Opposition leaders
-
పార్లమెంట్ ఉభయసభల్లో గందరగోళం
-
చంద్రబాబు మోసంపై భగ్గుమంటున్న ప్రతిపక్ష పార్టీలు
-
ప్రణీత్రావు విచారణ కోసం స్పెషల్ టీం
హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ కేసుతో వార్తల్లోకి ఎక్కిన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్ఐబీ) మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్ రావు ఎట్టకేలకు అరెస్ట్ అయ్యారు. అయితే.. ఈ కేసు విచారణ కోసం ఇప్పుడు ప్రత్యేక బృందం ఏర్పాటైంది. జూబ్లీహిల్స్ ఏసీపీ నేతృత్వంలోని ఈ బృందం.. ప్రణీత్రావును విచారణ చేపట్టి.. ఆ వివరాలతో సహా ఆయన్ని కోర్టులో ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ప్రణీత్రావును మంగళవారం రాత్రి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఆయన నివాసంలోనే పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాత్రికిరాత్రి ఆయన్ని హైదరాబాద్కు తరలించారు. ఇక.. ఎస్ఐబీ లాగర్ రూమ్లో హార్డ్డిస్క్లు ధ్వంసం చేసిన తర్వాత నుంచి ప్రణీత్రావు పక్కా ప్లాన్తో వ్యవహరించినట్లు తెలిసింది. గత నెలలో రాజన్న సిరిసిల్ల జిల్లా డీసీఆర్బీలో రిపోర్ట్ చేశారు. అక్కడ జాయిన్ అయిన రెండు రోజులకే సిక్ లీవ్ పెట్టినట్లు సమాచారం. సస్పెన్షన్కు వారం రోజుల ముందు నుంచే డీసీఆర్బీకి వెళ్లలేదని సమాచారం. సిరిసిల్ల హెడ్క్వార్టర్ను విడిచి వెళ్లరాదని సస్పెన్షన్ ఉత్తర్వుల్లో పేర్కొనప్పటికీ ఆయన తప్పించుకుని తిరుగుతున్నట్లు తేలింది. ఈ క్రమంలోనే ప్రణీత్రావు కోసం శ్రీనగర్ కాలనీలోని ఇంటి వద్ద పోలీసులు నిఘా పెట్టారు. ఇదీ చదవండి: అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నాడు.. ప్రణీత్రావు చేసిన నిర్వాకమిది! మంగళవారం రాత్రి ప్రణీత్ రావు ఇంటికి వచ్చిన విషయం గుర్తించి దాడి చేసి, ఆయనను అరెస్టు చేశారు. ఆయన వద్ద ఉన్న సెల్ ఫోన్లను సీజ్ చేశారు. స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చి ప్రణీత్రావును హైదరాబాద్కు తరలించారు. స్టేట్ మెంట్ రికార్డ్ చేసిన అనంతరమే ఆయన్ని నాంపల్లి కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉంది. ఎస్ఐబీలో కీలక సమాచారాన్ని ధ్వంసం చేశారనే ఆరోపణలపై.. ఎస్ఐబీ అడిషనల్ ఎస్పీ రమేశ్ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆదివారం ఎఫ్ఐఆర్ నమోదైన సైతం అయ్యింది. అంతకు ముందు.. ఆయన పోలీసుల అదుపులోనే రహస్య ప్రదేశంలో ఉన్నారని.. విచారణ జరుగుతోందన్న ప్రచారం నడిచింది. అయితే ప్రణీత్ రావు కోసం రెండ్రోజులుగా పంజాగుట్ట పోలీసులు సిరిసిల్లలోనే మకాం వేసినట్లు ఇప్పుడు తేలింది. ప్రణీత్రావుతో పాటు ఆయనకు సహకరించిన పలువురు అధికారుల్ని సైతం ప్రత్యేక టీం విచారణ చేపట్టే అవకాశాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. -
Russia: ప్రతిపక్ష నేతలకు పుతిన్ భయం..!
మాస్కో: పుతిన్ విమర్శకుడు, రష్యా ప్రతిపక్షనేత అలెక్సీ నావల్ని(47) శుక్రవారం దేశంలోని ఆర్కిటిక్ జైలులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు అనుమానాస్పద స్థితిలో మరణించిన,జైలు శిక్షలు పడిన, దేశ బహిష్కరణకు గురైన రష్యా ప్రతిపక్షనేతల ఉదంతాలు మళ్లీ చర్చనీయాంశమయ్యాయి. పుతిన్ తీవ్ర విమర్శకుడిగా పేరొందిన మాజీ డిప్యూటీ సీఎం బొరిస్ నెమ్సోవ్ 2015లో మాస్కోలోని క్రెమ్లిన్ భవనం సమీపంలోని బ్రిడ్జిపై నడుస్తూ వెళుతుండగా దుండగులు తుపాకీతో కాల్చి చంపారు. ఈ కేసులో ఐదుగురికి శిక్ష పడినప్పటికీ వీరి వెనుక ఉన్న మాస్టర్మైండ్ ఎవరన్నది ఇప్పటికీ తెలియలేదు. నెమ్సోవ్ మంచి వక్త. పుతిన్ విధానాలను తీవ్రంగా విమర్శించడమే కాక ఎప్పటికప్పుడు ఆందోళనలు నిర్వహించేవారు. రష్యా ప్రతిపక్ష నేతల్లో ఒకరైనా వ్లాదిమిర్ కరాముర్జా(42)కు 2023 ఏప్రిల్లో సుదీర్ఘంగా 23 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఈ జైలు శిక్షను కేవలం రష్యా ఉక్రెయిన్, యుద్ధంపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగాను దేశద్రోహం కేసులో విధించారు. ఉక్రెయిన్పై రష్యా చేసిన దాడి మీద విమర్శలు చేసినందుకుగాను మరో ప్రతిపక్ష నేత ఇల్యా యాషిన్కు 2022 డిసెంబర్లో ఎనిమిదిన్నర సంవత్సరాల జైలు శిక్ష పడింది. తాజాగా జైలులో మరణించిన నావల్ని అనుచరుడు లిలియా చన్యాషెవాకు 2023లో ఏడున్నరేళ్ల జైలు శిక్ష విధించారు. పుతిన్ను విమర్శించి దేశ బహిష్కరణకు గురైన వారు కూడా చాలా మందే ఉన్నారు. ఆయిల్ రంగంలో వ్యాపార దిగ్గజం మిఖాలీ పదేళ్ల జైలు శిక్ష తర్వాత లండన్ వెళ్లిపోయారు. ఉక్రెయిన్తో యుద్ధం ప్రారంభమైన తర్వాత విమర్శలు గుప్పించిన వారందరూ ఇప్పుడు ప్రపంచంలోని పలు దేశాలకు వెళ్లి బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. పుతిన్కు వ్యతిరేకంగా వార్తలు రాసిన ఇండిపెండెంట్ మీడియా జర్నలిస్టులపై చాలా మంది మీద ఫారెన్ ఏజెంట్లుగా ముద్ర వేశారు. ఇదీ చదవండి.. జైలులోనే మృతి చెందిన పుతిన్ ప్రత్యర్థి నావల్ని -
రామ మందిర ప్రతిష్టాపన: విపక్ష నేతలకు ఆహ్వానం
లక్నో: అయోధ్యలో జనవరి 22న జరగనున్న రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి కీలక విపక్ష నేతలకు కూడా ఆహ్వానం అందింది. కాంగ్రెస్ సీనియర్ నేతలు సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్, మల్లికార్జున్ ఖర్గే, అధిర్ రంజన్ చౌదరి, జేడీ(ఎస్) అధినేత దేవేగౌడలకు ఆహ్వానాలు పంపినట్లు విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్ తెలిపారు. రానున్న రోజుల్లో మరింత మంది విపక్ష నేతలకు ఆహ్వానాలు అందే అవకాశం ఉందని సమాచారం. అయితే.. ఈ కార్యక్రమానికి విపక్ష నేతలు గౌర్హాజరయ్యే అవకాశం ఉంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ వేడుకకు హాజరవనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన సన్నాహాలు ఇప్పటికే జోరందుకున్నాయి. జనవరి 15 నాటికి ఏర్పాట్లన్నీ పూర్తి కానున్నాయి. ప్రాణ ప్రతిష్ట పూజ జనవరి 16న ప్రారంభమై జనవరి 22కు ముగియనుంది. రామ మందిర ప్రతిష్ఠాపన వేడుకలో భాగంగా జనవరి 17న 100 దేవతా విగ్రహాలతో శ్రీరాముడి జీవితంలోని దృశ్యాలను ప్రదర్శిస్తూ ఊరేగింపు ఉంటుంది. ఈ ఊరేగింపులో శ్రీరాముడు పుట్టినప్పటి నుంచి వనవాసం వరకు సాగిన జీవితం, లంకపై విజయం, అయోధ్యకు తిరిగి రావడం వంటి చిత్రాలు ఉంటాయని ప్రధాన శిల్పి రంజిత్ మండల్ తెలిపారు. ఇదీ చదవండి: లాలూ, తేజస్వీలకు ఈడీ సమన్లు -
ప్రతిపక్షాలవి చిల్లర రాజకీయాలు
రాంగోపాల్పేట్ (హైదరాబాద్): ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి కత్తిదాడికి గురై ప్రాణాపాయ స్థితిలో ఉంటే ప్రతిపక్ష నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్రావు మండిపడ్డారు. మంగళవారం ఆయన సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి వచ్చి వైద్యులతో మాట్లాడి ప్రభాకర్రెడ్డి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే ఆయనతో కొద్దిసేపు ముచ్చటించి ధైర్యం చెప్పారు. అనంతరం హరీశ్రావు విలేకరులతో మాట్లాడుతూ.. కత్తితో పొడవడంతో కత్తి 3 అంగుళాలు లోపలికి వెళ్లగా 4 చోట్ల చిన్నపేగుకు గాయమైందన్నారు. 15 సెం.మీ. చిన్న పేగును తొలగించి, మూడున్నర గంటలపాటు వైద్యులు శస్త్ర చికిత్స చేశారని చెప్పారు. ఇటువంటి సమయంలో సీనియర్ నాయకులు కూడా దీన్ని అపహాస్యం చేసేలా కోడి కత్తి అంటూ మాట్లాడటం దురదృష్టకరమన్నారు. దివాళాకోరు రాజకీయాలు చేస్తున్న పార్టీలకు ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. వ్యక్తులను నిర్మూలించి రాజకీయాలు చేయాలనుకోవడం తెలంగాణలో ఎప్పుడూ లేదని, తాము అధికారంలో ఉన్న ఏ రోజూ పగతో వ్యవహరించలేదన్నారు. పగతో రాజకీయాలు చేస్తే గతంలో హౌజింగ్ స్కీముల్లో స్కాములు చేసిన కాంగ్రెస్ నాయకులు, ఓటుకు నోటుకు కేసులో దొరికిన వాళ్లు ఎప్పుడో జైలుకు వెళ్లేవారని చెప్పారు. రాష్ట్రంలో ఏదోరకంగా అల్లర్లు చేయాలని, ప్రజలను భయబ్రాంతులకు గురిచేయాలని ప్రతిపక్ష నాయకులు చూస్తున్నారని, ప్రజలు వీటిని గమనించాలని సూచించారు. ప్రచారంలో ఉన్న అభ్యర్థులపై ఇలాంటి దాడులు జరుగుతున్నాయని, అభ్యర్థులకు భద్రత పెంచాలని ఎన్నికల కమిషన్ను కోరారు. ఈ కేసులో కుట్రకోణం రెండు మూడు రోజుల్లో బయటకు వస్తుందని, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. ప్రభాకర్రెడ్డిని పరామర్శించిన వారిలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, మహమూద్ అలీ, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్రెడ్డి, మర్రి జనార్ధన్రెడ్డి తదితరులు ఉన్నారు. మరో నాలుగు రోజులు ఐసీయూలో మరో నాలుగు రోజుల పాటు ప్రభాకర్రెడ్డిని ఐసీయూలోనే ఉంచి చికిత్స అందించాల్సి ఉంటుందని సికింద్రాబాద్ యశోద ఆస్పత్రి హెడ్ డాక్టర్ విజయ్కుమార్, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్టు ప్రసాద్బాబు తెలిపారు. ప్రస్తుతం ఆయన స్పృహలోనే ఉన్నాడని, మరో మూడు నాలుగు రోజులు గడిస్తేనే ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందో లేదో చెప్పగలమన్నారు. -
సభ నుంచి ఎమ్మెల్యే సీతక్క వాకౌట్.. బీఆర్ఎస్పై సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో ఏం జరుగుతుందో అర్దం కావడం లేదంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. సభలోకి వచ్చిన తర్వాత కూడా బిజినెస్ గురించి చెప్పడం లేదని మండిపడ్డారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని, జీరో అవర్లో కూడా మాట్లాడనివ్వడం లేదని ఆరోపించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా చాలా మంది తమ సమస్యలు అసెంబ్లీలో మాట్లాడాలని మాకు చెప్తున్నారు.. కానీ మాకు అవకాశం ఇవ్వకపోతే మేము ఎలా మాట్లాడేదని ప్రశ్నించారు. అసెంబ్లీ నిర్వహాణ పట్ల ఎమ్మెల్యే సీతక్క అసంతృప్తి వ్యక్తం చేశారు. తమకు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ సభ నుంచి వెళ్లిపోయారు. అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆమె మాట్లాడుతూ.. ‘సభలో అధికార పార్టీ బుల్డోజ్ చేస్తుంది. బీఆర్ఎస్ నేతలు అసత్యాలు మాట్లాడుతున్నారు. మిషన్ భగీరథ నీళ్లు ఇస్తే.. ప్రతీ ఊళ్ళో వాటర్ ప్లాంట్లు ఎందుకు పెట్టుకుంటున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎంత సేపు మాట్లాడినా మైక్ కట్ చేయరు. మాకు ఓక నిమిషం మాట్లాడితే మైక్ కట్ చేస్తున్నారు. అసెంబ్లీలో లేని రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతున్నారు. ఎన్నికల ప్రచారం కోసం అధికార పార్టీ సభను వాడుకుంటుంది. నాలుగున్నర సంవత్సరాల క్రితం ఎన్నికైన సభ్యులు సభలో ఉంటే 9 ఏళ్ళ ప్రగతి గురించి చర్చ ఎలా చేపడుతున్నారు. సమస్యలు లేనప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు జీరో అవర్లోలో ఎందుకు అవకాశం ఇస్తున్నారు. సభ నిర్వాహణ మాలాంటి వారికి భాధ కలిగిస్తుంది’ అని వ్యాఖ్యానించారు. చదవండి: ఎన్నికల వేళ ఇదేం గోల?.. కాంగ్రెస్ నేతలకు క్లాస్.. అయినా! -
టీకా వేయించుకున్నారా? డాటా లీక్
కొవిన్ యాప్లో పౌరుల వ్యక్తిగత సమాచారం లీక్ అయిందని టీఎంసీ నేత సాకేత్ గోఖలే ఆరోపించారు. ఇది మోదీ ప్రభుత్వం అతి పెద్ద గోప్యతా ఉల్లంఘన అని అన్నారు. కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నవారి వ్యక్తిగత వివరాలు బహిరంగంగా లభ్యమవుతున్నాయని ఆరోపించారు. ఎన్సీపీ నేత సుప్రియా సూలే, కాంగ్రెస్ నేత చిదంబరం సైతం ఈ వ్యవహారంపై స్పందించారు. టీకా పొందినవారి వ్యక్తిగత వివరాలు ఇక టెలిగ్రామ్లో లభ్యమయ్యేలా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. Cowin Portal से डाटा हुआ लीक? करोड़ों लोगों की पर्सनल डिटेल टेलीग्राम पर आई!अब तक मोदी सरकार देश की संपत्ति ही बेच रही थी, पर अब तो.... pic.twitter.com/NnCPnuT9YT— Rashtriya Janata Dal (@RJDforIndia) June 12, 2023 బాధ్యులెవరు? 'కొవిడ్ టీకా తీసుకున్నప్పుడు ఆధార్, ఫోన్ నెంబర్లు,పాస్పోర్టు వివరాలు,ఓటర్ ఐడీతో సహా కుటుంబ వివరాలు అన్ని నమోదు చేశారు. దేశంలో ప్రముఖ వ్యక్తుల వివరాలు కూడా అందులో ఉన్నాయి. కొవిన్ డేటా వివరాలు ఎలా బయటకు వచ్చాయి? ఎవరు ఇందులో పాలుపంచుకున్నారు? ప్రజల ముందు ఈ విషయాన్ని ఎందుకు దాస్తున్నారు?' అని సాకేత్ గోఖలే కేంద్రాన్ని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై స్పందించిన సుప్రియా సూలే.. 'ఇది చాలా దురదృష్టకరమైన విషయం. ఎట్టిపరిస్థితుల్లో క్షమార్హం కాని నేరం' అని ఆమె అన్నారు. ఈ వ్యవహారంపై కేంద్రం స్పందించి దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. అదేం లేదు.. కొవిన్ యాప్లో ఎలాంటి వ్యక్తిగత వివరాలు లేవని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. టీకా తీసుకునే సమయంలో కేవలం వ్యాక్సిన్ తీసుకునే తేదీని మాత్రమే సేకరించినట్లు తెలిపారు. ప్రతిపక్ష ఆరోపణలపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ దర్యాప్తు చేస్తోందని వెల్లడించారు. Co-WIN portal of Health Ministry is completely safe with safeguards for data privacy. All reports of data breach are without any basis and mischievous in nature. Health Ministry has requested CERT-In to look into this issue & submit a report: Government of India pic.twitter.com/hXbTpl3FNU— ANI (@ANI) June 12, 2023 ఇదీ చదవండి:వీడియోలెందుకు తీస్తున్నావ్.. భారత్లో విదేశీయుడికి చేదు అనుభవం -
23న విపక్ష పార్టీల భేటీ.. కేసీఆర్కు అందని ఆహ్వానం
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనే కార్యాచరణ సిధ్దం చేసేందుకు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్ ఏర్పాటు చేసిన ప్రతిపక్ష అగ్రనేతల సమావేశం ఈ నెల 23న పాట్నాలో జరుగనుంది. ఈ నెల 12నే విపక్ష నేతల సమావేశం జరగాల్సి ఉన్నా, కాంగ్రెస్ సహా ఇతర పార్టీల ముఖ్య నేతలు అందుబాటులో లేకపోవడంతో ఈ భేటీని 23న నిర్వహించనున్నట్లు జేడీయూ అధ్యక్షుడు లాలన్ సింగ్ ప్రకటించారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, తమిళనాడు సీఎం స్టాలిన్, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, శివసేన (యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ–ఎంఎల్ జాతీయ కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్యలు హాజరు కానున్నారు. కాగా ఈ భేటీకి బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావుకు జేడీయూ నేతలు ఆహ్వానం పంపలేదు. గత ఏడాది ఆగస్టులో బిహార్లో నితీశ్కుమార్తో భేటీ నిర్వహించిన కేసీఆర్, బీజేపీ ముక్త్ భారత్ౖMðకలిసి పోరాడతామని ప్రకటించారు. అయితే అనంతరం వివిధ కారణాలతో రెండు పార్టీల మధ్య ఎలాంటి చర్చలు జరుగలేదు. తాజా భేటీకి ఆహ్వానం పంపలేదు. ఈ భేటీలో లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉమ్మడి కార్యాచరణ తీసుకునే అంశంపై చర్చించనున్నారు. హాజరవుతున్నా: శరద్ పవార్ బిహార్ సీఎం నితీశ్కుమార్ బుధవారం తనకు ఫోన్ చేసి ఆహ్వానించారని, విపక్షాల భేటీకి తాను హాజరవుతానని ఎన్సీపీ అధినేత శరద్పవార్ గురువారం తెలిపారు. పలు జాతీయ అంశాలపై కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని, అది విపక్షాల బాధ్యతని పవార్ అన్నారు. -
సస్పెండ్ ఎంపీల రాత్రి జాగారం.. 50 గంటల్లో పొద్దున్నే ఇలా..
సాక్షి, న్యూఢిల్లీ: నిత్యావసరాల ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం, జీఎస్టీ వంటి అంశాలు పార్లమెంట్ ఉభయ సభలను కుదిపేస్తున్నాయి. వీటిపై తక్షణమే చర్చ చేపట్టాలని, ప్రభుత్వం సమాధానం చెప్పాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. బుధవారం సైతం ప్రతిపక్ష సభ్యులు పట్టువీడకపోవడంతో ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగింది. ధరలపై చర్చకు సిద్ధమని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ వారు వెనక్కి తగ్గలేదు. ఎంపీలపై సస్సెన్షన్ ఎత్తివేయాలంటూ ఆందోళన చేపట్టారు. బుధవారం రాజ్యసభ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుడు సంజయ్సింగ్ను సభాపతి సస్పెండ్ చేశారు. దీంతో ఉభయ సభల నుంచి బహిష్కరణకు గురైన విపక్ష ఎంపీల సంఖ్య 24కి చేరింది. సస్పెండైన ప్రతిపక్ష ఎంపీలు బుధవారం పార్లమెంట్ ప్రాంగణంలో గాంధీ విగ్రహం వద్ద రిలే నిరసన ప్రారంభించారు. 50 గంటల పాటు నిరసన కొనసాగిస్తామన్నారు. 20 మంది రాజ్యసభ ఎంపీలకు నలుగురు లోక్సభ ఎంపీలూ తోడయ్యారు. వారికి విపక్షాలు ఆహారం, నీరు అందిస్తున్నాయి. నిరసనలో టీఆర్ఎస్ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పాల్గొన్నారు. పలు పార్టీల నేతలు రాజ్యసభ చైర్మన్ వెంకయ్యను కలిసి సస్సెన్షన్ ఎత్తేయాలని కోరారు. సదరు ఎంపీలు విచారం వ్యక్తం చేస్తేనే అది సాధ్యమని ఆయన చెప్పారు. అందుకు వారు తిరస్కరించారు. కాగా, నిరసనల్లో భాగంగా ఎంపీలందరూ పార్లమెంట్ ఆవరణలోనే నిద్రించారు. కాగా, రాత్రంతా జాగారం చేసినట్టు తెలుస్తోంది. పార్లమెంట్ వద్దే గురువారం ఉదయమే 6 గంటలకు టీ, 8 గంటలకు టిఫిన్ చేసినట్టు సమాచారం. దీనికి సంబంధించిన వీడియోను కాంగ్రెస్ నేతలు ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. #WATCH | Delhi: The 50-hour long day-night protest of suspended MPs continues at the Gandhi statue at Parliament. (Video Source: Opposition MP) pic.twitter.com/F2Tpu6q8WU — ANI (@ANI) July 28, 2022 విపక్షాల నోటీసుల తిరస్కరణ రాజ్యసభ ప్రారంభమైన వెంటనే ఛైర్మన్ వెంకయ్య నాయుడు విపక్ష ఎంపీల నోటీసులను తిరస్కరించారు. 19 మంది సభ్యుల సస్పెన్షన్ అంశాన్ని ప్రతిపక్ష ఎంపీలు లేవనెత్తడంతో సభ మధ్యాహ్నానికి వాయిదా పడింది. తర్వాత మంగళవారం పోడియంపై కాగితాలు చించి విసిరేసినందుకు సంజయ్ సింగ్ను సస్పెండ్ చేస్తూ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్సింగ్ తీర్మానం ఆమోదించారు. అయినా సింగ్ సభలోనే ఉండిపోయారు. దీనిపై రగడతో సభ గురువారానికి వాయిదా పడింది. లోక్సభలోనూ టీఆర్ఎస్ సహా విపక్ష ఎంపీలు వెల్లోకి దూసుకెళ్లి ఆందోళనకు దిగారు. సస్పెన్షన్ను ఎత్తివేయాలని ఆందోళన చేయడం రెండుసార్లు వాయిదాకు దారి తీసింది. ప్లకార్డులు ప్రదర్శించకుంటే సస్పెన్షన్ను ఎత్తేస్తామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ అన్నారు. ధరలపై వచ్చేవారం చర్చ! మోదీ సర్కారు దిగొచ్చి విపక్షాల డిమాండ్ మేరకు ధరల పెరుగుదల, సామాన్య ప్రజల కష్టాలపై పార్లమెంట్లో చర్చకు సిద్ధపడే సంకేతాలు కనిపిస్తున్నాయి. చర్చకు తాము సిద్ధమని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ వెల్లడించారు. ధరలపై వచ్చేవారం చర్చ ఉండొచ్చని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. Congress, DMK, TMC, CPM & AAP MPs from both Houses on 50 hour continous dharna by turns in Parliament precincts. They are protesting their suspension for demanding URGENT debate on price rise and GST on food items. (1/2) pic.twitter.com/4IhWLZlaGY — Jairam Ramesh (@Jairam_Ramesh) July 27, 2022 -
కేంద్రం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోంది
న్యూఢిల్లీ: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను రాజకీయ విరోధులపైకి ఉసిగొల్పుతోందని ప్రతిపక్ష నేతలు ఆరోపించారు. ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకోవాలని వారు మంగళవారం నూతన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు రాసిన లేఖలో కోరారు. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీని ఈడీ ప్రశిస్తున్న సమయంలో వారీ లేఖ రాయడం గమనార్హం. ధరల పెరుగుదల, జీఎస్టీ వంటి అంశాలపై తక్షణమే చర్చ చేపట్టాలన్న తమ డిమాండ్ను పట్టించుకోకుండా మొండిగా వ్యవహరిస్తుండటం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలపై ప్రభావం చూపుతోందని వివరించారు. ఈ లేఖపై కాంగ్రెస్, డీఎంకే, ఎస్పీ, ఆప్, ఆర్జేడీ, సీపీఎం నేతలు సంతకాలు చేశారు. ‘చట్టం ముందు అందరూ సమానమే. కానీ, ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీల నేతలకు వ్యతిరేకంగా ఏకపక్షంగా, పక్షపాత ధోరణితో చట్టాలను అమలు చేస్తున్నారు. వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. -
ప్రభుత్వం మా గొంతు నొక్కుతోంది: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ
న్యూఢిల్లీ: దేశ నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగడుతూ.. విపక్షాలు లేఖ రాశాయి. ఈ మేరకు ఆయా పార్టీల ఎంపీల సంతకాలతో కూడిన లేఖను మంగళవారం విడుదల చేశాయి. దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని విపక్షాలు లేఖలో ఆరోపించాయి. రాజకీయ ప్రత్యర్థులపై కేంద్రం ఈడీ, సీబీఐలను ఉసిగొల్పుతుందని విపక్షపార్టీలు పేర్కొన్నాయి. అలాగే పార్లమెంట్ లో నిత్యావసర ధరల పెరుగుదలపై చర్చ జరపాలని విపక్షాలు లేఖలో కోరాయి. ప్రజా సమస్యలపై చర్చించకుండా కేంద్రం ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుందని విపక్షాలు రాష్ట్రపతికి లేఖలో తెలిపాయి. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును విపక్షాలు కోరాయి. Opposition leaders write to @rashtrapatibhvn on stalemate in Parliament and "misuse" of investigating agencies by govt. @IndianExpress pic.twitter.com/igaQeOVszK — Manoj C G (@manojcg4u) July 26, 2022 -
మనమంతా ఏకమవుదాం..విపక్ష నేతలకు మమతా బెనర్జీ పిలుపు..!!
-
లంకలో కల్లోలం
కొలంబో: అల్లకల్లోలంగా మారిన ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దేందుకు శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్సే పలు చర్యలను ప్రకటించారు. కేంద్ర కేబినెట్లో చేరాల్సిందిగా ప్రతిపక్షాలను ఆయన సోమవారం ఆహ్వానించారు. ఆయన ఆహ్వానాన్ని ప్రతిపక్షాలు తిరస్కరించాయి. ప్రతిపక్షాలను ప్రభుత్వంలో చేరమని గొటబయ ఆహ్వానించడం ఒక డ్రామా అని ప్రతిపక్ష నేత సమగి జన బలవేగయ విమర్శించారు. సజిత్ ప్రేమదాస, మనో గణేసన్ తదితర విపక్ష నేతలు సైతం ఈ అఖిల పక్ష ప్రభుత్వ యోచనను తిరస్కరించారు. గొటబయ తమ్ముడు, లంక ఆర్థిక మంత్రి బసిల్ రాజపక్సేను ఆర్థిక మంత్రి పదవి నుంచి అధ్యక్షుడు స్వయంగా తొలగించారు. బసిల్ స్థానంలో ప్రస్తుత న్యాయమంత్రి ఆలి సబ్రేను నియమించారు. బెయిల్ అవుట్ ప్యాకేజీపై చర్చించేందుకు బసిల్ సోమవారం అమెరికా వెళ్లి ఐఎంఎఫ్తో చర్చలు జరపాల్సిఉంది. భారత రిలీఫ్ ప్యాకేజీపై కూడా బసిలే చర్చలు జరిపారు. అయితే బసిల్ చర్యలపై లంక అధికార పక్షం ఎస్ఎల్పీపీ కూటమిలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీంతో అధ్యక్షుడు బసిల్ను తొలగించినట్లు తెలిసింది. ఆదివారం కేబినెట్లోని మొత్తం 26మంది మంత్రులు తమ రాజీనామాలను సమర్పించారు. అనంతరం కొత్తగా కొందరు మంత్రులు పదవీ స్వీకారం చేశారు. కేంద్ర బ్యాంకు గవర్నర్ రాజీనామా లంక కేంద్ర బ్యాంకు గవర్నర్ అజిత్ నివార్డ్ కబ్రాల్ సోమవారం రాజీనామా చేశారు. గతేడాది సెప్టెంబర్లో కబ్రాల్ ఈ పదవిని స్వీకరించారు. గతంలో ఆయన కేంద్ర సహాయ ఆర్థిక మంత్రిగా పనిచేశారు. 2006–15 కాలంలో ఆయన కేంద్రబ్యాంకు గవర్నర్గా వ్యవహరించారు. రెండోదఫా గవర్నర్ పదవి స్వీకరించాక ఆయన విదేశీ రుణాలపై ఆధారపడడాన్ని తగ్గించే యత్నాలు చేశారు. సంక్షోభం ముదురుతున్నా బెయిలవుట్ను వ్యతిరేకించారు. ప్రస్తుతం ద్రవ్యోల్బణం ఆల్టైమ్ గరిష్టాలకు చేరింది. మితిమీరి కరెన్సీ ముదణ్రకు కబ్రాల్ అనుమతివ్వడమే ఇందుకు కారణమన్న ఆరోపణలున్నాయి. కబ్రాల్ వ్యతిరేకతను పట్టించుకోకుండాప్రభుత్వం ఇటీవల ఐఎంఎఫ్ను సాయం ఆర్థించింది. లాఠీ చార్జి, బాష్పవాయు ప్రయోగం ప్రధాని మహింద రాజపక్సే ఇంటిని చుట్టుముట్టిన ఆందోళనకారులను చెదరకొట్టేందుకు పోలీసులు లాఠీ చార్జి, బాష్పవాయు ప్రయోగానికి దిగారు. కర్ఫ్యూ ఆదేశాలను లెక్కచేయకుండా దాదాపు 2వేల మందికి పైగా ఆందోళనకారులు తంగాలె లోని మహింద ఇంటిని చుట్టుముట్టారు. ఆయన వెంటనే రాజీనామా చేయాలని వీరు డిమాండ్ చేశారు. వీరిపై పోలీసులు బలపయ్రోగానికి దిగారు. నిజానికి ఈ ప్రాంతంలో రాజపక్సే కుటుంబానికి చాలా పట్టు ఉంది. అయితే సంక్షోభం ముదిరిపోయి జీవితాలు అస్థవ్యస్థమవుతుండడంతో సాధారణ ప్రజల్లో మహిందపై వ్యతిరేకత ప్రబలిందని నిపుణులు భావిస్తున్నారు. దేశంలో రాజపక్సే కుటుంబానికి వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. గొటబయ రాజీనామా కోరుతూ ప్రజలు వీధుల్లో ఆందోళనకు దిగుతున్నారు. దీంతో దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు గొటబయ ప్రకటించారు. -
రాష్ట్రాన్ని శపించకండి: మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘నేతలు, పార్టీలు, పదవులు శాశ్వతం కాదు. కానీ రాష్ట్రం శాశ్వతం.. దాని పురోగతి శాశ్వతం. శాశ్వతంగా ఉండే రాష్ట్రాన్ని రాజకీయం కోసం శపించకండి. ఇటీవల మరీ కుసంస్కారంగా మాట్లాడే కొందరు నేతలు పుట్టుకొచ్చారు. దారుణంగా మాట్లాడుతున్నారు. తెలంగాణ పురోగతిలో దేశంలోనే ముందువరుసలోకి దూసుకు పోతుండటంతో వారు సహించలేకపోతున్నారు. నన్ను వ్యక్తిగతంగా దూషిస్తే దీవెనలుగా సర్దుకుపోతా, కానీ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసేలా మాట్లాడకండి. రాజకీయాలు వేరు, రాష్ట్ర పురోగతి వేరు..’అని ప్రతిపక్ష నేతలకు పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ హితవు పలికారు. సోమవారం శాసనసభలో పరిశ్రమలు, ఐటీ అంశంపై జరిగిన స్వల్పకాలిక చర్చకు ఆయన సమాధానమిచ్చారు. దేశాన్నే తెలంగాణ సాదుతోంది ‘ఆర్బీఐ తాజాగా విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం.. దేశానికి ఎక్కువ ఆదాయం తెచ్చిపెడుతున్న రాష్ట్రాల్లో తమిళనాడు, కర్ణాటక, బెంగాల్ తర్వాత తెలంగాణ నాలుగో స్థానంలో ఉంది. భౌగోళికంగా, జనాభా పరంగా 12, 11 స్థానాల్లో ఉన్న తెలంగాణ, దేశానికి కాంట్రిబ్యూషన్ విషయంలో నాలుగో స్థానంలో ఉండటంతో దేశాన్నే తెలంగాణ సాదుతోందని అర్థమవుతోంది. ఖాయిలా పడ్డ పరిశ్రమలను తెరిపించేందుకు ఓ వైపు రాష్ట్రం ప్రయత్నిస్తుంటే సహకరించాల్సిన కేంద్రం.. వాటి భూములను తెగనమ్ముకునే పనిలో ఉంది, ప్రైవేటుపరం చేస్తే ప్రోత్సాహకాలిస్తానంటోంది. మా విధానం ‘స్టార్టప్’అయితే, కేంద్రం విధానం ‘ప్యాకప్’గా మారింది. స్పీకర్ అనుమతిస్తే రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులపై చర్చకు సిద్ధమే..’అని కేటీఆర్ ప్రకటించారు. 3ఐ మంత్రం నిజం చేస్తున్నాం ‘డిజిటల్ విప్లవాన్ని ప్రపంచంలోనే నవయువకుల జనాభా ఎక్కువగా ఉన్న దేశంగా మనం అద్భుతంగా ఒడిసిపట్టుకునే వీలుంది. గతంలో ప్రధాని నిర్వహించిన ఓ సమావేశంలో నేనూ పాల్గొన్నా. ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్క్లూజివ్ గ్రోత్ అనే 3ఐ మంత్రం గురించి వివరించా. అదే మంత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిజం చేసి చూపుతోంది. 4 కోట్ల జనాభాలో 2 శాతం మందికి మించి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వటం సాధ్యం కాదు. అందుకే ప్రైవేటు పెట్టుబడులను గరిష్టంగా తెచ్చి ప్రైవేటు రంగంలో ఉపాధికి మెరుగైన బాటలు వేసే ప్రయత్నం చేస్తున్నాం..’అని మంత్రి తెలిపారు. తెలంగాణ వైపు చూస్తున్న కంపెనీలు ‘ప్రముఖ విదేశీ కంపెనీలు వాటి రెండోస్థాయి కేంద్రాలకు హైదరాబాద్ను ఎంచుకుంటున్నాయి. ప్రపంచ ఐటీ దిగ్గజాల్లో టాప్ ఐదు కంపెనీలు వాటి రెండో ప్రధాన కార్యాలయాలను హైదరాబాద్లో నెలకొల్పాయి. ఇతర రాష్ట్రాల్లో ఉన్న పెద్దపెద్ద కంపెనీలు కూడా వాటి విస్తరణకు తెలంగాణ వైపు చూస్తున్నాయి. ఇందుకు టీఎస్–ఐపాస్ లాంటి పారదర్శక విధానాలు, నిరంతరాయ విద్యుత్తు సరఫరా వంటివే కారణం. ఎప్పుడో తెలంగాణ ప్రారంభించిన టీఎస్–ఐపాస్ను అనుసరిస్తూ తాజాగా కేంద్రం కూడా అనుమతుల కోసం సింగిల్ విండో విధానాన్ని ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. టీఎస్ ఐపాస్ ద్వారా ఇప్పటివరకు 17,302 పరిశ్రమలకు అనుమతిచ్చాం. రూ.2.20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఐటీతో కలుపుకొంటే 19 లక్షల మందికి ఉపాధి లభించింది. ఇక ఉద్యోగాల్లో 70 శాతం స్థానికులకే ఇచ్చే కొత్త పారిశ్రామికవేత్తలకు అదనపు ప్రోత్సాహకాలను కూడా ప్రతిపాదిస్తున్నాం..’అని తెలిపారు. కట్టుకథలతో పెట్టుబడులు రావు ‘నీతి ఆయోగ్, రిజర్వ్ బ్యాంకు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు తమ నివేదికల్లో తెలంగాణ పురోగతిని పొగుడుతున్నాయి. కేంద్రమంత్రులు కూడా మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. కానీ స్థానిక బీజేపీ నేతలు మాత్రం విమర్శలు చేస్తున్నారు. కానీ కట్టుకథలతో పెట్టుబడులు రావు. కఠోర పరిశ్రమతోనే సాధ్యమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా పెద్దవైన 300 కంపెనీలు తెలంగాణలో ఇప్పటికే పెట్టుబడులు పెట్టాయి. కేసీఆర్ విజన్ ఎప్పుడూ గ్రాండ్గానే ఉంటుంది. ముచ్చర్లలో ప్రపంచంలోనే పెద్ద ఫార్మారంగం ఏర్పడుతోంది. అమెరికా అధ్యక్షుడు బైడెన్ వాడే హెలికాప్టర్ క్యాబిన్ కూడా తెలంగాణలోనే తయారవుతుంది. ఐటీ, ఎలక్ట్రానిక్స్, టెక్స్టైల్స్, ఫార్మా తదితర 14 ప్రాధాన్యతా రంగాలను ఎంపిక చేసుకుని వాటి తయారీ రంగాన్ని సాకారం చేస్తున్నాం..’అని చెప్పారు. వారి వీడియోల్లోనే అభివృద్ధి కన్పిస్తోంది ‘కొందరు నేతలు పాదయాత్రల పేరుతో మా ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్ల అవతారమెత్తారు. వారు సోషల్ మీడియాలో పెడుతున్న వీడియోల్లోనే ఆయా ప్రాంతాల్లో జరిగిన అద్భుత ప్రగతి తాలూకు దృశ్యాలు కనిపిస్తున్నాయి. వెరసి రాష్ట్రంలో అభివృద్ధి ఎలా జరిగిందో వారే చూపిస్తున్నారు..’అని మంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్ పాతనగర యువత కోసం శిక్షణ కేంద్రం, ఐటీ టవర్ ఏర్పాటుకు కేటీఆర్ హామీ ఇచ్చారు. లక్షల సంఖ్యలో ఉపాధికి ప్రణాళికలు ‘ఉమ్మడి రాష్ట్రంలో 23,650 ఎకరాల్లో పారిశ్రామికవాడలు ఏర్పడితే, తెలంగాణ వచ్చాక టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో 19,961 ఎకరాల్లో పారిశ్రామిక పార్కులు ఏర్పడ్డాయి. ఈ ఏడాది కొత్తగా 56 పార్కులు అందుబాటులోకి వస్తాయి. ఐటీ రంగంలో ఐదేళ్లలో 5 లక్షల మందికి ఉపాధి అందేలా ప్రణాళికలు అమలులోకి తెస్తున్నాం. లైఫ్ సైన్సెస్ రంగంలో 4 లక్షల మందికి ఉపాధి దక్కేలా లక్ష్యం నిర్ధారించుకున్నాం. కొత్తగా బీ–హబ్ ఏర్పాటు చేస్తున్నాం. మహబూబ్నగర్ దివిటిపల్లిలో ఎనర్జీ పార్కును, సంగారెడ్డి సమీపంలోని శివానగర్లో ఎల్ఈడీ పార్కును ప్రారంభించనున్నాం. చేవెళ్ల సమీపంలో ఎలక్ట్రిక్ బస్సుల తయారీ సంస్థలు వస్తున్నాయి. చైనా, బంగ్లాదేశ్ను ఢీకొనేలా దేశంలోనే పెద్దదైన కాకతీయ టెక్స్టైల్ పార్కుకు రూపకల్పన చేశాం. రామగుండం ఎరువుల కంపెనీ పునరుద్ధరణకు చర్యలు తీసుకున్నాం. దీని ప్రారంభోత్సవానికి ప్రధాని వచ్చే అవకాశం ఉంది..’అని కేటీఆర్ తెలిపారు. కేంద్రం స్పందించలేదు ‘ఐడీపీఎల్ పునరుద్ధరణ సాధ్యం కాదని కేంద్రం తేల్చింది. ఐదు ఇండస్ట్రియల్ కారిడార్లు, ఫార్మా సిటీకి రూ.వేయి కోట్ల సాయం, ఐటీఐఆర్ పునరుద్ధరణ, కాజీపేటలో రైల్వేకోచ్ ఫ్యాక్టరీ, పసుపు బోర్డు కోసం కోరితే స్పందించలేదు..’అని విమర్శించారు. -
2024 ఎన్నికలే అంతిమ లక్ష్యం: సోనియా గాంధీ
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ విపక్ష నేతలతో సమావేశమయ్యారు. శుక్రవారం సాయంత్రం సోనియా అధ్యక్షతన వర్చువల్గా ఈ సమావేశం జరిగింది. కేంద్రంలోని మోదీ సర్కార్పై ఐక్యంగా పోరాడటమే లక్ష్యం ప్రతిపక్ష పార్టీల భేటీ జరిగింది. స్వాతంత్ర్యోద్యమ విలువలు, రాజ్యాంగ సూత్రాలు, నిబంధనలను విశ్వసించే ప్రభుత్వాన్ని అందించాలనే ఏకైక ఉద్దేశ్యంతో పోరాడాలని సోనియా పిలుపు నిచ్చారు. 2024 లోక్సభ ఎన్నికలే లక్ష్యంగా ఐక్యంగా, ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగాలని సోనియా ప్రతిపక్ష పార్టీలను కోరారు. మనందరికీ ఎవరి సిద్దాంతాలు వారికి ఉన్నప్పటికీ వాటన్నిటినీ అధిగమించి దేశ ప్రయోజనాల కోసం ఏకం కావాల్సిన సమయం వచ్చిందన్నారు. ఇదొక చాలెంజ్. ఐకమత్యాన్ని మించిన ప్రత్యామ్నాయం లేదు. 2024 ఎన్నికలే అంతిమ లక్ష్యంగా అందరం కలిసికట్టుగా పోరాడాలని సోనియా సూచించారు. సమాఖ్య వ్యవస్థను, రాజ్యాంగ సంస్థలను దెబ్బతీస్తున్నారంటూ మోదీ సర్కార్పై ధ్వజమెత్తిన ఆమె పరిమితులు, ప్రతి బంధకాలను అధిగమించి ఐక్యంగా పోరాడాలన్నారు. పార్లమెంటులో ప్రతిపక్షాలు ఐక్యతను చాటినట్టుగానే పార్లమెంటు బయట కూడా అదే స్థాయిలో పోరాడాలన్నారు. ప్రతిపక్షాల ఐక్యత వల్ల ప్రభుత్వం వ్యాక్సినేషన్ పాలసీని మార్చుకుందన్న సోనియా మూడు వ్యవసాయ చట్టాలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రోజురోజుకు నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు. కాగా మోదీ సర్కార్ను గద్దె దించడమే లక్ష్యంగా ఇటీవలే విపక్షాలతో సమావేశమైన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పీడ్ పెంచడంతో తాజాగా సోనియా విపక్షాలతో భేటి కావడం విశేషం. -
విపక్ష నేతలతో సోనియా గాంధీ వర్చువల్ సమావేశం
-
రాజకీయ భేటీ కాదు!.. ఎన్సీపీ స్పష్టీకరణ
సాక్షి, న్యూఢిల్లీ: రాజకీయ వర్గాల్లో అనేక ఊహాగానాల మధ్య నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ నివాసంలో రాష్ట్రీయ మంచ్ కీలక భేటీ జరిగింది. మంగళవారం ఢిల్లీలో జరిగిన ఈ సమావేశానికి తృణమూల్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు, రాష్ట్రీయమంచ్ వ్యవస్థాపకుడు యశ్వంత్ సిన్హా అధ్యక్షత వహించారు. ఇది రాజకీయ భేటీ కాదని, భావసారూప్యం కలిగిన పార్టీలు, మేధావుల భేటీగా ఎన్సీపీ పేర్కొంది. కరోనా మహమ్మారి ప్రారంభమైన తరువాత మొదటిసారి పలు ప్రతిపక్ష పార్టీల నాయకులు, సమాజంలోని కీలక వ్యక్తులు రాష్ట్రీయ మంచ్ వేదికపై ప్రత్యక్షంగా ఒకేచోట సమావేశమయ్యారు. ఈ భేటీలో శరద్ పవార్ (ఎన్సీపీ), యశ్వంత్ సిన్హా (తృణమూల్ కాంగ్రెస్), ఒమర్ అబ్దుల్లా (నేషనల్ కాన్ఫరెన్స్), ఘన్శ్యామ్ తివారీ (సమాజ్వాదీ పార్టీ), జయంత్ చౌధరి (రాష్ట్రీయ లోక్దళ్), సుశీల్ గుప్తా (ఆప్), బినోయ్ విశ్వం (సీపీఐ), నీలోత్పల్ బసు( సీపీఎం), సంజయ్ ఝా (కాంగ్రెస్ మాజీ నేత), సుప్రియా సులే (ఎన్సీపీ) వంటి నాయకులతో పాటు జావేద్ అక్తర్, మాజీ బ్యూరోకాట్ కేసీ సింగ్, రిటైర్డ్ జస్టిస్ ఎ.పి. షా వంటి మేధావులతో కలిపి మొత్తం 21 మంది పాల్గొన్నారు. ఈ సమావేశంలో పెట్రోల్ – డీజిల్ ధరల పెరుగుదల, రైతు సమస్యలు, కోవిడ్ మేనేజ్మెంట్, వ్యవస్థలపై దాడి, నిరుద్యోగం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం వంటి అనేక అంశాలను చర్చకొచ్చాయని భేటీలో పాల్గొన్న వారు తెలిపారు. ఈ భేటీ అనంతరం తృణమూల్ కాంగ్రెస్ నేత యశ్వంత్ సిన్హా మాట్లాడుతూ ఈ సమావేశం రెండున్నర గంటల పాటు జరిగిందని, అనేక అంశాలపై చర్చించామని తెలిపారు. బీజేపీకి వ్యతిరేకంగా... కాంగ్రెసేతర థర్డ్ ఫ్రంట్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయనే వాదనను ఎన్సీపీ నాయకుడు మజీద్ మెమన్ తిరస్కరించారు. ఈ సమావేశాన్ని రాష్ట్రీయ మంచ్ చీఫ్ యశ్వంత్ సిన్హా ఏర్పాటు చేశారని, పవార్ కాదని తెలిపారు. కాంగ్రెస్ నాయకులు కపిల్సిబల్, అభిషేక్ మను సింఘ్వి, మనీష్ తివారీలకు కూడా ఆహ్వానించామని, ఇతర కారణాల వల్ల వారు హాజరుకాలేదని తెలిపారు. సీపీఎం నేత నీలోత్పల్ బసు కూడా ఇది భావసారూప్యత కలిగిన వ్యక్తుల మధ్య సమావేశమేనని, దీన్ని రాజకీయ భేటీగా చూడకూడదని అన్నారు. -
ప్రగతిభవన్ ఎదుట విపక్షాల ఆందోళన
-
ప్రగతి భవన్ ఎదుట విపక్షాల ఆందోళన
సాక్షి, హైదరాబాద్: కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందంటూ ప్రగతిభవన్ ముందు ఆందోళనకు దిగిన విపక్ష నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రగతి భవన్కు పీపీఈ కిట్తో వచ్చిన సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణను అరెస్ట్ చేశారు. తెలంగాణ రాష్ట్ర విపక్ష పార్టీలు ఆందోళనకు పిలుపునివ్వడంతో ఉదయం నుంచే వివిధ పార్టీల ముఖ్య నేతల ఇళ్ల పాటు, ప్రగతిభవన్ ముందు పోలీసులు భారీగా మొహరించారు. సీపీఐ నేత చాడ వెంకట్రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ప్రగతి భవన్ వద్ద నిరసన తెలిపేందుకు వెళ్తున్న సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్, ప్రజా సంఘాల కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. -
కూలీల ఇక్కట్లపై నేడు ప్రతిపక్షాల భేటీ
న్యూఢిల్లీ: దేశవ్యాప్త లాక్డౌన్ వల్ల వలస కూలీలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చర్చించేందుకు ప్రతిపక్షాల నేతలు శుక్రవారం సమావేశం కానున్నారు. కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియాగాంధీ ఆధ్వర్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే ఈ భేటీలో వివిధ పార్టీలకు చెందిన 20 మంది నేతలు పాల్గొంటారని అంచనా. ప్రధానంగా వలస కూలీల సమస్యలను పరిష్కరించే విషయంలో అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహంపై చర్చస్తారు. అలాగే పలు రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు కార్మిక చట్టాలను నీరుగారుస్తుండడంపైనా చర్చించే అవకాశం ఉంది. కేంద్రం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీపై ప్రతిపక్ష నేతలు నిరసన వ్యక్తం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు 17 ప్రతిపక్షాలు అంగీకారం తెలిపాయి. -
పబ్లిసిటీ కోసం గాలి మాటలొద్దు..
సాక్షి, హైదరాబాద్: వాస్తవాలు విస్మరించి.. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినట్లుగా ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు.శుక్రవారం ఆయన సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిని పరిశీలించారు. సీజనల్ వ్యాధుల పట్ల తీసుకుంటున్న చర్యలపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ప్రతిపక్షాల తీరుపై నిప్పులు చెరిగారు. నగరంలో వైద్యులంతా అప్రమత్తంగా ఉన్నారని...ఆదివారం కూడా వైద్యసేవలు అందిస్తున్నారని తెలిపారు. వాతావరణం మార్పుతో సీజనల్ వ్యాధులు ఎక్కువగా వ్యాపిస్తున్నాయని తెలిపారు. విష జర్వాలను అదుపు చేయడానికి వైద్యులు నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. దేశంలోనే బెస్ట్ మెడికల్ సేవలు తెలంగాణలో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేయొద్దని హితవు పలికారు. డెంగీ లేదనడం లేదని.. డెంగీని అదుపులోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పబ్లిసిటీ కోసం గాలి మాటలు మాట్లాడవద్దని ప్రతిపక్షాలను దుయ్యబట్టారు. -
కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన
న్యూఢిల్లీ/శ్రీనగర్: కశ్మీర్లో పరిస్థితులను పరిశీలించేందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో శనివారం ఢిల్లీ నుంచి వెళ్లిన ప్రతిపక్షపార్టీల నాయకుల బృందాన్ని అధికారులు శ్రీనగర్లోనే నిలిపివేశారు. బృందంలో కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, డీఎంకే, ఎన్సీపీ, జేడీఎస్, ఆర్జేడీ, టీఎంసీ పార్టీలకు చెందిన 11 మంది నేతలు ఉన్నారు. జమ్మూ కశ్మీర్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో చూడాలన్న గవర్నర్ సూచనల మేరకే తాము ఈ పర్యటన చేపట్టినట్లు బృందం వెల్లడించింది. అక్కడ ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నారని బీజేపీని ఉద్దేశించి సీపీఐ ఆరోపించింది. దీనిపై జమ్మూ కశ్మీర్ ప్రభు త్వం స్పందించింది. ప్రతిపక్ష పార్టీల పర్యటన కశ్మీర్లో నెలకొన్న శాంతికి విఘాతం కలిగించే అవకాశం తెలిపింది. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు రాలేదని సీపీఐ నేత డి.రాజా అన్నారు. ‘మేము క్షేత్రస్థాయిలో పరిస్థితుల్ని పరిశీలించడానికే వచ్చాం తప్ప ఇతరులకు ఇబ్బంది కలిగించడానికి కాదు’ అని ఎల్జేడీ పార్టీ చీఫ్ శరద్ యాదవ్ అన్నారు. ‘పరిస్థితులు బాగానే ఉంటే మమ్మల్ని ఎందుకు అనుమతించడం లేదు? మేము చట్టాలను అతిక్రమించడానికి రాలేదు’ అని కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్ అన్నారు. హక్కులను ఓ నిరంకుశ ప్రభుత్వం ఎలా కాలరాస్తుందో దేశం గమనిస్తోందని సీపీఎం విమర్శించింది. కశ్మీర్లోయలో ఆంక్షల ఎత్తివేత.. కశ్మీర్లోని చాలా ప్రాంతాల్లో శనివారం ఆంక్షలను ఎత్తివేశారు. ప్రార్థనల సందర్భంగా ఐక్యరాజ్య సమితి మిలిటరీ బృంద కార్యాలయాన్ని ముట్టడించాలని వేర్పాటువాదులు భావించారు. ఈ నేపథ్యంలో అధికారులు శుక్రవారం ఆంక్షలు విధిం చారు. పరిస్థితి అదుపులోనే ఉందని తెలిపారు. ఇంటర్నెట్, మొబైల్ సేవలపై ఆంక్షలుండగా, కొన్నిచోట్ల ల్యాండ్లైన్ ఫోన్లను అనుమతించారు. సుప్రీంకోర్టులో పీసీఐ పిటిషన్.. జమ్మూకశ్మీర్లో సమాచార వ్యవస్థపై ఉన్న ఆంక్షలను ఎత్తివేయాలని కశ్మీర్ టైమ్స్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అనురాధ భాసిన్ వేసిన పిటిషన్ను పరిశీలిం చాల్సిందిగా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. జర్నలిస్టులు తమ వృత్తిని నిర్వహించేందుకుగాను ఆంక్షలను ఎత్తివేయాల్సిందిగా ఆ పిటిషన్లో కోరారు. మీడి యా, దేశ సమగ్రత, సార్వభౌమాధికారం వాటిని దృష్టిలో ఉంచుకొనే ఆంక్షలు తొలగించేందుకు సహాయం చేయాలని పీసీఐ కోరింది. -
నోటికొచ్చినట్లు ఆరోపిస్తే దావా వేస్తాం
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ ఫలితాల వ్యవహారంలో ప్రతిపక్ష నేతలు నోటికొచ్చినట్లు ఆరోపణలు చేస్తే పరువునష్టం దావా వేస్తామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు హెచ్చరించారు. రూ. 4.30 కోట్ల టెండర్లలో రూ. 10 వేల కోట్ల కుంభకోణం జరిగిందని దిగజారి మాట్లాడుతున్నా రని మండిపడ్డారు. ఒకరిని దొంగ అని ఆరోపించి నిజాయతీని నిరూపించుకొమ్మంటే ఎలా? అని ఆవే దన వ్యక్తం చేశారు. పెద్దమ్మ గుడి దగ్గర ప్రమాణం చేసేందుకు ఒక బఫూన్ రమ్మంటే వెళ్లాలా అని ప్రశ్నించారు. అధికార పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ను కాబట్టి బట్ట కాల్చి మీద వెయ్యాలని కొందరు ఏది పడితే అలా ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇంటర్ ఫలితాల విషయంలో ప్రతిపక్షాలు, మీడియా సంయమనం పాటించాలని చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. టీఆర్ఎస్ కార్మిక విభాగం ఆధ్వర్యంలో తెలంగాణ భవన్లో బుధవారం ఘనంగా మే డే వేడుకలు జరిగాయి. టీఆర్ఎస్ కార్మిక విభాగం జెండా ఆవిష్కరించిన అనంతరం అక్కడ జరిగిన సమావేశంలో కేటీఆర్ ప్రసంగించారు. ప్రతిపక్షాలకు వేరే అంశాలు లేకే... ‘అన్నీ మంచిగా జరుగుతుంటే కొందరికి మనసున పడడంలేదు. ప్రతిపక్షాలకు ఏ అంశం లేకనే ఇంటర్ ఫలితాల సమస్యను రావణ కాష్టంలా రగిలిస్తున్నాయి. తప్పులు జరిగితే ప్రభుత్వం కచ్చితంగా సరిదిద్దుకుంటుంది. ఒక తండ్రిగా నాకూ బాధ ఉంది. పిల్లలు చనిపోతే ఎంత బాధ ఉంటుందో అందరికీ తెలుసు. అందుకే ఎవరూ తొందరపడవద్దని సీఎం కేసీఆర్ చేతులు జోడించి విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్షాలకు వేరే అంశాలు లేక చిల్లరమల్లర ప్రయత్నాలు చేస్తున్నారు. నిన్న ఒకాయన మాట్లాడారు. అది విద్యాశాఖలోని బోర్డులో జరిగిన విషయం. దీనికి ఐటీ శాఖతో సంబంధం ఉండదు. అందులో ఏం జరిగిందో తెలియదు. విచారణలో తేలుతుంది. నేను ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు గ్లోబరీనా సంస్థకు టెండర్ దక్కితే తప్పును నాకు అంటగడుతున్నారు. రూ. 4.30 కోట్ల టెండర్లో రూ. 10 వేల కోట్ల లం చం ఇచ్చారని అంటున్నారు. సమస్య సున్నితమైనది. ఈ విషయంలో అందరూ సంయమనం పాటించాలి. రాజకీయంగా కేసీఆర్ను, టీఆర్ఎస్ ఎదుర్కోవాలం టే ప్రతిపక్షాలకు వేరే అంశాలు ఉన్నాయి. విద్యార్థు లు, తల్లిదండ్రులు తొందర పడవద్దని చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా. ఒక బఫూన్.. పెద్దమ్మ గుడి దగ్గర ప్రమాణం చేసేందుకు రమ్మంటే వెళ్లాలా? ఒకరిని దొంగ అని ఆరోపించి నిజాయతీని నిరూపించుకొమ్మంటే ఎలా? కేసీఆర్ను ఎవరైనా ఏదైనా అం టే కొన్ని మీడియా సంస్థలు లేనిపోని హడావుడి చేస్తున్నాయి. ఇంటర్ ఫలితాల కేసు విచారణ హైకోర్టులో జరుగుతోంది. చదువే మొత్తం కాదు. తొందరపడి ప్రాణాలు తీసుకుంటే మళ్లీ రావు. ఆవేశంలో నిర్ణయాలు తీసుకొని తల్లిదండ్రులను బాధ పెట్టొ ద్దు. సమస్య తీవ్రమైనదే. అయినా ప్రతిపక్షాలు, మీడి యా సంయమనం పాటించాలని కోరుతున్నా. కాంగ్రెస్ పార్టీకి చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా. మర్యాదగా తప్పు దిద్దుకుంటే మంచిది. లేకుంటే కోర్టు దావాలకు వెళ్లాల్సి వస్తుంది. రాహుల్ గాంధీ ఏదో మాట్లాడితే కోర్టుకు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. కోర్టు దోషులుగా తేల్చిన వాళ్లను శిక్షించాలని ప్రభుత్వాన్ని నేనే మొదట డిమాండ్ చేస్తా. ప్రతిపక్ష నేతలు నోటికొచ్చినట్టు ఆరోపణలు చేస్తే పరువు నష్టం దావా వేస్తాం. మీడియా ఇంటర్ సమ స్య విషయంలో సంయమనం పాటించాలి. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సంయమనం పాటించాలని ప్రతిపక్షాలకు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా. రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ ప్రక్రియ త్వరలోనే ముగుస్తుంది. అప్పటిదాకా అందరూ ఓపిక పట్టాలి’అని కేటీఆర్ సూచించారు. కేసీఆర్.. కార్మిక పక్షపాతి కార్మిక లోకానికి కేటీఆర్ మే డే శుభాకాంక్షలు తెలిపారు. పరిశ్రమలు రావడమే కాదు... స్థానికులకు ఉపాధి కలగాలని, కార్మికులకు చట్ట ప్రకారం కనీస వేతనాలు అందాలనేది కేసీఆర్ విధానమని చెప్పారు. సీఎం కేసీఆర్ కార్మిక పక్షపాతి అని చేతల్లో నిరూపించుకున్నారన్నారు. అంగన్వాడీ కార్మికులకు రెండుసార్లు వేతనాలు పెంచిన ఘనత కేసీఆర్ది అని, కొన్ని ఎర్రజెండా పార్టీలు ఉద్యమాలకు వారిని వాడుకున్నారు తప్పితే ఏమీ చేయలేదని కేటీఆర్ వ్యాఖ్యా నించారు. గతంలో అంగన్వాడీ కార్మికులు వేతనాలు పెంచాలని కోరితే గుర్రాలతో తొక్కిస్తే కేసీఆర్ వారికి రెండుసార్లు వేతనాలు పెంచారని ఆయన గుర్తుచేశారు. ‘సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లోకి ఎవరినీ రానివ్వరని ప్రతిపక్షాలు అవాకులు చెవాకులు పేలుతుంటాయి. కానీ కేసీఆర్ కార్మికులను ప్రగతి భవన్కు పిలిపించి వారికి భోజనాలు పెట్టి మూడు గంటలపాటు చర్చించారు. కార్మికుల వేతనాలు పెంచారు. సింగరేణి కార్మికులకు అత్యధిక బోనస్ ఇవ్వడంతోపాటు వారసత్వ ఉద్యోగాల సమస్యను పరిష్కరించారు. హోంగార్డులకు, జీహెచ్ఎంసీ స్వీపర్లకు, ఆశావర్కర్లకు, వీఆర్ఏలకు, కాంట్రాక్టు ఉద్యోగులకు, విద్యుత్ కార్మికులకు, ఆర్టీసీ కార్మికులకు వేతనాలను పెంచిన కార్మిక పక్షపాతి కేసీఆర్. మూతబడిన పరిశ్రమలను తెరిపించారు. కొత్త పారిశ్రామిక విధానాన్ని తెచ్చారు. పనిచేసే చోటే కార్మికులకు నివాస సదుపాయం కల్పించాలనేది సీఎం ఆలోచన. పరిశ్రమల్లో స్థానికులకే ఎక్కువగా ఉద్యోగాలు కల్పించాలనేది కేసీఆర్ విధానం. అసంఘటిత రంగ కార్మికుల కోసం కేంద్ర కార్మిక మంత్రిగా కేసీఆర్ ఎన్నో చేశారు. బీడీ కార్మికులకు భృతి ఇస్తున్న రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటే. గీత కార్మికులకు, చేనేత కార్మికులకు చేయూత ఇస్తున్నారు. ఆటోలకు రవాణా పన్ను మినహాయించి వారికి లబ్ధి చేకూర్చారు. కార్మికులకు సంబంధించి ఇంకా కొన్ని డిమాండ్లు ఉన్నాయి. సీఎం కేసీఆర్ అన్నింటినీ పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు. రాష్ట్రంలో పారిశ్రామిక, వ్యవసాయ ప్రగతి పెరగాలి. ఈ రంగాలతో సంపద పెరగాలి. పెరిగిన సంపదను అందరి సంక్షేమం కోసం పంచాలి. ఇదే టీఆర్ఎస్ ప్రభుత్వ విధానం. కార్మికులందరికీ రేషన్ కార్డులు ఇచ్చే విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తా. సాక్షర భారత్, గోపాలమిత్ర, మధ్యాహ్న భోజనం వర్కర్లకు ప్రభుత్వం న్యాయం చేస్తుంది. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం కార్మిక పక్షపాతి కాదు. టీఆర్ఎస్ నిర్ణయాత్మక శక్తిగా ఉంటే కార్మికులకు అన్ని రకాలుగా మేలు చేసేందుకు మరింతగా ప్రయత్నిస్తాం’ అని కేటీఆర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్మిక మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, కాలేరు వెంకటేష్, టీఆర్ఎస్ కార్మిక విభాగం నేతలు రాంబాబు యాదవ్, రూప్సింగ్, నారాయణ తదితరులు పాల్గొన్నారు. సంక్షేమ శాఖలకు అభినందనలు... జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలంగాణ రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల విద్యార్థులు ప్రతిభ కనబరిచేలా కృషి చేసిన సంక్షేమ శాఖలకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందనలు తెలిపారు. సంక్షేమ శాఖల అధికారుల బృందం చక్కగా పని చేసిందని ప్రశంసించారు. సాంఘిక, గిరిజన సంక్షేమ సంస్థల్లో చదవిన 506 మంది విద్యార్థులు జేఈఈ మెయిన్లో ప్రతిభ కనబరిచారని సంక్షేమశాఖ ట్విట్టర్లో పేర్కొన్న అంశంపై కేటీఆర్ స్పందించారు. సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్కు ట్విట్టర్లో అభినందనలు తెలిపారు. జస్టిస్ సుభాషణ్రెడ్డి మృతికి సంతాపం జస్టిస్ సుభాషణ్రెడ్డి మృతిపట్ల టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ట్విట్టర్ వేదికగా సుభాషణ్రెడ్డి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. -
వైఎస్సార్ సీపీ నేతల వాట్సాప్ కాల్స్ ట్యాపింగ్
సాక్షి, అమరావతి: ప్రతిపక్ష వైఎస్సార్సీపీ అభ్యర్థులు, నేతలే లక్ష్యంగా ముఖ్యమంత్రి, లోకేశ్తో పాటు కొంతమంది రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అధికార దుర్వినియోగంతో అనైతిక చర్యలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే సీసీ కెమెరాల ద్వారా ఆర్టీజీఎస్ (రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ) వ్యవస్థతో వైఎస్సార్సీపీ అభ్యర్థులతో పాటు పార్టీ ముఖ్యనేతలపై నిఘా పెట్టిన ముఖ్యమంత్రి.. తాజాగా వారి వాట్సాప్ ఫోన్లను ట్యాప్ చేయిస్తున్నారు. వాట్సాప్ కాల్స్ ట్యాపింగ్ కోసం ప్రత్యేకంగా యూరప్ నుంచి సూక్ష్మ పరికరాలను తెప్పించారు. ఫోన్ ట్యాపింగ్లు, ప్రతిపక్ష అభ్యర్థుల కదలికలపై నిఘా ద్వారా సమాచారం సేకరించి.. ఎన్నికల ముందు ప్రతిపక్షంపై దుష్ప్రచారం చేసేందుకు చంద్రబాబు ఈ విధమైన అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. కాగా ట్యాపింగ్ ఈ విషయాన్ని అధికార వర్గాలతో పాటు తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది నేతలే వెల్లడిస్తున్నారు. ఎన్నికల సంఘం వద్ద ఉండాల్సిన ఓటర్ల కలర్ ఫొటోలతో కూడిన మాస్టర్ జాబితాను దొంగలించడమే కాకుండా ప్రభుత్వ సాధికార సర్వే ద్వారా రాష్ట్ర ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని హైదరాబాద్లోని ఐటీ గ్రిడ్స్ సంస్థకు ఇచ్చి, దానిద్వారా ఆ సమాచారాన్ని టీడీపీ సేవా మిత్ర యాప్కు ఇస్తూ ప్రభుత్వం, ఐటీ గ్రిడ్స్ దొరికిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐటీ గ్రిడ్స్ కార్యకలాపాలను ఇప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించారు. విజయవాడ ఆటోనగర్లో ఐటీ కంపెనీలున్న భవనంలోని ఒక అంతస్తులో ఈ సంస్థను ఏర్పాటుచేశారు. చంద్రబాబు ఆదేశాల మేరకు.. గతంలో ఈవీఎంలు టాంపరింగ్ చేసి కేంద్ర ఎన్నికల సంఘానికి దొరికిపోయిన చంద్రబాబు సన్నిహితుడు, బినామీ అయిన వేమూరి హరిప్రసాద్, పరారీలో ఉన్న ఐటీ గ్రిడ్స్ సీఈవో అశోక్లు విజయవాడ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ఓటర్లు, ప్రభుత్వ లబ్ధిదారుల వివరాల సేకరణతో ఎన్నికల్లో టీడీపీకి లబ్ధి చేకూర్చే ఎత్తుగడలను సాగిస్తున్నారు. ఇందుకోసం హైదరాబాద్ ఐటీ గ్రిడ్స్లో పనిచేసే ఉద్యోగులను విజయవాడకు తరలించారు. వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఎవరితో ఏమి మాట్లాడుతున్నారు, ఎవరిని కలుస్తున్నారు, ఎక్కడ ఉన్నారనే వివరాలను సీసీ కెమెరాల ద్వారా ఇప్పటికే ఆర్టీజీఎస్కు చెందిన ఉన్నతాధికారి ఒకరు పర్యవేక్షిస్తున్నారు. తాజాగా వైఎస్సార్సీపీ అభ్యర్థులు, ముఖ్యనేతల వాట్సాప్ కాల్స్ ట్యాపింగ్కు సైతం వారు పాల్పడుతున్నారు. యూరప్ నుంచి అధునాతన పరికరాలు ఇందుకోసం ప్రత్యేకంగా యూరప్ నుంచి సూక్ష్మ పరికరాలను తీసుకువచ్చారని అధికార పార్టీకి చెందిన ఒక నేత వెల్లడించారు. ఒకసారి వాయిస్ రికార్డు చేస్తే ఫోను మార్చి మాట్లాడినా ఆ వాయిస్ను రికార్డు చేసే టెక్నాలజీ ఆ పరికరాలకు ఉన్నట్టు సమాచారం. అలాగే సెల్ ఫోన్ నంబర్ తెలుసుకోవడం ద్వారా, అలాగే సెల్ఫోన్ తయారీ నంబర్ ద్వారా ట్యాపింగ్ కార్యకలాపాలు సాగిస్తున్నారని, ఈ వ్యవహారం అంతా హరిప్రసాద్, అశోక్ కనుసన్నల్లోనే జరుగుతోందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. గత రెండురోజులుగా వైఎస్సార్సీపీ బూత్ కన్వీనర్ల సమాచారం సేకరణ పనిలో నిమగ్నమయ్యారని, వారి ఫోన్ నంబర్లతో పాటు వారి బ్యాంకు అకౌంట్ల కోసం అన్వేషిస్తున్నారని ఆ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే రాష్ట్రంలోని ఐదు కోట్ల ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ప్రభుత్వం నుంచి పార్టీ సేవా మిత్ర యాప్కు ఇచ్చేసిన చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్లు.. ఇప్పుడు ప్రతిపక్ష వైఎస్సార్సీపీ బూత్ కన్వీనర్ల బ్యాంకు ఖాతాల వివరాలను, వారి ఫోన్ నంబర్లను సేకరిస్తుండటం గమనార్హం. ఇప్పటికే సచివాలయంలోను, ఆర్టీజీఎస్ కార్యాలయంలోనూ సీసీ కెమెరాల ద్వారా వచ్చే సమాచారాన్ని ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్కు చేరవేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఫోన్ ట్యాపింగ్లతో ప్రతిపక్షంపై దుష్ప్రచారానికి ఎత్తుగడ వేసిన చంద్రబాబు.. అందులో భాగంగానే డబ్బులున్న వ్యక్తులకే వైఎస్సార్సీపీ అంటూ దుష్ప్రచారం ప్రారంభించారు. పోలింగ్ సమయం దగ్గరపడే సరికి ఈ ప్రచారాన్ని తీవ్ర స్థాయికి తీసుకువెళ్లాలనేది వారి ఉద్దేశమని టీడీపీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అధికారుల కోడ్ ఉల్లంఘనలపై చర్యలేవీ.. ఇలావుండగా ప్రభుత్వ సాంకేతిక పరిజ్ఞానాన్ని కొందరు పోలీసు ఉన్నతాధికారులు అధికార పార్టీకి అనుకూలంగా వినియోగిస్తున్నారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఇంత బరితెగింపుతో అధికార దుర్వినియోగం, ఇంత అధికార పార్టీ పిచ్చితో వ్యవహరిస్తున్న పోలీసు అధికారులను గతంలో ఎన్నడూ చూడలేదని పోలీసు శాఖలో పనిచేస్తున్న ఒక అధికారి వ్యాఖ్యానించడం గమనార్హం. ప్రతిపక్ష పార్టీతో పాటు ఇతర పార్టీలు పోలీసు యంత్రాంగం దురాగతాలపై ఫిర్యాదు చేస్తే.. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆయా జిల్లా అధికార యంత్రాంగానికి పంపి వాటిపై నివేదికలు తెప్పించుకుంటున్నారు. జిల్లా అధికార యంత్రాంగం అలాంటివేమీ జరగలేదని నివేదిక పంపితే ఆ ఫిర్యాదులను పక్కన పడేస్తున్నారు తప్ప జిల్లా అధికార యంత్రాంగం నివేదికలో వాస్తవం ఉందా లేదా అనే విషయాన్ని ధ్రువీకరించుకోవడం లేదు. పశ్చిమగోదావరి జిల్లా, విశాఖపట్నం జిల్లాలకు కలెక్టర్లుగా తమకు అనుకూలంగా వ్యవహరించే వారిని చంద్రబాబు నియమించారు. ఇప్పుడు వారిద్దరూ అధికార పార్టీ పట్ల పక్షపాతంతో వ్యవహరిస్తున్నారు. అలాగే సచివాలయ స్థాయిలో కొందరు ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు కూడా అధికార పార్టీ నేతల్లా వ్యవహరిస్తూ యధేచ్చగా నియమావళిని ఉల్లంఘిస్తున్నప్పటికీ ఎటువంటి చర్యలను తీసుకోవడం లేదు. గతంలో టీవీలు, పత్రికల్లో వచ్చే వార్తలు, కథనాల ఆధారంగా కోడ్ ఉల్లంఘనలను గుర్తించి చర్యలు తీసుకునేవారు. ఇప్పుడు ఆ విధంగా చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. -
కోల్కతాలో యునైటెడ్ ఇండియా ర్యాలీ
-
ఆశల పల్లకిలో నేతల సందడి!
ఇప్పుడు అందరూ అనుకుంటున్న ప్రతిపక్షాల మహా కూటమి నిజంగా అవతరిస్తే అది ఒకరిద్దరు నేతల ప్రధానమంత్రి కావాలనే లక్ష్యానికి ఓ మార్గంలా మాత్రమే చివరికి మారుతుంది. మమత, మాయావతి, చంద్రబాబు నాయుడు, ఎప్పటి నుంచో రంగంలో ఉన్న శరద్ పవార్–వీరందరికీ ప్రధాని కావాలనే కాంక్ష ఉంది. ప్రధాన మంత్రి పదవి చేపట్టే అవకాశం వస్తే వారు సీనియారిటీకి ప్రాధాన్యం ఇస్తారా? వారి పార్టీలు గెలిచే సీట్లకు ప్రాముఖ్యం ఇస్తారా? ఇతరుల నుంచి లభించే మద్దతు కీలకం అవుతుందా? అంటే చెప్పడం కష్టం. గతంలో హెచ్డీ దేవెగౌడ, ఐకే గుజ్రాల్లను ప్రధానులను చేసిన పరిణామాలు కేంద్రంలో రాజకీయ అస్థిరతకు దారితీశాయి. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్కు వ్యతిరే కంగా ముఖ్యమంత్రి అర వింద్ కేజ్రీవాల్, ఆయన మంత్రివర్గ సహచరులు నిరసన చేపట్టినప్పుడు మద్దతు ఇవ్వడానికి కాంగ్రెస్ నిరాకరించింది. ఈ విషయమై ఆమ్ఆద్మీ పార్టీ(ఆప్) విన్నపాలను, రాజకీయ పండితుల విమర్శలను కాంగ్రెస్ నాయకత్వం ఖాతరు చేయలేదు. కేజ్రీవాల్ బృందం బైఠాయింపు ఆందోళన ముగిసింది. అయితే తమదే విజయమని ఆప్ ప్రకటించినా, కేజ్రీవాల్ ఏం సాధించారో చెప్పడం కష్టం. ఆప్ అగ్రనేతల నిరసన సమయంలో ఢిల్లీ వచ్చిన నలుగురు బీజేపీయేతర ముఖ్యమంత్రుల నుంచి కేజ్రీవాల్కు కొంత నైతిక మద్దతు లభించింది. ఇంకా మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో కూడా సానుకూల స్పందన ఆప్ సర్కారుకు దక్కింది. పరస్పర అనుమానాలతో ప్రమాదం కాంగ్రెస్ ఈ గొడవలో తలదూర్చకుండా దూరంగా ఉంది. పార్టీ వరకూ ఇది మంచి ఆలోచనతో చేసిన నిర్ణయం. ఆప్ను కాంగ్రెస్ శత్రుపక్షంగానే పరిగ ణిస్తోంది. అంతేగాక కేజ్రీవాల్ పార్టీ బీజేపీ ‘బీ’ టీమ్ అనే అనుమానం కాంగ్రెస్లో బలంగా పాతుకు పోయింది. బీజేపీ, కాంగ్రెస్ మధ్య ప్రత్యక్ష పోటీ ఉన్న రాష్ట్రాల్లో తమ ఓట్లు చీల్చడానికే ఆప్ అన్ని సీట్లకు పోటీచేసిందని కాంగ్రెస్ నేతలు ఇది వరకే ఆరోపించారు. ఇందులో నిజం ఎంత ఉన్నా గాని ఈ పరిస్థితుల్లో కేజ్రీవాల్ను బహిరంగంగా సమర్థించ డానికి కాంగ్రెస్ ముందుకొచ్చే అవకాశం లేదు. అదీ గాక, కేజీవాల్కు మద్దతు పలకడం వల్ల మమతా బెనర్జీ, చంద్రబాబు నాయుడు, పినరయి విజయన్, హెచ్డీ కుమారస్వామికి ఢిల్లీలో వచ్చేదిగాని, పోయే దిగాని ఏమీ లేదు. కాంగ్రెస్ పరిస్థితి పూర్తిగా భిన్నం. ప్రత్యర్థితో చేతులు కలిపి రాహుల్గాంధీ రాజధానిలో తన పార్టీకి కీడెందుకు చేస్తారు? ఇతర పక్షాలు, నేతలు అందరి మెప్పు పొందే పద్ధతిలో సమాఖ్య స్ఫూర్తి, ప్రతిపక్షాల ఐక్యత వంటి మాటలు చెబుతూ ఆప్ను సమర్థించారు. దీని వల్ల ప్రతిపక్షాల పోకడల్లో నిజమైన మార్పు ఏదీ రాదు. నరేంద్రమోదీ ప్రభు త్వం ఆప్ను అన్ని రకాలుగా దెబ్బదీయడానికి ప్రయ త్నిస్తోంది. ఎన్నికలు సమీపించే కొద్దీ ఇంకా ముమ్మ రంగా ఈ పని చేస్తుంది. దీనివల్ల ప్రతిపక్షాల ఐక్యత బలపడుతుందా? ఆప్ విపక్ష మహా కూటమిలో చేరడానికి ఇది దారితీస్తుందా? అంటే కాలమే నిర్ణ యిస్తుంది. ప్రతిపక్షాల ఐక్యతకు ముందస్తు ప్రయత్నం? నలుగురు ముఖ్యమంత్రుల ఢిల్లీ యాత్రను లోక్సభ ఎన్నికల ముందు బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పా టుకు చేసిన ముందస్తు ప్రయత్నంగా భావిస్తున్నారు. కుమారస్వామి ప్రమాణస్వీకారానికి అనేకమంది ప్రతిపక్ష అగ్రనేతలు బెంగళూరు వెళ్లినప్పుడు తొలి సారి ఇలాంటి ఆలోచన ముందుకొచ్చింది. ఆలింగ నాలు, కరచాలనాలతో ఈ నాయకులు మధ్య కనిపిం చిన ఐక్యత బీఎస్ యడ్యూరప్ప రాజీనామా చేశాక అవమానభారంతో కుమిలిపోతున్న బీజేపీకి హెచ్చ రికలా కనిపించింది. మోదీ–అమిత్షా ద్వయం ఏక మౌతున్న ప్రతిపక్షాల ఉమ్మడి బలాన్ని రుచి చూడాల్సి ఉంటుందనే సందేశం ఇవ్వగలిగారు. ప్రతి పక్షాలు ఐక్యతకు, అవి మీడియా ప్రచారం పొందడా నికి కేజ్రీవాల్ ధర్నా మరో అవకాశం కల్పించింది. కాని, కాంగ్రెస్ ఈ వ్యవహారంలో పాలుపంచుకోవ డానికి అంగీకరించలేదు. అయితే, ప్రతిపక్షాలు బీజేపీకి వ్యతిరేకంగా నిజంగా ఐక్యత సాధించడానికి ఇంకా చాలా గట్టి కృషి చేయాల్సి ఉంటుంది. ప్రాంతీయ పార్టీలకు దేని లెక్కలు దానికి ఉన్నాయి. తమ సొంత రాష్ట్రాల్లో సీట్లు పెంచుకోవడమే ఈ పక్షాల ప్రధాన లక్ష్యం. వీటి మధ్య పొత్తుకు అవకాశమున్న రాష్ట్రాలే కనిపింవు. అనేక రాష్ట్రాల్లో ఉనికిలో ఉన్న ఒక్క బీఎస్పీ పరిస్థితి మాత్రమే వీటికి భిన్నంగా ఉంది. కాంగ్రెస్ విష యానికి వస్తే ఇది జాతీయ పార్టీ. అనేక ప్రాంతీయ పార్టీలో ఆయా రాష్ట్రాల్లో అధికారం కోసం కాంగ్రెస్ ఎన్నో ఏళ్లుగా పోటీపడుతోంది. మరీ బలంగా లేని రాష్ట్రాల్లో సైతం బీజేపీయేతర పార్టీతో ఏర్పడే మహా కూటముల్లో చేరడం కాంగ్రెస్కు కుదిరే పని కాదు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ప్రతిపక్షాల మహా కూటమికి లోక్సభ సీట్లలో సగానికి పైగా సీటు లభించే పక్షంలో ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర పోషించడమే కాంగ్రెస్ లక్ష్యం. అందుకు అవసరమై నన్ని సీట్లు గెలవడమే ఈ పార్టీ ప్రధాన వ్యూహంగా కనిపిస్తోంది. కాంగ్రెస్కు బలంలేని అనేక రాష్ట్రాల్లో ఈ పార్టీ గెలిచే సీట్లు బాగా తగ్గిపోతేనే మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ వంటి పార్టీలకు లాభం. బీజేపీకి వ్యతిరేకంగా రూపుదిద్దు కునే ఏ ప్రతిపక్ష కూటమిలోనైనా బలహీనతగా కని పించే ప్రధాన వైరుధ్యం ఇదే. ఆప్ జాతీయ పార్టీ కాదు! ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులు, అభిమానులు ఎలా అను కున్నా ఇది జాతీయ స్థాయి రాజకీయ పార్టీ కాదు. కేంద్ర ప్రభుత్వ ఏర్పాటుకు సాగే రాజకీయాల్లో దీని పాత్ర చిన్నది. ఇతర ప్రతిపక్షాలను ప్రభావితం చేసే బలం దానికి లేదు. దేశ రాజధాని ఢిల్లీ ముఖ్యమంత్రి కావడం వల్లే అరవింద్ కేజ్రీవాల్కు ఆయనకున్న రాజకీయ ప్రాముఖ్యానికి మించిన మీడియా ప్రచా రం లభిస్తోంది. పదిహేనేళ్లు ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేసిన కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు షీలా దీక్షిత్ను ఓడించడం కూడా కేజ్రీవాల్ స్థాయి పెరిగి పోవడానికి ఒక కారణం. అంతేగాక, ఆయన మద్దతు దారులు అనర్గళంగా, దూకుడుగా మాట్లాడతారు. సామాజిక మాధ్యమాల్లో చాలా చురుకుగా కనిపి స్తారు. అయితే, ఆప్ బలాబలాలను, రాజకీయ పోక డలను నిశితంగా పరిశీలిస్తే, వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఈ పార్టీ ఇప్పుడున్న నాలుగు సీట్లు కూడా గెలుచు కోవడం చాల కష్టం. పార్లమెంటు ఎన్నికల్లో ప్రతి సీటూ ముఖ్యమే అయినప్పుడు ఏ జాతీయ కూటమి అయినా ఆప్కు నాలుగు సీట్లు ఇవ్వడానికి ఎలా సిద్ధపడుతుంది? ఫ్రంట్ రూపురేఖలు ఎలా ఉంటాయి? ఒకవేళ అన్ని ప్రధానమైన ప్రాంతీయపక్షాలతో ఏర్పాటయ్యే ఫెడరల్ ఫ్రంట్ రూపు రేఖలు ఎలా ఉంటాయి? అంటే ఇప్పుడు చెప్పడం కష్టమేగాని కొంత సూచనప్రాయంగా అర్థమౌతోంది. ఈ ఫెడ రల్ ఫ్రంట్లో ఎవరు చేరాలి? ఏఏ పార్టీలను బయటే ఉంచాలి? అనే విషయాలను పెద్ద ప్రాంతీయ పార్టీలే నిర్ణయిస్తాయి. ఒక వేళ మమతా బెనర్జీ పార్టీ (తృణ మూల్ కాంగ్రెస్) ఈ ఫ్రంట్లో ప్రధాన పాత్రలో నిలబడితే వామపక్షాలకు ఇందులో స్థానం దక్కదు. అనేక మంది ప్రతిపక్ష, ప్రాంతీయపక్ష నాయకులతో సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారామ్ ఏచూరికి ఎంతటి సత్సంబంధాలున్నా లాభం ఉండదు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి వామపక్షాలను తప్పక అడ్డుకుంటారు. గతంలో అనేక రాజకీయ వింతలు చూశాం. సమాజ్వాదీ పార్టీ–బీజేపీ మధ్య మంచి సంబంధాలు ఇలాంటి వింతే. అయితే, తృణ మూల్ కాంగ్రెస్, సీపీఎం మధ్య రాజీ కుదిరి అవి చేతులు కలిపే అవకాశాలు ఏమాత్రం లేదు. ఇప్పుడు అందరూ అనుకుంటున్న ప్రతిపక్షాల మహా కూటమి నిజంగా అవతరిస్తే అది ఒకరిద్దరు నేతల ప్రధాన మంత్రి కావాలనే లక్ష్యానికి ఓ మార్గంలా మాత్రమే చివరికి మారుతుంది. మమత, మాయావతి, చంద్ర బాబు నాయుడు, ఎప్పటి నుంచో రంగంలో ఉన్న శరద్ పవార్–వీరందరికీ ప్రధాని కావాలనే కాంక్ష ఉంది. ప్రధాన మంత్రి పదవి చేపట్టే అవకాశం వస్తే వారు సీనియారిటీకి ప్రాధాన్యం ఇస్తారా? వారి పార్టీలు గెలిచే సీట్లకు ప్రాముఖ్యం ఇస్తారా? ఇతరుల నుంచి లభించే మద్దతు కీలకం అవుతుందా? అంటే చెప్పడం కష్టం. గతంలో ఇలాంటి సందర్బాల్లో అత్యంత శక్తిమంతమైన ఈ పదవిని రాజీ అభ్యర్థిగా తొలుత హెచ్డీ దేవెగౌడ సాధించారు. ఆయన తర్వాత ఎవరికీ ముప్పులేని, కీడు చేయని అభ్యర్థిగా ఇందర్ కుమార్ గుజ్రాల్ ప్రధానమంత్రి పదవి చేపట్టారు. ఈ రెండు పరిణామాలు కేంద్రంలో రాజ కీయ అస్థిరతకు దారితీశాయి. అలాంటి ఏ ప్రంట్లోనైనా కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రముఖ అంశంగా ఉంటుంది. ఇది తనదైన గతిశీలతను కలిగి ఉంటుంది. ఈ తరహా కూట మిలో చంద్రబాబుకు స్థానముంటుందా లేక రాహుల్ గాంధీ అధికారానికి చేరువలో ఉన్న వైఎస్ జగన్తోనే సంప్రదింపులు జరుపుతారా? ఈ రెండు అంశాల్లో రాహుల్ వ్యక్తిత్వం దేంట్లో ఇమడగలుగుతుంది? ఫ్రంట్ రాజకీయంలో ఏమైనా జరగొచ్చు.. పై అంశాలన్నీ బీజేపీ క్రియారహితంగా ఉంటుందనే ఊహాపరికల్పనకు దారిస్తుంది. తన కాళ్లకిందే ప్రత్యర్థి బలపడటానికి ఏ పార్టీ అనుమతించదు. బలమైన రాజకీయకూటమి నిజంగా ఏర్పడటాన్ని అది కష్టం సాధ్యం చేస్తుంది. అది కేంద్ర స్థాయిలో అధికారాన్ని అనుభవిస్తూంటుంది. దాని రాజకీయ వ్యూహకర్తలు రెండు లేక మూడు ఎత్తులు జిత్తులను అమలు చేయడంలో సుపరిచితులు. కొంతమంది ప్రతిపక్ష నేతలు తమ మనస్సు మార్చుకునేలా అధికార పక్షం ఒత్తిడి పెంచవచ్చు లేదా ఊరించవచ్చు. సమాజ్ వాదీ పార్టీ ఉన్నట్లుండి బహుజన్ సమాజ్ పార్టీతో తన పొత్తు పట్ల అసౌకర్యంగా భావించదని ఎవరైనా చెప్పగలరా? పైగా ప్రంట్ ఏర్పడిన తర్వాత దాంట్లో టికెట్లు పొందలేనివారు కూటమినుంచి జారిపోతే ఎలా ఉంటుంది? ఇప్పటికే రాజకీయ కదలికలు, వ్యూహాలు మొదలయ్యాయి. తెరవెనుక సల్లాపాలు జరుగుతున్నాయి కాబట్టి దృష్టికోణం చాలా ముఖ్యమైంది. ఢిల్లీలో నలుగురు ముఖ్యమంత్రులు తనను కలవడం కేజ్రీవాల్కి తప్పకుండా నైతిక మద్దతు నివ్వడమే కాకుండా బలమైన సందేశాన్ని కూడా ఇస్తుంది. తమ తమ సొంత ఎజెండాలు కలిగి ఉన్న ఈ నలుగురూ ఢిల్లీకి వచ్చి సరైన అంశాలనే ప్రస్తావించారు. ఫొటోలు దిగి వెళ్లిపోయారు. అలాంటి మరొక అవకాశం తటస్థించినప్పుడు వారు మళ్లీ ఒకటిగా ముందుకొస్తారు కూడా. సిద్ధార్థ్ భాటియా వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు -
టీఏసీ అనుమతి కాంగ్రెస్కు చెంపపెట్టు
జోగిపేట(అందోల్): రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర జలవనరుల సంస్థ టీఏసీ (టెక్నికల్ అడ్వయిజరీ కమిటీ) అనుమతి ఇవ్వడంతో ఇక అన్ని అనుమతులు పూర్తయినట్లేనని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. బుధవారం ఆయన సంగారెడ్డి జిల్లా తాలెల్మ బహిరంగ సభలో మాట్లాడుతూ, టీఏసీ అనుమతికి సంబంధించి తనకు ఇప్పుడే ఢిల్లీ నుంచి తీపి కబురు వచ్చిం దన్నారు. విపక్ష పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా కాళేశ్వరానికి అన్ని అనుమతులు పొందగలిగామని, టీఏసీ అనుమతి కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు అని అన్నారు. ప్రభుత్వ చిత్తశుద్ధికి కాళేశ్వరం ప్రాజెక్టే నిదర్శనమన్నారు. సీఎం కేసీఆర్ రీడిజైన్ను జలవనరుల సంస్థ, కేంద్రం ఆమోదించిందన్నారు. ఆప్షన్ లేనందునే బీమా ఒక ప్రభుత్వ ఉద్యోగి చనిపోతే కుటుంబ సభ్యులకు ఉద్యోగం.. ఎమ్మెల్యే, ఎంపీ చనిపోతే వారి కుటుంబ సభ్యులను ఎన్నికల్లో గెలిపిస్తాం, మరి రైతు చనిపోతే ఏం చేస్తున్నామని..?, అందుకే సీఎం కేసీఆర్ రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టారని మంత్రి హరీశ్ అన్నారు. రైతు ఎటువంటి పరిస్థితుల్లో మరణించినా వారం రోజుల్లో రూ.5 లక్షల చెక్కు అతడి ఇంటికి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బాబూమోహన్, ఎంపీ బీబీ పాటిల్, సంగారెడ్డి కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
పోలీసుల అదుపులో ప్రతిపక్ష నాయకులు
వర్ని(బాన్సువాడ) : వర్ని మండలం మోస్రా గ్రామంలో మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి పర్యటన దృష్ట్యా బీజేపీ, కాంగ్రెస్ నాయకులను మంగళవారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నూతన మండలాల ఏర్పాటులో భాగంగా మోస్రా గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేయడంలో మంత్రి పోచారం నిర్లక్ష్యం చేస్తున్నారని నిరసిస్తూ ప్రతిపక్ష నాయకులు బంద్కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం ఉదయం మోస్రాలో భారీస్థాయిలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రత్యేక పోలీస్ బృందాలను రప్పించారు. ఉదయం వేళ బస్టాండ్ వద్ద, ఇళ్లలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ నాయకులను అదుపులోకి తీసుకుని నిజామాబాద్ నాల్గోటౌన్కు తరలించారు. గ్రామంలో మంత్రి కార్యక్రమం ముగిసిన తరువాత సాయంత్రం వారిని వదిలిపెట్టారు. ఇళ్లలో ఉన్న కార్యకర్తలను కూడా బలవంతంగా పీఎస్కు తరలించడం అన్యాయమని, అడిగే హక్కు కూడా లేదా అని ప్రశ్నించారు. పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసిన వారిలో బీజేపీ మండల అధ్యక్షుడు భూపాల్ రెడ్డి, యువమోర్చా నాయకుడు సందీప్ రెడ్డి, సుదర్శన్ గౌడ్, శ్రీనివాస్, కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు స్వామిగౌడ్, హరినారాయణ, కె.లక్ష్మణ్, సాయిలు తదితరులు ఉన్నారు. -
రాష్ట్రపతిని కలిసిన రాహుల్,ఇతర విపక్షాలు
-
‘వారిని బొంద పెట్టడం ఖాయం’
హైదరాబాద్: రైతు రాజుగా బతకాలన్న ధ్యేయంతో సీఎం కేసీఆర్ రైతాంగ సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారని పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ తెలిపారు. రైతు సమన్వయ సమితులను రాబందుల్లా అడ్డుకునేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఆయన మండిపడ్డారు. టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రతీ దానికి కోర్టు గుమ్మం తొక్కడం విపక్షాలకు పరిపాటిగా మారిందని, రైతు సమన్వయ సమితులపై పిటిషనర్లకు చివాట్లు పెట్టినా విపక్ష నేతలు సిగ్గు లేకుండా గవర్నర్ కలిశారని మండిపడ్డారు. రైతు సమన్వయ సమితుల్లో సామాజిక న్యాయం పాటించామని, ఒక్కసారి జీవో 39 మళ్లీ చదువుకుంటే విపక్షాలకు మంచిదని హితవు పలికారు. అసంఘటితంగా ఉన్న రైతులను సంఘటితం చేసేందుకు రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేస్తున్నామని ఆయన అన్నారు. వీటి ఏర్పాటు తర్వాత ఒక్క రైతు కూడా తమ వెంట రారనే భయంతోనే విపక్షాలు అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. సింగరేణిలో కలిసి పోటీ చేస్తామని కాంగ్రెస్, టీడీపీ, లెఫ్ట్ అనుబంధ సంఘాలు ప్రకటించడం రాజకీయ వ్యభిచారమేనని, ఇది కిచిడి కూటమి అని, వారి పప్పులు సింగరేణిలో ఉడకవని అన్నారు. సింగరేణి ఎన్నికలతోనే విపక్షాల పతనానికి నాంది అవుతుందని, వీరిని సింగరేణి బొందల గడ్డలో కార్మికులు బొంద పెట్టడం ఖాయమని ఆయన అన్నారు. మిషన్ భగీరథలాగే రైతు సమన్వయ సమితులు దేశానికి రోల్ మోడల్ కావడం ఖాయమని సుమన్ పేర్కొన్నారు. -
నేడు విపక్ష నేతలతో రాజ్నాథ్, సుష్మ భేటీ
-
ఆడబిడ్డల ఆదరణతో మళ్లీ అధికారంలోకి
ఓర్వలేకపోతున్న ప్రతిపక్షాలు: ఎంపీ కవిత నిజామాబాద్ రూరల్ (మోపాల్): రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి ప్రజలు సంతోషపడుతుంటే.. దాన్ని జీర్ణించుకోలేకపోతున్న విపక్ష నాయకులు అధికార దాహంతో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. నిజామాబాద్ రూరల్ మండలం గుండారం గ్రామంలో నిజాంసాగర్ కెనాల్ డి–50 నుంచి డి–63 వరకు రూ. 28 లక్షలతో చేపట్టనున్న ఆ«ధునికీకరణ పనులకు బుధవారం కవిత శంకు స్థాపన చేశారు. ఈ సందర్భంగా బహిరంగసభలో ఆమె కాంగ్రెస్, టీడీపీ నాయ కులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ మహిళల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టారన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పులు చేయించుకున్న మహిళలకు రూ.12 వేల ఆర్థిక çసహాయం జూన్ నుంచి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఆడబిడ్డ రూపంలో ప్రతి గ్రామంలో ఒక కేసీఆర్ ఉన్నారని అభివర్ణించారు. 2019లో జరిగే సాధారణ ఎన్నికల్లో ఆడబిడ్డల ఆద రణతో టీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ ఏర్పడుతుందన్నారు. ప్రభుత్వం అందించే సాయం మహిళల పేరిట ఇవ్వాలని తాను సీఎం దృష్టికి తీసుకుకెళ్లినట్లు తెలిపారు. -
లోకేష్లా అడ్డదారిన అధికారంలోకి రాలేదు
కల్లూరు(ఖమ్మం): తెలంగాణలో టీడీపీ నేతలు ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నారంటూ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. ఖమ్మం జిల్లా కల్లూరు, టేకులపల్లిలో 220/132/33 కేవీ విద్యుత్ ఉప కేంద్రాలను, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జగదీష్రెడ్డి మాట్లాడుతూ పక్క రాష్ట్రానికి ఏజెంట్లుగా పనిచేస్తున్న వారిని ప్రజలే తరిమికొడతారని చెప్పారు. కేసీఆర్ పిల్లలు లోకేష్ లాగా అడ్డదారిన అధికారంలోకి రాలేదు.. ఉద్యమం చేసి జైళ్లకు పోయి ప్రజాప్రతినిధులుగా గెలిచారని చెప్పారు. దేశ చరిత్రలో మెనిఫెస్టో అమలు చేసిన ఏకైక పార్టీ టీఆర్ఎస్ మాత్రమే.. దీనిపై బహిరంగ చర్చకు సిద్దమా అని నిలదీశారు. కమ్యూనిస్టు ద్రోహి తమ్మినేని వీరభద్రం అంటూ వాళ్ల పార్టీ కూడా ప్రజల గురించి ఆలోచించలేదు.. వీరభద్రం పార్టీ బెంగాల్ను ఇరవయ్యేళ్లు పాలించినా ఇంకా జనం రోడ్ల మీదే ఉన్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఆడబిడ్డకు కళ్యాణలక్ష్మి ద్వారా రూ.75 వేలు కట్నంగా కేసీఆర్ ఇస్తున్నారు అని జగదీష్రెడ్డి చెప్పారు. సత్తుపల్లికి ఏం కావాలన్నా చేస్తా: రాజకీయాలకు పనికి రాని వాళ్ళు మాట్లాడితే స్పందించాల్సిన అవసరం లేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు తెలంగాణ వైపు చూస్తున్నాయంటూ రైతులకు 24 గంటలు విద్యుత్ ఇవ్వాలని సీఎం కేసీఆర్ ప్రణాళిక రూపొందిస్తున్నారన్నారు. భూసేకరణ చట్టానికి వారం రోజుల్లో సీఎం కేసీఆర్ ఆమోద ముద్ర వేయించారన్నారు. తనను పాతికేళ్లు తల్లిలా మోసిన సత్తుపల్లి నియోజకవర్గానికి ఏం కావాలన్నా చేస్తానని తుమ్మల హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమాల్లో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, జెడ్పీ చైర్ పర్సన్ గడిపల్లి కవిత, ఎమ్మెల్సీ బాలసాని లక్మీనారాయణ, డీసీసీబి చైర్మన్ మువ్వా విజయ్ బాబు తదితరులు పాల్గొన్నారు. -
న'గరం'
► రైతులకు మద్దతుగా ఖమ్మంలో విపక్షాల ఆందోళన ► కొనసాగిన అరెస్టుల పర్వం... ► పోలీసుల విస్తృత తనిఖీలు, బందోబస్తు ► ఖాకీ పహారా నడుమ మార్కెట్లో కొనుగోళ్లు సాక్షి, ఖమ్మం/ఖమ్మం వ్యవసాయం: వ్యవసాయ మార్కెట్పై దాడి ఘటనతో ఖమ్మం నగరం అట్టుడికింది. రైతులకు మద్దతుగా విపక్షాల ఆందోళనలు, పోలీసుల విస్తృత తనిఖీలు, అరెస్ట్లు, 144 సెక్షన్తో శనివారం ఒక్కసారిగా ఖమ్మం నగరం వేడెక్కింది. మరోవైపు పోలీసుల పహారాలో ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిర్చి కొనుగోళ్లను వేగిరం చేశారు. జిల్లా అధికార యంత్రాంగం మిర్చి కొనుగోలుపై దృష్టి సారించి తగిన చర్యలు చేపట్టింది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిర్చి ధర పడిపోవడంతో రైతులు ఆందోళనకు గురై మార్కెట్యార్డుపై దాడి చేసిన విషయం విదితమే. రైతుల ఆందోళనకు మద్దతుగా శనివారం ప్రతిపక్షాలు గొంతు కలిపాయి. కాంగ్రెస్, సీపీఐ, టీడీపీ, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ, బీజేపీ నేతలు రైతులకు మద్దతుగా ఆందోళనలకు సిద్ధమయ్యారు. రైతుల దాడిలో మార్కెట్కు సంబంధించిన ఆస్తులు భారీగా విధ్వంసం కావడం, పరిస్థితులు చేయిదాటుతుండటంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ యంత్రాంగం 144 సెక్షన్ విధించింది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు చెందిన పోలీస్ యంత్రాంగాన్ని ఖమ్మంనగరంతోపాటు పరిసర మండలాల్లో మోహరింపజేసి గట్టి బందోబస్తు చేపట్టింది. ఎక్కడికక్కడ అరెస్ట్లు.. మిర్చికి మద్దతు ధర కల్పించాలని విపక్షాలు మార్కెట్యార్డును సందర్శించడం, ఆందోళనలకు ప్రణాళికలు రూపొందించుకోవడం తదితర చర్యలకు సమాయత్తం కావడంతో పసిగట్టిన పోలీస్యంత్రాంగం చర్యలకు పూనుకుంది. నగరంలోని బస్టాండ్ సెంటర్తోపాటు కాల్వొడ్డు, వరంగల్ క్రాస్రోడ్డు, ప్రకాష్నగర్ బ్రిడ్జి, బైపాస్రోడ్డు, ఎన్టీఆర్ విగ్రహం, రాజకీయ పార్టీల కార్యాలయాల వద్ద పోలీసులను భారీగా మోహరించారు. జిల్లా సరిహద్దు వద్ద వాహనాలను విస్తృతంగా తనిఖీ చేశారు. నాయకన్గూడెం, ముదిగొండ, తిరుమలాయపాలెం, శ్రీశ్రీ సర్కిల్, ఎన్టీఆర్ విగ్రహం వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. మార్కెట్ దాడి ఘటనలో రైతులున్నారనే అనుమానంతో ముదిగొండలో కొందరిని అదుపులోకి తీసుకోవడంతో పోలీస్స్టేషన్ ఎదుట రైతులు ఆందోళనకు దిగారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క ఇక్కడ ఆందోళన చేపట్టడంతో పోలీసులు ఆయనను అరెస్ట్చేసి కొణిజర్లకు తరలించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డితోపాటు జిల్లాకు చెందిన సీపీఐ నాయకులు పార్టీ కార్యాలయం నుంచి ఆందోళనకు బయలుదేరగా పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేసి కొణిజర్లకు తరలించారు. టీడీపీ నాయకులు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, నామా నాగేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు తుళ్లూరి బ్రహ్మయ్య, మద్దినేని బేబి స్వర్ణకుమారిలను అరెస్ట్ చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సన్నె ఉదయ్ప్రతాప్, జిల్లా రాష్ట్ర, నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు పోటు రంగారావు,రాయల చంద్రశేఖర్ తదితరులను, సీపీఎం నాయకుడు సుదర్శన్ పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. కొనుగోళ్లపై జేసీ పర్యవేక్షణ.. వ్యవసాయ మార్కెట్లో మిర్చి కొనుగోళ్లపై జిల్లా జాయింట్ కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పర్యవేక్షించారు. మార్కెట్కు వచ్చిన సరుకు వివరాలు, కొనుగోళ్లు తదితర అంశాలను మార్కెటింగ్ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. మిర్చి కొనుగోళ్లను వేగిరం చేయాలని అధికారులను ఆదేశించడంతోపాటు రహదారులపై ఉన్న మిర్చిని కాంటాలను పెట్టించి తరలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. మార్కెట్లో ఉన్న సరుకు వివరాలు, కొనుగోళ్లు జరిగిన విధానాన్ని, ధరల వివరాలను జేసీ తెలుసుకున్నారు. ప్రస్తుతం మార్కెట్స్థితిగతులను, మిర్చి కొనుగోళ్ల వ్యవహారాన్ని, శాంతిభద్రతలను తదితర అంశాలపై మార్కెటింగ్ శాఖ అధికారులతో సమీక్ష జరిపి ఉన్నతాధికారులకు నివేదించ చర్యలను చేపట్టారు. -
గుక్కెడు నీరివ్వలేరా?
బాలయ్య తీరు దారుణం ఎంపీ నిమ్మల, మున్సిపల్ చైర్పర్సన్ పట్టించుకోరు సీపీఐ రాష్ట్రకార్యదర్శి రామకృష్ణ, విపక్ష నేతలు హిందూపురం అర్బన్ : ప్రజలకు గుక్కెడు తాగునీరు ఇవ్వలేని చేతకాని పాలకులు ఉన్నారంటే సిగ్గుచేటని సామాజిక హక్కుల రాష్ట్ర కార్యదర్శి, సీపీఐ రాష్ట్రకార్యదర్శి రామకృష్ణ అన్నారు. పట్టణంలో నెలకొన్న తాగునీటి ఎద్దడిని నివారించాలంటూ సోమవారం సామాజిక హక్కుల వేదిక ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ, బీఎస్పీ, కాంగ్రెస్ నాయకులు, ప్రజలు ఆందోళన చేశారు. స్థానిక రహమత్పురం నుంచి ఖాళీ బిందెలతో ర్యాలీగా తరలివచ్చి మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం సీపీఐ కౌన్సిలర్ దాదాపీర్ అధ్యక్షతన «బహిరంగ సభ జరిగింది. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ హిందూపురం నియోజకవర్గంలో 35 ఏళ్లుగా టీడీపీ ఎమ్మెల్యేలే పాలిస్తున్నా నీటి సమస్యకు శాశ్విత పరిష్కరం చూపకపోవడం దారుణమన్నారు. ఇక్కడి ఎమ్మెల్యే బాలకృష్ణకు నియోజకవర్గానికి వచ్చే తీరికలేదు..ఎంపీ నిమ్మలకిష్టప్ప అసలు ఇటు వైపు కన్నెత్తి చూడరు..స్థానికంగా ఉండే చైర్పర్సన్ కమీషన్ల కోసం కమిషనర్తో గొడవలు పడటానికే సరిపోయిందన్నారు. ఎమ్మెల్యే బాలకృష్ణ ఆరునెలలుగా కనిపించడం లేదని వైఎస్సార్సీపీ నాయకులు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారంటే ఎంత సిగ్గుచేటన్నారు. సామాజిక హక్కుల వేదిక జిల్లా కార్యదర్శి జాఫర్ మాట్లాడుతూ మండుతున్న ఎండలో వందలాది మంది ప్రజలు ఖాళీ బిందెలతో మున్సిపల్ ఆఫీసు వద్దకు వస్తే అడిగేవారే లేకపోవడం దారుణమన్నారు. అధికారులు, పాలకులపై ప్రజలు తిరగబడే పరిస్థతి వచ్చిందన్నారు. అనంతరం మున్సిపల్ ఆఫీసు ఎదుట మట్టికుండలు పగులగొట్టి నినాదాలు చేశారు. డీఈ వన్నూరప్పకు వినతిపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకుడు వేణుగోపాల్రెడ్డి, పీసీసీ కార్యదర్శి ఇందాద్, బీఎస్పీ శ్రీరాములు, ఓపీడీఆర్ శ్రీనివాసులు, సీపీఐ నాయకులు సురేష్, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్కు మొయిలీ చురకలు
న్యూఢిల్లీ :ఈవీఎంల వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు తలెత్తాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీరప్ప మొయిలీ ఈ అంశంపై సొంతపార్టీ నిర్ణయంతో విభేదించారు. సీనియర్ల నుంచి అభిప్రాయం తీసుకోలేదని, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. ఈవీఎంలపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆందోళనలో కాంగ్రెస్ జత కలవడాన్ని మొయిలీ తప్పుబట్టారు. తాను న్యాయశాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఈవీఎంల విధానం ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. అలాగే ఫిర్యాదులు కూడా అందయని, వాటన్నిటిని తాము సమీక్షించడం జరిగిందనే విషయాన్ని మర్చిపోకూడదన్నారు. భారత ఎన్నికల ప్రక్రియ అత్యున్నతమైనదని, ఈ ఘనత కాంగ్రెస్, యూపీఏలకు దక్కుతుందన్నారు. మళ్లీ బ్యాలెట్ పత్రాల ద్వారా ఎన్నికలు వెళ్లేది లేదని ఆయన అన్నారు. ఆయా పార్టీలు ఎన్నికల్లో ఓటమికి కేవలం ఈవీఎంలు మాత్రమే కారణం కాదని మొయిలీ వ్యాఖ్యానించారు. అయితే ఓడినవాళ్లు తప్పంతా ఈవీఎంలదే అని ఆరోపించడం సరికాదని ఆయన చురకలు అంటించారు. మిగతా దేశాలతో పోల్చితే మన ఎన్నికల నిర్వహణా విధానం ఉత్తమమైనదని మొయిలీ అన్నారు. ఆ ఘటన యూపీఏతో పాటు కాంగ్రెస్ పార్టీకే దక్కుదుందన్నారు. ఈ నేపథ్యంలో మొయిలీ బుధవారం ఉదయం విపక్ష నేతలతో సమావేశం అయ్యారు. కాగా ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మళ్లీ ఈవీఎంల ట్యాంపరింగ్ అంశం తెరపైకి వచ్చింది. ఫలితాలు వచ్చిన రోజే బీఎస్పీ చీఫ్ మాయావతి, ఉత్తరాఖండ్ మాజీ సీఎం రావత్ ఈవీఎంలపై (ట్యాంపరింగ్ జరిగిందంటూ) తీవ్ర ఆరోపణలు చేయగా.. వీటిపై విచారణ జరపాలని అఖిలేశ్ డిమాండ్ చేశారు. పంజాబ్లో తమ ఓటమికి కూడా ట్యాంపరింగే కారణమని ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆరోపించారు. ట్యాంపరింగ్పై కోర్టుకు వెళ్లనున్నట్లు మాయావతి, కేజ్రీవాల్ తెలిపారు. 1982లోనే ఈవీఎంలను ప్రయోగాత్మకంగా భారత్లో వినియోగించినా.. 2004 సార్వత్రిక ఎన్నికల నుంచి పూర్తిస్థాయి వినియోగంలోకి వచ్చాయి. తాజా వివాదం నేపథ్యంలో ఈవీఎంను ట్యాంపరింగ్ చేయొచ్చా అనే అంశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. దీంతో ఈవీఎంల వినియోగంపై 13 పార్టీలు ఏకతాటి పైకి వచ్చాయి. ఈవీఎంల ట్యాంపరింగ్ జరుగుతోందని ఆరోపిస్తున్నాయి. కాంగ్రెస్, తృణమూల్, బీఎస్పీ, ఎన్సీపీ, వామపక్షాలు, డీఎంకే సహా పార్టీలకు చెందిన ప్రతినిధులు సోమవారం ఈసీని కలిశారు. రాబోయే ఎన్నికల్లో ఈవీఎంలకు బదులుగా బ్యాలెట్ పేపర్లు వాడాలని ఈసీని కోరాయి. ఈవీఎంలపై తమ అనుమానాల్ని సీరియస్గా తీసుకోవాల్సిందిగా పార్టీలు ఎన్నిక సంఘానికి విజ్ఞప్తి చేశాయి. -
విపక్షాలు పారిపోయాయి: మోదీ
-
విపక్షాలు పారిపోయాయి: మోదీ
లక్నో: ఉత్తరప్రదేశ్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని భారత ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. అవినీతిని రూపుమాపేందుకు తాము ప్రయత్నిస్తుంటే పార్లమెంటులో చర్చ జరగకుండా ప్రతిపక్షాలు అడ్డుకున్నాయని ఆయన మండిపడ్డారు. సోమవారం ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ పరివర్తన్ ర్యాలీలో పాల్గొన్న సందర్భంగా మోదీ మాట్లాడారు. అవినీతి, నల్లడబ్బుపై జరగాల్సిన చర్చ నుంచి విపక్షాలు పారిపోయాయని, అవినీతి పరులకు అండగా నిలుస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి, నల్లడబ్బు అనే అంశాలు పేద మధ్య తరగతి కుటుంబాలను దారుణంగా దెబ్బతీశాయని ఆవేదన వ్యక్తం చేశారు. బ్లాక్ మనీపై ఈసీ తీసుకుంటున్న చర్యలను స్వాగతిస్తున్నామని అన్నారు. పార్టీలకు వస్తున్న విరాళాల విషయంలో పారదర్శకతను పాటించడం ప్రతి రాజకీయ పార్టీ ఒక బాధ్యతగా తీసుకోవాలని కోరారు. -
పార్లమెంట్లో విపక్ష నేతల సమావేశం
-
ఆమరణదీక్షలు భగ్నం చేసిన పోలీసులు
ప్రతిపాదిత మండలాల జాబితాలో మోటకొండూరు గ్రామాన్ని చేర్చాలంటూ అఖిలపక్ష నాయకులు చేస్తున్న ఆమరణ దీక్షలను పోలీసులు భగ్నం చేశారు. నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట పరిధిలోని మోటకొండూరు గ్రామాన్ని ప్రత్యేక మండలంగా మార్చాలని గత కొన్ని రోజులుగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా.. గత వారం రోజులుగా యాదగిరిగుట్టలోని అంబెడ్కర్ విగ్రహం వద్ద ఆమరణ దీక్షలు చేస్తున్న అఖిలపక్ష నాయకులను పోలీసులు శనివారం అర్ధరాత్రి బలవంతంగా అక్కడినుంచి స్టేషన్కు తరలించారు. ఈ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ భద్రకాళి అమ్మవారి మొక్కు తీర్చుకోవడానికి వరంగల్ వెళ్తున్న సందర్భంగా.. మోటకొండూరు గ్రామస్థులు కాన్వాయ్ను అడ్డుకుంటారనే సమాచారంతో పోలీసులు ముందస్తు జాగ్రాత్తగా గ్రామానికి చెందిన 60 మంది కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. -
సీఎంను విమర్శిస్తే జీరోలవుతారు: శ్రీనివాస్గౌడ్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావును విమర్శిస్తే హీరోలవుతామని విపక్ష నేతలు భావిస్తున్నారని,కానీ ప్రజలు వారిని జీరోలుగా చేస్తారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్గౌడ్ అన్నారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. జైపాల్రెడ్డి తెలంగాణ ఉద్యమం గురించి పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. కల్వకుర్తిని రెవెన్యూ డివిజన్ చేయాలంటున్న జైపాల్రెడ్డి.. కాంగ్రెస్ పాలనలో ఎందుకు చేసుకోలేక పోయారని నిలదీశారు. జిల్లాల ఏర్పాటు అశాస్త్రీయమని విమర్శలు చేయడం కాంగ్రెస్ ద్వంద్వ విధానాలకు నిదర్శనన్నారు. విపక్ష నేతలు ప్రభుత్వ పథకాలపై విషయం కక్కుతున్నారని, ప్రభుత్వ పథకాలు దేశానికే తలమానికంగా నిలుస్తున్నాయన్నారు. -
'కొత్త జిల్లాల ఏర్పాటు శాస్త్రీయంగా ఉండాలి'
-
నయీం ప్రతి కదలిక వెనుక ఫర్హానా పాత్ర
-
కాంగ్రెస్ నేతలే ప్రజా కంటకులు
విపక్ష నేతలపై మంత్రి జూపల్లి కృష్ణారావు ఫైర్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్న కాంగ్రెస్ నేతలే ప్రజా కంటకులని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. అధికారమే పరమావధిగా భావించి ఢిల్లీకే పరిమితమైన జైపాల్రెడ్డికి, తెలంగాణ కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ సీఎం కేసీఆర్ను విమర్శించే నైతిక హక్కు ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మహబూబ్నగర్ జిల్లా అభివృద్ధికి జైపాల్రెడ్డి ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. సీఎం కేసీఆర్ ఎలా ప్రజా కంటకుడు అవుతారో జైపాల్రెడ్డి ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. పాలమూరు ప్రాజెక్టులను అడ్డుకోవడానికి చంద్రబాబు, ఆయన వందిమాగధులు సాగిస్తున్న కుట్రల్లో భాగంగానే నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల సాధన పేరుతో పాదయాత్రలు చేస్తున్నారన్నారు. ప్రాజెక్టులను అడ్డుకోవడానికి కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం, టీడీపీ నేతలు తమ సిద్ధాంతాలను గాలికొదిలి దుష్టచతుష్టయంలా మారారని వ్యాఖ్యానించారు. పాలమూరు ప్రాజెక్టులపై త్వరలోనే ప్రతిపక్ష పార్టీలకు బహిరంగ లేఖ రాస్తానని, వారికి దమ్ముంటే తాను అడిగే ప్రశ్నలకు సమధానం చెప్పాలన్నారు. ఎమ్మెల్సీ రాములు నాయక్, బోడకుంటి వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య పాల్గొన్నారు. -
పోరాడితే మరోరకంగా ఫలితాలు: సీఎం
* ప్రతిపక్షాలు చెప్పినట్టు చేస్తే.. కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్లవుతుంది * ఇక్కడ ఆందోళన చేసే విపక్షాలు అదేదో ఢిల్లీలో చేయాలి * కేంద్రాన్ని ఒప్పించి డబ్బులు తెస్తే సంతోషిస్తా.. * కర్నూలు జిల్లా కురవళ్లి సభలో ముఖ్యమంత్రి వ్యాఖ్యలు సాక్షి, కర్నూలు, సాక్షి ప్రతినిధి, కడప: రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో ప్రతిపక్షాలు చెప్పినట్టుగా తాము కేంద్రప్రభుత్వంపై పోరాడితే.. తమ మంత్రులు రాజీనామా చేస్తే ఫలితాలు వేరే విధంగా ఉంటాయని ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు అన్నారు. ప్రతిపక్ష నేతలు చెబుతున్నట్టుగా చేస్తే కొండనాలుకకు మందేస్తే.. ఉన్న నాలుక ఊడినట్టుగా రాష్ట్రం పరిస్థితి తయారవుతుందన్నారు. నీరు-చెట్టు పథకం పనుల పరిశీలనలో భాగంగా శనివారం మధ్యాహ్నం సీఎం కర్నూలు జిల్లా ఆలూరు మండలంలోని కురవళ్లి గ్రామంలో పర్యటించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రాన్ని తాను అడుగుతూనే ఉన్నానని చెప్పారు. హోదా విషయంలో తాను రాజీపడుతున్నట్టుగా ప్రతిపక్షాలు విమర్శించడాన్ని తప్పుపట్టారు. హోదాకోసం రాష్ట్రంలో ఆందోళన చేస్తున్న ప్రతిపక్షాలు అదేదో ఢిల్లీలో చేపట్టాలన్నారు. కేంద్రాన్ని ఒప్పించి రాష్ట్రానికి డబ్బులు తెస్తే సంతోషిస్తామన్నారు. తాను ఎన్నడూ రాజీపడనని, సమస్యలపై పోరాడుతానని చెప్పుకొచ్చారు. ‘‘ప్రత్యేక హోదా విషయంలో నా తప్పు ఏమన్నా ఉందా తమ్ముళ్లూ? కేంద్రాన్ని హోదా విషయంలో అడుగుతున్నానా? లేదా? తమ్ముళ్లూ.. నా తప్పు లేదనుకుంటే చేతులెత్తండి’’ అంటూ కోరారు. అక్కడ మాట్లాడకుండా ఇక్కడ విమర్శిస్తారా? తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీ వీడితే ఏమీ మాట్లాడని వైఎస్సార్సీపీ నేతలు ఇక్కడ మాత్రం తనను విమర్శిస్తున్నారని చంద్రబా బు మండిపడ్డారు.అనంతరం ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ రామాంజనేయులు రూపొందించిన ‘మనం-మన గ్రామాభివృద్ధి’ పట్టికను ఆవిష్కరించారు. నేను కాబట్టే రుణమాఫీ చేశా ఇదిలా ఉండగా వైఎస్సార్ జిల్లా కడపలో ఉద్యాన పంటల రైతులకు రుణ ఉపశమన పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఇందులో సీఎం మాట్లాడుతూ.. ‘‘విభజన చట్టంతో రాష్ట్రానికి అన్యాయం జరిగింది. కట్టుబట్టలతో వచ్చాం. తెలంగాణ కంటే 11 శాతం మేరకు ఆదాయం తక్కువ.. జనాభా ఎక్కువ. ఇతర రాష్ట్రాలకంటే రూ.35 వేల మేరకు తలసరి ఆదాయం తక్కువ. ఈ పరిస్థితుల్లో రైతులకు రుణవిముక్తి కల్పించాలని నిర్ణయించాం. వేరేవారైతే రుణమాఫీ చేయలేరు. కష్టపడి రుణమాఫీ చేశాం’ అని చెప్పుకొచ్చారు. ఎగువ రాష్ట్రాల అక్రమ ప్రాజెక్టుల ఏర్పాటుపై అభ్యంతరం తెలిపామని, ఈక్రమంలోనే తెలంగాణ ప్రాజెక్టులకు సైతం అభ్యంతరం చెప్పినట్లు వివరించారు. నేడు విదేశాలకు వెళ్లనున్న చంద్రబాబు సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదివారం రాత్రి హైదరాబాద్ నుంచి బయలుదేరి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈనెల 15న ఆయన విజయవాడ చేరుకుంటారు. ఇప్పటికే లోకేశ్, ఇతర కుటుంబసభ్యులు థాయ్లాండ్ వెళ్లారు. సీఎం థాయ్లాండ్ వెళ్లి అక్కడి నుంచి కుటుంబ సభ్యులతో కలసి స్విట్జర్లాండ్ వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇది పూర్తిగా వారి వ్యక్తిగత పర్యటన అని సమాచారం. సీఎం ఆదివారం తెలుగుదేశం మహానాడు తీర్మానాల కమిటీతో సమావేశమవుతారు. -
'రాజకీయ వ్యూహంతోనే రాద్దాంతం'
హైదరాబాద్: ప్రతిపక్షాలు రాజకీయ వ్యూహంతోనే జేఎన్యూ ఘటనపై రాద్దాంతం చేస్తున్నాయని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ఇందుకోసం దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేసే వారిని ప్రతిపక్షాలు వెనుకేసుకొస్తున్నాయని ఆయన విమర్శించారు. జీఎస్టీ బిల్లు వల్ల కార్మికులకు లబ్ది చేకూరుతుందని ఆయన వెల్లడించారు. కేంద్ర మంత్రి వర్గంలో టీఆర్ఎస్ చేరే అంశంపై మాట్లాడుతూ.. ఆ అంశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానికి చెప్పాలని అన్నారు. -
మంత్రిగారి ఫోన్లో ఇంతకీ ఏముంది?
కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తన ఫోన్లో ఓ వీడియోను ముగ్గురు ప్రతిపక్ష నేతలకు చూపిస్తున్న ఫొటో మీడియాలో హల్చల్ సృష్టిస్తోంది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు త్వరలో ప్రారంభం కానుండటంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిర్వహించిన అఖిలపక్ష సమావేశం సందర్భంగా వీళ్లంతా ఒకచోట ఉన్నప్పుడు ఎవరో ఈ ఫొటో తీశారు. పార్లమెంటును సజావుగా నడిపించేందుకు విపక్షాలు సహకరించాలని కోరడానికి ప్రధాని ఈ సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశం తర్వాత రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ బయటకు వచ్చారు. మీడియాతో మాట్లాడేందుకు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. అంతలో ఆర్థికమంత్రి ఆరుణ్ జైట్లీ, సీపీఐ నేత డి.రాజా కూడా బయటకు వచ్చారు. ఆ వెంటనే కేంద్ర మాజీమంత్రి ఆనంద్ శర్మ వచ్చారు. వాళ్లు ముగ్గురూ ఏదో మాట్లాడుకుంటుంటే ఆజాద్ అడ్డంగా చెయ్యి ఊపడం, రాజా మాత్రం అవునన్నట్లు తల ఊపడం కనిపించాయి. అంతలో జైట్లీ తన ఐఫోన్ 6ఎస్ బయటకు తీశారు. స్క్రీన్ మీద కాసేపు టక టకా టచ్ చేసి.. ఏదో వీడియో చూపించారు. కాసేపటికి జైట్లీ ఆ వీడియోను ఆపి.. ఫోన్ జేబులో పెట్టుకుని ఆజాద్, ఆనంద్ శర్మల వైపు చూశారు. ఆజాద్ తల ఆడించగా, ఆనంద్ శర్మ మాత్రం ఏదో ఆలోచిస్తున్నట్లు గడ్డం గోక్కున్నారు. తర్వాత మీడియాతో మాట్లాడిన ఆజాద్.. కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లోనూ జాతివ్యతిరేక నినాదాలు ఇచ్చేవారికి, రాజ్యాంగాన్ని సవాలుచేసేవారికి మద్దతు ఇవ్వబోదని ప్రకటించారు. -
బడ్జెట్ భేటీపై ‘జేఎన్యూ’ నీడ!
జేఎన్యూ వివాదంపై అఖిలపక్ష భేటీలో విపక్షం ప్రశ్నల వర్షం ♦ కన్హయ్య అరెస్ట్ అన్యాయమన్న కాంగ్రెస్, వామపక్షాలు ♦ వర్సిటీల వివాదాలు పార్లమెంటులో ప్రతిధ్వనిస్తాయన్న లెఫ్ట్ ♦ ఆ నినాదాలు అభ్యంతరకరమైనవి.. సభలో చర్చకు సిద్ధం: సర్కారు ♦ తాను దేశం మొత్తానికీ ప్రధానినని, ఒక్క పార్టీకి కాదని మోదీ వ్యాఖ్య ♦ సమావేశాలు సజావుగా సాగాలన్న అంశంపై స్థూల ఏకాభిప్రాయం న్యూఢిల్లీ: ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ వివాదం.. మరో వారంలో మొదలుకానున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ప్రతిధ్వనిస్తుందన్న విషయం స్పష్టమైంది. బడ్జెట్ సమావేశాల్లో సహకారం కోరుతూ ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ప్రతిపక్ష పార్టీలు జేఎన్యూ వివాదంపై ప్రశ్నలు లేవనెత్తాయి. వర్సిటీ విద్యార్థి సంఘం నేత కన్హయ్యకుమార్ను దేశద్రోహం అభియోగాలపై అరెస్ట్ చేయటం అన్యాయమని కాంగ్రెస్, వామపక్షాలు తప్పుపట్టాయి. అయితే.. వర్సిటీలో విద్యార్థులు చేసిన నినాదాలు తీవ్ర అభ్యంతరకరమైనవని ప్రభుత్వం పేర్కొంది. జేఎన్యూ వివాదంపై పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో చర్చించటానికి సిద్ధమంది. ఈ నెల 23వ తేదీ నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు మొదలుకానున్న నేపథ్యంలో మోదీ ఈ అఖిలపక్ష భేటీ నిర్వహించారు. తాను మొత్తం భారతదేశానికీ ప్రధానమంత్రినని, కేవలం ఒక్క పార్టీకి కాదని పేర్కొంటూ.. బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగటానికి సహకరించాలని విపక్షాలను కోరారు. ఇటీవల పార్లమెంటు సమావేశాల్లో వరుసగా ప్రతిష్టంభనలు ఏర్పడుతున్న నేపథ్యంలో.. బడ్జెట్ భేటీల విషయంలో మోదీ ముందుగానే చొరవ తీసుకుంటూ ఈ భేటీని ఏర్పాటు చేశారు. ‘‘ప్రతిపక్షం లేవనెత్తిన అంశాలకు స్పందిస్తాం..పరిష్కరిస్తాం. ఇక్కడ కనిపించిన సుహృద్భావ వాతావరణం పార్లమెంటులోనూ ప్రతిఫలిస్తుందని ఆశిస్తున్నా’’ అని ఆకాంక్షించారు. పార్లమెంటులో బిల్లులను వాటి గుణగణాల ఆధారంగా ఆమోదించాలన్నది తమ పార్టీ వైఖరి అంటూ కాంగ్రెస్ పార్టీ బంతిని సర్కారు కోర్టులోకే నెట్టివేసింది. భేటీ రెండు గంటలకు పైగా సాగింది. ఆ తర్వాత పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం.వెంకయ్యనాయుడు మీడియాతో మాట్లాడుతూ.. బడ్జెట్ భేటీలు సజావుగా సాగాలన్న అంశంపై స్థూల ఏకాభిప్రాయం వచ్చిందన్నారు. బీజేపీ వచ్చాక వాతావరణం కలుషితం జేఎన్యూ వివాదంలో ‘దేశ వ్యతిరేకుల’కు ప్రతిపక్ష కాంగ్రెస్ మద్దతిస్తోందంటూ అధికార బీజేపీ విమర్శలు ఎక్కుపెట్టిన నేపథ్యంలో.. దేశ సమైక్యత, రాజ్యాంగంపై దాడి చేస్తూ నినాదాలు చేసిన విద్యార్థులతో తమ పార్టీకి ఏ సంబంధమూ లేదని రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాంనబీఆజాద్ ఈ భేటీలో పేర్కొన్నారు. అయితే.. కన్హయ్య దేశద్రోహానికి పాల్పడ్డాడన్న ఆరోపణకు ఎలాంటి సాక్ష్యమూ లేదని తప్పుపట్టారు. కన్హయ్య.. రాజ్యాంగానికి గానీ, దేశానికి గానీ వ్యతిరేకంగా ఏమీ మాట్లాడలేదన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ దేశంలో వాతావరణం కలుషితంగా మారిపోయిందని.. అందుకు బాధ్యులైన వారిపై ఆ పార్టీ ప్రభుత్వం ఎటువంటి చర్యలూ చేపట్టలేదని ధ్వజమెత్తారు. హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో దళిత స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య అంశం గురించీ కాంగ్రెస్ నేతలు ప్రస్తావిస్తూ.. బీజేపీ విద్యార్థి విభాగమైన ఏబీవీపీ ప్రోద్బలంతోనే అతడిని ఒత్తిడికి గురిచేశారన్నారు. తమ పార్టీ నాయకత్వాన్ని దేశ వ్యతిరేకులని విమర్శిస్తూ అప్రతిష్టపాలు చేసేందుకు బీజేపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తుతూ.. అటువంటి వారిని ప్రభుత్వం నియంత్రించాలనిసూచించారు. అరుణాచల్ప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధించటానికి కారణమైన ఆ రాష్ట్ర గవర్నర్ నిర్ణయాల గురించీ కాంగ్రెస్ లేవనెత్తింది. సంయమనం పాటించాలి: వెంకయ్య జేఎన్యూ వర్సిటీ వివాదంపై ప్రభుత్వ వైఖరిని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ భేటీలో వివరించారు. వర్సిటీ కార్యక్రమంలో చేసిన నినాదాలు, అతికించిన పోస్టర్లు తీవ్ర అభ్యంతరకరమైనవన్నారు. ‘దేశ వ్యతిరేకం’ వంటి పదాల వినియోగంపై ప్రతిపక్ష నేతల ఆందోళనను గుర్తిస్తున్నామంటూనే.. ప్రధానిని ఉద్దేశించి చేసిన ‘హిట్లర్’ విమర్శలను వెంకయ్య ప్రస్తావించారు. పార్టీలన్నీ సంయమనం పాటించాలన్నారు. పార్లమెంటు సమావేశాలకు ముందు ఈ నెల 22న లాంఛనంగా జరిగే అఖిలపక్ష భేటీలో.. సమావేశాల అంశాలతో పాటు, ప్రవేశపెట్టనున్న బిల్లుల గురించి చర్చిస్తామని వెంకయ్య తెలిపారు. ఆలయంలో గంట మోగుతుంది: వామపక్షాలు దేశంలోని వర్సిటీల్లో జరుగుతున్న పరిణామాల గురించి, అరుణాచల్లో రాష్ట్రపతి పాలన గురించి అఖిలపక్ష భేటీలో వామపక్షాలు లేవనెత్తాయి. వీటిపై ప్రధాని జోక్యం చేసుకోవాలన్నాయి. ‘సీపీఎం కార్యాలయంపై దాడి చేశారు. ఏచూరికి బెదిరింపులు వచ్చాయి. సీపీఐ నేత డి.రాజాకు బెదిరింపులు వస్తున్నాయి’ అని సీపీఎం నేత మొహమ్మద్ సలీం ఆ తర్వాత మీడియాతో అన్నారు.. ‘‘బయట ఇంత గందరగోళం జరుగుతున్నపుడు ప్రజాస్వామ్య ఆలయం (పార్లమెంటు)లో గంట మోగుతుంది’ అని పేర్కొన్నారు. జీఎస్టీ బిల్లు ఆమోదానికి కృషి చేయాలని తృణమూల్కాంగ్రెస్ కోరింది. పార్లమెంటు సజావుగా సాగాలని, చర్చ జరగాలని జేడీయూ చీఫ్ శరద్యాదవ్ సూచించారు. -
విపక్ష నేతలకు ఉరి ఖరారు
ఢాకా: విపక్ష పార్టీలకు చెందిన ఇద్దరు కీలక నేతలకు ఉరిశిక్షను ఖరారు చేస్తూ బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. పాకిస్థాన్ నుంచి విడిపోయే సందర్భంలో చోటుచేసుకున్న 1971 యుద్ధ సమయంలో అనేక నేరాలకు పాల్పడ్డారంటూ అలీ అహసాన్ మహమ్మద్ ముజాహిద్(67), సలాఉద్దీన్ ఖాదర్ చౌదరిల(66)కు ప్రత్యేక న్యాయస్థానం విధించిన ఉరిశిక్షను బుధవారం సుప్రీంకోర్టు సమర్థించింది. దీంతో ఈ ఇద్దరు వృద్ధ నేతలను ఏ క్షణమైనా ఉరితీసేందుకు అనుమతి లభించినట్లయింది. ప్రస్తుతం జమాతే ఇస్లామి(బంగ్లాదేశ్) పార్టీలో కీలకనేతగా ఉన్న మహమ్మద్ ముజాహిద్.. 1971 యుద్ధ సమయంలో వేలాది మైనారిటీ హిందువుల ఊచకోతలకు ప్రేరేపించడం, పలువురు మేధావులను హింసించడంతోపాటు వారిలో కొందరిని హత్య చేయించారనే ఆరోపణలున్నాయి. తనపై నమోదయిన ఐదుకేసుల్లోనూ ముజాహిద్ దోషిగా తేలారు. ఇక ఖాదర్ చౌదరి విషయానికి వస్తే ప్రస్తుతం ఖలీదా జియా నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్ పీ)లో కీలక నేతగా ఉన్న ఆయన.. యుద్ధసమయంలో పెద్ద ఎత్తున సామూహిక హత్యాకాండలు జరిపించారని, ఇతర మతాలకు చెందిన గురువులను తీవ్రంగా హింసించారనే ఆరోపణలు నిజమేనని 2013లో నిర్ధారణ అయింది. కాగా, ప్రత్యేక న్యాయస్థానం విధించిన ఉరి శిక్షపై ఈ ఇరువురూ సుప్రీంకోర్టును ఆశ్రయించగా అక్కడ కూడా చుక్కెదురైంది. 1971 యుద్ధనేరాలపై పలు వివాదాలు చెలరేగుతుండటంతో ప్రధాని షేక్ హసీనా.. 2010లో సమగ్ రవిచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. యుద్ధ నేరాల్లో దోషులుగా తేలినవారిలో ఇప్పటికే కొద్దిమందికి మరణదండన అమలుకాగా, నేటి తీర్పుతో ఆ సంఖ్య పెరగనుంది. సుప్రీంతీర్పు నేపథ్యంలో ఆయా పార్టీల ప్రభావిత ప్రాంతాల్లో అలజడులు చెలరేగే అవకాశం ఉండటంతో గట్టి బందోబస్తుకు ఆదేశాలు జారీఅయ్యాయి. -
దేవుళ్లు దయ్యాలయ్యారా?
-
దేవుళ్లు దయ్యాలయ్యారా?
మున్సిపల్ కార్మికుల మహాధర్నాలో సీఎంపై విపక్ష నేతల ఫైర్ హైదరాబాద్: ‘‘పారిశుద్ధ్య కార్మికులు నిజమైన దేవుళ్లని ‘స్వచ్ఛ హైదరాబాద్’ కార్యక్రమంలో మీరే అన్నారు. ఇప్పుడు న్యాయమైన కోరికలు తీర్చాలని అడిగితే ఆ దేవుళ్లు దయ్యాలయ్యారా?..’’ అని సీఎం కేసీఆర్పై విపక్షాల నేతలు మండిపడ్డారు. కార్మిక దేవుళ్లు రోడ్డున పడి ధర్నాలు చేస్తుంటే పట్టించుకోవడం లేదేమని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం దేవుళ్లకు వందల కోట్లు ఖర్చు చేస్తోందని, అందులో కొంత డబ్బు కేటాయించినా కార్మికుల బతుకులు బాగుపడతాయని పేర్కొన్నారు. మున్సిపల్ ఉద్యోగ, కార్మిక ఐక్య సంఘాల ఆధ్వర్యంలో శనివారం ఇందిరాపార్కు వద్ద జరిగిన ‘మహా ధర్నా’లో వివిధ పార్టీల నేతలు పాల్గొని మాట్లాడారు. ‘‘సీఎం కేసీఆర్ మొన్న యాదగిరిగుట్టకు వెళ్లి లక్ష్మీనరసింహ స్వామికి రూ.200 కోట్లు ఇచ్చారు. పండుగలూ బ్రహ్మండంగా చేస్తున్నారు. లక్ష్మీ నరసింహ స్వామి ఏమైనా సమ్మె చేశారా?’’ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రశ్నించారు. కేసీఆర్కు ఓ అలవాటు ఉందని. ఆయనకు దండం పెడితే కోరికలు తీరవని, దండం తీస్తేనే తీరుతాయని వ్యాఖ్యానించారు. పారిశుద్ధ్య కార్మికులను ప్రభుత్వం గడ్డిపోచ కింద లెక్కగడుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి విమర్శించారు. ఆ గడ్డిపోచలు కలిస్తే టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉరితాడు తయారవుతుందని మరిచిపోవద్దని.. కార్మికుల సమస్యల పరిష్కారంపై పట్టింపులకు పోవద్దని కేసీఆర్కు సూచించారు. మన రాష్ట్రం, మన ప్రభుత్వం వచ్చిందనుకుంటే రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలన సాగుతోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్కు ‘చెత్తశుద్ధి’ ఉంటే స్వచ్ఛ హైదరాబాద్ అంటూ మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఇప్పుడు రోడ్లపైకి పంపాలని కాంగ్రెస్ నేత దానం నాగేందర్ ఎద్దేవా చేశారు. ఈ మహాధర్నాలో టీడీపీ నేత కృష్ణయాదవ్, బీజేపీ నేత కృష్ణమూర్తి, అన్వేష్ (సీపీఐఎంఎల్), జానకీరాములు (ఆర్ఎస్పీ), వెంకట్రెడ్డి(ఆప్), కార్మిక సంఘాల నేతలు పాలడుగు భాస్కర్ (సీఐటీయూ), ఏసురత్నం (ఏఐటీయూసీ), కృష్ణ (ఐఎఫ్టీయూ), సుధీర్(ఏఐటీయూసీ), రామారావు మాట్లాడారు. రేపటి నుంచి దీక్షలు.. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోతే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని మున్సిపల్ కార్మిక సంఘాల నేతలు ప్రకటించారు. ఈ మేరకు భవిష్యత్ కార్యాచరణను రూపొందిం చామని, సోమవారం నుంచి జీహెచ్ఎంసీతో పాటు రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల వద్ద రిలే నిరాహార దీక్షలు ప్రారంభిస్తామని చెప్పా రు. మంగళవారం మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేల ఇళ్ల ముందు నిరసనలు చేపడతామని.. అవసరమైతే ఆ తర్వాత ఆమరణ నిరాహార దీక్షలకూ దిగుతామని ప్రకటించారు. కా గా కార్మికుల సమ్మెతో గ్రేటర్ హైదరాబాద్ పరి ధిలో ఎక్కడ చూసినా చెత్త పేరుకుపోయింది. పర్యాటక, చారిత్రక ప్రాంతాలు కూడా అధ్వానంగా మారాయి. శనివారం విధులకు హాజరై న కొందరు తాత్కాలిక, ఔట్సోర్సింగ్ సిబ్బం దిని సమ్మెలో ఉన్న కార్మికులు అడ్డుకోవడంతో పలుచోట్ల ఘర్షణ వాతావరణం నెలకొంది. రివర్స్ గేర్లో చర్చలు సమ్మె విరమిస్తే వేతనాలు పెంచుతామంటున్న ప్రభుత్వం, వేతనాలు పెంచితేనే సమ్మె విరమిస్తామంటున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ కార్మికులు... ఇలా ఎవరికివారే పట్టుదలతో ఉండడంతో ఎన్నిసార్లు చర్చించినా ఫలితం తేలడం లేదు. వేతనాలు పెంచేందుకు సిద్ధమేనని ప్రభుత్వం, సమ్మె విరమణకు సిద్ధమని కార్మిక నేతలూ సెలవిస్తున్నా... ఎవరు ముందు చేయాలన్నదానిపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఇప్పటివరకు ప్రభుత్వం కార్మిక నేతలతో నాలుగు పర్యాయాలు జరిపిన చర్చలు విఫలం కావడానికి ఇదే కారణమని తెలుస్తోంది. తాజాగా శనివారం కూడా కార్మిక నేతలతో మంత్రి నాయిని దాదాపు మూడున్నర గంటల పాటు జరిపిన చర్చలూ విఫలమయ్యాయి. దీంతో సమ్మె కొనసాగుతుందని కార్మిక నేతలు ప్రకటించారు. సమ్మె విరమిస్తే జీతాలు పెంచుతామని మంత్రి చెప్పారని, జీతాలు పెంచితేనే సమ్మె విరమిస్తామని తాము తేల్చి చెప్పామని తెలిపారు. -
తెలంగాణ స్పీకర్ ను కలసిన విపక్ష నేతలు
హైదరాబాద్: టీఆర్ఎస్, టీడీపీలు పట్టింపులకు పోకుండా సభను సజావుగా జరిగేందుకు సహకరించాలని కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత జానారెడ్డి, బీజేఎల్పీ నేత కె. లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు. అయితే ఈ విషయంపై పార్టీలో చర్చించుకుని ఆ తర్వాత స్పందిస్తామని మంత్రులు హరీష్రావు, ఈటెల తెలిపారు. మంత్రి కేటీఆర్పై తామిచ్చిన ప్రివిలేజ్ మోషన్పై స్పందించాల్సిందేనని ప్రభుత్వాన్ని టీటీడీపీ ఫ్లోర్ లీడర్ ఎర్రబెల్లి డిమాండ్ చేశారు. అంతకుమందు అసెంబ్లీ 10 నిముషాలు వాయిదా పడింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో చోటు చేసుకుంటున్న ప్రతిష్టంభనను తొలగించాలని స్పీకర్ మధుసూధనాచారీకి విజ్ఞప్తి చేసేందుకు ఆయనతో భేటీ అయ్యారు. ఈ భేటీలో జానారెడ్డి, ఎర్రబెల్లి, లక్ష్మణ్, మంత్రి హరీష్రావులు పాల్గొన్నారు. -
ప్రతిపక్ష నేతలందరికీ గవర్నర్ ఫోన్
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా వ్యవహారంపై ఇంకా సందిగ్దత కొనసాగుతూనే ఉంది. సీఎం పదవికి రాజీనామా చేస్తూ ఆయన గవర్నర్ నరసింహన్కు లేఖ సమర్పించడం, ఆయన ఆమోదించడం అన్నీ చెకచెకా జరిగిపోయాయి. సంప్రదాయం ప్రకారం గవర్నర్ ఈ విషయాన్ని ప్రతిపక్ష పార్టీల నేతలకు ఫోన్ చేసి చెప్పారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, వైఎస్ఆర్ సిపి గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు, బిజెపి సీనియర్ నేత దత్తాత్రేయలకు సిఎం రాజీనామా విషయాన్ని తెలియజేశారు. ఇక ఏం చేయాలనేదాని కోసం గవర్నర్ ఢిల్లీ సూచనల కోసం ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా విషయం రేపు ఉదయం ఢిల్లీలో జరిగే కేంద్ర మంత్రి మండలి సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఈ సమావేశంలో రాష్ట్రపతి పాలనపై నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. సిఎం రాజీనామా చేసిన వెంటనే గవర్నర్ ఆమోదించడం, ఆ తరువాత సంప్రదాయం ప్రకారం ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగమని కోరకపోవడం పలు రకాల ఆలోచనలకు దారి తీస్తోంది. -
పేదలకు మేలు చేసేది మేమే : రాహుల్ గాంధీ
విపక్ష నేతలు చాలానే చెబుతారు... మోడీపై రాహుల్ పరోక్ష విమర్శలు బరణ్ (రాజస్థాన్): విపక్ష నేతలు మాటలు చాలానే చెబుతారని, పనులు మాత్రం సంపన్నుల కోసమే చేసి పెడతారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. కాంగ్రెస్ మాత్రం మాటల్లో కాకుండా, చేతల్లోనే పేదలకు మేలు చేస్తుందని అన్నారు. రాజస్థాన్లోని బరణ్ పట్టణంలో మంగళవారం ఏర్పాటైన భారీ ర్యాలీలో ప్రసంగించిన రాహుల్, ముఖ్యంగా బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీపై పరోక్షంగా విమర్శనాస్త్రాలు సంధించారు. అట్టడుగు స్థాయిలో ఉన్న నిరుపేదలు, మహిళలు తమ కలలను సాకారం చేసుకునేలా ఎదగాలన్నదే తమ సంకల్పమని, ఈ సంకల్పమే లేకుంటే తమకు రాజకీయాలతో పని లేదని ప్రజల హర్షధ్వానాల మధ్య అన్నారు. పేదలకు లబ్ధి కలిగించే ఆహార భద్రతా బిల్లు, భూసేకరణ బిల్లు వంటి వాటిని యూపీఏ ప్రభుత్వమే తెచ్చిందని, బలహీన వర్గాల ఆర్థిక స్వావలంబన కోసం మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వంటి పథకాలను అమలు చేస్తోందని చెప్పారు. ఆచరణకు నోచుకోని మాటలు చెప్పడంలో తమకు నమ్మకం లేదని, మాటలతో సరిపుచ్చకుండా, ఏదైనా ఆచరణలో చేసి చూపించడమే తమకు తెలుసునని అన్నారు. ‘మీ బిడ్డలు పెద్దపెద్ద కలలు కనాలని మేం కోరుకుంటాం... మిమ్మల్ని మేం కలలు కననివ్వకపోతే, ఈ దేశం ముందుకు సాగదు’ అని అన్నారు. ‘మా రాజకీయాలు... మీ కలల రాజకీయాలు’ అని వ్యాఖ్యానించారు. ‘కేవలం దాదాపు ఐదువందల మంది మాత్రమే కలలు కనాలని, వారు మాత్రమే విమానాలు, కార్లలో తిరగాలని వారు కోరుకుంటున్నారు. ఇదీ వారి ఆలోచనా ధోరణి’ అని విపక్షాలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సంక్షేమ పథకాలను ప్రకటిస్తే, వాటి అమలుకు నిధులు ఎలా వస్తాయని విపక్షాలు ప్రశ్నిస్తాయని, అయితే, భూముల సేకరణ, గనుల కేటాయింపులు వంటి వ్యవహారాల్లో ఎవరూ నోరు మెదపరని అన్నారు. కాంగ్రెస్ ఎల్లప్పుడూ పేదల పక్షానే నిలిచిందని, ఇకపైనా ఇదే పంథాను కొనసాగిస్తుందని హామీ ఇచ్చారు.