నెన్నీ విషయం బయటకు చెప్పేందుకు తాము చాలా ఉద్వేగానికి లోనయ్యామని వివరించింది. కాగా.. 2018లో ఒక్కటైన ఈ జంటకు ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. -
మహిళల కోసం ఢిల్లీ కమిషన్ మెట్లెక్కిన హీరోయిన్లు
Yami Gautam Neha Dhupia Visit Delhi Commission For Women: బాలీవుడ్ ముద్దుగుమ్మ యామీ గౌతమ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. నితిన్ సరసన కొరియర్ బాయ్ కల్యాణ్, గౌరవం, నువ్విలా తదితర చిత్రాల్లో నటించి టాలీవుడ్ ఆడియెన్స్కు చేరువైంది. బీటౌన్లో మంచి గుర్తింపు పొందిన ఈ అమ్మడు తాజాగా నటించిన చిత్రం 'ఏ థర్స్డే' మంచి విజయాన్ని సాధించింది. ఇందులో లైంగిక వేధింపులకు గురైనా బాధితురాలి పాత్రలో నటించి ప్రేక్షకులతోపాటు విమిర్శకులను సైతం మెప్పించింది యామీ గౌతమ్. అంతేకాకుండా నిజ జీవితంలో కూడా అత్యాచార వేధింపులకు గురైన మహిళల భద్రత కోసం, వారికి పునరావాసం కల్పించేందుకు మజ్లీస్, పారి పీపుల్ ఎగైనెస్ట్ రేప్ ఇన్ ఇండియా అనే రెండు ఎన్జీవో సంస్థలతో కలిసి పనిచేస్తోంది. చదవండి: సినిమాలో ఆ పాత్ర.. ఇప్పుడు వారి కోసం రియల్ లైఫ్లో ఇలా ఈ క్రమంలోనే యామీ గౌతమ్ ఢిల్లీ మహిళా కమిషన్ కార్యాలయానికి వెళ్లింది. ఆమెతోపాటు సినిమాలోని తనతోపాటు నటించిన హీరోయిన్ నేహా ధూపియా కూడా ఉంది. వీరిద్దరూ కలిసి ఢిల్లీ మహిళా కమిషన్ను సందర్శించారు. కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్తోపాటు ఇతర అధికారులతో చర్చించారు. ఢిల్లీలో మహిళల భద్రత, భరోసా కోసం వారు చేపట్టిన వివిధ కార్యాక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా మహిళలపై హింసకు సంబంధించిన ఫిర్యాదులు నమోదు చేసేందుకు ఉన్న 181 హెల్ప్లైన్ నంబర్, దాని పనితీరు గురించి వివరంగా తెలుసుకున్నారు. చదవండి: అది యాక్సెప్ట్ చేయడానికి ఏళ్లు పట్టింది.. హీరోయిన్ ఎమోషనల్ పోస్ట్ ఈ హెల్ప్లైన్ ద్వారా ఫిర్యాదు అందిన వెంటనే సత్వర చర్యలు తీసుకునేందుకు పెట్రోల్ వ్యాన్లు పంపిస్తారని తెలిసి సంతోషం వ్యక్తం చేశారు. తన సినిమాలో చూపించినట్లు మహిళల భద్రత కోసం చేసిన కఠినమైన చర్యలు తీసుకోవడం ఆనందంగా ఉందని యామీ తెలిపారు. ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్, ఇతర అధికారులను కలవడం సంతోషంగా ఉందన్నారు. మహిళల భద్రత కోసం ఈ బృందం చూపిన చొరవపట్ల అభినందనలు తెలిపారు. ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో షేర్ చేశారు యామీ గౌతమ్. కాగా యామీ గౌతమ్, నేహా ధూపియా నటించిన 'ఏ థర్స్డే' చిత్రం ఫిబ్రవరి 17 నుంచి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్టీమింగ్ అవుతోంది. View this post on Instagram A post shared by Yami Gautam Dhar (@yamigautam) -
ప్రేమను నేర్పింది నువ్వేగా...మాటలే దొరకడం లేదు : నటి
సాక్షి, ముంబై: బాలీవుడ్ నటి నేహా ధూపియా, అంగద్ బేడీల మెహర్ కూతురు ఈ రోజుతో మూడేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నేహా ధూపియా తన కుమార్తె మెహర్కోసం ఒక అద్భుతమైన పోస్ట్ పెట్టింది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే నేహా మెహర్కు స్పెషల్గా శుభాకాంక్షలు తెలిపింది. (Nayanthara Birthday Special: డేరింగ్ అండ్ డాషింగ్ నయన్ ‘తార’) రెండవ బిడ్డ కడుపులో ఉండగా నేహా ధూపియా మెహర్తో కలిసివున్న తన ప్రసూతి ఫోటోషూట్ ఫోటోను పోస్ట్ చేస్తూ ఇలా తెలిపింది, " మూడేళ్ల క్రితం ఇదే రోజు ఉదయం 11.25 గంటలకు... నా శరీరానికి ఆవల నా గుండె కొట్టుకోవడం ప్రారంభించింది. నా బంగారు తల్లీ నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. ప్రేమ అంటే ఏమిటో నువ్వేగా మాకు నేర్పించావు. నువ్వొక అద్భుతానికి.. ఎప్పుడూ లేనిది, మాటలు రావడం లేదు అమ్మకు’’ . కాగా నేహా ధూపియా, అంగద్ బేడీ దంపతులకు 2018లో నవంబర్ 18న మెహర్ పుట్టింది. అలాగే ఈ ఏడాది అక్టోబర్ 3న తమ రెండవ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. నేహూ భర్త అంగద్ బేడి , పిల్లల చిత్రాలను సోషల్ మీడియాలో తరచుగా పోస్ట్ చేస్తూనే ఉంటుంది. తన కంటే 2 సంవత్సరాలు చిన్నవాడు, నటుడు అంగద్ బేడిని నేహా 2018లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Neha Dhupia (@nehadhupia) -
మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి
Neha Dhupia, Angad Bedi Blessed with Baby Boy: బాలీవుడ్ నటి నేహా ధూపియా ఆదివారం నాడు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ శుభవార్తను నేహా భర్త, నటుడు అంగద్ బేడీ ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. తల్లీబిడ్డలిద్దరూ క్షేమంగా ఉన్నారని తెలిపాడు. అయితే కొడుకు ఫొటోను మాత్రం రివీల్ చేయలేదు. రెండో బిడ్డకు జన్మనిచ్చిన నేహాకు ఆమె అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా మిన్నారం సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్గా కెరీర్ ఆరంభించిన నేహా తర్వాత జపనీస్ చిత్రంలో నటించింది. 2000 సంవత్సరంలో వచ్చిన 'నిన్నే ఇష్టపడ్డాను' చిత్రంతో టాలీవుడ్లో లక్ పరీక్షించుకుంది. అదే ఏడాది 'ఖయామత్: సిటీ అండర్ త్రెట్' చిత్రంతో బాలీవుడ్లోకి అడుగు పెట్టింది. తర్వాత “క్యా కూల్ హై హమ్”, “షూట్ అవుట్ లోఖండ్వాలా” వంటి హిట్ చిత్రాల్లో నటించింది. తెలుగులో నిన్నే ఇష్టపడ్డాను తర్వాత విలన్, పరమవీర చక్ర వంటి సినిమాల్లోనూ నటించింది. 2018 మేలో నటుడు, మోడల్ అంగద్ బేడీని పెళ్లి చేసుకోగా అదే సంవత్సరం నవంబర్లో మెహర్ అనే బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by ANGAD BEDI (@angadbedi) -
ప్రెగ్నెన్సీ వల్ల.. మూవీస్ నుంచి తొలగించారు
బాలీవుడ్ ఇండస్ట్రీలోని హ్యాపీ కపుల్స్లో నేహా ధూపియా, అంగద్ బేడి జంట ఒకటి. ఇద్దరూ యాక్టర్స్గా తమ కెరీర్ని సక్సెస్పుల్గా కొనసాగిస్తూనే వ్యక్తిగత జీవితాన్ని కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ దంపతులకు ఇప్పటికే మెహర్ అనే కూతురు ఉండగా, నేహా మరోసారి ప్రెగ్నెన్సీతో ఉంది. ఈ విషయాన్ని ఇటీవలే సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది ఈ జంట. అయితే ఇటీవల ఓ ఇంటర్వూలో అంగద్ మాట్లాడుతూ.. పెళ్లి తర్వాత తాము ఎదుర్కొన్న ఇబ్బందులను పంచుకున్నాడు. ‘నేహా రెండో సారి ప్రెగ్నెంట్ కావడంతో అనేక ప్రాజెక్టులను కొల్పోవాల్సి వచ్చింది. ఎవరు కూడా తనని అలాగే కొనసాగించడానికి ఇష్టపడలేదు. నా పరిస్థితి కూడా అందుకు భిన్నంగా ఏం లేదు. అనేక ప్రాజెక్టుల నుంచి తప్పించారు. ఈ ఇండస్ట్రీలో మనం చాలా ఏళ్లు ఉంటాం. అందువల్ల అవన్నీ మరిచిపోయి జీవితంలో ముందుకు సాగిపోవాలి. అలా నన్ను తీసేసిన తర్వాత అంతకంటే మంచి మనుషులు, క్రేజీ ప్రాజెక్టులలో పని చేసే అవకాశం లభించింది. అదే జీవితం అంటే’ అని అంగద్ తెలిపాడు. అయితే ప్రెగ్నెన్సీ మూలంగా ఎంతోమంది నేహాని సినిమాల నుంచి తీసేసినా, ఆమె ప్రస్తుతం చేస్తున్న చిత్రం గురువారం డెరెక్టర్ బెహజాద్ ఖంబాట స్క్రీన్పై గర్భిణి పోలీసుగా తెరపై చూపించడానికి స్క్రిప్ట్లో మార్పులు చేశాడని సంతోషం వ్యక్తం చేశాడు. చదవండి: నేను కరీనాకు ఏ విషయంలోనూ సలహాలు ఇవ్వను: సైఫ్ అలీ ఖాన్ View this post on Instagram A post shared by ANGAD BEDI (@angadbedi) -
బేబీ బంప్తో నటి.. ఫోటో వైరల్
ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ నేహా ధూపియా రెండోసారి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా నేహా ధూపియా దంపతులు వెల్లడించారు. బేబీ బంప్తో ఫోటోలను షేర్ చేస్తూ...'మంచి క్యాప్షన్తో రావడానికి రెండు రోజులు పట్టింది. మేం ఆలోచించిన వాటిలో ఉత్తమమైంది ఇదే.. థ్యాంక్యూ గాడ్' అంటూ ఫ్యామిలీ ఫోటోను షేర్ చేశారు. నేహా ధూపియా పోస్ట్పై పలువురు ప్రముఖులు సహా నెటిజన్లు అభినందనలు తెలియజేస్తున్నారు. ఇక నేహా ధూపియా.. నటుడు, మోడల్ అడంగ్ సింగ్ బేడీ అనే వ్యక్తిని 2018 మేలో పెళ్లి చేసుకోగా అదే సంవత్సరం నవంబర్లో మెహర్ అనే బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. 'మిస్ ఇండియా: ది మిస్టరీ' అనే మూవీతో బాలీవుడ్లోకి అడుగుపెట్టిన నేహా ధూపియా “క్యా కూల్ హై హమ్”, “షూట్ అవుట్ లోఖండ్వాలా” వంటి హిట్ చిత్రాల్లో నటించింది. తెలుగులోనూ నిన్నే ఇష్టపడ్డాను,విలన్, పరమవీర చక్ర వంటి చిత్రాల్లోనూ నటించింది. View this post on Instagram A post shared by Neha Dhupia (@nehadhupia) -
వైరల్: కన్నీరు పెట్టిస్తున్న రాజ్ కౌశల్ చివరి పోస్ట్
ప్రముఖ నటి, యాంకర్ మందిరా బేడి భర్త, నిర్మాత రాజ్ కౌశల్ ఇవాళ గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. దీంతో బాలీవుడ్ ప్రముఖులు, సినీ నటీనటులు ఆయన మృతికి నివాళులు అర్పిస్తున్నారు. ఈ క్రమంలో రాజ్ కౌశల్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన చివరి పోస్టు వైరల్గా మారింది. ఈ ఆదివారం వీకెండ్ సందర్భంగా ఆయన స్నేహితులు, భార్య మందిర బేడీతో సందడి చేసినట్లు కౌశల్ తన చివరి పోస్టులో రాసుకొచ్చారు. ఇది చూసి ఆయన ఫాలోవర్స్, స్నేహితులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కాగా గత ఆదివారం మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ ఆయన భార్య సాగరిక ఘాట్కే, నటి నేహా దూపియా, అంగద్ బేడి, భార్య మందిరా బేడిలతో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేస్తూ ‘సూపర్ సండే, సూపర్ ఫ్రెండ్స్, సూపర్ ఫన్’ అంటూ షేర్ చేశారు. అది చూసి ‘మూడు రోజుల క్రితమే స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడిపిన కౌశల్ ఇలా మృత్యువాత పడటం తీవ్రం కలచివేస్తోంది’, ‘ఇదే ఆయన చివరి పోస్టు అని తలచుకుంటే కన్నీరు ఆగడం లేదు’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇదే ఫొటోను నేహా దూపియా షేర్ చేస్తూ భావోద్యేగానికి లోనయ్యారు. View this post on Instagram A post shared by Raj Kaushal (@rajkaushal) ‘రాజ్ ఈ ఫొటోను మనం ఎప్పటికి గుర్తుండిపోయే జ్ఞాపకం గుర్తుగా తీసుకున్నాము. కానీ నువ్వు మా మధ్య ఎప్పటికి ఉండవనే విషయాన్ని నమ్మలేకపోతున్నా’ అంటూ మై స్ట్రాంగ్ లేడీ, ఈ సమయంలో నిన్ను ఓదార్చడానికి నాకు మాటలు రావడం లేదంటూ మందిరా, ఆమె కుమారుడు వీర్, కూతురు తారాలను ఉద్దేశిస్తూ తన పోస్టులో రాసుకొచ్చారు. అదే విధంగా రాజ్ కౌశల్ తన కుమారుడు వీర్, కూతురు తారాలతో పాటు మిగిలిన కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేసిన కౌశల్ పోస్టులు కూడా ఈ సందర్భంగా వైరల్ అవుతున్నాయి. View this post on Instagram A post shared by Neha Dhupia (@nehadhupia) చదవండి: Mandira Bedi: ప్రముఖ నటి మందిరా బేడి భర్త కన్నుమూత -
హీరోయిన్స్కు పోటీ ఇస్తాడన్నారు: నటుడు
‘‘నిజానికి చిన్నపుడు నేను చాలా డ్యాన్స్ చేసేవాడిని. ఐటం సాంగ్స్కి కూడా నర్తించేవాడిని. అందరూ నా డాన్స్ను మెచ్చుకునేవాళ్లు. ఊళ్లో నాటకాలు వేసే సమయంలో ఎక్కువగా ఆడ వేషాలు వేసేవాడిని. ఇదంతా చూసిన మా ఊరి పెద్దాయన ఒకరు.. ‘‘ఇదిగో ఈ అబ్బాయి ముంబైకి వెళ్తే.. టాప్ హీరోయిన్లను సైతం వెనక్కి నెట్టేస్తాడు’’అని తరచూ అంటూ ఉండేవారు’’అంటూ బాలీవుడ్ నటుడు పంకజ్ త్రిపాఠి తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు. తాను కచ్చితంగా హిందీ చిత్రసీమలో ప్రవేశిస్తానని అందరూ అనుకునే వారని, కానీ తాను మాత్రం ఎన్నడూ నటుడిని అవుతానని ఊహించలేదని చెప్పుకొచ్చాడు.(చదవండి: దీపికను వెనక్కి నెట్టిన శ్రద్ధా కపూర్!) బరేలీ కీ బర్పీ, న్యూటన్, గుంజన్ సక్సేనా వంటి ఇటీవల విడుదలైన సినిమాలతో పాటు, సాక్రెడ్ గేమ్స్, మీర్జాపూర్ వంటి వెబ్సిరీస్లతో గుర్తింపు పొందాడు పంకజ్ త్రిపాఠి. నటి నేహా దుఫియా నిర్వహిస్తున్న ‘‘నో ఫిల్టర్ నేహా’’ చాట్ షోలో పాల్గొన్న అతడు తమ మనసులోని భావాలు పంచుకున్నాడు. ‘‘మా గ్రామంలో నాటకాలు వేసేవాళ్లం. పదో తరగతి చదువుతున్న సమయంలో తొలిసారి అమ్మాయి వేషం వేశాను. అప్పటి వరకు ఆ పాత్ర పోషించిన అబ్బాయి ఒకరు సిటీకి వెళ్లి తిరిగి రాలేదు. దాంతో నాటకం ఆగిపోయే పరిస్థితి వచ్చింది. కానీ అలా జరగడం నాకు ఇష్టం లేదు. అందుకే నేనే ముందుకొచ్చి.. ఆ వేషం వేస్తా అనగానే అందరూ ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా మా డైరెక్టర్ రాఘవ్ చాచా అయితే, నాన్న దగ్గరికి వెళ్లి అనుమతి తీసుకున్న తర్వాతే వేషం ఇస్తా అన్నారు. కోపంతో లాఠీ పట్టుకుని నా వీపు విమానం మోగిస్తారేమో అని భయపడ్డా. కానీ నాన్న అభ్యంతరం చెప్పలేదు. నాకు నచ్చిన పనిచేసే స్వేచ్చ ఉందన్నారు. తర్వాత నేను ఎన్నో నాటకాల్లో భాగస్వామ్యమయ్యాను. కానీ ముంబైకి వస్తానని, బాలీవుడ్లో నటుడిగా స్థిరపడతానని ఎన్నడూ అనుకోలేదు. అప్పుడు సరదా కోసం చేసి నటన, ఇప్పుడు జీవితంగా మారింది’’అని పంకజ్ పేర్కొన్నాడు. ఇప్పుడు తనకున్న ఆర్థిక పరిస్థితితో సంతృప్తికరంగా ఉన్నానని, ఇకపై ఎండార్స్మెంట్లు, సినిమా ఆఫర్లు రాకపోయినా పెద్దగా బాధపడనని చెప్పుకొచ్చాడు. ఇక మంచు విష్ణు దూసుకెళ్తా సినిమాలో విలన్గా పంకజ్ త్రిపాఠి తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువైన సంగతి తెలిసిందే. -
‘పని మీద దృష్టి పెట్టండి. పురుషుల మీద కాదు’
ముంబై : నటి నీనా గుప్తా పేరు ప్రస్తుతం సోషల్ మీడియా ట్రెండ్ అవుతున్నారు. నేహా ధుపియా నిర్వహిస్తున్న టెలివిజన్ ‘నో ఫిల్టర్ నేహా’ షోలో ఇటీవల నీనా గుప్తా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒకవేళ మీరు యుక్త వయస్సులో ఉంటే మీకు మీరు ఇచ్చుకునే సలహా ఏంటని నేహా ప్రశ్నించగా... దీనిపై స్పందించిన నీనా ‘పని మీద దృష్టి పెట్టండి. పురుషుల మీద కాదు’ అంటూ సమాధానమిచ్చారు. అయితే నీనా ఇలా చెప్పడం మొదటి సారి కాదు. తన జీవితంలో ఎదురైన అనుభవాల నుంచి నేర్చుకున్న గుణపాఠాన్ని తరచూ అభిమానులతో పంచుకుంటారన్న విషయం తెలిసిందే. యువత సరైన దారిలో ఎలా నడుచుకోవాలో కూడా సందేశాలు ఇస్తూ ఉంటారు. (వివాహితుడిని ప్రేమించకండి: నటి) కాగా నేహా ధూపియా షో ఐదో సీజన్ త్వరలో ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించిన ప్రోమోను మంగళవారం విడుదల చేశారు. ఈ ప్రోమోలో నీనా గుప్తాతోపాటు, రానా దగ్గుబాటి, కపిల్ దేవ్, రాహుల్ ద్రవిడ్ సైఫ్ అలీఖాన్, సోనూసూద్, అదితి రావ్ వంటి ప్రముఖులను కూడా ఇంటర్య్వూ చేస్తున్నట్లు కన్పిస్తోంది. ఈ షో ఆగస్ట్ 28న ప్రారంభం కాబోతుంది. (విడాకుల విషయం విని కుప్పకూలిపోయా..) View this post on Instagram 5 years of unfiltered fun. 5 years of your favorite celebrity talkshow! #NoFilterNeha Season 5 at Home Edition is finally here! Join us every week as we bring down the roof - of our very own homes, of course! Premiering exclusively on @JioSaavn Pro, co-produced by @wearebiggirl A post shared by Neha Dhupia (@nehadhupia) on Aug 25, 2020 at 12:51am PDT వెస్టిండీస్ క్రికెటర్, వివాహితుడైన వివియన్ రిచర్డ్స్ను ప్రేమించిన నీనా గుప్తా... పెళ్లి కాకుండానే 1989లో కూతురికి జన్మనిచ్చారు. ఆమే ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మసాబా గుప్తా. కూతురికి జన్మనిచ్చిన తర్వాత వివియన్ రిచర్డ్స్, నీనా విడిపోయారు. అనంతరం నీనా గుప్తా వేరే వ్యక్తినిపెళ్లి చేసుకున్నారు. బదా యీ హో, సర్వమంగళ్ జ్యాదా సావధాన్ సినిమాలలో ఇటీవల తెరపై కనిపించిన ఆమె బాలీవుడ్లో వరుస అవకాశాలు దక్కించుకుంటున్నారు. -
నా ఐదుగురు బాయ్ ఫ్రెండ్స్ అతనే..
లాక్డౌన్ వేళ సినీ ప్రముఖులు ఇళ్లకే పరిమితమయ్యారు. ఇక రోజువారి తమ వ్యక్తిగత, వృత్తికి సంబంధించిన విషయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ అభిమానులను అలరిస్తున్నారు. దీనిలో భాగంగానే సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే బాలీవుడ్ నటీ నేహా ధుపియా మే10 (ఆదివారం) మదర్స్ డే సందర్భంగా తన భర్త అంగద్ బేడీతో దిగిన ఫొటోలను ట్విటర్లో పోస్ట్ చేశారు. ‘హ్యాపీ యానివర్సరీ మై లవ్.. మనం ఒకటై రెండేళ్లు అవుతోంది. అంగద్.. నా జీవితానికి ప్రేమ ఇచ్చిన వ్యక్తి . నాకు ఎల్లప్పుడూ మద్దతుగా నిలుస్తాడు. మంచి తండ్రిగా ఉంటారు. నాకు ఆత్మీయ స్నేహితుడు. ఎప్పుడూ నాకు కోపం తెప్పించే సహచరి. ఇలా ఐదుగురు బాయ్ ఫ్రెండ్స్ను అతనిలో నేను కలిగి ఉన్నాను. అది నా ఎంపిక’ అంటూ ఆమె కామెంట్ చేశారు. ‘ఎల్లప్పుడూ నిన్ను ప్రేమిస్తాను’ అంటూ నేహా భర్త అంగద్ రిప్లే ఇచ్చాడు. Happy anniversary my love ... to two years of togetherness 💕... "Angad is like 1. The love of my life 2. a suport system 3. a great father,4. My best friend and 5. The most annoying roommate ever. It's like I have 5 bfs in one...it's my choice." #thosewhoknowknow @Imangadbedi pic.twitter.com/dmlZFW0IZ0 — Neha Dhupia (@NehaDhupia) May 10, 2020 ప్రస్తుతం ఆమె పోస్ట్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక వీరిద్దరూ 2018లో వివాహం చేసుకుని ఒకటయ్యారు. ఈ జంట ఓ పాపకు జన్మనిచ్చింది. అదేవిధంగా భర్త అంగద్ తనతో సరదాగా గొడవ పడ్డా.. ఒకరినొకరం అర్థం చేసుకుంటామని ఆమె తెలిపారు. అంగద్ చాలా సరదాగా ఉండే వ్యక్తి అని, పలు సందర్భాల్లో తన ఊహకు అందనంత ఫన్గా ఉంటారని నేహా చెప్పుకొచ్చారు. మదర్స్ డే రోజే నేహా, అంగద్ జంట రెండవ వివాహ వార్షికోత్సవం కావటం విశేషం. -
ఇదిగో నా ఐదుగురు గర్ల్ఫ్రెండ్స్: నటుడు
ముంబై: ట్రోలింగ్ బారిన పడిన తన భార్య నేహా ధుపియాకు నటుడు అంగద్ బేడీ అండగా నిలబడ్డాడు. ‘‘నా మాటలు వినండి... ఇదిగో నా ఐదుగురు గర్ల్ఫ్రెండ్స్!’’ అంటూ నేహాతో ఉన్న ఫొటోలు షేర్ చేసి ట్రోల్స్కు ఘాటు కౌంటర్ ఇచ్చాడు. ప్రముఖ రియాలిటీ షో రోడీస్ రెవల్యూషన్లో లీడర్గా వ్యవహరిస్తున్న నేహా ధుపియా.. ఓ వ్యక్తిపై ఫైర్ అయిన సంగతి తెలిసిందే. తన గర్ల్ఫ్రెండ్ను చెంపదెబ్బ కొట్టానన్న అతడి మాటలకు స్పందించిన నేహా.. అమ్మాయిని కొట్టడం తప్పని పేర్కొన్నారు. అయితే ఆమె తనను మోసం చేసిందని.. ఐదుగురు అబ్బాయిలతో సంబంధం పెట్టుకున్నందు వల్లే ఈ విధంగా చేశానని అతడు వివరణ ఇచ్చాడు. అయినప్పటికీ అతడు చేసింది ముమ్మాటికీ తప్పేనని నేహా మండిపడ్డారు. ఈ నేపథ్యంలో.. ‘‘నేహా.. ఫేక్ ఫెమినిస్ట్, అనైతిక సంబంధాలను ప్రోత్సహిస్తోంది’’ అంటూ నెటిజన్లు ఆమెపై ట్రోలింగ్కు దిగారు.(నటిపై ఫైర్ అవుతున్న నెటిజన్లు!) ఈ క్రమంలో తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారంటూ నేహా ఆదివారం ఓ లేఖ విడుదల చేశారు. మోసం చేసేవాళ్లను తనెప్పుడూ సపోర్టు చేయనని, మహిళల భద్రత గురించి మాత్రమే నేను మాట్లాడానని పేర్కొన్నారు. నిజం వైపే నిలబడతానని, ఏదేమైనా శారీరక హింస, దాడి ఆమోదించదగ్గ విషయం కాదని అభిప్రాయపడ్డారు. ఇక ఆమె భర్త అంగద్ బేడీ సైతం నేహాతో ఉన్న ఐదు ఫొటోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసి తనకు మద్దతుగా నిలిచాడు. కాగా అంగద్- నేహా 2018లో వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. వీరికి ఓ పాప సంతానం. View this post on Instagram Sun MERI baat.. here are my 5 girlfriends!!!! Ukhad lo jo ukhad na hai!!!! @nehadhupia ✊️✊️ #itsmychoice A post shared by Angad Bedi “ARVIND VASHISHTHH” (@angadbedi) on Mar 15, 2020 at 10:00pm PDT -
నటిపై ఫైర్ అవుతున్న నెటిజన్లు!
బాలీవుడ్ నటి నేహా ధూపియాపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఓ షోలో తను చేసిన వ్యాఖ్యలకుగాను సోషల్ మీడియాలో ఆమెపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా యువతే లక్ష్యంగా ఓ ఛానల్ ‘రోడీస్ రెవల్యూషన్’ అనే రియాలిటి షోను నిర్వహిస్తోంది. ఈ షోలో మొత్తం అయిదుగురు గ్యాంగ్ లీడర్లలో ఒకరైన నేహా ధుపియా.. యువ గ్యాంగ్కు లీడర్గా వ్యవహరిస్తున్నారు. ఈ షోకు సంబంధించిన ప్రోమోను సంబంధిత ఛానల్ గురువారం విడుదల చేసింది. ఈ ప్రోమోలో ఓ యువకుడు తనను మోసం చేసిన తన గర్ల్ఫ్రెండ్ను చెంపదెబ్బ కొట్టినట్లు వెల్లడించాడు. తనతో ప్రేమలో ఉన్న సమయంలో ఒకేసారి మరో అయిదుగురు అబ్బాయిలతో సంబంధం పెట్టుకుందని.. అందుకే తనని చెంపదెబ్బ కొట్టానని చెప్పాడు.(‘అలాంటి వారు వస్తే... కంగనా నటన వదిలేస్తుంది’) ఆకలిగా ఉందన్నా పట్టించుకోలేదు: నటి #fakefeminism Memers To #NehaDhupia pic.twitter.com/4dSMVblp6Q — Shalini Shukla (@ShaliniShukla_) March 12, 2020 ఈ విషయంపై స్పందించిన నేహా.. ‘‘నువ్వు అలా చేయడం సరైనది కాదు. అమ్మాయి అయిదుగురు అబ్బాయిలతో కలిసి ఉండటం అనేది తన ఇష్టానికి సంబంధించిన విషయం’’ అంటూ సదరు యువకుడిపై విరుచుకుపడ్డారు. దీంతో నేహా వ్యాఖ్యలపై మండిపడుతూ నెటిజన్లు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. తనపై మీమ్స్ క్రియేట్ చేస్తూ.. ఆమె ‘ఫేక్ ఫెమినిస్ట్’ అని ట్విటర్లో షేర్ చేస్తున్నారు. అదే విధంగా.. ‘నేహా అదే తప్పునకు అయిదుగురు అబ్బాయిలను కొట్టినప్పుడు ఒకలా రియాక్ట్ అవుతారు... అదే తప్పు చేసిన ఒక అమ్మాయిని కొట్టినప్పుడు మరోలా స్పందిస్తూ.. లింగ భేదం చూపిస్తున్నారు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేగాక తను మాటలను అదుపులో పెట్టుకోకపోతే విపరీతమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇక రోడీస్ షోలో నేహాతో పాటు రణ్విజయ్ సింఘా, ప్రిన్స్ నరులా, రాఫ్తార్తో పాటు నిఖిల్లు లీడర్లుగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ షో గత నెలలో ప్రారంభమైంది. Shame on people like @NehaDhupia, who show such double faces on equality !! https://t.co/z6XWMOFHIj — Baibhab Chakraborty (@Im_baibhab) March 12, 2020 -
షార్ట్ అండ్ స్ట్రాంగ్!
గాయనిగా, నటిగా, నిర్మాతగా, వ్యాఖ్యాతగా, సంగీత దర్శకురాలిగా తనలోని విభిన్నమైన కోణాలను ప్రేక్షకులకు చూపించారు శ్రుతీహాసన్. ఇప్పుడు మరో మీడియమ్లోకి అడుగుపెడుతున్నట్టు తెలిసింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేసిన శ్రుతీహాసన్ తాజాగా ఓ షార్ట్ ఫిల్మ్లో నటిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ నటీమణులు కాజోల్, నేహా ధూపియా, నీనా కులకర్ణి అలాగే ముక్తా బావ్రే, రామా జోషీ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ప్రియాంకా బెనర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ షార్ట్ ఫిల్మ్కు ‘దేవి’ అని టైటిల్ పెట్టారు. శక్తిమంతమైన సందేశంతో షార్ట్ అండ్ స్ట్రాంగ్గా ఈ షార్ట్ ఫిల్మ్ రూపొందుతోందని సమాచారం. ‘‘నా తొలి షార్ట్ ఫిల్మ్ను ఇంత మంది ప్రతిభ కలిగిన నటీమణులతో కలసి చేయడం చాలా ఆనందంగా ఉంది’’ అని పేర్కొన్నారు శ్రుతీహాసన్. -
ప్రేమ దొంగ
ప్రేమించినవాళ్ల కోసం చిన్నచిన్న దొంగతనాలు చేసిపెట్టడం అబ్బాయిలకు మామూలే. యంగ్హీరో ఇషాన్ ఖట్టెర్ కూడా శ్రీదేవిగారి అమ్మాయి జాహ్నవికోసం చిన్నపాటి దొంగతనం చేశాడు. అయితే ఆమె మీద ప్రేమతో ఆ దొంగతనం చేశాడా, లేక.. తన దొంగతనాన్ని గులాబీ పువ్వులా ఆమెకు అందజే సి ఇన్డైరెక్టుగా తన ప్రేమను జాహ్నవికి చెప్పాలనుకున్నాడా అన్నది తెలీదు. నటి నేహా ధుపియా చాట్ షోలో ఇషాన్ ఈ సంగతి చెప్పాడు. సినిమా షూట్ కోసం ఒమన్ వెళ్లినప్పుడు అక్కడి హోటల్లో కనిపించిన ఒక అందమైన దిండును దొంగిలించి ఎవరికీ కనిపించకుండా ప్యాక్ చేసి జాహ్నవికి గిఫ్టుగా ఇచ్చాడట. ‘‘ఎందుకు చేశావ్ ఆ పని!’’ అని నేహ అడిగితే.. ‘‘తను చెయ్యలేదుగా..’’అని చాట్ షోలో కూర్చొని ఉన్న జాహ్నవి వైపు చూసి నవ్వాడు. ‘‘సారా అలీఖాన్, జాహ్నవీ.. వీళ్లిద్దరిలో నీకు ఎవరి యాక్టింగ్ ఇష్టం?’’ అని నేహ ఇంకో ప్రశ్న అడిగింది. సారా అక్కడే ఉంది. అయినా.. ‘‘జాహ్నవి’’ అనే చెప్పాడు ‘‘జాహ్నవి యాక్టింగ్ ఇష్టమా? జాహ్నవి ఇష్టమా?’’ అని నేహ ఇంకో ప్రశ్నేమీ వెయ్యలే దు. అప్పటికే కుర్రాడు తడబడుతున్నాడు మరి. జాహ్నవి తొలి చిత్రం ‘ధడక్’లో హీరో అతడే. తాకితే చాలు పిల్లల్తో పాటు ఒక పిల్లీ ఇంట్లో ఉంటే భలే సందడిగా ఉంటుంది. అయితే ముద్దొచ్చిప్పుడే దాన్ని చేతుల్లోకి తీసుకుందామంటే ఒప్పుకోదు. తనకు ఇష్టమైనప్పుడు కూడా మనకు ముద్దు రావాలి. మామూలు పిల్లులతో ఇది అయ్యే పనేనా! అందుకే ‘ఎలిఫెంట్ రోబోటిక్స్’ అనే చైనా స్టార్టప్ కంపెనీ ఓ పిల్లి రోబోను తయారు చేసింది. దానికి ‘మార్స్ క్యాట్’ అని పేరు పెట్టి.. ప్రస్తుతం లాస్వెగాస్లో జరుగుతున్న కన్సూ్యమర్ ఎలక్ట్రానిక్ షోలో ప్రదర్శిస్తోంది. ‘రన్’ అంటే పరుగెత్తడం, ‘కమ్ íß యర్’ అంటే దగ్గరకు రావడం.. ఇవి మాత్రమే ఆ పిల్లి రోబో ప్రత్యేకతలు కాదు. పక్కింట్లోంచి చుట్టపు చూపుగా వచ్చి వెళుతుండే నిజమైన పిల్లులతోటీ ‘మ్యావ్ మ్యావ్’మంటూ మాటలు కలుపుతుంది. వాటితో కలిసి ఆడుతుంది. బొమ్మల్తో కూడా బొమ్మలా కలిసిపోతుంది. ఇవన్నీ కూడా మనం కమాండ్స్ ఇవ్వకుండానే! అది యాక్టివేట్ అవడానికి చిన్న టచ్ చాలు. ముందు ముందు ఈ పిల్లిరోబో యజమానులు (రోబోను కొనుక్కున్నవారు) ఇచ్చే సూచనలు, సలహాలతో మార్స్ క్యాట్ని మరింత ఇంటెలిజెంట్ ఫోలోని చేయబోతున్నాం అని కంపెనీ వాళ్లు చెబుతున్నారు. -
ఆకలిగా ఉందన్నా పట్టించుకోలేదు: నటి
బాలీవుడ్ ప్రముఖ నటి నేహా ధూపియా దక్షిణాది చిత్ర పరిశ్రమ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ హీరోలకే తొలి ప్రాధాన్యమని, హీరోయిన్లను చిన్నచూపు చూస్తారని పేర్కొన్నారు. తాజాగా ఓ షోకు హాజరైన ఆమె దక్షిణాదిలో హీరోయిన్లపై వివక్ష ఉందన్న విషయాన్ని అనుభవంతో సహా చెప్పుకొచ్చారు. ‘చాలాకాలం క్రితం జరిగిన సంఘటన ఇది. నేను ఓ దక్షిణాది సినిమా చేస్తున్నాను. ఓ రోజు షూటింగ్ చేస్తున్న సమయంలో నాకు ఆకలి వేసింది. దీంతో అక్కడున్న వారికి ఆహారం సిద్ధం చేయమని చెప్పాను. కానీ వాళ్లు ముందు హీరోకు పెట్టాలని చెప్పారు. నాకు ఆకలిగా ఉందని చెప్పినా కూడా పట్టించుకోలేదు. ముందు హీరో తిన్న తర్వాతే నాకు తిండి పెడతామన్నారు.’ ‘థ్యాంక్ గాడ్.. ఇలాంటి అనుభవం మళ్లీ నాకు ఎదురుకాలేదు. అయితే ఈ విషయంపై నాకు ఏమాత్రం కోపం రాలేదు. పైగా నవ్వుకున్నాను కూడా’ అని నేహా ధూపియా చెప్పుకొచ్చారు. ‘నిన్నే ఇష్టపడ్డాను’ చిత్రంతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన నేహా తెలుగులో చివరగా నందమూరి బాలకృష్ణ నటించిన ‘పరమ వీర చక్ర’ సినిమాలో కనిపించారు. 2018లో తన స్నేహితుడు, నటుడు అంగద్ బేడీని వివాహమాడారు. వీరికి మెహర్ అనే కూతురు ఉంది. కాగా నేహా ధూపియా ప్రస్తుతం బుల్లితెరలో వస్తున్న ప్రముఖ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. -
‘తల్లి అయ్యాక ఛాన్సులు రాలేదు: హీరోయిన్
దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెత సినిమా వాళ్లకు సరిగా సరిపోతుందేమో. ముఖ్యంగా హీరోయిన్ల పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. అందుకే కెరీర్ సక్సెస్ ఫుల్గా ఉన్నప్పుడే వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటారు. పొరపాటున పెళ్లి అయితే హిట్ మాట అటుంచితే అసలు అవకాశాలు దక్కవు అనడంతో సందేహం లేదు. అదే మరి ఓ బిడ్డకు జన్మనిచ్చాక వారి పరిస్థితి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమా ఛాన్సులు ఆ నటీమణుల దరిదాపుల్లో కనిపించవు. ప్రస్తుతం అదే సమస్యను ఎదుర్కొంటున్నారు బాలీవుడ్ నటి నేహా ధూపియా. బీఎఫ్ఎఫ్ విత్ వోఘ్ షోతో పేరు పొందిన నేహా.. తన బిడ్డకు జన్మనిచ్చాక ఎలాంటి సినిమా అవకాశాలు రాలేదని వాపోయారు. చివరగా నటించిన ‘తుమ్హారీ సులు’కు ప్రశంసలు, అవార్డులు సొంతం చేసుకున్నప్పటికీ సినిమా ఛాన్సులు రాలేదని ఆమె స్పష్టం చేశారు. బాలీవుడ్ నటుడు అంగద్ బేడిని పెళ్లాడిన నేహాకు 2018లో పాప పుట్టిన విషయం తెలిసిందే. గత వారమే ముద్దుల తనయ మోహర్ పుట్టిన రోజున అమృత్సర్లోని స్వర్ణ దేవాలయాన్ని సందర్శించి ఆశీర్వాదాలు తీసుకున్నారు. తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘ప్రెగ్నెన్సీ సమయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాను. అయితే ఆ సమయంలో అనేక పత్రికలు నన్ను ట్రోల్ చేస్తూ తప్పుగా వార్తలు రాశాయి. అలాంటి వార్తలు రాయడం సరికాదు. అవును నేను ఓ బిడ్డకు జన్మనిచ్చాను. అప్పటి నుంచి నాకు ఎలాంటి సినిమా అవకాశాలు రాలేదు. ప్రసవానంతరం ప్రతి ఒక్కరు బరువు తగ్గాలని నేను అనడం లేదు. ఎవరి ప్రత్యేకత వారికీ ఉంటుంది. ప్రస్తుతం వెబ్ షో కోసం చర్చలు జరుపుతున్నాను. చూద్దాం.. ఇకనైనా పరిస్థితి ఎలా ఉంటుందో’ అంటూ తన మనసులోని మాటను బయటపెట్టారు. -
దయచేసి వాళ్లను సిగ్గుపడేలా చేయకండి..!
తన గారాల పట్టి నైరాకు పాలు పడుతూ మాతృత్వపు మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నారు నటి సమీరారెడ్డి. రెండోసారి గర్భం దాల్చిన నాటి నుంచి తన ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు ఆమె. గర్భిణిగా ఉన్నపుడు, ప్రసవం తర్వాత ఎదురయ్యే ఇబ్బందులు, శరీరాకృతి గురించి ఆందోళన చెందకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని మహిళల్లో స్ఫూర్తి నింపారు. ప్రస్తుతం ప్రపంచ తల్లిపాల వారోత్సవం(ఆగష్టు 1-7)సందర్భంగా తల్లిపాల ఆవశ్యకతను వివరిస్తూ, అటువంటి సమయంలో భర్తలు... ఏవిధంగా అండగా ఉండాలో సూచిస్తూ సమీరా పెట్టిన పోస్టు నెటిజన్లను హత్తుకుంటోంది. ‘అమ్మ’ పై ప్రేమ, గౌరవం చూపండి! ‘ కొత్తగా తండ్రులైనవారు, ప్రియమైన నా వాళ్లందరూ ఈ విషయాన్ని శ్రద్ధగా గమనించండి! ప్రపంచ తల్లిపాల వారోత్సవం సందర్భంగా మీకో విషయం చెప్పదలచుకున్నాను. కొత్తగా బిడ్డకు జన్మనిచ్చిన తల్లులకు మీ అండ అవసరం. గర్భిణిగా ఉన్నప్పుడు, ప్రసవం తర్వాత మహిళల్లో ఒక రకమైన ఒత్తిడి, భయం నెలకొంటాయి. వారు ఆత్మవిశ్వాసంతో ఉండలేరు. ఇవన్నీ పరోక్షంగా వారి ఆరోగ్యంపై.. ముఖ్యంగా చనుబాలపై ప్రభావం చూపుతాయి. బిడ్డతో వ్యవహరించే తీరులో మార్పునకు కారణమవుతాయి. కాబట్టి పాల ఉత్పత్తి తగ్గిపోయి శిశువు ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఇటువంటి సమయాల్లో మీ సహకారం ఆమెకు అవసరం. మీ ప్రేమతో ఆ ఒత్తిడిని, భయాలను దూరం చేయండి. ఇక ఇంకో విషయం బిడ్డకు చనుబాలు పట్టే తల్లులను హేళనగా చూస్తూ వాళ్లను సిగ్గుతో బిగుసుకుపోయేలా చేయకండి. తల్లులూ మీరూ వినండి. పాలు పడటం లేదని ఆందోళన చెందకండి. పాలు పట్టే తీరును బట్టి కూడా వాటి ఉత్పత్తి ఆధారపడి ఉంటుంది. నేను మాత్రం ఈ విషయంలో అస్సలు ఒత్తిడికి లోనవ్వను. ప్రతీ అమ్మపై ప్రేమ, గౌరవం చూపాల్సిన బాధ్యత అందరిపై ఉంది’ అంటూ సమీరా రెడ్డి తన ఇన్స్టాగ్రామ్లో రాసుకొచ్చారు. అంతేగాక తన బిడ్డను హత్తుకొని ఉన్న క్యూట్ ఫొటోను షేర్ చేశారు. View this post on Instagram New dads & loved ones listen up! Its World Breast feeding week and this post is for you to know that you can be the biggest support and encouragement to a new mom! A mother may be depressed, lacking in confidence, worried, or stressed and it affects breastfeeding. These factors do not directly affect her milk production, but can interfere with the way in which she responds to her baby. This can result in the baby taking less milk, and failing to stimulate milk production. So be there for her . ❤️ Understanding the pressure on her physically and emotionally is the best thing you can do. Nothing like feeling loved at such an overwhelming time. 🙌🏻 . I would also like to give a shoutout to moms who have struggled with low milk production . This could happen due to a pathological reason including endocrine problems or a host of other factors .A few mothers have a physiological low breast-milk production, for no apparent reason, and production does not increase when the breastfeeding technique and pattern improve. There is no reason to shame them or make them feel any pressure in not being able to BF. we need to support all mothers and show love and respect 🍼. . #worldbreastfeedingweek2019 . @WABA_global @who @unicefindia A post shared by Sameera Reddy (@reddysameera) on Aug 2, 2019 at 12:46am PDT ఇక మరో నటి నేహా దుఫియా కూడా తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. తన బిడ్డ మెహర్ పుట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు తనతో గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ.. తల్లిపాల ఆవశ్యకతను వివరిస్తూ ఓ సందేశాత్మక వీడియో రూపొందించారు. బహిరంగ ప్రదేశాల్లో సిగ్గుపడకుండా అనువైన రీతిలో బిడ్డకు పాలు పట్టడం నేరమేమీ కాదని నేహ వీడియోలో చెప్పుకొచ్చారు. -
గొడవపడితే.. 15రోజుల పాటు మాట్లాడుకోం
నా భార్యతో గొడవపడితే.. దాదాపు 15 రోజుల పాటు మాట్లాడను అంటున్నారు బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్. నేహా ధూపియా వ్యాఖ్యతగా వ్యవహరించే ఓ కార్యక్రమానికి హాజరాయ్యరు షాహిద్ కపూర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘దంపతులన్నకా గొడవలు సహజం. అది మంచిది కూడా. ఒకరితో ఒకరం విభేధించడం.. సమస్యలను పరిష్కరించుకోవడం చాలా ముఖ్యం. దాని వల్ల ఒకరి గురించి మరొకరికి పూర్తిగా అర్థం అవుతుంద’న్నారు. ‘ఇక మా విషయానికోస్తే రెండు మూడు నెలలకోసారి మేం గొడవ పడుతుంటాం. పోట్లాడుకున్నప్పుడు దాదాపు 15 రోజుల పాటు మేం మాట్లాడుకోం. తర్వాత తనో, నేనో సర్దుకు పోవడం జరుగుతుంది. ఆ తర్వాత అంతా మామూలవుతుంద’న్నారు. ప్రస్తుతం షాహీద్ కపూర్ కబీర్ సింగ్ సినిమా ప్రమోషన్స్తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తెలుగు అర్జున్ రెడ్డికి రీమేక్ అన్న సంగతి తెలిసిందే. -
కరీనా పెళ్లికి నన్ను పిలువలేదు : హీరో
ముంబై: కరీనా కపూర్ వివాహానికి తనను ఆహ్వానించలేదని బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ తెలిపారు. ఆయన నటించిన తాజా చిత్రం కబీర్ సింగ్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సమయంలో నేహా ధూపియా చాట్ షో బీఎఫ్ఫ్ విత్ వోగ్లో పాల్గొన్న షాహిద్ తన సినిమా, వ్యక్తిగత జీవితం, ప్రియాంక చోప్రా, కరీనా కపూర్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ప్రియాంక, కరీనా.. షాహిద్ మాజీ ప్రియురాళ్లు. ఇటీవల జరిగిన ప్రియాంక చోప్రా వివాహానికి హాజరైన మీరు కరీనా పెళ్లి ఎందుకు వెళ్లలేదని నేహా ధూపియా ప్రశ్నించగా.. కరీనా వివాహం జరిగి చాలా రోజులవుతుందని, తనను పెళ్లికి పిలిచిందో లేదో సరిగా గుర్తులేదని అన్నారు. దీపికా పదుకొనె, రణ్వీర్ సింగ్ ఇద్దరిలో ఎవరు మీకు మంచి కో-స్టార్ అని అడగ్గా.. దీపిక అని సమాధానమిచ్చారు. పద్మావతి సినిమాలో దీపిక, రణ్వీర్తో కలిసి షాహిద్ నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని పాత్రలపరంగా రణ్వీర్ కంటే దీపికతో ఎక్కువగా కనెక్ట్ అయ్యానని చెప్పారు. సినిమా సెట్లో దీపికతో అనేక విషయాలు పంచుకున్నట్లు తెలిపారు. గత సంవత్సరం వచ్చిన ‘పద్మావతి’ సినిమా తమ ముగ్గురికి మంచి పేరు తీసుకొచ్చిందని తెలిపారు. 2006లో విడుదలైన ‘రంగ్దే బసంతి’ సినిమాలో తనకు అవకాశం వచ్చిందని, అయితే సమయం దొరకని కారణంతో ఆ సినిమా చేయలేకపోయానని షాహిద్ బాధపడ్డారు. అంతేకాక ‘షాన్దార్’ సినిమా చేసేటప్పుడు తను అయోమయంలో ఉండి.. ఆ సినిమా ఒప్పుకున్నట్టు చెప్పారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడిన సంగతి తెలిసిందే. -
‘ఇప్పటికీ తను నా గర్ల్ఫ్రెండే’
బాలీవుడ్ జంట అంగద్ బేడి- నేహా దుఫియా వివాహ బంధంలోకి అడుగుపెట్టి నేటితో ఏడాది పూర్తయ్యింది. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా హ్యాపీ కపుల్కు అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. పెళ్లి రోజును పురస్కరించుకుని వీరిద్దరు తమ ముద్దుల చిన్నారితో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో నేహాతో తన అనుబంధం గురించి అంగద్ బేడీ మాట్లాడుతూ... ‘ గడిచిన ఏడాది ఎంతో హాయిగా సాగిపోయింది. పెళ్లి చేసుకుంటే జీవితం మారిపోతుంది. కష్టాలు మొదలవుతాయి(నవ్వుతూ) అంటూ చాలా మంది చెప్పారు. కానీ మా విషయంలో అలాంటివేమీ జరగడం లేదు. పెళ్లికి ముందు ఎలా ఉండేవాళ్లమో ఇప్పుడూ అంతే. ఇప్పటికీ మేమిద్దరం ప్రాణ స్నేహితులం. ప్రేమికులం. అంతేకాదు అందమైన కుటుంబాన్ని కలిగి ఉన్న అదృష్టవంతులం. నేహను జీవిత భాగస్వామిగా పొందడం ద్వారా నా జీవితం పరిపూర్ణమైంది’ అంటూ భార్యపై ప్రేమ కురిపించాడు. మెహర్ దేవుడిచ్చిన వరం.. ‘దేవుడి ఆశీస్సులతో ప్రస్తుతం మేము ముగ్గురం అయ్యాం. మా అనుబంధానికి గుర్తుగా మెహర్(కూతురు) మా జీవితంలోకి వచ్చింది. నిజానికి ఇప్పటికీ నేహాను నా గర్ల్ఫ్రెండ్లానే భావిస్తున్నా. తల్లిదండ్రులుగా బాధ్యతలను నెరవేరుస్తూనే మాకంటూ ఓ ప్రత్యేక స్పేస్ ఏర్పరచుకున్నాం. నిజాయితీగా గల స్నేహం మమ్మల్ని ఒక్కటి చేసింది. ఇప్పుడు దాంపత్య బంధంలో కూడా అంతే నిజాయితీగా ముందుకు సాగుతున్నాం’ అని అంగద్ కపుల్ గోల్స్ గురించి చెప్పుకొచ్చాడు. కాగా గతేడాది సోనమ్ కపూర్- ఆనంద్ అహుజాల పెళ్లి ముచ్చట్లలో మీడియా మునిగిపోయిన వేళ తమ పెళ్లి ఫొటోలను షేర్ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించారు నేహా దుఫియా- అంగద్ బేడీ. ఎప్పుడూ తమ మధ్య ఉన్న బంధాన్ని బహిరంగంగా ప్రకటించని ఈ జంట సరిగ్గా ఇదే రోజున పంజాబీ సంప్రదాయంలో జరిగిన పెళ్లి వేడుకలో ఇరు కుటుంబాలు, కొద్దిమంది సన్నిహితుల మధ్య దంపతులుగా మారిన విషయం తెలిసిందే. వీరికి ప్రస్తుతం కూతురు మెహర్ ఉంది. -
‘ఇలాంటి క్రూరమైన కామెంట్లు చేయకండి’
తల్లయ్యాక మీరు చాలా లావయ్యారు అంటూ బాడీ షేమింగ్ చేసిన ఓ మహిళా రిపోర్టర్కు బాలీవుడ్ నటి నేహా ధూపియా గట్టి కౌంటర్ ఇచ్చారు. ఒక తల్లిగా తనకు కూతురే ప్రథమ ప్రాధాన్యం అని.. మిగిలిన విషయాలన్నీ ఆమె తర్వాతే అంటూ మాతృత్వాన్ని చాటుకున్నారు. ‘ ఫ్యాట్ షేమింగ్ అనే జాడ్యం సెలబ్రిటీ తల్లులనే కాదు సాధారణ తల్లులను కూడా బాధిస్తోంది. అయితే నేను ఈ విషయం గురించి చింతించను. నా కూతురి కోసం ఫిట్గా, ఆరోగ్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే రోజుకు రెండుసార్లు వర్కౌట్ చేస్తున్నాను. ప్రస్తుతం నాకు ఫిట్నెస్ మాత్రమే ముఖ్యం. ఈ సమాజం చూసే చూపుల పట్ల పెద్దగా ఆసక్తి లేదు. ఇక నుంచైనా ఇలాంటి క్రూరమైన కామెంట్లు చేయకండి. కాస్త దయాగుణం కలిగి ఉండండి’ అంటూ నేహా తన ఇన్స్టాగ్రామ్ పోస్టులో రాసుకొచ్చారు. కాగా బాడీషేమింగ్ పట్ల నేహా స్పందించిన తీరును సెలబ్రిటీలు సహా నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ‘నేహా నువ్వు నిజంగా అద్భుతమైన మహిళవి. ఎన్నో సవాళ్లను చిరునవ్వుతో, తెలివితో ఎదుర్కొన్నావు. లావు పెరగడం కాదు ఇక్కడ అసలు సమస్య. మన ఆలోచనా దృక్పథంలో మార్పు రావడం ముఖ్యం. ఆ మహిళకు ఏదో ఒకరోజు కనువిప్పు కలుగుతుంది’ అంటూ కరణ్ జోహార్ ట్వీట్ చేశాడు. ‘మీరు గొప్ప అమ్మ. మహిళల శరీరాన్ని, బాహ్య సౌందర్యాన్నిమాత్రమే చూసే వ్యక్తుల గురించి అసలు పట్టించుకోకపోవడమే మంచిది’ అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ఇక గతేడాది మే నెలలో తన స్నేహితుడు అంగద్ బేడీని పెళ్లి చుసుకున్న నేహా ధూపియా ఇటీవలే పాపకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. Thank you , next! pic.twitter.com/c3T9bJWN46 — Neha Dhupia (@NehaDhupia) February 2, 2019 Neha! You are an amazing Woman! You walk so many paths with humour...with intelligence and with abandon! It’s never about losing weight it’s always about gaining perspective! And I hope the woman who wrote this has gained some today.... https://t.co/VhlGJtM4Oj — Karan Johar (@karanjohar) February 2, 2019 -
2019లో సల్మాన్ పెళ్లి : కరణ్ జోహర్
బాలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే వెంటనే గుర్తోచ్చే పేరు సల్మాన్ ఖాన్. 53 ఏళ్ల వయసులో ఉన్నా సల్మాన్ పెళ్లి వార్తలు ఇప్పటికీ బాలీవుడ్లో హల్చల్ చేస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ విషయంపై స్పందించిన బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రముఖ నటి నేహాధూపియా వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న ‘నో ఫిల్టర్ నేహా’ కార్యక్రమంలో పాల్గొన్న కరణ్.. సల్మాన్ పెళ్లిపై స్పందించారు. 2019 సల్మాన్ఖాన్ పెళ్లి చేసుకుంటారన్న కరణ్, తాను పెళ్లి చేసుకోబోయేది అమ్మాయిని కాదు. ఇప్పటికే కమిట్ అయిన మూడు సినిమాలనే సల్మాన్ పెళ్లి చేసుకుంటున్నాడంటూ ట్విస్ట్ ఇచ్చారు. ఈ రోజు (శుక్రవారం) పుట్టిన రోజు జరుపుకుంటున్న సల్మాన్ ఖాన్ ప్రస్తుతం భారత్, దబాంగ్ 3 సినిమాలతో పాటు మరో సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. -
మేం ముగ్గురమయ్యాం
ఆదివారంనాడు నేహా ధూపియా, అంగద్ బేడీ ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. వీరి ఫ్యామిలీ ఇద్దరి నుంచి ముగ్గురుగా మారింది. అవును.. నేహా ధూపియా ఆదివారం ఉదయం 11 గంటలకు ఓ పాపకు జన్మనిచ్చారు. ఈ ఏడాదే నేహా, అంగద్ ఒక్కటయిన సంగతి గుర్తుండే ఉంటుంది. కొన్ని సంవత్సరాలుగా రిలేషన్షిప్లో ఉన్న వీళ్లు మే నెలలో వివాహం చేసుకున్నారు. -
‘అందుకే యువీకి నాపై కోపం’
న్యూఢిల్లీ: తన పెళ్లి గురించి చెప్పనందుకు క్రికెటర్ యువరాజ్ సింగ్ తనపై కోపంగా ఉన్నాడని అంటున్నారు బాలీవుడ్ నటుడు అంగద్ బేడీ. ఈ ఏడాది సినీ నటి నేహా ధుపియాను అంగద్ రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి కార్యక్రమాలన్నీ పూర్తయ్యేవరకు వీరి పెళ్లి విషయం బయటకు రానివ్వలేదు. అయితే యువరాజ్, అంగద్ చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు. అలాంటిది పెళ్లి గురించి కనీసం తనకు కూడా ఒక్కమాటైనా చెప్పలేని కారణంగా యువీ చాలా అప్సెట్ అయ్యాడని అంగద్ పేర్కొన్నారు. అందుకే తనతో సరిగ్గా మాట్లాడటం లేదని అంగద్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘ఫ్రెండ్షిప్ డే రోజున యువీ ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ పెట్టాడు. ‘నా స్నేహితులనుకున్నవారితో నాకు ఎదురైన అనుభవాలను చూశాక మనుషుల కంటే నా శునకాలే మేలనిపించింది’ అని పోస్ట్ చేశాడు. అది చూశాక నా గురించే ఆ పోస్ట్ పెట్టాడనిపించింది. తప్పు నాదే. నా ప్రాణ స్నేహితుడైన యువీకి నా పెళ్లి గురించి చెప్పలేదు. కానీ అనుకోకుండా పెళ్లి గురించి ఓ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. యువీ నాపై కోపంగా ఉండటానికి అతనికి చాలా కారణాలు ఉండవచ్చు. నాకు యువీ అంటే ఇప్పటికీ ఇష్టమే. కానీ మా ఇద్దరి మధ్య ఉన్న బంధం ఇదివరకు ఉన్నట్లుగా లేదు. త్వరలో అతనికి నాపై కోపం తగ్గుతుందని అనుకుంటున్నాను’ అని అంగద్ బేడీ పేర్కొన్నారు. -
అవకాశాలు రావని భయపడ్డాను
నటి నేహా ధూపియా వివాహం అంగద్ బేడీతో ఈ ఏడాది మేలో జరిగిన విషయం తెలిసిందే. నేహా త్వరలో ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఈ విషయాన్ని గత నెల ఈ దంపతులు ప్రకటించారు. మరి.. ఇన్నాళ్లూ ఈ విషయాన్ని ఎందుకు దాచారు? అంటే.. నేహా ధూపియా ఇలా చెప్పుకొచ్చారు. ‘‘ప్రెగ్నెంట్ అని ముందే చెప్పడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే నెలలు గడిచేకొద్దీ శరీరాకృతిలో మార్పులు వచ్చినా మొదటి నాలుగైదు నెలలు మామూలుగా ఉంటాం. అందుకని సినిమాలు చేసుకునే వీలు ఉంటుంది. అయితే ప్రెగ్నెంట్ అని తెలిస్తే అవకాశాలు ఇవ్వరని భయపడ్డాను. నాకేమో విశ్రాంతి తీసుకోవడం ఇష్టం లేదు. లక్కీగా ఆరు నెలల వరకూ నాకెలాంటి సమస్యా ఎదురవలేదు. ఇప్పుడూ అంతే. నా ఎనర్జీ లెవల్స్ తగ్గకపోవడంతో ‘హెలికాప్టర్ ఈల’ సినిమాలో కూడా నటించాను. ఆ సంగతలా ఉంచితే.. ఈ సమయంలో నాకెందుకో తెలియదు కానీ అప్పుడప్పుడూ పీడకలలు రావడం, నేను భయపడటం జరుగుతుంది. అప్పుడు నా భర్త అంగద్ ముఖం చూస్తే ఆ భయాలన్నీ పోయి చాలా ప్రశాంతంగా ఉంటున్నా’’ అని చెప్పుకొచ్చారు నేహా. అంతా బాగానే ఉంది. నేహా పెళ్లయి దాదాపు ఐదు నెలలవుతోంది. గర్భం దాల్చిన ఆరు నెలల వరకూ, ఇప్పుడూ ఎలాంటి ప్రాబ్లమ్ లేదని ఆమె పేర్కొన్నారు. పైగా తొమ్మిదో నెలలోకి ఎంటరైనట్లున్నారు. దాంతో పెళ్లికి ముందే ఆమె ప్రెగ్నెంట్ అని ఔత్సాహికరాయుళ్లు వార్తలు మొదలుపెట్టారు. -
ఆ రూమర్ నిజమైంది...
సాక్షి, ముంబై: పెళ్లి కబురుతో అభిమానులను ఆశ్చర్యపర్చిన బాలీవుడ్ నటి నేహాదుపియా, అంగద్ బేడి, జంట మరో గుడ్న్యూస్తో ఫాన్స్కి స్వీట్ షాకిచ్చారు. తాము త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నామనే వార్తను సోషల్ మీడియాలో పంచకున్నారు. తద్వారా గత కొద్దికాలంగా తన ప్రెగ్నెన్సీ వార్తలపై వస్తున్న ఊహాగానాలకు బాలీవుడ్ తార నేహా దూపియా తెరదించినట్టయింది. ఈ సందర్భంగా కొన్ని ఫోటోలను షేర్ చేశారీ జంట. దీంతో ఇవి వైరల్ అయ్యాయి. ఇన్స్టాగ్రామ్ వేదికగా ఈ శుభవార్తను శుక్రవారం నేహా కన్ఫామ్ చేశారు. కొత్త ఆరంభం.. ఇపుడు మేం ముగ్గురం.. ఆ భగవంతుడి ఆశీర్వాదం తమతో ఉందంటూ కొన్ని పోటోలను షేర్ చేశారు. అలాగే రూమర్లు నిజమయ్యాయంటూ అంగద్ బేడీ చమత్కారంగా స్పందించారు. దీంతో లక్షలకుపైగా వ్యూస్నుసాధించాయీ ఫోటోలు. అభినందనల వెల్లువ కురుస్తోంది. అద్భుతమైన జంటకు కంగ్రాట్స్..మరో అందమైన ప్రేమకథకు ఆరంభం అంటూ బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ విషెస్ చెప్పారు .మరోవైపు ముంబైలో అట్టహాసంగా జరుగుతున్న లాక్మే ఫ్యాషన్ వీక్2018లో నేహా దూపియా, అంగద్ బేడి తళుక్కున మెరిసారు. మ్యాచింగ్ సాంప్రదాయ దుస్తుల్లో అక్కడున్న వారిని మెస్మరైజ్ చేశారు. చేతిలో చేయివేసుకొని ర్యాంప్పై వాక్ చేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చారు. చాలాకాలం డేటింగ్ అనంతరం నేహా దుపియా, అంగద్ బేడీ ఈ ఏడాది మే 10న ఆకస్మాత్తుగా వివాహం చేసుకోవడం హాట్ టాపిక్గా నిలిచింది. నేహా గర్భం దాల్చడం వల్లే హడావిడిగా పెళ్లి చేసుకొన్నారనే వార్లు మీడియాలో గుప్పుమన్న సంగతి తెలిసిందే. -
తల్లి కాబోతున్న బాలీవుడ్ నటి
బాలీవుడ్ నటి నేహా దుపియా ఎలాంటి హాడావుడి లేకుండా.. గుట్టుచప్పుడు కాకుండా బిషన్ సింగ్ బేడీ కుమారుడు అంగద్ బేడిను వివాహామాడారు. నేహా చడీచప్పుడు కాకుండా పెళ్లి చేసుకోవడంతో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. వీరిద్దరూ హడావిడిగా పెళ్లి చేసుకోవడంపై అప్పట్లో ఎన్నో అనుమానాలు, సందేహాలు వ్యక్తమయ్యాయి. కొన్ని రోజుల తర్వాత నేహా ప్రెగ్నెంట్ అనే వదంతులు కూడా చక్కర్లు కొట్టాయి. అందుకే చడీచప్పుడు కాకుండా ఆమె వివాహం చేసుకున్నారని పుకార్లు వచ్చాయి. తాజాగా ఆ వదంతులన్నీ నిజం కాబోతున్నాయి. ఈసారి నేహా దుపియా నిజంగానే తల్లి కాబోతున్నారు. చాలా రోజుల నుంచి కొట్టిపారేస్తూ వస్తున్న ప్రెగ్నెన్సీ రూమర్లను, ఇప్పుడు ఆమె సోషల్ మీడియా వేదికగా కన్ఫామ్ చేసేశారు. ఇన్స్టాగ్రామ్లో నేహా కొన్ని ఫోటోలను షేర్ చేసింది. దానిలో తన భర్త అంగద్ను ప్రేమగా పట్టుకుని ఉండగా, తన బేబి బంప్ను చూపిస్తూ అంగద్ సంబురపడుతున్న పిక్చర్ను షేర్చేశారు. దానికి క్యాప్షన్గా... ‘కొత్త ఇన్నింగ్స్ ఇక్కడ ఉంది... #3ఆఫ్అజ్.....#సత్నంవహేగురు’ అంటూ పోస్టు చేశారు. అంగద్ కూడా తన ఇన్స్టాగ్రామ్లో ఇవే ఫోటోలను షేర్ చేస్తూ.. ‘హా! వదంతులు నిజం కాబోతున్నాయి... #3ఆఫ్అజ్..... #సత్నంవహేగురు’ అంటూ పోస్టు చేశారు. ఇలా క్యూట్గా నేహా దుపియా తన ప్రెగ్నెన్సీని కన్ఫామ్ చేసేశారు. కాగ, నేహా, అంగద్ల వివాహం ఈ ఏడాది మేలో జరిగింది. వీరిద్దరూ ఈ విషయాన్నీ తమ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ధ్రువీకరించారు. తాజాగా తల్లిదండ్రులం కాబోతున్నామని విషయాన్ని కూడా సోషల్ మీడియా ద్వారానే కన్ఫామ్ చేశారు. -
‘అతడి పేరు కూడా తెలీదు.. ఇంకా వివాహమా’
సాక్షి, ముంబై : ప్రాణ స్నేహితుల్లా మెలిగిన, ప్రేమించుకున్న వ్యక్తులను బ్రేకప్ తర్వాత మీ బంధం ఎలా ఉందని అడిగితే ఎవరికైనా కోపం, చిరాకు రావడం సహజం. ప్రస్తుతం బాలీవుడ్ నటి, మోడల్ నోరా ఫతేహి పరిస్థితి కూడా ఈ విధంగానే ఉంది. మూడేళ్ల పాటు నటుడు అంగద్ బేడీతో రిలేషన్ షిప్లో ఉన్న నోరా... గతంలో అతడిపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇద్దరి పుట్టిన రోజు కూడా ఒకటే కావడంతో సంతోషం పట్టలేని ఆమె.. వారిద్దరి ఫొటోలను షేర్ చేసి ‘హ్యాపీ బర్త్డే అంగద్.. మనం ఇద్దరం ఒకే తేదీన పుట్టడం ఎంతో బాగుంది కదా. నువ్వు అచ్చం నాలాగే ఎందుకు ఉంటావో ఇప్పుడు తెలిసింది బెస్టీ అంటూ’ ట్వీట్ చేశారు. ఇందుకు బదులుగా.. ‘ హ్యాపీ బర్త్ డే సూపర్ స్టార్.. నీతో ఈ రోజును పంచుకోవడం నా అదృష్టం’ అంటూ అంగద్ ట్వీట్ చేశాడు. అయితే నోరాతో బ్రేకప్ అనంతరం అంగద్.. బాలీవుడ్ హీరోయిన్ నేహా ధుపియాను గత మేలో వివాహం చేసుకున్నాడు. అత్యంత సన్నిహితుల మధ్య పంజాబీ సంప్రదాయంలో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. కాగా ఇటీవల ఓ జాతీయ మీడియాతో జరిపిన చిట్చాట్లో భాగంగా.. అంగద్ బేడీకి వివాహ శుభాకాంక్షలు తెలిపారా అంటూ నోరా ఫతేహిని యాంకర్ ప్రశ్నించారు. దీంతో చిరాకు పడిన నోరా..‘అంగద్ బేడీ ఎవరు. అతడి పేరు కూడా ఎప్పుడూ వినలేదు. అసలు మీరేం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. అతడు ఎవరో కూడా తెలియనపుడు అతడి పెళ్లి గురించి నేనెలా మాట్లాడతానంటూ’ ఆగ్రహం వ్యక్తం చేశారు. Happy birthday to us 😎😄😇 @Imangadbedi how cool we are born on the same day! That explains why ur as cool as me😉 thats why we are besties😁 pic.twitter.com/WkaqYK6LGE — Nora Fatehi (@Norafatehi) February 6, 2017 Happy birthday superstar @Norafatehi I'm honoured to share my birthday with you.i always have your back.. errr I mean your shoulder😎 #bestie pic.twitter.com/iKTBexJbI4 — ANGAD BEDI! (@Imangadbedi) February 6, 2017 -
నేహా ధుపియా : హానర్ స్మార్ట్ఫోన్లు
సాక్షి, న్యూఢిల్లీ: హువావే సబ్-బ్రాండ్ హానర్ రెండు కొత్త స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది. బడ్జెట్ ధరల్లో హానర్ 7ఏ, 7సీ పేరుతో ఇండియాలో ప్రారంభించింది. గత నెల చైనాలో లాంచ్ చేయగా మంగళవారం భారత మార్కెట్లో విడుదల చేసింది. ప్రముఖనటి నేహా ధుపియా మీదుగా ఈ రెండు డివైస్లను లాంచ్ చేసింది. ఈ రెండు స్మార్ట్ఫోన్లు ప్రత్యేకంగా ఇ-కామర్స్ సైట్ ఫ్లిప్కార్ట్ ద్వారా విక్రయానికి లభ్యం. ముఖ్యంగా షావోమికి చెందిన రెడ్ మీ 5, 5ఏకు పోటీగా ఫేస్ అన్లాక్, డ్యుయల్ రియర్ కెమెరా ప్రధాన ఫీచర్లుగా వీటిని లాంచ్ చేసింది. భారత వినియోగదారుల కోసం పేటీఎం ఫీచర్తోపాటు రైడర్స్ సౌకర్యంకోసం రైడ్మోడ్ అనే ఫీచర్ను యాడ్ చేశామని హానర్ ఇండియా ప్రతినిధి సుమీత్ అరోరా తెలిపారు. ఇండియా టాప్ 5 బ్రాండ్గా హానర్ నిలిచిందని పేర్కొన్నారు. షావోమీ, వన్ప్లస్తో పోలిస్తే 146 శాతం హయ్యస్ట్ గ్రోత్ సాధించామని సుశీల్ తారిఖ్ హువావే చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ ప్రకటించారు. జియో భాగస్వామ్యంతో మోర్ డేటా, మోర్ క్యాష్బ్యాక్ ఆఫర్ అందిస్తున్నామని హానర్ తెలిపింది. హానర్ 7ఏ ఫీచర్లు 5.99 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే 720 x 1440 రిజల్యూషన్ ఆండ్రాయిడ్ ఓరియో 8.0 స్నాప్డ్రాగన్ 450 ప్రాసెసర్ 3జీబీ/32జీబీ స్టోరేజ్ 13+2ఎంపీ రియర్ కెమెరా, 8ఎంపీ సెల్ఫీ కెమెరా 4జీబీ ర్యామ్ /64జీబీ స్టోరేజ్ 3000 ఎంఏహెచ్ బ్యాటరీ బ్లాక్, బ్లూ, గోల్డ్ కలర్స్ లో లభ్యం హానర్ 7సీ ఫీచర్లు 5.7 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే 720 x1440 రిజల్యూషన్ ఆండ్రాయిడ్ ఓరియో 8.0 స్నాప్డ్రాగన్ 400 ప్రాసెసర్ 3జీబీ/4జీబీ ర్యామ్ 32జీబీ/64జీబీ స్టోరేజ్ 13+2ఎంపీ రియర్ కెమెరా, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా 3000 ఎంఏహెచ్ బ్యాటరీ ధరలు: 7ఏ ధర 8,999 రూపాయలు నిర్ణయించింది. ఇది మే29 నుంచి ప్రత్యేకంగా ఫ్లిప్కార్ట్లో అందుబాటులోఉంటుంది. కాగా 7 సీ ధర రూ.9,600, 11,999 రూపాయలు ఉంది. ఇది అమెజాన్ ద్వారా మే31న విక్రయానికి లభ్యం. -
నీ కన్నా రెండేళ్లు చిన్నవాడితో పెళ్లా?
సినిమా స్టార్స్కు విమర్శలు కొత్తకాదు. సోషల్ మీడియాలో అయినదానికి, కానిదానికి కొంతమంది ట్రోలర్స్ వారి మీద పడి ఏడుస్తుంటారు. ఎప్పుడూ ఏదో విమర్శి చేసి.. చికాకు పరుచాలనుకుంటారు. అలాంటి వారికి ఇప్పుడు సినీవాళ్లు గట్టిగానే బదులు ఇస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి బాలీవుడ్ నటి నేహా ధూపియా చేరారు. ఇటీవలే నేహా ధూపియా నటుడు అంగద్ బేడీని పెళ్లి చేసుకున్నారు. ఢిల్లీలో వీరి వివాహ వేడుక కుటుంబసభ్యుల నడుమ ఒకింత గోప్యంగా జరిగింది. అనంతరం తమ పెళ్లి అయిందనే విషయాన్ని ఇద్దరూ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. అయితే, నేహా ధూఫియా తనకన్నా రెండేళ్లు చిన్నవాడిని పెళ్లి చేసుకుందని విమర్శిస్తూ.. ఓ నెటిజన్ వెకిలి కామెంట్ పెట్టారు. తన భర్త అంగద్ బేడీ తాజా చిత్రం ‘సూర్మా’ లోని ఆయన పాత్రను పరిచయం చేస్తూ నేహా దూఫియా ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్టు పెట్టారు. దీనికి ఓ నెటిజన్ స్పందిస్తూ.. ‘అంగద్ బేడీ నీ కన్నా రెండేళ్లు చిన్నవాడు. అతను నీకు భర్త కాదు.. తమ్ముడులాంటి వాడు. రాఖీ కట్టు..’అంటూ వెకిలి వ్యాఖ్య చేశాడు. ఈ కామెంట్కు నెహా ఒకింత కూల్గానే ఘాటు బదులిచ్చారు. ‘నీ సలహా నచ్చిందోయ్. కానీ నాకో ఫెవర్ చేయ్. నీ జీవితమెంటో నువ్ చూసుకో..’ అంటూ ‘పంచ్’ ఎమోజీతో నెహా బదులిచ్చారు. A person with a heart of gold - meet Bikramjeet Singh aka Bikram in #Soorma, releasing on 13th July! #DontLetThisStoryPass ... congratulations team ... @sonypicsprodns @Flicker_Singh @diljitdosanjh @taapsee @IChitrangda @SnehaRajani @shaadesh @thecsfilms ... well done Mister .. 👊😉 @angadbedi 😘 A post shared by Neha Dhupia (@nehadhupia) on May 16, 2018 at 4:21am PDT -
జహీర్ పెళ్లిలో వీరి ప్రేమకథ మొదలైంది..
తన ప్రాణ స్నేహితుడు అంగద్ బేడిని రహస్యంగా వివాహమాడి అభిమానులతో పాటు బాలీవుడ్ జనాలకు స్వీట్ షాకిచ్చింది నేహా ధూపియా. సోనమ్ కపూర్- ఆనంద్ అహుజాల పెళ్లి ముచ్చట్లలో మీడియా మునిగిపోయిన వేళ తమ పెళ్లి ఫొటోలను షేర్ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది ఈ కొత్త జంట. అయితే ఎప్పుడూ తమ మధ్య ఉన్న బంధాన్ని బహిరంగంగా ప్రకటించని నేహా- అంగద్.. మే10న పంజాబీ సంప్రదాయంలో జరిగిన పెళ్లి వేడుకలో ఇరు కుటుంబాలు, కొద్దిమంది సన్నిహితుల మధ్య దంపతులుగా మారిన విషయం తెలిసిందే. అయితే గత నవంబర్లో జరిగిన క్రికెటర్ జహీర్ ఖాన్- సాగరిక ఘట్కేల వివాహ సమయంలోనే అంగద్... నేహా దగ్గర పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చినట్లు వదంతులు వినిపించాయి. జహీర్ ఖాన్ పెళ్లి అనంతరం అంగద్- నేహాలు సాగించిన సరదా సంభాషణ గమనిస్తే అది నిజమే అన్పిస్తోంది మరి. జహీర్- సాగరికల పెళ్లి ఫొటోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన అంగద్ వారికి శుభాకాంక్షలు తెలిపాడు. అందుకు బదులుగా నేహా.. ‘తర్వాత నీ వివాహమే అంగద్’ అంటూ సరదాగా కామెంట్ చేసింది. ‘అయితే పదమరి’ అంటూ అంతే కొంటెగా సమాధానమిచ్చాడు అంగద్. నేహా బదులిస్తూ ‘ఎప్పుడు’ అంటూ కామెంట్ చేయగా.. ‘15 జనవరిన’ అంటూ అంగద్ బదులిచ్చాడు. ఇలా వీరి ప్రేమకథ మరో పెళ్లిలో మొదలైంది. ‘ప్రాణ స్నేహితులని పెళ్లి చేసుకోవడం ప్రపంచంలోనే అన్నింటి కన్నా గొప్ప అనుభూతి. ప్రస్తుతం మేము ఆ అనుభూతిని ఆస్వాదిస్తున్నాం. స్నేహితులుగా ఉన్న మేము ఢిల్లీలో జరిగిన వివాహ వేడుక ద్వారా దంపతులుగా మారామంటూ’ ఈ నవజంట సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘వచ్చే వారం స్నేహితులు, సన్నిహితుల మధ్య ముంబైలో రిసెప్షన్ జరపాలనుకుంటున్నాం. మాపై ప్రేమ కురిపించి.. ఆశీర్వాదాలు అందజేసిన ప్రతీ ఒక్కరికీ పేరుపేరున ధన్యవాదాలు’ అంటూ ఈ జంట ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే పెళ్లైన వెంటనే నేహా- అంగద్లు హనీమూన్ కోసం అమెరికా వెళ్లినట్లు సమాచారం. క్రికెట్ దిగ్గజం కొడుకుతో నటి పెళ్లి Finally!!! Big fella is man down!! @zaheer_khan34 @sagarikaghatge game.. Set.. Match! Chak de.. #zaheerkhan #sagarikaghatge A post shared by Angad Bedi (@angadbedi) on Nov 22, 2017 at 10:33pm PST -
క్రికెట్ దిగ్గజం కొడుకుతో నటి పెళ్లి
ముంబై: డేటింగ్ నుంచి మొదలుపెడితే ఎంగేజ్మెంట్.. ముహుర్తం ఖరారు.. బందువుల రాక.. మెహెందీ, సంగీత్.. పెళ్లి.. అప్పగింతలు.. వందలకొద్దీ వార్తలు, వేలకొద్దీ ఫొటోలు, సోషల్మీడియాలో చర్చలు..!! సెలబ్రిటీల పెళ్లివేడుకల్లో సాధారణంగా చోటుచేసుకున్న ఈ రొటీన్కు కాస్త భిన్నంగా.. చడీచప్పుడు లేకుండా ఎకాఎకిన పెళ్లిచేసేసుకుని అభిమానులకు స్వీట్ షాకిచ్చింది హీరోయిన్ నేహా ధూపియా. క్రికెట్ దిగ్గజం కుమారుడు: భారత క్రికెట్లో దిగ్గజ స్పిన్నర్గా పేరుపొందిన బిషన్ సింగ్ బేడీ తనయుడు అంగద్ బేటీనే నేహా వివాహం చేసుకుంది. అంగద్ సైతం బాలీవుడ్లో, టీవీ రంగంలో నటుడిగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. బుధవారం పంజాబీ సంప్రదాయంలో జరిగిన ఈ వేడుకలో ఇరు కుటుంబాలు, కొద్దిమంది సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు. పెళ్లి దుస్తుల్లో మెరిపోతున్న ఫొటోలను.. స్వయంగా వధూవరులే పోస్ట్ చేశారు. ‘‘లైఫ్లో తీసుకున్న బెస్ట్ నిర్ణయం ఇదే.. నా ఫ్రెండ్ అంగద్ను పెళ్లి చేసుకున్నాను. హలో.. హస్బెండ్గారు..’’ అని నేహా రాసుకొచ్చింది. ‘ఇప్పటిదాకా స్నేహితురాలు.. ఇకనుంచి భార్య’ అంటూ అంగద్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. సోషల్ మీడియా ద్వారా పెళ్లి వార్తలు తెలుసుకున్న ప్రముఖులంతా కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.. -
నా భర్తను ప్రతిరోజూ తిడతాను..
సాక్షి, ముంబై: ‘ఔను నా భర్తను ప్రతిరోజూ తిడతాను. దూషిస్తాను. కానీ ద్వేషంతో కాదు. ప్రేమతో. అతను ప్రేమతో చేసే విషయాలు చూసి తిడతాను. అందులో ప్రేమ తప్ప ద్వేషం లేదు. నేను ఎవరినైనా తిట్టానంటే.. వారిని నిజంగా ప్రేమించినట్టు’ అంటోంది బాలీవుడ్ నటి రాణి ముఖర్జీ. ప్రముఖ నిర్మాత, యశ్రాజ్ ఫిలిమ్స్ అధినేత ఆదిత్యచోప్రాను నాలుగేళ్ల కిందట రాణి పెళ్లాడిన సంగతి తెలిసిందే. వారికి అధీర అనే రెండేళ్ల కూతురు ఉంది. పెళ్లి, సంతానం నేపథ్యంలో సినిమాల నుంచి విరామం తీసుకున్న రాణి ఇప్పుడు ‘హిచ్కీ’ అనే వినూత్న సినిమాతో త్వరలోనే ప్రేక్షకులను పలుకరించబోతోంది. మాట్లాడుతున్నప్పుడు ‘హిచ్క్క్’ అంటూ వింత శబ్దం చేసే ఓ స్కూల్ టీచర్ ఏవిధంగా తన విద్యార్థులను తీర్చిదిద్దిందనే ఇతివృత్తంతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా రాణి ముఖర్జీ తాజాగా నేహా ధూపియా చాట్లో ముచ్చటించింది. సెలబ్రిటీ డిజైనర్ సబ్యసాచి ముఖర్జీతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె తన పెళ్లి, వైవాహిక జీవితం, తమ అనుబంధం గురించి వివరించింది. ‘ముఝ్సే దోస్తీ కరోగీ’ సినిమా సమయంలో తొలిసారి ఆదిత్య చోప్రాతో పరిచయం అయిందని, ఆ పరిచయం ప్రేమగా మారిందని రాణి తెలిపింది. తనకు, ఆదిత్యకు పెద్దగా ప్రచార ఆర్భాటాలు, ఆడంబరాలు ఇష్టం ఉండవవని, అందుకే కేవలం 12మంది సమక్షంలో నిరాడంబరంగా తమ పెళ్లి జరిగిందని రాణి వెల్లడించింది. అందరూ సెలబ్రిటీ కిడ్స్ తరహాలో తమ చిన్నారి అధిరా ఫొటోలు మీడియాలో, సోషల్ మీడియాలో కనిపించడం తమకు నచ్చదని, అందుకే తనను ఎక్కువగా ఫొటోలు తీసేందుకు ఇష్టపడమని చెప్పింది. -
మేకింగ్ ఆఫ్ మూవీ - తుమ్హరీ సులు
-
అందుకే కోస్టార్స్తో ఆ పని చేయలేదు: హీరోయిన్
ముంబై: బాలీవుడ్ బ్యూటీ సోనం కపూర్ చాలా ముక్కుసూటిగా మాట్లాడుతుంది. మనసులో ఉన్నది ఉన్నట్టు నిజాయితీగా తన అభిప్రాయాలు వెల్లడిస్తుంది. బోల్డ్గా మాట్లాడటం ఆమె నైజమని తెలిసిన వారు చెప్తారు. తాజాగా నేహా ధూపియా షోలోనూ తన అభిప్రాయాలతో సోనం దుమ్మురేపింది. నేహా వివాదాస్పద ప్రశ్నలు అడిగినా.. వాటికి ఏమాత్రం తొణకకుండా బోల్డ్ గా సమాధానం చెప్పింది. 'సావన్' మ్యూజిక్ యాప్ కోసం నేహా ధూపియా "#నోఫిల్టర్నెహా' షోను నిర్వహిస్తోంది. దర్శకుడు కరణ్ జోహార్ తో నిర్వహించిన తొలి ఎపిసోడ్తోనే ఈ షో దుమ్మురేపింది. 26 ఏళ్ల వయస్సులో వర్జినిటీ కోల్పోయానని చెప్పిన కరణ్.. రాఖీ సావంత్ ను కారిక్యేచర్ అని ఎందుకన్నానో వంటి వివాదాస్పద ప్రశ్నలెన్నింటికో సమాధానం ఇచ్చారు. అదేవిధంగా రెండో ఎపిసోడ్లో సోనంను హాట్ హాట్ కాంట్రవర్సీ క్వశ్చన్స్ ను నేహా అడిగింది. వీటికి అంతేబోల్డ్ గా సోనం సమాధానమిచ్చింది. శృంగారమంటే తనకు ఇష్టమేనని, కానీ సినీ పరిశ్రమలో ఎవరి పట్ల తాను ఆకర్షితురాలు కాలేదని, అందుకే వారితో శృంగారంలో పాల్గొనలేదని చెప్పింది. మీ రిలేషన్ షిప్ స్టేటస్ ఏమిటి? అని అడుగగా.. 'నేను ఇప్పిటికీ ఒంటరినే. సహ నటులు ఎవరితోనూ డేటింగ్ చేయలేదు. వారు బాగుంటారు. కానీ, వారితో ఎప్పుడూ సినిమాల గురించే మాట్లాడలేను. దాంతోపాటు నా సహనటులకు నేనెప్పుడూ ఆకర్షితురాలవ్వలేదు. వారితో శృంగారంలో పాల్గొనలేదు. అందుకే వారితో నాకు సత్సంబంధాలు ఉన్నాయి' అని సోనం స్పష్టం చేసింది. అయితే, తన సోదరి రెయా, 'మీర్జ్యా' సినిమాతో బాలీవుడ్ కు పరిచయమైన సోదరుడు హర్ష గురించి తాను ఆందోళన చెందుతున్నట్టు తెలిపింది. ఆలియా భట్ ఇప్పటికే 'వర్జినల్' అనీ, సోనాక్షి తన స్టైలిష్ట్ ను మార్చాల్సిన సమయం ఆసన్నమైందని సోనం నాటీ కామెంట్స్ చేసింది. -
నా లైఫ్ మలుపు తిరిగింది ఇక్కడే..
సాక్షి, సిటీబ్యూరో: ‘హైదరాబాద్ నాకెంతో స్పెషల్. గ్లామర్ వరల్డ్లో నా లైఫ్ మలుపు తిరిగింది ఇక్కడి నుంచే’ అంటూ బాలీవుడ్ బ్యూటీ నేహా ధూపియా ‘ఫెమినా మిస్ ఇండియా యూనివర్స్’ టైటిల్ గెలిచిన రోజుల్ని గుర్తు చేసుకుంది. ఏరియల్ వాషింగ్ పౌడర్ సంస్థ ఆధ్వర్యంలో ‘లాండ్రీ బాధ్యత మహిళలకే ఎందుకు?’ అంశంపై బుధవారం తాజ్ డెక్కన్లో చర్చా వేదిక నిర్వహించారు. తండ్రి ప్రదీప్ ధూపియాతో కలిసి పాల్గొన్న నేహా.. తనను మగపిల్లలతో సమానంగా తల్లిదండ్రులు పెంచారని వివరించింది. తన సినీ కెరీర్ గురించి మాట్లాడుతూ, ప్రస్తుతం హిందీలో రెండు చిత్రాలు చేస్తున్నానంది. తెలుగులో రెండు సినిమాలు చేశానని, మళ్లీ మంచి అవకాశం వస్తే తప్పక చేస్తానంది. ఫిట్నెస్ కోసం రోజుకు కనీసం 40 నిమిషాలైనా కేటాయించడం అవసరం అని సూచించింది. -
ఆ రోజులు భయానకం
* అయినా పోరాటం ఆపలేదు * యువరాజ్ సింగ్ మనసులో మాట కోల్కతా: భారత జట్టులో స్థానం కోల్పోయిన తర్వాత తాను ఎంతో మానసిక వేదనకు గురయ్యానని స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ వ్యాఖ్యానించాడు. అదో బాధాకర దశగా అతను అభివర్ణించాడు. ‘ప్రపంచకప్ తర్వాతి రోజులు ఎంతో భయంకరంగా గడిచాయి. ఇంతకంటే ఘోరంగా పరిస్థితులు ఉండవేమో అనిపించింది. అయితే అదంతా గతం. ఆ తర్వాత నేను పోరాడాను. మానసికంగా మరింత దృఢంగా తయారయ్యాను’ అని ఆదివారం ఇక్కడ జరిగిన కోల్కతా 25 కిలోమీటర్ల రేసుకు అతిథిగా హాజరైన సందర్భంగా యువీ పేర్కొన్నాడు. 2014 ఏప్రిల్లో చివరిసారి టీమిండియాకు ప్రాతినిధ్యం వహించిన యువీ తాజాగా ఆస్ట్రేలియాతో జరిగే టి20లకు ఎంపికయ్యాడు. ఏడాదిన్నర పాటు జాతీయ జట్టుకు దూరంగా ఉన్న తర్వాత దేశవాళీలో ఆడేలా స్ఫూర్తి పొందడం అంత సులువు కాదని... అయితే తనకు మరో దారి లేదు కాబట్టి పట్టుదల కనబర్చానన్నాడు. ఈ అవకాశాన్ని తాను పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటానని యువరాజ్ విశ్వాసం వ్యక్తం చేశాడు. ‘ఆస్ట్రేలియా లో ఆడటం అంత సులువు కాదు. అయితే అవకాశం దక్కడం సంతోషం. ప్రపంచకప్కు కూడా ఎంపికవుతాననే నమ్మకముంది. గతంలోలాగే బా గా ఆడాలని అంతా కోరుకుంటారు కాబట్టి ఒత్తిడి ఉండటం సహజం’ అని ఈ పంజాబీ ధీమా కనబర్చాడు. కష్టకాలంలో తనకు అండగా నిలిచిన కు టుంబ సభ్యులు, స్నేహితులతో పాటు తన ధార్మిక గురువుకు కూడా యువీ కృతజ్ఞతలు తెలిపాడు. -
25కే రన్ లో యువీ-నేహాల సందడి
కోల్ కతా:దాదాపు 20 నెలల అనంతరం భారత జాతీయ క్రికెట్ జట్టులోకి పునరాగమనం చేసిన స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్.. నగరంలో ఆదివారం నిర్వహించిన 'టాటా స్టీల్ కోల్ కతా 25 కే రన్' కార్యక్రమంలో సందడి చేశాడు. బాలీవుడ్ నటి నేహా ధూపియాతో కలిసి యువీ అభిమానుల్ని అలరించాడు. ఈ కార్యక్రమం ప్రారంభోత్సవానికి ఈ ఇద్దరు సెలబ్రిటీలు హాజరు కావడంతో అక్కడ మంచి జోష్ కనిపించింది. గతంలో వీరిద్దరి ప్రేమాయణం కొనసాగి డేటింగ్ వరకూ వెళ్లిందనే వార్తలు అప్పట్లో పెద్ద దుమారాన్ని రేపాయి. అటు తరువాత కూడా యువీ మరికొందరు బాలీవుడ్ భామలతో కూడా డేటింగ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే బాలీవుడ్ భామలతో ప్రేమ వ్యవహారాన్ని డేటింగ్ వరకే పరిమితం చేయాలనుకున్నాడో?ఏమో కానీ.. ఆ తరువాత బ్రిటీష్ నటి హాజల్ కీచ్ తో ప్రేమాయణం కొనసాగించాడు. ఇటీవల యువీ-హాజల్ కిచ్ ల నిశ్చితార్థం కూడా జరిగింది. వీరిద్దరూ ఫిబ్రవరిలో పెళ్లి చేసుకునే అవకాశం ఉంది. -
బాలీవుడ్ ఛాన్స్ కొట్టేసింది
రాయ్లక్ష్మీగా పేరు మార్చుకున్న తరువాత లక్ష్మీరాయ్ కి బాగానే కలిసొస్తున్నట్టుగా ఉంది. ఇన్నాళ్లు అవకాశాల కోసం ఎదురుచూసిన ఈ భామ ఇప్పుడు వరుస ఆఫర్లతో ఉక్కిరిబిక్కిరి అవుతుంది. కాంచన మాల కేబుల్ టివి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైన ఈ భామ, సక్సెస్ కోసం చాలా కాలం పాటు ఎదురుచూసింది. ఇటీవల లక్ష్మీరాయ్ కాస్తా రాయ్ లక్ష్మీగా మారిన తరువాత వరుస సక్సెస్ లతో దూసుకుపోతుంది. ఇప్పటికే కోలీవుడ్ లో స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్న ఈ భామ టాలీవుడ్ లో కూడా క్రేజీ ఆఫర్ ను కొట్టేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్నసర్థార్ గబ్బర్ సింగ్ లో ఓ స్పెషల్ సాంగ్ చేస్తున్న ఈ భామ కొన్ని సీన్స్ లో కూడా కనిపించనుందట. ఈ సినిమాతో పాటు కోలీవుడ్ లో మరో అరడజను సినిమాలతో యమా బిజీగా ఉంది లక్ష్మీ. ఇలా చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న సమయంలోనే అందాల భామకు బాలీవుడ్ నుంచి పిలుపొచ్చింది. క్రియేటివ్ డైరెక్టర్ దీపక్ శివదాసని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సీక్వల్ మూవీ జూలి సినిమాలో లీడ్ రోల్ కు లక్ష్మీ రాయ్ ని ఎంపిక చేశారు. 2004లో రిలీజ్ అయిన తొలి భాగంలో నేహాదూపియ నటించిన ఈ పాత్రలో సీక్వల్ కోసం లక్ష్మీరాయ్ నటించనుంది. గ్లామర్ డోస్ కూడా కాస్త ఎక్కువగానే ఉండే సినిమా కోసం పర్ఫెక్ట్ ఫిగర్ లో కనిపించాలని బరువు తగ్గే పనిలో పడింది రాయ్ లక్ష్మీ. -
ఆగస్టు 27న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకొంటున్న దలీప్ సింగ్ రాణా (ద గ్రేట్ కాళి) (రెజ్లర్), నేహా ధూపియా (నటి) ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారి వ్యక్తిగత సంవత్సర సంఖ్య 7. ఈ సంవత్సరం సృజనాత్మక రంగంలో ఉన్న వారికి, రచనారంగం, టీవీ, మీడియా, సినీరంగంలోని వారికి మంచి గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు వచ్చే అవకాశం ఉంది. విదేశీ చదువు, విదే శీ ఉద్యోగం కోసం కంటున్న కలలు నెరవేరతాయి. డాక్టర్లు, ఫార్మశీ, దైవసంబంధమైన కార్యాలలో ఉన్న వారి కృషికి తగ్గ ఫలితం దక్కుతుంది. సన్మానాలు జరుగుతాయి. కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మిత్రుల సలహా తీసుకోవడం మంచిది. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపించకుండా, తగాదాలు రాకుండా జాగ్రత్తపడటం మంచిది. ఈ రోజు పుట్టిన తేదీ 27 కాబట్టి కుజుని ప్రభావం వల్ల ధైర్యం, సహనం, కొత్త ఆలోచనలు, సమాజం పట్ల అంకిత భావం వంటి మంచి లక్షణాలుంటాయి. సొంత ఇంటి కల నెరవేరుతుంది. ఆస్తులు సమకూర్చుకుంటారు. ప్రేమికులు జాగ్రత్తగా వ్యవహరించాలి. కోర్టుకేసులు, న్యాయసంబంధమైన వివాదాలు ఉన్న వారు కొంచెం సంయమనం పాటించాలి. అలాగే అహంభావం, దూకుడు తగ్గించుకోవడం మంచిది. లక్కీనంబర్స్: 1,2,6,7, లక్కీ డేస్: ఆది, సోమ, మంగళ, శుక్రవారాలు లక్కీ కలర్స్: వైట్, సిల్వర్, గ్రే. సూచనలు: కేతుగ్రహజపం, సుబ్రహ్మణ్యాభిషేకం చేయించుకోవడం, దుర్గాదేవిని లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం, వికలాంగులకు సేవ చేయడం, తోబుట్టువులను ఆదరించడం మంచిది. - డాక్టర్ మహమ్మద్ దావూద్ -
నేహా ధూపియా ట్వీట్లపై కలకలం
ముంబై: బాలీవుడ్ నటి నేహా ధూపియా చేసిన ట్వీట్లు కలకలం రేపాయి. ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ఆమె చేసిన వ్యాఖ్యలపై ఆయన మద్దతుదారులు మండిపడుతున్నారు. మోదీని విమర్శించే అర్హత ఆమెకు లేదంటూ ఎదురుదాడికి దిగారు. మంగళవారం కురిసిన భారీ వర్షానికి ముంబై మహానగరం స్తంభించింది. దీనిపై నేహా ధూపియా ట్విటర్ లో స్పందించారు. 'ఒక్క వర్షానికే ముంబైలో జనజీవనం స్తంభించింది. మంచి పరిపాలన అంటే సెల్ఫీలు తీసుకోవడం, యోగా చేయడం కాదు. ప్రజలు సురక్షితంగా ఉండేలా చూడడం పాలకుల కర్తవ్యం' అంటూ ట్వీట్ చేశారు. మోదీని ఉద్దేశించి చేసిన ఈ వ్యాఖ్యలపై ఆయన మద్దతుదారులు రీట్వీట్లతో తీవ్రస్థాయిలో స్పందించారు. వార్తల్లో నిలిచేందుకు శృతి సేథ్, నేహా ధూపియా లాంటి సి-గ్రేడ్ నటీమణులు మోదీని విమర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. నేహా ధూపియా ఎలాంటి సినిమాలు చేసిందో చూడాలని మరొకరు వ్యాఖ్యానించారు. అయితే మోదీ వ్యతిరేకులు ఆమెకు బాసటగా నిలిచారు. బీజేపీ నాయకుల మాదిరిగానే మోదీ మద్దతుదారులు వేధింపులకు గురిచేస్తున్నారని విమర్శించారు. One rain n the city comes to a standstill. Good governance is not about selfies n makin us do yoga,it's making sure ur citizens r safe. — Neha Dhupia (@NehaDhupia) July 21, 2015 -
ట్వీట్స్
ట్రైన్లో ప్రయాణించడం అంటే ఇష్టం. ప్రయాణానికి ఎక్కువ సమయం పడుతుందా, తక్కువ సమయం పడుతుందా అనేది వేరే విషయం. ప్రతి కంపార్ట్మెంట్, ప్రతి ప్రయాణికుడు, ప్రతి ప్లాట్ఫాం...మనకు ఒక కథ చెబుతాయి! ట్రైన్లో ప్రయాణిస్తున్నప్పుడు ఈ కథలను వినుకుంటూ వెళ్లవచ్చు. -నేహా దూపియా -
కె.జె. యేసుదాసుపై మండిపడ్డ బాలీవుడ్ నటి
ఇండోర్:మహిళల వస్త్రధారణకు సంబంధించి వివాదస్పద వ్యాఖ్యలు చేసిన ప్రముఖ గాయకుడు కె.జె.యేసుదాసుపై బాలీవుడ్ నటి నేహా ధూపియా మండిపడ్డారు. ఆయన చేసిన తాజా వ్యాఖ్యలతో మహిళలను తక్కువ చేసినట్లేనని ఆమె విమర్శించారు.' ఇది నిజంగా దురదృష్టం. మహిళలు ఏది ధరించాలి. ఏది ధరించకూడదు' అని పేర్కొనడం సమాజానికే సిగ్గు చేటన్నారు. దేశం పురోగమనం సాధిస్తున్న దశలో ఈ వ్యాఖ్యలు ప్రముఖ స్థానంలో వ్యక్తి చేయడం బాధాకరమన్నారు. '21 టోపాన్ కీ సలామీ' చిత్ర ప్రమోషన్ కార్యక్రమానికి విచ్చేసిన నేహా ఈ వ్యాఖ్యలు చేశారు. గాంధీ జయంతి సందర్భంగా తిరువనంతపురంలో ఓ స్వచ్ఛంధ సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహిళలు జీన్స్ ధరించడాన్ని యేసుదాసు తప్పుబట్టిన సంగతి తెలిసిందే. జీన్స్ ధరించడం భారత సంస్కృతికి విరుద్ధమని, మహిళలు జీన్స్ ధరించడం ద్వారా ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదన్నారు. నిండుదనంతో కూడిన వస్త్రాలనే ధరించాలని సూచించారు. నిరాడంబరత్వం, మంచితనం భారత మహిళల్లోని గొప్ప లక్షణాలని, వారు జీన్స్ ధరించడం భారత సంస్కృతికి వ్యతిరేకమని పేర్కొన్నారు. -
నిర్మాతగా..?
పూజా భట్, జూహీ చావ్లా, ప్రీతీ జింటా, దియా మీర్జా.. ఇలా పలువురు బాలీవుడ్ తారలు నిర్మాతలుగా మారారు. ఇప్పుడీ జాబితాలో నేహా ధూపియా చేరనున్నారు. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ చెప్పుకోదగ్గ చిత్రాలు చేసే అవకాశం రాలేదామెకు. ప్రస్తుతం ఒకటి, రెండు సినిమాలు చేస్తున్నారు. త్వరలో నిర్మాతగా మారాలనుకుంటున్నారామె. ‘‘నటన మాత్రం కాకుండా నాకేదైనా వ్యాపారం చేయాలనిపిస్తే, కచ్చితంగా నా దృష్టి నిర్మాణ రంగం పైనే ఉంటుంది. ఫిలిం మేకింగ్ అంటే నాకు చాలా ఆసక్తి. మంచి మంచి సినిమాలు నిర్మించాలన్నది నా లక్ష్యం’’ అని ఇటీవల ఓ సందర్భంలో నేహా పేర్కొన్నారు. ‘‘మీరు నిర్మించే చిత్రాల్లో మీరే నాయికగా నటిస్తారా?’’ అనే ప్రశ్న నేహా ముందుంచితే -‘‘ఆ విషయం గురించి ఇంకా ఆలోచించలేదు’’ అన్నారు. -
'జూలీ' సీక్వెల్లో నటించనన్న నెహా ధూపియా
ముంబై: మాజీ మిస్ ఇండియా నెహా ధూపియా 'జూలీ' సీక్వెల్లో నటించడానికి ఇష్టపడటంలేదు. 2004లో విడుదలైన జూలీ చిత్రంలో నెహా తన అందాలను అతిగా ఆరబోసి సంచలనం సృష్టించింది. ఆ చిత్రంలో ఆమె వ్యభిచారిగా నటించింది. ఇప్పుడు ఆదే చిత్రం సీక్వెల్లో నటించమంటే ఆమె తిరస్కరించారు. ''అవును జూలీ 2లో నటించమని నన్ను అడిగారు. అయితే ప్రస్తుతం తాను ఆ చిత్రంలో నటించాలని అనుకోవడంలేదు. అందువల్ల తిరస్కరించాను'' అని ఈరోజు ఇక్కడ ఒక ఇంటర్వ్యూలో నెహా ధూపియా చెప్పారు. డిఫరెంట్గా ఉండే కథా చిత్రాలలో నటించాలని అనుకుంటున్నట్లు తెలిపారు. తాను త్వరలో ఒక హాస్య కథా చిత్రంలో నటిస్తున్నట్లు చెప్పారు. మూస చిత్రాలలో కాకుండా డిఫరెంట్గా ఉండే సినిమాలలో నటించాలని తనకు ఉంటుందని తెలిపారు. జూలీలో నటించినప్పుడు కూడా అలానే అనుకున్నట్లు చెప్పారు. అయితే ఇప్పుడు అటువంటి చిత్రాలలో నటించాలని అనుకోవడంలేదని నెహా చెప్పారు. ** -
జూలీ సీక్వెల్కు నేహ నో
ముంబై: బాలీవుడ్ నటి, మాజీ మిస్ ఇండియా నేహా ధూపియా జూలీ చిత్రం సీక్వెల్లో నటించేందుకు నిరాకరించారు. 2004లో విడుదలైన జూలీ సినిమాలో నేహ గ్లామర్ రోల్లో నటించారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సినిమా సీక్వెల్ ఆఫర్ను తిరస్కరించినట్టు నేహా చెప్పారు. పంజాబ్ చిత్రాల్లోనూ నటించిన నేహా ప్రస్తుతం హిందీలో ఓ కమెడీ సినిమాతో పాటు కరణ్ జోహార్ చిత్రంలో నటిస్తున్నారు. -
లాక్మేలో ఇలియానా, మలైకా, కరిష్మా మెరుపులు