Omkar
-
నామినేషన్స్ తో హీటెక్కిన డాన్స్ ఐకాన్ సీజన్ 2
ఓంకార్ హోస్ట్ గా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సెన్సేషనల్ డ్యాన్స్ షో డ్యాన్ ఐకాన్ సీజన్ 2 వైల్డ్ ఫైర్ పేరుకు తగినట్లే రోజు రోజుకూ హీటెక్కుతోంది. సెకండ్ ఎపిసోడ్ నామినేషన్స్ తో కార్యక్రమం మరింత ఉత్కంఠగా మారింది. టాప్ ప్లేస్ కోసం ఎవరు పోటీ పడతారు అనేది ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. గాలి, నీరు, ఆకాశం, అగ్ని, భూమి పేర్లతో పంచభూతాల్లాంటి ఐదుగురు కంటెస్టెంట్స్ విపుల్ కాండ్పాల్, సాధ్వి మజుందార్, బినితా చెట్రీ, షోనాలి మరియు బర్కత్ అరోరా తమ పర్ ఫార్మెన్స్ లు ఆకట్టుకుంటుండగా..వీరికి ఐదుగురు మెంటార్స్ గా మానస్, దీపిక, జాను లైరి, ప్రకృతి, యష్ మాస్టర్ వ్యవహరిస్తున్నారు. డాన్స్ ఐకాన్ సీజన్ 2 వైల్డ్ ఫైర్ సెకండ్ ఎపిసోడ్ నామినేషన్స్ ఉత్కంఠ కలిగిస్తూ సాగాయి. టీమ్ ఎర్త్ మెంటార్ ప్రకృతి కంబం.. మానస్ నాగులపల్లి టీమ్ 'ఫైర్' ని నామినేట్ చేసింది. రివేంజ్ గా ప్రకృతి మెంటార్ గా ఉన్న ఎర్త్ ని మానస్ నామినేట్ చేయడం హీట్ పెంచింది. యష్ మాస్టర్, దీపికా జానులైరి 'వాటర్' ను నామినేట్ చేయగా, ప్రతీకారంగా జనులైరి, దీపిక 'ఎయిర్' ను నామినేట్ చేసింది. యశ్ మాస్టర్ 'స్కై' మాత్రం నామినేషన్స్ నుంచి బయటపడింది. ఈ నామినేషన్స్ ప్రక్రియ రాబోయే రోజుల్లో డాన్స్ ఐకాన్ సీజన్ 2 వైల్డ్ ఫైర్ మరింత సస్పెన్స్ గా ఉండబోతున్నట్లు హింట్ ఇస్తోంది. -
డ్యాన్స్ ఐకాన్ 2 సరికొత్తగా ఉంటుంది: ఓంకార్
‘‘నేను గతంలో ‘ఆట, ఆట జూనియర్స్’ వంటి డ్యాన్స్ షోస్కి హోస్ట్ చేశాను. కానీ ‘డ్యాన్స్ ఐకాన్ 2– వైల్డ్ ఫైర్’(Dance Ikon 2 Wild Fire) మాత్రం ఇప్పటిదాకా వచ్చిన డ్యాన్స్ షోస్ అన్నింటిలో సరికొత్తగా ఉంటుంది. ప్రేక్షకులకు ఒక రియల్ ఫీల్ ఇవ్వాలనే స్క్రిప్టెడ్గా చేయకుండా రియాల్టీ షో చేస్తున్నాం’’ అని హోస్ట్ ఓంకార్(Omkar) చెప్పారు. ‘డ్యాన్స్ ఐకాన్’ సీజన్ 1కు కొనసాగింపుగా ‘డ్యాన్స్ ఐకాన్ సీజన్ 2– వైల్డ్ ఫైర్’ నేటి నుంచి ఆహా ఓటీటీలో ప్రీమియర్కు రెడీ అవుతోంది. ఈ షోకి ఓంకార్, హీరోయిన్ ఫరియా అబ్దుల్లా, శేఖర్ మాస్టర్ హోస్ట్లుగా వ్యవహరిస్తున్నారు. సాధారణంగా సినిమాలకు ప్రివ్యూ, ప్రీమియర్స్ వేస్తుంటారు. కానీ మీడియా కోసం తొలిసారి ఒక డ్యాన్స్ రియాల్టీ షోకు సీక్రెట్ స్క్రీనింగ్ చేసింది ఆహా ఓటీటీ. సీక్రెట్ స్క్రీనింగ్ అనంతరం నిర్వహించిన ప్రెస్ మీట్లో ఓంకార్ మాట్లాడుతూ– ‘‘సాధారణంగా తెలుగు నుంచి కంటెస్టెంట్స్ను సెలెక్ట్ చేస్తుంటాం. కానీ, ఈసారి దేశవ్యాప్తంగా కంటెస్టెంట్స్ని ఆడిషన్ చేసి ఐదుమందిని తీసుకున్నాం. వారికి పోటీ ఇచ్చే సత్తా ఉన్న తెలుగు కంటెస్టెంట్స్ను ఇప్పుడు సెలెక్ట్ చేయబోతున్నాం. ‘డ్యాన్స్ ఐకాన్ 1’ విన్నర్ మన తెలుగువాళ్లే. మరింత కష్టమైన పోటీలో మనవాళ్లు ప్రతిభ చూపించాలనే ఇలా చేస్తున్నాం. ఆసక్తి ఉన్న వారు 60 సెకన్ల డ్యాన్స్ వీడియో చేసి మాకు పంపిస్తే.. అది చూసి ఎంట్రీలను తీసుకుంటాం. ప్రతి శుక్రవారం 7 గంటలకు షో స్టార్ట్ అవుతుంది. షో పూర్తయ్యాక ప్రేక్షకుల నుంచి పోల్ నిర్వహిస్తాం. 100 పాయింట్స్లోపు ప్రేక్షకులు తమకు నచ్చినన్ని పాయింట్స్ ఇవ్వొచ్చు. ఆదివారం వరకు ఈ ఓటింగ్ కొనసాగుతుంది. ప్రతి వారం ఒక్కొక్కరు ఎలిమినేట్ అవుతుంటారు. కంటెస్టెంట్స్తో పాటు మెంటార్స్ కూడా ఎలిమినేట్ అవుతారు. అలాగే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయి. మూడు నెలల పాటు ‘డ్యాన్స్ ఐకాన్ 2 – వైల్డ్ ఫైర్’ని ప్రేక్షకులు ఎంజాయ్ చేయబోతున్నారు’’ అని చెప్పారు. ఈ ప్రెస్మీట్లో మెంటార్స్ మానస్, యశ్ మాస్టర్, ప్రకృతి మాట్లాడారు. -
అదిరిపోయే ట్విస్టులతో ఆకట్టుకుంటుంది: ఫరియా అబ్దుల్లా
డ్యాన్స్ లవర్స్ను మెప్పించిన ‘డ్యాన్స్ ఐకాన్ సీజన్ 1’(Dance Ikon) కు కొనసాగింపుగా ‘డ్యాన్స్ ఐకాన్ సీజన్ 2(Dance Ikon 2) వైల్డ్ఫైర్’ రానుంది. ఫిబ్రవరి 14 నుంచి ఈ షో ఆహా ఓటీటీలో ప్రీమియర్కు రెడీ అవుతోంది. ఈ షోకు ఓంకార్(Ohmkar), హీరోయిన్ ఫరియా అబ్దుల్లా, శేఖర్ మాస్టర్ హోస్ట్లుగా వ్యవహరించనున్నారు. ‘డ్యాన్స్ ఐకాన్ 2 వైల్డ్ఫైర్’ షోలో దేశవ్యాప్తంగా కంటెస్టెంట్స్ పాల్గొంటారని, హిప్ హాప్, క్లాసికల్, కాంటెంపరరీ స్టైల్స్తో ఈ డ్యాన్స్ షో వీక్షకులను అలరిస్తుందని నిర్వాహకులు పేర్కొన్నారు.ఈ సందర్భంగా హైదరాబాద్లో జరిగిన ‘డ్యాన్స్ ఐకాన్ 2’ షో ప్రెస్మీట్లో హోస్ట్స్లో ఒకరైన ఓంకార్ మాట్లాడుతూ– ‘‘డ్యాన్స్ ఐకాన్ 2–వైల్డ్ఫైర్’లో ఐదుగురు కంటెస్టెంట్స్ సర్ప్రైజ్ చేస్తారు. ముఖ్యంగా ఇద్దరు పిల్లల పెర్ఫార్మెన్స్లు చర్చనీయాంశమవుతాయి. ముగ్గురు హోస్ట్లతో పాటు సింగర్ జాను లైరి, ప్రకృతి, మానస్, దీపిక ఈ నలుగురు మెంటార్స్ ఉంటారు. ‘డ్యాన్స్ ఐకాన్ 2: వైల్డ్ ఫైర్’ వీక్షకులకు హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే కంప్లీట్ డ్యాన్స్ షో’’ అని అన్నారు.ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ–‘‘డ్యాన్స్ ఐకాన్ సీజన్ 1’కు కూడా నన్ను హోస్ట్గా అడిగారు. కానీ, ఆ సమయంలో చేయలేకపోయాను. ఇప్పుడు ఓంకార్, శేఖర్ మాస్టర్లతో కలిసి హోస్ట్ చేస్తుండటం సంతోషంగా ఉంది. ప్రతి ఎపిసోడ్ అదిరిపోయే ట్విస్టులతో ఆకట్టుకుంటుంది. ఈ షో వీక్షకులకు కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుందని గ్యారంటీగా చెప్పగలను’’ అని తెలిపారు. ‘‘ఈ షోలో వీక్షకులను సర్ప్రైజ్ చేసే డ్యాన్స్ పెర్ఫార్మెన్స్లు ఉంటాయి’’ అని చె΄్పారు శేఖర్ మాస్టర్. ఈ కార్యక్రమంలో మెంటార్ యశ్, మెంటార్ మానస్, సింగర్ జాను లైరి, మెంటార్ ప్రకృతి మాట్లాడారు. -
ఇస్మార్ట్ జోడీ 3కి రంగం సిద్ధం: ఎవరెవరు పాల్గొంటున్నారంటే?
ప్రేమ అంటే ఓ మ్యాజిక్. ఆ మ్యాజిక్తో స్టార్ మా "ఇస్మార్ట్ జోడి సీజన్ 3"ని ప్రారంభిస్తోంది. గత రెండు సీజన్లు విజయవంతంగా ముగించుకుని ఇప్పుడు మూడో సీజన్తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. యాంకర్ ఓంకార్ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్న ఈ షోలో సెలబ్రిటీ జంటల మధ్య అనుబంధానికి, అన్యోన్యతకు, అనురాగానికి కావాల్సినంత వినోదాన్ని జోడించనున్నారు.ఈ షోలో ప్రదీప్- సరస్వతి, అనిల్ జీలా- ఆమని, అలీ రెజా- మసుమా, రాకేష్- సుజాత, వరుణ్- సౌజన్య, యష్- సోనియా, మంజునాథ- లాస్య, ఆదిరెడ్డి- కవిత, అమర్ దీప్- తేజు జంటలు పాల్గొంటున్నారు. కొత్తగా పెళ్లి చేసుకున్నవారు, కొంత జీవితం చూసినవారు, సలహాలు సూచనలు ఇచ్చే స్థాయి అందుకున్నవారు అంద ఉన్నారు.ఈ షో వినోదంతో అలరించడమే కాదు, ఆలోచింపచేస్తుంది. జంటలు మరింత ప్రేమగా ఉండేందుకు పరోక్షంగా సలహాలిస్తుంది. బంధం బలంగా ఉండడానికి ఏం చేయాలో సూచనలిస్తుంది. స్టార్ మా లో ఈ శనివారం(డిసెంబర్ 21) రాత్రి 9 గంటలకు ఇస్మార్ట్ జోడి సీజన్ 3 ప్రారంభం కానుంది. ప్రతి శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు ప్రసారం కానుంది. -
మీ ఇంటిబిడ్డగా అడుగుతున్నా, గెలిపించండి: నిఖిల్
చివరి ఓటు అప్పీల్ ఛాన్స్ పొందేందుకు గౌతమ్, నిఖిల్ హోరాహోరీగా ఆడారు. అటు ఓంకార్ హౌస్లోకి వచ్చి తన ఇస్మార్ట్ జోడీకోసం ఓ జంటను బుక్ చేసుకుని వెళ్లాడు. మరి మౌస్లో ఇంకా ఏమేం జరిగాయో నేటి (డిసెంబర్ 6) ఎపిసోడ్ హైలైట్స్లో చదివేయండి..రంగు పడుద్దిగత వీకెండ్లో గోల్డెన్ టికెట్ పొందిన నిఖిల్, రోహిణి, గౌతమ్కు ఓట్ అప్పీల్ గేమ్లో పాల్గొనేందుకు చివరి ఛాన్స్ ఇచ్చాడు. ముందుగా కేక్ గేమ్ పెట్టాడు. కేక్పై ఉన్న ఎనిమిది నెంబర్ కిందపడకుండా కేక్ కట్ చేయాలన్నాడు. ఈ ఆటలో రోహిణి ఓడిపోయింది. నిఖిల్, గౌతమ్కు రంగుపడుద్ది అనే ఛాలెంజ్ ఇచ్చాడు. ప్రత్యర్థి టీ షర్ట్పై ఎవరు ఎక్కువ రంగు పూస్తే వారే విజేతగా నిలుస్తారు. ఈ గేమ్లో కొట్టుకుంటూ తోసుకుంటూ, లాగుతూ, ఈడడ్చుకెళ్తూ భీకరంగా ఆడారు.కొట్టుకున్న గౌతమ్, నిఖిల్మొదటి రౌండ్లో గౌతమ్ గెలిచాడు. రెండో రౌండ్ అయిపోయేసరికి గౌతమ్ కొడుతున్నాడని నిఖిల్ ఆరోపించాడు. నేను కావాలని కొట్టలేదు, నీకు తగిలిందనగానే సారీ చెప్పాను. మరి నువ్వు నన్ను లాక్కెళ్లలేదా? అని ప్రశ్నించాడు. పక్కకెళ్లి కూసోబే అని నిఖిల్ అనడంతో గౌతమ్.. బే అని ఎవడ్ని అంటున్నావ్? ఎక్కువ తక్కువ మాట్లాడకు అని మండిపడ్డాడు. ఆడే విధానం తెలియదు, ముఖం మీద కొట్టావ్.. అని నిఖిల్ రెచ్చిపోయి మాట్లాడుతూనే ఉన్నాడు. నలిగిపోయిన ప్రేరణవీళ్లిద్దరికీ సర్ది చెప్పలేక సంచాలకురాలు ప్రేరణ మధ్యలో నలిగిపోయింది. మొన్న నేను నోరు జారినప్పుడు హౌస్ అందరూ నన్ను తప్పని వేలెత్తి చూపారు.. మరి ఇప్పుడు నిఖిల్ నోరు జారితే ఎవరూ ఎందుకు స్పందించట్లేదని గౌతమ్ హౌస్మేట్స్ను ప్రశ్నించాడు. అందుకు వాళ్లు.. అమ్మాయిని వాడుకుంటున్నావ్? అనడం చాలా పెద్ద తప్పు కాబట్టే ఆరోజు మాట్లాడాల్సి వచ్చిందన్నారు. ఇకపోతే రెండు, మూడవ రౌండ్స్లో నిఖిల్ గెలిచాడు. ఎక్కువ రౌండ్లు నిఖిల్ గెలవడంతో ప్రేక్షకులను ఓట్లు అడిగే చాన్స్ పొందాడు.ఎప్పటికీ రుణపడి ఉంటానిఖిల్ మాట్లాడుతూ.. ఇన్నివారాలు నన్ను సేవ్ చేసినందుకు థాంక్యూ.. నేనెంతో కష్టపడ్డా.. మీరూ అంతే ఇష్టపడి నన్ను సేవ్ చేశారు. నేను విజేత అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందుకోసం ఇంకా ఎంతైనా కష్టపడతాను. ఈ ఒక్కసారి మీ నిఖిల్ను గెలిపించండి. ఇప్పటికీ, ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను. తెలిసో తెలియక తప్పులు చేశాను. అందుకు నన్ను క్షమించండి. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ నిఖిల్ ఒకేలా ఉంటాడు. ఓటు వేయండిమీ ప్రేమాభిమానాలు కూడా ఎప్పటికీ ఇలాగే ఉంటాయని నా గట్టి నమ్మకం. ఈ షో గెలవాలంటే మీ ఓట్లు కావాలి. తెలుగు రాష్ట్రాల ప్రజలు నన్ను మీ ఇంటిబిడ్డగా భావించి ఓటు వేయమని కోరుతున్నాను అని అభ్యర్థించాడు. తర్వాత యాంకర్ ఓంకార్ హౌస్లో ఎంట్రీ ఇచ్చాడు. ఇస్మార్ట్ జోడీ మూడో సీజన్ రాబోతుందంటూ గ్లింప్స్ రిలీజ్ చేశారు. తర్వాత అతడు కంటెస్టెంట్లతో చిన్న గేమ్ ఆడించాడు. నీ పార్ట్నర్ కోసం నీలో ఏ లక్షణాన్ని దూరం చేస్తావని అడగ్గా నిఖిల్ తన చిరాకును వదిలేస్తానన్నాడు. బిగ్బాస్ ఇస్మార్ట్ జోడీతర్వాత అందర్నీ జంటలుగా విడగొట్టి డ్యాన్సులు చేయించాడు. అయితే వీళ్లందరూ పేపర్ పైన స్టెప్పులేయాల్సి ఉంటుంది. ప్రతి రౌండ్కు ఆ పేపర్ సైజ్ను తగ్గిస్తూ ఉంటారు. పేపర్ దాటి అడుగు బయట పెట్టిన జంట అవుట్.. అలా మొదటి రౌండ్లో గౌతమ్-రోహిణి అవుట్ కాగా తర్వాత నిఖిల్- విష్ణు ఎలిమినేట్ అయ్యారు. ప్రేరణ నబీల్ను ఎత్తుకుని మరీ డ్యాన్స్ చేసి గెలిచేసింది. పెళ్లి వీడియో చూసుకుని మురిసిపోయిన ప్రేరణనబీల్ తనకు తందూరి చికెన్ బర్గర్+ సాఫ్ట్ డ్రింక్ కావాలని కోరగా.. ప్రేరణ.. తన పెళ్లి వీడియో అందరికీ చూపించాలని ఉందంది. నబీల్ను ఒప్పించి ప్రేరణ తన పెళ్లి వీడియో వచ్చేలా చేసింది. తన పెళ్లి క్షణాలను చూసుకుని ఆమె భావోద్వేగానికి లోనైంది. ఇంతలో ఓంకార్ ట్విస్ట్ ఇచ్చాడు. నీ కోరిక తీర్చినందుకుగాను నువ్వు, నీ భర్తతో ఇస్మార్ట్ జోడీలో తప్పకుండా పాల్గొనాలంటూ మాట తీసుకున్నాడు. అందుకామె సంతోషంగా ఒప్పుకుంది.మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
వైవిధ్యమైన కథ
‘రాజుగారి గది, హిడింబ’ చిత్రాల ఫేమ్ అశ్విన్ బాబు హీరోగా, దిగంగనా సూర్యవన్షీ హీరోయిన్గా సోమవారం కొత్త సినిమాప్రారంభమైంది. మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మిస్తున్న ఈ సినిమా తొలి సన్నివేశానికి దర్శకుడు సుబ్బు మంగాదేవి కెమెరా స్విచ్చాన్ చేయగా, డైరెక్టర్ విజయ్ కనకమేడల క్లాప్ ఇచ్చారు. దర్శకుడు వశిష్ఠ గౌరవ దర్శకత్వం వహించగా, దర్శక–నిర్మాత ఓంకార్ యూనిట్కి స్క్రిప్ట్ అందించారు. నిర్మాతలు సుధాకర్ రెడ్డి, ‘ఠాగూర్’ మధు, శిరీష్ రెడ్డి, ఎర్రబెల్లి విజయ్ కుమార్ రావు జ్యోతి ప్రజ్వలన చేశారు. ‘‘వైవిధ్యమైన కథ, సరికొత్త కథనాలతో రూపొందుతున్న న్యూ ఏజ్ సినిమా ఇది’’ అన్నారు మేకర్స్. ఈ చిత్రానికి సంగీతం: వికాస్ బడిస, కెమెరా: దాశరధి శివేంద్ర. -
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నటి వరలక్ష్మి శరత్కుమార్ ప్రధాన పాత్రలో నటించిన హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ మాన్షన్ 24. అవికా గోర్, సత్యరాజ్, బిందు మాధవి, రాజీవ్ కనకాల, రావు రమేశ్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ప్రముఖ యాంకర్ కమ్ డైరెక్టర్ ఓంకార్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ట్రైలర్ను బుధవారం రిలీజ్ చేశారు. 'జాతీయ సంపదను దోచుకున్న కాళిదాసు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు' అన్న హెడ్లైన్తో ట్రైలర్ మొదలైంది. అయితే తాను దేశద్రోహి కూతుర్ని కాదని, నిజాయితీపరుడైన కాళిదాసు కూతుర్ని, దాన్ని నిరూపిస్తానంటూ సీన్లోకి ఎంటరైంది వరలక్ష్మి శరత్కుమార్. కనిపించకుండా పోయిన తండ్రి కోసం, అతడి మీద వేసిన దేశద్రోహి అనే నిందను తొలగించేందుకు తనే స్వయంగా రంగంలోకి దిగుతుంది. తండ్రి కోసం వెతుకులాట మొదలుపెడుతుంది. ఈ క్రమంలో అతడి తండ్రి చివరిసారిగా ఓ కోటకు వెళ్లినట్లు తెలుసుకుంటుంది. అక్కడికి వెళ్లినవారెవరూ తిరిగి రాలేదని అందరూ చెప్తూ ఉంటారు. అయినా సరే, తన తండ్రి ఏమయ్యాడో తెలుసుకోవాలని పాడుబడ్డ మాన్షన్లోకి అడుగుపెడుతుంది. అక్కడ వరలక్ష్మికి ఎదురైన పరిణామాలేంటి? తన తండ్రి నిజాయితీపరుడా? దేశద్రోహా? వరలక్ష్మి అక్కడి నుంచి తిరిగి ప్రాణాలతో బయటపడిందా? వంటి విషయాలు తెలియాలంటే ఓటీటీలో చూడాల్సిందే! ఈ వెబ్ సిరీస్ అక్టోబర్ 17 నుంచి హాట్స్టార్లో ప్రసారం కానుంది. చదవండి: సీక్రెట్గా బిగ్బాస్ బ్యూటీ ఎంగేజ్మెంట్? ఎవరా మిస్టరీ మ్యాన్? -
అమెరికాలో ప్రధాని మోదీతో జగిత్యాలవాసి.. ఆయన ఎవరంటే?
జగిత్యాల జోన్: ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో అక్కడే స్థిరపడ్డ జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన ప్రవాస భారతీయుడు నలమాసు ఓంకార్ కూడా పాల్గొన్నారు. పారిశ్రామికవేత్తలతో ఇప్పటివరకు జరిగిన సమావేశాల్లో సాంకేతిక అంశాలపై ప్రధానితో ఆయన చర్చించారు. అయితే, హైదరాబాద్లోని హెచ్సీయూ నుంచి రసాయన శాస్త్రంలో పీజీ, బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి ఎంఫిల్ చేసిన ఓంకార్ సుమారు 30 ఏళ్ల కిత్రం అమెరికాకు వలస వెళ్లారు. ప్రస్తుతం ఆయన శానిఫ్రాన్సిస్కోలోని గ్లోబల్ చిప్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. ఇది కూడా చదవండి: తెలంగాణలో ఎనిమిది జిల్లాలకు భారీ వర్ష సూచన -
'ఇప్పటి వరకు అన్నీ నువ్వే'.. ఏడ్చేసిన హీరో అశ్విన్!
-
'నిన్ను ఇంకా ఇబ్బంది పెడుతున్నా'.. హీరో అశ్విన్ కన్నీటి పర్యంతం!
టాలీవుడ్లో యంగ్ హీరో అశ్విన్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజు గారి గది సిరీస్తో అభిమానులను మెప్పించారు. ప్రముఖ యాంకర్, డైరెక్టర్ ఓంకార్ తమ్ముడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. జీనియస్ అనే సినిమా ద్వారా టాలీవుడ్కు పరిచయమయ్యారు. నాన్న, నేను, నా బాయ్ ఫ్రెండ్స్ సినిమాలో మెప్పించారు ఆయన నటించిన రాజుగారి గది సిరీస్ సూపర్ హిట్గా నిలిచింది. రాజు గారి గది సిరీస్ చిత్రాలకు అతడి అన్నయ్యే దర్శకుడు కావడం విశేషం. (ఇది చదవండి: హీరోయిన్లందరినీ ట్రై చేశా.. జేడీ చక్రవర్తి బోల్డ్ కామెంట్స్) హిడింబ చిత్రం మరోసారి అభిమానులను పలకరించనున్నారు. అయితే తాజాగా ఈ చిత్ర బృందం ఓంకార్ యాంకర్గా హోస్ట్ చేస్తున్న సిక్త్ సెన్స్ ప్రోగ్రామ్లో పాల్గొన్నారు. అశ్విన్తో పాటు హీరోయిన్ నందితా శ్వేత, విద్యుల్లేఖా రామన్ కూడా వచ్చారు. తాజాగా ఈ షోకు సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. అయితే ఈ షోలో పాల్గొన్న తమ్ముడిని చూసి ఓంకార్ ఆనందం వ్యక్తం చేశారు. తొలిసారి తమ్ముడితో సిక్త్ సెన్స్ షో ఆడుతున్నానని భావోద్వేగానికి గురయ్యారు. ఈ షోలో పాల్గొన్న వారిని ప్రశ్నించిన ఓంకార్.. తన తమ్ముడికి కూడా ఓ ప్రశ్న వేశాడు. నీ జీవితంలో ఎప్పుడైనా బాధపడిన సందర్భం ఉందా అని అడిగాడు. (ఇది చదవండి: ఆశిష్ విద్యార్థి రెండో పెళ్లి.. దీని వెనుక ఇంత కథ ఉందా..!) ఈ ప్రశ్నకు అశ్విన్ ఫుల్ ఎమోషనల్ అయ్యారు. 'ఇప్పటివరకు నాకు అన్నీ నువ్వే. నేను ఇంకా ఇబ్బంది పెడుతూనే ఉన్నా అన్నయ్యా. నిన్ను అడగాలంటే కన్నీళ్లు ఆగడం లేదంటూ' కన్నీటి పర్యంతమయ్యాడు. తమ్ముడిని చూసిన అన్నయ్య కూడా ఫుల్ ఎమోషనల్గా కనిపించారు. వీరు మొత్తం ముగ్గురు అన్నదమ్ముులు కాగా.. చిన్నతమ్ముడు నిర్మాణరంగంలో రాణిస్తున్నారు. తన తమ్ముళ్ల కోసం ఓంకార్ ఎంత ఈ ప్రోమో చూస్తే అర్థమవుతోంది. -
హీరోయిన్లందరినీ ట్రై చేశా.. జేడీ చక్రవర్తి బోల్డ్ కామెంట్స్
ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోగా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు జేడీ చక్రవర్తి. మనీ మనీ , గులాబీ , బొంబాయి ప్రియుడు వంటి ఎన్నో సినిమాలతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు. హీరోగా, విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మెప్పించిన జేడీ చక్రవర్తి ప్రస్తుతం హాట్ స్టార్లో ఓ ఒరిజినల్లో నటిస్తున్నారు. ఇందులో ఈషా రెబ్బా హీరోయిన్గా నటిస్తుంది. త్వరలోనే ఈ మూవీ విడుదల కానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్లో భాగంగా ఓంకార్ హోస్ట్గా చేస్తున్న ఓ షోకు జేడీ, ఈషా రెబ్బా హాజరై సందడి చేశారు. చదవండి: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హీరో ధనుష్.. షాకింగ్ లుక్ ఈ సందర్భంగా మీ కెరీర్లో ఏ హీరోయిన్ని అయినా ఇంప్రెస్ చేయడానికి ట్రై చేశారా అని ఓంకార్ ప్రశ్నించగా జేడీ చక్రవర్తి అంతే బోల్డ్గా సమాధానం ఇచ్చారు. మా నాన్న మీద ఒట్టు అందరు హీరోయిన్లని ట్రై చేశా అంటూ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్గా మారింది. -
గోవిందరాజస్వామి ఆలయం మహా సంప్రోక్షణ ఆపండి
సాక్షి, అమరావతి : తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి దేవస్థానం గర్భగుడి విమాన గోపురంపై బంగారు పూతతో కూడిన రాగి రేకులను ఏర్పాటు చేసే విషయంలో అక్రమాలు జరిగాయని, వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు అడ్వొకేట్ కమిషన్ను నియమించాలని కోరుతూ హైకోర్టులో గురువారం లంచ్మోషన్ రూపంలో అత్యవసర పిటిషన్ దాఖలైంది. గోవిందరాజ స్వామి దేవస్థానంలో ఈ నెల 21న తలపెట్టిన మహా సంప్రోక్షణ వాయిదా వేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ తిరుపతికి చెందిన తుమ్మా ఓంకార్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ బీఎస్ భానుమతి విచారణ జరిపారు. ఇదే వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే రెండు వ్యాజ్యాలు దాఖలయ్యాయని, వాటిపై కోర్టు ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేదని టీటీడీ తరఫు సీనియర్ న్యాయవాది ఎస్.సత్యనారాయణ ప్రసాద్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ వ్యాజ్యాల్లో కౌంటర్లు కూడా దాఖలు చేశామన్నారు. పూర్తి వివరాలు సమర్పించేందుకు విచారణను వాయిదా వేయాలని కోరారు. ఇందుకు న్యాయమూర్తి అంగీకరిస్తూ తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. టీటీడీ కౌంటర్తో పాటు ఇతర అంశాలనూ పరిశీలిస్తామని న్యాయమూర్తి తెలిపారు. అంతకు ముందు పిటిషనర్ తరఫు న్యాయవాది జేవీ ఫణిదత్ వాదనలు వినిపిస్తూ.. ఆగమ శాస్త్ర నిబంధనలకు విరుద్ధంగా విమాన గోపురానికి బంగారుపూత పూసిన రాగి రేకులు అమర్చడం వల్ల గోపురం దెబ్బతింటుందని చెప్పారు. ఇందులో అక్రమాలు జరిగాయని, రాగి రేకులకు బంగారు పూతకు బదులు బంగారు రంగు వేస్తున్నారని, వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు అడ్వొకేట్ కమిషన్ను నియమించాలని కోరారు. మహా సంప్రోక్షణ పూర్తయితే గర్భగుడిని ఎక్కి విమాన గోపురాన్ని పరిశీలించే అవకాశం ఉండదన్నారు. అందువల్ల మహా సంప్రోక్షణను నిలిపివేయాలని కోరారు. -
ముంబై జట్టు హెడ్ కోచ్గా ఓంకార్ సాల్వి
2023-24 దేశీయ సీజన్కు గాను తమ జట్టు ప్రధాన కోచ్గా ఓంకార్ సాల్విని ముంబై క్రికెట్ అసోసియేషన్ నియమించింది. ఓంకార్ సాల్వి ప్రస్తుతం ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ కోచింగ్ స్టాప్లో భాగంగా ఉన్నాడు. ఈ క్యాష్రిచ్ లీగ్ ముగిసిన వెంటనే ఓంకార్ ముంబై పురుషుల జట్టుతో చేరనున్నాడు. కాగా గతంలో ముంబై బౌలింగ్ కోచ్గా కూడా ఓంకార్ సాల్వి పనిచేశాడు. కానీ ఈ సారి మాత్రం ఆ జట్టు మాజీ హెడ్కోచ్ అమోల్ ముజుందార్ స్థానాన్ని భర్తీ చేయనున్నాడు. అదే విధంగా ముంబై బ్యాటింగ్ కోచ్గా ఆజట్టు మాజీ ఆటగాడు వినిత్ ఇందుల్కర్ నియమితులు కాగా, మాజీ వికెట్ కీపర్-బ్యాటర్ ఓంకార్ గురవ్ జట్టుకు ఫీల్డింగ్ కోచ్గా సేవలందించనున్నాడు. ముంబై తరపున 16 ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడిన ఓంకార్ గురవ్.. 434 పరుగులు చేశాడు. ఓంకార్ కంటే వినిత్ ఇందుల్కర్కు ఎక్కువ దేశీవాళీ క్రికెట్ ఆడిన అనుభవం ఉంది. ఇందుల్కర్ ముంబై తరపున 43 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు, 32 లిస్ట్-ఏ మ్యాచ్లు ఆడాడు. చదవండి: WTC FINAL 2023: కిషన్ కంటే అతడు చాలా బెటర్.. ఎందుకు సెలక్ట్ చేశారో అర్ధం కావడం లేదు! -
యాంకర్ ఓంకార్, కొరియోగ్రాఫర్ యష్ మాస్టర్ తో " స్పెషల్ చిట్ చాట్ "
-
Maddikayala Omkar: సామాజిక న్యాయ యోధుడు
వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు, మాజీ శాసన సభ్యులు, ఎంసీపీఐ (యూ) వ్యవస్థాపకులు, కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ ప్రజా ఉద్యమాల చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు. 1924లో ఉమ్మడి నల్లగొండ జిల్లా ఆత్మకూర్ మండలం, ఏపూర్లో మద్దికాయల రామయ్య, అనంతలక్ష్మి దంపతులకు ఆయన జన్మించారు. 16 ఏళ్ల వయస్సులోనే నిజాం నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడిన ‘ఆంధ్ర మహా సభ’లో వలంటీర్గా చేరి... ఆ తరువాత భూమి, భుక్తి, వెట్టిచాకిరీ విముక్తికై సాగిన మహత్తర వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో క్రియాశీల పాత్ర పోషించారు. నిజాం సైన్యాలపై, యూనియన్ సైన్యాలపై ఆయన తుపాకీ చేతపట్టి అలుపెరుగని పోరాటం చేశారు. ఆ నాటి నిజాం పాలన ఓంకార్ తలకు వెలకట్టింది. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలో పలు బాధ్యతలు చేపట్టి, 1964లో ఏర్పడ్డ మార్క్సిస్ట్ పార్టీలో ముఖ్య నాయకునిగా పేరుగాంచారు. 1972 నుండి 1994 వరకు వరంగల్ జిల్లా నర్సంపేట ప్రజలు ఐదుసార్లు అత్యధిక మెజార్టీతో గెలిపించి శాసన సభ్యునిగా చట్టసభకు పంపినారు. ప్రజలు ‘అసెంబ్లీ టైగర్’గా ఆయన్ని అభివర్ణించారు. నక్సలైట్లు, భూస్వాములు ఆయనపై అనేకసార్లు హత్యా ప్రయత్నం చేయగా ప్రాణాపాయం నుండి బయట పడిన ఓంకార్ను అన్ని వర్గాల ప్రజలు ‘మృత్యుం జయుడు’గా పిలిచారు. 1964 మార్క్సిస్ట్ కార్యక్రమాన్ని నిబద్ధతతో నడపడానికి 1984లో ఎమ్సీపీఐ (యూ)ను ఏర్పాటు చేసి దేశమంతా విస్తరణకు పూనుకున్నారు. వర్గ వ్యవస్థలో భాగం గానే భారతదేశంలో కుల వ్యవస్థ ఉందని ఆయన భావించారు. అగ్రవర్ణ ఆధిపత్యంలో వివక్షకులోనై ఉన్న అణగారిన ప్రజలను సాంఘిక వ్యత్యాసాల నుండి బయట పడేయడానికి ఆర్థికంగా, రాజకీయంగా చైతన్యపరచి ఆధిపత్య వర్గాల చెంతన ఉన్న దోపిడీ, పెట్టుబడిదారీ వర్గాలపై తిరుగు బాటు చేయించినప్పుడే శ్రామిక వర్గ రాజ్యస్ధాపన సులువు అవుతుందని ఆయన చెప్పారు. ఆర్థిక, రాజకీయ రంగాలపై అగ్రకుల సంపన్న వర్గాల ఆధిపత్యం సాగదంటూ... ‘జనాభా నిష్పత్తి ప్రకారం సీట్ల పంపకం కావాలి, వారే రాజ్యాధికారం చేపట్టాలంటూ 1999 లో 14 కుల సంఘాలను కలుపుకొని ఉమ్మడి రాష్ట్రంలో ‘మహాజన ఫ్రంట్’ ఏర్పాటు చేశారు. జనాభాలో 93 శాతంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అగ్రవర్ణలలోని పేదలు ఆర్థిక, రాజకీయ, సాంఘిక, సమానత్వాన్ని సాధించలేకపోతున్నారు. అందుకే ‘వర్గ వ్యవస్థలోనే కుల వ్యవస్థ’ ఉన్నదని ఓంకార్ స్పష్టం చేశారు. భారతదేశ నిర్దిష్ట పరిస్థితులపై అంచనా ఉన్న ఓంకార్ ఆశయాలకు అనుగుణ్యంగానే ఎమ్సీపీఐ (యూ) కార్యక్రమం ముందుకు సాగుతుంది. ‘ఓట్లు మావే సీట్లు మావే’, ‘ఓట్లు మావి అధికారం మీదంటే’ ఇక చెల్లదంటూ ఏర్పడిన ఆనాటి ‘మహాజన ఫ్రంట్’లో అయినా, 2018లో ‘సామాజిక న్యాయం, బహుజనులకే రాజ్యాధికారం’ అంటూ ఏర్పడిన ‘బహుజన లెఫ్ట్ ఫ్రంట్’ (బీఎల్ఎఫ్)లో అయినా ఎమ్సీపీఐ (యూ) భాగస్వామి అయిందంటే... ఓంకార్ ఆశయ సాధన కోసమే. 2008 అక్టోబర్ 17న అమరులైన కామ్రేడ్ ఓంకార్కు... నేటి దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా పోరాడుతూ బహుజన రాజ్యస్థాపనకై పాటుపడడమే ఘనమైన నివాళి. (క్లిక్ చేయండి: ఆయన జీవితమే ఒక సందేశం) – వనం సుధాకర్ ఎంసీపీఐ(యూ) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు (అక్టోబర్ 17న ఓంకార్ వర్ధంతి సందర్భంగా) -
ఓటీటీలోకి రమ్యకృష్ణ అరంగేట్రం, ఆ డాన్స్ షోలో ‘శివగామి’ సందడే సందడి..
ప్రేక్షకులకు వందశాతం వినోదం అందించడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్న ప్రముఖ తొలి తెలుగు ఓటీటీ ప్లాట్ఫాం ఆహా. ప్రేక్షకులు వందశాతం వినోదం అందించేందుకు ఆహా సరికొత్త కథలు, షోలతో ముందుకు వస్తోంది. అన్స్టాపబుల్ టాక్ షో విత్ ఎన్బీకే, తెలుగు ఇండియన్ ఐడల్ వంటి రియాలిటీ షోలతో ప్రేక్షకులను అలరించిన ఆహా తాజాగా డాన్స్ ఐకాన్ షోతో సిద్ధమైంది. ఆహా ప్లాట్ఫాంపై తాజాగా గ్రాండ్గా లాంచ్ అయిన ఈ షోతో లేడీ సూపర్ స్టార్, ‘శివగామి’ రమ్యకృష్ణ డిజిటల్ రంగంలోకి అడుగుపెట్టింది. చదవండి: కృష్ణంరాజు ముగ్గురు కూతుళ్ల గురించి ఈ ఆసక్తిర విషయాలు తెలుసా? ప్రముఖ యాంకర్ ఓంకార్ హొస్ట్గా చేయనున్న ఈ షోకి ఆమె జడ్జీగా వ్యవహరిస్తున్నారు. ఆమెతో పాటు కింగ్ ఆఫ్ హుక్ స్టెప్స్ శేఖర్ మాస్టర్ కూడా న్యాయనిర్ణేతగా ఉండబోతున్నాడు. ఈ సందర్భంగా రమ్యకృష్ణ మాట్లాడుతూ.. ‘డ్యాన్స్ ఐకాన్ వంటి షోతో ఆహాలో జడ్జిగా అరంగేట్రం చేస్తుండడం సంతోషంగా ఉంది. ఇలాంటి ఒక ఫార్మాట్ ఈ మధ్య కాలంలో ఎవ్వరూ చేయనిది. ఈ షో ద్వారా ఎవరూ చూడని ఒక కొత్త రమ్యని చూడబోతున్నారు. అందరూ ఈ షో ని ఆదరిస్తారని ఆశిస్తున్నా’ అని చెప్పుకొచ్చారు. చదవండి: ఓటీటీ రిలీజ్కు రెడీ అవుతున్న కార్తికేయ 2! ఎప్పుడు, ఎక్కడంటే.. అదే విధంగా ఆహా సీఈఓ అజిత్ ఠాకూర్ మాట్లాడుతూ.. ‘డ్యాన్స్ ఐకాన్తో ఆహా ఫ్యామిలీకి రమ్యకృష్ణని మేము స్వాగతిస్తున్నాము. రమ్య ఎంతో మందికి ఒక రోల్ మోడల్. డ్యాన్స్పై ఆమెకున్న అవగాహన అసమానమైనది. డాన్స్ ఐకాన్కు ఆమె జడ్జిగా వ్యవహరిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది’ అన్నారు. అనంతరం యాంకర్, ఈ షో ప్రొడ్యూసర్ ఓంకార్ “రమ్యకృష్ణ గారు ఈ షో కి జడ్జి గా వ్యవహరించడం నాకు చాలా ఆనందంగా ఉంది. రమ్య గారితో పనిచేయాలి అనే నా కల, ఆహ టీం ద్వారా సాకరమైంది. డాన్స్ ఐకాన్ షో ద్వారా అందరికీ నాన్-స్టాప్ ఎంటర్టైన్మెంట్ దొరకనుంది’ అని తెలిపారు. ఈ షో సెప్టెంబర్ 17 నుండి ప్రతి శనివారం, ఆదివారం రాత్రి 9 గంటలకు ఆహాలో అందుబాటులో ఉండనుంది. -
ఓంకార్ హోస్ట్గా ఆహాలో ‘డాన్స్ ఐకాన్’ షో, ఫస్ట్లుక్ విడుదల
కరోనా తర్వాత ఓటీటీల వినియోగం విస్తృతంగా పెరిగింది. వెబ్సిరీస్, సినిమాలు, స్పెషల్ షోలతో ఓటీటీలు ప్రేక్షకుడికి బోలెడంత వినోదాన్ని పంచుతున్నాయి. తెలుగువారికి నచ్చే మెచ్చే కంటెంట్ను అందిస్తూ ఆహా అనిపిస్తోంది తొలి తెలుగు ఓటీటీ ప్లాట్ఫాం. ఇప్పటికే కొత్త సినిమాలు, వెబ్ సిరీస్, టాక్ షో, సింగింగ్ షోలతో ప్రేక్షకులను అలరిస్తోన్న ఆహా ఇప్పుడు మరో కొత్త షోను డిజిటల్ ప్రేక్షక్షుల ముందుకు తీసుకువస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రతిభవంతులైన డాన్స్ర్ల కోసం డాన్స్ ఐకాన్ షోను పరిచయం చేయబోతోంది. ఈ షోకు ప్రముఖ యాంకర్ ఓంకార్ హోస్ట్గా, నిర్మాతగా వ్యవహరించనున్నాడు. ఇక త్వరలోనే మీ ముందుకు తీసుకురాబోతున్న ఈ షో ఫస్ట్లుక్ ఆగస్ట్ 20న ఆహా విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఈ షో యాంకర్, ప్రొడ్యూసర్ ఓంకార్ మాట్లాడుతూ.. ‘ఈ షో ద్వారా నేను మొదటిసారి ఓటీటీకి ప్లాట్ఫాంలోకి అడుగుపెడుతున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చిన అరవింద్ గారికి, ఆహాకు ధన్యవాదాలు. నేను ఎన్నో డ్యాన్స్ షోస్ చేశాను, కానీ ఇది చాల డిఫరెంట్గా ఉండబోతుంది. ఈ షో.. కంటెస్టెంట్స్తో పాటు కొరియోగ్రాఫీ చేసే మాస్టర్స్ జీవితాలని కూడా మార్చేస్తుంది. గెలిచిన కంటెస్టెంట్ కొరియోగ్రాఫర్కు టాలీవుడ్లో ఒక పెద్ద హీరో సినిమాలో కొరియోగ్రఫీ చేసే అవకాశం వస్తుంది. అందరు ఈ షోని ఆదరిస్తారని భావిస్తున్నా’ అంటూ చెప్పుకొచ్చాడు. -
'ఆట' డ్యాన్స్ షో విన్నర్ టీనా కన్నుమూత
ఓంకార్ యాంకర్గా బుల్లితెరపై ఎంతో పాపులర్ అయిన డ్యాన్స్ రియాలిటీ షో ఆట. ఈ షో మొదటి సీజన్ విన్నర్ టీనా మృతి చెందింది. ఈ విషయాన్ని ఆట సందీప్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. టీనా సాధు మరణవార్త తెలిసి షాక్ అయ్యాను. ఆట సీజన్లో నా పార్టనర్ అయిన టీనా మరణవార్త చాలా బాధిస్తుంది. ఆమె కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. టీనా ఆత్మకు శాంతి చేకూరాలి అంటూ ఆట సందీప్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ఇది చూసిన నెటిజన్లు టీనా మరణవార్త తెలిసి షాక్ అవుతున్నారు. ఆమె మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఆట సీజన్-1విన్నర్గా నిలిచిన టీనా ఆ తర్వాత సీజన్-4కి జడ్జిగా వ్యవహరించారు. అయితే కొన్నాళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న టీనా ఇలా హఠాన్మరణం చెందడం షాకింగ్గా అనిపిస్తుంది. ఆమె మరణానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. View this post on Instagram A post shared by 𝐀𝐚𝐭𝐚 𝐒𝐚𝐧𝐝𝐞𝐞𝐩 𝐃𝐚𝐧𝐜𝐞 𝐌𝐚𝐬𝐭𝐞𝐫🇮🇳 (@aata_sandeep) -
బిగ్బాస్ నాన్స్టాప్: ప్రముఖ యాంకర్ ఓంకార్ వచ్చేశాడు!
Omakar Into Bigg Boss House: ఆనందాలను పంచే రంగుల హోలీ అంటే చిన్నవాళ్ల దగ్గరనుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ ఇష్టమే. రంగులు పూసుకుంటూ, నీళ్లు చల్లుకుంటూ అనుంబంధాలను మరింత ధృడంగా మార్చుకుంటారందరూ. ఇలాంటి హోలీ పండగను జరుపుకునే అవకాశం కంటెస్టెంట్లకు కల్పించాడు బిగ్బాస్. దీంతో నేటి ఎపిసోడ్ కలర్ఫుల్గా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ హోలీ వేడుకల్లో అమ్మాయిలను ఇంప్రెస్ చేయాలనే టాస్క్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. అందులో భాగంగా అనిల్ బిందుమాధవి మీద పొగడ్తల వర్షం కురిపించగా అనిల్ అషూ చేయి పట్టుకుని స్టెప్పులేశాడు. ఇక హౌస్మేట్స్కు రెట్టింపు వినోదాన్ని పంచేందుకు ప్రముఖ యాంకర్ ఓంకార్ రావడం విశేషం. మరి వీరు ఏ రేంజ్లో వినోదాన్ని పంచనున్నారో తెలియాలంటే హాట్స్టార్లో రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఎపిసోడ్ చూడాల్సిందే! చదవండి: కోట్లు సంపాదించిన మిత్ర శర్మ ఇల్లు చూశారా? -
శివశంకర్ మాస్టర్ పాడె మోసిన ఓంకార్
Anchor Omkar At Shiva Shankar Master Last Rites Video Goes Viral: ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ అంత్యక్రియలు సోమవారం(నవంబర్29)న పూర్తయ్యాయి. హైదరాబాద్ ఫిల్మ్నగర్లోని ‘మహాప్రస్థానం’లో ఆయన చిన్న కుమారుడు అజయ్.. శివశంకర్ మాస్టర్ భౌతిక కాయానికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అంతకుముందు పంచవటి కాలనీలోని ఆయన నివాసానికి పలువురు సినీ ప్రముఖులు హాజరై శివశంకర్ మాస్టర్కు నివాళులు అర్పించారు. కాగా అంత్యక్రియలకు హాజరైన ప్రముఖ యాంకర్, దర్శకనిర్మాత ఓంకార్తో పాటు ఆయన తమ్ముడు అశ్విన్ బాబు శివశంకర్ మాస్టర్ పాడె మోశారు. అంత్యక్రియల ప్రక్రియ పూర్తయ్యే వరకు అన్నీ దగ్గరుండి చూసుకున్నారు. కాగా ఓంకార్- శివశంకర్ మాస్టర్ కాంబినేషన్లో వచ్చిన డ్యాన్స్ షోలు అప్పట్లో సూపర్ హిట్లుగా నిలిచిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఇద్దరికీ మంచి అనుబంధం ఉంది. ‘కురువి కూడు’ (1980) అనే తమిళ చిత్రం ద్వారా కొరియోగ్రాఫర్గా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన శివశంకర్ మాస్టర్ తమిళం, తెలుగులో ఎన్నో చిత్రాలకు కొరియోగ్రాఫర్గా పనిచేశారు. -
రాజు గారి గది 4 కథ రెడీగా ఉంది: ఓంకార్
బుల్లితెరపై యాంకర్గా కెరీర్ మొదలు పెట్టిన ఓంకార్ డిఫరెంట్ హోస్టింగ్ స్టైల్తో తక్కువ కాలంలోనే ఎక్కువ గుర్తింపు సంపాదించుకున్నాడు. ఎన్నో వైవిధ్యమైన రియాలిటీ షోలను ప్రేక్షకులకు పరిచయం చేసి అలరించిన ఆయన 'జీనియస్' చిత్రంతో దర్శకుడిగా మారాడు. కానీ ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోకపోవడంతో తిరిగి రియాలిటీ షోల మీద దృష్టి పెట్టాడు. ఆ తర్వాత ఓ హారర్ స్క్రిప్ట్తో మరోసారి వెండితెరపై తన లక్ పరీక్షించుకున్నాడు. అలా రాజుగారి గది సినిమాను తెరకెక్కించాడు. ఇది సూపర్ హిట్టవ్వడంతో అదే ఊపులో సీక్వెల్ తీశాడు. అదీ హిట్ టాక్ తెచ్చుకోవడంతో తన తమ్ముడు అశ్విన్, హీరోయిన్ అవికా గోర్ ప్రధాన పాత్రల్లో 'రాజు గారి గది 3' సినిమా రూపొందించాడు. కానీ ఇది ఆశించిన స్థాయిలో క్లిక్ అవ్వలేదు. దీంతో ఈ ఫ్రాంచైజీలో సినిమాలు రావని అంతా ఫిక్సయిపోయారు. కానీ ఈ అనుమానాలను పటాపంచలు చేస్తూ తన దగ్గర 'రాజు గారి గది 4' కథ సిద్ధంగా ఉందంటున్నాడు ఓంకార్. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. 'రాజు గారి గది 4' స్క్రిప్ట్ రెడీ అయిందన్నాడు. దీనితోపాటు ఓ థ్రిల్లర్, స్పోర్ట్స్, గ్రామీణ నేపథ్యంలో కథలు రాసుకున్నానని చెప్పుకొచ్చాడు. కానీ కరోనా వల్ల ఇవేవీ సెట్స్ మీదకు వెళ్లలేదన్నాడు. చదవండి: Sardar Ka Grandson: ‘సర్దార్ కా గ్రాండ్సన్’ మూవీ రివ్యూ -
వైరల్ : ముమైత్ఖాన్పై సీరియస్ అయిన ఓంకార్
బుల్లితెరపై యాంకర్గా ఓంకార్కు ప్రత్యేక స్థానం ఉంది. తనదైన స్టైల్తో షో టీఆర్పీ రేటింగ్స్ పెంచడంలో ఓంకార్ ముందుంటారు. ప్రస్తుతం ఓ బుల్లితెరపై ప్రసారం అయ్యే డ్యాన్స్ షోకు ఓంకార్ హోస్ట్గా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో జరిగిన ఓ గొడవలో షో జడ్జిగా వ్యవహరిస్తున్న ముమైత్ ఖాన్కు ఓంకార్ గట్టి కౌంటర్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయ్యంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అసలు ఏమైందంటే..జడ్జిమెంట్ టైంలో ఓ కంటెస్టెంట్కు, ముమైత్ ఖాన్కు గొడవ జరుగుతుంది. దీంతో కంటెస్టెంట్ పైకి ముమైత్ గట్టిగా అరుస్తుండటంతో ఎందుకు సీరియస్ అవుతున్నారు అంటూ ఓంకార్ ఆమెను కూల్ చేసే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ముమైత్ తగ్గకపోగా, ఓంకార్పై కూడా వేలు చూపిస్తూ తన కోపాన్ని ప్రదర్శించింది. ఈ సంఘటనతో సీరియస్ అయిన ఓంకార్..మీరు మీరు గొడవపడుతున్నప్పుడు నన్నెందుకు పాయింటౌట్ చేస్తున్నారు అంటూ సీరియస్ అయ్యాడు. ఈ షాకింగ్ ఇన్సిడెంట్తో ఏం చెయ్యాలో తెలియక ముమైత్ సైలంట్ అయిపోతుంది. దీనికి సంబంధించిన ఎపిసోడ్ టెలికాస్ట్ కావాల్సి ఉంది. అయితే ఈ ప్రోమోపై సోషల్ మీడియాలో పలు మీమ్స్ చక్కర్లు కొడుతున్నాయి. చదవండి : అందరు చూస్తుండగానే మోనాల్కు ముద్దు పెట్టిన కుర్ర మాస్టర్! ప్రముఖ డ్యాన్స్ షోలో ప్రమాదం..కంటెస్టెంట్కు తీవ్ర గాయం! -
చూస్తుండగానే మోనాల్కు ముద్దు పెట్టిన కుర్ర మాస్టర్!
బిగ్ బాస్ 4 ఫేం మోనాల్ గజ్జర్ ఒకప్పుడు ఎవరికి తెలియదు. హీరోయిన్గా ఎన్ని సినిమాలు చేసిన రాని గుర్తింపు ఒక్కసారిగా బిగ్బాస్ షోతో వచ్చేసింది. ఫేడ్ అవుట్ అయిన హీరోయిన్గా బిగ్ బాస్ హౌజ్లో అడుగుపెట్టిన ఈ గుజరాతి భామ ఇప్పుడు అందరి నోళ్లల్లో నానుతోంది. దీనికి అభిజిత్, అఖిల్ సార్థక్తో ఒకేసారి లవ్ ట్రాక్ నడపడమే. అలా 98 రోజుల పాటు హౌజ్లో కొనసాగిన మోనాల్పై విమర్శలు వచ్చినప్పటికి బయటకు వచ్చాకా ఆమెకు ప్రేక్షకులు నీరాజనాలు పడుతున్నారు. అంతేగాక దర్శక నిర్మాతల నుంచి ఆమెకు వరుస ఆఫర్లు వచ్చిపడుతున్నాయి. ఈ క్రమంలో ఆమెకు పలు సినిమాల్లో నటించే అవకాశం కొట్టెసింది. దీంతో పాటు స్టార్ మాలో వస్తున్న డ్యాన్స్ ప్లస్ రియాలిటీ షోకు మెంటర్గా చేస్తూనే వీలు చిక్కినప్పుడల్లా స్టేజ్పై కాలు కదుపుతోంది ఈ భామ. ఈ క్రమంలో నిన్న స్టార్ మా విడుదల చేసిన ప్రోమో ప్రస్తుతం నెట్టంట వైరల్ అవుతోంది. ఈ షోలో కన్నా మాస్టర్ టీమ్ రెండు వారాల క్రితం అద్భుతమైన ప్రదర్శన ఇచ్చి మోనాల్ మెప్పు పొందిన సంగతి తెలిసిందే. ఈ టీం పర్ఫామెన్స్కు ఫిదా అయిన మోనాల్ కన్నా మాస్టర్ను తీసుకెళ్లి తన సీట్లో కూర్చోబెట్టింది. అలా తీసుకెళ్తోన్న సమయంలో ఓ రొమాంటిక్ సాంగ్ వేశారు షో నిర్వహకులు. ఆ తర్వాత కన్నా మాట్లాడుతూ మేడమ్ కోసం ఏదైనా చేస్తానని చెప్పడంతో తనకు ఇష్టమైన పట్టు వస్త్రాలు కూడా వేసుకువస్తావా అని ఓంకార్ అడగ్గా.. మేడమ్ చేప్తే తప్పకుండా వేసుకోస్తానంటూ సమాధానం ఇచ్చాడు. అన్నట్టుగానే ఈ వారం జరిగే ఎపిసోడ్కు కన్నా మాస్టర్ పట్టు వస్రాలతో దర్శనమిచ్చాడు. తన పర్ఫామెన్స్ తర్వాత మోనాల్ను స్టేజ్పైకి తీసుకువేళ్లి తనతో స్టేప్పులేశాడు. అనంతరం ఆమెకు గులాబి పువ్వు ఇచ్చి మోకాళ్లపై కుర్చోని మోనాల్ చేయిపై ముద్దు పెట్టాడు. అది చూసి కంటెస్టెంట్స్, షో మెంటర్స్తో పాటు యాంకర్ ఓంకార్ సైతం ఒక్కసారిగా షాకయ్యారు. చదవండి: మోనాల్తో వీడియో కాల్, అఖిల్ కామెంట్ వైరల్ మహేశ్తో స్పెషల్ సాంగ్: మోనాల్ క్లారిటీ! -
ప్రేక్షకుల సపోర్ట్ చాలు
ఓక్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రూపొందిన చిత్రం ‘రాజుగారి గది–3’. ఓంకార్ దర్శకత్వంలో అశ్విన్బాబు, అవికాగోర్ జంటగా నటించారు. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రం సక్సెస్మీట్ను హైదరాబాద్లో నిర్వహించింది చిత్రబృందం. ఈ సందర్భంగా ఓంకార్ మాట్లాడుతూ –‘‘నా తమ్ముడు అశ్విన్ను హీరోగా యాక్సెప్ట్ చేసి ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. సాధారణంగా పెద్ద íహీరో సినిమాలకు మాత్రమే థియేటర్స్ ఫుల్ అవుతుంటాయి. అలాంటిది మా ‘రాజుగారి గది 3’ చిత్రం ఫుల్ అవుతోంది’’ అన్నారు. అలీ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రాన్ని నేను కూకట్పల్లిలోని థియేటర్లో ప్రేక్షకుల మధ్యలో కూర్చుని చూశాను. వారందరూ సినిమాను చాలా ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా ఆడాలంటే ప్రేక్షకుల సపోర్ట్ ఉంటే చాలు’’ అన్నారు. ‘‘4 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది ఈ చిత్రం. అశ్విన్ ప్రాణం పెట్టి నటించారు’’ అన్నారు కెమెరామెన్ ఛోటా. కె. నాయుడు. ‘‘సినిమా చెయ్యాలనే ఆసక్తే నన్ను సినిమాల్లోకి వచ్చేలా చేసింది. ఈ చిత్రంతో నాకు ఓ మార్కెట్ ఏర్పడింది అని ఫ్రెండ్స్ అంటుంటే చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు అశ్విన్. ‘‘సినిమా ఇంత పెద్ద విజయం సాధించినందుకు మా యూనిట్కి అభినందన లు’’ అన్నారు అవికాగోర్. సంగీత దర్శకుడు షబ్బీర్ పాల్గొన్నారు. -
'రాజుగారి గది 3' మూవీ రివ్యూ
-
'రాజుగారి గది 3' మూవీ రివ్యూ
టైటిల్ : రాజుగారి గది 3 జానర్ : హర్రర్ కామెడీ నటీనటులు : అశ్విన్ బాబు, అవికా గోర్, అలీ, అజయ్ ఘోష్, ఊర్వశీ, బ్రాహ్మాజీ, గెటప్ శ్రీను, శివశంకర్ మాస్టార్, హరితేజ సంగీతం : షబీర్ దర్శకత్వం : ఓంకార్ నిర్మాణం : ఓక్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ‘ఆట’లాంటి షోస్తో టెలివిజన్ తెరపై సత్తా చాటిన ఓంకార్.. దర్శకుడిగా ‘రాజుగారి గది’ సినిమాతో సినీ పరిశ్రమలోనూ తనదైన ముద్ర వేశారు. హర్రర్ కామెడీ జానర్లో తీసిన ‘రాజుగారి గది’ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఈ సిరీస్లో తీసే చిత్రాలకు క్రేజ్ ఏర్పడింది. ఆ తర్వాత నాగార్జున, సమంత వంటి అగ్రశ్రేణి స్టార్స్తో తీసిన ‘రాజుగారి గది-2’ అనుకున్న అంచనాలను అందుకోలేకపోయింది. ఆ సినిమా కమర్షియల్గా విజయం సాధించలేదు. ఈ నేపథ్యంలో మరోసారి హర్రర్ కామెడీనే నమ్ముకున్న ఓంకార్ ‘రాజుగారి గది-3’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈసారి అశ్విన్ బాబుకు జోడీగా అవికా గోర్ నటించిన ‘రాజుగారి గది-3’ ప్రేక్షకులను మెప్పించిందా? అసలు గదిలో ఏముంది? ఈ మూడోపార్టులో దెయ్యం నవ్వించి.. భయపెట్టిందా? తెలుసుకుందాం పదండి! కథ..: మాయా (అవికా గోర్) ఓ ఆస్పత్రిలో వైద్యురాలిగా పనిచేస్తుంటుంది. ఆమె తండ్రి గరడపిళ్లై. కేరళలో పేరుమోసిన మాంత్రికుడు. ఈ క్రమంలో మాయను ఎవ్వరూ వెంబడించి వేధించినా.. ఐ లవ్యూ చెప్పినా.. మాయాను అనుసరిస్తూ ఉండే ఓ దెయ్యం వారి భరతం పడుతుంది. మరోవైపు అశ్విన్ ఓ కాలనీలో ఆటోడ్రైవర్. నిత్యం తాగి తందనాలు ఆడుతూ.. కాలనీ వాసులను వేధించుకు తింటుంటాడు. మాయను ప్రేమించి.. ఐలవ్యూ చెప్పి దెయ్యం చేతిలో చావుదెబ్బలు తిన్న డాక్టర్ శశి (బ్రహ్మాజీ).. కాలనీ వాసులతో పథకం రచించి.. మాయను అశ్విన్ ప్రేమించేలా చేస్తాడు. అశ్విన్ కూడా మాయకు ఐలవ్యూ చెప్పడంతో దెయ్యం అతనికి చుక్కలు చూపిస్తుంది. ఈ క్రమంలో గరడపిళ్లైతో తాడో-పెడో తేల్చుకోవడానికి అశ్విన్, తన మామ అలీతో కలిసి కేరళ వెళుతాడు. అక్కడ అశ్విన్కు ఎదురైన పరిస్థితులేమిటి? యక్షిని ఎవరు? మాయకు రక్షణగా యక్షిని ఎందుకు తిరుగుతుంది? యక్షిని బారి నుంచి మాయను ఎలా రక్షించి.. అశ్విన్ పెళ్లి చేసుకున్నాడు? రాజుగారి గదిలో వారికి ఎదురైన పరిస్థితులు ఏమిటి? అన్నది తెలుసుకోవడానికి సినిమా చూడాలి. ఎవరు ఎలా చేశారు? రాజుగారి గదిలో హీరోగా చేస్తూ వస్తున్న అశ్విన్ బాబు.. ఈ సినిమాలోనూ తనదైన శైలిలో ఆకట్టుకున్నాడు. యాక్టింగ్ పరంగా కొంచెం మెరుగయ్యాడు. కానీ, డైలాగ్ మాడ్యులేషన్ అనేక యాసల్లో ఉండటం కనిపిస్తుంది. ఇక, మాయగా అవికా గోర్ అందంగా కనిపించింది. కొంచెం బొద్దుగా ఉన్నప్పటికీ తన నటనతో పర్వాలేదనిపించింది. క్లైమాక్స్లో కాసేపు దెయ్యంగా కనిపించింది. ఫస్ట్ హాఫ్లో అలీ, అశన్లతో కలిసి బ్రహ్మాజీ, శివశంకర్ మాస్టార్, గెటప్ శ్రీను తదితరులు కాసింత నవ్వులు పంచారు.సెకండ్ హాఫ్లో గరడ పిళ్లై, రాజమాతలుగా అజయ్ ఘోష్, సీనియర్ నటి ఊర్వశీలు.. అలీ, అశ్విన్ తోడుగా దెయ్యాలతో కలిసి హర్రర్ కామెడీ పండించారు. ముఖ్యంగా అలీ, అజయ్ ఘోష్, ఊర్వశీ తమ పాత్రలకు న్యాయం చేస్తూ.. నవ్వులు పంచారు. విశ్లేషణ..! హర్రర్ కామెడీ సినిమాలకు బలమైన కథ, కథనాలు ముఖ్యం. దర్శకుడిగా ఓంకార్.. ఈ హర్రర్ కామెడీ సినిమాకు ఒకింత డిఫరెంట్ పాయింట్నే ఎంచుకున్నారు. అమ్మాయి వెంటపడే వ్యక్తులనే యక్షిని రఫ్ ఆడటమనే కాన్సెప్ట్ బాగానే ఉన్నా.. సెకండాఫ్లో రాజుగారి గదిలోకి పాత్రలు ఎంటరైన తర్వాత పూర్తిగా కామెడీ మీద ఫోకస్ చేయడం కొంత ప్రేక్షకులకు నిరాశకు గురిచేయవచ్చు. అంతగా భయపెట్టి థ్రిల్ చేసే అంశాలు సినిమాలో లేకపోవడం మైనస్గా చెప్పవచ్చు. సెకండాఫ్లో దెయ్యాలన్నీ వచ్చి కామెడీ పండించడం తప్ప పెద్దగా ప్రేక్షకుడిని ఉత్కంఠకు గురిచేయవు. యక్షిని నేపథ్యాన్ని కార్టూన్రూపంలో చెప్పడం కన్విన్సింగ్గానే ఉన్నా.. ఇంకాస్త మెరుగ్గా చెబితే ప్రేక్షకుల్లో నాటుకుపోయేది. దర్శకుడిగా ఓంకార్ టేకింగ్ బాగుంది. ఛోటా కే నాయుడు సినిమాటోగ్రఫి.. షబీర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాను బాగా ఎలివేట్ చేశాయి. ఎప్పటిలాగే బుర్ర సాయిమాధవ్ డైలాగులు హాస్యాన్ని పండిస్తూ.. అదనపు బలాన్ని చేకూర్చాయి. షబీర్ పాటలు అంతగా గుర్తుండిపోవు కానీ పాటల టేకింగ్ బావుంది. మొత్తానికి ఈ హర్రర్ కామెడీలో హర్రర్ అంతలేకపోయినా కామెడీ ప్రేక్షకులను మెప్పించవచ్చు. బలాలు కామెడీ సినిమాటోగ్రఫీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓంకార్ టేకింగ్ బలహీనతలు కథ, కథనాలు సాలిడ్గా లేకపోవడం హార్రర్ పెద్దగా లేకపోవడం ఫస్టాఫ్లో సాగదీత ఫీలింగ్ - శ్రీకాంత్ కాంటేకర్ -
మూడో గదిలో వినోదం కూడా ఉంది
‘‘నా సినిమాలో కథకే ప్రాధాన్యం ఇస్తాను. కథ నచ్చితేనే ప్రేక్షకులు హిట్ చేస్తారు. ‘రాజుగారి గది 3’ సినిమా కథపై నాకు నమ్మకం ఉంది. తప్పక విజయం సాధిస్తుంది’’ అన్నారు. ఓంకార్. అశ్విన్బాబు, అవికా గోర్ జంటగా ఓక్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఓంకార్ స్వీయదర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘రాజుగారిగది 3’. ఈ చిత్రం నేడు విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఓంకార్ చెప్పిన విశేషాలు. ► ‘రాజుగారి గది’ (2015) విజయానికి ఆ సినిమాలోని హాస్యభరిత సన్నివేశాలే కారణం. అందులో మంచి సందేశంతో పాటు వినోదం కూడా ఉంది. ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారు. అయితే ‘రాజుగారి గది 2’ (2017)లో మంచి సందేశం ఉంది కానీ వినోదాన్ని మిస్సయ్యాం అని ప్రేక్షకులు అన్నారు. ‘రాజుగారి గది 3’ మంచి వినోదాన్ని అందిస్తుంది. ► ఈ సినిమా కథ రాసుకుంటున్నప్పుడే నా తమ్ముడు అశ్విన్ హీరోగా సరిపోతాడనిపించింది. నేను దర్శకత్వం వహించిన సినిమాల్లోనే కాక, ఇతర సినిమాల్లోనూ అశ్విన్ నటించాడు. కానీ రావాల్సిన గుర్తింపు రాలేదు. ‘రాజుగారి గది 3’ తర్వాత అశ్విన్కు హీరోగా మంచి గుర్తింపు వస్తుందనుకుంటున్నాను. అవికా అద్భుతంగా నటించింది. ► ఇతర సినిమాలతో బిజీగా ఉండటం వల్లే ఈ సినిమా నుంచి తమన్నా తప్పుకున్నారు. ఆ తర్వాత ఈ సినిమా కోసం కాజల్, తాప్సీలను సంప్రదించాం. కానీ కుదర్లేదు. ఫైనల్గా అవికాను తీసుకున్నాం. కథలో కూడా కొన్ని మార్పులు చేశాం. కానీ తమన్నాకు నేను చెప్పిన కథ వేరే. ఈ కథతో ఓ అగ్ర కథానాయికతో భవిష్యత్లో సినిమా చేయాలనుకుంటున్నాను. అలాగే ‘రాజుగారి గది 2’ సినిమాను వెంకటేశ్గారితో తెరకెక్కించాలనుకున్నా. వేరే సినిమాలతో ఆయన బిజీగా ఉండటం వల్ల నాగార్జునగారితో తీశాం. వెంకటేశ్గారితో ఓ సినిమా చేయాలన్నది నా కోరిక. ‘రాజుగారి గది’ సిరీస్లో ఓ చిత్రాన్ని ఆయనతో చేయాలని ఉంది. ► నేను అక్టోబరులో పుట్టాను. ‘రాజుగారి గది’ సిరీస్లో వస్తోన్న ప్రతి సినిమా అక్టోబరులోనే విడుదలవుతోంది. ‘రాజుగారి గది 3’ సినిమా నాకు దర్శకుడిగా మంచి పేరు తెచ్చిపెడుతుందని ఆశిస్తున్నాను. నాకు నటనపై పెద్దగా ఆసక్తి లేదు. దర్శకుడినిగానే కొనసాగుతాను. ► నేను చేస్తోన్న ఓ రియాలిటీ షో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. నా దగ్గర ‘రాజుగారి గది 4’ కథతో పాటు, ఓ క్రీడా నేపథ్యంలో సాగే కథ ఉంది. వీటిలో ఏ సినిమా ముందు సెట్స్పైకి వెళ్తుందనే విషయంపై ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. -
‘నా డ్రీమ్ 18న చూడబోతున్నారు’
బుల్లితెరపై సత్తా చాటిన ఓంకార్ తరువాత రాజుగారి గది సినిమాతో వెండితెర మీద కూడా దర్శకుడిగా సక్సెస్ అయ్యాడు. ఈ సినిమా ఘనవిజయం సాధించటంతో ఏకంగా నాగార్జున, సమంత లాంటి స్టార్స్తో రాజుగారి గది 2 సినిమాను తెరకెక్కించాడు. అయితే ఆ సినిమా రిజల్ట్ బెడసి కొట్టింది. దీంతో కాస్త గ్యాప్ తీసుకొని తన తమ్ముడు అశ్విన్ హీరోగా ‘రాజుగారి గది 3’ చిత్రాన్ని ఓంకార్ తెరకెక్కించాడు. ఓక్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నిర్మిస్తున్న ఈ చిత్రంలో అవికాగోర్ హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ‘యూ/ఏ’ సర్టిఫికేట్ను సొంతం చేసుకుంది. ఈ నెల 18న విడుదల కానున్న ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ను బుధవారం ప్రసాద్ ల్యాబ్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు ఓంకార్ మాట్లాడుతూ.. ‘18న విడుదలవుతున్న ఈ చిత్రం చిన్న పిల్లలతో సహా అందరూ చూసి ఎంజాయ్ చేయొచ్చు. అశ్విన్, కళ్యాణ్ నా తమ్ముళ్ళు ఇద్దరూ నన్ను నమ్ముకుని నాతో ఉంటూ నన్ను సపోర్ట్ చేస్తూ చాలా హెల్ప్ చేశారు. నేను ఎప్పుడూ అశ్విన్ని హీరోని చెయ్యాలని, కళ్యాణ్ని ప్రొడ్యూసర్ చేయాలన్నది నా కోరిక. 18న అశ్విన్ హీరోగా మీ ముందుకు వస్తాడు. ఇక కళ్యాణ్ బాధ్యత ఒకటి ఉంది. మీరందరూ మమ్మల్ని తప్పకుండా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. నాన్నగారూ లాస్ట్ ఇయర్ చనిపోయారు. అప్పటి నుంచి నేను వైట్ డ్రస్లో ఉంటున్నాను. తమ్ముళ్ళని సక్సెస్ చేసిన తర్వాతే డ్రసింగ్ మార్చుకుంటాను. నన్ను ఆదరించినట్లే నా తమ్ముడు అశ్విన్ని రిసీవ్ చేసుకుంటారని భావిస్తున్నాను’అని ఓంకార్ అన్నారు. ‘నా డ్రీమ్ 18న చూడబోతున్నారు. జీనియస్ నుంచి నేను ఒక ఐదు చిత్రాల్లో చేశాను. కానీ చోటా గారి లాంటి పెద్ద టెక్నీషియన్తో పని చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా జూన్ 21న మొదలై ఇంత త్వరగా పూర్తవడానికి మొయిన్ కారణం కాస్ట్ అండ్ క్రూ ఎవ్వరూ మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. అందరూ ఇష్టపడి మమ్మల్ని ఆశీర్వదిస్తారని అనుకుంటున్నాను’అని అశ్విన్ బాబు పేర్కొన్నారు. హీరోయిన్ అవికాగోర్ మాట్లాడుతూ..‘మొదటిసారి నేను చాలా నెర్వస్గా ఫీలవుతున్నాను. ఎందుకంటే ఈ చిత్రం నాకు చాలా స్పెషల్. ‘రాజుగారి గది3’ చిత్ర యూనిట్ను నా ఫ్యామిలీగా భావిస్తున్నాను. ఈ క్యారెక్టర్ని ఆడియన్స్ ఎలా ఆదరిస్తారా అని వెయిట్ చేస్తున్నాను. చోటాగారు, ఓంకార్ బ్రదర్స్ చాలా కష్టపడ్డారు’అని అన్నారు. -
‘రాజుగారి గది 3’ ప్రీ రిలీజ్ ఫంక్షన్
-
అద్దంలో చూసుకొని భయపడ్డాను
‘‘సినిమా రిలీజ్ అయిపోతే మార్చడానికి ఏమీ ఉండదు. కానీ సీరియల్స్ విషయానికి వస్తే గత ఎపిసోడ్లో జరిగిన తప్పులను ఎప్పటికప్పుడు సరిదిద్దుకోవచ్చు. టీవీ ద్వారానే పాపులారిటీ సంపాదించాను. అందుకే టాలీవుడా? బాలీవుడా? టీవీ ఇండస్ట్రీయా? అని అడిగితే ఎప్పుడూ టీవీకే నా ఓటు’’ అన్నారు అవికా గోర్. ‘చిన్నారి పెళ్లి కూతురు’ సీరియల్ ద్వారా గుర్తింపు పొంది హీరోయిన్గా మారారామె. ఓంకార్ దర్శకత్వంలో అశ్విన్ హీరోగా నటించిన ‘రాజుగారి గది 3’లో హీరోయిన్గా నటించారు అవికా. ఈ నెల 18న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా అవికా మాట్లాడుతూ – ‘‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమా తర్వాత వరుసగా టీవీ షోలు, ఒక హిందీ సినిమా చేశాను. అందుకే తెలుగులో సినిమాలు చేయలేకపోయాను. పేరుకి చేశాం అనేట్టు సినిమా అంగీకరించడం నాకు ఇష్టం ఉండదు. ప్రస్తుతం ‘ఖత్రా’ అనే టీ షో చేస్తున్నాను. ఆ సమయంలో ఓంకార్గారు కలసి ‘రాజుగారి గది 3’ కథ చెప్పారు. ఈ సినిమాలో ముందు తమన్నాను అనుకున్నాం, డేట్స్ క్లాష్తో ఆమె తప్పుకున్నారు అని ముందే చెప్పారు. ఆయన కథ చెప్పడం పూర్తయ్యే సమయానికి భయపడిపోయాను. హారర్ సినిమాలు ఒక్కదాన్నే చూడటానికి భయపడుతుంటాను. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఉంటేనే చూస్తాను. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యాక పూర్తి మేకప్ వేసుకున్నాక నన్ను నేను అద్దంలో చూసుకుని, భయపడ్డాను. మా నాన్నగారైతే ‘ఇదే నువ్వు’ అని ఆటపట్టించారు. ప్రేక్షకులు భయపడుతూనే విపరీతంగా నవ్వుతారు. అదే మా సినిమా హైలెట్. ప్రస్తుతం తెలుగు అర్థం అవుతోంది. నేర్చుకుంటున్నాను. సెట్లో పెద్ద పెద్ద టెక్నీషియన్స్తో వర్క్ చేయడం మంచి ఎక్స్పీరియన్స్. అలీగారి లాంటి లెజెండ్తో నటించడం మర్చిపోలేను. కుదిరితే బిగ్ బాస్ షో హోస్ట్ చేయాలనుంది కానీ బిగ్బాస్ హౌస్లోకి వెళ్లలేను. ఒక తెలుగు ప్రాజెక్ట్ కమిట్ అయ్యాను. త్వరలోనే ప్రకటిస్తాను’’ అన్నారు. అన్ని ఇండస్ట్రీల్లో తెలుగు ఇండస్ట్రీ బెస్ట్ అని నా అభిప్రాయం. ఇక్కడ ఉన్నంత ప్లానింగ్, పద్ధతి ఎక్కడా ఉండదు. జూలైలో సినిమా ప్రారంభించి అక్టోబర్లో వచ్చేస్తున్నాం. యాక్టర్గా నాకు మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది తెలుగు ఇండస్ట్రీయే. -
చిన్నారి దెయ్యం
-
భయపెట్టేందుకు వస్తున్నారు!
రాజుగారి గది, రాజుగారి గది2 సినిమాలతో వరుస విజయాలు అందుకున్న ఓంకార్ ఇప్పుడు అదే సిరీస్లో మూడు చిత్రాన్ని సిద్ధం చేస్తున్నారు. స్వీయ దర్శకత్వంలో తమ్ముడు అశ్విన్ బాబు హీరోగా రాజుగారి గది3 చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ సినిమాతో లాంగ్ గ్యాప్ తరువాత అవికా గోర్ తెలుగు సినిమాలో నటిస్తున్నారు. అలీ, బ్రహ్మాజీ, ధనరాజ్, అజయ్ ఘోష్, ఊర్వశి, హరితేజలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ తాజాగా సీనియర్ హీరో విక్టరి వెంకటేష్ చేతుల మీదుగా ట్రైలర్ను విడుదల చేశారు. థ్రిల్లింగ్ విజువల్స్తో రూపొందించిన ఈ ట్రైలర్ సినిమా మీద అంచనాలు పెంచేస్తోంది. షబీర్ సంగీతమందిస్తున్న ఈ సినిమాను దసరా సందర్భంగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
రాజుగారి గది 3 ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన వినాయక్
వినాయక చవితి సందర్భంగా ‘రాజుగారి గది 3’ ఫస్ట్ లుక్ని వి.వి.వినాయక్ విడుదల చేశారు. రాజుగారిగది, రాజుగారిగది 2 చిత్రాల తర్వాత ఓంకార్ దర్శకత్వంలో ఈ చిత్రంలో తెరకెక్కుతోంది. అశ్విన్బాబు, అవికాగోర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయ్యింది. డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. షబీర్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి ఛోటా కె.నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఓక్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై రూపొందుతోన్న ఈ చిత్రాన్ని దసరాకు విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఫస్ట్లుక్ని విడుదల సందర్భంగా దర్శకుడు వినాయక్ మాట్లాడుతూ... ‘రాజుగారి గది, రాజుగారి గది 2 చిత్రాల కంటే రాజుగారిగది 3 చాలా పెద్ద హిట్ కావాలి. ఓంకార్ చాలా కష్టపడి కమిట్మెంట్తో ఈ సినిమా చేస్తున్నారు. అశ్విన్ ఈ సినిమాలో తొలిసారి సోలో హీరోగా నటిస్తున్నాడు. ఓంకార్ ఓక్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. టీవీ రంగంలో ఓక్ ఎంటర్టైన్మెంట్స్ ఎంత పెద్ద బ్యానర్ అయ్యిందో సినిమా రంగంలోనూ అంతే పెద్ద బ్యానర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమాకు పనిచేసిన ఛోటా కె.నాయుడు సహా యూనిట్ మొత్తానికి నా శుభాకాంక్షలు’ అన్నారు. దర్శక నిర్మాత ఓంకార్ మాట్లాడుతూ... ‘రాజుగారిగది సినిమా చేసేటప్పుడు ఆ సినిమా గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. అప్పుడు వినాయక్ అన్నయ్య చేతుల మీదుగా వినాయకచవితిరోజునే టీజర్ను విడుదల చేశాం. దాని దశ మారిపోయింది. బిజినెస్ అయిపోయింది. నాలుగేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు వినాయక్ అన్నయ్య చేతుల మీదుగా ఫస్ట్ లుక్ విడుదల చేయడం ఆనందంగా అనిపించింది. రాజుగారిగది, రాజుగారిగది 2 చిత్రాల కంటే ఈ సినిమా కచ్చితంగా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. ఈ సినిమాకు ఛోటాగారు, గౌతంరాజుగారు, మ్యూజిక్ డైరెక్టర్ షబీర్ సహా ఇతర టెక్నీషియన్స్ అలాగే అశ్విన్, అవికా, అలీ గారు, బ్రహ్మాజీ గారు, ఊర్వశి గారు ఇలా అందరూ వారి సొంత సినిమాగా భావించి చేయడం వల్ల సినిమా చాలా బాగా వచ్చింది. అన్నీ కుదిరితే ఈ దసరాకు ప్రేక్షకుల ముందుకు వస్తాం’ అన్నారు. -
తమన్నా ప్లేస్లో అవికానా!
బుల్లితెరపై సత్తా చాటిన ఓంకార్ తరువాత రాజుగారి గది సినిమాతో వెండితెర మీద కూడా దర్శకుడిగా సక్సెస్ అయ్యాడు. ఈ సినిమా ఘనవిజయం సాధించటంతో ఏకంగా నాగార్జున, సమంత లాంటి స్టార్స్తో రాజుగారి గది 2 సినిమాను తెరకెక్కించాడు. అయితే ఆ సినిమా రిజల్ట్ బెడసి కొట్టింది. అందుకే తదుపరి సినిమాకు లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. ఇటీవల తన తమ్ముడు అశ్విన్ హీరోగా రాజుగారి గది 3 చిత్రాన్ని ప్రారంభించాడు ఓంకార్. హారర్ జానర్లో తెరకెక్కనున్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్గా నటిస్తుందని ప్రకటించారు. కానీ ఓ బాలీవుడ్ సినిమా కోసం తమన్నా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారట. దీంతో చేసేదేమి లేక మరో హీరోయిన్తో సినిమాను కంటిన్యూ చేసేందుకు రెడీ అవుతున్నారు. అయితే తమన్నా లాంటి గ్లామరస్ స్టార్ను తీసుకోవాలనుకున్న ప్లేస్లో ఇప్పుడు ఉయ్యాల జంపాల ఫేం అవికా గోర్ను తీసుకున్నారట. అవికా టాలీవుడ్ను వదిలేసి చాలా కాలం అవుతుంది. ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాలో కనిపించినా అది అతిథి పాత్రే. మరి ఈ సమయంలో అవికా రాజుగారి గది 3కి ఎంత వరకు ప్లస్ అవుతుందో చూడాలి. -
రాజుగారి గదిలోకి ఎంట్రీ
భయపెట్టడానికి కొత్త గదిలోకి అడుగుపెట్టారు మిల్కీ బ్యూటీ తమన్నా. ఓంకార్ దర్శకత్వంలో తమన్నా ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘రాజుగారి గది 3’. ఇదివరకు ఓంకార్ దర్శకత్వంలోనే వచ్చిన ‘రాజుగారి గది, రాజుగారి గది 2’ చిత్రాలకు ఇది సీక్వెల్ అని చెప్పుకోవచ్చు. ఓక్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. గురువారం ‘ రాజుగారి గది 3’ ప్రారంభోత్సవం జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత ‘దిల్’ రాజు క్లాప్ ఇచ్చారు. ‘స్టార్ మా’ బిజినెస్ హెడ్ అలోక్జైన్ కెమెరా స్విచ్చాన్ చేశారు. ఈ రోజు నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. అశ్విన్బాబు, అలీ, బ్రహ్మాజీ, ప్రభాస్ శ్రీను, హరితేజ, అజయ్ ఘోష్, ఊర్వశి తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు మాటలు: సాయిమాధవ్ బుర్రా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కల్యాణి చక్రవర్తి. -
‘రాజుగారి గది 3’ మూవీ ప్రారంభం
-
రాజుగారి గదిలోకి మూడోసారి!
బుల్లితెర నుంచి వెండితెరకు దర్శకుడిగా పరిచయం అయిన ఓంకార్ రాజుగారి గది సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. దీంతో అదే జానర్లో నాగార్జున, సమంత ప్రధాన పాత్రల్లో రాజుగారి గది 2 చిత్రాన్ని తెరకెక్కించిన మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు అదే ట్రెండ్ ను కంటిన్యూ చేస్తూ రాజుగారి గది 3ని తెరకెక్కిస్తున్నాడు ఓంకార్. వరుసగా హారర్ చిత్రాలతో సత్తా చాటుతున్న తమన్నా ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ మూవీ గురువారం లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత దిల్ రాజుతో స్టార్ మా బిజినెస్ హెడ్ అలోక్ జైన్లు ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. అశ్విన్ బాబు హీరోగా నటిస్తున్న ఈసినిమాలో ఊర్వశి, అలీ, బ్రహ్మాజీ, హరితేజ, ప్రభాస్ శ్రీను, అజయ్ ఘోష్లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఓంకార్ స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. -
ఆ హర్రర్ సినిమాకు మరో సీక్వెల్
బుల్లితెరపై స్టార్ యాంకర్గా గుర్తింపు తెచ్చుకున్న ఓం కార్ తరువాత వెండితెర మీద కూడా సత్తా చాటాడు. జీనియస్ సినిమాతో దర్శకుడిగా మారిన ఓంకార్ రాజుగారి గది సినిమాతో తొలి విజయాన్ని అందుకున్నాడు. అదే ఊపులో నాగార్జున లాంటి స్టార్ హీరోతో రాజుగారి గది 2 చిత్రాన్ని తెరకెక్కించి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా తరువాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఓంకార్ ఓ సినిమా చేస్తున్నట్టుగా వార్తలు వినిపించాయి. కానీ ప్రస్తుతం బుల్లితెరపై బిజీ అవుతున్నాడు ఓంకార్. సిక్త్స్ సెన్స్ అనే రియాలిటీషోకు వ్యాఖ్యతగా వ్యవహిరస్తున్నాడు. బుల్లితెరపై రీ ఎంట్రీ ఇచ్చిన సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఓంకార్ సినిమాలను పక్కన పెట్టే ఉద్దేశం లేదని తెలిపాడు. త్వరలో రాజుగారి గది 3ని ప్రారంభించబోతున్నట్టుగా ప్రకటించాడు ఓంకార్. అయితే ఈ సినిమానే బెల్లంకొండ హీరోగా తెరకెక్కిస్తాడా లేక..? మరో కథను రెడీ చేస్తాడా..? తెలియాల్సి ఉంది. -
నా ప్రేమ నువ్వేనా
వాస్దేవ్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘నాలో ప్రేమ నువ్వేనా’. జై చిరంజీవ ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై రూపొందిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమా లోగోని సినిమాటోగ్రాఫర్ చోటా కె. నాయుడు ఆవిష్కరించి, బెస్ట్ విషెష్ చెప్పారు. వాసుదేవ్ మాట్లాడుతూ –‘‘న్యూ ఏజ్ అండ్ డిఫరెంట్ లవ్స్టోరీతో తెరకెక్కిన సినిమా ఇది. త్వరలోనే పాటలను విడుదల చేసి, సమ్మర్లో సినిమా రిలీజ్ చేస్తాం’’ అన్నారు. రాశీ సైనా, సంజయ్ శివలింగమ్, రాజు తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: అర్జున్. -
బెల్లంకొండతో సుకుమారి
వరుసగా భారీ చిత్రాలు చేస్తూ ఆకట్టుకుంటున్న యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన నెక్ట్స్ సినిమాలో ఓ క్రేజీ హీరోయిన్ తో జతకట్టనున్నాడు. శ్రీనివాస్ ప్రస్తుతం శ్రీవాస్ దర్శకత్వంలో సాక్ష్యం సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. జయ జానకీ నాయక లాంటి మంచి హిట్ తరువాత చేస్తున్న ఈ సినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. సాక్ష్యం సినిమా సెట్స్ మీద ఉండగానే ఇప్పుడు మరో సినిమాను లైన్ లో పెడుతున్నాడు ఈ యంగ్ హీరో. దర్శకుడిగా మారిన యాంకర్.. ఓంకార్ దర్శకత్వంలో ఓ స్పోర్ట్స్ డ్రామాలో నటించనున్నాడు. ఇటీవల రాజుగారి గది 2 సినిమాతో డీసెంట్ హిట్ అందుకున్న ఓంకార్, నెక్ట్స్ సినిమాను డిఫరెంట్ జానర్ లో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.ఇప్పటికే నెక్ట్స్ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభమయ్యాయన్న టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో కీర్తి సురేష్ని హీరోయిన్గా ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నారు చిత్రయూనిట్. అజ్ఞాతవాసి సినిమాలో సుకుమారిగా ఆకట్టుకున్న కీర్తి సురేష్.. కోలీవుడ్, టాలీవుడ్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. -
అమ్మో సమంత కల్లోకి రావొద్దు....
అందంతో పాటు అభినయంతో ప్రేక్షకుల్ని తొలి సినిమాతోనే మాయ చేసిన సమంత నిన్న మొన్నటి వరకూ చాలామంది డ్రీమ్గాళ్. అయితే ఇప్పుడు మాత్రం ఆమె తమ కల్లోకి రావొద్దని చాలా మంది కోరుకుంటున్నారట. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.... శుక్రవారం విడుదలైన రాజుగారి గది 2లో సమంత నటన సూపర్బ్ అంటూ ప్రశంసల జల్లు కురుస్తోంది. మరీ ముఖ్యంగా సినిమా క్లైమాక్స్లో సామ్ యాక్షన్ అదుర్స్ అంటూ ట్విట్టర్లో కామెంట్స్ వస్తున్నాయి. ఇదే విషయాన్ని రంగస్థలం టీమ్ కూడా ఇదే విషయాన్ని ట్విట్ చేసింది. @Samanthaprabhu2 Till now u mi8 have been a dream girl for many. Now after #RajuGariGadhi2 most ppl do not want u in their dreams. — రంగస్థలం 1985 🌅 (@AkkuZoomin) 13 October 2017 చాలామంది ఇప్పటివరకూ సమంతను డ్రీమ్గాళ్గా చూశారని, అయితే రాజుగారి గది 2 సినిమా చూశాక వాళ్లంతా తమ కల్లోకి సమంత రావొద్దని అనుకుంటారని పేర్కొంది. కాగా రంగస్థలం చిత్రంలో హీరో రామ్చరణ్ సరసన సమంత హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా సమంత తన నటనకు ఫుల్ మార్కులు కొట్టేసింది. ఈ చిత్రంలో అమృత పాత్రలో నటించిన ఆమె తనకు అందం, అభినయంలో తిరుగులేదని మరోసారి ప్రూవ్ చేసుకుంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో బబ్లీగా కనిపించిన సామ్, దెయ్యంగా భయపెట్టడంలోనూ సక్సెస్ సాధించింది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్లలో సమంత నటన కంటతడి పెట్టించింది. దీంతో ఆమె నటనపై ట్విట్టర్లో పొగడ్తల వర్షం కురుస్తోంది. సుమంత ఇంటి పేరు మారినా ఆమె సక్సెస్లో విజయపరంపర కొనసాగుతోందని అభిమానులు వ్యాఖ్యలు చేశారు. సమంత పెళ్లి తర్వాత విడుదలైన తొలి సినిమాతో హిట్ సొంతం చేసుకుందని అభినందించారు. అలాగే మామాకోడళ్లు సమంత నాగార్జున కాంబినేషన్ సీన్స్ లో ఇద్దరు పోటాపోటీగా ఇరగదీశారంటూ కామెంట్స్ పెట్టారు. -
మూవీ రివ్యూ: ‘రాజు గారి గది 2'
టైటిల్ : రాజు గారి గది 2 జానర్ : హర్రర్ థ్రిల్లర్ తారాగణం : నాగార్జున, సమంత, సీరత్ కపూర్, అశ్విన్, వెన్నెల కిశోర్, అభినయ, నందు సంగీతం : ఎస్.తమన్ దర్శకత్వం : ఓంకార్ నిర్మాత : ప్రసాద్ వి పొట్లూరి, పరం వి పొట్లూరి, నిరంజన్ రెడ్డి రాజు గారి గది సినిమాతో దర్శకుడిగా తొలి విజయాన్ని అందుకున్న ఓంకార్, మూడో సినిమా కోసం మరోసారి హర్రర్ సబ్జెక్ట్ నే ఎంచుకున్నాడు. రెండో సినిమానే పీవీపీ లాంటి బడా బ్యానర్ లో నాగార్జున లాంటి సీనియర్ హీరోతో రాజుగారి గది 2 సినిమాను తెరకెక్కించారు. మలయాళ సినిమా ప్రేతమ్ ఆధారంగా తెరకెక్కిన రాజు గారి గది 2 తెలుగు ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుంది. పెళ్లి తరువాత రిలీజ్ అవుతున్న సమంత తొలి సినిమా ఆశించిన విజయాన్ని సాధించిందా..? కథ : అశ్విన్ (అశ్విన్ బాబు), కిశోర్ (వెన్నెల కిశోర్), ప్రవీణ్ (ప్రవీణ్) ముగ్గురు ప్రాణ స్నేహితులు. ఎప్పటికీ తమ స్నేహం అలాగే ఉండాలని ఆలోచనతో ముగ్గురు కలిసి ఇంట్లో వాళ్లను ఎదిరించి మరీ ఓ బిజినెస్ మొదలు పెడతారు. విశాఖపట్నం బీచ్ లో ఉండే రాజుగారి బంగ్లా కొని అందులో రిసార్ట్ స్టార్ట్ చేస్తారు. రిసార్ట్ కు వచ్చిన సుహానిస (సీరత్ కపూర్) మీద కిశోర్, ప్రవీణ్ లు మనసుపడతారు. అయితే ఆమెకు దగ్గరయ్యే ప్రయత్నంలో వారికి ఆ రిసార్ట్ లో దెయ్యం ఉందని తెలుస్తుంది. దెయ్యం పని పట్టేందుకు దగ్గరలోని చర్చి ఫాదర్ ను కలిస్తే ఆయన రుద్ర ( నాగార్జున) గురించి చెప్తాడు. (సాక్షి రివ్యూస్) ప్రపంచంలోనే అత్యుత్తమ మెంటలిస్ట్ లలో ఒకడైన రుద్ర, సైన్స్ గురించి ఎంత తెలిసిన మన పాత ఆచారాలను, నమ్మకాలను పాటిస్తుంటాడు. రిసార్ట్ కు వచ్చిన రుద్ర.. అమృత (సమంత) అనే అమ్మాయి ఆత్మ రిసార్ట్ లో తిరుగుతుందని, ఏవో ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి ఆ ఆత్మ ప్రయత్నిస్తుందని కనిపెడతాడు. అమృత ఎవరు..? ఎలా చనిపోయింది..? అమృత తెలుసుకోవాలనుకుంటున్న సమాధానాలు ఏంటి..? ఆ సమాధానాలు అమృతకు తెలిసాయా..? రుద్ర ఆత్మకు ఎలా సాయం చేశాడు..? అన్నదే మిగతా కథ. నటీనటులు : ఈ వయసులో కూడా కుర్ర హీరోలకు పోటి ఇస్తున్న సీనియర్ హీరో నాగార్జున రాజు గారి గది 2తో మరో విభిన్న పాత్రలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రయోగాలకు ఎప్పుడు ముందుండే నాగ్, ఈ సినిమాలో మెంటలిస్ట్ రుద్ర పాత్రలో మెప్పించారు. మనసులోని భావాలను పసిగట్టే పాత్రలో నాగ్ నటన ఆకట్టుకుంది. ముఖ్యంగా సమంత నాగార్జున కాంబినేషన్ లో వచ్చే సీన్స్ లో ఈ ఇద్దరి నటన కట్టిపడేస్తుంది. సమంత తనకు అందం, అభినయంలో తిరుగులేదని మరోసారి ప్రూవ్ చేసుకుంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో బబ్లీగా కనిపించిన సామ్, దెయ్యంగా భయపెట్టడంలోనూ సక్సెస్ సాధించింది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్లలో సమంత నటన కంటతడి పెట్టిస్తుంది.(సాక్షి రివ్యూస్) సీరత్ కపూర్ కు నటనకు పెద్దగా అవకాశం లేకపోయినా.. ఫస్ట్ హాఫ్ లో గ్లామర్ షోతో అలరించింది. వెన్నెల కిశోర్, ప్రవీణ్, షకలక శంకర్ లు భయపడుతూనే నవ్వించారు. మరో ముఖ్యమైన పాత్రలో అభినయ ఆకట్టుకుంది. క్లైమాక్స్ సీన్స్ లో సమంతతో పోటీ పడి నటించింది. సాంకేతిక నిపుణులు : రాజుగారి గది సినిమాతోనే దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్న ఓంకార్, మూడో సినిమాతో మరోసారి మెప్పించాడు. నాగార్జున, సమంత లాంటి టాప్ స్టార్స్ ఉన్నా కథకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వటం కలిసొచ్చింది. మలయాళ సినిమా నుంచి మూలకథను తీసుకున్న ఓంకార్, పూర్తిగా కొత్త టేకింగ్ తో మెప్పించాడు. ఎక్కడా ఇది రీమేక్ అని గుర్తించ లేనంతగా మన నేటివిటికీ తగ్గట్టుగా సినిమాను తెరకెక్కించాడు. ఇప్పటికే మంచి నటిగా ప్రూవ్ చేసుకున్న సమంత నుంచి అవార్డ్ విన్నింగ్ పర్ఫామెన్స్ రాబట్టడంలో ఓంకార్ విజయం సాధించాడు. గ్రాఫిక్స్ వర్క్ ఆకట్టుకుంటుంది. సినిమాకు మరో ఎసెట్ తమన్ అందించిన సంగీతం, పాటలు లేకుండా తెరకెక్కిన ఈ సినిమాలో బిట్స్ సాంగ్స్ తో అలరించాడు. (సాక్షి రివ్యూస్) ఇక తన నేపథ్య సంగీతంతో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాడు. దివాకరన్ సినిమాటోగ్రఫి హర్రర్ సినిమాకు కావాల్సిన ఇంటెన్సిటీని తీసుకువచ్చింది. పీవీపీ సినిమా నిర్మాణలు విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : నాగార్జున, సమంతల నటన క్లైమాక్స్ తమన్ అందించిన నేపథ్య సంగీతం మైనస్ పాయింట్స్ : ఫస్ట్ హాఫ్ లోని కొన్ని సీన్స్ - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
ఓంకార్కి ఓ దండం పెట్టా: నాగార్జున
సాక్షి, హైదరాబాద్ : రాజుగారి గది-2 సినిమా బాగా వచ్చిందని, క్లైమాక్స్లో సమంత నటన సూపర్ అని అక్కినేని నాగార్జున ప్రశంసించారు. నాగార్జున ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో ఆయన మెంటలిస్ట్ పాత్రలో నటించారు. శుక్రవారం ఈ సినిమా విడుదల సందర్భంగా చిత్ర యూనిట్ గురువారం ప్రెస్మీట్ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ..రాజుగారి గది-2 సినిమా తనకు చాలా స్పెషల్ అని అన్నారు. నాగ చైతన్య, సమంత పెళ్లి తర్వాత వస్తున్న ఈ సినిమా చాలా పెద్ద హిట్ కావాలని ఆయన ఆకాంక్షించారు. ‘ఈ సినిమా నాకు చాలా స్పెషల్. పెళ్లి అయిన తర్వాత కోడలు సమంత ఒక హిట్ తీసుకొచ్చిందని అనుకునేలా ఉండాలి. అది తప్పకుండా వస్తుందని గొప్ప నమ్మకం. సినిమా మీద నాకు బాగా కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడల్లా చెబుతుంటాను... అలాగే మళ్లీ వస్తున్నాం... మళ్లీ హిట్ కొడుతున్నాం. ఇక దర్శకుడు ఓంకార్కు ఓసీడీ ఉంది. సినిమా మీద అతడికి విపరీతమైన ప్రేమ. అనుకున్నది కరెక్ట్గా వచ్చేవరకూ అందర్ని చంపాడు. నేను సాధారణంగా ఎప్పుడు చిరాకు పడను. అలాంటిది నేను కూడా అతడి మీద చిరాకుపడ్డాను. చివరి రోజు షూటింగ్ అయిపోయాక నీకో దండం అయ్యా బాబు అని...ఓంకార్కు చెప్పాను. చిత్ర యూనిట్ అంతా ఓ టీమ్గా పనిచేసింది. ఆ శ్రమకు తగిన ఫలితం సినిమా రిలీజ్ అయిన తర్వాత కనిపిస్తుంది’ అని నాగార్జున అన్నారు. -
నేను కెప్టెన్... నాగార్జునగారు కోచ్!
‘‘సిన్మాలో ఎంతమంది ఆర్టిస్టులున్నా... థియేటర్ నుంచి బయటకొచ్చిన ప్రేక్షకులకు గుర్తుండేది నాగార్జునగారు, సమంతలే. వాళ్లిద్దరి పాత్రలు సిన్మాకి హైలైట్. ముఖ్యంగా క్లైమాక్స్లో మామాకోడళ్లు తమ నటనతో చంపేశారంతే!’’ అన్నారు ఓంకార్. నాగార్జున హీరోగా ఆయన దర్శకత్వంలో పీవీపీ సినిమా, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, ఓక్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు నిర్మించిన ‘రాజుగారి గది–2’ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా ఓంకార్ చెప్పిన సంగతులు... ► ‘రాజుగారి గది’ తర్వాత ఆ సిన్మాకి సీక్వెల్ స్టోరీ ఒకటి, ఫ్యామిలీ స్టోరీ మరొకటి రెడీ చేశా. వెంకటేశ్గారికి ‘రాజుగారి గది’ సీక్వెల్ కథ చెప్పా. అయితే... అదీ, ఇప్పుడీ సిన్మా కథ ఒక్కటి కాదు. వెంకీగారు ‘గురు’తో బిజీ. ఈలోపు నా స్నేహితులు వంశీ–శేఖర్ ద్వారా నిర్మాత పీవీపీగారిని కలిశా. ఆయనే సీక్వెల్ తీద్దామని, ఓ రోజు మలయాళ ‘ప్రేతమ్’ ట్రైలర్ లింక్ పంపించారు. అందులో ఉన్నది ఉన్నట్టుగా రీమేక్ చేస్తే ఆడదని చెప్పి, ‘ప్రేతమ్’లో మూలకథ తీసుకుని కొత్త కథ రాశా. ► పీవీపీ, మ్యాట్నీ సంస్థల పేరునీ, ‘రాజుగారి గది’కి వచ్చిన ఇమేజ్నీ దృష్టిలో పెట్టుకుని కథ రెడీ చేశా. కథ విన్న ‘మ్యాట్నీ’ నిరంజన్రెడ్డిగారు మెంటలిస్ట్ పాత్రకు నాగార్జునగారు, ఆత్మ పాత్రకు సమంత అయితే బాగుంటుం దన్నారు. నాగ్ సార్ కథ విన్న ఐదు నిమిషాల్లో ‘ఓకే’ చేసేశారు. సమంత కూడా కథ విన్న వెంటనే ‘ఐయామ్ డూయింగ్ దిస్’ అన్నారు. ► ‘బౌండ్ స్క్రిప్ట్ పర్ఫెక్ట్గా వచ్చేవరకు సలహాలు ఇస్తా. షూటింగ్ స్టార్ట్ అయ్యాక యు ఆర్ మై బాస్’ అన్నారు నాగ్ సర్. ఓ స్టార్ హీరోతో నేను వర్క్ చేయడం ఇదే మొదటిసారి. ఆయన అన్నట్లుగానే దర్శకుడిగా నాకు రెస్పెక్ట్ ఇచ్చి, ఎన్ని టేక్స్ అడిగినా చేశారు. మంచి సీన్స్, సిన్మా కోసం కొన్ని రీటేక్స్ తప్పలేదు. ‘బొమ్మరిల్లు’ క్లైమాక్స్ తర్వాత... మళ్లీ మాటల రచయిత అబ్బూరి రవికి అంత పేరు తీసుకొచ్చే క్లైమాక్స్నీ, మాటల్నీ ఇందులో రాశారు. ► ఇటీవల ఇంటర్వ్యూలో ‘ముంబైలో వద్దు, హైదరాబాద్లోనే గ్రాఫిక్స్ చేయిద్దామంటే, మీరు ముంబై కంపెనీకే గ్రాఫిక్స్ వర్క్ అప్పగించారని... దర్శకులు టైమ్సెన్స్ తెలుసుకోవాలి’ అని నాగార్జున చేసిన వ్యాఖ్యలను ఓంకార్ వద్ద ప్రస్తావించగా... ‘‘నాగార్జునగారిది 30 ఏళ్ల అనుభవం. నాకిది మూడో చిత్రమే. ఈ సిన్మాకి నేను కెప్టెన్ అయితే... ఆయనే మా కోచ్. మంచి క్వాలిటీ కోసమే ముంబై కంపెనీతో గ్రాఫిక్స్ వర్క్ చేయించాం. అవుట్పుట్ చూసి, ఆయన హ్యాపీ ఫీలయ్యారు. నాగ్ సార్ మాటల్ని ఆశీర్వాదాలుగానే తీసుకున్నా. ఐయామ్ ఎ పాజిటివ్ పర్సన్. నెగిటివ్గా ఆలోచిస్తే... ముందుకు వెళ్లలేం’’ అన్నారు. ► ‘సమంత ఆత్మగా నటించారని నాగచైతన్య సినిమా చూడనన్నారట!’ అని ఓంకార్ని అడగ్గా... ‘‘అఖిల్ కూడా చూడనని చెప్పారట! రిలీజయ్యాక ఆడియన్స్ రెస్పాన్స్ చూసి తప్పకుండా చూస్తారని ఆశిస్తున్నా’’ అన్నారు. -
ఆర్జీజీ2 లో నాగ్ రోల్ రివీల్
గత ఏడాది రిలీజ్ అయిన ఓంకార్ సినిమా రాజుగారి గది సూపర్ హిట్ అయ్యింది. ఆ చిత్రానికి సీక్వెల్ గా రాజుగారి గది 2 తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఓంకార్ ఆ పనుల్లో బిజీగా ఉన్నాడు . ఫిబ్రవరి 17 నుండి సెట్స్ పైకి రానున్న రాజుగారి గది 2 ఫస్ట్ పేజ్ లో రెగ్యులర్ షూటింగ్ జరుపుకోవడానికి రెడీ అయిపోయింది. హీరోగా 30 ఏళ్ల కెరీర్లో పలు వైవిధ్యమైన సినిమాలు చేసిన నాగార్జున, తొలిసారి హారర్ కమ్ థ్రిల్లర్ ‘రాజుగారి గది-2’లో ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో నాగార్జున క్యారెక్టర్ పై ఇప్పుడిప్పుడే ఓ క్లారిటీ వస్తోంది. ఇందులో నాగ్ విలక్షణంగా ఉండే గెటప్ తో కనిపించనున్నారు. నాగ్ డ్రెస్సింగ్ నుంచి లుక్స్ వరకు అన్నీ ట్రెండీగా ఉంటాయట. ఓ ఫ్యాన్సీ బైక్ పై హల్చల్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తాడని సమాచారం. నాగ్ ఈ సినిమాలో మెంటలిస్ట్గా కనిపించబోతున్నారు. అతీంద్రియ శక్తులు కలిగి.. ఎదుటి వ్యక్తి ఆలోచనలు, ప్రవర్తనతో ఓ ఆట ఆడుకుంటాడట. కాగా ఈ చిత్రంలో సమంతా ఓ కీ రోల్ లో నటించనుంది. అయితే నాగార్జున, సమంతా జంటగా నటిస్తున్నారనే వార్తల్లో నిజం లేదంటున్నారు చిత్ర యూనిట్. వారిద్దరివి వేరు వేరు పాత్రలని, అదేవిధంగా అందరు అనుకుంటున్నట్టు సమంతా ఘోస్ట్ గా కూడా నటించడం లేదని తేలింది. చాలా ఎమోషనల్ రోల్ లో ఆమె ప్రేక్షకులను అలరించునుందట. ఇంతకు ముందు రాజు గారి గదిలో హీరోగా చేసిన ఓంకార్ తమ్ముడు అశ్విన్ కూడా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో కనిపించనున్నాడు. సీరత్ కపూర్ ఒక హీరోయిన్ చేస్తోంది. పీవీపీ సినిమా, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, ఓక్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. థమన్ సంగీతం అందిస్తున్నారు. -
మామగారి సినిమాలో సమంత
ప్రస్తుతం ఓం నమో వేంకటేశాయ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న సీనియర్ హీరో నాగార్జున తన నెక్ట్స్ సినిమాను కూడా లైన్లో పెట్టాడు. టీవీ యాంకర్గా ఎంట్రీ ఇచ్చి తరువాత డైరెక్టర్గా సక్సెస్ సాధించిన ఓంకార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఓంకార్ దర్శకత్వంలోనే తెరకెక్కిన రాజుగారి గది సినిమాకు సీక్వల్గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే లాంచనంగా ప్రారంభమైన ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. నాగ్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో ముగ్గురు ముద్దుగుమ్మలు సందడి చేయనున్నారు. ఇప్పటికే ఒక హీరోయిన్గా రన్ రాజా రన్ ఫేం సీరత్ కపూర్ను ఎంపిక చేయగా మరో కీలక పాత్రకు స్టార్ హీరోయిన్ సమంతను ఫిక్స్ చేశారు. మరో హీరోయిన్ ఎంపిక జరగాల్సి ఉంది. గతంలో నాగార్జున, సమంతలు మనం సినిమాలో కలిసి నటించారు. రాజుగారి గది 2లో కూడా నాగ్, సమంత పాత్రలు మనం తరహాలోనే ఉండే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. -
నాగ్ జోడిగా సీరత్
సీనియర్ హీరోలందరూ హీరోయిన్లు దొరక్క ఇబ్బందులు పడుతుంటే కింగ్ నాగార్జున మాత్రం వరుసగా కుర్రభామలతో సినిమాలు చేసేస్తున్నాడు. రమ్యకృష్ణ లాంటి సీనియర్ హీరోయిన్లతో జత కడుతూనే లావణ్య త్రిపాఠి, ప్రగ్యా జైస్వాల్ లాంటి కుర్ర హీరోయిన్లతో రొమాన్స్ చేస్తున్నాడు. తాజాగా మరో యంగ్ హీరోయిన్, నాగ్కు జోడిగా నటించేందుకు అంగీకరించింది. ప్రస్తుతం రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఓం నమోవేంకటేశాయ సినిమాలో నటిస్తున్నాడు నాగార్జున. ఈ సినిమా తరువాత రాజుగారి గది ఫేం ఓంకార్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. ఇప్పటికే లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమాకు రాజుగారి గది 2 అనే టైటిల్ ఫిక్స్ చేశారు. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాలో నాగార్జున సరసన ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారు. ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతోంది. అయితే ఒక హీరోయిన్గా రన్ రాజా రన్, టైగర్ లాంటి సినిమాల్లో నటించిన సీరత్ కపూర్ను ఫైనల్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. శర్వానంద్ లాంటి యంగ్ హీరోతో నటించిన బ్యూటి నాగ్తో జోడి కట్టేందుకు ఏమాత్రం ఆలోచించకుండా ఓకె చెప్పేసిందట. త్వరలో మరో హీరోయిన్ను ఫైనల్ చేయనున్నారు చిత్రయూనిట్. -
రాజుగారు మళ్లీ వస్తున్నారు
రాజుగారి గది 2 , ఓంకార్ ,పొట్లూరి వి. ప్రసాద్ ‘‘గతేడాది చిన్న చిత్రంగా రిలీజై భారీ విజయాన్ని నమోదు చేసుకుంది ‘రాజుగారి గది’. ఈ చిత్రంతో దర్శకుడిగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు ఓంకార్. చిన్నా పెద్దా తేడా లేకుండా ఈ ఏడాది ‘క్షణం’, ‘ఊపిరి’ లాంటి విజయవంతమైన చిత్రాలను అందించిన నిర్మాణ సంస్థ పీవీపీ. ‘రాజుగారి గది 2’ని నిర్మించడానికి ఈ సంస్థ అధినేత పొట్లూరి వి. ప్రసాద్ ముందుకొచ్చారు. ఈ సీక్వెల్కి అగ్ర నిర్మాణ సంస్థ తోడవడంతో భారీ తారాగణంతో పాటు మంచి టెక్నిషియన్లను కూడా తీసుకుంటున్నామని దర్శకుడు ఓంకార్ అన్నారు. మొదటి భాగంకన్నా రెండో భాగం ఇంకా క్వాలిటీగా ఉంటుందన్నారు. పీవీపీ సినిమా, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, ఓక్ ఎంటర్ టైన్మెంట్స్ నిర్మించనున్నాయి. పెరల్ వి. పొట్లూరి, పరమ్ వి. పొట్లూరి, కవిన్ అన్నే నిర్మాతలు. -
ఓంకార్ 'రాజుగారి గది-2'
దర్శకుడిగా మారిన పాపులర్ టీవీ యాంకర్ ఓంకార్ మరోసారి ప్రేక్షకులను పలకరించనున్నాడు. తన తమ్ముడు అశ్విన్ను హీరోగా పెట్టి 'రాజుగారి గది' అనే హారర్ కామెడీని తెరకెక్కించిన విషయం తెలిసిందే. సినిమా అనుకున్నదాని కంటే హిట్ అవ్వడంతో మళ్లీ అదే జానర్లో 'రాజుగారి గది-2' ను తీసేందుకు సిద్ధమవుతున్నాడు. మరింత భయంతో కూడిన వినోదాన్ని ప్రేక్షకులకు అందించే పనిలో పడ్డాడు. ఓంకార్ 'రాజుగారి గది' చిత్రాన్ని వారాహి చలన చిత్ర బ్యానర్ సహకారంతో నిర్మించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు 'రాజుగారి గది-2' చిత్రానికి పి.వి.పి సినిమా బ్యానర్ తోడయ్యింది. పివిపి సినిమా, మ్యాట్నీ ఎంటర్టెయిన్మెంట్ , ఓక్ ఎంటర్టెయిన్మెంట్ ప్రై.లి. బ్యానర్స్ సంయుక్తంగా 'రాజుగారి గది-2' నిర్మించేందుకు ముందుకొచ్చాయి. నటీనటులు, ఇతర టెక్నీషియన్ల ఎంపిక జరగాల్సి ఉందని, త్వరలోనే పూర్తి వివరాలు తెలియజేస్తామని పివిపి సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. -
రాజు గారి గదిలోకి అంజలి
గత ఏడాది చిన్న సినిమాగా విడుదలై ఘనవిజయం సాధించిన మూవీ రాజుగారి గది. జీనియస్ ఫెయిల్యూర్ తరువాత విరామం తీసుకున్న ఓంకార్, రాజు గారి గది సినిమాతో మరోసారి దర్శకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. హార్రర్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సినిమా కేవలం రెండున్నర కోట్లతో రూపొంది 7 కోట్లకు పైగా వసూళు చేసింది. దీంతో ఈ సినిమాకు సీక్వల్ను రూపొందించే ఆలోచనలో ఉన్నాడు ఓంకార్. ఇప్పటికే కథాకథనాలను కూడా రెడీ చేసిన ఓంకార్ ప్రస్తుతం నటీనటుల ఎంపిక మీద దృష్టి పెట్టాడు. అయితే తొలి భాగాన్ని తక్కువ బడ్జెట్లో కొత్త వారితో తెరకెక్కించినా.. రెండో భాగాన్ని మాత్రం భారీగానే ప్లాన్ చేస్తున్నాడు. అందుకు తగ్గట్టుగా హీరోయిన్ అంజలిని ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటింపచేయడానికి ప్రయత్నిస్తున్నాడు. గీతాంజలి సినిమాతో హర్రర్ సినిమా చేసిన అంజలి మరోసారి అదే తరహా పాత్రలో నటించడానికి అంగీకరించిందన్న టాక్ వినిపిస్తోంది. మరి రాజుగారి గది సీక్వల్కు అంజలి గ్లామర్ ఎంత వరకు ప్లస్ అవుతుందో చూడాలి. -
'రాజుగారి గది -2 ' కథ రెడీ
తిరుమల : రాజుగారి గది -2 చిత్రానికి కథ రెడీగా ఉందని చిత్ర దర్శకుడు ఓంకార్ తెలిపారు. సోమవారం రాజుగారి గది చిత్రం హీరో అశ్విన్ బాబు, రచయిత దివాకర్, సహనటులు చేతన్, బుజ్జెమ్మతో కలసి ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల ఓంకార్ మీడియాతో మాట్లాడారు. దసరా పర్వదినం రోజున విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బాస్టర్ విజయం సాధించిందన్నారు. అందులోభాగంగా విజయయాత్ర కొనసాగిస్తున్నామన్నారు. శ్రీవారి ఆశీస్సులతోనే ఇక్కడి నుంచే ఆ చిత్రానికి డైలాగులు రాశామని.. చిత్రం విజయం సాధించినందుకు మొక్కు తీర్చుకున్నామన్నారు. -
ఇలాంటి కాన్సెప్ట్ ఈజీ కాదు
- ఓంకార్ ఓక్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో ఓంకార్ నిర్మించిన చిత్రం ‘రాజుగారి గది’. అశ్విన్, చేతన్, ధన్యా బాలకృష్ణన్, పూర్ణ ముఖ్య తారలుగా నటించిన ఈ చిత్రం విజయోత్సవం మంగళవారం జరిగింది. ఓంకార్ మాట్లాడుతూ - ‘‘అవయవదానం గొప్పదనం చెప్పే సినిమా తీయడమంటే అంత ఈజీ కాదు. ఆ విషయంలో నిమ్మగడ్డ ప్రసాద్ గారు హెల్ప్ చేశారు. సాయి కొర్రపాటి, అనిల్ సుంకర అందించిన సపోర్ట్తో దసరా కానుకగా విడుదల చేసి, మంచి విజయం సాధించాం’’ అని చెప్పారు. ‘‘ఇది నా సెకండ్ హారర్ మూవీ’’ అని పూర్ణ అన్నారు. ‘‘టీమ్ అందరం బాగా కష్టపడ్డాం. ఈ చిత్రాన్ని పెద్ద హిట్ చేసి నాకు లైఫ్ ఇచ్చారు’’ అని హీరో అశ్విన్ చెప్పారు. నిర్మాత సాయి కొర్రపాటి, సంగీత దర్శకుడు సాయికార్తీక్, చిత్ర కథానాయిక ధన్యా బాలకృష్ణన్, నటులు చేతన్, ధన్రాజ్ తదితరులు పాల్గొన్నారు. -
రాజు గారి గది... లోపల ఏముంది?
చిత్రం: రాజు గారి గది తారాగణం: అశ్విన్, ‘షకలక’ శంకర్, ధన్రాజ్, సప్తగిరి మాటలు: సాయిమాధవ్ బుర్రా కెమేరా: ఎస్. జ్ఞానమ్ సంగీతం: సాయికార్తీక్ నిర్మాత: ఓక్ ఎంటర్టైన్మెంట్స్ కథ-స్క్రీన్ప్లే-దర్శకత్వం: ఓంకార్ గతంలో ‘జీనియస్’ అనే సినిమాతో దర్శకుడిగా తొలి అడుగు వేసిన ఓంకార్ ఈసారి లో-బడ్జెట్లో చేసిన హార్రర్ - కామెడీ -క్రైమ్ సినిమా ‘రాజు గారి గది’. అనగనగా నందిగామ అనే ఊరు. అక్కడ ఓ పాడుబడిన మహల్... దానిలోకి వెళ్ళినవాళ్ళంతా చనిపోతుంటారు. ఆ మహల్లో దయ్యం ఉందని ఊరంతా పుకారు. ఆ బంగళాలో ఉన్నదేమిటో నిజం నిరూపించడానికి కొందరు బయలుదేరతారు. తీరా ఆ ముగ్గురూ కూడా చనిపోతారు. అలా అప్పటికి 34 మంది బలైపోయిన ఆ రాజమహల్ రహస్యం ఛేదించడానికి అన్నట్లుగా ఒక టీవీ చానల్ ఒక షో పెడుతుంది. దానిలో పాల్గొనడానికి ఏడుగురు సెలక్ట్ అవుతారు. ఆ ఏడుగురూ అక్కడకు వెళ్ళి, ఆ మహల్లో ఏడు రోజుల పాటు ఉండి, దయ్యాలున్నాయా, లేదా అన్నది కనిపెట్టాలన్నది గేమ్. అలా ఏడు రోజులూ అక్కడే గడిపి, గెలిచినవాళ్ళకు రూ. 3 కోట్లు ప్రైజ్మనీ. అందుకు ఒప్పుకొని, ఆ ఏడుగురూ అక్కడకు వెళ్ళినప్పుడు ఏం జరిగిందన్నది సినిమా. వెళ్ళిన ఏడుగురిలో ఒక్కొక్కరిదీ ఒక్కో నేపథ్యం. అశ్విన్ (అశ్విన్)కు ఓ ఫ్లాష్బ్యాక్ ఉంటుంది. అతని అన్నయ్య డాక్టర్ (రాజీవ్ కనకాల). ఆర్గాన్ డొనేషన్ గురించి జనంలో చైతన్యం తెచ్చే ఆ డాక్టర్ కూడా అనుమానాస్పదంగా ఆ మహల్లోని పాడుబడ్డ బావిలో మరణిస్తాడు. ఆ కథకూ, ఈ మహల్లో పెళ్ళి కాకుండా తిరుగుతున్న బొమ్మాళి (పూర్ణ) దయ్యానికీ ఉన్న సంబంధం ఏమిటి? ఇంతకీ ఆ మహల్లో దయ్యాలున్నాయా? ఎందుకవి అందరినీ చంపుతున్నాయన్నది మిగతా కథ. ఓంకార్ తన తమ్ముడు అశ్విన్ను హీరోగా పరిచయం చేస్తూ, డెరైక్షన్ చేసిన సినిమా ఇది. చూడడానికి అన్న పోలికలు పుష్కలంగా ఉన్న అశ్విన్ది ప్రధాన పాత్ర. డాక్టర్ నందన్గా చేతన్ చీను వినూత్నంగా కనిపిస్తారు. బాలా త్రిపురసుందరి అలియాస్ బాలాగా ధన్యా బాలకృష్ణన్ తెలంగాణ మాండలికంలో, గుంటూరు జిల్లా యాసలో శివుడుగా ధన్రాజ్, క్రైస్తవ మత ప్రబోధకుడి కుమారుడిగా ఎం.వై. దానం అలియాస్ మైదానంగా ‘షకలక’ శంకర్, బుజ్జిమాగా తమిళ నటి విద్యుల్లేఖా రామన్ - ఇలా ఒక్కొక్కరిదీ ఒక్కో రకం డైలాగ్ డెలివరీ. స్క్రిప్టుకు తగ్గట్లే అందరూ నవ్వించడానికి ప్రయత్నించారు. ఈ సినిమాకు ప్రధాన బలం - ‘షకలక’ శంకర్ చేసిన కామెడీ, చూపిన హావభావాలు. క్షణాల్లో రకరకాల వేరియేషన్స్ చూపిస్తూ, ఆయన పండించిన సన్నివేశాలు ఆడియన్స్కు నచ్చుతాయి. మరిన్ని ఛాన్స్లు తెచ్చిపెడతాయి. ధన్రాజ్తో కాంబినేషన్ సీన్లు పండాయి. సెకండాఫ్లో సప్తగిరి చేసే ‘కచ్చేరీ’ లాంటి కామెడీ మాస్ను ఉద్దేశించినదనుకోవాలి. పాటలు ఎక్స్పెక్ట్ చేయలేని హార్రర్ సినిమాకు... తగ్గట్లుగా బాగా కుదిరినవి - కెమేరా వర్క్, రీరికార్డింగ్. సౌండ్ ఎఫెక్ట్స్తో ప్రేక్షకుల్ని ఉద్విగ్నతకు గురి చేస్తారు. నిడివి పరంగా కేవలం రెండు గంటల చిల్లరే ఉన్న ఈ సినిమాకు ఎడిటింగ్లో షాట్స్ ఎంపిక, వాటి ప్లేస్మెంట్ విషయంలో మరింత జాగ్రత్త తీసుకుంటే, హార్రర్ ఎఫెక్ట్ పెరిగేదనిపిస్తుంది. అలవాటైన టీవీ చానల్ గేమ్షో కాన్సెప్ట్నే... ఈ సినిమాకూ తీసుకున్నారు యాంకర్ ఓంకార్. ఇవాళ టీవీల్లో ఫేమస్ అయిన ‘బిగ్ బాస్’ తరహా గేమ్షోను ఆశ్రయించారు. అక్కడ బాహ్య ప్రపంచానికి దూరంగా ఒక ఇంట్లో అభ్యర్థులందరూ ఉండడమనే కాన్సెప్ట్కు ఇక్కడ దయ్యాలున్న రాజమహల్ను పెట్టుకున్నారు. పేరుకిది హార్రర్ జానర్ సినిమా అయినా, దానికి సోషల్ క్రైమ్ జత చేసి, సందేశం ఇవ్వాలని చూశారు. ఆ మధ్య వచ్చిన ‘ప్రేమకథా చిత్రమ్’ దగ్గర నుంచి జనరంజక ఫార్ములా అయిన హార్రర్లో ఎంటర్టైన్మెంట్ మిళాయింపు పద్ధతినీ పాటించారు. ఇలా అది కొంత, ఇది కొంత - అంటూ విజయసూత్రాలన్నీ వాడుకోవాలని చూశారు. ఫస్టాఫ్ అంతా హార్రర్ ధోరణిలో ఆసక్తిగా నడిచిపోతుంది. నిజానికి, ఈ సినిమాకు ‘రాజు గారి గది’ అని పేరు పెట్టారు కానీ, మొత్తం మహల్కే తప్ప, ప్రత్యేకంగా ఆ గదికి సినిమాలో ఇచ్చిన ఇంపార్టెన్స్ తక్కువే. క్రైమ్ సీరియల్గా బాగా నప్పే కాన్సెప్ట్ను ఒక చిన్న సినిమాగా తీశారు. మొత్తానికి, రాజు గారి గదిలో ఏముందా అని అతిగా ఊహించుకోకుండా కాసేపు కాలక్షేపానికి వెళితే, ఆశాభంగం తప్పుతుంది. టాయిలెట్ కామెడీల లాంటి జుగుప్సను పక్కన పెడితే, రీరికార్డింగ్ ఎఫెక్ట్లు, ‘షకలక’ శంకర్ కామెడీలతో సర్దుకుపోవచ్చనిపిస్తుంది. -
నా తమ్ముడు రెండు త్యాగాలు చేశాడు!
‘‘దర్శకుడిగా నా తొలి చిత్రం ‘జీనియస్’ను ఆరు కోట్లలో తీయాలనుకుంటే పది కోట్లయ్యింది. దర్శకుడిగా నాకు మంచి పేరొచ్చినా నిర్మాతకు ఆర్థిక సంతృప్తి లభించలేదు. అందుకే ఈసారి వీలైనంత తక్కువ బడ్జెట్లో, తక్కువ టైమ్లో సినిమా తీయాలనుకున్నా’’ అని ఓంకార్ అన్నారు. ఓక్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తన తమ్ముడు అశ్విన్ను హీరోగా పరిచయం చేస్తూ స్వీయదర్శకత్వంలో ఓంకార్ నిర్మించిన చిత్రం ‘రాజుగారి గది’. దసరా కానుకగా ఈ నెల 22న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఓంకార్ మాట్లాడుతూ - ‘‘నా కెరీర్కు మంచి మలుపు అయిన ‘ఆట’ గేమ్ షోలో నా తమ్ముడు అశ్విన్ కూడా పోటీపడ్డాడు. అశ్విన్ గెలిస్తే, షో నాది కాబట్టి గెలిచాడనుకుంటారని తనంతట తానుగా తప్పుకుని, త్యాగం చేశాడు. అలాగే, తనని హీరోగా పెట్టి ఓ సినిమా ప్రారంభిస్తే, నిర్మాతల కోరిక మేరకు వేరే హీరోతో తీయాల్సి వచ్చింది. ఆ విధంగా రెండోసారి కూడా నా తమ్ముడు త్యాగం చేశాడు. అందుకే అశ్విన్ని హీరోగా నిలబెట్టాలనే తపనతో ఈ సినిమా చేశా. నిర్మాతలు సాయి కొర్రపాటి, అనిల్ సుంకర నా సినిమా కొనడం ఆనందంగా ఉంది. ఓ గ్రామంలో ఉన్న మహల్లోకి వెళ్లినవాళ్లందరూ చనిపోతుంటారు. ఏడుగురు వ్యక్తులు ఆ మహల్లోకి వెళితే ఏం జరిగిందన్నది చిత్ర కథాంశం. భయపెడుతూనే నవ్వించే చిత్రమిది’’ అన్నారు. ఈ చిత్రం తర్వాత ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయడానికి కథ రెడీ చేసుకున్నాననీ, ‘రాజుగారి గది’ సీక్వెల్కి స్టోరీ రెడీ చేశానని ఓంకార్ అన్నారు.