ornaments
-
రత్నాభరణాలపై జీఎస్టీ తగ్గింపు?
రత్నాభరణాల పరిశ్రమలో ఉత్పత్తవుతున్న వస్తువులపై జీఎస్టీని తగ్గించాలని ఇండియా జెమ్ అండ్ జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ (GJC) ప్రభుత్వాన్ని కోరింది. జీఎస్టీకి సంబంధించి రాబోయే బడ్జెట్లో తీసుకోబోయే నిర్ణయాలపై వివిధ విభాగాల నుంచి ప్రభుత్వం వినతులు కోరింది. అందులో భాగంగా జీజేసీ రత్నాభరణాల ఉత్పత్తిపై జీఎస్టీని తగ్గించాలని తెలిపింది.ఈ సందర్భంగా జీజేసీ ఛైర్మన్ రాజేశ్ రోక్డే మాట్లాడుతూ..‘జెమ్స్ అండ్ జువెలరీ రంగం ఉత్పత్తి చేస్తున్న వస్తువులపై జీఎస్టీ(GST)ని 1 శాతానికి తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరాం. ప్రస్తుతం అది 3 శాతంగా ఉంది. జీఎస్టీని తగ్గిస్తే వినియోగదారులపై వ్యయ భారం తగ్గుతుంది. రాబోయే బడ్జెట్లో వ్యాపారాలకు, తయారీ రంగానికి ఊతమిచ్చేలా పన్నుల హేతుబద్ధీకరణ ఉండాలని తెలియజేశాం. వరుసగా పెరుగుతున్న బంగారం రేట్లకు అనుగుణంగా ప్రస్తుత జీఎస్టీ రేటు అంతకంతకూ పెరుగుతోంది. ఇది పరిశ్రమకు, అంతిమ వినియోగదారులకు భారంగా మారుతోంది. సహజ వజ్రాలు, ల్యాబ్లో తయారు చేసే వజ్రాలకు మధ్య తేడా గుర్తించేలా పకడ్బందీ విధానాలు ఉండాలి. ప్రస్తుతం సహజ వజ్రాలు(Natural diamonds), ప్రయోగశాలలో తయారు చేసే వజ్రాలపై ఒకే జీఎస్టీ రేటు ఉంది. ల్యాబ్లో తయారు చేసే వజ్రాలపై జీఎస్టీ తగ్గించాలి’ అన్నారు.ఇదీ చదవండి: అమెజాన్ తొలి రాకెట్ ప్రయోగం.. స్పేస్ఎక్స్కు ముప్పు?ఆభరణాల కొనుగోలుపై ఈఎంఐజ్యువెలరీ పరిశ్రమకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ కావాలని, రాష్ట్రాల వారీగా స్పెషల్ నోడళ్లను ఏర్పాటు చేయాలని జీజేసీ ప్రభుత్వాన్ని కోరింది. ఆభరణాల కొనుగోలుపై ఈఎంఐను పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఎప్పటినుంచో కోరుతున్నట్లు జీజేసీ తెలిపింది. వచ్చే సమావేశాల్లో ఈమేరకు నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. పన్ను రేటు తగ్గింపు వల్ల గ్రామీణ ప్రాంతాల్లో అధికారిక కొనుగోళ్లు పెరుగుతాయని జీజేసీ వైస్ ఛైర్మన్ అవినాష్ గుప్తా అన్నారు. ఆర్థిక వ్యవస్థలో నిరుపయోగంగా ఉన్న గృహ బంగారాన్ని వెలికితీసే కొత్త విధానాలు ప్రవేశపెట్టాలని తెలిపారు. -
171.6 టన్నుల బంగారు ఆభరణాలు!
బంగారంపై మక్కువ రోజురోజుకూ పెరుగుతోంది. గోల్డ్ కొనుగోలును చాలామంది పెట్టుబడిగా భావిస్తారు. అందుకే భారత్లో వాటి రిజర్వ్లు పెరుగుతున్నాయి. బంగారు ఆభరణాల డిమాండ్ సెప్టెంబర్ త్రైమాసికంలో 171.6 టన్నులకు చేరిందని నివేదికల ద్వారా తెలిసింది. క్రితం ఏడాది ఇదే కాలంలో దీని డిమాండ్ 155.7 టన్నుల కంటే ఈసారి 10 శాతం పెరిగింది. దిగుమతి సుంకం తగ్గింపుతో ఆభరణాలకు అనూహ్య డిమాండ్ పెరిగిందని.. 2015 తర్వాతి కాలంలో ఒక ఏడాది మూడో త్రైమాసికంలో ఆభరణాలకు గరిష్ట డిమాండ్ ఏర్పడినట్టు ప్రపంచ పసిడి మండలి(వర్ల్డ్ గోల్డ్ కౌన్సిల్) ప్రాంతీయ సీఈవో సచిన్ జైన్ తెలిపారు.బంగారంపై సుంకం తగ్గింపుతో బంగారం ధరలు తగ్గుతాయని తొలుత అందరూ భావించారు. కానీ అదనంగా ఇతర అంశాలు తొడవ్వడంతో దేశీయంగా డిమాండ్ పెరగడానికి దారితీసినట్టు డబ్ల్యూజీసీ నివేదిక తెలిపింది. ముఖ్యంగా ఆర్బీఐ నుంచి బంగారం కొనుగోళ్లు కొనసాగడం, మంచి వర్షాల సీజన్ డిమాండ్కు ప్రేరణగా నిలిచినట్టు పేర్కొంది. నివేదిక ప్రకారం సెప్టెంబర్ క్వార్టర్లో ఆర్బీఐ 13 టన్నుల మేర కొనుగోలు చేసింది. ఆర్బీఐ వద్ద నిల్వలు 854 టన్నులుఈ ఏడాది జనవరి–మార్చి కాలంలో, ఏప్రిల్–జూన్ కాలంలో 18 టన్నుల చొప్పున ఆర్బీఐ బంగారం కొనుగోలు చేసింది. దీంతో బంగారం నిల్వలు 854 టన్నులకు చేరాయి. 2023 చివరితో పోల్చి చూస్తే ఇది 6% పెరిగాయి. జులై–సెప్టెంబర్ త్రైమాసికంలో బంగారంలో పెట్టుబడుల డిమాండ్ 76.7 టన్నులుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న 54.5 టన్నులతో పోల్చి చూస్తే 41 శాతం పెరిగినట్టు డబ్ల్యూజీసీ తెలిపింది. పునర్వినియోగానికి సిద్ధం చేసిన (రీసైకిల్డ్) ఆభరణాల పరిమాణం 23.4 టన్నులుగా ఉంది.ఇదీ చదవండి: గూగుల్ ఆస్తులమ్మినా తీరని జరిమానా!ఇక ముందూ బలమైన డిమాండ్ డిసెంబర్ త్రైమాసికంలోనూ బంగారం డిమాండ్ బలంగా కొనసాగుతుందని సచిన్ జైన్ పేర్కొన్నారు. పండగ సీజన్తోపాటు వివాహాల కోసం కొనుగోళ్లు డిమాండ్కు మద్దతుగా నిలుస్తాయన్నారు. బంగారం ధరలు పెరగడం దిగుమతి సుంకం ప్రయోజనాన్ని పూర్తిగా హరించిందని..దీంతో కొందరు పెట్టుబడి దృష్ట్యా బంగారం ధరలు తగ్గే వరకు వేచి చూడొచ్చని అభిప్రాయపడ్డారు. -
మరికొద్ది గంటల్లో తెరుచుకోనున్న పూరీ రత్నభాండాగారం
దేశమంతా అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఒడిశాలోని పూరీ శ్రీక్షేత్ర రత్న భాండాగారం రహస్య గది తెరిచేందుకు రంగం సిద్ధమైంది. ఐదు కర్ర పెట్టెల్లో దాచిన విలువైన జగన్నాథుని ఆభరణాల గది రేపే తెరుచుకోనుంది.ఈ రత్న భాండాగారంపై ఏళ్లుగా చర్చ నడుస్తోంది. గతంలో రాజులు, భక్తులు సమర్పించిన అనేక బంగారు, వజ్ర, రత్నాభరణాలు ఈ గదిలో ఉన్నాయని.. వీటి విలువ వెలకట్టలేనిదని అంచనాలున్నాయి.ఆదివారం పూరీలోని ప్రముఖ జగన్నాథ దేవాలయంలోని రత్న భాండాగారాన్ని తెరవనున్నారు. అందులోని విలువైన వస్తువులపై ఆడిట్ చేయనున్నారు. అక్కడ ఉంచిన విలువైన వస్తువులపై ఆడిట్ చేయనున్నారు.46 ఏళ్ల తర్వాత ఆ రహస్య గది తెరవనుండటంతో లోపల కింగ్ కోబ్రా వంటి భారీ విష సర్పాలుంటాయనే భయం నెలకొంది. ముందు జాగ్రత్తగా పాములు పట్టడంలో నిపుణులైన వారిని పిలిపించారు. ఒకవేళ విషసర్పాలు కాటేసినా.. సత్వర వైద్యం కోసం వైద్యుల్ని సిద్ధం చేశారు. అయితే.. పురాతన దేవాలయం కాబట్టి చిన్న చిన్న రంధ్రాల ద్వారా పాములు రత్న భండారంలోకి ప్రవేశించే అవకాశం ఉందని సేవకుడు హరేకృష్ణ మహాపాత్ర అంటున్నారు. జగన్నాథ్ హెరిటేజ్ కారిడార్ ప్రాజెక్టు పనులు చేస్తుండగా ఆలయ పరిసరాల్లో పాములు కనిపించిన సందర్భాన్ని ఆయన ప్రస్తావించారు కూడా.👉పూరీ జగన్నాథ ఆలయం కింది భాగంలో ఈ రత్న భాండాగారం ఉంది. ఇందులో రెండు భాగాలున్నాయి. 12వ శతాబ్దంలో రాజులు సమర్పించిన అనేక వజ్ర, రత్నాభరణాలు ఈ గదిలో ఉన్నాయి. ఆలయంలో రోజువారీ పూజలు నిర్వహించేందుకు అవసరమైన నగలు నిధి పైభాగంలో ఉంటాయి. మిగతా ఆభరణాలు ఖజానా కింది భాగంలో భద్రపరుస్తారు. 👉అయితే.. లోపలి భాగంలో వెలకట్టలేనంత అపార సంపద ఉందని భావిస్తుంటారు. అయితే.. దీని తాళాలు మాత్రం కొన్నేళ్లుగా కనిపించకుండా పోయాయి. దీంతో.. ఆ ఆభరణాలు భద్రంగా ఉన్నాయా? లేదా? అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.👉భాండాగారంలో భారీ మొత్తంలో బంగారం, వజ్రాలు, నగలు కొన్ని వస్త్రాల్లో చుట్టి చెక్కపెట్టెల్లో ఉన్నాయని ఆలయ మాజీ నిర్వాహకులు రబీంద్ర నారాయణ్ మిశ్రా వెల్లడించారు. 1978లో ఓసారి ఆ గదిని పరిశీలించిన బృందంలో మిశ్రా కూడా ఒకరు. ఆ సమయంలో విలువైన నగల వివరాలన్నింటిని పొందుపరిచారు. తమిళనాడు, గుజరాత్లకు చెందిన కంసాలీలను రప్పించినప్పటికీ.. ఆ ఆభరణాల విలువను మాత్రం లెక్కకట్టలేకపోయారు. తిరిగి 1985లో ఆ రత్న భాండాగారాన్ని తెరిచి చూసినప్పటికీ కొత్త జాబితాను మాత్రం రూపొందించలేదు.👉ఆభరణాల భద్రతపై ప్రజల్లో అనుమానాలు వ్యక్తమైన తరుణంలో దానిని తెరిచేందుకు కొన్నేళ్ల క్రితం ప్రయత్నాలు జరిగాయి. ఈ క్రమంలోనే.. హైకోర్టు ఆదేశాల మేరకు జస్టిస్ రఘుబీర్ దాస్ కమిషన్ బృందం భాండాగారం తలుపులు తెరిచేందుకు 2018 ఏప్రిల్ 4న పరిశీలనకు వెళ్లింది. అయితే, రహస్య గది తాళం చెవి లేకపోవడంతో లోపలకు వెళ్లలేకపోయింది. కిటికీ ద్వారా వెలుపల నుంచి పరిశీలించిన బృందం.. పైకప్పుల పెచ్చులు ఊడటం, గోడల్లో తేమ ఉండడాన్ని గమనించారు. వెంటనే మరమ్మతులు చేయకపోతే భాండాగారానికి ముప్పు ఉందని హెచ్చరించారు. ఇది జరిగిన కొన్నాళ్లకు ఆ గదికి సంబంధించిన డూప్లికేట్ తాళం లభ్యమైందని ప్రభుత్వం వెల్లడించింది. 👉జగన్నాథుని రత్న భాండాగారాన్ని గురించిన మొదటి అధికారిక వివరణ 1805లో అప్పటి పూరీ కలెక్టర్ చార్లెస్ గోమ్స్ నివేదికలో వచ్చింది. ఆ సమయంలో రత్న భాండాగారంలో రత్నాలు పొదిగిన బంగారు, వెండి ఆభరణాలు, 128 బంగారు నాణేలు, 24 బంగారు కడ్డీలు, 1297 వెండి నాణేలు, 106 రాగి నాణేలు, 1333 రకాల వస్త్రాలు లభించాయి. 👉కాగా, 1978లో జగన్నాథ ఆలయంలోని రత్నాల దుకాణాన్ని తెరిచినప్పుడు అక్కడ 454 బంగారు ఆభరణాలు, 293 వెండి వస్తువులు లభించాయి. 1982 – 1985 సంవత్సరాలలో రత్న భండాగారం తెరచుకుంది. కానీ అప్పటికి విషయాలు లెక్కించలేదు.👉జగన్నాథుడి సన్నిధిలో విలువైన ఆభరణాలకు సంబంధించి ఒడిశా అసెంబ్లీలోనూ చర్చ జరిగింది. 2021లో అప్పటి న్యాయశాఖ మంత్రి ప్రతాప్ జెనా మాట్లాడుతూ.. 1978లో రూపొందించిన జాబితా ప్రకారం, 12,831 భరీల బంగారం (ఒక భరీ సుమారు 12 గ్రాములతో సమానం), 22,153 భరీల వెండితోపాటు అత్యంత విలువైన రాళ్లతో కూడిన బంగారు ఆభరణాలు, ఇతర నగలు ఉన్నాయి. ఎంతో విలువైన రాళ్లతో కూడిన 22,153 భరీల వెండి కూడా నిపుణులు గుర్తించారు. వీటితోపాటు వెండి ఉపకరణాలు ఉన్నాయి. అయితే, పలు కారణాల వల్ల 14 బంగారు, వెండి ఆభరణాలను కొలవలేకపోయినందున వాటిని ఈ జాబితాలో పొందుపరచలేదని చెప్పారు.👉రఘుబీర్ కమిటీ నివేదికపై జులై 10లోగా స్పందన తెలియజేయాలంటూ ఒడిశా హైకోర్టు.. ప్రభుత్వాన్ని ఆదేశించిన నేపథ్యంలో ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. తాళాలు ఎలా మాయమయ్యాయని.. డూప్లికేట్ తాళాలతో వాటిని తెరవాల్సిందేనని విపక్ష పార్టీలు పట్టుబట్టాయి. రాజకీయం చేయొద్దని బీజేడీ కోరినా.. బీజేపీ, కాంగ్రెస్లు వెనక్కి తగ్గలేదు. అయితే ఈలోపే ఎన్నికలు జరిగాయి. ఒడిశాలో తొలిసారి అధికారం చేపట్టిన బీజేపీ.. ఎన్నికల హామీ మేరకు రత్న భాండాగారం తెరిపించేందుకు సిద్ధమైంది.👉ఒడిశా పూరీ జగన్నాథ క్షేత్రంలోని రత్న భాండాగారాన్ని తెరిపించి సంపద లెక్కింపు, భాండాగారం మరమ్మతులు పర్యవేక్షించేందుకు బీజేపీ ప్రభుత్వం హైకోర్టు రిటైర్డ్ జడ్జి బిశ్వనాథ్ రథ్ కమిటీని ఏర్పాటు చేసింది. దీంతో.. ఈ నెల 14న(ఆదివారం) రత్న భాండాగారం రహస్య గదిని తిరిగి తెరవాలని ఒడిశా ప్రభుత్వానికి ఆ కమిటీ సిఫార్సు చేసింది.👉జగన్నాథ ఆలయంలోని రత్నాల భాండాగారాన్ని తెరిచే బాధ్యతను బిశ్వనాథ్ కమిటీనే తీసుకుంది. ఆయన నేతృత్వంలోని 16 మంది సభ్యుల కమిటీకి ఈ బాధ్యతను అప్పజెప్పారు. ఈ కమిటీ జగన్నాథ ఆలయంలోని రత్న భాండాగారంలో ఉంచిన వస్తువులను లెక్కించి వాటిపై నివేదికను రూపొందిస్తుంది. సంప్రదాయ దుస్తుల్లో.. రత్న భాండాగారం తెరిచి అక్కడున్న వస్తువులను లెక్కిస్తారని తెలుస్తోంది. -
బాలరామునికి నేపాల్ నుంచి కానుకలు!
అయోధ్యలో నూతన రామాలయం ప్రారంభమైనది మొదలు బాలరాముని దర్శనం కోసం భక్తులు బారులు తీరుతున్నారు. దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా బాలరాముని దర్శనం కోసం జనం తరలివస్తున్నారు. తాజాగా నేపాల్ విదేశాంగ మంత్రి ఎన్ పి సౌద్ అయోధ్యలో బాలరాముణ్ణి దర్శించుకునేందుకు వచ్చారు. ఆయన తనతోపాటు బాలరామునికి ఐదు కానుకలు తీసుకువచ్చారు. అయోధ్యలోని మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయంలో నేపాల్ విదేశాంగ మంత్రికి యూపీకి చెందిన సీనియర్ అధికారులు స్వాగతం పలికారు. నేపాల్ విదేశాంగ మంత్రితో పాటు ఆయన భార్య జ్యోత్స్నా సౌద్ కూడా అయోధ్యకు వచ్చారు. ఈ దంపతులు రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నేపాల్ విదేశాంగ మంత్రి రామ్లల్లాకు ఐదు రకాల వెండి ఆభరణాలను సమర్పించారు. వీటిలో విల్లు, గద, కంఠహారం, చేతులు, కాళ్లకు ధరించే కంకణాలు మొదలైనవి ఉన్నాయి. విదేశాంగ మంత్రి సౌద్ అయోధ్యను సందర్శించడానికి వచ్చిన నేపాల్ ప్రభుత్వ తొలి మంత్రి. ఆయన సరయూ నది ఒడ్డున సాయంత్రం జరిగే హారతిలో కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే హనుమాన్గర్హి ఆలయాన్ని కూడా సందర్శిస్తారు. -
శ్రావణమాసంలో బంగారం కొంటున్నారా?ఈ ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసా?
భారతీయ మహిళలకు బంగారానికి అవినాభావ సంబంధం ఉంటుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందులోనూ శ్రావణమాసం వచ్చిందంటే చాలు బంగారం కొనేందుకు మరింత ఆసక్తి చూపిస్తుంటారు. అధిక మాసం ముగిసి నిజ శ్రావణ మాసంలోకి అడుగు పెట్టడంతో పెళ్లిళ్లు, గృహప్రవేశాలు..ఇలా ఒకటేమిటి వరుసగా శుభకార్యాలు జరగనున్నాయి. ఈ క్రమంలో వ్రతాలు, పూజల నేపథ్యంలో షాపింగ్ చేసే వారి సంఖ్య పెరుగుతుంది. మరీ ముఖ్యంగా బంగారం కొనుగోళ్లు ఊపందుకున్నాయి. మరి బంగారం వేసుకుంటే అందంతో పాటు ఆరోగ్యం కూడా పెరుగుతుందని మీకు తెలుసా? బంగారం వెనకున్న సైంటిఫిక్ రీజన్స్ ఏంటన్నది ఇప్పుడు తెలుసుకుందాం. తరాలు మారుతున్నా బంగారానికి ఉన్న ఆధరణ మాత్రం అస్సలు తగ్గడం లేదు. ట్రెండ్కి తగ్గట్లు కొత్తకొత్త డిజైన్లు మార్కెట్లో సందడి చేస్తున్నాయి. సాదారణంగానే పెళ్లిళ్లు, ఫంక్షన్లకు బంగారం షాపుల వైపు చూసే మగువలు ఇక శ్రావణమాసం వచ్చిందంటే మరింత ఆసక్తి కనబరుస్తుంటారు. శ్రావణమాసంలో లక్ష్మీదేవి తమ ఇంట్లో కొలువై ఉంటుందని భావిస్తారు. దీంతో ఎంతో కొంత బంగారం కొనుగోలు చేయాలని అనుకుంటారు. ఇక అప్పట్లో ఏడువారాల నగలు ఎక్కువగా ధరించేవారు. ఆ పేరులోనే నిండుదనం ఉంది. ఎంత బంగారం ఉన్నా ఏడువారాల నగలు అనగానే వచ్చే ఆ ఆనందమే వేరు. ఇంతకీ ఏడువారాల నగలలకున్న ప్రత్యేకత ఏంటంటే.. ఆదివారం- సూర్యుడు: కెంపులు పొదిగిన కమ్మలు, హారం సోమవారం - చంద్రుడు: ముత్యాల హారాలు, గాజులు మంగళవారం- కుజుడు: పగడాల దండలు, ఉంగరాలు బుధవారం - బుధుడు: పచ్చల పతకాలు, గాజులు గురువారం - బృహస్పతి: పుష్యరాగం కమ్మలు, ఉంగరాలు శుక్రవారం - శుక్రుడు: వజ్రాల హారాలు, ముక్కుపుడక శనివారము - శని: నీలమణి హారాలు.. ఇలా ఏడువారాల నగలను ఒక్కో రోజు ఒక్కో గ్రహం అనుగ్రహం కోసం వీటిని ధరించేవారు. దీనివల్ల ఆయువు, ఆరోగ్యాలు సిద్ధిస్తాయని నమ్మకం. బంగారం అనేది అలంకార ప్రాయం అని మాత్రమే అనుకుంటారు..కానీ బంగారు ఆభరణాలు వేసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటంటే.. ►చర్మానికి వచ్చే ఎన్నో రకాల ఇన్ఫెక్షన్స్ను దరిచేరకుండా బంగారం కాపాడుతుందట. ► బంగారు ఆభరణాలు ధరించడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. శరీరంపై ఏదైనా గాయాలు తగిలినా త్వరగా నయం అయ్యేలా చేస్తుంది. ► బాడీ టెంపరేచర్ను స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది. ► ఒత్తిడి ఆందోళన వంటి మానసిక సమస్యలు దూరమై మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. ► ఆర్థరైటిస్తో బాధపడేవాళ్లు బంగారు ఆభరణాలు ధరించడం వల్ల ప్రయోజనకరంగా ఉంటుందట ►ఆయుర్వేద శాస్త్రం ప్రకారం.. బంగారం వేసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుందట ► దీర్ఘాయువును పెంచడంలో కూడా బంగారం చాలా చక్కగా పనిచేస్తుంది. ► బంగారాన్ని ఏ రూపంగా ధరించినా ఎంతో కొంత శక్తి శరీరానికి సంక్రమిస్తుంది. ► బంగారు ఆభరణాలు ధరిస్తే శరీరంలోని వివిధ భాగాలకు ఆక్సిజన్ ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. ►ఈమధ్య వివిధ సౌందర్య చికిత్సల్లోనూ బంగారన్ని ఉపయోగిస్తున్నారు. దీనివల్ల ముఖం కాంతివంతంగా మారడమే కాకుండా చర్మం యవ్వనంగా మారుతుంది. -
ఊరిలోని చిన్నాపెద్దా అందరూ బంగారం ప్రియులైతే.. ఏఐ ఫోటోలు
-
ప్రపంచంలోని టాప్ 10 అత్యంత అరుదైన ఆభరణాలు
-
దొంగను మార్చేసిన భగవద్గీత.. చోరీ చేసిన నగలు వెనక్కి!
భగవద్గీత ఓ దొంగలో మార్పు తీసుకొచ్చింది. చేసిన తప్పులకు పశ్చాత్తాపం చెందడమే కాదు.. తొమ్మిదేళ్ల కిందట ఓ ఆలయంలో చోరీ చేసిన నగలను సైతం తిరిగి ఇచ్చేలా చేసింది. ఆశ్చర్యకరమైన ఈ ఘటన భువనేశ్వర్(ఒడిషా)లో జరిగింది. భువనేశ్వర్లోని గోపీనాథ్పూర్ రాధాకృష్ణ ఆలయంలో 2014 మే నెలలో చోరీ జరిగింది. కృష్ణ భగవానుడికి చెందిన లక్షల విలువైన ఆభరణాలు మాయమయ్యాయి. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే.. అవి దొరకపోవడంతో కొత్త అభరణాలు చేయించారు ఆలయ నిర్వాహకులు. కట్ చేస్తే.. ఈ మధ్య ఆలయ ద్వారం వద్ద ఓం సంచి ఒకటి దొరికింది. అందులో ఓ లేఖ.. పోయిన నగలు కనిపించాయి. చేసిన చోరీకి క్షమాపణలు కోరుతూ లేఖ, జరిమానా కింద రూ.300 కూడా ఉంచాడు ఆ వ్యక్తి. ఈ మధ్యకాలంలో తాను భగవద్గీత చదివానని.. తన మార్గం తప్పని తెలుసుకొని విలువైన ఆ ఆభరణాలను వెనక్కి ఇచ్చేస్తున్నట్టు దొంగ పేర్కొన్నాడు. మరోవైపు, తొమ్మిదేళ్ల క్రితం చోరీకి గురైన ఆభరణాలు తిరిగి దొరకడంతో ఆలయ అధికారులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చోరీకి గురైన ఆభరణాలు ఇలా మళ్లీ దొరకడం అద్భుతమే అంటున్నారు. Video Source: OTV News English -
మునుగోడులో తులం బంగారం, రూ.30వేలు అని ఊరించి.. రూ.3వేలతో
సాక్షి, నల్లగొండ(మర్రిగూడ): ఓటర్లను కొనుగోలు చేసేందుకు ప్రధాన పార్టీలు ముందస్తుగా డబ్బులు, బంగారం ఎర చూపినప్పటికీ తీరా ఎన్నిక దగ్గర పడడంతో రూ.3వేలతోనే సరిపుచ్చడంతో నిర్ఘాంతపోవడం ఓటర్ల వంతు అయింది. మునుగోడు ఉప ఎన్నికలో ఎంతో ఆశతో ఎదురు చూసిన ఓటర్లకు రాజకీయ నాయకులు షాకిచ్చారు. ఇంటికి తులం బంగారం, ఓటుకు రూ.30వేలు ఇస్తామని ఆయా ప్రధాన పార్టీలు గుట్టుగా ప్రచారం చేసినప్పటికీ ఓటరు ఊహకు అందకుండా రూ.3వేలతో సరిపుచ్చారని పలువురు పేర్కొంటున్నారు. ఎవరు ఎక్కువ తాయిలాలు ముట్టజెప్తే వారికే ఓటు వేయాలన్న ఆలోచనతో సగటు ఓటరు ఆలోచిస్తున్నాడు. కొన్ని గ్రామాల్లో ప్రధాన పార్టీలైన ప్రధాన పార్టీల నాయకులు పోటాపోటీగా ఓటర్లకు నగదు అందించాలని చూసినా పలుచోట్ల ఓ పార్టీ నాయకులను మరో పార్టీ నాయకులు అడ్డుపడ్డారనే ఆరోపణలు వస్తున్నాయి. ఆశించిన విధంగా డబ్బులు అందకపోవడంతో ఓటర్లు నిరుత్సాహానికి గురైనట్లు తెలుస్తోంది. -
ఆభరణమూ చరిత్ర చెబుతుంది
పొన్నియిన్ సెల్వన్... అది ఒక చరిత్ర పుస్తకం. అది ఒక సాహిత్య సుమం. అది ఒక సామాజిక దృశ్యకావ్యం. వీటన్నింటికీ దర్పణాలు ఈ ఆభరణాలు. ఆభరణం చరిత్రను చెబుతుంది. ఆభరణం కూడా కథను నడిపిస్తుంది. ఆ ఆభరణాలకు రూపమిచ్చిన డిజైనర్... ప్రతీక్ష ప్రశాంత్ పరిచయం ఇది. ప్రతీక్ష ప్రశాంత్... ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్ సినిమాలో ఆమె కీలకమైన బాధ్యతలు నిర్వర్తించారు. తన క్రియేటివిటీతో తెరకు కళాత్మకతను పొదిగారామె. ఆ సినిమాలో నటీనటులు ధరించిన ఆభరణాలను రూపొందించిన ప్రతీక్ష ప్రశాంత్... సినిమా కోసం తనకు ఏ మాత్రం అవగాహన లేని చోళ రాజుల గురించి తెలుసుకున్నారు. వారి జీవన శైలి, వారికి ఇతర దేశాలతో ఉన్న వర్తక వాణిజ్యాలు, ఆచారవ్యవహారాలు, ధార్మికజీవనం... అన్నింటినీ ఔపోశన పట్టారు ప్రతీక్ష. ఆ అనుభవాలు ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. ‘‘మాకు సినిమా ప్రపంచంతో ఏ మాత్రం పరిచయం లేదు. మా ఇంట్లో వాళ్లు మహా బిడియస్థులు. మా పూర్వికులు నిజాం కుటుంబాలకు ఆభరణాలు తయారు చేశారు. హైదరాబాద్ లో ఆరు దశాబ్దాలుగా ఆభరణాల తయారీ, అమ్మకాల వ్యాపారంలో ఉన్నారు. కానీ వాళ్ల ఫొటోలు కూడా ఎక్కడా కనిపించవు. అలాంటిది ఒక్కసారిగా నేను సినిమా కోసం పని చేయడం ఊహించని మలుపు అనే చెప్పాలి. సినిమాకు ఆర్నమెంట్ డిజైనర్గా కంటే ముందు నా గురించి చెప్పాలంటే... మాది గుజరాతీ కుటుంబం. నేను పుట్టింది, పెరిగింది మాత్రం ముంబయిలో. మా నాన్నలాగే ఆర్కిటెక్చర్ చేశాను. పెళ్లితో కిషన్దాస్ ఆభరణాల తయారీ కుటుంబంలోకి వచ్చాను. నాకు ఉత్తరాది కల్చర్తోపాటు హైదరాబాద్ కల్చర్ తో మాత్రమే పరిచయం. అలాంటిది తమిళనాడుకు చెందిన ఒక పీరియాడికల్ మూవీకి పని చేయవలసిందిగా ఆహ్వానం అందడం నిజంగా ఆశ్చర్యమే. ఆ సినిమాకు డ్రెస్ డిజైనర్గా పనిచేసిన ‘ఏకా లఖానీ’కి నాకు కామన్ ఫ్రెండ్ సినీ నటి అదితి రావు హైదరీ. ఆమె ఆర్నమెంట్ డిజైనింగ్లో నా స్కిల్ గురించి ఏకా లఖానీకి చెప్పడంతో నాకు పిలుపు వచ్చింది. మణిరత్నం గారితో మాట్లాడిన తరవాత నేను చేయాల్సిన బాధ్యత ఎంత కీలకమైనదో అర్థమైంది. కొంచెం ఆందోళన కూడా కలిగింది. ఎందుకంటే నాకు చోళుల గురించి తెలియదు. ఆభరణాలు అర్థం కావడానికి కొన్ని పెయింటింగ్స్ చూపించారు. వాటిని చూసి యథాతథంగా చేయడం నాకు నచ్చలేదు. అందుకే చోళుల గురించి అధ్యయనం చేశాను. విదేశీ మణిమాణిక్యాలు చోళులు ధరించిన ఆభరణాల్లో ఉన్న మాణిక్యాలు మామూలు మాణిక్యాలు కాదు. అవి బర్మా రూబీలు. బర్మాతో చోళులకు ఉన్న వర్తక వాణిజ్యాల గురించి తెలిస్తేనే నేను ఆభరణంలో బర్మా రూబీ వాడగలుగుతాను. టాంజానియా, గోల్కొండతో కూడా మంచి సంబంధాలుండేవి. మరకతాలు, వజ్రాల్లో ఆ మేరకు జాగ్రత్త తీసుకున్నాం. అలాగే చోళులు శివభక్తులు, చేతికి నాగ వంకీలను ధరిస్తారు. తలకు పెద్ద కొప్పు పెట్టి, ఆ కొప్పుకు సూర్యవంక, చంద్రవంక, నాగరం వంటి ఆభరణాలను ధరిస్తారు. ఆభరణాల్లో కమలం వంటి రకరకాల పూలు– లతలు, నెమలి, రామచిలుక వంటి పక్షులు, దేవతల రూపాలు ఇమిడి ఉంటాయి. ముక్కు పుడక నుంచి చేతి వంకీ, ముంజేతి కంకణం, వడ్డాణం, తల ఆభరణాలు... వేటికవి తనవంతుగా కథను చెబుతాయి, కథకు ప్రాణం పోస్తాయి. రంగస్థలం అయితే తల వెనుక వైపు ఆభరణాల మీద ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉండక పోవచ్చు. కానీ సినిమాలో ముఖ్యంగా మణిరత్నం మూవీలో కెమెరా పాత్ర చుట్టూ 360 డిగ్రీల్లో తిరుగుతుంది. కాబట్టి ఎక్కడా రాజీ పడడానికి వీల్లేదు. పైగా ఇప్పుడు ప్రేక్షకులు ఒకప్పటిలాగ సినిమా చూసి బాగుందనో, బాగోలేదనో ఒక అభిప్రాయంతో సరిపుచ్చడం లేదు. పాత్ర అలంకరణ నుంచి, సన్నివేశం నేపథ్యం వరకు ప్రతిదీ నిశితంగా గమనిస్తున్నారు, పొరపాటు జరిగితే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి ఆటపట్టిస్తారు. అలాగే ఒకసారి ఐశ్వర్య ధరించిన ఆభరణాన్ని మరోసారి పారపాటున త్రిషకు అలంకరించామంటే ఇక అంతే. అప్పట్లో కోర్సుల్లేవు ఇక నా ఆర్నమెంట్ డిజైనర్ కెరీర్ విషయానికి వస్తే... నేను ఇందులో ఎటువంటి కోర్సూ చేయలేదు. ఇప్పటిలాగ పాతిక– ముప్పై ఏళ్ల కిందట కోర్సులు లేవు కూడా. మా మామగారికి సహాయంగా స్టోర్లోకి అడుగుపెట్టాను. నిపుణులైన మా కారిగర్స్ తమ అనుభవంతో పని నేర్పించారు. ప్రతి పనినీ ఆసక్తితో నేర్చుకున్నాను. ఇప్పటికీ రోజూ మధ్యాహ్నం వరకు నా ఆర్కిటెక్చర్ ఆఫీస్, మధ్యాహ్నం నుంచి ఆర్నమెంట్ స్టోర్ చూసుకుంటూ ఉంటాను. ఈ సినిమాకి పని చేయడం నా జీవితంలో ఒక విశిష్టమైన ఘట్టం’’ అన్నారామె. చారిత్రక దృశ్యమాలిక ఈ సినిమా కోసం మూడేళ్లు పనిచేశాను. నాలుగు వందల మంది డాన్సర్స్తో చిత్రీకరించిన విజయగీతం చాలా పెద్దది. సినిమా కోసం 450 ఆభరణాలు బంగారంతో చేశాం. ఐశ్వర్యారాయ్, త్రిష, విక్రమ్, జయం రవి, కార్తి, శోభిత... వంటి ముఖ్యపాత్రలతోపాటు మరికొన్ని ప్రధాన పాత్రలకు బంగారు ఆభరణాలు, చిన్న పాత్రలకు గిల్టు ఆభరణాలు చేశాం. దర్బార్ సన్నివేశాలు, యుద్ధఘట్టాలు, డాన్సులు... సన్నివేశాన్ని బట్టి ఆభరణం మారుతుంది. అలాగే ఒక్కో పాత్ర హెయిర్ స్టయిల్ ఒక్కో రకంగా ఉంటుంది. తలకు అలంకరించే ఆభరణాలు కూడా మారుతాయి. ప్రతి ఆభరణమూ చోళుల కాలాన్ని స్ఫురింపచేయాలి. చోళుల రాజ చిహ్నం పులి. రాజముద్రికల మీద పులి బొమ్మ ఉంటుంది. ఉంగరం మీద కొంత కథ నడుస్తుంది. కాబట్టి ఆ సీన్లో చిన్న డీటెయిల్ కూడా మిస్ కాకుండా పులితోపాటు పామ్ ట్రీ కూడా ఉండేటట్లు దంతంతో ఆభరణాన్ని రూపొందించాం. కల్కి కృష్ణమూర్తి రాసిన ప్రఖ్యాత తమిళ నవలకు, చారిత్రక ఘట్టాలకు దృశ్యరూపం ఇచ్చే ప్రయత్నంలో ఎక్కడా లోపం జరగకూడదనేది మణిరత్నం గారి సంకల్పం. ఆ ప్రయత్నంలో సక్సెస్ అయ్యాననే అనుకుంటున్నాను. – ప్రతీక్ష ప్రశాంత్, ఆర్నమెంట్ డిజైనర్ – వాకా మంజులారెడ్డి ఫొటోలు: నోముల రాజేశ్ రెడ్డి -
సత్యదేవుని ఆభరణాల డిజిటలైజేషన్
అన్నవరం: సత్యదేవుని బంగారు ఆభరణాలు, వెండి వస్తువుల డిజిటలైజేషన్ ప్రక్రియ ఆదివారం ఆరంభమైంది. ఉత్సవాలు, ఇతర పర్వదినాల్లో స్వామి, అమ్మవార్లకు అలంకరించే ఆభరణాలను డిజిటలైజ్ చేసేందుకు దేవస్థానం ఈఓ వి.త్రినాథరావు, అసిస్టెంట్ కమిషనర్ రమేష్బాబు ఆధ్వర్యాన ఫొటోలు తీయించారు. స్వామి వారికి ప్రతి రోజూ అలంకరించే ఆభరణాలను తీయడం సాధ్యం కాదు కనుక వాటిని స్వామివారి జన్మనక్షత్రం మఖ నాడు మూలవిరాట్కు అభిషేకం చేసేందుకు తీసినపుడు డిజిటలైజ్ చేయాలని నిర్ణయించారు. సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారి కిరీటాలు, హారాలు, నేత్రాలు, స్వామివారి మీసం, కర్ణాభరణాలు, బంగారు పాత్రలు, పళ్లాలు సుమారు వంద ఆభరణాలను ఆదివారం రికార్డు ప్రకారం తూకం వేసి, ఫొటోలు తీయించారు. ప్రధానార్చకులు ఇంద్రగంటి నరసింహమూర్తి, కోట శ్రీనివాస్, అర్చకుడు సుధీర్, అకౌంట్స్ సెక్షన్ సూపరింటెండెంట్లు అనకాపల్లి ప్రసాద్, బలువు సత్య శ్రీనివాస్, ఎస్పీఎఫ్ పోలీసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డిజిటలైజేషన్లో భాగంగా ప్రతి ఆభరణాన్నీ ఫొటో తీసి, రికార్డుల ప్రకారం సరి చూసి, దాని పేరు, బరువు, ఇన్వెంటరీ నంబర్, తనిఖీ చేసిన తేదీ తదితర వివరాలతో ఆల్బమ్ చేయించి, దేవస్థానం వెబ్సైట్లో పొందుపరుస్తారు. సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారికి నిత్యం అలంకరించే ఆభరణాలు సుమారు 200 ఉన్నాయి. ఇవి కాకుండా గతంలో వాడి పాతబడటంతో ప్రస్తుతం దేవస్థానం లాకర్లలో ఉంచిన ఆభరణాలు మరో 200 ఉన్నాయి. వీటి రక్షణకు దేవస్థానంలో నిత్యం 12 మంది ఎస్పీఎఫ్ సిబ్బంది ప్రధానాలయం వద్ద కాపలా ఉంటారు. దేవదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు దేవస్థానంలో గతంలో గోల్డ్ బాండ్ కోసం ఎస్బీఐకి ఇవ్వగా మిగిలిన ఆభరణాలన్నింటినీ డిజిటలైజ్ చేస్తున్నామని ఈఓ త్రినాథరావు చెప్పారు. రామాలయం, వనదుర్గ, కనకదుర్గ, నేరేళ్లమ్మ ఆలయాల్లోని ఆభరణాలను సోమవారం, బ్యాంకుల్లోని ఆభరణాలను మంగళవారం డిజిటిలైజ్ చేస్తామని తెలిపారు. ప్రస్తుతం వాడకంలో లేని ఆభరణాలను దేవస్థానానికి తిరిగి జమ చేయాల్సిందిగా అర్చకులను ఆదేశించామన్నారు. డిజిటలైజేషన్ వలన భవష్యత్తులో ఆ ఆభరణం చోరీ అయినా లేక పాడయినా దాని వివరాలు తెలుస్తాయని ఈఓ తెలిపారు. (క్లిక్: అరుదైన దేవాలయం... మద్యం మాన్పించే దేవుడు!) -
Charminar: ‘లాడ్బజార్’.. తళుక్.. ఆ పేరు ఎలా వచ్చిందంటే
సాక్షి, చార్మినార్(హైదరాబాద్): నగర చరిత్రలో చార్మినార్కు ఎంత గుర్తింపు ఉందో పక్కనే ఉన్న లాడ్బజార్కూ అంతే గుర్తింపు ఉంది. ఎక్కడేక్కడి నుంచో వచ్చి చార్మినార్ను సందర్శిచిన తర్వాత లాడ్బజార్లోకి అడుగు పెడతారు. వందలు, వేలల్లో ఉండే అందమైన డిజైన్ల గాజులను కొనుగోలు చేస్తుంటారు. ఏ పండగొచ్చినా.. పెళ్లిళ్ల సీజన్ మొదలైనా మొదట గుర్తుకు వచ్చేది లాడ్ బజారే.. వందల సంఖ్యలో ఉన్న షాపులను నిత్యం వేలాది మంది సందర్శిస్తుంటారు. రాష్ట్రంలోని జిల్లాలకే కాకుండా ఇతర రాష్ట్రాలకు సైతం ఇక్కడి గాజులు ఎగుమతి అవుతుంటాయి. అందమైన గాజులు తక్కువ ధరలకే లభ్యమవుతుండటంతో ఇక్కడి గాజులకు డిమాండ్ కూడా అధికంగానే ఉంటోంది. నిత్యం పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు వచ్చే విదేశీయులు సైతం గాజులను కొనుగోలు చేసి వారి దేశాలకు తీసుకెళ్తుంటారు. రాత్రిపూట లాడ్బజార్లోకి వెళ్తే జిగేల్మంటూ మెరిసే గాజుల అందాలను చూడాలంటే రెండు కళ్లు చాలవు. ఇంతటి పేరుగాంచిన లాడ్బజార్ను నైట్ బజార్గా మార్చాలని 1999లో అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఆ ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయని స్థానిక గాజుల వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు ప్రజాప్రతినిధులు గానీ.. ఇటు సంబంధిత అధికారులు గానీ.. నైట్ బజార్ విషయాన్ని పట్టించుకోవడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నైట్ బజార్గా మారిస్తే పాతబస్తీకి మరింత వన్నె తెచ్చినట్లవుతుందని అంటున్నారు. ఏళ్లుగా గాజుల విక్రయాలతోనే జీవనం సాగిస్తున్న వ్యాపారుల ఇబ్బందులపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరుతున్నారు. ► దూరప్రాంతాల నుంచి షాపింగ్ కోసం ఇక్కడికి వచ్చే వినియోగదారులకు పార్కింగ్ సౌకర్యం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. మల్టీ లెవల్ పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తే ట్రాఫిక్ ఇక్కట్ల నుంచి విముక్తి లభిస్తుంది. పార్కింగ్కు సౌకర్యం కల్పిస్తేనే వ్యాపారం పెరిగే అవకాశం ఉంటుంది. ► పరిసరాల రోడ్లన్నీంటినీ వెడల్పు చేయాలి. చార్మినార్ ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్లను పూర్తిగా అందుబాటులోకి తేవాలి. లాడ్బజార్లో వ్యాపారాభివృద్ధి కోసం ఇక్కడి దుకాణాలకు విద్యుత్ బిల్లుల్లో రాయితీ కల్పించాలి. ఆ పేరెలా వచ్చిందంటే.. ►లాడ్లా అంటే గారాబం.. ప్రేమ.. అనురాగం. ఉర్దూ భాషలో తమకు ఇష్టమైన వారిని, ముఖ్యంగా చిన్నారులను లాడ్లా అని సంబోధిస్తుంటారు. తమ ప్రేమ, అభిమానానికి గుర్తుగా ఇక్కడ నుంచి కానుకలను కొని బహుకరిస్తుండటంతో ఈ పేరు వచ్చిందని చెబుతుంటారు. ► మహ్మద్ కూలీ కుతుబ్షా కూడా తాను ప్రేమించిన భాగమతికి ఇక్కడి లాడ్బజార్లోని గాజుల్నే బహుమతిగా ఇచ్చారట. ప్రస్తుతం లాడ్బజార్లో దాదాపు 250కి పైగా దుకాణాలు నిత్యం తమ వ్యాపార లావాదేవీలు కొనసాగిస్తున్నాయి. -
Home Creations: ఒంటి అలంకరణ వస్తువులతో ఇంటి అలంకరణ
ఇంటిని అందంగా అలంకరించాలంటే బోలెడంత డబ్బు ఖర్చు చేయాలనే ఆలోచనకు స్వస్తి చెప్పడం మంచిది. ఉన్న వస్తువులతో రీ సైక్లింగ్ చేసే పద్ధతులు తెలుసుకుంటే చాలు ఇంటిని వినూత్నంగా మార్చుకోవచ్చు. అందుకు ఫ్యాషన్ యాక్ససరీస్ అదేనండీ ఒంటి అలంకరణ వస్తువులను చూపులను ఆకట్టుకునే విధంగా ప్రతి పీస్ను ఇంటి అలంకరణలో ఉపయోగించవచ్చు. చెవి రింగులు, మెడకు చుట్టుకునే స్కార్ఫ్, వేసుకునే హై హీల్స్, పట్టుకొనే గొడుగు.. కాదేదీ ఇంటి అలంకరణకు అనర్హం. ఫ్యాషన్ యాక్ససరీస్ ఉపయోగించేవాటికన్నా పక్కన పెట్టేసేవి ఎక్కువే ఉంటాయి. అంతగా కొని దాచిపెట్టేస్తారు కాబట్టి, వీటితోనే ఇంటి అలంకరణ చేసేస్తే.. ఇంట్లో వారి మెప్పుతో పాటు ఇంటికి వచ్చే అతిథులు మార్కులు కూడా కొట్టేయొచ్చు. అయితే, ఇప్పుడే స్టార్ట్ చేద్దాం... సిల్క్ స్కార్ఫ్ బయటకు వెళితే కుర్తీ, టాప్కి కాంబినేషన్గా మెడలో స్కార్ఫ్ ఉండాల్సింది. అందమైన స్కార్ఫ్లు ఎన్నో మీ వద్ద ఉండే ఉంటాయి. కొన్ని స్కార్ఫ్ల డిజైన్లు చూడముచ్చటగా ఉంటాయి. ఫ్రేమ్లో స్కార్ఫ్ని సెట్ చేస్తే, అందమైన వాల్ ఆర్ట్ అలంకరణకు రెడీ. ఇందుకు ఫ్రేమ్ ఎంపిక ఒక్కటే మీ ఛాయిస్. మీ అభిరుచిని బట్టి ఎన్ని స్కార్ఫ్లు అయినా మార్చుకుంటూ రోజుకో ఆర్ట్ని ఆస్వాదించవచ్చు. వేలాడే జూకాలు అతివల హృదయానికి చేరువగా ఉండేది ఆర్ట్. అందుకే, వారికి కావల్సిన ప్రతీ వస్తువూ కళాత్మకంగా ఉండేది ఎంచుకుంటారు. వాటిలో చెవి రింగులు ప్రధానమైనవి. ఒక మంచి ఫ్రేమ్లో అమర్చి, లివింగ్ రూమ్లో అలంకరించి, ఆ అందమైన తేడాను మీరే గమనించవచ్చు. బరువైన బ్యాంగిల్.. పేపర్వెయిట్ ఇత్తడి, రాగి, గాజు మెటీరియల్తో తయారైన సింగిల్ హెవీ బ్యాంగిల్స్ను మన దగ్గర చాలానే ఉంటాయి. బరువుగా ఉందనో, మరోసారి వాడుదామనో పక్కన పెట్టేసిన ఇలాంటి గాజును టేబుల్ పెపర్వెయిట్గా ఉపయోగించుకోవచ్చు. వీటి డిజైన్ కూడా చాలా కళాత్మకంగా ఉండటంతో చూడగానే ఆకట్టుకుంటుంది. గొడుగు దీపాల జిలుగులు ఎండ, వానల సమయాల్లో అందమైన గొడుగుల సంఖ్య మన దగ్గర చేరుతూనే ఉంటాయి. ఏదైన టూర్లకు వెళ్లినప్పుడు కూడా చిన్న చిన్న గొడుగులను సేకరించే అలవాటు ఉంటుంది. వీటిని ఇలా విద్యుత్ దీపాలకు అడ్డుగా పెట్టి, ఇంటి అలంకరణలో రెట్టింపు కళ తీసుకురావచ్చు. బ్యాగులే శిల్పాలు పాడైన ఫ్యాన్సీ బ్యాగులు, క్లచ్లు, శాండల్స్, ఉపయోగించని లిప్స్టిక్ వంటివి కవర్లో పెట్టి, మూలన పడేయాల్సిన అవసరం లేదు. వాటికి కొంచెం సృజనాత్మకత జోడించి, శిల్పాలుగా మార్చుకోవచ్చు. ఇంటి గ్లాస్ షోకేస్లో అందంగా అలంకరించుకోవచ్చు. మీకు కావల్సిందల్లా కొంచెం ఊహ, మరికొంచెం సృజనాత్మకత.. ఇలా మీ ఆలోచనా సామర్థ్యాన్ని బట్టి ఉన్న వస్తువులతోనే ఇంటిని కొత్తగా అలంకరించవచ్చు. చదవండి: Home Creations: అలంకరణలో ఇదో విధం..! -
పట్టుకున్న బంగారం ఏం చేస్తారు?
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ విమానాశ్రయాల్లో బంగారం, వజ్రాలు, విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు అక్రమంగా తరలిస్తూ కస్టమ్స్ అధికారులకు పట్టుబడడం తెలిసిందే. హైదరాబాద్లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోనూ ఇలాంటివి జరుగుతుంటాయి. అయితే ఇలా కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న పసిడి, వెండి, వజ్రాలు తదితర విలువైన వస్తువులను తర్వాత ఏం చేస్తారు? అనేది తెలుకోవాలనే ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. దీనితోపాటు మరికొన్ని ప్రశ్నలను నగరానికి చెందిన ఓ సమాచార హక్కు కార్యకర్త ఆర్టీఐ దరఖాస్తు ద్వారా అడిగితే ఏం సమాధానం వచ్చిందో తెలుసా? ‘‘మా వద్ద సమాచారం లేదు’’అని!! అది చదివి అవాక్కవడం అతని వంతైంది. పన్ను ఎగ్గొట్టే యత్నంలో.. యూఏఈ, సౌదీ అరేబియా తదితర గల్ఫ్ దేశాల నుంచి బంగారం, ఇతర దేశాల నుంచి పలు ఎలక్ట్రానిక్ పరికరాలు, విదేశీ కరెన్సీని కొందరు విమానాల ద్వారా అక్రమంగా హైదరాబాద్కు తెస్తుంటారు. పన్ను ఎగ్గొట్టే ఉద్దేశంతో నిబంధనలకు విరుద్ధంగా వీటిని తీసుకొస్తుంటారు. అత్యంత ఆధునిక విధానాల్లో వీటిని తెస్తూ కస్టమ్స్ అధికారుల కంట పడకుండా బురిడీ కొట్టిస్తుంటారు. అయితే, బాడీ స్కానింగ్ తదితర అధునాతన సాంకేతికత అందుబాటులోకి వచ్చాక.. స్మగ్లర్ల పప్పులు ఉడకడం లేదు. ఇలా పట్టుబడిన బంగారం, వెండి, వజ్రాలు, కరెన్సీ, విలువైన ఎలక్ట్రానిక్ పరికరాలను కస్టమ్స్ అధికారులు ఏం చేస్తారు? వీటిని వేలం వేస్తారా? లేక ఇతర శాఖలకు పంపుతారా? కోర్టుకు స్వాధీనం చేస్తారా? అనే సందేహాలు తలెత్తుతుంటాయి. ఇవే ప్రశ్నలను సంధిస్తూ నగరానికి చెందిన రాబిన్ అనే సామాజిక ఉద్యమకారుడు శంషాబాద్లోని హైదరాబాద్ కస్టమ్స్ ఆఫీసుకు, సనత్నగర్లోని కస్టమ్స్ డిప్యూటీ కమిషనర్కు సమాచార హక్కు ద్వారా దరఖాస్తు చేశాడు. చెన్నై సీబీఐ లాకర్లా అయితే ఎలా?: రాబిన్ తన ప్రశ్నలకు కస్టమ్స్ అధికారులు ఎలాంటి సమాచారం లేదని చెప్పడంపై ఆర్టీఐ దరఖాస్తుదారుడు రాబిన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. నిత్యం కస్టమ్స్ వాళ్లు పట్టుకుంటున్న బంగారం, వెండి, విదేశీ కరెన్సీ వివరాల గురించి ప్రసార మాధ్యమాల్లో వార్తలు వస్తుంటాయని, స్వాధీనం చేసుకున్న వాటిన ఏంచేస్తారో ప్రజలకు చెప్పకపోవడం ఏంటని వాపోయాడు. అసలు ఈ వస్తువుల రికార్డు నిర్వహణ సరిగా ఉందా? అని నిలదీశాడు. నిర్వహణ సరిగా లేకపోతే ఇటీవల చెన్నైలోని సీబీఐ కస్టడీ నుంచి దాదాపు 100 కిలోల బంగారం మాయమైన తరహాలో జరిగితే ఏమేం మాయమయ్యాయనే సంగతి ఎలా తెలుస్తుందని ప్రశ్నిస్తున్నాడు. ఈ తొమ్మిది ప్రశ్నలు సంధించాడు! (1) 2015 నుంచి 2020 వరకు కస్టమ్స్ శాఖ సీజ్ చేసిన వస్తువుల వివరాలు (2) స్వాధీనం చేసుకున్న వస్తువులు ఏయే దేశాలవి? (3) 2015–2020 వరకు నమోదు చేసిన కేసులు (4) స్వాధీనం చేసుకున్న బంగారం, వెండి, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు ఏం చేస్తారు? (5) ప్రస్తుతం హైదరాబాద్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ వద్ద ఉన్న వస్తువుల విలువ ఎంత? (6) సీజ్ చేసిన వçస్తువులను హైదరాబాద్ కస్టమ్స్ వేలం వేస్తుందా? (7) మీరు నిర్వహించిన వేలంలో విక్రయించిన పది వస్తువులు, వాటిని కొనుగోలు చేసిన వ్యక్తుల వివరాలు (8) వేలం సమాచారం ప్రజలకు ఎలా తెలియజేస్తారు? గత పది వేలంల గురించిన వివరాలు (9) హైదరాబాద్ కస్టమ్స్ శాఖ సీజ్ చేసిన వస్తువుల్లో ఎన్ని కస్టడీలో ఉన్నాయి? ఇతర విభాగాలు, కోర్టుకు ఎన్నింటిని అప్పగించారు? -
శంషాబాద్ ఎయిర్పోర్ట్లో బంగారం పట్టివేత
-
ట్రెండ్కు తగినట్టు ఉంటేనే ఎవరైనా చూసేది
అక్కా! నువ్వు చేయించుకున్నావ్ కదా! నాక్కూడా చేయించవే!! ఏమండీ!నా తోటికోడలు చేయించుకుందిగా!! అత్తా! మీ అమ్మాయికి చేయించారుగా!! వదినా! మా అన్నయ్య నీకు చేయించాడుగా!! పండగ చేసుకునే సమయంలో ఈ చేయించడమేంటీ?! ఇవాళ ధనత్రయోదశి.. ఎల్లుండి పండగ! మరి కన్నుల పండుగ చేయించాలి కదా! ఆభరణాల కొనుగోలులోనే కాదు కాలానుగుణంగా వచ్చే మార్పులకు తగ్గట్టుగా ఎప్పుడూ అవి కొత్తదనంతో ఆకట్టుకుంటూ ఉండాలి. ఒకసారి నగ కొన్నాక అదెప్పుడూ ట్రెండ్లో ఉండాలి. అలాంటి ఆభరణాలు ఎన్నో మెడల్స్లో వచ్చాయి. అతివల మనసు దోచేస్తున్నాయి. ఎప్పటికీ ఎవర్గ్రీన్ అనిపించే డిజైన్స్ను ధరించిన మన ‘తారా’మణులు ఆభరణాలకు కొత్త సింగారాలను అద్దుతున్నారు. వీటిలో ఖరీదైనవే కాదు అచ్చూ అలాగే ఉండే ఇమిటేషన్ జువెల్రీ కొంగొత్తగా ఆకట్టుకుంటుంది. ఏ వేడుకకు ఏ ఆభరణమో ఎంపికలోనే ఉంటుంది అసలు అందం. ♦ వరుసలుగా కూర్చిన పేటల హారాలు, జంతువులు, పక్షుల డిజైన్లతో రూపొందించిన హారాలు అన్నింటి ఔరా! అనిపిస్తూనే ఉన్నాయి. ♦ పోల్కీ కుందన్స్ సెట్ సంప్రదాయ వస్త్రాలంకరణ లోనే కాదు వెస్ట్రన్ డ్రెస్సులకు ఓ ప్రత్యేక అందాన్ని, ఆకర్షణను తెచ్చిపెడతాయి. అందుకే తారల అలంకరణలో తప్పనిసరి ఆభరణం అయ్యింది. ♦ మామిడి పిందెల హారాలు ఏ సందర్భాన్నైనా కాంతివంతంగా మార్చేస్తాయి. కాలాలు మారినా మారని ఈ డిజైన్ అతివలకు ఎప్పుడూ ఆకర్షణీయమే! ♦ మిగతా ఆభరణాలేవీ అవసరం లేకుండా పెద్ద పెద్ద చెవి బుట్టాలు ఏ వేడుకనైనా ప్రత్యేకతను నిలిపేలా చేస్తున్నాయి. ♦ పెద్ద పెద్ద పోల్కీచోకర్ సెట్స్ వేడుకకు ఒక రాణివాసపు లుక్ను తీసుకువస్తున్నాయి. అందుకే మన సంప్రదాయ వేడుకలో తప్పనిసరి గ్రాండ్ ఆభరణమైంది. ♦ దేవతా మూర్తుల రూపాలతో డిజైన్ చేసిన ఆభరణాలు (టెంపుల్ జువెల్రీ) సంప్రదాయ వేడుకలో హైలైట్గా నిలుస్తున్నాయి. ♦ ముత్యాల సొగసు ఎప్పుడూ కొత్త సింగారాలను మోసుకొస్తూనే ఉంటుంది. అందుకే ప్రతి వేడుకను ముత్యాల ఆభరణాలు ప్రత్యేకంగా నిలుస్తుంటాయి. ♦ వజ్రాభరణాలు ఏ వయసు వారికైనా తీరైనా ఖరీదైన అందాన్ని తీసుకువస్తాయి. మగువల మనసు దోచే ఆభరణాలలో ఒక్కటైనా వజ్రాభరణం ఉండాల్సిందే! -
మహిళ కడుపులో నగలు, నాణేలు
రామ్పుర్హట్: కడుపునొప్పితో ఆసుపత్రికి వెళ్లిన ఓ మహిళకు శస్త్రచికిత్స చేసిన వైద్యులు.. ఆమె కడుపులో ఉన్న 1.5 కేజీల ఆభరణాలు, నాణేలను చూసి విస్తుపోయారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్లోని బీర్భూమ్ జిల్లా రామ్పురహాట్లో చోటుచేసుకుంది. మర్గ్రామ్కు చెందిన మానసికస్థితి సరిగా లేని 26 ఏళ్ల ఓ మహిళ కొన్ని రోజులుగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతోంది. దీంతో కుటుంబసభ్యులు ఆమెను నగరంలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శస్త్రచికిత్స చేసి మహిళ కడుపులోంచి బంగారం, కాంస్యం, రాగితో చేసిన గొలుసులు, దుద్దులు, ముక్కుపుడకలు, గాజులు వంటి 1.5 కేజీల ఆభరణాలు, రూ.5, రూ.10 విలువ గల 90 నాణేలను బయటికి తీసినట్లు వైద్యులు తెలిపారు. తాము బయటకు తీసిన వాటిలో చేతి వాచీలు కూడా ఉన్నాయని వెల్లడించారు. ‘నా కూతురి మానసిక పరిస్థితి సరిగా లేదు. కొద్దిరోజులుగా భోజనం చేసిన తర్వాత ప్రతి వస్తువును విసిరికొడుతోంది. మాయమైన ఆభరణాల గురించి అడిగిన ప్రతిసారి ఏడవడం మొదలు పెట్టేది. కొంత కాలంగా ఆమెను కనిపెట్టి చూస్తున్నాం. రెండు నెలలుగా అనారోగ్యంతో బాధ పడుతోంది. చాలా మంది ప్రైవేటు డాక్టర్లకు చూపించినా ప్రయోజనం లేకపోయింద’ని బాధితురాలి తల్లి వివరించింది. -
ఆమె పొట్టలో కిలోన్నర బంగారం..
కోల్కతా : ఇంత వరకూ ఇనుప వస్తువులు మింగిన వారి గురించే చదివాం. కానీ ఈ యువతి ఏకంగా బంగారాన్ని మింగేసింది. ఇలా ఇప్పటి వరకూ ఆమె కడుపులో దాదాపు కిలోన్నరకు పైగా బంగారం చేరింది. ఆ వివరాలు... పశ్చిమ బెంగాల్కు చెందిన ఓ 26 ఏళ్ల యువతికి మతి స్థిమితం లేదు. దాంతో ఆకలేసినప్పుడల్లా చేతికి దొరికిన పదార్థాలను తినేది. ఈ క్రమంలోనే బంగారు ఆభరణాలను కూడా కడుపులో పడేసుకుంది. దాంతో గత కొద్ది రోజులుగా యువతి అనారోగ్యంతో బాధపడుతుంది. తిన్న వెంటనే వాంతులు చేసుకుంటుంది. ఈ క్రమంలో తల్లిదండ్రులు ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. పరీక్షలు జరిపిన వైద్యులు ఆమె కడుపులో ఏవో వస్తువులు ఉన్నట్లు గుర్తించారు. దాంతో ఆపరేషన్ చేయగా ఆమె కడుపులో ఆభరణాలు, నాణాలు కనిపించాయి. ఆపరేషన్ చేసిన వైద్యుడు... యువతి కడుపులో నుంచి గొలుసులు, ముక్కు పుడకలు, చెవి పోగులు, గాజులు, బ్రాస్లెట్ తదితర ఆభరణాలతోపాటు రూ.5, రూ.10 నాణేలను వెలికితీశామని తెలిపాడు. వీటి బరువు సుమారు 1.5 కిలోగ్రాముల వరకూ ఉందన్నారు. ప్రస్తుతం యువతి ఆరోగ్యం నిలకడగా ఉందని.. త్వరలోనే కోలుకుంటుందని తెలిపారు. ఈ విషయం గురించి బాధితురాలి తల్లి మాట్లాడుతూ.. ‘నా కూతురికి మతిస్థిమితం లేదు. ఎప్పుడూ ఆమెను ఇంట్లో ఎవరో ఒకరు కనిపెట్టుకునే ఉంటాం. ఒంటరిగా ఉన్నప్పుడు ఆమె ఆభరణాలను మింగి ఉంటుంది. ఇన్ని రోజులుగా ఇంట్లో ఆభరణాలు కనిపించకుండా పోతుంటే మాకు అర్థం కాలేదు. ఎవరైనా దొంగిలిస్తున్నారేమో అని అనుమానం కలిగింది. దీని గురించి మా అమ్మాయిని అడిగితే ఏడ్చేదే తప్ప.. ఏం చెప్పేది కాదు. అయితే గత కొద్ది రోజులుగా భోజనం చేసిన వెంటనే వాంతులు చేసుకుంటుంది. ఆస్పత్రికి తీసుకురావడంతో ఈ విషయం తెలిసింది’ అన్నారు. -
శ్రీవారి ఆభరణాలు భద్రమే..!
తిరుమల: అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య తిరుమల శ్రీవారి ఆభరణాలున్నాయని, పోటులో ఎలాంటి తవ్వకాలు జరగలేదని టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ తెలిపారు. సోమవారం రాత్రి పద్మావతి అతిథి గృహంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అవాస్తవాలు ప్రచారం చేయడం మానుకోవాలని రమణ దీక్షితులకు సూచించారు. శ్రీవారి ఆలయంలో వజ్ర వైఢూర్యాలతో కూడిన ఆభరణాలను బోర్డు సభ్యులతో కలసి నిశితంగా పరిశీలించినట్లు చెప్పారు. 1952 నుంచి మిరాశీ వ్యవస్థ రద్దయిన 1996 వరకు ప్రతి ఆభరణాన్ని తిరువాభరణం రిజిస్టర్లో నమోదు చేశారని తెలిపారు. 2001లో గరుడ సేవ సందర్భంగా భక్తులు నాణేలు విసరడంతో కెంపు రాయి పగిలిందని చెప్పారు. పగిలిన కెంపు పొడిని సేకరించి మూటకట్టి రిజిస్టర్లో నమోదు చేశారన్నారు. పోటులోని పురాతన గోడలు దెబ్బ తినకుండా అడుగు మందంతో ఫైర్ రిఫ్రట్టరీ బ్రిక్వాల్ మాత్రమే ఏర్పాటు చేశారని.. నేలపై ఎలాంటి తవ్వకాలు జరగలేదన్నారు. కాగా, శ్రీవారి ఆభరణాలు ప్రదర్శించాలన్న ప్రతిపాదన ఆగమ శాస్త్రానికి విరుద్ధమని ఆగమ సలహా మండలి సభ్యుడు సుందరవదన భట్టాచార్యులు చెప్పారు. -
‘అది టీటీడీకే అవమానం’
సాక్షి, హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి మండిపడ్డారు. ఆమె సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. వేంకటేశ్వరస్వామి ఆభరణాల అంశంపై టీటీడీ తీసుకున్న నిర్ణయం సరైనది కాదన్నారు. టీటీడీ అధికారుల సమక్షంలో నగల పరిశీలన అంటున్నారని.. అది టీటీడీ కాదు.. టీడీపీ పాలకకమిటీ అని విమర్శించారు. ఒకవేళ నగల పరిశీలన జరిగితే న్యాయం జరుగదన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల భూములను సైతం కాజేసిన వారు పరిశీలన కమిటీలో ఉన్నారని, ఇది దేవస్థానం వారికే అవమానమన్నారు. కేరళలోని పద్మనాభస్వామి ఆలయంలో వేసిన జ్యుడీషియల్ కమిటీలా.. ఇక్కడ కూడా నగల పరిశీలనకు కమిటీ వేస్తే తప్ప న్యాయం జరుగదని తెలిపారు. కాగా, శ్రీవారి ఆభరణాలు ప్రదర్శించాలని మొదట టీటీడీ భావించినప్పప్పటికీ.. ఇందుకు ఆగమసలహా మండలి సభ్యులు అభ్యంతరం తెలిపారు. శ్రీవారి ఆభరణాల ప్రదర్శణను ఆగమ సలహాదారు సుందరవదన భట్టాచార్య తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. శ్రీవారి ఆభరణాలు అత్యంత పవిత్రమైనవని, వాటికి విలువ కట్టలేమని ఆయన అన్నారు. ఆభరణాలను ప్రదర్శిస్తే.. వాటి భద్రత బాధ్యత ఎవరిదని ఆయన ప్రశ్నించారు. -
శ్రీవారి ఆభరణాల ప్రదర్శనపై వెనక్కి తగ్గిన టీటీడీ
-
శ్రీవారి ఆభరణాల ప్రదర్శనకు బ్రేక్!
సాక్షి, తిరుమల : కలియుగ ప్రతక్ష దైవం శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామి ఆభరణాల ప్రదర్శనపై టీటీడీ వెనుకకుతగ్గింది. శ్రీవారి ఆభరణాలు ప్రదర్శించాలని మొదట టీటీడీ భావించినప్పప్పటికీ.. ఇందుకు ఆగమసలహా మండలి సభ్యులు ఒప్పుకోలేదు. శ్రీవారి ఆభరణాల ప్రదర్శణను ఆగమ సలహాదారు సుందరవదన భట్టాచార్య తీవ్రంగా వ్యతిరేకించారు. శ్రీవారి ఆభరణాలు అత్యంత పవిత్రమైనవని, వాటికి విలువ కట్టలేమని ఆయన అన్నారు. ఆభరణాలను ప్రదర్శిస్తే.. వాటి భద్రత బాధ్యత ఎవరిదని ఆయన ప్రశ్నించారు. పింక్ డైమండ్ తాను చూడలేదని సుంధరవదన భట్టాచార్య తెలిపారు. టీటీడీ రికార్డులో ఉన్న ప్రకారం ఆభరణాలన్నీ ఉన్నాయని చెప్పారు. అయితే, టీటీడీ ఏర్పడకముందే స్వామివారికి చెందిన అనేక ఆభరణాలు కనుమరుగయ్యాయని చెప్పారు. శ్రీవారి ఆభరణాల ప్రదర్శనను ఆగమ పండితులు సైతం వ్యతిరేకిస్తున్నారని, గర్భాలయంలో ఉంటేనే ఆభరణాలకు భద్రత లభిస్తుందని ఆగమ సలహాదారు సుంధరవదన భట్టాచార్య తెలిపారు. అనాదిగా ఆలయంలోనే ఆభరణాలకు మరమత్తులు చేపడుతున్నామని చెప్పారు. శ్రీవారి నిత్య సేవలు ప్రత్యక్ష ప్రసారం ఇస్తామన్న ఈవో వ్యాఖ్యలను సైతం ఆగమ సలహాదారులు ఖండించారు. ఆగమ సంప్రదాయానికి వ్యతిరేకంగా చేపట్టే ఎలాంటి కార్యక్రమాలనైనా వ్యతిరేకిస్తామని ఆగమ సలహాదారులు స్పష్టం చేశారు. -
నల్లపూసలు ఎందుకు ధరిస్తారు?
ముల్తైదువులు ధరించే ఆభరణాలు వారి దేహంపై ఆధ్యాత్మికంగాను, వైజ్ఞానికంగానూ ఉత్తమ పరిణామాల్ని కలిగిస్తాయి. స్త్రీ సంతానాన్ని తన గర్భంలో మోసి మరొక ప్రాణికి జన్మనిస్తుంది. అందువల్ల స్త్రీ నాడులకు అనుకూలమైన వాటినే ఆమెకు ఆభరణాలుగా ఏర్పాటు చేసారు పెద్దలు. వాటిల్లో నల్లపూసలు ఒకటి. వెనకటి కాలంలో నల్లపూసలను నల్లమట్టితో తయారు చేసేవారు. ఈ నల్లపూసలు ఛాతీమీద ఉత్పన్నమయ్యే ఉష్ణాన్ని పీల్చుకునేవి. అదికాక పిల్లలకు పాలిచ్చే తల్లులలో పాలను కాపాడుతాయని నమ్మకం. ఇప్పుడు నల్లపూసలు వేసుకోవడమే తక్కువ. మనదేహంలోని ఉష్ణంతో బాటు బంగారు గొలుసు వేసుకోవడం వల్ల ఇంకా వేడిపెరిగి శరీరం వివిధ రుగ్మతలకు నిలయమౌతోంది. ఇక ఆధ్యాత్మిక దృష్టితో చూసినప్పుడు హృదయ మధ్య భాగంలో అనాహత చక్రం ఉంది. గొంతుభాగంలో సుషుమ్న, మెడ భాగంలో విశుద్ధ చక్రం ఉంది. ఈ చక్రాలపై నల్లపూసలు ఉన్నందువల్ల హృదయం, గొంతుభాగంలో ఉష్ణం సమతులనమై రోగాలు పరిహారమౌతాయి. ఇటీవల కాలంలో నల్లపూసలతాడును ప్రత్యేకంగా చేయించుకుని ధరించడం జరుగుతుందిగానీ, పూర్వం మంగళ సూత్రానికే నల్లపూసలను అమర్చేవారు. వివాహ సమయంలోనే వధువు అత్తింటివారు, ఓ కన్యతో మంగళ సూత్రానికి నల్లపూసలు చుట్టిస్తారు. ఆ మంగళ సూత్రానికి వధూవరులచే ‘నీలలోహిత గౌరి’ కి పూజలు చేయిస్తారు. ఈ విధంగా చేయడం వలన నీలలోహిత గౌరీ అనుగ్రహంతో, వధువు సౌభాగ్యం స్థిరంగా ఉంటుందని శాస్త్రం చెబుతోంది. నీలలోహిత గౌరిని పూజించడం వలన ... ఆమె సన్నిధిలో ఉంచిన నల్లపూసలను ధరించడం వలన వధూవరులకి సంబంధించిన సర్పదోషాలు తొలగిపోతాయని శాస్త్రం అంటోంది. -
ఆభరణాలు భద్రం
భువనేశ్వర్ : శ్రీజగన్నాథుని ఆభరణాలు, ఇతరేతర అమూల్యమైన సంపద భద్రంగా ఉన్నట్టు శ్రీ జగన్నాథ ఆలయ అధికార వర్గం(ఎస్జేటీఏ) తెలిపింది. శ్రీమందిరం రత్న భాండాగారం తాళం చెవి గల్లంతు కావడంతో స్వామి అమూల్య రత్న సంపద పట్ల పలు అపోహలు ప్రసారం అవుతున్నాయి. ఇవన్నీ నిరాధారంగా శ్రీ జగన్నాథ ఆలయ అధికార వర్గం స్పష్టం చేసింది. రత్న భాండాగారం రెండు అంచెల్లో ఉంటుంది. బాహ్య భాండాగారం(బహారొ భొండారొ), లోపలి భాండాగారం (భిత్తొరొ భొండారొ)గా పేర్కొన్నారు. స్వామి అమూల్య రత్న సంపద లోపలి భాండాగారంలో భద్రంగా ఉంటుంది. నిత్య వినియోగ ఆభరణాలు, పాత్రలు వగైరా సొత్తు బాహ్య భాండాగారంలో ఉంటుంది. అరుదుగా వినియోగించే ఆభరణాలు లోపలి భాండాగారంలో భద్రపరుస్తారు. బాహ్య భాండాగారం తెరిస్తే గానీ లోపలి భాండాగారం లోనికి ప్రవేశించడం అసాధ్యం. రాష్ట్ర హై కోర్టు ఉత్తర్వుల మేరకు రత్న భాండాగారం స్థితిగతుల్ని సమీక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతితో ఇటీవల బాహ్య భాండాగారం తెరిచారు. గోడలు అక్కడక్కడ స్వల్పంగా బీటలు వారినట్లు గుర్తించారు. ఈ సందర్భంగా బాహ్య భాండాగారం గ్రిల్ నుంచి లోపలి భాండాగారం వైపు దృష్టి సారించారు. ఈ భాండాగారం తలుపుల తాళాలకు సీలు వేసినట్లు అధికార వర్గం గుర్తించింది. ఈ లెక్కన లోపలి భాండాగారం సురక్షితంగా ఉన్నందున దానిలో రత్న సంపద కూడా భద్రంగా ఉండడం తథ్యంగా శ్రీ జగన్నాథ ఆలయ అధికార వర్గం స్పష్టం చేసింది. తాళం గల్లంతు వాస్తవమే! రాష్ట్ర హై కోర్టు ఉత్తర్వుల మేరకు రత్న భాండాగారం పరిశీలించడం అనివార్యంగా మారింది. ఈ నేపథ్యంలో రత్న భాండాగారం తెరిచేందుకు తా ళం చెవి కోసం వెతుకులాట మొదలైంది. జిల్లా ట్రెజరీలో ఉండాల్సిన తాళం చెవి కనిపించనట్లు జిల్లా కలెక్టరు బహిరంగపరిచారు. అధికార సమూహం అంతా ఏకమై గాలించిన రత్న భాండాగారం తాళం చెవి కాన రాని మాట వాస్తవం. కాగిత పత్రాలు, దస్తావేజులు వగైరా క్షుణ్ణంగా పరిశీలించిన ప్రయోజనం శూన్యంగా పరిణమించింది. అంచెలంచెలుగా అధికారులు ఈ పరిస్థితిని సమీక్షించిన మేరకు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లేందుకు నిర్ణయించారు. 1985 సంవత్సరంలో లోపలి భాండాగారం తెరిచి ఆభరణాలు వగైరా లెక్కించినట్టు దస్తావేజులు స్పష్టం చేస్తున్నాయి. లెక్కింపు ముగించి ఈ భాండాగారానికి 3 తాళాలు వేశారు. ఒక తాళానికి సీలు ఉన్నట్టు ఇటీవల గుర్తించారు. రాష్ట్ర హై కోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించడంతో ఈ ఏడాది ఏప్రిల్ నెల 4వ తేదీన రత్న భాండాగారం పరిశీలించారు. తాళం చెవి గల్లంతుపట్ల 17 మంది సభ్యుల నిపుణుల బృందం తలకిందులు అయి ప్రయత్నించిన గాలించ లేకపోయింది. బాహ్య భాండాగారం తెరిచి పరిశీలన మొక్కుబడిగా ముగించేశారు. లోపలి భాండాగారం పరిశీలించాల్సిన అవసరం లేనట్లు నిపుణుల బృందం ప్రకటించింది. తాజా పరిస్థితుల్ని విశ్లేషిస్తే తాళం చెవి లేనందున లోపలి భాండాగారం పరిశీలన సాధ్యం కానట్లు తెలుస్తుంది. అంచెలంచెలుగా సమావేశాలు ఏప్రిల్ 4వ తేదీ ఉదయం రత్న భాండాగారం పరిశీలన ముగించిన వెంటనే శ్రీ మందిరం సబ్ కమిటీ అదే రోజు మధ్యాహ్నం అత్యవసరంగా సమావేశం అయింది. తాళం చెవి గల్లంతు శీర్షికతో ఈ సమావేశం కొనసాగింది. ఈ సమావేశం తీర్మానం మేరకు మర్నాడు భువనేశ్వర్ స్పెషల్ సర్క్యుట్ హౌసులో శ్రీమందిరం పాలక మండలి సమావేశం జరిగింది. పూరీ గజపతి మహా రాజా, శ్రీ జగన్నాథుని తొలి సేవకుడు దివ్య సింఘ్ దేవ్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో కూడా తాళం చెవి జాడ కానరానందున విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలని నిర్ణయించారు. ఇంటర్నల్ ఆడిట్ తాళం చెవి జాడ కోసం ఇంటర్నల్ ఆడిట్ కూడా నిర్వహించారు. శ్రీమందిరం సేవా పాలక మండలి ప్రముఖుడు ఈ ఆడిట్ నిర్వహించారు. 1985 సంవత్సరంలో రత్న భాండాగారం ఆభరణాల లెక్కింపు పురస్కరించుకుని శ్రీమందిరం పాలక మండలి డిప్యుటీ పాలకుడు రబీంద్ర నారాయణ మిశ్రా నుంచి రత్న భాండాగారం తాళం చెవి తీసుకున్నట్టు ఆడిట్ ఖరారు చేసింది. శ్రీ మందిరం ప్రధాన పాలకునికి ఈ నివేదిక సమర్పించారు. కలెక్టరేటులో రికార్డు రూమ్ క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. ఇంత ప్రయాసపడిన తాళం చెవి జాడ దొరక లేదు. న్యాయ విచారణకు సహకరిస్తాం రత్న భాండాగారం తాళం చెవి గల్లంతు నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ న్యాయ విచారణకు ఆదేశించారు. ఈ విచారణకు పూర్తి స్థాయిలో సహకరిస్తామని శ్రీ జగన్నాథ ఆలయ అధికారవర్గం(ఎస్జేటీఏ) తెలిపింది. -
శ్రీవారి వజ్రాలు ఎలా మాయం అయ్యాయి?
-
ఆభరణాలు బయటపడకపోతే పదవికి రాజీనామా చేస్తా
-
విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, విశాఖపట్నం : తిరుమల తిరుపతి దేవస్థానంలోని పోటు నేల మాళిగలోని విలువైన ఆభరణాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి, హైదరాబాద్లలోని ఆయన నివాసాలకు తరలించారంటూ బుధవారం వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. 12 గంటల్లోగా కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) లేదా తెలంగాణ పోలీసులతో చంద్రబాబు నివాసంలో తనిఖీలు నిర్వహిస్తే ఆభరణాలు బయపడతాయని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఇంట్లో ఆభరణాలు బయటపడకపోతే వెంటనే తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. 12 గంటల కంటే ఎక్కువ సమయం చంద్రబాబుకు ఇస్తే తిరుమల ఆభరణాలు విదేశాలకు తరలిపోతాయని అన్నారు. కేవలం హెరిటేజ్ వ్యాపారంతోనే చంద్రబాబు ఇన్ని ఆస్తులు కూడబెట్టారంటే సాధ్యమైన పని కాదని ఆయన చెప్పారు. తన కుమారుడు లోకేష్పై అసత్య ప్రచారం చేస్తున్నారని అంటున్న చంద్రబాబు ఎందుకు సీబీఐ విచారణను కోరడం లేదని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. వేల మంది పోలీసులను పెట్టుకున్నా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న అభిమానాన్ని చంద్రబాబు నాయుడు అడ్డుకోలేరని అన్నారు. -
జగన్నాథుని రత్న భాండాగారం పరిశీలన
భువనేశ్వర్ : ఒడిశాలోని ప్రసిద్ధ పూరీ జగన్నాథ ఆలయ రత్న భాండాగారం తలుపులు ఎట్టకేలకు తెరుచుకున్నాయి. నగల భాండాగార నిర్మాణాన్ని పరిశీలించాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశాలతో 34 ఏళ్ల తర్వాత బుధవారం అధికారులు ఆలయ రత్న భాండాగార తలుపులు తెరిచారు. అయితే ఆభరణాలను ఎట్టి పరిస్థితుల్లో తాకొద్దని న్యాయస్థానం సూచనలు చేసింది. 10 మంది సభ్యులతో ప్రత్యేక బృందం నగల భాండాగారం పరిశీలన చేపట్టింది. కాగా చివరిసారిగా 1984వ సంవత్సరంలో రత్న భాండాగారం పరిశీలన నిర్వహించారు. ఇది అత్యంత గోప్య ప్రక్రియ. శ్రీ మందిరం సత్వ లిపి ప్రకారం ఈ ప్రక్రియ ఆద్యంతాలు నిర్వహిస్తారు. పరిశీలనలో భాగంగా రత్న భాండాగారం లోపలి గోడలు, పై–కప్పు ఇతరేతర నిర్మిత కట్టడాల స్థితిగతుల్ని నిపుణులు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తారని శ్రీ మందిరం దేవస్థానం ప్రధాన పాలన అధికారి ప్రదీప్ కుమార్ జెనా తెలిపారు. రత్న భాండాగారం పరిశీలన వ్యవధిలో భక్తులకు దర్శనం తాత్కాలికంగా నిలిపివేస్తారు. పరిశీలన ముగియడంతో బృందం సభ్యులు సమగ్ర నివేదిక తక్షణమే సమర్పించేందుకు ఉత్తర్వులు జారీ చేశారు. 36 నియోగుల సమావేశం తీర్మానం మేరకు ఈ బృందంలో పూరీ గజపతి మహా రాజా ప్రతినిధి, రాష్ట్ర హైకోర్టు ప్రతినిధి, భండార్ మేకప్, పట్టజోషి మహాపాత్రో, దెవులొ కొరొణొ, తొడొవు కొరొణొ సేవాయత్ వర్గాల ప్రతినిధులతో భారతీయ పురావస్తు శాఖ ఇద్దరు ప్రతినిధులు, కోర్ కమిటీ నుంచి ఇద్దరు ప్రతినిధుల్ని సభ్యులుగా ఎంపిక చేశారు. వీరందరికీ మూడు అంచెల్లో తనిఖీలు నిర్వహించి రత్న భాండాగారం లోనికి అనుమతిస్తారు. తొలుత మజొణా మండపం ఆవరణలో తనిఖీ చేస్తారు. రెండోసారి బెహొరొణొ ద్వారం ముంగిట తనిఖీలు చేసిన తర్వాత రత్న భాండాగారం ప్రాంగణంలో భండార్ మేకప్ సేవాయత్ ప్రముఖులు తనిఖీ చేసిన మేరకు లోనికి ప్రవేశించేందుకు అనుమతిస్తారని వివరించారు. రత్న భాండాగారంలో గోప్యమైన విషయాలు, వివరాలు, అంశాల్ని బహిరంగంగా చర్చించడం వంటి చర్యలకు పాల్పడకుండా స్థానిక లోకనాథుని దేవస్థానంలో పరిశీలన బృందం సభ్యులు అంతా ప్రమాణం చేయడం అనివార్యంగా పేర్కొన్నారు. గజపతి మహారాజా రావలిసిందే జగన్నాథుని రత్న భాండాగారం పరిశీలన బృందంలో పూరీ గజపతి మహా రాజా దివ్య సింగ్ దేవ్ ప్రత్యక్షంగా పాల్గొనాల్సిందేనని జగన్నాథ సేవాయత్ సమ్మేళన్ స్పష్టం చేసింది. తరతరాల ఆలయ సంప్రదాయాల ప్రకారం పూరీ గజపతి మహా రాజా జగన్నాథుని తొలి సేవకుడు. జగన్నాథ ఆలయ అధికారిక మండలి శాశ్వత అధ్యక్షునిగా ఆయన కొనసాగుతున్నారు. ఆయన ప్రతినిధిని సభ్యునిగా రత్న భాండాగారం పరిశీలనకు ప్రేరేపించడం విచారకరం. పూరీ గజపతి మహారాజా ప్రత్యక్షంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని జగన్నాథ సేవాయత్ సమ్మేళన్ తెలిపింది. ఆలయ పాలక మండలి, సేవా యత్, రాష్ట్ర ప్రభుత్వ వర్గాలతో నిర్వహించిన త్రివర్గ సమావేశంలో ఈ మేరకు ఎటువంటి ప్రతిపాదన లేనట్లు సమ్మేళన్ ప్రముఖుడు కాశీనాథ్ ఖుంటియా తెలిపారు. ఈ సమావేశానికి హాజరు అయిన పూరీ గజపతి మహా రాజా దివ్య సింగ్ దేవ్ ఈ నేపథ్యంలో ఎటువంటి అభ్యంతరాల్ని ప్రస్తావించలేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఆయనకు బదులుగా ప్రతినిధిని ఖరారు చేసి రత్న భాండాగారం పరిశీలన బృందం ఖరారు చేయడంపట్ల జగన్నాథ సేవా యత్ సమ్మేళన్ సందేహం వ్యక్తం చేస్తోంది. -
ఆరుగురు అరెస్ట్: రూ.11.13 లక్షల సొత్తు సీజ్
సాక్షి, కొవ్వూరు: పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు సబ్ డివిజన్ పరిధిలో ద్విచక్ర వాహనాలు, బంగారు ఆభరణాల దొంగతనాలకు పాల్పడిన ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.11,13,600లు విలువ చేసే బంగారపు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అలాగే 28 వాహనాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ రవిప్రకాష్ హెచ్చరించారు. -
‘సింహపురి’లో నగల బ్యాగ్ మాయం
సాక్షి, ఒంగోలు: సికింద్రాబాద్ నుంచి గూడూరు వెళ్తున్న సింహపురి ఎక్స్ప్రెస్ రైలులోలో ప్రయాణికురాలి నగల బ్యాగ్ మాయం అయింది. రూ.35 లక్షల విలువ చేసే నగలు ఉన్న బ్యాగ్ పోయిందని రావిపాటి సుశీల అనే ప్రయాణికురాలు ఒంగోలు రైల్వేపోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాధితురాలు హైదరాబాద్ నుంచి ఇదే రైలులో ఒంగోలు వస్తుండగా ఈ సంఘటన జరిగింది. కేసు నమోదు చేసుకుని రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
బ్యాంకులో అగ్నిప్రమాదం
అన్నానగర్: మధురై సమీపం పేరైయూర్లో ఓ బ్యాంకులో అగ్ని ప్రమాదం సంభవించింది. రూ. 8 లక్షల విలువ గల వస్తువులు కాలి బూడిదయ్యాయి. అదృష్టవశాత్తు కోట్ల ఖరీదైన బంగారం, నగదు సురక్షితంగా ఉన్నాయి. ఈ ఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. మధురై సమీపం పేరైయూర్ బస్టాండ్ ఎదురుగా ఉన్న బ్యాంకులో శనివారం సాయంత్రం పని ముగియగానే సిబ్బంది బ్యాంక్కు తాళం వేసి వెళ్ళారు. సాయంత్రం 4.50 గంటల సమయంలో బ్యాంకు లోపల అగ్నిప్రమాదం సంభవించి దట్టమైన పొగలు బయటకు వస్తుండగా స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పేరైయూర్ పోలీసు జాయింట్ సూపరింటెండెంట్ చార్లెస్ ఆధ్వర్యంలో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి వెళ్ళి బ్యాంకు కిటికీ అద్దాలను పగులగొట్టి సుమారు గంటసేపు పోరాడి మంటలను ఆర్పారు. అనంతరం బ్యాంకు సిబ్బందిని పిలిపించి లోపలికి వెళ్ళి చూడగా క్యాషియర్ గది మొత్తం కాలిపోయింది. పదికి పైన కంప్యూటర్లు, వస్తువులు కాలి బూడిదయ్యాయి. పోలీసుల ప్రాథమిక విచారణలో విద్యుత్ షార్టు సర్క్యూట్ వల్ల అగ్నిప్రమాదం సంభవించిందని గుర్తించారు. అదృష్టవశాత్తు రూ.40 లక్షల నగదు, రూ.22 కోట్ల విలువ గల బంగారం సురక్షితంగా ఉన్నాయి. పేరైయూర్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. -
నగలు తీయించి పరుగో పరుగు
ముంబయి: పోలీసులమని చెప్పి ఓ ఇద్దరు దొంగలు 55 ఏళ్ల మహిళను బురిడీ కొట్టించారు. ఆమె దగ్గర నుంచి దాదాపు రూ.50వేల అభరణాలు ఎత్తుకెళ్లారు. ముంబయిలోని విల్ పర్లేలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు వారికోసం లుకౌట్ నోటీసులు అంటించారు. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ అంధేరిలోని దుర్గా చావల్ ప్రాంతంలో విజయ మరాఠీ(55) అనే మహిళ ఉంది. ఆమె పరిస్వాడా ప్రాంతంలోని సహార్ రోడ్డులోగల న్యూ ఎయిర్పోర్ట్ ప్రవేశ ద్వారం వద్ద వాకింగ్ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు ఆమెకు తారసపడ్డారు. తాము పోలీసులం అని, ఆ ప్రాంతంలో నిఘా నడుస్తుందని, విలువైన వస్తువులు తీసుకొని వాకింగ్ వెళ్లకూడదని, ప్రమాదం పొంచి ఉందని నమ్మబలికించి ఆమె నగలు మొత్తం తీసివ్వాలని ఓ రుమాలు కూడా ఇచ్చారు. తిరిగి వచ్చేటప్పుడు ఆ నగలు తీసుకెళ్లాలని అన్నారు. వారి మాటలు నిజమే అని నమ్మిన ఆమె అలాగే చేసింది. దాంతో వాటిని తీసుకొని దొంగలు పరారయ్యారు. ఈ మేరకు బాధితురాలు అక్కడే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. -
జీరోపై వెండి విక్రయాలు
- నిందితుడి అరెస్టు - రూ.15లక్షల వెండి స్వాధీనం ఆదోని టౌన్ : పన్నులు చెల్లించకుండా గుట్టుగా వెండి ఆభరణాల విక్రయాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తి గురువారం పోలీసులకు పట్టుబడ్డాడు. అతని వద్ద నుంచి పోలీసులు రూ. 15లక్షల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ కొల్లి శ్రీనివాసరావు ఆదోని టూటౌన్ స్టేషన్లో విలేకరులకు వెల్లడించారు. పట్టణంలోని ఖాజీపుర వీధికి చెందిన వీరేష్ షరాఫ్ బజారులో బంగారు, వెండి ఆభరణాలను తయారు చేస్తూ దుకాణాలకు విక్రయించేవాడు. ఈ వ్యవహారంలో పన్ను చెల్లించకుండా ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టేవాడు. బుధవారం ఎస్కేడీ కాలనీలోని ఏడవ రోడ్డులో నల్లని బ్యాగును భుజాన వేసుకొని అటూఇటూ తిరుగుతుండగా అనుమానించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. టూటౌన్ సీఐ ఘంటా సుబ్బారావు, ఎస్ఐ రమేష్బాబు సిబ్బందితో వెళ్లి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. 33 వెండి పలకలు, 80 చిన్న, పెద్ద వెండి కుంకుమ భరిణెలు మొత్తంగా 14,814 గ్రాముల వెండి అతని వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.7 లక్షల వరకు ఉంటుందని డీఎస్పీ తెలిపారు. వీరేష్పై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచామన్నారు. స్వాధీనం చేసుకున్న వెండిని తదుపరి చర్యల నిమిత్తం ఆదాయపు పన్ను శాఖ అధికారులకు అప్పగించనున్నట్లు చెప్పారు. -
సిద్ధిపేటలో దొంగల బీభత్సం
సిద్ధిపేట మండలకేంద్రం గణేశ్ నగర్లో దొంగలు బీభత్సం సృష్టించారు. స్థానికంగా నివాసముంటున్న శ్రీశైలం, పదయ్య, నర్సింహులు అనే ముగ్గురి ళ్లలో చోరీకి పాల్పడ్డారు. మూడిళ్లలో కలిపి 2 తులాల బంగారం, రూ.10 వేల నగదు దోచుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆభరణాల కోసమే హత్య
వ్యాపారం బాగా సాగేందుకు ఇంట్లో పూజ చేయించాలనుకున్నాడు.. అందుకు చెర్వుగట్టుకు వెళ్లి ఓ శివ భక్తురాలితో మాట్లాడాడు.. ఓ మంచి రోజు చూసి ఇంటికి పిలిచాడు.. ఒంటరిగా వచ్చిన ఆవృద్ధురాలి ఒంటిపై ఉన్న ఆభరణాలను చూసి అతడికి దుర్బుద్ధి పుట్టింది. ఇంకేముంది నిస్సాయురాలైన ఆమెను గొంతునులిమి చంపేసి.. ఆభరణాలను కాజేశాడు. చెర్వుగట్టు సమీపంలో గత నెల వెలుగుచూసిన వృద్ధురాలి హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఆభరణాల కోసమే హత్య చేసినట్టు విచారణలో వెల్లడైంది. అరెస్ట్ చేసిన నిందితుడిని సోమవారం సీఐ సుబ్బిరాంరెడ్డి మీడియా ముందు ప్రవేశపెట్టారు. – నార్కట్పల్లి నల్లగొండ మండలం దోమలపల్లి గ్రామానికి చెందిన బీమనపల్లి భరత్ కుటుంబం పదేళ్ల క్రితం చిట్యాలకు వలస వచ్చింది. భువనగిరి రోడ్డులో అద్దెకుంటూ చిరువ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వ్యాపారం బాగా సాగాలని చెర్వుగుట్ట దేవాలయానికి వెళ్లి పూజ నిర్వహించాడు. అక్కడే కొలుపు చెబుతున్న జిల్లా కేంద్రంలోని ఏఆర్నగర్కు చెందిన ఉటుకూరి మాణిక్యమ్మ(55)ను సంప్రదించాడు. దీంతో ఇంట్లో పూజ చేయాలని అందుకు రూ. 5వేల వరకు ఖర్చు అవుతుందని చెప్పింది. ఇంటికి పిలిచి.. భరత్ పూజ చేయించేందుకు ఒప్పందం చేసుకుని మాణక్యమ్మను గత నెల 10వ తేదీన ఇంటికి పిలిచాడు. అయితే ఆ సమయంలో భరత్ ఇంట్లో ఒక్కడే ఉన్నాడు. మాణిక్యమ్మ ఒంటిపై ఉన్న బంగారు, వెండి ఆభరణాలను చూసి అతడి కన్ను చెదిరింది. దీంతో వాటిని కాజేసేందుకు ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే తన వద్ద ఉన్న తువాలతో ఆమె గొంతు నులిమి హత్య చేశాడు. ఆపై ఆమె ఒంటిపై ఉన్న ఆభరణాలు, సెల్ఫోన్, నాలుగు వేల నగదు తీసుకున్నాడు. ఈ క్రమంలో అతడి భార్య, కుమారుడు వచ్చారు. ఇంట్లో మృతదేహం చూసి అవాక్కయ్యారు. వారికి ఏవో మాటలు చెప్పి అదే రోజు రాత్రి కుమారుడి ఆటోలో మాణిక్యమ్మ మృతదేహాన్ని చెర్వుగట్టు గ్రామానికి వెళ్లే దారిలో పడవేసి వచ్చాడు. సెల్ఫోన్ నంబర్ ఆధారంగా.. గత నెల 11వ తేదీన వృద్ధురాలి హత్య వెలుగుచూడడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. మాణిక్యమ్మ సెల్ఫోన్ ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. పరోక్షంగా సహకారంం అందించి భరత్ భార్య లక్ష్మి, కుమారుడు మహేష్ పరారీలో ఉన్నారని సీఐ వివరించారు. సమావేశంలో ఎస్ఐ మోతీరామ్, నరేందర్, క్రైనీ ఎస్ఐ గోవర్ధన్ సిబ్బంది ఉన్నారు. -
ఆలయాల్లో చోరీ
– రూ. 2 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు అపహరణ – వరుస చోరీలతో పూజారుల ఆందోళన వెల్దుర్తి రూరల్: ఆలయాలే టార్గెట్గా దొంగలు స్వైర విహారం చేస్తున్నారు. ఊరికి దూరంగా ఉన్న గుళ్లను ఎంచుకుని చోరీలకు పాల్పడుతున్నారు. శుక్రవారం అర్ధరాత్రి వెల్దుర్తి మండలంలో రెండు ఆలయాల్లో విలువైన బంగారు, వెండి ఆభరణాలతో పాటు హుండీ డబ్బులను అపహరించారు. బొమ్మిరెడ్డిపల్లెలోని హైవే పక్కన ఉన్న పామయ్యస్వామి ఆలయ తాళం పగులగొట్టి హుండీతో పాటు గర్భగుడిలోని పది వెండి పడుగలు ఎత్తుకెళ్లారు. ఖాళీ హుండీని మల్లెపల్లెరోడ్డులో పడేసి వెళ్లారు. అందులో దాదాపు 35వేల నగదు అపహరణకు గురైనట్లు గ్రామ నాయకుడు లక్ష్మీరెడ్డితోపాటు గ్రామస్తులు, పూజారి తెలిపారు. అదే రోజు రాత్రి బ్రహ్మగుండం సమీపంలో రామళ్లకోట రహదారిలోని నిత్యాంజనేయ స్వామి క్షేత్రంలోని రెండు చిన్న ఆలయాల్లో చోరీ జరిగింది. లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోని అమ్మవారి రెండు తులాల నాలుగు బంగారు పుస్తెలు, 20 తులాల వెండి కిరీటం, రాగి చెంబులతో పాటు హుండీని, మైక్సెట్ను దొంగలు అపహరించారు. అనంతరం పక్కనే ఉన్న రాములవారి ఆలయంలోకి ప్రవేశించిన దొంగలు సీతాదేవి అమ్మవారి విగ్రహం మెడలోని రెండు బంగారు పుస్తెలు (తులం) అపహరించారు. పక్కనే ఉన్న కాశిరెడ్డినాయన ఆశ్రమంలోని తలుపులను పగులగొట్టి హుండీని, వంట సామగ్రిని సైతం ఎత్తుకెళ్లారు. ఈ రెండు ఆలయాల హుండీ మొత్తం, బంగారు, వెండి, వస్తువుల విలువ కలిపి దాదాపు లక్షన్నర సొత్తు చోరీ జరిగినట్లు పూజారి మాధవి తెలిపారు. ఆలయం పక్కనే ఉన్న ఇంట్లో నివాసం ఉంటున్నానని, తన ఇంటి తలుపును కూడా ఎవరో అర్ధరాత్రి శబ్దం చేయడంతో భయపడి తెలుపు తీయలేదన్నారు. ఆటో శబ్దం వచ్చిందన్నారు. తెల్లారేసరికి ఆలయాలు తెరిచి ఉంచడంతో చోరీ జరిగిందని గ్రామస్తులకు చెప్పానన్నారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. కొద్ది నెలలుగా మండలంలోని సర్పరాజపురం సుంకులమ్మ ఆలయం, రామల్లకోట పెద్దమ్మ గుడి, వెల్దుర్తి ఎల్లమ్మ గుడి, మదార్పురం గోదుమారి ఎల్లమ్మ ఆలయాల్లో చోరీలు జరిగాయి. వరుస చోరీలతో పూజారులు, భక్తులు ఆందోళన చెందుతున్నారు. -
పట్టపగలు చోరీ
ఈపూరు: మండలంలోని అంగలూరు గ్రామంలో పట్టపగలు చోరీ జరిగిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కట్టా వెంకట్రావు కుమార్తె అట్లూరి కుమారి మాచర్లలో నివాసం ఉంటోంది. అయితే అంగలూరులో తన పెదనాన్న అంత్యక్రియల నిమిత్తం ఇక్కడకు వచ్చింది. ఈ క్రమంలో ఆమె ఒంటిపై ఉన్న బంగారు నగలను బ్యాగులో పెట్టి చెక్క బీరువాలో దాచింది. శుక్రవారం మధ్యాహ్నం స్నానం చేసి బంగారం కోసం బీరువాలో చూడగా బ్యాగు కనిపించలేదు. దీంతో ఈపూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కుమారి ఫిర్యాదు మేరకు ఎస్ఐ ఉజ్వల్కుమార్ సంఘటనా ప్రాంతాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. చోరీకి గురైన వాటిలో రెండు నానుతాడులు, నల్లపూసల గొలుసు, చెయిన్, చెవి దుద్దులు మొత్తం 12.5 సవర్ల బంగారం, రూ.7వేల నగదు ఉన్నట్టు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. -
శ్రీశైలాలయం ఆభరణాలు భద్రమే..
– ఈఓ సాగర్బాబు వ్యవహారంతో అప్రమత్తం – స్వామి, అమ్మవార్లకు భక్తులు సమర్పించిన ఆభరణాల తనిఖీ – ఆంధ్రా బ్యాంకు లాకర్ పరిశీలన శ్రీశైలం: శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామివార్లకు భక్తులు సమర్పించిన బంగారు, వెండి ఆభరణాలను మాజీ ఈఓ సాగర్బాబు ఇప్పటి వరకు స్వాధీనం చేయకపోవడంతో మంగళవారం ప్రస్తుత ఈఓ నారాయణ భరత్గుప్త స్థానిక ఆంధ్రా బ్యాంకు లాకర్ను తెరిపించి పంచనామా చేయించారు. దాతలు బహూకరించిన బంగారు, వెండి ఆభరణాలను దేవస్థానం ఈఓ సంబంధిత గుమస్తా, ఇతర అధికారులతో కలిసి అధికారికంగా లాకర్లో భద్రపరుస్తారు. కొన్నింటిని స్వామి, అమ్మవార్ల నిత్య పూజలు.. కైంకర్యాలకు వినియోగించడం ఆనవాయితీ. ఈఓ బదిలీ సమయంలో కొత్త అధికారికి ఆంధ్రా బ్యాంకులోని దేవస్థానం బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేయాల్సి ఉంటుంది. అయితే బదిలీ అయిన ఈఓ సాగర్బాబు వీటిని స్వాధీనం చేసేలోగా ఏసీబీ దాడులు జరగడంతో ప్రస్తుత ఈఓ అప్రమత్తం అయ్యారు. పోలీసు, రెవెన్యూ, దేవస్థానం సిబ్బందితో కలిసి లాకర్ను పగులగొట్టించి ఆభరణాలను పరిశీలించారు. అయితే ఇందులో ఎలాంటి గోల్మాల్ జరగలేదని తెలుస్తోంది. తనిఖీలో ఈఓతో పాటు డిప్యూటీ తహశీల్దార్ రాజేంద్రసింగ్, వన్టౌన్ ఎస్ఐ లోకేష్కుమార్, ఆంధ్రా బ్యాంకు మేనేజర్, దేవస్థానం ఏఈఓ కష్ణారెడ్డి, అకౌంట్స్ గుమస్తా ఉమేష్ ఉన్నారు. -
ఏఆర్ కానిస్టేబుల్ ఇంట్లో చోరీ
రూ 12.50 లక్షల సొత్తు అపహరణ నెల్లూరు(క్రైమ్): ఓ కానిస్టేబుల్ కుటుంబంతో కలిసి తన స్వగ్రామానికి వెళ్లాడు. ఇదే అదనుగా భావించిన దుండగులు ఇంటి తలుపులు పగులగొట్టి బీరువాలోని రూ. 12.50 లక్షల విలువచేసే బంగారు, వెండి ఆభరణాలు, నగదు అపహరించుకొని వెళ్లారు. ఈ సంఘటన బుధవారం తెల్లవారుజామున జెడ్పీకాలనీ రెండో వీ«ధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే... ఉదయగిరి మండలం గంగులవారి చెరుపల్లి (జి.సి పల్లి) గ్రామానికి చెందిన పసుపులేటి శ్రీనివాసులు ఏఆర్ కానిస్టేబుల్. ఆయన నెల్లూరు జెడ్పీ కాలనీ రెండో వీధిలో నివాసముంటున్నారు. నెల రోజుల క్రితం అతని తమ్ముడు మృతిచెందాడు. దీంతో ఈనెల 19వ తేదీ శ్రీనివాసులు భార్య నిర్మల, కుమార్తె అనంతలక్ష్మిలు జి,సి పల్లిలో ఉంటున్న శ్రీనివాసులు తల్లిదండ్రుల వద్దకు వెళ్లారు. శ్రీనివాసులు 23వ తేదీ ఉదయం 10.30 గంటలకు జీసీ పల్లికి బయలుదేరి వెళ్లాడు. బుధవారం తెల్లవారుజామున గుర్తుతెలియని దండుగులు ఇంటి తలుపులు పగులగొట్టి లోనికి ప్రవేశించారు. రెండోగదిలో ఉన్న బీరువాలో సుమారు 52 సవర్ల బంగారు ఆభరణాలు, లాకర్లోని రూ.12.50 లక్షలు విలువచేసే 42 సవర్ల బంగారు ఆభరణాలు, అరకేజీ వెండి, రూ.37వేల నగదు అపహరించుకొని వెళ్లారు. ఇంట్లోనుంచి బయటకు వెళ్లే క్రమంలో బంగారు కుచ్చులు ప్రహరీ పక్కన పడిపోయాయి. ఉదయం శ్రీనివాసులు ఇంటిపక్కనే నివాసముంటున్న చెంచమ్మ ఇంటి తలుపులు పగులగొట్టి ఉండటాన్ని గమనించి సమీపంలో నివాసముంటున్న ఏఆర్ హెడ్కానిస్టేబుల్ నాగేశ్వరరావుకు విషయాన్ని తెలియజేసింది. ఆయన బాధిత కుటుంబసభ్యులకు, ఐదో నగర పోలీసులకు సమాచారం అందించారు. ఐదోనగర ఇన్స్పెక్టర్ జి. మంగరావు, ఎస్ఐ జగత్సింగ్లు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్టీం సంఘటనా స్థలానికి చేరుకుని వేలిముద్రలను సేకరించింది. బాధిత కుటుంబసభ్యులు హుటాహుటిన నెల్లూరుకు చేరుకున్నారు. చోరీ ఘటనపై ఐదో నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐదోనగర ఇన్స్పెక్టర్ జి. మంగరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పట్టపగలే వృద్ధురాలి హత్య
నర్సంపేట : పట్టణ శివారులోని సర్వాపురంలో ఓ వృద్ధురాలిని పట్టపగలే గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసి నగలు దోచుకెళ్లిన సంఘటన మంగళవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. సర్వాపురానికి చెందిన కోల పూలమ్మ(65) నర్సం పేట– మహబూబాబాద్ ప్రధాన రహదారికి సమీపంలో నివా సం ఉంటోంది. భర్త కొన్నేళ్ల క్రితం మృతిచెందడంతో ఒంటరి గా జీవిస్తోంది. పెద్ద కుమారుడు అశోక్ ఖమ్మం జిల్లా పాల్వం చలో నివాసముంటుండగా, చిన్న కుమారుడు శ్రీనివాస్ అమెరికాలో స్థిరపడ్డాడు. కూతురు అరుణ కేసముద్రంలో ఉం టోంది. ప్రతి రోజు పూలమ్మ చుట్టుపక్కల ఇళ్లకు వెళ్లి వచ్చేదని, మధ్యాహ్నం నుంచి కనిపించలేదని చుట్టు పక్కల వారు తెలిపా రు. పూలమ్మ ఉంటున్న ఇంట్లోని పక్క గదిలో మరో మహిళ వలపదాసు వసంత అద్దెకు ఉంటూ, బీడీలు చుట్టేందుకు బయటకు వెళ్లి సాయంత్రం వస్తోంది. ఈ క్రమంలోనే ఇంటికి చేరుకున్న వసంత పక్కగది తలుపులు దగ్గరికి వేసి ఉండడంతో అనుమానం వచ్చి తెరిచి చూడగా పూలమ్మ మృతి చెంది కని పించింది. దీంతో ఆమె చుట్టుపక్కలవారికి తెలపగా పోలీసుల కు సమాచారమిచ్చారు. ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసుతోపాటు చెవి కమ్మలు దోచుకెళ్లేందుకు కొందరు వ్యక్తులు ఇం ట్లో చొరబడి హత్యచేసి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. తెలిసినవారే హతమార్చారా ? ఒంటిరిగా ఉంటున్న పూలమ్మ గ్రామంలో ప్రతి ఒక్కరిని పలుకరిస్తూ ఉండేదని, మెడలో బంగారు గొలుసుతోపాటు చెవులకు బంగారు కమ్మలు ఉండటాన్ని చూసిన దుండగులే నగల కోసం హత్య చేసి ఉంటారని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గదిలో ఒంటరిగా ఉన్న వృద్ధురాలి వద్దకు తెలిసిన వ్య క్తులు వెళ్లడం వల్లనే ప్రతిఘటించలేదని, నగలు తీసుకున్న వ్య క్తులు తమను గుర్తుపట్టి ఉంటుందని, బయటకు తెలియకుండా ఉండేందుకు తలపై బాది గదిలో ఉన్న బియ్యం మూటను ముఖంపై అదిమి హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. క్లూస్ టీంతో తనిఖీలు వృద్ధురాలి అనుమానాస్పద మృతి సమాచారం తెలుసుకున్న డీఎస్పీ దాసరి మురళీధర్, సీఐ బోనాల కిషన్, ఎస్సై హరికృష్ణ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం జిల్లా కేంద్రం నుంచి క్లూస్ టీంను రప్పించి తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ విలేకరులకు తెలిపారు. -
మిస్టరీగా మారిన నగల గల్లంతు
వరంగల్ : హన్మకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ నక్కలగుట్ట బ్రాంచి లాకర్లోని బంగారు ఆభరణాలలు మాయమైన ఘటన మిస్టరీగా మారింది. భీమారం ప్రాంతానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి ఆంజనేయులుకు బ్యాంక్లో లాకర్ ఉంది. ఈ లాకర్లో పెట్టిన ఆభరణాలు మాయమైనట్లు ఆయన సుబేదారి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు స్పందించి బ్యాంకు అధికారులను ప్రశ్నించారు. ఉన్నతాధికారులు అందుబాటులో లేకపోవడంతో పోలీసులు బుధవారం మళ్లీ విచారణ చేపట్టారు. ఈలోగా బాధితుడు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు వేగం పుంజుకుంది. లాకర్లో పెట్టిన నగలు సుమారు రూ.15లక్షల విలువ చేస్తాయని బాధితుడు చెప్పడంతో బ్యాంకు అధికారులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. బ్యాంకు లాకర్లో పెట్టిన నగల పూర్తి బాధ్యత వినియోగదారుడికే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అయితే తాను నగలు బ్యాంకు లాకర్లో పెట్టినా, అందులో లేవని బాధితుడు వాపోతుండడం గమనార్హం. -
గోవిందుడి దగ్గరికి వెళ్లొచ్చేసరికి..!
మలేషియా టౌన్షిప్(కేపీహెచ్ బీ): తిరుపతి వెళ్లి వచ్చేసరికి ఇంట్లో ఉన్నదంతా దొంగలు ఊడ్చుకెళ్లిన ఘటన కేపీహెచ్బీ పోలీసు స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. ఎస్సై రాందాస్ తెలిపిన వివరాల ప్రకారం.. కేపీహెచ్బీ కాలనీ తొమ్మిదో ఫేజ్కు చెందిన రవీంద్ర ఈ నెల 6న కుటుంబ సమేతంగా దైవదర్శనం కోసం తిరుపతికి బయలుదేరారు. సోమవారం ఉదయం పేపర్ బాయ్ పేపర్ వేసే క్రమంలో ఇంటి తాళాలు పగులగొట్టి ఉండటాన్ని గమనించి రవీంద్రకు ఫోన్ద్వారా సమాచారం అందజేశాడు. సోమవారం రాత్రి తిరుపతి నుంచి తన నివాసానికి చేరుకున్న రవీంద్ర ఇంట్లో పరిశీలించగా సుమారు ఏడు తులాల బంగారు నగలు, రూ.11 వేల నగదు కనిపించలేదు. గుర్తు తెలియని దుండగులు సొత్తును అపహరించుకుపోయారని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
మత్తు మందు ఇచ్చి దోచేశారు..
శ్రీకాకుళం: హౌరా- చెన్నై ఎక్స్ ప్రెస్లోని ఏసీ ఫస్ట్ క్లాస్ బోగీలో శనివారం దొంగలు హల్చల్ సృష్టించారు. ప్రయాణికులు శ్రీకిషన్ సింగ్, రాజ్ కుమారి దంపతులకు దుండగులు మత్తు మందు ఇచ్చి బంగారు నగలు ఎత్తు కెళ్లారు. తోటి ప్రయాణికులు పలాస రైల్వేస్టేషన్లో సమాచారం అందించగా బాధితులను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటన పై రైల్వే పోలీసులు విచారణ ప్రారంభించారు. -
బడికి వెళ్లొచ్చేసరికి దోచేశారు
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని వంగాయగూడెం సమీపంలో దొంగలు పట్టపగలే ఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. వెంకటరమణ, శ్రీలతాగౌతమి దంపతులు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. సోమవారం ఉదయం వీరు స్కూల్కు వెళ్లి సాయంత్రం తిరిగి వచ్చే సరికి ఇంటి తాళాలు పగులగొట్టి ఉన్నాయి. ఇంట్లోని రెండు బీరువా తలుపులు కూడా బద్దలు కొట్టి ఉన్నాయి. వాటిల్లోని 30 కాసుల బంగారు ఆభరణాలు చోరీకి గురవడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ రామారావు, క్లూస్టీమ్ సీఐ కె.నరసింహమూర్తి సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు ప్రారంభించారు -
బంగారు షాపుకు కన్నం.. నగలు చోరీ
-
దొంగ కడుపులోంచి బయటపడ్డ గొలుసు
-
ఆ గొలుసు బయటకొచ్చింది
‘ఎనిమా’ ఇచ్చి రప్పించిన వైద్యులు * ఊపిరి పీల్చుకున్న పోలీసులు హైదరాబాద్: వైద్యుల ‘ఎనిమా’ చికిత్స... పోలీసుల డబ్బా చిట్కా పని చేసింది.. దొంగ మింగిన బంగారు గొలుసు కథ ఎట్టకేలకు సుఖాంతమైంది. నిందితుడి కడుపులో ఉన్న గొలుసు బయటపడటంతో ఐదు రోజులుగా హైరానా పడుతున్న పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. హైదరాబాద్ మాణికేశ్వర్ నగర్కు చెందిన వికాస్ (22) ఈనెల 15 వ తేదీ రాత్రి చిలకలగూడ మైలార్గడ్డకు చెందిన ప్రమీల మెడ నుంచి బంగారు మంగళసూత్రాన్ని తెంపుకొని పరారయ్యాడు. అయితే పోలీ సులు వెంటపడటంతో గొలుసును మింగేశాడు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్న రైల్వే పోలీసులు.. న్యాయమూర్తి ఆదేశాల మేరకు గాంధీ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ ఎక్స్రే తీయించగా నిందితుడి కడుపు దిగువ భాగంలో గొలుసు ఉన్నట్లు తేలింది. శస్త్రచికిత్స చేసి గొలుసును బయటకు తీయాలని పోలీసులు కోరగా, వైద్యులు నిరాకరించారు. శస్త్రచికిత్స చేస్తే ప్రాణాలకు ప్రమాదమని, వారం రోజుల్లో మలద్వారం గుండా బయటకు వస్తుందని స్పష్టం చేశారు. దీంతో పోలీసులకు చెప్పుకోలేని కష్టాలు మొదలయ్యాయి. ఇదే విషయాన్ని ఈ నెల 18 న ‘గొలుసు రికవరీకి దారేది..?’ శీర్షికన ‘సాక్షి’ ప్రచురించిన విషయం తెలిసిందే. ఫలించిన పోలీసుల డబ్బా చిట్కా... నిందితుడు వికాస్ కడుపులోని గొలుసును బయటకు రప్పించేందుకు వైద్యులు ఎనిమా (ద్రావకం, మందులు ఇచ్చి కడుపును శుభ్రం చేయడం) ఇచ్చారు. నిందితుడు మలవిసర్జనకు వెళ్లినప్పుడు లెట్రిన్ కుండీ గుండా గొలుసు పోయే అవకాశం ఉంది. దీంతో పోలీసులు డబ్బా చిట్కాను ఉపయోగించారు. నిందితునికి ఓ డబ్బా ఇచ్చి అందులోనే మలవిసర్జన చేసి, అనంతరం గొలుసు ఉందా లేదా అనేది వెతకాలని చెప్పారు. రోజూ రెండు పూటల ఎక్స్రే తీయించి గొలుసు కడుపులో ఎక్కడ ఉందో పరిశీలించారు. బుధవారం ఉదయం తీసిన ఎక్స్రేలో కడుపులో ఉన్న గొలుసు పెద్ద పేగులోకి వచ్చినట్లు నిర్ధారించుకున్నారు. మరోమారు ఎనిమా ఇవ్వడంతో మలవిసర్జన సమయంలో గొలుసు డబ్బాలో పడింది. శుభ్రం చేసిన ఆ గొలుసును రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
దొంగ కడుపులోంచి బయటపడ్డ గొలుసు
చిలకలగూడ (హైదరాబాద్): చోర కళలో ఆరితేరిన ఓ దొంగ.. పోలీసులకు పట్టుబడతాననే భయంతో తస్కరించిన బంగారు గొలుసును ఏకంగా మింగేశాడు. చివరికి అతడిని పోలీసులు పట్టుకొని గొలుసు తీసేందుకు నానా కష్టాలు పడ్డారు. కొట్టేసిన బంగారు గొలుసును దొంగ గుటుక్కున మింగేయగా... గాంధీ ఆస్పత్రి వైద్యులు దాన్ని బయటకు రప్పించారు. సీతాఫల్ మండి రైల్వే స్టేషన్ సమీపంలో రెండు రోజుల క్రితం సాయంత్రం వాకింగ్కు వెళుతున్న ఓ మహిళ మెడలోని నాలుగు తులాల బంగారు గొలుసును వికాస్ అనే దొంగ తెంపుకుని పరారయ్యాడు. వారాసిగూడ వద్ద పోలీసులు అదే రోజు రాత్రి గస్తీ నిర్వహిస్తుండగా... అనుమానాస్పదంగా తిరుగుతున్న వికాస్ పట్టుబడ్డాడు. విచారిస్తున్న సమయంలోనే జేబులో ఉన్న బంగారు గొలుసును గుటుక్కున మింగేశాడు. దీంతో పోలీసులు అతడిని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లి ఎక్స్రే తీయించారు. కడుపు కింది భాగంలో గొలుసు ఉన్నట్లు తేలింది. శస్త్రచికిత్స చేసి గొలుసు తీయాలని పోలీసులు అక్కడి వైద్యులను కోరారు. అయితే, ఆపరేషన్ చేస్తే ప్రమాదమని, వారం రోజుల్లో మలద్వారం గుండా గొలుసు బయటకు వస్తుందని వైద్యులు చెప్పారు. దాంతో వారాసిగూడ పోలీసులు వికాస్ను రైల్వే పోలీసులకు అప్పగించారు. వారు కోర్టు అనుమతి మేరకు వికాస్ను గాంధీ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడి వైద్యులు వికాస్కు ఎనీమా ఇవ్వగా బుధవారం అతడు బంగారు గొలుసును విసర్జించాడు. -
మంగళసూత్రం మింగేశాడు
-
మంగళసూత్రం మింగేశాడు..
మంగళసూత్రం మింగిన దొంగ బయటకి తీయలేమంటున్న వైద్యులు తలబాదుకుంటున్న పోలీసులు హైదరాబాద్: చోర కళలో ఆరితేరిన ఓ దొంగ.. పోలీసులకు పట్టుబడతాననే భయంతో తస్కరించిన బంగారు గొలుసును ఏకంగా మింగేశాడు. చివరికి అతడిని పోలీసులు పట్టుకొని గొలుసు తీసేందుకు నానా కష్టాలు పడుతున్నారు. హైదరాబాద్ చిలకలగూడ మైలార్గడ్డకు చెందిన శంకరయ్య, ప్రమీల దంపతులు. శనివారం రాత్రి వారు సీతాఫల్మండి రైల్వేస్టేషన్ వైపునకు వాకింగ్ వచ్చారు. అక్కడే తచ్చాడుతున్న మాణికేశ్వరినగర్కు చెందిన వికాస్ (22) అనే దొంగ.. ప్రమీల మెడలోని నాలుగు తులాల మంగళసూత్రం తెంపుకొని పరారయ్యాడు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం అర్ధరాత్రి చిలకలగూడలో వికాస్ను గుర్తించిన పోలీసులు పట్టుకునేందుకు ప్రయత్నించగా జేబులోంచి గొలుసు తీసి అమాంతం మింగేశాడు. దీంతో పోలీసులు అతడిని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లి ఎక్స్రే తీయించారు. కడుపు కింది భాగంలో గొలుసు ఉన్నట్లు తేలింది. శస్త్రచికిత్స చేసి గొలుసు తీయాలని పోలీసులు అక్కడి వైద్యులను కోరారు. అయితే, ఆపరేషన్ చేస్తే ప్రమాదమని, వారం రోజుల్లో మలద్వారం గుండా గొలుసు బయటకు వస్తుందని వైద్యులు చెప్పారు. దీంతో నిందితుడిని ఇన్పేషెంట్గా చేర్చుకోవాలని పోలీసులు కోరగా అందుకు మొదట వైద్యులు నిరాకరించారు. గొలుసు ఎప్పుడు బయటకు వస్తుందో తెలియదని, నిందితుడు మలవిసర్జనకు వెళ్ల్లిన ప్రతిసారీ ఎవరు చెక్ చేస్తారని పోలీసులను ప్రశ్నించారు. పోలీస్ స్టేషన్లో ఉంటే తాము కూడా అదే పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని పోలీసులు కూడా సమాధానమిచ్చారు. చివరికి నిందితుడిని ఆస్పత్రిలో చేర్చుకునేందుకు వైద్యులు అంగీకరించారు. అయితే, దొంగ మింగిన బంగారం ఎప్పుడు బయటకు వస్తుందో... ఎలా రికవరీ చేయాలో తెలియక పోలీసులు తెగ హైరానా పడుతున్నారు. -
గాజులద్దిన తెలం‘ఘన కీర్తి’
రెండు వేల ఏళ్ల క్రితమే సొబగులద్దిన తెలంగాణ ‘గాజు’ భువనగిరి సమీపంలో వర్ధిల్లిన పరిశ్రమ హైదరాబాద్: అలంకరణలో గాజుదే కీలక ‘పాత్ర’. తల, మెడ, ముంజేతులు, మణికట్టు.. ఆభరణం ఏదైనా గాజు పొదిగితే దాని అందమే వేరు. ఆభరణాలే కాదు అలంకరణ వస్తువుల శోభను పెంచడంలోనూ గాజు పాత్ర కీలకం. అంతటి ప్రాధాన్యం ఉన్న గాజును రెండు వేల ఏళ్ల క్రితమే నాణ్యంగా, నైపుణ్యంగా ప్రపంచానికి అందించిన ఘన చరిత్ర మన తెలంగాణది. చారిత్రక భువనగిరి ఖిల్లాకు చేరువలో ఇలాంటి అద్భుత పరిశ్రమ అప్పట్లో అలరారింది. ఆ ప్రాంతంలో వేల కుటుంబాలు ఆ పరిశ్రమను ఆసరా చేసుకుని జీవనం సాగించాయి. ఆ ప్రాంతం ‘గాజు’ పేరుతోనే వర్ధిల్లింది. భువనగిరి సమీపంలో ఉన్న బస్వాపూర్ గ్రామమే నాటి గాజు పరిశ్రమ కేంద్రం. ఇప్పటికీ ఆ ఊరిని గాజుల బస్వాపూర్గానే పిలుస్తున్నారు. ప్రస్తుతం పేరులో మాత్రమే కనిపించే ‘గాజు’ జాడలు తాజాగా వెలుగుచూశాయి. ‘కొత్త తెలంగాణ చరిత్ర’ బృందం సభ్యులు రామోజు హరగోపాల్, వేముగంటి మురళీకృష్ణలు ఆ ప్రాంతాన్ని పరిశీలించి రెండు శతాబ్దాల కాలం నాటి గాజు పరిశ్రమ గలగలల నిగ్గుతేల్చారు. -సాక్షి, హైదరాబాద్ ముడి సరుకుకు కొదవ లేకపోవడమే... బస్వాపూర్ గ్రామ శివారులోని గాండ్రోని చెలకలో గాజుల బట్టీల ఆనవాళ్లు ఇప్పటికీ పదిలంగా ఉన్నాయి. బట్టీలు మట్టి దిబ్బల్లో మూసుకుపోయినప్పటికీ.. నాటి బట్టీలకు వినియోగించిన ముడిసరుకు, అందులో నుంచి వెలికితీసిన గాజు ముద్దలు, గాజు తయారీకి వినియోగించిన పాత్రల అవశేషాలు, సున్నపురాళ్లు, డంగు సున్నం ముద్దలు అక్కడ విస్తారంగా కనిపిస్తున్నాయి. ఈ మిశ్రమాలను నూరేందుకు వినియోగించిన నల్ల సానరాళ్లు కూడా ఉన్నాయి. స్థానికంగా ఉన్న ఉసిళ్లవాగు నుంచి స్వచ్ఛమైన నీటిని గాజు తయారీకి వినియోగించారని తెలుస్తోంది. వాగు నుంచి మంచి ఇసుక (సిలికాన్ డై ఆక్సైడ్) వాడేవారు. సమీపంలోని పాండవుల గుట్ట రాళ్లు కూడా నాణ్యమైన ముడి రాతి రేణువులను అందించేది. గాజుకు వివిధ రంగులు అందించేందుకు ఫెర్రిక్ ఆక్సైడ్ ఉన్న ఖనిజపు రాళ్లు కూడా ఇక్కడ పుష్కలంగా ఉన్నాయి. వివిధ ప్రాంతాలను అనుసంధానం చేసేందుకు భువనగిరి మీదుగా ప్రాచీన రహదారి ఉండేది. ఇలా అన్ని రకాలుగా ఈ ప్రాంతం అనువైందిగా ఉండడంతో దీన్ని గాజుల పరిశ్రమకు కేంద్రంగా మార్చుకున్నారు. ఇప్పటికీ అక్కడి పొలాలను దున్నుతున్నప్పుడు గాజుకు సంబంధించిన వస్తువులు బయటపడుతూనే ఉన్నాయి. గ్రామంలో క్రీ.శ.6- 7 శతాబ్దాల క్రితం నాటి శివాలయం, ఆంజనేయస్వామి దేవాలయం, రాష్ట్ర కూటుల కాలం నాటి వినాయకుడి విగ్రహం దొరకడం గ్రామ చరిత్రను స్పష్టం చేస్తోంది. గాండ్రోని చెలక పేరు ఇలా... ప్రస్తుతం గాజు పరిశ్రమ ఆనవాళ్లు దొరుకుతున్న ప్రాంతాన్ని గాండ్రోని చెలకగా పిలుస్తున్నారు. కాచరోని.. గాచ్రోని.. గాండ్రోని... ఇలా ఆ పేరు రూపాంతరం చెందినట్టు తెలుస్తోంది. కాచము అంటే గాజు. దానివల్లే ఆ చెలకకు ఆ పేరు వచ్చిందంటారు. దీంతోపాటు ఎర్ర చెలకలు, పలుగురాళ్ల కేంద్రం సైదాపురం గుట్టలు, మంచి ఇసుకను ఇచ్చే మాసాయిపేట పూసలగుట్టలు కూడా ఈ పరిశ్రమతో విరాజిల్లినట్టు తెలుస్తోంది. -
దోపిడీ దొంగల భీభత్సం
-
శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాల్లో గోల్డా...రోల్డేనా...?
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి దేవస్థానానికి చెందిన ఆభరణాలు భారతీయస్టేట్ బ్యాంకు లాకర్లలో ఏళ్ల తరబడి మగ్గుతున్నాయి. కనీసం బ్రహ్మోత్సవాల్లోనైనా పాతకాలం నాటి హారాలు, బంగారు కిరీటాలు, పాదాలు, కర్ణాలు, పెద్ద పెద్ద హారాలు, పచ్చలు పొదిగిన నగలు, చేతి కడియాలు తదితర స్వర్ణాభరణాలు కనువిందు చేస్తాయని భక్తులు నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రతిఏటా.. ఈ ఏడాది భద్రతా ఇబ్బందులున్నాయి...వచ్చే ఏడాది బంగారు నగలు తప్పక అలంకరిస్తాం.....అంటూ ఉత్సవాల నాటి ఈవోలు కాలంగడిపేస్తు వెళ్లిపోతున్నారు. భక్తులు ప్రశ్నించేందుకు వచ్చే ఏడాది ఆ ఈవోలు ఉండడంలేదు...(వరుసగా రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహించిన ఈవోలు లేరు..) బదిలీపై వెళ్లిపోతున్నారు. దీంతో ఏటా గిల్టు నగలతోనే ఉత్సవాలు ముగిస్తున్నారు. భక్తులు మాత్రం తీవ్రమైన నిరాస చెందుతున్నారు. ఈ ఏడాది ఈవో కార్యాలయంలో జరిగిన పలు సమావేశాల్లో పలువురు పుర పెద్దలు బ్రహ్మోత్సవాల్లో బంగారు నగలు స్వామి, అమ్మవార్లకు అలంకరించి ఊరేగింపు చేయాలని విన్నవించారు. ఉత్సవమూర్తులను స్వర్ణాలంకారణతో దర్శించే భాగ్యం భక్తులకు కల్పించాలని కోరారు. ఈసారైనా ఆ అదృష్టం లభిస్తుందో.. లేదో? వేచిచూడాల్సి ఉంది. ’ అదిభిక్షువు వాడినేమి కోరేది... బూడిదిచ్చేవాడినేమి అడిగేది...అంటూ ఒక సినీ కవి పరమశివుడ్ని భిక్షువుతో పోల్చాడు. అయితే శ్రీకాళహస్తీశ్వరుడు ఆది నుంచి భిక్షువు కాదు. రాజులు, జమీందారులు ఆయనకు అపురూపమైన దివ్యాభరణాలను కానుకగా ఇచ్చారు. విజయనగరాధీశుడు శ్రీకృష్ణదేవరాయలు కూడా వాయులింగేశ్వరునికి ఆభరణాలు కానుకగా ఇచ్చారు. శ్రీకాళహస్తి రాజు సుమారు 14వేల ఎకరాల కైలాసగిరులను ఇచ్చారు. అయితే ఆనాటి ఆభరణాలు ఇప్పటికీ చెక్కచెదరకుండా ఉన్నాయి. దేవస్థానం చేయించిన వజ్రకిరీటంతో పాటు కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్థనరెడ్డి కుటుంబీకులు స్వామి, అమ్మవార్లకు ఇచ్చిన ఆభరణాలు కూడా ఉన్నాయి. టీటీడీకి తప్ప జిల్లాలోని మిగిలిన ఏ ఆలయాలకు ఈ స్థాయిలో ఆభరణాలు లేవు. అయినా భక్తులు వాటిని దర్శించే భాగ్యం కలగడంలేదు. అభరణాలు వాడకంపై నిర్ణయం తీసుకోలేదు... బ్రహ్మోత్సవాల్లో ఉత్సవమూర్తులకు ఆలయ బంగారు ఆభరణాలు అలంకరిండంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. గతంలో భద్రతా ఇబ్బందులతో అలంకరించలేదని తెలుస్తోంది. పలువురు పుర పెద్దలు బంగారు నగలు ఉత్సవాల్లో వినియోగించాలని సూచించిన మాట వాస్తవమే. భద్రతాధికారులతో మరోసారి బంగారు అభరణాలపై చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటాం. -రామిరెడ్డ్డి,ఆలయ ఈవో -
నగల వేలంపై బ్యాంకు మేనేజర్ నిలదీత
గుంటూరు: గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం వరగాని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖ కార్యాలయంలో బుధవారం సాయంత్రం గొడవ జరిగింది. బ్యాంకు అధికారులు తాకట్టు పెట్టిన నగలను తమకు సమాచారం ఇవ్వకుండా వేలం వేశారంటూ ఖాతాదారులు బుధవారం సాయంత్రం బ్యాంకు వద్ద ఆందోళన చేశారు. దీనిపై మేనేజర్తో వాగ్వాదానికి దిగారు. అతనిని బయటకు లాక్కొచ్చారు. సమాచారం తెలిసిన పోలీసులు రంగ ప్రవేశం చేసి..రెండు వర్గాల వారిని పోలీస్స్టేషన్కు పిలిపించారు. లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయాలని కోరారు. -
నకిలీ ఖాకీల నేరాలు
నెల్లూరు(క్రైమ్) : జిల్లాలో దొంగ ఎవరో..దొర ఎవరో తెలియని పరిస్థితి నెలకొంది. ఎవరిని నమ్మాలో..ఎవరిని నమ్మకూడదో అంతుపట్టని పరిస్థితి. స్థానింగా ఉన్న దొంగలతో పాటు పొరుగు జిల్లాలు, రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఇక్కడే తిష్టవేశారు. ఎప్పటికప్పుడు తమ పంథాను మార్చుకుంటూ పక్కా ప్రణాళికలతో జనాన్ని దోచుకుంటున్నారు. పోలీసుల అవతారం ఎత్తి దొరికినంత దోచుకెళుతున్నారు. ఒక్కోసారి జాగ్రత్తలు చెబుతూ.. మరోసారి బెదిరిస్తూ తమ దందా కొనసాగిస్తున్నారు. ఎత్తుగా, ధృడంగా ఉండే వ్యక్తులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిర్మానుష్య ప్రదేశాల్లో మాటేస్తున్నారు. ఒంటరిగా వెళ్లే మహిళలే వీరి టార్గెట్. స్పెషల్ వింగ్ పోలీసులమని వారితో మాటలు కలుపుతారు. వీధుల్లో తిరిగేటప్పుడు ఆభరణాలు ధరించ వద్దని సలహాలు ఇస్తారు. ఇంతలో ఆ ముఠాకే చెందిన వ్యక్తి బంగారు గొలుసు ధరించి అటుగా వెళుతున్నట్లు నటిస్తాడు. అతడిని ఆపి అదే సలహా ఇవ్వడంతో పాటు బంగారు గొలుసును తీసి ఓ ప్యాకెట్లో మూట కట్టి తిరిగి అప్పగిస్తారు. మీరు కూడా ఇవ్వండంటూ మహిళలకు సూచిస్తారు. ఇదంతా నిజమేనని నమ్మిన అమాయకులు తమ ఒంటిపై నగలు వారికి అప్పగిస్తున్నారు. క్షణాల్లోనే వారిని మాయచేసి బంగారుకు బదులు రాళ్లు, చిత్తుకాగితాలు మూట కట్టి తిరిగి ఇస్తారు. ఇంటికెళ్లి చూసుకున్నాక మోసపోయామని తెలుసుకుని లబోదిబోమంటున్నారు. ఇలాంటి సంఘటనలే ఈ ఏడాదిలో జిల్లాలో ఇప్పటి వరకు పదికి పైగా జరిగాయి. ఇప్పటికైనా పోలీసులు ఇలాంటి ముఠాలపై నిఘా ఉంచడం, ప్రజలను ఇలాంటి ముఠాల బారిన పడకుండా అప్రమత్తం చేసే చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఇటీవల చోటు చేసుకున్న ఘటనలు - జనవరిలో బాలాజీనగర్లోని వైకేఆచారీ స్కూల్ వద్ద కల్లూరుపల్లి హౌసింగ్బోర్డుకు చెందిన విశ్రాంత అధ్యాపకురాలి నుంచి 11 సవర్ల బంగారు నగలు అపహరించారు. - కనకమహల్ సెంటర్ సమీపంలో పాల వ్యాపారి ఎస్కే హుస్సేన్ను బెదిరించి రూ.20 వేల నగదు, సెల్ఫోన్ లాక్కెళ్లారు. - ఏప్రిల్లో రంగనాయకులపేటలోని ఓ ఆస్పత్రికి వెళుతున్న అల్లీపురానికి చెందిన నాగభూషణమ్మ నుంచి సుమారు నాలుగు సవర్ల బంగారు ఆభరణాలు దోచుకున్నారు. - గత నెల 14వ తేదీన తోటపల్లిగూడూ రు మండలం కోడూరు బీచ్లో ఇద్ద రు యువకులను విచారణ పేరుతో బెదిరించి రూ. 2 వేలు దోచేశారు. - ఇరవై రోజుల క్రితం నెల్లూరులోని కొండాయపాళెం గేటు ప్రాంతంలో రేషన్ దుకాణానికి వెళుతున్న వృద్ధురాలు వనమ్మను మోసం చేసి 5 సవ ర్ల ఆభరణాలు ఎత్తుకెళ్లారు. - గత మంగళవారం ఉదయం గంజాం రమణమ్మ (67) తన బంధువులు ఇంటికి నడుచుకుంటూ వెళుతుండగా రామ్మూర్తినగర్లోని వెంకటేశ్వరస్వామి దేవాలయం వద్ద ఇద్ద రు దుండగులు తాము పోలీసులమం టూ ఆమె వద్దనున్న 9 సవర్ల బంగారు ఆభరణాలు అపహరించుకుని వెళ్లారు. - అదే రోజు కావలిలోనూ ఓ మహిళను మోసం చేసి నగలు ఎత్తుకెళ్లారు.