New buses
-
అబ్బా.. సర్కారు డబ్బా!
2,736 కొత్త బస్సుల కొనుగోలుకు నిర్ణయంరాబోయే మూడేళ్లలో ఆర్టీసీకి 2,736 కొత్త బస్సులు కొనుగోలు చేయాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఇప్పటికే గత మూడేళ్లుగా ఆర్టీసీ కొత్త బస్సు లను కొనుగోలు చేస్తోంది. ఇప్పుడు కొత్తగా కొనాలని నిర్ణయించిన 2,736 బస్సుల్లో మొదటి దశ కింద 1,500 బస్సుల టెండర్ ప్రక్రియ చేపట్టాం. డిసెంబర్ లేదా జనవరి నుంచి వీటిని.. మిగిలిన వాటిని ఆ తర్వాత దశలవారీగా ప్రవేశపెడతాం. – 2023, మార్చి 7న అప్పటి ఆర్టీసీ ఎండీ హోదాలో ద్వారకా తిరుమలరావు మీడియాకు వెల్లడించిన విషయం సాక్షి, అమరావతి : 2023లో నాటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం 1,500 కొత్త బస్సుల కొనుగోలు ప్రక్రియ చేపట్టింది. టెండర్లు పూర్తిచేసి ఆర్డర్లు కూడా జారీచేసేసింది. బస్సులు కూడా వచ్చేశాయి. వాటిని ప్రారంభించడమే తరువాయి.. ఇంతలో ఎన్నికల కోడ్ వచ్చి బ్రేక్ పడింది. ఆ తర్వాత ప్రభుత్వం మారింది. ఇప్పుడా బస్సులను ప్రస్తుత ప్రభుత్వం కేవలం జెండా ఊపి ప్రారంభిస్తోందంతే. కానీ, అంతా తామే చేశామన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం యమా బిల్డప్ ఇస్తోంది. ఈ బస్సుల కొనుగోళ్లలో వీరి పాత్ర పిసరంత కూడా లేకపోయినా తెగ డబ్బా కొట్టుకుంటున్నారు. సొమ్మొకరిది.. సోకొకరిది అన్నట్లుగా ఉంది టీడీపీ కూటమి ప్రభుత్వ తీరు. విషయం ఏమిటంటే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన పనులను ప్రస్తుత సర్కారు ప్రారంభిస్తూ అంతా తామే చేశామని గప్పాలు కొట్టుకుంటున్న జాబితాలో ఆర్టీసీ కొత్త బస్సుల ప్రారంభం కూడా చేరింది. టీడీపీ ప్రభుత్వం 1,400 కొత్త ఆర్టీసీ బస్సులను ప్రారంభించిందని ఆయన గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ, వాస్తవం ఏమిటంటే.. ఆ బస్సుల కొనుగోళ్లకు సంబంధించి కర్త, కర్మ, క్రియ అంతా వైఎస్సార్సీపీ సర్కారే. ఇప్పుడు వాటిని ప్రస్తుత ప్రభుత్వం కేవలం ప్రారంభిస్తోందంతే. కానీ, ఆ వాస్తవాన్ని మరుగునపెట్టి వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని విమర్శించడం విడ్డూరంగా ఉంది. మూడు దశల్లో 2,906 బస్సుల కొనుగోలు నిజానికి.. 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆర్టీసీకి కొత్త బస్సుల కొనుగోలు ప్రక్రియ చేపట్టింది. ముందుగా 2019–20లో కొత్త బస్సులు కొనుగోలు చేసింది. పాత బస్సుల స్థానంలో 900 సరికొత్త డీజిల్ బస్సులను ప్రవేశపెట్టింది. తిరుమల–తిరుపతి ఘాట్రోడ్డుతో పాటు తిరుపతి సమీప పట్టణాల్లో విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టిన ఘనత కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వానిదే. రెండేళ్లపాటు కోవిడ్ ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ 2019 నుంచి 2023 మధ్య ఆర్టీసీ మొత్తం 1,406 కొత్త బస్సులను కొనుగోలు చేసింది. ఇక 2023 చివరిలో మరో 1,500 కొత్త డీజిల్ బస్సుల కొనుగోలు ప్రక్రియను చేపట్టింది. టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి ఆర్డర్లు కూడా జారీచేసింది. కాంట్రాక్టు దక్కించుకున్న కంపెనీలు ఎన్నికల ముందు సరఫరా చేశాయి. ఎన్నికల నియమావళి ఉండటంతో గత ప్రభుత్వం ప్రారంభించలేదు. వాటినే ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం ప్రారంభిస్తోంది.. అంతే! టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీకి కొత్త బస్సుల కొనుగోలు కోసం ఇప్పటివరకు టెండర్లు పిలవనే లేదు. మరి టెండర్లు పిలవకుండానే కొత్త బస్సులను రెండు నెలల్లో ఎలా కొనుగోలు చేస్తారో ప్రభుత్వం చెప్పాలి. వాస్తవానికి ఈ బస్సులన్నింటికీ టెండర్లు పిలిచి డబ్బులు చెల్లించింది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే. ఈ బస్సులకు మహా అయితే ఈ రెండు నెలల కాలంలో తుది మెరుగులుదిద్ది ఉంటారు. ఇప్పుడు వీటికి జెండా ఊపుతూ అదేదో మొత్తం తమ ప్రభుత్వ ఘనతగా చెప్పుకుంటూ టీడీపీ లేబుల్ వేసుకుంటున్న తీరుని చూసి జనం నవ్వుకుంటున్నారు. -
దూరప్రాంతాలకు కొత్తగా వెయ్యి బస్సులు
గన్నవరం: ప్రయాణికులకు మెరుగైన సేవలందించడంతో పాటు సిబ్బంది సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు తెలిపారు. కృష్ణాజిల్లా గన్నవరం ఆర్టీసీ బస్టాండ్, డిపోను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రయాణికులు, విద్యార్థులతో మాట్లాడి ఆర్టీసీ సర్వీస్ల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం డిపోను పరిశీలించిన ఎండీ, బస్సుల కండీషన్పై గ్యారేజ్ సిబ్బంది నుంచి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెగ్యులర్ సర్వీస్ల ఆదాయంతోపాటు, కమర్షియల్ ఆదాయం పెంచే దిశగా కార్యాచరణ చేపట్టినట్లు తెలిపారు గతంలో 15 ఏళ్లకు ఆర్టీసీ స్థలాలు లీజుకు ఇచ్చినప్పటికీ సరైన స్పందన రాలేదని, ఈ విషయంలో కొన్ని మార్పులు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సంస్థ కొత్తగా కొనుగోలు చేసిన వెయ్యి డీజిల్ బస్సులు వస్తుండటం వల్ల దూర ప్రాంత సర్వీస్లు పెరిగే అవకాశం ఉందన్నారు. పాత ఎక్స్ప్రెస్ బస్సులను పల్లె వెలుగు బస్సులుగా మార్పులు చేసి గ్రామీణ సర్వీస్లకు ఉపయోగిస్తామని చెప్పారు. అద్దె బస్సులను కూడా బ్రాండ్ న్యూ కింద కొత్తగా తీసుకున్నామని వివరించారు. ఇటీవల మహాశివరాత్రి, సంక్రాంతి, శబరిమలకు నడిపిన సర్వీస్ల వల్ల ఆర్టీసీ ఆదాయం పెరిగిందన్నారు. భక్తుల సౌకర్యార్ధం దేవాలయాల సందర్శన ప్రత్యేక సర్వీస్లను కూడా పెంచామని చెప్పారు. ఆర్టీసీలో పని చేస్తున్న సిబ్బంది సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్నట్లు తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులకు ప్రతినెల 1వ తేదీనే జీతాలు పడుతున్నాయని, పీఎఫ్ ట్రస్ట్ను కూడా బలోపేతం చేసినట్లు పేర్కొన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత సంస్థ అప్పులు కూడా చాలావరకు తీర్చివేసినట్లు తెలిపారు. గన్నవరం బస్టాండ్ ఆవరణలో ఖాళీగా ఉన్న స్థలాలను లీజుకు ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు పేర్కొన్నారు. డిపో మేనేజర్ పి. శివాజీ నేతృత్వంలో సిబ్బంది ఎండీకి ఘన స్వాగతం పలికారు. -
అమ్మో ‘రాజధాని’ బస్సులు
సాక్షి, హైదరాబాద్: రాజధాని బస్సులు ఆర్టీసీ ప్రయాణికులకు చుక్కలు చూపుతున్నాయి. విరిగిన కుర్చిలు, సరిగ్గా పనిచేయని ఏసీ, పరిశుభ్రత అంతంతమాత్రమే కావడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రయాణికుల నుంచి సంపూర్ణ ఆదరణ ఉన్నా, కొత్త బస్సులు కొనేందుకు ఆర్టీసీ వద్ద నిధులు లేకపోవటంతో కావాల్సినన్ని బస్సులను ఆర్టీసీ సమకూర్చుకోలేకపోతోంది. గత సంవత్సరం ఖరారైన టెండర్లకు సంబంధించిన బస్సులు విడతల వారీగా సమకూరుతున్నాయి. కానీ, అది ఆర్టీసీ డిమాండ్కు తగ్గట్టుగా లేకపోవటంతో గత్యంతరం లేని పరిస్థితిలో డొక్కు బస్సులను ఆర్టీసీ కొనసాగించాల్సి వస్తోంది. ఇటీవల 750 వరకు కొత్త సూపర్ లగ్జరీ బస్సులు ఆర్టీసీ కొనుగోలు చేసింది. పాత సూపర్ లగ్జరీ బస్సుల్లో కొన్నింటిని వినియోగించుకుంటూ, మిగతా వాటిని ఎక్స్ప్రెస్ బస్సులుగా, సిటీ బస్సులుగా అధికారులు మార్చారు. కానీ, రాజధాని కేటగిరీకి మాత్రం కొత్త బస్సులు లేక, పాత వాటినే వినియోగిస్తున్నారు. డిమాండ్ ఉన్నా.. రాజధాని బస్సులకు బాగా డిమాండ్ ఉంది. గరుడ బస్సుల్లో టికెట్ ధర ఎక్కువగా ఉన్నందున, టికెట్ ధరలు తక్కువగా ఉండే ఏసీ బస్సుల్లో ప్రయాణించేందుకు ప్రయాణికులు ఆసక్తి చూపుతున్నారు. రైలు నెట్వర్క్, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు అంతగా తిరగని దూర ప్రాంతాల్లో ఈ బస్సులకు మంచి డిమాండ్ ఉంది. ఆదివారం, ఇతర సెలవు రోజుల్లో అయితే, విజయవాడ లాంటి రైలు కనెక్టివిటీ మెరుగ్గా ఉన్న ప్రాంతాలకు కూడా వీటిల్లో సీట్లు దొరకని పరిస్థితి ఉంది. 2016లో కొన్న బస్సులే... ప్రస్తుతం 235 రాజధాని బస్సులు మాత్రమే తిరుగుతున్నాయి. అవన్నీ 2016లో కొన్న బస్సులు. సాధారణంగా ఐదు లక్షల కిలోమీటర్లు తిరగ్గానే బస్సులను మార్చేస్తారు. కానీ, ఇవి 10 లక్షల కి.మీ. తిరిగినా వాటినే వాడాల్సి వస్తోంది. పాతవాటి స్థానంలో కొత్తవి కొనాల్సి ఉన్నా నిధుల లేమితో ఆర్టీసీ సమకూర్చుకోలేకపోయింది. గతేడాది 46 బస్సులకు టెండర్లు పిలిచారు. తాజాగా అవి సమ కూరాయి. దీంతో వాటి సంఖ్య 281కి చేరింది. వాస్తవానికి పాత 235 బస్సు లను తొలగించి అంతమేర కొత్తవి సమకూర్చుకోవాల్సి ఉంది. నిధులు లేక కొత్తవి కొనలేకపోతున్నారు. అన్నీ సమస్యలే.... పాత బస్సుల్లో ఏవీ సక్రమంగా ఉండటం లేదు. సీట్లు పాడైనా మరమ్మతు చేయకుండానే ట్రిప్పులకు పంపుతున్నారు. ఆది, సోమవారాల్లో పరిస్థితి దారుణంగా ఉంటోంది. సీట్లు విరిగినా.. ఆన్లైన్లో అడ్వాన్స్ రిజర్వేషన్లో ఉంచుతున్నారు. వాటిని బుక్ చేసుకున్నవారు వాటిల్లో కూర్చోలేక నానా తిప్పలు పడుతున్నారు. కొందరు మధ్యలోనే దిగిపోతున్నారు. ఇక వాటిల్లో ఏసీ వ్యవస్థ పాతబడి సరిగ్గా పనిచేయటం లేదు. మధ్యాహ్నం వేళ ఏసీ ప్రభావం అంతగా లేక ప్రయాణికులు ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం ఎండ తీవ్రత పెరగటంతో ఈ బస్సులెక్కాలంటే జనం ఇబ్బంది పడుతున్నారు. ఈ బస్సుల్లో సిబ్బందితో ప్రయాణికుల వాగ్వాదం నిత్యకృత్యమైంది. -
‘‘బీఆర్ఎస్ ఓటమికి ఆర్టీసీ కార్మికులు కృషి చేశారు’’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ పాత్ర ఎవరు మర్చిపోరని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని ఆర్టీసీ కార్మికులు ముందుండి నడిపించారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ మార్గ్లో 100 కొత్త బస్సులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్కలతో కలిసి రేవంత్రెడ్డి శనివారం ప్రారంభించారు. ‘కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పుడు కొత్త బస్సులు ప్రారంభించుకుంటున్నాం. రాష్ట్రం ఏర్పడితే సమస్యలు పరిష్కరిస్తారని ఆర్టీసీ కార్మికులు అనుకున్నారు కానీ పరిష్కారం కాలేదు. గత ప్రభుత్వం మిమ్మల్ని విస్మరించింది. ఎంతో మంది ఆర్టీసి కార్మికులు ప్రాణ త్యాగం చేశారు. అయినా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. గత ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి మీ కృషి ఏంతో ఉంది. మహాలక్ష్మి స్కీమ్ను మేనిఫెస్టోలో పెట్టాం. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఈ పథకం అమలు చేశాం. 15 కోట్ల 27 లక్షల మంది మహిళలు ఆర్టీసి లో ఉచితంగా ప్రయాణం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిజమైన అంకెలతో ఈ బడ్జెట్ ప్రవేశ పెట్టింది. గత ప్రభుత్వాల బడ్జెట్ వాస్తవ రూప దాల్చదు అని అధికారులు అన్నారు’అని రేవంత్రెడ్డి తెలిపారు. ఇదీ చదవండి.. బడ్జెట్పై హరీశ్రావు కీలక వ్యాఖ్యలు -
ఆర్టీసీ సిబ్బందిపై దాడులను సహించం: మంత్రి పొన్నం ప్రభాకర్
-
కొత్త బస్సులను ప్రారంభించిన టీఎస్ఆర్టీసీ
-
రోడ్డెక్కనున్న కొత్త బస్సులు
సాక్షి,హైదరాబాద్ : ఆర్టీసీ బస్సుల్లో మహిళల రద్దీ పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం కొత్తగా బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. 30 ఎక్స్ప్రెస్, 30 రాజధాని ఏసీ, 20 లహరి స్లీపర్ కమ్ సీటర్(నాన్ ఏసీ) బస్సులను హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గ్లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద శనివారం ఉదయం 10 గంటలకు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నంప్రభాకర్ జెండా ఊపి లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి రవాణా, రహదారి, భవనాలశాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, రవాణాశాఖ కమిషనర్ జ్యోతి బుద్దా ప్రకాశ్తోపాటు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తదితరులు హాజరవుతారు. రూ. 400 కోట్లతో 1,050 కొత్త బస్సులు ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైనసేవలు అందించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిరంతరం కృషి చేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరానికిగాను రూ.400 కోట్ల వ్యయంతో అధునాతనమైన 1,050 కొత్త డీజిల్ బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. వాటిలో 400 ఎక్స్ప్రెస్, 512 పల్లెవెలుగు, 92 లహరి స్లీపర్ కమ్ సీటర్, 56 ఏసీ రాజధాని బస్సులు న్నాయి. వీటికి తోడు పర్యావరణహితమైన ఎలక్ట్రిక్ వాహనాలను హైదరాబాద్ సిటీలో 540, జిల్లాల్లో 500 బస్సులను కూడా అందుబాటులోకి తేనుంది. ఇవన్నీ విడతల వారీగా వచ్చే మార్చి నాటికి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చేలా సంస్థ ప్లాన్ చేసింది. -
ఆర్టీసీకి 910 కొత్త బస్సులు
సాక్షి, హైదరాబాద్: మూడునెలల్లో ఆర్టీసీకి 910 కొత్త బస్సులు సమకూరబోతున్నాయి. చాలా కాలంగా పాతబడ్డ బస్సులతో లాక్కొస్తుండగా, వాటిల్లోంచి కొన్నింటిని తుక్కుగా మార్చేసి.. కొత్త బస్సులు అందుబాటులోకి తేవాలని సంస్థ నిర్ణయించింది. ఇప్పటికే టెండర్లు పిలవగా టాటా, అశోక్ లేలాండ్ కంపెనీలు తక్కువ కొటే షన్తో ముందుకొచ్చాయి. టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి నెగోషియేషన్స్ ద్వారా వాటి కొటేషన్ మొత్తాన్ని కొంతమేర తగ్గించేందుకు ఆర్టీసీ అధి కారులు చర్చలు జరుపుతున్నారు. మరికొద్ది రో జుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసి, రెండు కంపెనీలు ఒకే ధరకు ముందుకొచ్చేలా చేసి, వాటికే ఆర్డర్ ఇవ్వాలని చూస్తున్నారు. ఈ నెలలోనే కంపెనీ లకు బస్సులు ఆర్డర్ ఇస్తే...బస్ బాడీల నిర్మా ణానికి మూడు నెలల సమయం పడుతుంది. ఎక్స్ప్రెస్ బస్సులు 540 ఆర్టీసీలో బాగా డిమాండ్ ఉన్న ఎక్స్ప్రెస్ కేటగిరీని బలోపేతం చేయాలని సంస్థ నిర్ణయించింది. ప్రస్తుతం అద్దె బస్సులుపోను సొంతంగా 1,800 వరకు ఎక్స్ప్రెస్ బస్సులున్నాయి. ఇవి ఎక్కువ ఆక్యుపెన్సీ రేషియోతో నడుస్తూ ఆర్టీసీకి మంచి ఆదాయాన్ని తెచ్చి పెడుతున్నాయి. దూర ప్రాంత పట్టణాల మధ్య ఇవి తిరుగుతున్నాయి. కొన్ని ఇతర రాష్ట్రాలకు కూడా వెళుతున్నాయి. ఈ నేపథ్యంలో 540 కొత్త ఎక్స్ప్రెస్ బస్సులు సమకూర్చుకోవాలని ఆర్టీసీ అనుకుంటోంది. వాటి రాకతో డొక్కు ఎక్స్ప్రెస్ బస్సులు అదే సంఖ్యలో తొలగిస్తారు. వాటిల్లో కొన్నింటిని సిటీ బస్సులుగా, మరికొన్నింటిని పల్లెవెలుగు బస్సులుగా కన్వర్ట్ చేస్తారు. అంతమేర సిటీ, పల్లెవెలుగు పాత డొక్కు బస్సులను తుక్కుగా మారుస్తారు. స్లీపర్ కమ్ సీటర్ రాజధాని బస్సులు 50 లేదా 60 ఇక దూరప్రాంత పట్టణాల మధ్య తిరుగుతున్న రాజధాని (ఏసీ) బస్సులకు కూడా మంచి ఆదరణ ఉంది. ప్రస్తుతం ఉన్న బస్సులు బాగా పాతబడిపోయాయి. వాటిల్లోంచి మరీ పాత బస్సులను తొలగించి కొన్ని కొత్తవి సమకూ ర్చాలన్న ఉద్దేశంతో 50 లేదా 60 బస్సులు కొంటున్నారు. ప్రస్తుతం రాజధాని కేటగిరీ బస్సు లన్నీ సీటర్ బస్సులే. తొలిసారి ఆ కేటగిరీలో స్లీపర్ బస్సులు సమకూర్చనున్నారు. పైన కొన్ని బెర్తులు, దిగువ సీట్లు ఉండే స్లీపర్ కమ్ సీటర్ బస్సులు తీసుకోవాలని నిర్ణయించారు. ఎట్టకేలకు పల్లెవెలుగుకు కొత్త బస్సులు సాధారణంగా ఎక్స్ప్రెస్, రాజధాని బస్సులు పాతబడ్డాక వాటిని తొలగించి సిటీ ఆర్డినరీ, పల్లె వెలుగు బస్సులుగా కన్వర్ట్ చేస్తారు. దీంతో ఆ బస్సులు చాలా పాతబడి ఉంటున్నాయి. అయితే కొత్తగా ఇప్పుడు 100 నుంచి 120 మధ్యలో కొత్త బస్సులు సమకూర్చాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం చాలా ఊళ్లకు అద్దె బస్సులే నడుస్తున్నాయి. మరో 200 కొత్త బస్సులు హైదరాబాద్ సిటీకి కేటాయిస్తారు. -
APSRTC: కొత్తగా 1500 బస్సులు కొనుగోలుకు ప్లాన్!
సాక్షి, అమరావతి: ఏపీఎస్ఆర్టీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ ఉద్యోగుల ప్రయోజనాల పరిరక్షణకు అవసమరైన అన్ని చర్య లు తీసుకోవాలని ఆ సంస్థ పాలకమండలి నిర్ణయించింది. క్యాడర్ స్ట్రెంత్ సర్దుబాటుతో ఉద్యోగుల ప్రయోజనాలకు విఘాతం కలగకుండా తగిన విధానాన్ని రూపొందించాలని తీర్మానించింది. కాగా, విజయవాడ ఆర్టీసీ భవన్లో గురువారం పాలకమండలి సమావేశం జరిగింది. కొత్తగా 1,500 బస్సులను కొనుగోలు చేయడంతోపాటు 100 ఈ–బస్సు లను అద్దె ప్రాతిపదికన తీసుకునేందుకు కూడా సమావేశంలో నిర్ణయించారు. ఆర్టీసీలో కారుణ్య నియామకాలకు ఆమో దించినందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ సమావేశం ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఈ సమావేశంలో ఆర్టీసీ చైర్మన్ మల్లి కార్జునరెడ్డి, ఎండీ సీహెచ్.ద్వారకా తిరు మలరావు, డైరెక్టర్ రాజ్రెడ్డి పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి: బలహీనపడిన అల్పపీడనం.. ఇక గట్టి వానలు తగ్గినట్టే! -
1,500 కొత్త బస్సులొస్తున్నాయి
సాక్షి, అమరావతి: ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు ఆర్టీసీ సన్నద్ధమవుతోంది. అందుకోసం కొత్తగా 650 బస్సుల కొనుగోలుకు నిర్ణయించింది. చాలా ఏళ్ల తరువాత ఆర్టీసీ కొత్త బస్సులు కొనుగోలు చేయనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. జీతాల వ్యయం, అందుకోసం అప్పులు, వాటిపై వడ్డీలు, ఇతర నిర్వహణ వ్యయాలతో ఆర్టీసీ దశాబ్దాలుగా తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతూ వస్తోంది. అప్పుల భారం పెరిగిపోవడంతో తొమ్మిదేళ్లుగా కొత్త బస్సులు కొనుగోలు చేయలేకపోయింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తరువాత ఏటా రూ.350 కోట్ల జీతాల భారం లేకుండాపోయింది. ఈ మూడేళ్లలోనే దాదాపు రూ.2 వేలకోట్ల అప్పులను తీర్చగలిగింది. మరోవైపు ఆక్యుపెన్సీ రేషియో పెరుగుతుండటంతో ఆర్టీసీ రాబడి కూడా క్రమంగా పెరుగుతోంది. దీంతో ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఆర్టీసీ కొత్త బస్సుల కొనుగోలుకు సిద్ధమైంది. అక్టోబర్ నుంచి ప్రతి నెల 200 బస్సులు మొత్తం ఏడు కేటగిరీల కింద రూ.650 కోట్లతో బస్సుల కొనుగోలుకు ఆర్టీసీ టెండర్ల ప్రక్రియ చేపట్టింది. సర్విసుల వారీగా అమరావతి–11, వెన్నెల–8, ఇంద్ర–32, స్టార్లైనర్–27, సూపర్లగ్జరీ–735, అ్రల్టాడీలక్స్–145, ఎక్స్ప్రెస్–542 బస్సులు కొనుగోలు చేయనుంది. అమరావతి సర్విసు కింద 11 బస్సులను నేరుగా ఓల్వో కంపెనీ నుంచి కొనుగోలు చేయాలని నిర్ణయించారు. మిగిలిన 1,489 బస్సుల కొనుగోలుకు ఆర్టీసీ టెండర్లు పిలిచింది. బీఎస్–6 మోడల్తో అత్యాధునిక ప్రమాణాలతో బస్సులను సరఫరా చేయాలని నోటిఫికేషన్లో పేర్కొంది. బిడ్లను ఈ నెల 20న తెరిచి, అనంతరం నెలరోజుల్లో టెండర్ల ప్రక్రియను పూర్తిచేయనుంది. అక్టోబర్ నుంచి ప్రతి నెల 200 కొత్త బస్సుల చొప్పున ప్రవేశపెట్టనుంది. 2024 ఏప్రిల్ నాటికి మొత్తం 1,500 బస్సులను ఆర్టీసీ అందుబాటులోకి తేనుంది. మరో 600 బస్సులను ఆధునికీకరించి పల్లెవెలుగు సర్విసులుగా ప్రవేశపెట్టాలని ఆర్టీసీ నిర్ణయించింది. ప్రస్తుతం పల్లెవెలుగు బస్సులు అప్పుడప్పుడు బ్రేక్డౌన్ అవుతుండటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. దీనికి పరిష్కారంగా ప్రస్తుతం ఎక్స్ప్రెస్ సర్విసులుగా ఉంటూ తక్కువ మైలేజీ ఇస్తున్న 600 బస్సుల బాడీలను రీఫర్బిíÙంగ్ ద్వారా ఆధునికీకరించి పల్లెవెలుగు సర్వీసులుగా నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. కొత్త బస్సుల కొనుగోలుతో ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందుతాయని ఆర్టీసీ ఎండీ ద్వారకాతిరుమలరావు చెప్పారు. -
AP: ప్రయాణికులకు గుడ్న్యూస్.. కొత్తగా 1,489 ఆర్టీసీ బస్సులు
సాక్షి, అమరావతి: ఏపీలో ఆర్టీసీ ప్రయాణికులకు ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. ప్రయాణికులకు మరింత మెరుగైన రవాణా సేవలందించేందుకు ఆర్టీసీ కొత్త బస్సుల కొనుగోలు ప్రక్రియ చేపట్టింది. కొత్తగా 1,489 బస్సులు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. దూర ప్రాంతాలు, అంతర్రాష్ట సర్వీసుల కోసం ఈ బస్సులను కొనుగోలు చేయనుంది. డీలర్ల వద్ద నుంచి కాకుండా నేరుగా బస్సుల తయారీ కంపెనీల నుంచే వాటిని కొనుగోలు చేయాలని నిర్ణయించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఒక్కో బస్ ఖరీదు దాదాపు రూ.45లక్షల చొప్పున మొత్తం రూ.670కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. కాగా టెండర్ల ప్రక్రియ పూర్తి పారదర్శకంగా నిర్వహించేందుకు జ్యుడీషియల్ ప్రివ్యూకు ఆర్టీసీ నివేదించింది. టెండర్ డాక్యుమెంట్లను జ్యుడీషియల్ ప్రివ్యూ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. టెండరు నిబంధనలు, ఇతర అంశాలపై సలహాలు, సూచనలు, అభ్యంతరాలను ఈమెయిల్ ద్వారా తెలిపేందుకు ఈ నెల 19 సాయంత్రం 5గంటల వరకు అవకాశం ఇచ్చారు. - టెండర్ పత్రాలు అందుబాటులో ఉంచిన జ్యుడిషియల్ ప్రివ్యూ వెబ్సైట్ www.judicialpreview. ap.gov.in - టెండర్ల ప్రక్రియపై సలహాలు, సూచనలు, అభ్యంతరాలు తెలిపేందుకు ఈమెయిల్స్ పంపాల్సిన జ్యుడీషియల్ ప్రివ్యూ ఈమెయిల్ ఐడీలు judge&jpp@ap.gov.in, apjudicialpreview@gmail.com. ఇది కూడా చదవండి: ఆదుకోవాలని వచ్చిన వారికి తక్షణ సాయం -
రోడ్డెక్కిన ఆర్టీసీ లహరి ఏసీ స్లీపర్ బస్సులు.. స్పెషల్ ఫీచర్స్ ఇవే..!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ తొలిసారి ప్రీమియం కేటగిరీ స్లీపర్ బస్సులను ప్రారంభించింది. ప్రయాణికుల సౌకర్యార్థం కోసం అత్యాధునిక హంగులతో కొత్తగా అందుబాటులోకి తీసుకొచ్చిన లహరి ఏసీ స్లీపర్ బస్సుల ప్రారంభోత్సవం హైదరాబాద్లోని ఎల్బీనగర్లో సోమవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, సంస్థ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, ఎండీ వీసీ సజ్జనర్ తదితరులు పాల్గొన్నారు. వీరంతా కలిసి లహరి బస్సులను జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. టీఎస్ఆర్టీసీ అత్యాధునిక హంగులతో కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకురావడం శుభపరిణామన్నారు. ఇటీవల 756 సూపర్ లగ్జరీ బస్సులను కొనుగోలు చేసిందని, వాటికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. ప్రజారవాణా వ్యవస్థను ప్రజలు మంచిగా ఆదరిస్తున్నారని, టీఎస్ఆర్టీసీ బస్సులు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేస్తాయనే గొప్ప నమ్మకాన్ని కూడగట్టుకుందని చెప్పారు. సంస్థను లాభాల బాటపట్టించేందుకు యాజమాన్యం వినూత్న ఆలోచనలను చేస్తోందని, సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రైవేట్కు ధీటుగా అమ్మఒడి అనుభూతి ట్యాగ్ లైన్' పేరుతో లహరి ఏసీ స్లీపర్ బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చిందని, వీటిని ప్రజలు మంచిగా ఆదరించాలని కోరారు. త్వరలోనే ఎలక్ట్రిక్ బస్సులనూ సమకూర్చుకుంటుందన్నారు. టీఎస్ఆర్టీసీని ప్రజలకు మరింతగా చేరువచేయడంలో సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ చేస్తోన్న కృషిని అభినందించారు. అలాగే, పేదల కనీస ప్రయాణ అవసరాలను తీర్చడంలో ప్రజా రవాణా వ్యవస్థ ప్రముఖ పాత్ర పోషిస్తోందన్నారు. చదవండి: డబుల్ ఇంజన్ అంటే మోదీ-అదానీ: మంత్రి కేటీఆర్ ప్రయాణికులకు శుభవార్త! 16 కొత్త ఏసీ స్లీపర్ బస్సులు రేపటి నుండి అందుబాటులోకి వస్తున్నాయి. రాష్ట్రంలో తొలిసారిగా వీటిని #TSRTC వాడకంలోకి తెస్తోంది. LB Nagar లో సోమవారం ఉదయం 9.30 గంటలకు ఈ బస్సులను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు ప్రారంభిస్తారు. #NewACSleeperBuses pic.twitter.com/WBrFy37xmt — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) March 26, 2023 టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ మాట్లాడుతూ.. తొలిసారిగా అందుబాటులోకి తెస్తోన్న ఏసీ స్లీపర్ బస్సుల్లో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను కల్పించడం జరిగిందన్నారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని బస్సుల్లో ట్రాకింగ్ సిస్టంతో పాటు పానిక్ బటన్ సదుపాయాన్ని కల్పించామని చెప్పారు. 12 మీటర్ల పొడవు గల ఏసీ స్లీపర్ బస్సుల్లో లోయర్ 15, అప్పర్ 15తో 30 బెర్తుల సామర్థ్యం ఉందన్నారు. ఈ బస్సుల్లో ఉచిత వైఫై సౌకర్యం కూడా అందుబాటులో ఉందని తెలిపారు. టీఎస్ఆర్టీసీ లాభాల బాట పట్టేందుకు ప్రతి పౌరుడు సహకరించి సంస్థను ఆదరించాలని కోరారు. ప్రజల సంక్షేమం కోసమే ప్రజా రవాణా వ్యవస్థ ఉందనే విషయం మరచి పోవద్దన్నారు. సంస్థ ఎండీ వీ సజ్జనర్ మాట్లాడుతూ.. ప్రయాణికుల సౌకర్యార్థం 630 సూపర్ లగ్జరీ బస్సులను, 130 డీలక్స్ బస్సులను ఇప్పటికే అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు. సుదూర ప్రాంతాలకు వెళ్లే వారికోసం ఏసీ స్లీపర్ బస్సులను వాడకంలోకి తెస్తున్నామని వివరించారు. త్వరలోనే మరో 100 ఏసీ స్లీపర్ బస్సులను ప్రారంభిస్తామని పేర్కొన్నారు. పర్యావరణ హితం కోసం ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. వాటిని ఏప్రిల్లో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. తొలిసారిగా హైదరాబాద్-విజయవాడ మార్గంలో 50 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు రాబోతున్నాయని తెలిపారు. కొత్తగా అందుబాటులోకి వచ్చిన లహరి బస్సుల్లో సీట్లను www.tsrtconline.in లో బుక్ చేసుకోవాలని ఆయన సూచించారు. టెండర్ ద్వారా అశోక్ లేలాండ్ కంపెనీ నుంచి ఈ బస్సులను కొన్నారు. ఈ స్లీపర్ బస్సులను తొలుత హైదరాబాద్ నుంచి ఐదు నగరాలకు తిప్పనున్నారు. మియాపూర్, ఎంజీబీఎస్ల నుంచి బెంగళూరుకు, హుబ్లీకి, బీహెచ్ఈఎల్, ఎంజీబీఎస్ల నుంచి విశాఖపట్నం, తిరుపతి, చెన్నైలకు నడుపుతారు. గరుడ ప్లస్ కంటే ఈ బస్సుల్లో టికెట్ ధర 30 శాతం వరకు ఎక్కువగా ఉండనుంది. రైలు మూడో ఏసీ శ్రేణి టికెట్ ధరకు ఇంచుమించు సమంగా వీటి టికెట్ ధరలను ఖరారు చేశారు. లహరి స్లీపర్ బస్సుల్లో 30 బెర్తులు ఉంటాయి. మంచినీటి సీసా హోల్డర్, మొబైల్ చార్జింగ్ సాకెట్తోపాటు ఉచిత వైఫై వసతి ఉంటుంది. ఈ బస్సుల్లో మూడు సీసీ కెమెరాలు, పానిక్ బటన్, రేర్ వ్యూ కెమెరా, ఎల్ఈడీ సూచిక బోర్డులుంటాయి. ప్రారంభోత్సవ ఆఫర్.. ఈ కొత్త సర్వీసులను ప్రారంభిస్తున్న సందర్భంగా తొలుత కొన్ని రోజుల పాటు టికెట్ ధరల్లో తగ్గింపును అమలు చేస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలోని ప్రాంతాలకు వెళ్లే సర్వీసుల్లో 20 శాతం, ఇతర రూట్లలో తిరిగే బస్సుల్లో 15 శాతం మేర టికెట్ ధరలను తగ్గించనున్నారు. డైనమిక్ ఫేర్ విధానం ప్రారంభం.. డైనమిక్ టికెట్ ఫేర్ విధానం కూడా సోమవారం నుంచే ఆర్టీసీ ప్రారంభించింది తొలిసారి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల తరహాలో డిమాండ్ ఆధారంగా టికెట్ ధరలను సవరిస్తారు. డిమాండ్ ఎక్కువగా ఉండే సమయాల్లో టికెట్ ధర ఎక్కువగా, డిమాండ్ లేని సమయాల్లో తక్కువగా ఉంటుంది. గరిష్టంగా 25 శాతానికి మించకుండా పెంచుతారు, కనిష్టంగా 20 శాతానికి తగ్గకుండా ధరలు తగ్గిస్తారు. తనంతట తానుగా పరిస్థితి ఆధారంగా సిస్టమే ధరలను మార్చుకునే సాఫ్ట్వేర్ను సిద్ధం చేశారు. ఇందుకు ఓ ప్రైవేటు సాఫ్ట్వేర్ డెవలపింగ్ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. దాదాపు నెల రోజుల కసరత్తు తర్వాత ఆ విధానం సిద్ధం కావటంతో సోమవారం నుంచి దాన్ని ప్రారంభిస్తున్నారు. దీంతో దూరప్రాంతాలకు వెళ్లే సర్వీసుల్లో టికెట్ ధరలు ఇక గంటగంటకు మారనున్నాయి. లహరి స్లీపర్ సర్వీసుల్లో కూడా ఇదే విధానం అమలుకానుంది. -
ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణీకులకు అదిరిపోయే గుడ్ న్యూస్
-
APSRTC: ఏపీఎస్ ఆర్టీసీ చరిత్రలో కీలక అడుగులు
సాక్షి, విజయవాడ: ఏపీఎస్ ఆర్టీసీ చరిత్రలో కీలక అడుగులు పడ్డాయి. భారీగా సొంత బస్సులు కొనుగోలుకు ప్రభుత్వం నిర్ణయించింది. 2,736 కొత్త బస్సుల కొనుగోలుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రూ.572 కోట్ల అంచనాతో 1500 కొత్త డీజిల్ బస్సులు, జీసీసీ మోడల్ లో 1000 ఎలక్ట్రికల్ బస్సులు కొనుగోలు చేస్తున్నట్లు ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. 200 డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్పు చేస్తున్నామని ఆయన తెలిపారు. ‘‘36 కొత్త అద్దె బస్సులు తీసుకోబోతున్నాం. వీలైతే కర్ణా టక తరహాలో 15 మీటర్ల అంబారీ బస్సులు. కొత్త స్క్రాప్ పాలసీ ప్రకారం కొన్ని బస్సులు తీసేయాల్సి వస్తోంది. రాష్ట్రంలో 15 ఏళ్ల సర్వీసు దాటిన బస్సులు కేవలం 221 మాత్రమే ఉన్నాయి. అంతర్రాష్ట్ర సర్వీసులు నడిపే విషయంపై ఒడిశా, కర్ణాటకతో ఒప్పందాలు పూర్తయ్యాయి. తమిళనాడు, తెలంగాణతో త్వరలోనే ఒప్పందాలు చేసుకుంటాం’’ అని ద్వారకా తిరుమలరావు పేర్కొన్నారు. చదవండి: మార్చి, ఏప్రిల్ నెలల్లో ఏపీ ప్రభుత్వ కార్యక్రమాల షెడ్యూల్ ఇదే.. -
TSRTC: ప్యానిక్ బటన్.. సీసీ కెమెరాలు.. అందుబాటులోకి ఆధునిక బస్సులు!
సాక్షి, హైదరాబాద్: ప్యానిక్ బటన్.. ప్రయాణ సమయాల్లో మహిళలు తాము ప్రమాదంలో ఉన్నామని.. తమను కాపాడాలని పోలీసులకు తెలిపేందుకు వినియోగించే సాంకేతిక సాధనం. అలాగే రోడ్డు ప్రమాదాలు, అగ్నిప్రమాదాలు, వరదల వంటి ప్రకృతి విపత్తుల్లో వాహనాలు చిక్కుకున్నప్పుడు సహాయం కోరేందుకు దోహదపడే పరికరం. కేవలం ఒక్క బటన్ను నొక్కడం ద్వారా వాహన లైవ్ లొకేషన్ను నేరుగా పోలీసులు లేదా సహాయ బృందాలకు తెలియజేయగలగడం దీని ప్రత్యేకత. ఢిల్లీ నిర్భయ ఘటన తర్వాత విస్తృతంగా వ్యాప్తిలోకి వచ్చిన ఈ సాధనం ఇప్పుడు టీఎస్ఆర్టీసీ బస్సుల్లో కూడా అందుబాటులోకి రాబోతోంది. కేంద్ర ప్రభుత్వం నిర్భయ పథకంలో భాగంగా మహిళా భద్రత కోసం అన్ని ప్రజారవాణా వాహనాల్లో ప్యానిక్ బటన్లు, వాహన లొకేషన్ ట్రాకింగ్ పరికరాల ఏర్పాటును తప్పనిసరి చేసింది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఇప్పుడు కొత్తగా కొంటున్న బస్సుల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా ఆర్టీసీకి చేరిన 50 కొత్త సూపర్ లగ్జరీ బస్సులను సంస్థ శనివారం వినియోగంలోకి తెస్తోంది. ఈ బస్సులను అశోక్ లేలాండ్ కంపెనీ రూపొందించింది. మొత్తం 630 సూపర్ లగ్జరీ బస్సుల ఆర్డర్ పొందిన ఆ కంపెనీ తాజాగా 50 బస్సులను అందించింది. మిగతావి రోజుకు కొన్ని చొప్పున జనవరి నాటికి పూర్తిగా సరఫరా చేయనుంది. ఈ బటన్ నొక్కడం ద్వారా సమాచారాన్ని పొందే కమాండ్ కంట్రోల్ రూమ్ బస్భవన్లో ఏర్పాటు చేస్తున్నారు. అయితే అది ఇంకా అందుబాటులోకి రాలేదు. అందుబాటులోకి రాగానే బస్సుల్లోని ప్యానిక్ బటన్తో ఆ వ్యవస్థ అనుసంధానమై పనిచేయడం ప్రారంభిస్తుంది. ప్రతి బస్సులో రెండు వీడియో కెమెరాలు.. బస్సుల్లో అవాంఛిత ఘటనలు చోటుచేసుకున్నప్పుడు కారణాలను గుర్తించే వీలు ప్రస్తుతం లేదు. కొత్తగా వచ్చే బస్సుల్లో సెక్యూరిటీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. డ్రైవర్ కేబిన్ వద్ద ఉండే ఓ సీసీ కెమెరా.. బస్సులోకి ఎక్కే ప్రయాణికులను గుర్తిస్తుంది. డ్రైవర్ వెనుక భాగంలో ఉండే మరో కెమెరా బస్సు చివరి వరకు లోపలి భాగాన్ని చిత్రిస్తుంది. ఈ రెండు కెమెరాలు చిత్రించిన వీడియో ఫీడ్ 15 రోజుల వరకు నిక్షిప్తమవుతుంది. ఇక బస్సును రివర్స్ చేసేటప్పుడు డ్రైవర్కు ఎన్నో ఇబ్బందులు తలెత్తుతుంటాయి. కొత్త బస్సుల్లో రివర్స్ కెమెరాలను బిగించారు. బస్సు వెనుకవైపు ఉండే కెమెరా రివర్స్ చేసేటప్పుడు డ్రైవర్కు వెనుక ప్రాంతాన్ని చూపుతుంది. త్వరలో బస్సు ట్రాకింగ్ వ్యవస్థ కూడా అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా బస్సులో ఉండనున్నాయి. ఫైర్ డిటెక్షన్ అండ్ అలారం సిస్టం కూడా ఏర్పాటు చేశారు. మోతాదుకు మించి వేడి ఉత్పన్నమైనా లేక పొగ వచ్చినా ఈ వ్యవస్థ గుర్తించి అలారం మోగిస్తుంది. దీంతో డ్రైవర్ అప్రమత్తమై బస్సును ఆపేసి ప్రయాణికులను కిందకు దించేందుకు వీలవుతుంది. షార్ట్ సర్క్యూట్ వల్ల తరచూ బస్సుల్లో చోటు చేసుకొనే అగ్రిప్రమాదాలను ముందే గుర్తించి ప్రయాణికులకు ప్రాణాపాయాన్ని తప్పించేందుకు ఈ అలారంతో అవకాశం కలుగుతుంది. అలాగే ఈ బస్సుల్లో సెల్ఫోన్ చార్జింగ్ కోసం ఏర్పాట్లు చేయడంతోపాటు వినోదం కోసం టీవీలను ఏర్పాటు చేశారు. 50 కొత్త సూపర్ లగ్జరీ బస్సులను రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ శనివారం ట్యాంక్బండ్పై ప్రారంభించనున్నారు. సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని రెండ్రోజుల క్రితం ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి ప్రకటించినప్పటికీ సీఎం ఇతర కార్యక్రమాల్లో బిజీగా ఉండటంతో రవాణాశాఖ మంత్రి ప్రారంభించనున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. మొత్తం 1,016 కొత్త బస్సులకు ఆర్టీసీ ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇందులో 630 సూపర్ లగ్జరీ బస్సులు, 370 డీలక్స్/ఎక్స్ప్రెస్ బస్సులు, 16 ఏసీ స్లీపర్ బస్సులున్నాయి. త్వరలో 130 డీలక్స్ బస్సులు కూడా అందనున్నాయి. శబరిమల.. సంక్రాంతి స్పెషల్గా సేవలు.. ప్రస్తుతం శబరిమల అయ్యప్ప భక్తుల కోసం దాదాపు 200 బస్సులు బుక్ అయ్యాయి. మరిన్ని బుక్ కానున్నాయి. శబరిమల దూర ప్రాంతమైనందున వీలైనంత వరకు కొత్త బస్సులు కేటాయించనున్నారు. ఇప్పుడు అందుతున్న సూపర్ లగ్జరీ బస్సుల్లో కొన్నింటిని అందుకు వినియోగించనున్నారు. సంక్రాంతి రద్దీ దృష్ట్యా దూర ప్రాంతాలకు స్పెషల్ బస్సులు నడుపుతున్నారు. కొత్త బస్సుల్లో కొన్నింటిని అందుకు కేటాయించనున్నారు. (క్లిక్ చేయండి: తెలంగాణ భవన్ ముందు ట్రాఫిక్ నరకం) -
ఆర్టీసీకి కొత్త బస్సులు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ 2015 తర్వాత పెద్దఎత్తున కొత్త బస్సులను కొనుగోలు చేస్తోంది. మొత్తం వెయ్యి బస్సులను కొనేందుకు ఇటీవలే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసింది. అశోక్ లేలాండ్ కంపెనీ సూపర్ లగ్జరీ, డీలక్స్ బస్సుల టెండర్లు దక్కించుకుంది. బస్సుల తయారీ పూర్తి కావస్తుండటంతో దశలవారీగా వాటిని ఆర్టీసీకి సరఫరా చేస్తోంది. ఇందులో భాగంగా ఆదివారం నాలుగు సూపర్ లగ్జరీబస్సులు ఆర్టీసీకి చేరాయి. మొత్తం 630 సూపర్ లగ్జరీ బస్సులను ఆర్టీసీకి సరఫరా చేయబోతోంది. తొలిసారి కంపెనీలోనే బస్సు తయారీ గరుడ లాంటి ఏసీ కేటగిరీ బస్సులు మినహా మిగతావాటికి సంబంధించిన చాసీస్ను మాత్రమే ఆర్టీసీ కొనుగోలు చేస్తుంది. ఆర్టీసీకి ముందు నుంచి సొంతంగా బస్బాడీ యూనిట్ ఉండటమే దీనికి కారణం. దాదాపు 250 మంది సిబ్బందితో మియాపూర్లో ఆర్టీసీకి పెద్ద బస్బాడీ బిల్డింగ్ యూనిట్ ఉంది. చాసీస్లను కొనుగోలు చేసి ఇందులో బాడీలను సొంతంగా కట్టించుకునేది. కానీ, ఆర్థిక ఇబ్బందులతో బస్బాడీ నిర్వహణను భారంగా భావించి దాన్ని క్రమంగా పక్కనపెట్టేస్తూ వచ్చింది. దీంతో గతంలోనే సూపర్ లగ్జరీ బస్సులను కొన్నప్పుడు, కంపెనీ నుంచి చాసీస్ కొని ప్రైవేటు సంస్థతో బాడీ కట్టించింది. కానీ, ఈసారి బాడీతో కలిపే బస్సులు కొనాలని నిర్ణయించి ఆ మేరకే టెండర్లు పిలిచింది. ఫలితంగా ఆదివారం సరఫరా అయిన 4 బస్సులు పూర్తి బాడీతో అశోక్ లేలాండ్ కంపెనీ నుంచి ఆర్టీసీకి చేరాయి. బాడీలకు కొత్త లుక్ ఇప్పుడు అశోక్లేలాండ్ తయారీ చేసిన బస్సుల బాడీలు కొత్త లుక్ సంతరించుకున్నాయి. ముందుభాగం ఓల్వో బస్సును పోలినట్టుగా ఉంది. గతంలో కొన్న సూపర్ లగ్జరీ బస్సులు ఇప్పుడు గులాబీ రంగుతో రోడ్డుపై తిరుగుతున్నాయి. ఈ కొత్త బస్సులు తెలుపు రంగుపై నీలం, క్రీమ్ రంగు స్ట్రైప్లతో కనిపిస్తున్నాయి. ముందుభాగంలో తెలుపు, క్రీమ్ కలర్ స్ట్రైప్స్ ఏర్పాటు చేశారు. లైట్లు ఉన్న భాగాన్ని నలుపు రంగులో ఉంచారు. సామగ్రి పెట్టేందుకు గతంతో పోలిస్తే చాలా విశాలమైన స్థలాన్ని కేటాయించారు. ప్రస్తుతం నడుస్తున్న సూపర్ లగ్జరీ సర్వీసుల్లో 450 బస్సులు దాదాపు ఆరు లక్షల కి.మీ. మేర తిరిగాయి. దీంతో వాటిల్లో కొన్నింటిని ఆర్డినరీ బస్సులుగా, కొన్నింటిని పల్లెవెలుగు సర్వీసులుగా అధికారులు మార్చనున్నారు. ఆ 450 బస్సుల స్థానంలో కొత్త సూపర్లగ్జరీ బస్సులను ప్రవేశపెట్టనున్నారు. మంచి లాభాలతో తిరుగుతున్న ఎక్స్ప్రెస్ రూట్లను అప్గ్రేడ్ చేసి దాదాపు 150 సూపర్ లగ్జరీ బస్సులను ప్రారంభించబోతున్నారు. ప్రస్తుతం ఉన్న 130 డీలక్స్ బస్సులన్నీ 12 లక్షల కి.మీ.కుపైగా తిరిగి ఉన్నందున వీటిని తుక్కుగా మార్చాలని నిర్ణయించారు. వాటి స్థానంలో కొత్త డీలక్స్ బస్సులు రానున్నాయి. 370 ఇతర కేటగిరీ బస్సుల్లో అన్ని డీలక్స్ బస్సులనే తీసుకోవాలా, కొన్ని ఎక్స్ప్రెస్ బస్సులు తీసుకోవాలా అన్న విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. తొలుత 130 డీలక్స్ బస్సులను సరఫరా చేయాలని అశోక్ లేలాండ్ కంపెనీకి ఆర్డర్ ఇచ్చారు. తెలంగాణ ఆర్టీసీ ఏర్పడ్డాక తొలిసారి స్లీపర్ బస్సులను ఆర్టీసీ ప్రవేశపెట్టబోతోంది. ఇప్పటికే 16 కొత్త బస్సులకు టెండర్లు పిలిచింది. త్వరలో అవి ఆర్టీసీకి అందనున్నాయి. వాటిని దూరప్రాంత నగరాలు, పట్టణాలకు తిప్పనుంది. -
ఆప్ సర్కార్పై మరో దర్యాప్తు.. ‘బస్సుల’పై సీబీ‘ఐ’
న్యూఢిల్లీ: ఆప్ సర్కారుపై మరో దర్యాప్తుకు తెర లేచింది. ఢిల్లీలో 1,000 లో–ఫ్లోర్ బస్సుల కొనుగోలులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సీబీఐ దర్యాప్తుకు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆదేశించారు. టెండరింగ్, బస్సుల కొనుగోలుకు ఢిల్లీ రవాణా కార్పొరేషన్(డీటీసీ) ఆధ్వర్యంలో వేసిన కమిటీకి రవాణా మంత్రిని చైర్మన్గా నియమించారు. ఇది ముందస్తు ఒప్పందంలో భాగంగానే జరిగిందని ఎల్జేకు ఫిర్యాదు అందింది. ఈ వ్యవహారంలో భారీగా డబ్బులు చేతులు మారిందని అందులో ఆరోపించారు. దీనిపై ఎల్జే వివరణ కోరగా అక్రమాలు నిజమేనని ఢిల్లీ చీఫ్ సెక్రెటరీ నివేదిక సమర్పించారు. ఎల్జే ఆదేశాల మేరకు సీబీఐ ఇప్పటికే ప్రాథమిక దర్యాప్తు చేపట్టింది. రెండు ఫిర్యాదులను కలిపి సీబీఐ విచారించేందుకు లెఫ్టినెంట్ గవర్నర్ అంగీకరించారు. బస్సుల కొనుగోలులో అవినీతి జరిగినట్లు వస్తున్న ఆరోపణలపై ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రభుత్వం ఇంకా స్పందించలేదు. కేజ్రీవాల్, అవినీతి.. పర్యాయపదాలు: బీజేపీ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, అవినీతి అనేవి పర్యాయపదాలుగా మారిపోయాయని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా ఆరోపించారు. సీఎం పదవిలో ఇంకా కొనసాగే అర్హత కేజ్రీవాల్కు ఎంతమాత్రం లేదని తేల్చిచెప్పారు. భాటియా ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంలో ప్రతి విభాగం అవినీతిలో కూరుకుపోయిందన్నారు. కేజ్రీవాల్ మిత్రులకు లబ్ధి చేకూరేలా కాంట్రాక్టులు, టెండర్లు కట్టబెడుతున్నారని ధ్వజమెత్తారు. నిన్న ఎక్సైజ్ పాలసీలో, ఇప్పుడు బస్సుల కొనుగోలులో అవినీతి బయటపడిందని చెప్పారు. కేజ్రీవాల్ కరడుగట్టిన నిజాయతీపరుడు కాదు, కరడుగట్టిన అవినీతిపరుడని ప్రజలు భావిస్తున్నారని భాటియా వ్యాఖ్యానించారు. బస్సుల కొనుగోలు విషయంలో ‘ఆప్’ సర్కారు కేవలం కొన్ని కంపెనీలకు లాభం కలిగేలా టెండర్ నిబంధనలను, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ మార్గదర్శకాలను ఉల్లంఘించిందని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు ఆదేశ్ గుప్తా విమర్శించారు. ఇదీ చదవండి: డిగ్రీ పరీక్షలు రాయనున్న ప్రధాని మోదీ, ఎంఎస్ ధోని! -
AP: ఆర్టీసీ బస్సులకు సరికొత్త రూపు
సాక్షి, అమరావతి: ప్రజా రవాణా విభాగం (ఆర్టీసీ) బస్సులు కొత్త రూపు సంతరించుకోనున్నాయి. దశాబ్ద కాలంగా పాతబడిన బస్సులతో ప్రయాణికులు పడుతున్న పాట్లకు ముగింపు పలకాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈ బస్సులను ఆధునికీకరణకు ప్రణాళిక రూపొందించింది. ఇప్పటికే 650 కొత్త బస్సుల కొనుగోలుతోపాటు 880 అద్దె బస్సులకు ఆర్టీసీ టెండర్లు పిలిచింది. మరోవైపు ప్రస్తుతం ఉన్న బస్సులకు ఫేస్లిఫ్ట్ ద్వారా సరికొత్తగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. రెండు దశల్లో 2,750 బస్సులను ఆధునికీకరిస్తారు. దసరా నాటికి మొదటి దశ ఆధునికీకరించిన బస్సులను ప్రారంభించేందుకు సమాయత్తమవుతోంది. ఆర్టీసీలో ప్రస్తుతం 11,271 బస్సుల్లో దాదాపు 3,800 బాగా పాతబడ్డాయి. వాటిలో ఏసీ బస్సులు 10 లక్షల కిలోమీటర్లు, ఎక్స్ప్రెస్ బస్సులు 8 లక్షల కి.మీ., పల్లె వెలుగు బస్సులు 12 లక్షల కి.మీ. పూర్తి చేశాయి. ఆర్టీసీ ఆదాయం సరిపోక, ఉద్యోగుల జీతాలకే అప్పులు చేయాల్సి రావడంతో దశాబ్ద కాలంగా ఆర్టీసీ కొత్త బస్సులు కొనలేదు. ఉన్న వాటికి మరమ్మతులు చేయించలేదు. ఉన్న బస్సుల ఆధునికీకరణా చేపట్టలేదు. సీఎం జగన్మోహన్రెడ్డి 2020 జనవరి నుంచి ఆర్టీసీనీ ప్రభుత్వంలో విలీనం చేస్తూ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. దాంతో ఉద్యోగుల జీతాల కోసం ఏటా రూ.3,600 కోట్లు ప్రభుత్వమే చెల్లిస్తోంది. దాంతో ఆర్టీసీ అభివృద్ధి, ప్రయాణికులకు మెరుగైన బస్సు ప్రయాణాన్ని అందించేలా పాలక మండలి కార్యాచరణ చేపట్టింది. రెండు దశల్లో ఆధునికీకరణ 2,750 బస్సులను ఆధునికీకరించాలని ఆర్టీసీ నిర్ణయించింది. కొత్త సీట్లు వేయడం, టైర్లు, హెడ్లైట్లు మార్చడం, రంగులు వేయడం, సాంకేతిక సమస్యలను పరిష్కరిస్తారు. బస్సులకు కొత్త రూపు తెస్తారు. మొదటి దశలో 1,250 పల్లె వెలుగు బస్సులు, 250 సిటీ బస్సుల ఆధునీకరణ చేపట్టారు. ఆర్టీసీ మెకానికల్ విభాగం సొంత గ్యారేజీల్లోనే ఈ పనులు చేపట్టింది. ఒక్కో బస్సుకు రూ.2 లక్షల చొప్పున మొత్తం 1,500 బస్సుల ఆధునీకరణకు రూ.30 కోట్లు వెచ్చిస్తున్నారు. దసరా నాటికి తొలి దశ పూర్తి చేయనున్నారు. రెండో దశలో 1,250 ఎక్స్ప్రెస్ సర్వీసులను ఆధునికీకరించనున్నారు. వాటిలో ఎక్స్ప్రెస్, డీలక్స్, సెమీ లగ్జరీ సర్వీసులున్నాయి. ప్రధానంగా జిల్లా కేంద్రాల మధ్య తిరిగే ఈ సర్వీసులను మరింత వినూత్నంగా ఫేస్ లిఫ్ట్ డిజైన్ను ఆర్టీసీ రూపొందించింది. సీట్లు, టైర్లు, లైట్లు మార్చడంతోపాటు అవసరమైన మేరకు బస్సు బాడీనీ కొత్తగా నిర్మిస్తారు. డిసెంబర్ దీనిని పూర్తి చేయాలని ఆర్టీసీ భావిస్తోంది. -
వోల్వో-ఐషర్ కొత్త ఇంటర్ సిటీ బస్సులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాణిజ్య వాహనాల తయారీలో ఉన్న వోల్వో ఐషర్ కమర్షియల్ వెహికిల్స్ కొత్త శ్రేణిని ప్రవేశపెట్టింది. తదుపరితరం ఇంటర్సిటీ బస్లను శుక్రవారమిక్కడ ప్రదర్శించింది. వీటిలో వోల్వో నుంచి 15, 13.5 మీటర్ల కోచ్లు, ఐషర్ నుంచి 13.5 మీటర్ల కోచ్ ఉన్నాయి. బస్ మార్కెట్ తిరిగి పుంజుకుందని, త్వరలోనే కోవిడ్ ముందస్తు స్థాయికి చేరుకుంటుందని వోల్వో ఐషర్ కమర్షియల్ వెహికిల్స్ ఎండీ, సీఈవో వినోద్ అగర్వాల్ మీడియాకు తెలిపారు. సుదూర ప్రయాణాల విషయంలో ఈ వాహనాలు పరిశ్రమలో నూతన ప్రమాణాలను సృష్టిస్తాయని అన్నారు. -
ఆర్టీసీకి ‘విజయ’ దశమి
సాక్షి, హైదరాబాద్: విజయదశమి కానుకగా ప్రయాణికుల ముందుకు ఆర్టీసీ కొత్త బస్సులు తీసుకురానుంది. 1,016 కొత్త బస్సులు కొనేందుకు టెండర్లు పిలిచింది. మూడు రకాల కేటగిరీలకు సంబంధించి రెండింటికి అశోక్ లేల్యాండ్, మరో రకానికి టాటా కంపెనీ తక్కువ మొత్తాన్ని కోట్ చేశాయి. ఆ ధరలను మరికాస్త తగ్గించేందుకు ఆర్టీసీ ఉన్నతాధికారులు సోమవారం ఆయా సంస్థల ప్రతినిధులతో బేరం కోసం భేటీ కానున్నారు. కనీసం ఒక్కో బస్సుపై రూ. లక్ష చొప్పున తగ్గించేలా ఒప్పిం చాలని ఆర్టీసీ యత్నిస్తోంది. ఈ బస్సులను ఆయా కంపెనీలు దసరా నాటికి ఆర్టీసీకి అందించనున్నాయి. తొలిసారి స్లీపర్ బస్సులు.. తెలంగాణ ఆర్టీసీ తొలిసారి స్లీపర్ బస్సులు కొనుగోలు చేస్తోంది. ప్రస్తుతం ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు 90 శాతం స్లీపర్ బస్సులే నడుపుతుండటంతో వాటికి ప్రయాణికుల ఆదరణ మెరుగ్గా ఉంది. ప్రైవేటు ట్రావెల్స్ పోటీని తట్టుకోవాలంటే స్లీపర్ బస్సులు సమకూర్చుకోవాలని ఆర్టీసీ ఇటీవల నిర్ణయించింది. ప్రయోగాత్మకంగా 16 స్లీపర్ బస్సులు కొనేందుకు టెండర్లు పిలిచింది. 30 బెర్తులతో కూడిన ఒక్కో ఏసీ బస్సుకు రూ. 50 లక్షల వరకు అశోక్ లేల్యాండ్ కోట్ చేసి ఎల్1గా నిలిచింది. సోమవారం జరిగే చర్చల తర్వాత కొనుగోలు ఆర్డర్ ఇవ్వనుంది. ప్రస్తుతం ఆర్టీసీకి సొంత బస్సులు 6,200 వరకు ఉండగా వీటిలో దాదాపు వెయ్యి బస్సులు కాలంచెల్లి తుక్కుగా మారేందుకు సిద్ధంగా ఉన్నాయి. దీంతో తగినన్ని బస్సులు లేక చాలా ప్రాంతా లకు ప్రజారవాణా దూరమైంది. ఆ సంఖ్య మరింత తగ్గకుండా ఇప్పుడు 1,016 బస్సులు అందుబాటులోకి రానున్నాయి. వాటి తర్వాత హైదరాబాద్ సిటీ రీజియన్ కోసం 300 ఎలక్ట్రిక్ బస్సులు రాబోతున్నాయి. రూ. 340 కోట్ల ఖర్చుతో.. గతంలో ఇంజన్ ఛాసిస్లను మాత్రమే ఆర్టీసీ వివిధ కంపెనీల నుంచి కొనుగోలు చేసి బాడీలను మాత్రం సొంతంగా ఏర్పాటు చేసుకొనేది. ప్రస్తుతం ఆర్టీసీ బస్ బాడీ బిల్డింగ్ యూనిట్ బలహీనపడినందున బాడీలతో కలిపే బస్సులు కొనే యోచనలో ఉంది. ఇందుకోసం టెండర్లలో ఛాసిస్లు, బాడీతో కలుపుకొని అనే రెండు రకాల ధరలను ఆహ్వానించింది. ధరల తగ్గింపుపై కంపెనీలతో చర్చల తర్వాత ఏది కొనాలనే విషయమై నిర్ణయం తీసుకోనుంది. బస్సుల కొనుగోలుకు సుమారు రూ. 340 కోట్లు ఖర్చయ్యే అవకాశం ఉంది. సూపర్ లగ్జరీ బస్సులే ఎక్కువ.. ఆర్టీసీ కొననున్న బస్సుల్లో 630 సూపర్ లగ్జరీ బస్సులున్నాయి. ఈ కేటగిరీలో అశోక్ లేల్యాండ్ కంపెనీ తక్కువ కోట్ చేసింది. ఛాసిస్ అయితే ఒక్కో బస్సు ధరను రూ. 20 లక్షల వరకు, బాడీతో కలుపుకొంటే రూ. 35 లక్షల వరకు కోట్ చేసింది. ఈ బస్సు 12 మీటర్ల పొడవు ఉండనుంది. ఇక 370 ఎక్స్ప్రెస్ బస్సులకు సంబంధించి టాటా కంపెనీ తక్కువ మొత్తాన్ని కోట్ చేసింది. 11 మీటర్ల పొడవుండే ఈ బస్సులకు ఒక్కో దానికి ఛాసిస్ అయితే రూ. 15 లక్షల వరకు, బాడీతో కలుపుకొంటే రూ. 25 లక్షల వరకు కోట్ చేసినట్లు తెలిసింది. ఈ బస్సులకు సంబంధించి ఛాసిస్లే కొనుగోలు చేసి బాడీని విడిగా తయారు చేయించుకోవాలని ఆర్టీసీ భావిస్తోంది. సూపర్ లగ్జరీ వరకు బాడీతో కలుపుకొనే కొంటే బాగుంటుందనే యోచనలో ఉంది. -
ఆర్టీసీ ప్రయాణికులకు ఊరట.. గేర్ మార్చిన టీఎస్ఆర్టీసీ
సాక్షి, హైదరాబాద్: డొక్కు బస్సులతో నత్తనడకన సాగుతున్న తెలంగాణ ఆర్టీసీ గేర్ మార్చింది. కొత్త బస్సులు కొనే దిశగా వేగం పెంచింది. 1,016 కొత్త బస్సుల కొనుగోలుకు టెండర్లు పిలిచింది. తయారీదారులకు ఆ బస్సుల గురించిన వివరాలు అందించి కొటేషన్లు ఆహ్వానించింది. అవి విడతలవారీగా మరో నాలుగైదు నెలల్లో ఆర్టీసీ చెంతకు చేరనున్నాయి. కాలం చెల్లిన వాటితోపాటు డొక్కుగా మారిన బస్సులతోనే ఆర్టీసీ ఇంతకాలం నెట్టుకొస్తోంది. అయితే ఇటీవల కండీషన్ లేని బస్సుల వల్ల ప్రమాదాలు పెరగడంతో వాటిని తొలగించడానికి ఆర్టీసీ చర్యలు చేపట్టింది. వరసగా జరుగుతున్న ప్రమాదాల్లో ఎక్కువగా అద్దె బస్సులే ఉంటున్నాయి. కొన్ని సొంత బస్సులు కూడా ప్రమాదాలకు కారణమవుతుండటాన్ని ఆర్టీసీ తీవ్రంగానే పరిగణిస్తోంది. పది రోజుల క్రితం జరిగిన ఆర్టీసీ బోర్డు సమావేశంలో కొత్త బస్సులు కొనే అంశాన్ని చర్చించారు. ఆ వెంటనే బస్సుల కొనుగోలుకు టెండర్లు పిలిచారు. కొత్త బస్సులను కొత్త ప్రాంతాలతోపాటు కొరత ఉన్న చోట తిప్పనున్నారు. కాగా, ఆర్టీసీ తొలిసారి స్లీపర్ బస్సులు కొనబోతోంది. ఇప్పుడు కొనేవాటిల్లో 16 ఏసీ స్లీపర్ బస్సులు ఉన్నట్టు ప్రకటించింది. (చదవండి: పడవతో గస్తీ..లేక్ పోలీసింగ్ వ్యవస్థ) -
ఆర్టీసీకి కొత్త బస్సులు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీకి త్వరలో కొత్త బస్సులు రాబోతున్నాయి. ఇప్పటికే చాలా బస్సులు పాతబడి ప్రయాణాలకు ఇబ్బందిగా మారడంతో.. వెంటనే కొన్ని కొత్త బస్సులు కొనాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈ మేరకు రూ.100 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ నిధులతో సుమారు 280 బస్సులు వస్తాయని అంచనా. ఆర్టీసీ ఆదాయం పెరగాలంటే.. దూరప్రాంత బస్సుల సంఖ్య పెంచాలని ఇటీవల ఆర్టీసీ సమీక్షలో సీఎం కేసీఆర్ సూచించారని అధికారవర్గాలు తెలిపాయి. పల్లె వెలుగు, సిటీ సర్వీసులతో భారీగా నష్టాలు వస్తున్న నేపథ్యంలో.. దూరప్రాంతాలకు నడిచే బస్సులపై దృష్టి సారించాలని ఆదేశించారని పేర్కొన్నాయి. ఈ మేరకు కొత్త బస్సులు కొనాలని నిర్ణయించినట్టు వెల్లడించాయి. బ్యాంకుల నుంచి ఆర్టీసీ రూ.వెయ్యి కోట్లు రుణం తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పూచీకత్తు ఇచ్చింది. అందులో ఇప్పటికే రూ.500 కోట్లు ఆర్టీసీకి అందాయి. వాటిని వివిధ అవసరాలకు కేటాయించారు. మరో రూ.500 కోట్లు రానున్నాయి. అందులో రూ.400 కోట్లను ఆర్టీసీ సహకార పరపతి సంఘానికి బకాయిల కింద చెల్లించాలని.. మిగతా రూ.100 కోట్లతో కొత్త బస్సులు కొనాలని నిర్ణయించారు. (చదవండి: లొంగుబాటలో అన్నలు) సూపర్ లగ్జరీ, డీలక్స్ బస్సులే.. ఆర్టీసీలో దూర ప్రాంతాల మధ్య నడిచే సూపర్ లగ్జరీ బస్సులకు డిమాండ్ ఎక్కువ. గరుడ, గరుడ ప్లస్, ఇంద్ర వంటి ఏసీ కేటగిరీ బస్సుల్లో చార్జీలు ఎక్కువ. నాన్ ఏసీ కేటగిరీలో సౌకర్యవంతంగా ఉండే సూపర్ లగ్జరీ బస్సు చార్జీలు వాటితో పోలిస్తే బాగా తక్కువ. దీనితో వాటికి ప్రయాణికుల తాకిడి ఎక్కువ. కొత్తగా కొననున్న బస్సుల్లో ఈ కేటగిరీవే వందకుపైగా తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. మరో 80 వరకు డీలక్స్ బస్సులు కొననున్నారు. ప్రస్తుతమున్న డీలక్స్ బస్సుల్లో 80 బస్సులను సూపర్ లగ్జరీ సర్వీసులుగా అప్గ్రేడ్ చేయాలని భావిస్తున్నారు. దీనితో సూపర్ లగ్జరీ బస్సులు మరిన్ని పెరుగుతాయి. ఒక్కో కొత్త బస్సు ధర సగటున రూ.35 లక్షల వరకు ఉంటుందని.. రూ.100 కోట్లతో 280 నుంచి 285 వరకు కొత్త బస్సులు వస్తాయని అంచనా వేస్తున్నారు. అవసరం భారీగా.. కొనేవి తక్కువ.. ప్రస్తుతం ఆర్టీసీ 9 వేల బస్సులను తిప్పుతుండగా.. అందులో ఆర్టీసీ సొంత బస్సులు ఆరు వేలే. మిగతావి అద్దె బస్సులు. ఆర్టీసీలో అవసరానికి, డిమాండ్కు తగ్గట్టుగా కొత్త బస్సులు కొనడం లేదు. ఏటా 250 వరకు బస్సుల కాలపరిమితి తీరిపోతుంది. వాటి స్థానంలో కొత్తవి తేవడంతోపాటు పెరిగే డిమాండ్కు తగినట్టుగా సర్వీసులు పెంచాల్సి ఉంటుంది. అంటే.. కాలం తీరే బస్సుల కంటే ఎక్కువగా అవసరం అవుతాయి. కానీ గత మూడేళ్లలో ఆర్టీసీలో కొత్తగా వచ్చిన బస్సులు కేవలం 270 మాత్రమే. ఇదే సమయంలో వెయ్యికిపైగా బస్సులు తుక్కు కిందికి వెళ్లిపోయాయి. ఇప్పుడు కేవలం 280 బస్సులు కొననున్నారు. అయితే ఇప్పుడిప్పుడే ఆర్టీసీ ఆదాయం పెరుగుతోందని, టికెట్ ధరలను కూడా సవరించే యోచనలో ఉన్నందున.. భవిష్యత్తులో పెద్ద సంఖ్యలో కొత్త బస్సులు కొనే అవకాశం ఉందని అధికార వర్గాలు చెప్తున్నాయి. -
డొక్కు బస్సులకు చెక్..
ఎప్పుడాగిపోతాయో తెలియదు.. ఎక్కడాగిపోతాయో అంతు బట్టదు. ప్రయాణికులు గమ్యానికి చేరతారో లేదో అంతుబట్టదు. ఆర్టీసీలో ఆలాంటి డొక్కు బస్సులను పక్కన పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాలం చెల్లిన బస్సులకు మోక్షం లభించనుంది. సంస్థపై ప్రభుత్వం చూపుతున్న ప్రత్యేక శ్రద్ధతో సమస్యలు పరిష్కారం కానున్నాయి. ఇటీవల మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాల్లో రూ.వెయ్యి కోట్ల రుణసాయంతో ఆర్టీసీ ఆర్థిక పరిపుష్టిని పెంచుకోవడానికి వీలవుతుందని కార్మిక సంఘాలు, అధికార వర్గాలు భావిస్తున్నాయి. ప్రత్యేకించి ఆ నిధులను కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్త బస్సులను కొనుగోలు చేసుకోవడానికి ప్రభుత్వం అంగీకరించడంతో సంస్థ మనుగడ మెరుగుపడుతుంది. సాక్షి, విజయనగరం అర్బన్: విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల ఆర్టీసీ నార్ట్ ఈస్ట్ కోస్ట్ రీజియిన్ పరిధిలోని తొమ్మిది డిపోల్లో కాలం చెల్లిన బస్సులు 100 వరకు ఉన్నాయి. మోటారు చట్ట నిబంధనల మేరకు ప్రయాణికుల రవాణా భారీ వాహనాలకు జీవిత ప్రయాణ పరిమితులుంటాయి. ఎక్స్ప్రెస్, డీలక్స్ సర్వీసుల బస్సుల జీవితకాలం 8 లక్షల కిలోమీటర్ల ప్రయాణం మాత్రమే. ఇంకా సామర్థ్యం ఉంటే పాసింజర్ బస్సు సర్వీసులుగా నడపవచ్చు. కానీ పాసింజర్ సర్వీసులకు 12 లక్షల కిలోమీటర్ల దూరంగా నిర్ధేశించారు. ఆ పరిధి దాటితే రోడ్డు మీద అవి తిరగడానికి వీల్లేదు. అంతవరకు 8 లక్షల కిలోమీటర్లు తిరిగిన ఎక్స్ప్రెస్లను పాసింజర్ సర్వీసులుగా తిప్పుతారు. తరువాత 12 కిలోమీటర్లు తిప్పాక కాలం చెల్లిన బస్సులుగా మూలకు చేర్చుతారు. తాజాగా నెక్ పరిధిలో మొత్తం 789 బస్సుల్లో ఒక్కొక్క డిపోల్లో 8 నుంచి 10 బస్సులను పూర్తి స్థాయిలో సామర్థ్యం లేనివిగా గుర్తించి వాటిని రోడ్డుపైకి పంపుతున్నారు. వాటిలో అధిక శాతం ఎక్స్ప్రెస్ సర్వీసులున్నట్టు వివేదికలు చెబుతున్నాయి. ఇటీవల విఖాఖ నుంచి విజయనగరం వస్తున్న ఆర్టీసీ మెట్రో ఎక్స్ప్రెస్ రఘు ఇంజనీరింగ్ కాలేజీ జంక్షన్లో ఆగిపోయింది. విశాఖ – విజయనగరం మధ్య జాతీయ రహదారిపై వారానికి కనీసం నాలుగు బస్సులైనా బ్రేక్డౌన్ అవుతూ దర్శనమిస్తాయి. రెండురోజుల క్రితం విజయనగరం నుంచి జామి మీదుగా వెళ్లే రూట్లో పల్లెవెలుగు బస్సు నిలిచిపోయింది.ఔ అయిదేళ్లుగా కాలక్షేపం.. సామర్థ్యం లేని బస్సులను ఏటా గుర్తించి వాటి స్థానంలో ప్రత్నామ్నాయంగా కొత్తవి ఏర్పాటు చేయాల్సి ఉంది. గత ప్రభుత్వం ఐదేళ్లపాటు అలాంటి చర్యలేవీ చేపట్టకుండా సామర్థ్యం లేని పాత బస్సులనే కొనసాగించిందన్న విమర్శలున్నాయి. సంస్థ కార్మిక సంఘాలు ఈ విషయాన్ని అనేక సార్లు యాజమాన్యం దృష్టికి తీసుకొచ్చినా ఫలితం లేకపోయింది. ఆర్టీసీ నార్త్ ఈస్టు కోస్ట్ (నెక్) రీజయన్ పరిధిలోని తొమ్మిది డిపోలలో 789 బస్సులున్నాయి. వీటిలో 587 బస్సుల సంస్థవి కాగా మిగిలినవన్నీ అద్దె ప్రాతిపదికన ఉన్నవే. అయితే సంస్థ బస్సుల్లో 208 వరకూ సుమారు 13 లక్షల కిలోమీటర్లు తిరిగినవని సమాచారం. మోటారు చట్టం ప్రకారం 11 నుంచి 12 లక్షల కిలోమీటర్ల మధ్య రవాణా చేసిన బస్సులను సర్వీసుల నుంచి తొలగించాల్సి ఉంది. సంస్థ మెకానికల్ విభాగం ద్వారా తనిఖీ చేశాక వాటి సామర్థ్యం మెరుగ్గా ఉందనిపిస్తే కొన్నాళ్ల వరకూ తిప్పుకొనే అవకాశం ఉంది. కానీ అలాంటి చర్యలేవీ చేపట్టకుండా గత పాలకులు కాలం చెల్లిన బస్సులను రోడ్డుపైకి పంపుతున్నారన్న ఆరోపణలు వినిపించాయి. పైగా రోజుకు 300 కిలోమీటర్లు మాత్రమే తిరగాల్సిన బస్సుల్ని 400 కిలోమీటర్ల వరకూ నడిపిస్తున్నారని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఫలితంగా శబ్ధ, వాయు కాలుష్యాలు, సమయాభావంలేని ప్రయాణం వంటి సమస్యలను ప్రయాణికులు ఎదుర్కొంటున్నారు. దూర సర్వీసులలో ఇలాంటి బస్సులే ఏర్పాటు చేయడం వల్ల మధ్యలోనే ఆగిపోతున్నాయి. దీంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆయా బస్సుల్లో పనిచేస్తున్న డ్రైవర్, కండక్టర్లు కూడా మానసిక క్షోభను అనుభవిస్తున్నారని కార్మిక సంఘాలు వాపోతున్నాయి. కొత్త బస్సులొస్తే మెరుగైన సేవలు.. బస్సుల రవాణా సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు పరీక్షించి సర్వీసులకు పంపుతాం. నెక్ రీజియన్లో సామర్థ్యం లేని 100 బస్సుల వరకూ తాజాగా రద్దు చేసి, వాటి స్థానంలో ప్రత్యామ్నాయ బస్సులను ఏర్పాటు చేశాం. రద్దు చేసిన బస్సుల్లో 12 లక్షల కిలోమీటర్లు నడిచినవి. వాటి స్థానంలో కొత్త బస్సులు వస్తే సంస్థ సేవలు మరింత మెరుగుపడతాయి. సామర్థ్యంలో లేని బస్సులను నిర్వహించడం లేదు. సంస్థకు ప్రభుత్వం ప్రకటించిన రుణసాయం కొత్తబస్సుల కొనుగోలుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. – కొటాన శ్రీనివాసరావు, డిప్యూటీ సీఎంఈ, ఆర్టీసీ నెక్ -
కాలం చెల్లినా.. రైట్రైట్
సాక్షి, ఆదిలాబాద్ : ఆర్టీసీలో బస్సుల పరిస్థితి అధ్వానంగా మారింది. ఆర్డినరి, ఎక్స్ప్రెస్, హైటెక్ అనే తేడా ఏమీలేదు. ఆదిలాబాద్ రీజియన్లోని ఆరు డిపోల పరిధిలో గల అధిక మొత్తం బస్సులది ఇదే పరిస్థితి. రాష్ట్రంలోని ఇతర రీజియన్లతో పోలిస్తే ఆదాయం తక్కువ ఉంటుందో మరేమో కానీ బస్సుల పరంగా ఇక్కడి ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇతర రీజియన్లో తిరిగిన బస్సులను వివిధ రిపేర్ల కారణంగా ఇక్కడికి పంపి నడిపిస్తున్నారన్న అపవాదు లేకపోలేదు. పల్లెకు వెలుగేది? గ్రామీణ ప్రాంత ప్రజలు నిత్యం వివిధ పనుల రీత్యా పట్టణ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారు. అత్యధిక గ్రామీణులకు పల్లె వెలుగు బస్సే దిక్కు. అత్యధికంగా ఈ బస్సులే నిత్యం వివిధ మార్గాల్లో నడుస్తుంటాయి. సంస్థకు అధికంగా ఆదాయం సమకూరుస్తాయి. అయితే గత ఐదారేళ్లుగా ఈ ఆర్డినరి బస్సుల రీప్లేస్మెంట్ లేదు. దీంతో అవే బస్సులు నడుపుతున్నారు. నిర్ధేశిత రీడింగ్ను ఎన్నడో దాటేశాయి. బస్సు కాలం చెల్లినా ఇంజిన్ పనిచేసినంత కాలం బస్సు నడుపుతామన్న ధోరణి ఆర్టీసీ అధికారుల్లో కనిపిస్తోంది. ప్రగతిరథ చక్రాల్లో 40 శాతం బస్సులు ప్రస్తుతం కాలం చెల్లినవేనని అధికారులు ఒప్పుకుంటున్నా పైకిమాత్రం చెప్పరు. ఇదేమంటే అదంతే .. అనే రీతిలో వ్యవహరిస్తారు. ఇందులో అధికారులకు ఓ స్వార్థ ప్రయోజనం లేకపోలేదు. ఎన్ని ఎక్కువ కాలం చెల్లిన బస్సులు నడిపితే అధికారి స్థాయిని బట్టి అంతా ఇన్సెంటీవ్ సంస్థ ఇస్తుండడంతో ఇలాంటి బస్సులను నెట్టుకొస్తున్నారన్న విమర్శలు లేకపోలేదు. కొన్ని కార్మిక సంఘాలు దీన్ని వ్యతిరేకించినా సంస్థ నిబంధనల రీత్యా వారూ గీత దాటని పరిస్థితి. ఆ బస్సులకు రీడింగ్ మీటర్లే ఉండవు ఒక బస్సు పూర్తిస్థాయిలో నిర్ధేశిత కిలో మీటర్లు తిరిగాక దాన్ని కాలం చెల్లిన బస్సుగా పరిగణిస్తారు. ఆర్టీసీలో అధికంగా పల్లె వెలుగుల్లో ఈ పరిస్థితి కనిపిస్తోంది. రీజియన్ పరిధిలోని ఆదిలాబాద్, భైంసా, నిర్మల్, ఉట్నూర్, ఆసిఫాబాద్, మంచిర్యాల డిపోల పరిధిలో తిరుగుతున్న ఆర్డినరి బస్సుల్లో ఇలాంటి కాలం చెల్లిన బస్సులకు అసలు రీడింగ్ మీటర్లే కనిపించవు. ఆర్టీసీ బస్సు డ్రైవర్లకు డ్రైవింగ్కు సంబంధించి కిలోమీటర్ పర్ లీటరు (కేఎంపీఎల్)నే పరిగణలోకి తీసుకొని వారు సంస్థకు ఏ విధమైన ప్రయోజనం దక్కిస్తున్నారనే అంచనాలు వేస్తూ ప్రశంస పత్రాలు అందజేస్తారు. అలాంటప్పుడు అసలు రీడింగే లేని బస్సులు నడుపుతున్నప్పుడు ఆ డ్రైవింగ్ను ఎలా అంచనా వేస్తున్నారో ఆర్టీసీ అధికారులకే తెలియాలి. స్పీడ్ మీటర్ మాత్రం దాంట్లో కనిపిస్తుంది. ఇక ఆ బస్సుల స్టీరింగ్ చూస్తేనే ప్రయాణికులకు ఒక రకమైన భయం పుడుతుంది. డ్రైవర్ క్యాబిన్ వద్ద బస్సుల పరిస్థితిని చూస్తే గుబులు పుడుతుంది. గతేడాది వేములవాడ వద్ద బస్సు ప్రమాద సంఘటన ఆర్టీసీలో ప్రకంపనలు సృష్టించింది. అయితే ఆ తర్వాత అది సద్దుమణిగిపోయింది. ప్రధానంగా ఇలాంటి ఏళ్లనాటి బస్సుల కారణంగానే ప్రమాదాలు సంభవిస్తున్నాయనే అభిప్రాయం ఉంది. తగ్గిన ఓఆర్.. ఆర్టీసీలో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది బస్సులో ప్రయాణికుల శాతం (ఆక్యుపెన్సీ రేషియో) గణనీయంగా తగ్గింది. దీనికి డొక్కు బస్సులే కారణమన్న అభిప్రాయం లేకపోలేదు. ఆర్టీసీలో ప్రయాణం.. సురక్షిత ప్రయాణం అనేది సంస్థ నినాదం. రీజియన్ స్థాయిలో ప్రస్తుతం 70 నుంచి 75 శాతం ఓఆర్ ఉండగా, గతేడాది ఇదే సమయానికి 90శాతం ఉండటం గమనార్హం. అలాగే ఆదాయం పరంగా చూస్తే ప్రస్తుతం రూ.70 లక్షల నుంచి రూ.75లక్షల వరకు లభిస్తుండగా, గతేడాది రూ.80లక్షల నుంచి రూ.85లక్షల వరకు, అంతకంటే ఎక్కువ కూడా రోజు ఆదాయం సమకూరేది. ఈ నేపథ్యంలో ప్రయాణికులను దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ మార్పులు చేయని పక్షంలో రానున్న రోజుల్లో ఓఆర్, ఆదాయం మరింత పడిపోయినా ఆశ్చర్య పోనక్కర్లేదు. రీజియన్ పరిధిలో పలు డ్రైవర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సుమారు 1100 పోస్టులకు గాను 110 ఖాళీ ఉన్నట్లు చెబతున్నారు. సాధారణంగా ఒక బస్సు నడవాలంటే బస్ ఆఫ్ రేషియో (బీఎస్ఆర్) 6.2గా సిబ్బంది ఉండాలి. ఈ అంకెల్లో డ్రైవర్, కండక్టర్, మెకానిక్, ఆఫీస్ స్టాఫ్, కంట్రోలర్, సూపర్వైజర్ రావడం జరుగుతుంది. ప్రస్తుతం ఇది 4.2గా ఉందని కార్మిక వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఉన్న సిబ్బందిపైనే అదనపు భారం పడుతోంది. దీంతో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించలేకపోతున్నారు. తారు రోడ్లపై అద్దె బస్సులు రీజియన్ పరిధిలోని ఆరు డిపోల్లో రాజధాని, సూపర్లగ్జరీ, డీలక్స్, ఎక్స్ప్రెస్, పల్లెవెలుగు, మినీ పల్లెవెలుగు బస్సులు నడుస్తున్నాయి. ఆర్టీసీ నుంచి పాత బస్సుల స్థానంలో కొత్తబస్సుల రీప్లేస్మెంట్ గత కొన్నేళ్లుగా లేదు. సంస్థ నష్టాల కారణంగా ఈ పరిస్థితి తలెత్తింది. ఇదిలా ఉంటే అద్దెబస్సుల సంఖ్య ఏటా క్రమంగా పెరుగుతోంది. ఎక్స్ప్రెస్ అద్దె బస్సులే అధికంగా ఉన్నాయి. దీంతో ప్రధానంగా ముఖ్యపట్టణాలకు ప్రధాన రోడ్డు మార్గాల్లోనే ఈ బస్సులు పయనిస్తున్నాయి. ఇక రహదారులు సరిగ్గా లేని మార్గాల్లో పల్లెవెలుగు బస్సులు వెళ్తుంటాయి. ఇక దూర ప్రాంతాలకు రాజధాని, లగ్జరీ, సూపర్లగ్జరీ, డీలక్స్ బస్సులు నడుస్తుంటాయి. ఆదిలాబాద్, మంచిర్యాల, కుమురంభీం జిల్లాల్లో వివిధ ప్రాంతాల నుంచి రైలు మార్గాలు ఉన్నా నిర్మల్లో ఈ సదుపాయం లేదు. ఆదిలాబాద్లో రైలుమార్గం ఉన్నా తక్కువ రైళ్లు ఈమార్గంలో పయనిస్తుండడంతో అత్యధికంగా ప్రయాణికులకు బస్సులే దిక్కు. దీన్ని సొమ్ము చేసుకోవాల్సిన ఆర్టీసీ చేష్టలోడుతోంది. ప్రైవేట్ ట్రావెల్స్ ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ మార్గంలో పదుల సంఖ్యలో వెళ్తుంటాయంటే అర్థం చేసుకోవచ్చు. -
హైదరాబాద్లో ఓలెక్ట్రా బస్ ప్లాంటు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ బస్ల తయారీలో ఉన్న ఓలెక్ట్రా గ్రీన్టెక్ హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ వద్ద అంతర్జాతీయ స్థాయిలో కొత్త ప్లాంటును ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే సంస్థకు జడ్చర్ల వద్ద తయారీ కేంద్రం ఉంది. ప్రతిపాదిత నూతన ప్లాంటు కోసం తెలంగాణ ప్రభుత్వం 300 ఎకరాల స్థలాన్ని మంజూరు చేసింది. ఏడాదిన్నరలో తొలి దశ పూర్తి అవుతుంది. ఆ తర్వాత రెండేళ్లకు రెండు, మూడవ దశ పూర్తి చేస్తామని ఓలెక్ట్రాను ప్రమోట్ చేస్తున్న మేఘా ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ గ్రూప్ డైరెక్టర్ కె.వి.ప్రదీప్ తెలిపారు. బీవైడీ–ఓలెక్ట్రా తయారీ 40 ఎలక్ట్రిక్ బస్లను టీఎస్ఆర్టీసీ మంగళవారమిక్కడ ప్రారంభించిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కొత్త ఫ్యాక్టరీకి రూ.300 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్టు వెల్లడించారు. అన్ని దశలు పూర్తి అయితే ప్రత్యక్షంగా 3,500 మందికి, పరోక్షంగా 4,000 మందికి ఉపాధి లభిస్తుందని వివరించారు. ఏటా 10 వేల యూనిట్ల విపణి.. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు ఉద్దే శించిన ఫేమ్–2 పథకంతో ఈ రంగానికి మంచి బూస్ట్నిస్తుందని ఓలెక్ట్రా ఎండీ ఎన్.కె.రావల్ తెలిపారు. ‘మూడేళ్లలో ఫేమ్–2 కింద 7,000 బస్లకు కేంద్రం ప్రోత్సాహకాలు ఇవ్వనుంది. రెండేళ్ల తర్వాత ఏటా భారత్లో 10,000 ఎలక్ట్రిక్ బస్లు రోడ్డెక్కుతాయి. రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఈ–బస్ల వినియోగాన్ని పెంచనున్నాయి. ప్రస్తుతం ఓలెక్ట్రా మూడు రకాల మోడళ్లలో బస్లను తయారు చేస్తోంది. మరిన్ని మోడళ్లను పరిచయం చేస్తాం. ప్రస్తుతం 120 బస్లకు ఆర్డర్ బుక్ ఉంది’ అని వివరించారు. ఇప్పటి వరకు ఎలక్ట్రిక్ బస్ల విభాగం కోసం మేఘా ఇంజనీరింగ్ రూ.800 కోట్లు ఖర్చు చేసింది. పెట్టుబడులు కొనసాగిస్తాం.. భారత్లో ఎలక్ట్రిక్ బస్ల రంగంలో రానున్న రోజుల్లో వ్యాపార అవకాశాలు పుష్కలంగా ఉంటాయని ఓలెక్ట్రా భాగస్వామి బీవైడీ ఇండియా ఎండీ లియో షోలియాంగ్ అన్నారు. దేశంలో ఆధునిక టెక్నాలజీని ప్రవేశపెడతామని చెప్పారు. ఇప్పటి వరకు ఇక్కడ రూ.1,400 కోట్లు పెట్టుబడి పెట్టామని వెల్లడించారు. ఇలా పెట్టుబడులకు కొనసాగిస్తామని పేర్కొన్నారు. భారత్లో ఇప్పటికే ఓలెక్ట్రా రూపొందించిన 68 బస్సులు హిమాచల్ ప్రదేశ్, పుణే, కేరళ, ముంబైతోపాటు శంషాబాద్ విమానాశ్రయంలో పరుగెడుతున్నాయని ఓలెక్ట్రా ఈడీ ఎన్.నాగ సత్యం తెలిపారు. తాజాగా ప్రవేశపెట్టిన 40 బస్సులతో కలిపి వీటి సంఖ్య 108కి చేరుతుందని చెప్పారు. ఒక్కో బస్సు ఒకసారి చార్జింగ్తో 250 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని కంపెనీ సీవోవో ఆనంద్ స్వరూప్ తెలిపారు. ఈ–బజ్ కే9 పేరుతో రూపొందిన ఈ మోడల్ ఏసీ బస్లు 12 మీటర్ల పొడవుంటాయి. డ్రైవరుతో కలిపి 40 మంది కూర్చోవచ్చు. ఇతర నగరాలకు ఈ–బస్లు.. మియాపూర్, జేబీఎస్ బస్టాండ్ నుంచి వివిధ మార్గాల ద్వారా శంషాబాద్కు ఈ 40 బస్లను నడుపుతారు. ఇన్ని ఎలక్ట్రిక్ బస్లు ఒకేసారి రోడ్డెక్కడం దేశంలో ఇదే ప్రథమమని రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, టీఎస్ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ అన్నారు. ఈ–బస్ల విషయంలో ఇతర రాష్ట్రాలు తెలంగాణను అనుసరించాల్సిందేనని తెలిపారు. హైదరాబాద్ నుంచి ప్రధాన నగరాలకు ఎలక్ట్రిక్ బస్లను ప్రవేశపెడతామని వెల్లడించారు. పెరుగుతున్న కాలుష్యం, ఇంధన ధరల కట్టడికి ఈ–బస్లు పరిష్కారమని అభిప్రాయపడ్డారు. -
ఒక్కొక్కరూ ఓ కేసీఆర్ కావాలె
♦ ఆర్టీసీని కాపాడుకోవాలె: సీఎం పిలుపు ♦ అప్పట్లో ఆర్టీసీని లాభాల బాట పట్టించిన ♦ మంత్రి మొదలు కార్మికుల దాకా కలిసి పని చేయాలె ♦ వజ్ర మినీ ఏసీ తదితర కొత్త బస్సులు ప్రారంభించిన సీఎం సాక్షి, హైదరాబాద్: ‘‘ఆర్టీసీ అంటే సాధారణ విషయం కాదు. రాష్ట్రంలో ఐదు కోట్ల మంది దానిమీదే ఆధారపడ్డరన్న సంగతి మరవొద్దు. నిత్యం 90 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సులల్లనే తిరుగుతరు. అంటే దాదాపు ఐదో వంతు తెలంగాణ బస్సులల్లనే ఉంటదన్నట్టు. ఆర్టీసీపై ఎంత గురుతర బాధ్యత ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అప్పట్లో తీవ్ర నష్టా ల్లో ఉన్న ఆర్టీసీని నేను రవాణా మంత్రిగా రూ.14 కోట్ల లాభాల్లోకి తెచ్చిన. ప్రతి ఆర్టీసీ ఉద్యోగీ ఒక కేసీఆర్ కావాలె. మీరు తలచుకుని వంద శాతం పనిచేస్తే సంస్థ బాగుపడ్తది. అభి ప్రాయ భేదాలతో నవ్వేటోని ముంగట మనం జారిపడొద్దు. తెలంగాణ ఆర్టీసీ దేశంలో భేషని పించుకోవాలె. మిషన్ కాకతీయ, మిషన్ భగీ రథ పథకాలను ఎన్నో రాష్ట్రాల నుంచి వచ్చి చూసిపోతున్నరు. షీ టీమ్స్ను చూసి ఇతర రాష్ట్రాల్లోనూ మొదలు పెడుతున్నరు. రుణ మాఫీ ఎట్ల చేసినమా అని నిన్నటికి నిన్న మహారాష్ట్రవాళ్లు మన దగ్గర నేర్చుకొని పోయిండ్రు. తెలంగాణ మూడేళ్ల పసికూన. యంగెస్ట్ స్టేట్ ఆఫ్ ఇండియా. అయినా ఇన్ని రాష్ట్రాల వాళ్లు మన దగ్గరికొచ్చి చూసిపోతు న్నరు. రేపు మన ఆర్టీసీని కూడా చూస్తందుకు కూడా అట్ల రావాలె’’ అంటూ ఆర్టీసీ యంత్రాంగానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఉద్బోధించారు. ఆర్టీసీ కొత్తగా కొను గోలు చేసిన వజ్ర ఏసీ మినీ, పల్లె వెలుగు మినీ బస్సులతోపాటు ఇతర పెద్ద బస్సులను గురు వారం ప్రగతి భవన్లో ఆయన ప్రారంభిం చారు. ఇక నుంచి ప్రభుత్వం ఆర్టీసీకి అండగా ఉంటుందని సీఎం భరోసా ఇచ్చారు. ‘‘బడ్జెట్లో ఆర్టీసీకి ప్రతిపాదించిన రూ.వెయ్యి కోట్లు విడుదల చేస్తాం. హైదరాబాద్ నగరంలో వచ్చే నష్టాలను జీహెచ్ఎంసీ నిధులతో భర్తీ చేస్తాం. ఆ మొత్తం నెల నెలా ఆర్టీసీకి అందేలా చూస్తా’’అని హామీ ఇచ్చారు. ఆర్టీసీ నష్టాలు గతంతో పోలిస్తే కొంత నష్టాలు తగ్గినా లాభాల్లోకి రావాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. సమైక్య రాష్ట్రంలో ఆర్టీసీపై నిత్యం కత్తే సమైక్య రాష్ట్రంలో ఆర్టీసీపై నిత్యం ప్రైవేటీకరణ కత్తి వేలాడుతుండేదని సీఎం అన్నారు. కానీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం రూ.750 కోట్లు ఇచ్చి, కొన్ని అప్పులు తీర్చి సంస్థను బతికించే ప్రయత్నం చేసిందన్నారు. ‘‘ప్రజా రవాణా సంస్థను నిర్వహించడం ఏ ప్రభుత్వానికైనా ఒక సామాజిక బాధ్యత. సమస్య మూలాల్లోకి పోయి సంస్థను ఎలా నడపాలా అని గత పాలకులు పరిశోధన చేయకపోవడం దారుణం. ఆర్టీసీని బతికించుకోవాలె. విద్యుత్ సంస్థలను బతికించుకునేందుకు వాటికి రూ.12,000 కోట్ల అప్పులను రాష్ట్రం ప్రభుత్వ మే భరిస్తున్నది. అట్లే ఆర్టీసీని కూడా ఎట్ల గట్టున పడేయాలా అని ఆలోచిస్తున్నం. సమై క్య రాష్ట్రంలో కూడా లేని విధంగా బడ్జెట్లో ఆర్టీసీకి రూ.1,000 కోట్లు కేటాయించినం. బస్ పాస్ వంటివాటిని పైసాపైసా రీయింబర్స్ చేస్తం. ప్రపంచంలో ఎక్కడ చూసుకున్నా పట్టణ ప్రాంతాల్లో ప్రజా రవాణా నష్టాల్లోనే ఉంది. ఒక్క హైదరాబాద్లో తిరుగుతున్న బస్సుల సంఖ్యే పలు చిన్న రాష్ట్రాల్లోని మొత్తం బస్సుల కంటే ఎక్కువగా ఉంటుంది! నగరం లో వేల సంఖ్యలో ప్రైవేటు వాహనాలున్నా జనం మాత్రం ఆర్టీసీ బస్సుల్లో వేలాడుతూ మరీ పోవడం చూస్తే ఆశ్చర్యమైతది. 3,000 పై చిలుకు బస్సులు నగరంలో నిత్యం రద్దీగా తిరుగుతున్నయంటే అది ఆర్టీసీపై ప్రజలకున్న నమ్మకానికి నిదర్శనం. అందుకే మనం ఆర్టీసీని కాపాడుకోవాల్సి ఉంది. ఆ ఉద్దేశం తోనే సంస్థ నష్టాల్లో ఉన్నా 55,000 మంది కార్మికులకు మంచి ఫిట్మెంట్తో వేతనాలు పెంచినం. 4,000 మంది కాంట్రాక్టు ఉద్యోగు లను క్రమబద్ధీకరించినం. ఆర్టీసీని లాభాల్లో ఉన్న సంస్థలకు అప్పగించటం ద్వారా వాటి లాభాలతో దాని నష్టాలను భర్తీ చేసే విధానం వేరే దేశాల్లో ఉంది. మన దగ్గర కూడా ముంబైలో అమలవుతున్నది. అదే మాదిరిగా హైదరాబాద్లో వచ్చే నష్టాలను జీహెచ్ఎంసీ భర్తీ చేసేలా చట్ట సవరణ చేసినం. ఈ సభకు వచ్చే ఐదు నిమిషాల ముందు జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్రెడ్డితో మాట్లాడిన. ఆర్టీసీకి జీహెచ్ఎంసీ ఆ మొత్తాన్ని నెలనెలా చెల్లించాల ని చెప్పిన’’ అని సీఎం వెల్లడించారు. మరిన్ని ప్రాంతాలకు వజ్ర ఏసీ బస్సులు బస్సెక్కాలంటే ఇమ్లీబన్కో, జూబ్లీ బస్టాండు లో వెళ్లే విధానం నుంచి బస్సులే కాలనీలకు వచ్చే కొత్త విధానం ప్రారంభిస్తుండటం సంతోషంగా ఉందని సీఎం అన్నారు. వజ్ర పేరుతో వస్తున్న ఏసీ మినీ బస్సులు కాలనీలకే వచ్చి ప్రయాణికులను ఎక్కించుకునే విధానం మంచి ఫలితాలనిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 21 సీట్లుండే ఈ బస్సులను తొలుత హైదరాబాద్ నుంచి నిజామాబాద్, వరంగల్ నడుపుతున్నారు. వీటిని కరీంనగర్తో పాటు సింగరేణి, ఎన్టీపీసీ వంటి పరిశ్రమలుండే మంచిర్యాల, రామగుండం, ఆదిలాబాద్ల వైపు కూడా నడపాలని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా సూచించారు. ఈ బస్సులు రోడ్డెక్కాక వేరే ప్రాంతాల నుంచి కూడా డిమాండ్ వస్తుందని ఆయన అన్నారు. ఇలాంటి విధానం ఇప్పటి వరకు దేశంలో ఎక్కడా లేదన్నారు. సోయి తప్పి ఉండొద్దు... రవాణా మంత్రి, ఆర్టీసీ చైర్మన్, అధికారులు, కార్మికులు అంతా ఓ కుటుంబంలా చిరునవ్వుతో కలిసిమెలిసి పనిచేయాలని సీఎం హితబోధ చేశారు. ‘‘రాష్ట్ర పెద్దగా కఠినంగా చెప్తున్న. మీలో ఎవరూ సోయి తప్పి వ్యవహరించొద్దు. భేదాభిప్రాయాలు లేకుండా వ్యవహరించాలి. ఎవరికి వాళ్లమే అన్నట్టుగా వ్యవహరిస్తే అది దుర్మార్గమైతది. మనం బాగా పని చేస్తే సంస్థ బాగుంటది. ఎన్ని నష్టాలొచ్చినా బాగా చేయించేవారుంటే గాడిలో పడతది. రైతు కొద్ది గుర్రమని గుర్తించాలె. మంత్రి, చైర్మన్, ఎండీ ముందుండి సంస్థను లాభాలబాట పట్టించాల్సిందే. అందుకోసం అంతా సోదర భావంతో పని చేయాలె’’అని పిలుపునిచ్చారు. రవాణా మంత్రిగా పనిచేసిన అనుభవంతో సంస్థపై తనకు ప్రేమ ఉందన్నారు. దటీజ్ ఆర్టీసీ ‘‘ఇటీవల వరంగల్లో జరిగిన టీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు పార్టీ పక్షాన దాదాపు 6,000 ఆర్టీసీ బస్సులు బుక్ చేశారు. లక్షల మంది తరలి వచ్చిన ఆ సభ అనంతరం ఒక్క ప్రమాదం కూడా జరగకుండా అంతా బస్సుల్లో క్షేమంగా గమ్యస్థానాలకు వెళ్లిండ్రు. దటీజ్ ఆర్టీసీ. సభ తర్వాత నేను హైదరాబాద్వచ్చి నిశ్చింతగా నిద్రపోగలిగానంటే అది ఆర్టీసీ గొప్పతనమే’’అని సీఎం అన్నారు. బయోడీజిల్ సూపర్ లగ్జరీలు కొత్తగా ప్రారంభించిన బస్సుల్లో బయో డీజిల్తో నడిచే సూపర్ లగ్జరీ బస్సులు కూడా ఉండటం విశేషం. వజ్ర బస్సుల్లో సీట్లు బుక్ చేసుకునే మొబైల్ యాప్ను కూడా సీఎం ప్రారంభించారు. మంత్రులు మహేందర్రెడ్డి, హరీశ్రావు, ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారా యణ, ఎండీ రమణారావు, ఎంపీలు గుత్తా సుఖేందర్రెడ్డి, కొత్త ప్రభాకర్రెడ్డి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ప్రశాంత్రెడ్డి, మండలి చీఫ్ విప్ సుధాకర్రెడ్డి, విప్ పల్లా రాజేశ్వర్రెడ్డి, ఆర్టీసీ యూనియన్ నేతలు తదితరులు పాల్గొన్నారు. -
కొత్త బస్సులకు నేడు మోక్షం
- మధ్యాహ్నం ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ - నెలలుగా పార్కింగ్ యార్డుకే పరిమితం... సాక్షి, హైదరాబాద్: బ్యాంకుల నుంచి అప్పు తెచ్చి మరీ కొనుగోలు చేసిన దాదాపు 300 బస్సులకు 4 నెలల తర్వాత మోక్షం కలుగు తోంది. ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించాలని ఆర్టీసీ నిర్ణయించినప్పటికీ, సీఎంకు పని ఒత్తిడి కారణంగా వీలు చిక్కకపోవటంతో 4 నెలలుగా ఆ బస్సులు పార్కింగ్ యార్డుకే పరిమితమయ్యాయి. ఎట్టకేలకు వాటిని సీఎం గురువారం మధ్యాహ్నం ప్రారంభించబోతున్నారు. రూ. 350 కోట్లతో 1,100 కొత్త బస్సులు కొనాలని గతంలోనే ఆర్టీసీ నిర్ణయిం చింది. ఇందులో తొలుత 600 బస్సులు కొన్నది. గత డిసెంబర్ నుంచి విడతలవారీగా వస్తున్న ఈ బస్సులను ముషీరాబాద్లోని పార్కింగ్ యార్డులో ఉంచింది. కానీ సీఎం కార్యాలయం నుంచి ప్రారంభోత్సవ ముహూ ర్తం ఆలస్యం అవుతూ వచ్చింది. దీంతో కొత్తగా వచ్చే బస్సులు నిలిపేందుకు చోటు లేకుండా పోయింది. 300 బస్సులను జిల్లా లకు పంపి మరో 300 బస్సులను అలాగే ఉంచేసింది. ఎట్టకేలకు బుధవారం సీఎంవో నుంచి ప్రారంభోత్సవ కబురు అందటంతో వాటి దుమ్ము దులిపి, కడిగి సిద్ధం చేశారు. మొదట మూడో తేదీన ప్రారంభోత్సవం అని చెప్పినా తర్వాత దాన్ని ఐదుకు మార్చారు. మళ్లీ ఇప్పుడు నాలుగో తేదీకి మార్చి ఖరారు చేశారు. గురువారం ప్రగతిభవన్లో జరిగే కార్యక్రమంలో సీఎం వాటిని ప్రారంభించ నున్నారు. వెంటనే వాటిని జిల్లాలకు పంపనున్నారు. కొత్తగా ప్రవేశపెట్టబోయే ఏసీ మినీ వజ్ర బస్సులు 60, నాన్ ఏసీ మినీ పల్లెవెలుగు బస్సులు 50 ఉన్నాయి. సూపర్లగ్జరీ, డీలక్స్, ఎక్స్ప్రెస్, పల్లెవెలుగు బస్సులు 190 ఉన్నాయి. వేసవిలో రద్దీ పెరిగినందున కొత్త బస్సుల అవసరం ఎంతో ఉంది. ఇప్పటికే సగానికిపైగా వేసవి గడిచిపోయినందున మిగిలిన రోజుల రద్దీ కనుగుణంగా కొత్త బస్సులను వెంటనే డిపోలకు కేటాయించనున్నారు. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్త బస్సులు
ఆర్టీసీ ఈడీ ముక్కాల రవీందర్ పలు డిపోల్లో తనిఖీలు హన్మకొండ : కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్త బస్సులు ప్రవేశ పెట్టనున్నట్లు ఆర్టీసీ ఈడీ(ఈ) ముక్కాల రవీందర్ తెలిపారు. హన్మకొండలోని ఆర్టీసీ వరంగల్-2, హన్మకొండ డిపోలతో పాటు మభబూబాబాద్ డిపోను శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డిపోల్లోని మెకానికల్ విభాగాలు, బస్సుల కండీషన్లను పరిశీలించిన ఆయన మెకానిక్ల సమస్యలపై ఆరా తీశారు. హన్మకొండ డిపోకు కొత్తగా వచ్చిన జేఎన్ఎన్యూఆర్ఎం బస్సుల కండీషన్ను అడిగి తెలుసుకున్నారు. కాలం చెల్లిన బస్సులు, ప్రధానంగా 6.50 లక్షలు కిలోమీటర్లు తిరిగి సూపర్ లగ్జరీ బస్సుల స్థానంలో కొత్త సూపర్ లగ్జరీ బస్సులు ప్రవేశపెట్టనున్నట్లు ఈడీ చెప్పారు. ఈ మేరకు వరంగల్ రీజియన్కు కొత్తగా 50 బస్సులు రానున్నాయన్నారు. ఇక ప్రయాణికులకు మెరుగైన సేవలందించడంలో భాగంగా హన్మకొండ-హైదరాబాద్ రూట్లో మినీ బస్సులు ప్రవేశ పెడుతున్నామన్నారు. వరంగల్లోని వివిధ కాలనీల నుంచి హైదరాబాద్లోని పలు కాలనీలకు నేరుగా ఈ బస్సులు నడుస్తాయని, వీటిని దసరా నుంచే ప్రారంభించేలా కృషి చేస్తున్నట్లు ఈడీ రవీందర్ వివరించారు. ఈ మేరకు ప్రయాణికులు ఆర్టీసీని ఆదరించాలని కోరారు. కాగా, హన్మకొండ, వరంగల్-2 డిపోల పరిశీలన సందర్భంగా ల్లో బస్సులు మరమ్మత్తు చేసే కందకం(పిట్)లోకి నీరు వస్తోందని, అందులోని వైర్లు తడిసి షాక్ తగులుతోందని మెకానిక్లు ఈడీ రవీందర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ ఆర్టీసీ మెకానిక్లకు నష్టం కలుగకుండా జాగ్రత్తలు, చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో వరంగల్ రీజినల్ మేనేజర్ తోట సూర్యకిరణ్, డిప్యూటీ సీఎంఈ జి.రాములు, డిపో మేనేజర్లు భానుకిరణ్, అర్పిత పాల్గొన్నారు. -
ఆర్టీసీకి 1,391 కొత్త బస్సులు
► కొత్తగా 750 గ్రామాలకు రవాణా సౌకర్యం సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ రికార్డు స్థాయిలో కొత్త బస్సులను రోడ్డెక్కించబోతోంది. ఈ ఏడాది 1,391 కొత్త బస్సులను కొనుగోలు చేసేందుకు నిర్ణయించింది. రూ.350 కోట్లను ఇందుకోసం ఖర్చు చేయనుంది. ఇప్పటికే కొనుగోలు ఆర్డర్లను కూడా జారీ చేసింది. రాష్ట్రంలో 1,100 గ్రామాలకు ఆర్టీసీ బస్సులు వెళ్లటం లేదు. కొత్త బస్సులతో మొత్తం 750 గ్రామాలకు రవాణా సౌకర్యం కల్పించబోతోంది. అన్ని నియోజకవర్గ కేంద్రాల నుంచి భాగ్యనగరానికి ‘రాజధాని’ ఏసీ బస్సులు నడిపేందుకు అదనంగా 95 ఏసీ బస్సులను సమకూర్చుకోబోతోంది. తొలిసారిగా 236 మినీ బస్సులను కూడా కొంటోంది. ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉందన్న ఉద్దేశంతో గతంలో చాలా ఊళ్లకు బస్సులను నిలిపివేసింది. ఆ సమస్యకు మినీ బస్సులతో చెక్ పెట్టాలని నిర్ణయించింది. ఇక ఇందులో 100 వరకు ఏసీ బస్సులుంటాయని అధికారులు చెబుతున్నారు. ప్రత్యేక సందర్భాల్లో ప్రైవేటు వ్యక్తులకు అద్దెకు ఇవ్వటంతోపాటు, నగరాల్లోని కాలనీల నుంచి వేరే ప్రాంతాలకు నడిపేందుకు వాటిని వాడతారని పేర్కొంటున్నారు. ఇవి కాకుండా 386 సూపర్ లగ్జరీ బస్సులు, 600 ఎక్స్ప్రెస్ బస్సులు, 74 పల్లెవెలుగు బస్సులు అందుబాటులోకి రాబోతున్నాయి. -
అద్దె రూట్లు మళ్లీ పాత వారికే: ఆర్టీసీ
సాక్షి, హైదరాబాద్ : అద్దె బస్సుల కాలపరిమితి పూర్తయ్యాక ఆయా రూట్లలో కొత్త బస్సులు తిప్పుకొనే వెసులుబాటును పాత యజమానులకే ఇవ్వనున్నట్లు ఆర్టీసీ స్పష్టం చేసింది. మళ్లీ టెండర్లు పిలవకుండా పాతవారికే కేటాయించనున్నట్టు తేల్చి చెప్పింది. కాలపరిమితి పూర్తయిన రూట్లలో కొత్త బస్సులు తీసుకునేప్పుడు టెండర్లు ఆహ్వానిస్తే నిరుద్యోగులు సహా కొత్తవారు టెండర్లలో పాల్గొనే అవకాశం ఉంటుంది. అలా కాకుండా పాతవారికే మళ్లీ కట్టబెట్టడం వల్ల కొత్తవారికి అవకాశం లేకపోవటంతోపాటు, ఆ ప్రక్రియ ద్వారా వచ్చే ఆదాయం కోల్పోయే అవకాశం ఉంటుందంటూ ఇటీవల ‘అమ్మకానికి ఆర్టీసీ బస్సు రూట్లు’ అంటూ ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన ఆర్టీసీ, 2008లో అద్దె ప్రాతిపదికన తీసుకున్న 507 బస్సుల్లో ఈ నెలాఖరుతో 27 బస్సుల కాలపరిమితి తీరుతుందని, వచ్చే ఏడాది నాటికి దశల వారీగా అన్ని బస్సుల గడువు పూర్తవుతుందని పేర్కొంది. గడువు పూర్తయిన వాటి స్థానంలో మళ్లీ పాతవారికే కొత్త బస్సులు నడుపుకొనే అవకాశం ఇవ్వనున్నట్లు వెల్లడించింది. టెండరు ప్రక్రియ ద్వారా వచ్చే ఆదాయం కోల్పోయే పరిస్థితి ఉన్నా.. అది పెద్ద విషయం కాదని తెలిపింది. పాతవారికే బస్సులు కేటాయించే విషయంలో అక్రమాలకు అవకాశం లేదని చెప్పడం విశేషం. -
ఆర్టీసీకి కేంద్రం షాక్
‘జేఎన్ఎన్యూఆర్ఎం’లో వాటా 60 శాతానికి తగ్గించుకుంటున్నట్లు వెల్లడి సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీకి కేంద్రం షాక్ ఇచ్చింది. జేఎన్ఎన్యూఆర్ఎం పథకం కింద కొత్త బస్సుల కొనుగోలు వ్యయంలో కేంద్రం ఇప్పటివరకు 80 శాతం భరిస్తోంది. తాజాగా దాన్ని 60 శాతానికి తగ్గించింది. వెంటనే దీనిని అమలు చేయనున్నట్టు ఆర్టీసీకి ఉత్తర్వులు పంపింది. తాజాగా కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్ పట్టణాలను జేఎన్ఎన్యూఆర్ఎంలో చేరుస్తూ కేంద్రం ఇటీవల 130 బస్సులను మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఇందులో 60 బస్సులు ఇప్పటికే రాగా మిగతావాటిని ఇవ్వనున్నట్టు ఇటీవలే పేర్కొంది. ఆ మేరకు నిధులు కూడా మంజూరు చేసింది. కొత్త బస్సుల కొనుగోలులో తన వాటాను తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఈ మూడు పట్టణాలకు మంజూరు చేసే నిధుల్లోనే వర్తింపజేయనున్నట్టు తాజాగా స్పష్టం చేయగా ఆర్టీసీ కంగుతిన్నది. ఈ 130 బస్సులకు రూ.48.5 కోట్లు అవసరం కాగా తన వాటాగా 20 శాతం భరిస్తే సరిపోతుందని ఆర్టీసీ ఇప్పటి వరకు భావించింది. కానీ తాజాగా కేంద్రం చేసిన ప్రకటనతో 40 శాతం భరించాల్సి వస్తోంది. ప్రస్తుతం ఆర్టీసీ వద్ద అన్ని నిధులు లేవు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆర్టీసీని విస్మరిస్తూ ఆర్థిక సాయం చేయకుండా చేతులెత్తేసింది. -
నష్టాల నుంచి లాభాల బాట
- త్వరలో 40 కొత్త బస్సుల రాక - నెలలో ఒకరోజు సిబ్బంది స్వచ్ఛంద సేవలు - ఆర్టీసీ ఆర్ఎం సుధీష్బాబు సాక్షి, విశాఖపట్నం : ఆర్టీసీ విశాఖ రీజియన్కు ఏళ్ల తరబడి నష్టాలే తప్ప లాభం తెలియదు. ఎన్ని ప్రయోగాలు చేసినా ఫలితాలు కానరాలేదు. ఏటేటా నష్టాలు పెరుగుతూ వచ్చాయి. అలా ఆ నష్టాలు ఏడాది క్రితం వరకు రూ.12.31 కోట్లకు చేరుకున్నాయి. అయితే పరిస్థితిలో ఇప్పుడు మార్పు వచ్చింది. ఏడాది కాలంగా నష్టాలను అధిగమిస్తూ వస్తోంది. దీంతో జూన్ నాటికి రూ.4.55 లక్షల లాభాన్ని ఆర్జించగలిగింది. ఇదే ఇప్పుడు విశాఖ రీజియన్లో పనిచేస్తున్న ఆర్టీసీ కార్మిక వర్గాల్లో ఆనందం నింపుతోంది. ప్రయాణికులతో మరింత సఖ్యతగా మెలగడం ద్వారా ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్) పెంచడం, ఒకదాని వెనక ఒకటిగా బస్సులు వెళ్లకుండా చూడడం, బస్సులు సమయపాలన పాటించడం తదితర అంశాలు రీజియన్ లాభాల బాట పట్టడానికి దోహదపడ్డాయి. ఉదాహరణకు మే నెలలో 64 నుంచి 66కు పెరిగిన ఓఆర్, జూన్లో 72 నుంచి 76కు పెరిగింది. అంతే కాదు సంస్థ ఆదాయం పెంపునకు సిబ్బంది, కార్మికులు కూడా ‘పరిరక్షణ’ పేరిట తమ వంతు పాటుపడుతున్నారు. కొన్నాళ్ల నుంచి సిబ్బంది తమ సెలవు రోజుల్లోనూ నెలలో ఒకసారి ముఖ్యమైన బస్టాపులు, స్టేజిల్లో ఆటోలు, జీపులు, ఇతర ప్రయివేటు వాహనాల్లో ప్రయాణికులు వెళ్లకుండా నిలువరిస్తూ స్వచ్ఛందంగా విధులు నిర్వహిస్తున్నారు. ఉదయం నాలుగు గంటలు, సాయంత్రం నాలుగు గంటల చొప్పున వీరు అక్కడ ఈ బాధ్యతలు చేపడుతున్నారు. ఇలా జిల్లాలోని తొమ్మిది డిపోల నుంచి 150 నుంచి 200 మంది వరకు ఇందులో పాలు పంచుకుంటున్నారు. దీంతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య పెరగడం ద్వారా సంస్థ ఆదాయమూ పెరగడానికి దోహద పడుతున్నారు. పుష్కరాల సందర్భంగా ‘పరిరక్షణ’కు కాస్త విరామం ఇచ్చారు. వచ్చే వారం నుంచి మళ్లీ యధావిధిగా కార్మికులు స్వచ్ఛంద సేవలు కొనసాగిస్తారని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ జి.సుధీష్బాబు ‘సాక్షి’కి తెలిపారు. విశాఖ రీజియన్ లాభాల బాట పట్టడంలో కార్మికులు, సిబ్బంది కృషి ఉందన్నారు. పుష్కరాల సందర్భంగా రీజియన్కు రూ.11.44 కోట్ల ఆదాయం సమకూరిందని చెప్పారు. జులై నెల పుష్కరాల ఆదాయంతో లాభం మరింత పెరుగుతుందన్నారు. కొత్తగా 40 బస్సులు విశాఖ రీజియన్కు త్వరలో 40 కొత్త బస్సులు రానున్నాయని ఆర్ఎం తెలిపారు. ఇందులో 30 మెట్రో బస్సులు, మరో 10 సిటీ ఆర్డినరీ బస్సులు ఉన్నాయన్నారు. వీటిని ప్రయాణికుల డిమాండ్ ఉన్న రూట్లలో నడుపుతామన్నారు. గత ఏప్రిల్ నుంచి రాజమండ్రికి 4, కాకినాడకు 4, శ్రీకాకుళానికి 4, విజయనగరానికి 5 చొప్పున 15 మెట్రో ఏసీ బస్సులను తిప్పుతున్నామని చెప్పారు. వీటిలో కాకినాడ మినహా మిగిలిన సర్వీసుల ఆదాయం ఆశాజనకంగా ఉందని తెలిపారు. విభజన తర్వాత సర్వీసులు విస్తృతం రాష్ట్ర విభజన తర్వాత విశాఖ నుంచి రాష్ట్రంలోని వివిధ దూరప్రాంతాలకు బస్సు సర్వీసులను పెంచామని ఆర్ఎం తెలిపారు. కర్నూలుకు 2, కడపకు 2, ప్రొద్దుటూరు 2 సర్వీసుల చొప్పున సూపర్ లగ్జరీ సర్వీసులను నడుపుతున్నామన్నారు. ఆటోలు, ప్రైవేటు వాహనాల్లో ప్రయాణికులను నిలువరించి ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించేలా చర్యలు చేపడ్తున్నట్టు రీజనల్ మేనేజర్ సుధీష్బాబు వివరించారు. -
కొత్తకొత్తగా..
- జిల్లాకు 77 జేఎన్ఎన్యూఆర్ఎం బస్సులు - వచ్చే నెలాఖరుకు సిద్ధం - తొలి ప్రాధాన్యంగా పుష్కరాల కోసం కేటాయింపు సాక్షి, విజయవాడ : జిల్లాకు మరో 77 కొత్త బస్సులు మంజూరయ్యాయి. ఈ ఏడాది మొదటి అర్థ సంవత్సరానికి జేఎన్ఎన్యూ ఆర్ఎం కింద ఈ బస్సులు మంజూరయ్యాయి. వాస్తవానికి రెండు నెలల కిందటే మంజూరైనప్పటికీ ఆర్టీసీ విభజన ప్రక్రియ, ఉద్యోగుల సమ్మె, ఇతర కారణాలతో కేటాయింపుల్లో కొంత ఆలస్యం జరిగింది. ఈ క్రమంలో ఎట్టకేలకు కేటాయింపు ప్రక్రియ ఖరారు కావడంతో వచ్చే నెలాఖరుకు బస్సులు అందుబాటులోకి వచ్చేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. అన్నీ విజయవాడ పరిధిలోకే.. జిల్లాలో ఇప్పటికే జేఎన్ఎన్యూఆర్ఎం బస్సులు దాదాపు 300 వరకు ఉన్నాయి. కాలంచెల్లిన బస్సుల్ని తొలగించి వాటి స్థానంలో కొత్త బస్సుల్ని నడుపుతున్నారు. గత ఏడాది దశలవారీగా జిల్లాకు 150కుపైగా కొత్త బస్సులు మంజూరయ్యాయి. ఈ ఏడాది మొదటి ఆర్థిక సంవత్సరం నిధుల ద్వారా 90 బస్సుల్ని కేటాయించారు. వీటిలో 13 ఏసీ సర్వీసులు, మిగిలినవి 77 లోకల్ సబర్బన్ బస్సులు. ఏసీ బస్సులు మూడు నెలల కిందటే సిద్ధం కావడంతో వాటిని జిల్లాకు కేటాయించారు. నగరంలోని పండిట్ నెహ్రూ బస్స్టేషన్కు, గవర్నర్పేట, ఆటోనగర్ డిపోలకు కేటాయించారు. వచ్చే నెలాఖరులో వచ్చే 77 కొత్త బస్సులను కూడా నగరంలోని డిపోలకే మంజూరు చేయనున్నారు. వీటిని మెట్రో సర్వీస్ రూట్లో నడపనున్నారు. విజయవాడ-గుంటూరు, విజయవాడ-ఏలూరు, విజయ వాడ-గుడివాడ, విజయవాడ, నందిగామ, విజయవాడ- తెనాలి తదితర రూట్లతో పాటు నగరంలో సిటీ ఎక్స్ప్రెస్ సర్వీసులుగా ఇవి నడుస్తాయి. పాత బస్సుల స్థానే.. నగరంలో ఇప్పటికే 520 సిటీ సర్వీసులు ఉన్నాయి. ఇవన్నీ ఆర్డినరీ, డీలక్స్, మెట్రో సర్వీసులు. రవాణా శాఖ నిబంధనల ప్రకారం 12 నుంచి 13 లక్షల కిలోమీటర్లు తిరిగిన బస్సుల్ని నిలిపివేసి వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటుచేయాలి. అలా ప్రస్తుతం 12 లక్షల కిలోమీటర్లు తిరిగిన బస్సులు నగరంలో 25 ఉన్నాయి. ఈ క్రమంలో నూతనంగా మంజూరయ్యే 77 బస్సుల్లో 30 బస్సుల్ని సిటీ సర్వీసుకే కేటాయించనున్నారు. నగరంలో సిటీ బస్సుల్లో ఆక్యుపెన్సీ సగటున 70 శాతం వరకు ఉంటుంది. ఆక్యుపెన్సీ పెంచే దిశగా ఆర్టీసీ కొత్త సర్వీసుల ద్వారా ఎక్కువ స్టాప్స్ ఏర్పాటుచేసి సర్వీసులను నడపాలని నిర్ణయించింది. ప్రస్తుతం పుష్కరాలకు ఎక్కువ రద్దీ, వందల సంఖ్యలో అదనపు సర్వీసులు అవసరం ఉండటంతో ఇప్పటికే సిద్ధమైన బస్సులను తొలి ప్రాధాన్యతగా తూర్పుగోదావరి జిల్లాకు కేటాయించారు. -
ఆర్టీసీకి కొత్తగా 100 కొత్త బస్సులు
విజయవాడ : ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయమని ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి శిద్దా రాఘవరావు స్పష్టం చేశారు. ఆయన శనివారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ ఆర్టీసీని ప్రమాదాలు, నష్టాలు లేని సంస్థగా తీర్చిదిద్దుతామన్నారు. రిపబ్లిక్ డే రోజున 100 కొత్త బస్సులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదగా ప్రారంభిస్తామని శిద్దా తెలిపారు. ఆర్టీసీ విభజన ప్రక్రియకు ఇంకా రెండు నెలల సమయం పడుతుందని శిద్దా రాఘవరావు తెలిపారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో రాష్ట్రానికి 700 కొత్త బస్సులు రానున్నాయని ఆయన ప్రకటించారు. ఇకపై రోడ్ల నాణ్యతను అధునాతన పరికరాలతో తనిఖీ చేయనున్నామని శిద్దా రాఘవరావు పేర్కొన్నారు. -
ఇది నిరంతర ప్రక్రియ
దుబ్బాక: సంక్షేమ పథకాల లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, అర్హులైన వారు ఎప్పుడైనా సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకోవచ్చని నీటిపారుదల శాఖ మంత్రి హరీష్రావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలను నిరుపేద కుటుంబాలకు అందించేందుకుచిత్తశుద్ధితో పనిచేస్తున్నామన్నారు. అందువల్లే సంక్షేమ పథకాల లబ్ధిదారుల సంఖ్యకు పరి మితి విధించలేదన్నారు. అర్హులు ఎంతమంది ఉన్నా, సంక్షేమ ఫలాలు అందిస్తామన్నారు. ఆదివారం ఆయన దుబ్బాక డిపోకు మంజూరు చేసిన రెండు కొత్త బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో 2.50 లక్షల మంది వృద్ధులు, వితంతువులు, వికలాంగులు పింఛన్లకు అర్హులని గుర్తించామన్నారు. జిల్లాల్లోని 10 నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించిన సదరం క్యాంపులో మరో 3 వేల మంది వికలాంగులను పింఛన్లకు అర్హులని నిర్ధారించామన్నారు. అర్హులై ఉండి పింఛన్లు రానివారు స్థానిక ఎంపీడీఓ, తహశీల్దార్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తు చేసుకోవడానికి ఎలాంటి కాల పరిమితి విధించలేదన్నారు. అర్హులందరికీ ఈ నెల 10 నుండి 15 లోగా పింఛన్లను అందజేస్తామని మంత్రి స్పష్టం చేశారు. నిరుపేద దళిత, మైనార్టీ కుటుంబాలకు చెందిన ఆడపిల్లల పెళ్లికి ముందే రూ. 51 వేలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోందన్నారు. జిల్లాలో 136 సాంఘిక సంక్షేమ వసతి గ ృహాలు ఉన్నాయని, ఆయా వసతి గ ృహాల్లో అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు నెలకోసారి రాత్రిబస చేసి వసతి గృహాల్లోని సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. వసతి గృహాల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించాలన్న ఉద్దేశంతోనే సన్నరకం బియ్యాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం అం దిస్తోందన్నారు. హాస్టళ్లలో మ రుగుదొడ్లు, తాగునీరు లాం టి మౌలిక వసతులు కల్పిం చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అనంతరం మంత్రి హరీష్రావుతోపాటు ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి, కలెక్టర్ రాహుల్ బొజ్జా, సిద్దిపేట ఆర్డీఓ ముత్యంరెడ్డి, ఆర్టీసీ ఇన్చార్జి ఆర్ఎం రాజు, డిపో మేనేజర్ భానుకిరణ్, తహశీల్దార్ అరుణ, ఎంపీడీఓ ప్రవీణ్ తదితరులు దుబ్బాక డిపో నుంచి నూతనంగా నిర్మించిన ఫంక్షన్ హాల్ వరకు కొత్త బస్సులో ప్రయాణించి ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతు సంక్షేమానికి పెద్దపీట చిన్నకోడూరు: రైతు సంక్షేమానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని మంత్రి హరీష్రావు అన్నారు. ఆదివారం ఆయన చిన్నకోడూరు మండల కేంద్రంలో భూ సమస్యల పరిష్కార పత్రాలు, పట్టాదారు పాస్పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జిల్లాలో ఎక్కడా రెవెన్యూ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రెవెన్యూ సదస్సుల్లో 2,892 సమస్యలు పరిష్కరించినట్లు తెలిపారు. ఈ నెల 15 నుంచి వితంతువులు, వృద్ధులు, వికలాంగులకు పెంచిన పింఛన్లు పంపిణీ చేస్తామన్నారు. చిన్నకోడూరు మండలంలో 5,932 మందికి పింఛన్లు మంజూరైనట్లు తెలిపారు. ఈ నెల నుంచి రేషన్లో బియ్యం కోటా పెంచుతున్నట్లు తెలిపారు. అంతకుముందు మంత్రి హరీష్రావు పెద్దకోడూరులో రూ. 14 లక్షలతో నిర్మించిన అసిస్టెంట్ ఇంజనీర్ కార్యాలయ భవనాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా, ఆర్డీఓ ముత్యంరెడ్డి, తహశీల్దార్ పరమేశ్వర్, ఎంపీడీఓ భిక్షపతి, జెడ్పీటీసీ సభ్యురాలు నమూండ్ల కమల పాల్గొన్నారు. -
కొత్త బస్సుల కొనుగోలుకు రూ.10.41 కోట్లు
సాక్షి, హైదరాబాద్: కొత్త బస్సులు కొనేందుకు ప్రభుత్వం ఆర్టీసీకి రూ.10.41 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వు జారీ చేసింది. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్కు సంబంధించి ఈ మొత్తాన్ని విడుదల చేసినట్టు పేర్కొంది. -
త్వరలో నగరానికి కొత్త బస్సులు
న్యూఢిల్లీ: ఎల్లో బస్సుల (స్టాండర్డ్) స్థానంలో కొత్త బస్సులు రానున్నాయి. ఇందుకు సంబంధించి ఢిల్లీ రవాణా సంస్థ (డీటీసీ) త్వరలో ఇండియన్ ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ (ఐఏఎంసీ)తో ఓ ఒప్పందం కుదుర్చుకోనుంది. ఈ విషయాన్ని డీటీసీ అధికార ప్రతినిధి ఆర్.ఎస్.మిన్హాస్ వెల్లడించారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ‘1,380 సెమీ లో-ఫ్లోర్ బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించాం. ఇందుకు సంబంధించి అంతర్జాతీయ సంస్థలనుంచి టెండర్లను ఆహ్వానించాం. టాటా మోటార్స్ సంస్థ ఇందుకు ఆసక్తి చూపించింది. బిడ్ పత్రాన్ని పుణేలోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్టు (సీఐఆర్టీ) సంస్థకు పంపాం. సాంకేతిక సలహాలు, సూచనలు ఇవ్వాల్సిందిగా ఆ సంస్థను కోరాం’ అని అన్నారు. కాగా 1,380 సెమీఫ్లోర్ శీతలేతర బస్సులు, 345 లో-ఫ్లోర్ శీతల బస్సుల కొనుగోలు కోసం డీటీసీ గతంలో టెండర్లను ఆహ్వానించింది. అయితే ఇందుకు ఏ సంస్థ కూడా ముందుకు రాలేదు. ఎల్లో బస్సుల (స్టాండర్డ్) స్థానంలో ఈ బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. వీటిని ఔటర్ ఢిల్లీతోపాటు గ్రామీణ ప్రాంతాల ప్రయాణికుల అవసరాలను తీర్చేందుకు వీటిని వినియోగించనుంది. గతంలో చేసిన ప్రయత్నాలు విఫలమైనప్పటికీ ఈసారి బస్సులను కొనుగోలు ప్రక్రియ ఆగదని డీటీసీ అధికారులు ధీమాతో ఉన్నారు. ‘సెమీ లోఫ్లోర్ బస్సులు గ్రామీణ ప్రాంతాలతోపాటు ఔటర్ ఢిల్లీవాసులకు ఎంతో ఉపయోగపడతాయని భావిస్తున్నాం. ఈ రెండు ప్రాంతాల్లో రహదారులు సరిగా ఉండవు. సెమీ లో-ఫ్లోర్ బస్సులు నగర ప్రయాణికులతోపాటు గ్రామీణ, ఔటర్ ఢిల్లీవాసుల అవసరాలను తీర్చగలుగుతాయి’అని మిన్హాస్ పేర్కొన్నారు. డీటీసీ అధికారులు అందించిన వివరాల ప్రకారం మొత్తం 600 లోఫ్లోర్ బస్సులను దశలవారీగా సేవలనుంచి తప్పించనున్నారు. మరో 1,275 లోఫ్లోర్ బస్సుల నిర్వహణ కాలపరిమితి ముగిసింది. వాటి స్థానంలో కొత్త సెమీలోఫ్లోర్ బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నారు. వాస్తవానికి డీటీసీకి ప్రస్తుతం 11 వేల బస్సులు అవసరం. డీటీసీ, ఢిల్లీ ఇంటిగ్రే టెడ్ మల్టీమోడల్ ట్రాన్సిట్ సిస్టం (డీఐఎంటీఎస్) సంస్థ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఇరు సంస్థలు నగరవ్యాప్తంగా చెరో 5,500 బస్సులను నడపాల్సి ఉంది. అయితే ప్రస్తుతం దాదాపు 4,937 బస్సులను డీటీసీ నగరవ్యాప్తంగా నడుపుతోంది. ఇక డీఐఎంటీఎస్ వద్ద కేవలం 1,157 బస్సులే ఉన్నాయి. -
రూ.80 కోట్లతో కొత్త బస్సులు
* అధికారులతో సమీక్షలో మంత్రి మహేందర్రెడ్డి * వోల్వో కంపెనీ నుంచి కొంటున్న ఆర్టీసీ సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ను అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రకటించిన నేపథ్యంలో ఆర్టీసీ అప్పుడే ఓ అడుగు ముందుకేసి ఒక్కోటి రూ.కోటి విలువైన అత్యాధునిక బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. వీటిని వోల్వో కంపెనీ నుంచి కొనుగోలు చేయబోతోంది. ఇప్పటి వరకు ఈ తరహా బస్సులు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో మాత్రమే నడుస్తున్నాయి. మన ఆర్టీసీ తొలి విడతగా జేఎన్ఎన్యూఆర్ఎం పథకం కింద రూ.80 కోట్ల వ్యయంతో 80 బస్సులను కొనబోతోంది. ఈ వ్యయంలో కేంద్రం 35 శాతం, ఆర్టీసీ 50 శాతం, రాష్ట్రం 15 శాతం భరించనుంది. గురువారం సాయంత్రం బస్భవన్లో జరిగిన సమీక్ష అనంతరం ఈ విషయాన్ని రవాణా శాఖ మంత్రి మహేందర్రెడ్డి మీడియాకు తెలిపారు. కాగా, బెంగళూరును ఆదర్శంగా తీసుకుని వోల్వో బస్సుల కొనుగోలుకు ముందుకు వస్తున్న సర్కారు తీరుపై విమర్శలు వస్తున్నాయి. అక్కడ వోల్వోలు నష్టాలు కురిపించడంతో ఈ బస్సుల కొనుగోలును నిలిపివేయడం గమనార్హం. రవాణా వసతి లేని 1300 గ్రామాలకు బస్సులు తెలంగాణలో రవాణా వసతి లేని 1300 గ్రామాలకు బస్సులు తిప్పాలని నిర్ణయించినట్టు రవాణా మంత్రి మహేందర్రెడ్డి విలేఖరుల సమావేశంలో చెప్పారు. ఇందుకు ఆయా గ్రామాలకు రోడ్లను నిర్మించనున్నట్టు వెల్లడించారు. తెలంగాణలో కొత్తగా 21 డిపోలను ఏర్పాటు చేస్తామని, ప్రభుత్వ స్థలాలను గుర్తిస్తున్నామని చెప్పారు. ముంబైలో సిటీ బస్సులు నడుపుతున్న తీరును పరిశీలించి ఆ విధానాలను హైదరాబాద్లో ప్రారంభిస్తామన్నారు. -
మళ్లీ కోతపెడితే మెరుపు సమ్మె
కార్మికుల జీతాల్లో కోతతో కొత్త బస్సుల కొనుగోలుపై కార్మికుల భగ్గు మెరుపు సమ్మెకు దిగుతామని హెచ్చరికతో ఆర్టీసీ యాజమాన్యం వెనుకడుగు గత నెలలో ఇలాగే 24 బస్సుల కొనుగోలు హైదరాబాద్: వేతనాల్లో కోతపెట్టి కొత్త బస్సులు కొనాలనే ఆర్టీసీ అధికారుల నిర్ణయంపై కార్మికులు భగ్గుమన్నారు. కార్మిక సంఘాలు మెరుపు సమ్మెకు దిగుతామని హెచ్చరించడంతో ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారు. గత నెలలో ఆర్టీసీ సిబ్బంది ఒకరోజు వేతనాన్ని మినహాయించిన అధికారులు వాటితో 24 కొత్త బస్సులు కొన్నారు. ఒక్క నెల, ఒక్కరోజే కదా అని అప్పట్లో కార్మికులు పెద్దగా నిరసన తెలపలేదు. కానీ, దాన్ని ఏకంగా ఏడాదిపాటు కొనసాగించాలని నిర్ణయించిన ఆర్టీసీ యాజమాన్యం జూన్ నెల వేతనాల్లో కూడా కోత పెట్టేందుకు సిద్ధమైందన్న సంగతి తెలిసి కార్మికులు అగ్గిమీద గుగ్గిలమయ్యారు. నెలవారీ కోత రూ.4.5 కోట్లు...: తీవ్ర నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి కొత్త బస్సులు కొనుగోలు చేయడం భారంగా మారింది. దీంతో సిబ్బంది ‘చేయూత’తో గట్టెక్కేలా ఉన్నతాధికారి ఒకరు యాజమాన్యం ముందుకు ఓ ప్రతిపాదన తీసుకొచ్చారు. ప్రతినెలా సిబ్బంది వేతనాల్లోంచి ఒకరోజు మొత్తాన్ని మినహాయిస్తే రూ.4.5 కోట్లు జమవుతుందని, దీంతో ప్రతినెలా జిల్లాకు (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కలిపి)ఓ బస్సు చొప్పున కొనవచ్చనేది ఆ ప్రతిపాదన. ఇదేదో బాగుందనుకున్న యాజమాన్యం గుర్తింపు పొందిన యూనియన్ నేతలతో భేటీ నిర్వహించి విషయాన్ని వారి దృష్టికి తీసుకువచ్చింది. ఒకరోజు వేతనంతో ఏకంగా 24 బస్సులు కొనే అవకాశం ఉండడంతో దానికి వారు కూడా సరేనన్నారు. దీంతో మే నెలలో ఒకరోజు కోతపెట్టి రూ.4.5 కోట్లతో 24 బస్సులు కొన్నారు. కార్మికుల నుంచి కొంత వ్యతిరేకత వ్యక్తమైనా యూనియన్ నాయకులు సర్దిచెప్పారు. అయితే, జీతంలో కోత నిర్ణయాన్ని ఏడాదిపాటు కొనసాగించాలని నిర్ణయించుకున్న అధికారులు జూన్ నెలలోనూ కట్ చేసేందుకు సిద్ధమైంది. విషయం తెలుసుకున్న కార్మిక సంఘాల నేతలు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మే నెలలోనే కార్మికులను అతికష్టమ్మీద ఒప్పించామని, ఇప్పుడు ఏకంగా 12 నెలల పాటు కోతపెడతామంటే ఊరుకునేది లేదని మండిపడ్డారు. కొత్త బస్సులను ప్రభుత్వ నిధులతోనో, గ్రాంట్లతోనే, కేంద్రం సాయంతోనే కొనాలి తప్ప ఇలా కార్మికుల వేత నాలతో కొనడం సరికాదంటూ మెరుపు సమ్మెకు దిగేందుకు సిద్ధమని హెచ్చరించారు. దీంతో వెనక్కు తగ్గిన అధికారులు జీతంలో కోత పెట్టడం లేదంటూ ప్రకటించారు. -
నెక్కి 26 కొత్త బస్సులు
విజయనగరం అర్బన్, న్యూస్లైన్: కాలం చెల్లిన బస్సుల స్థానంలో ఆర్టీసీ కొత్త బస్సులను ఏర్పాటు చేస్తోంది. నార్త్ ఈస్ట్కోస్టు రీజియన్ పరిధిలో ఏడాది క్రితం 28 బస్సుల కోసం ప్రతిపాదనలు పంపగా 26 బస్సులు మంజూరయ్యాయి. లగ్జరీ సర్వీసుల స్థానాల్లో వీటిని నడుపుతారు. ఇంతవరకూ సంస్థకు బస్సుల అందించే కంపెనీల నుంచి కాకుండా కొత్త కంపెనీలకు చెందిన బస్సులు పంపారు. ప్రయాణికులకు మరింత సౌకర్యంగా ఉండే విధంగా సీట్ల మధ్య దూరం, విశాలమైన విండోలతో నూతన బస్సులు రూపొందించారు. ఈ బస్సులను విజయనగరం డిపోకు-6, పలాస-6, శ్రీకాకుళం-14 సర్దుబాటు చేసినట్లు నెక్ ఆర్ఎం అప్పన్న తెలిపారు. మరో రెండు బస్సులు ఇంకా రావాల్సి ఉందని, వాటిని విజయనగరం డిపోకి పంపుతామని తెలిపారు. విజయనగరం డిపోకి మంజూరుచేసిన ఆరు బస్సులను విశాఖ-విజయనగరం-విశాఖ నాన్స్టాప్ సర్వీసులకు కేటాయించారు.