pacific ocean
-
ట్రంప్ మాస్ వార్నింగ్.. దెబ్బకు దిగివచ్చిన పనామా!
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జెట్ స్పీడ్లో దూసుకెళ్తున్నారు. పనామా కెనాల్ విషయంలో ట్రంప్ కొంత మేరకు తన పంతం నెగ్గించుకున్నారు. తమ యుద్ధ నౌకలు పనామా కెనాల్ నుంచి ప్రయాణించినప్పుడు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేకుండా ఆ దేశం అంగీకరించిందని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సె వెల్లడించారు. తాజాగా కుదిరిన ఒప్పందం ప్రకారం.. నిర్ణయం తీసుకున్నట్టు చెప్పుకొచ్చారు.వివరాల ప్రకారం.. గతంలో ట్రంప్ పనామా కాలువను కొనుగోలు చేయాలని కలలు కన్నారు. కానీ అది తీరకముందే పదవిని కోల్పోయారు. ఇక, రెండోసారి పదవీ బాధ్యతలు చేపట్టిన ఆయన.. ఈసారి కచ్చితంగా పనామా కాలువను కొనాలని చూస్తున్నారు. పనామా కాల్వను తిరిగి స్వాధీనం చేసుకొంటామని హెచ్చరికలు జారీ చేశారు. ఇందుకోసం సైనిక శక్తిని కూడా వాడే అవకాశం ఉందని ఆయన సంకేతాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో పనామా కాస్త వెనక్కి తగ్గి మరి అమెరికా యుద్ధ నౌకలు పనామా కాలువపై నుంచి ప్రయాణిస్తే ఎలాంటి ఫీజును తీసుకోమని చెప్పింది. ఈ మేరకు అమెరికా రక్షణ మంత్రి హెగ్సే, పనామా పబ్లిక్ సెక్యూరిటీ మంత్రి ఫ్రాంక్ అలెక్స్కు మధ్య ఒప్పందం కుదిరింది.ఈ ఒప్పందం విషయాన్ని అమెరికా విదేశాంగశాఖ కూడా ధ్రువీకరించింది. ఈ క్రమంలో ట్విట్టర్ వేదికగా.. అమెరికా ప్రభుత్వ నౌకలు ఇప్పుడు పనామా కెనాల్ నుంచి ఎటువంటి ఛార్జీలు లేకుండా ప్రయాణించవచ్చు అని పేర్కొంది. దీని వల్ల అమెరికా ప్రభుత్వ నౌకలకు పెద్ద మొత్తంలో డబ్బులు మిగులుతాయని చెప్పుకొచ్చారు. వాస్తవానికి కొన్నాళ్ల క్రితమే పనామా అమెరికాకు కొన్ని రాయితీలు ఇవ్వాలని నిర్ణయించుకొంది. ఈ విషయాన్ని ఆదివారమే విదేశాంగ మంత్రి రూబియో సూచాయగా వెల్లడించారు. ఇక, అమెరికాకు చెందిన 40 శాతం కంటైనర్లు పనామా నుంచి ప్రయాణిస్తాయి.ఇదిలా ఉండగా.. అట్లాంటిక్-పసిఫిక్ సముద్రాలను కలుపుతూ అమెరికా భారీ వ్యయప్రయాసలతో పనామా కాల్వను 1914లో నిర్మించింది. దీనిని తొలుత అమెరికానే నిర్వహించింది. కానీ, పనామా దేశంలో దీనిపై తీవ్ర అసంతృప్తితో ఘర్షణలు చెలరేగడంతో.. 1977లో నాటి అమెరికా అధ్యక్షుడు జిమ్మీకార్టర్ కీలక నిర్ణయం తీసుకొన్నారు. ఈ కాల్వను ఆ దేశానికి అప్పజెబుతూ ఒప్పందం చేసుకొన్నారు. ఈ కాల్వ తటస్థంగా ఉండి తీరాలని అమెరికా షరతు విధించింది. ఇక్కడ ఎటువంటి ముప్పు వచ్చినా అమెరికాకు దానిని రక్షించుకొనే హక్కు ఉంటుందని పేర్కొంది. ఆ తర్వాత పనామా ప్రభుత్వం కూడా ఈ కాల్వ అభివృద్ధికి భారీ మొత్తంలోనే ఖర్చు చేసింది. -
ట్రంప్ పనామా జపం వెనక..
పనామా కాలువ. వందేళ్ల క్రితం నిర్మించిన ఇంజనీరింగ్ అద్బుతం. చిన్నపాటి భూభాగం కారణంగా కలవకుండా ఉండిపోయిన అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రాలను వందల కోట్లు వెచ్చించి అక్కడి వారి కలను సాకారం చేసింది అగ్రరాజ్యం. పాతికేళ్ల తర్వాత దానిపై అజమాయిషీ కోసం పట్టుబడుతుండటం విచిత్రం. ఆ కాల్వపై అజమాయిషిని నాటి అమెరికా అధ్యక్షుడు స్థానిక దేశానికి ధారాదత్తం చేస్తే కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం అదేమీ చెల్లవంటూ కొత్త రాగం ఆలపిస్తున్నారు. ట్రంప్ బెదిరింపులకు బెదిరేదిలేదని పనామా ప్రభుత్వం చెబుతుండటంతో ఏమౌతుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. అవసరమైతే సైనిక శక్తితో బెదిరించో, బలవంతపు దౌత్యంతోనో మాట నెగ్గించుకోవడం దశాబ్దాలుగా అమెరికాకు అలవాటు. రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టి వారమైనా తిరక్కుండానే ఏకంగా వందకు పైగా కార్యనిర్వాహక ఉత్తర్వులిచ్చిన తెంపరి ట్రంప్ పనామాపై ఎలాంటి దూకుడు నిర్ణయాలు తీసుకుంటారోనని ప్రపంచ దేశాలన్నీ ఉత్కంఠగా వేచిచూస్తున్నాయి... భారీ రాకపోకలు, అనూహ్య రాబడి అమెరికా నౌకలు ఆసియా ఖండానికి వెళ్లాలంటే గతంలో దక్షిణ అమెరికా ఖండం చుట్టూతా వేల మైళ్లు సముద్రయానం చేయాల్సి వచ్చేది. ప్రయాణఖర్చలు విపరీతంగా ఉండేవి. వీటిని చాలా వరకు తగ్గించేందుకు, ప్రత్నామ్నాయ సముద్రమార్గంగా పనామా కాలువను తెరమీదకు తెచ్చారు. అనుకున్నదే తడవుగా వందల కోట్లు ఖర్చుపెట్టి కాలువను తవ్వి 1914 ఆగస్ట్ 15న కాలువను వినియోగంలోకి తెచ్చారు. కొత్తలో ఈ మార్గం గుండా రోజుకు మూడు నాలుగు నౌకలే రాకపోకలు సాగించేవి. అయితే అత్యంత దగ్గరి దారికావడంతో రానురాను దీని గుండా అంతర్జాతీయ సరకు రవాణా నౌకల రాకపోకలు విపరీతంగా పెరిగాయి. ఇప్పుడు ఏటా లక్షలాది నౌకలు వెళ్తున్నాయి. దీంతో కాల్వపై యాజమాన్య హక్కులున్న పనామా దేశానికి ఏటా నికర లాభం ఏకంగా రూ.43,000 కోట్లకు పెరిగిందని ఒక అంచనా. ఏటా ఇంతటి లాభాల పంట పండించే బంగారు కోడిని నాటి అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ అప్పనంగా పనామాకు అప్పజెప్పారని నేటి అధ్యక్షుడు ట్రంప్ తెగ బాధపడిపోతున్నారు. పనామా దేశ వార్షిక ఆదాయంలో 23.6 శాతం ఒక్క ఈ కాలువ నుంచే వస్తుండటం గమనార్హం. పనామా వాదనేంటి? నాటి కాలువకు నేటి కాలువకు ఎంతో తేడా ఉంది. బాధ్యతలు తమ చేతుల్లోకి వచ్చాక పనామా దేశం ఈ కాలువను మరింతగా తవ్వి పెద్దగా విస్తరించింది. ఏకంగా 5 బిలియన్ డాలర్లు ఖర్చుపెట్టింది. సామర్థ్యాన్ని రెట్టింపు చేసింది. దీంతో 2016 ఏడాది తర్వాత భారీ నౌకలు సైతం సులభంగా వెళ్లడం మొదలవడంతో యాజమాన్యం అధిక లాభాలను కళ్లజూస్తోంది. ‘‘ మేం సొంతంగా ఎంతో ఖర్చుపెట్టాం. గతంలో పోలిస్తే ఆదాయం 55 శాతం పెరగడానికి గతంలో మేం పెట్టిన పెట్టుబడులే కారణం’’ అని కాలువ మాజీ అడ్మిని్రస్టేటర్ జార్జ్ లూయిస్ క్విజానో తేల్చి చెప్పారు. ‘‘ కాలువ మా దేశంలో, దేశభక్తిలో అంతర్భాగం. దీనిపై యాజమాన్య హక్కులు మాకే దక్కుతాయి’’ అని పనామా దేశస్తులు తెగేసి చెబుతున్నారు. అధ్యక్ష ఎన్నికలప్పుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో ఆగ్రహించిన స్థానికులు పనామా సిటీలోని అమెరికా రాయబార కార్యాలయం వద్ద పెద్ద ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో అమెరికా ఈ కాలువను దక్కించుకోవాలంటే పెద్ద ఘర్షణ చెలరేగి అది అంతర్జాతీయ నౌకాయానంపైనా పెను ప్రభావం పడే ప్రమా దముంది. అమెరికా నౌకలపై అధిక చార్జీలు ఈ కాలువను వాణిజ్య అవసరాలకు అత్యధికంగా వాడుతున్న దేశాల్లో అమెరికా అగ్రస్థానంలో ఉంది. తర్వాత చైనా, చిలీ, జపాన్, దక్షిణకొరియాలు అతిగా వాడుతున్నట్లు తెలుస్తోంది. అమెరికా సరకు రవాణా నౌకలతోపాటు చాలా ప్రపంచదేశాలపై నిఘా కోసం, తమ మిత్రదేశాల్లో తమ స్థావరాలకు సైన్యాన్ని తరలించేందుకు యుద్ధనౌకలనూ ఇదే మార్గం గుండా పంపుతోంది. వినియోగం ఎక్కువగా ఉండటంతో అమెరికాకు రాకపోకలు చార్జీలు ఎక్కువ అవుతున్నాయి. అయితే మాపైనే అధిక చార్జీలు మోపుతున్నారని ట్రంప్ వాదిస్తున్నారు. అయితే తన వాదనలకు బలం చేకూర్చే ఆధారాలను ఆయన బయటపెట్టలేదు. పైగా చైనా రహస్యంగా ఈ కాలువ నిర్వాహణ యాజమాన్య హక్కులు పొందిందని ట్రంప్ ప్రధాన ఆరోపణ. కాలువను పనామా దేశం శాశ్వతంగా సొంతంగా మాత్రమే నిర్వహించుకోవాలన్న ‘ టోరిజోస్–కార్టర్’ ఒడంబడికను పనామా కాలదన్నిందని, తటస్థ వైఖరికి తిలోదకాలు ఇచ్చిందని అమెరికా ఆరోపిస్తోంది. కష్టపడి తవ్విన తమకే అధిక చార్జీల వాత పెడుతూ, శత్రుదేశం చైనాకు నిర్వహణ హక్కులు కట్టబెట్టారని ట్రంప్ ఆగ్రహంగా ఉన్నారు. అందుకే ఎలాగైనా సరే పనామా కాలువపై యాజమాన్య హక్కులను తిరిగి సంపాదిస్తామని ప్రమాణస్వీకారం రోజే ట్రంప్ ప్రకటించారు. 13 ఏళ్ల పాటు సుదీర్ఘ చర్చల తర్వాత 1977లో నాటి అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్, పనామా పాలకుడు ఒమర్ టోరిజోస్కు పనామాకాలువ బాధ్యతలు అప్పగించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కిరిబాటి.. కొత్త సంవత్సరం వచ్చేసిందోచ్!
Happy New Year 2025: పాత ఒక రోత.. కొత్త ఒక వింత అంటే బాగోదేమో.. కానీ పాత జ్ఞాపకాలని మదిలో దాచుకుంటూ కొత్త ఆశల్ని భుజానకెత్తుకోవడం అంటే సరిగ్గా సరిపోతుంది కదా. మరికొన్ని గంటల్లో యావత్ ప్రపంచం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోవడానికి సిద్ధమవుతోంది. ఒక్కో దేశం ఒక్కో విధంగా కొత్త ఏడాదిలోకి ప్రవేశించబోతోంది.అయితే ఇప్పటికే పలు దేశాల్లో కొత్త ఏడాది ఉదయించింది’. ప్రపంచంలో అన్నింటికి కంటే ముందు సూర్యుడు ఉదయించే దేశాల్లో పసిఫిక్ మహాసముద్ర తీర ప్రాంత దేశాలు ముందు వరుసలో ఉంటాయి. అందులో కిరిబాటి అనే ద్వీప దేశం ఒకటి. సూర్యుడి చుట్టూ భూమి పరిభ్రమించే క్రమంలో ఆ భానుడి లేలేత కిరణాలు కిరిబాటి అనే చిన్న దేశం మీద ముందుగా పడతాయి. అంటే ఈ దేశమే ముందు నిద్ర లేస్తుంది అన్నమాట. ఇదొక ద్వీప దేశం. దీని జనాభా చాలా తక్కువ.ఇక్కడ జనాభా 1.34 లక్షలు అని ఒక అంచనా. మన లెక్కన ఒక అసెంబ్లీ నియోజవర్గం ఓటర్ల సంఖ్య కంటే చిన్న దేశం ఇది. భారత్లో డిసెంబర్ 31(3.30 PM) సూర్యుడు అస్తమించే సమయంలో అక్కడ జనవరి 1వ తేదీ వచ్చేస్తుంది. భారత్కు కిరిబాటికి ఇంచుమించు 8.30 గంటల సమయం వ్యత్యాసం ఉంది.🎆✨ Happy New Year 2025! ✨🎆The first to welcome 2025: 🎉Christmas Island, Kiribati: 5 AM EST (3:30 PM IST)Chatham Islands, NZ: 5:15 AM EST (3:45 PM IST)Auckland & Wellington, NZ: 6 AM EST (4:30 PM IST)The countdown begins! 🌍#HappyNewYear #HappyNewYear2025 pic.twitter.com/RRqFy7PgT8— Shahadat Hossain (@shsajib) December 31, 2024 భూమిపై ప్రకృతి సౌందర్యం, ప్రజలు తక్కువగా ఉన్న ప్రదేశాల్లో ఇది ఒకటి. ప్రపంచంలోని అత్యుత్తమ ప్రదేశాల టాప్-10 జాబితాలో కూడా ఈ ద్వీప దేశానికి చోటు ఉండటం విశేషం. ఇది పసిఫిక్ మహాసముద్రం మధ్యలో, న్యూజిలాండ్కు ఉత్తరాన ఉంది. భారత్లో ( 12 am అయిన సందర్భంలో)కొత్త ఏడాది ప్రారంభం కావడానికంటే ముందే నూతన సంవత్సరం జరుపుకునే పలు దేశాల జాబితా వరుస క్రమంలో..కిరిబాటి(8.30 am on Jan 1)సమోవా, టోంగా((7.30 am on Jan 1)న్యూజిలాండ్((7.30 am on January 1)రష్యా, ఫిజి((6.30 am on January 1)ఆస్ట్రేలియా((5.30 am on January 1)పాపువా న్యూగినియా((4.30 am on January 1)ఇండోనేషియా, జపాన్, దక్షిణ కొరియా, ఉత్తర కొరియా( 1.30 am on January 1)చైనా, మలేషియా, సింగపూర్(2.30 am on January 1)వియాత్నాం, థాయ్లాండ్( 1.30 am on January 1)మయన్మార్(1 am on January 1)బంగ్లాదేశ్, కజికిస్తాన్, భూటాన్( 12.30 am on January 1)నేపాల్(12.15 am on January 1) -
పసిఫిక్ మహాసముద్రంలో చీకటి జీవి
భూగోళంపై ఎన్ని రకాల జీవులున్నాయో లెక్కేలేదు. ఎన్నో రకాల జీవులు ఇప్పటికే అంతరించిపోయినట్లు సైంటిస్టులు చెబుతున్నారు. మరోవైపు కొత్తరకం జీవుల ఉనికి బయటపడుతూనే ఉంది. దక్షిణ అమెరికా ఖండంలోని పెరూ, చిలీ దేశాల సముద్ర తీరంలో ఒక జీవిని గుర్తించారు. తూర్పు పసిఫిక్ మహాసముద్రంలో భాగమైన అటకామా ట్రెంచ్ అట్టడుగున ఈ ప్రాణి నివసిస్తున్నట్లు కనిపెట్టారు. యాంఫీపాడ్ పాడ్ వర్గానికి చెందిన ఈ జీవికి డుల్సిబెల్లా కమాంచక అని పేరుపెట్టారు. కమాంచక అంటే స్థానిక భాషలో చీకటి అని అర్థం. ఈ చీకటి జీవి మాంసాహారి. ఇతర జీవులే దీని ఆహారం. ఇవి ఇక్కడ పెద్దగా కనిపించలేదు కాబట్టి అంతరించేపోతున్న జీవుల జాబితాలో చేర్చారు. ఇంటిగ్రేటెడ్ డీప్–ఓషియన్ అబ్జర్వింగ్ సిస్టమ్(ఐడీఓఓఎస్)లో భాగంగా గత ఏడాది సముద్రం అడుగు భాగంలో శోధించారు. ఉపరితలం నుంచి 7,902 మీటర్ల లోతులో కొత్త రకం జీవి ఉన్నట్లు బయటపడింది. అంటే దాదాపు 8 కిలోమీటర్ల లోతున ఇది సంచరిస్తుండడం గమనార్హం. వాస్తవానికి అక్కడ అత్యధిక నీటి ఒత్తిడి ఉంటుంది. జలాంతర్గాములు సైతం అంత లోతుకి చేరుకోవడం కష్టం. మానవుడు ఇప్పటికీ చూడని సముద్రాల అడుగు భాగంలో జీవ వైవిధ్యానికి కొదవ లేదు. మనకు తెలియని ఎన్నో ప్రాణులు అక్కడ ఉన్నాయని సైంటిస్టులు చెబుతున్నారు. అటకామా ట్రెంచ్ అనేది భూమిపై అత్యంత లోతైన సముద్ర ప్రాంతం. ఇక్కడ సముద్రం లోతు 6,000 మీటర్ల నుంచి 11,000 మీటర్ల దాకా ఉంటుంది. ఎన్నో విశిష్టమైన జీవులకు అటకామా ట్రెంచ్ నెలవుగా మారింది. అరుదైన యాంఫీపాడ్స్, స్నెయిల్ ఫిష్, మడ్ డ్రాగన్స్ ఇక్కడ కనిపిస్తాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ప్రపంచంలో అతిపెద్ద పగడం
ఏకంగా 100 అడుగులకు పైగా పొడవైన పగడాన్ని(కోరల్)ను నైరుతి పసిఫిక్ మహాసముద్రంలో సైంటిస్టులు గుర్తించారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పగడం అని చెబుతున్నారు. 300 ఏళ్ల క్రితం ఏర్పడిన ఈ పగడం అంతరిక్షం నుంచి కూడా కనిపిస్తుందని అంటున్నారు. నేషనల్ జియోగ్రాఫిక్ ప్రిస్టీన్ సీస్ ప్రోగ్రామ్లో భాగంగా గత నెలలో సోలోమాన్ దీవుల్లో సముద్ర స్థితిగతులను అధ్యయనం చేయడానికి బయలుదేరిన సైంటిస్టులకు ఈ పగడం కనిపించింది. గతంలో అమెరికాలో సమోవాలో గుర్తించిన భారీ పగడం కంటే ఇది మూడు రెట్లు పెద్దది కావడం విశేషం. అంతేకాదు భూమిపై అతిపెద్ద జంతువైన బ్లూవేల్ కంటే కూడా పొడవైనది. సాధారణంగా సముద్రాల అంతర్భాల్లో పగడపు దిబ్బలు ఏర్పడతాయి. ఈ దిబ్బల్లో చిన్నచిన్న పగడాలు కనిపిస్తాయి. కానీ, నైరుతి పసిఫిక్ మహాసముద్రంలో తాజాగా గుర్తించి పగడం సింగిల్ కోరల్ కావడం గమనార్హం. కొన్ని శతాబ్దాలుగా దీని పరిమాణం పెరుగుతున్నట్లు గుర్తించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఖండాంతర క్షిపణిని పరీక్షించిన చైనా
బీజింగ్: అమెరికాలోని నగరాలను తాకేంతగా సుదూరాలకు వెళ్లగల సామర్థ్యమున్న ఖండాంతర క్షిపణి(ఐసీబీఎం)ను చైనా విజయవంతంగా పరీక్షించింది. వ్యూహాత్మక రక్షణ సామర్థ్యాలను ప్రపంచానికి చాటే ఉద్దేశంతోనే చైనా ఈ పరీక్ష జరిపిందని అంతర్జాతీయ రక్షణరంగ నిపుణులు చెబుతున్నారు. పసిఫిక్ మహాసముద్ర జలాల్లో బుధవారం ఉదయం 8.44 గంటలకు జరిపిన ఈ పరీక్ష తమ ఆయుధ పనితీరు, సైన్యం శిక్షణా సామర్థ్యాలను ప్రదర్శించి నిర్దేశిత లక్ష్యాన్ని చేధించిందని చైనా రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. పొరుగు దేశాలు ఆందోళన చెందకుండా ముందే రాకెట్ ప్రయోగించే దిశ, గమ్యం తదితర వివరాలను వారితో చైనా పంచుకుంది. దశాబ్దాల కాలంలో చైనా బహిరంగంగా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించడం ఇదే తొలిసారని చైనా అధికారిక ‘చైనా డైలీ’ వార్తాసంస్థ పేర్కొంది. ఈ క్షిపణి ఎంత దూరం వెళ్తుందో చైనా చెప్పలేదు. ఇది పలు అమెరికా నగరాలనూ తాకగలదని హాంకాంగ్ కేంద్రంగా నడిచే సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పేర్కొంది. -
Ghost Shark: కొత్త దెయ్యం షార్క్ దొరికింది
విల్లింగ్టన్: పసిఫిక్ మహాసముద్రంలో అత్యంత లోతుల్లో సంచరించే కొత్త రకం చేపను న్యూజిలాండ్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ చేప కళ్లు చాలా నల్లగా ఉండటంతోపాటు చిమ్మచీకటిమయమైన సముద్రం లోతుల్లో సంచరిస్తుండటంతో దీనిని ‘ఘోస్ట్ షార్క్’గా పేర్కొంటున్నారు. ఘోస్ట్ షార్క్లను స్పూక్ షిఫ్ లేదా చిమేరా అని కూడా అంటారు. వీటిలో ముళ్లులు, పొలుసులు ఉండవు. శరీరం మొత్తం మెత్తగా మృదులాస్థితోనే తయారై ఉంటుంది. న్యూజిలాండ్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వాటర్ అండ్ అటా్మస్ఫిరికల్ రీసెర్చ్ బృందం ఈ చేప జాతిని కనుగొంది. న్యూజిలాండ్కు తూర్పున ఉన్న ఛాథమ్ రైస్ అనే సముద్రజలాల ప్రాంతంలో ఈ చేపలు జీవిస్తున్నాయి. ఉపరితలం నుంచి దాదాపు 2,600 మీటర్లలోతు మాత్రమే సంచరిస్తుంటాయి. మొత్తం పొడవులో సగం ఉండే పొడవాటి ముక్కు లాంటి నోరు వీటి ప్రత్యేకత. ‘‘లాటిన్లో అవియా అంటే బామ్మ. అందుకే దీనిని హరియోటా అవియా అని పేరు పెట్టాం. అంతరించి పోతున్న జాతుల జాబితాలో చేర్చే విషయమై ఆలోచిస్తున్నట్టు నిపుణులు తెలిపారు. -
ఇదేం వింత చట్టం! భార్య పుట్టినరోజు మర్చిపోవడమే నేరమా..!
పుట్టినరోజు అనేది ప్రతి ఒక్కరికి ఎంతో ఇష్టమైన రోజు. ఎంతలా అంటే వాళ్ళకి ఉన్నంతలో బాగా జరుపుకోవాలి అనుకుంటారు. అయితే భార్యలకు బయటవాళ్ళు ఇచ్చే కాంప్లిమెంట్ కంటే మనసుకి నచ్చిన వాళ్ళు ఇచ్చే కామెంట్ ఎక్కువ సంతోషాన్ని ఇస్తుంది. తాను పుట్టినరోజుని తన భర్త గుర్తుపెట్టుకుని విష్ చేస్తే వచ్చే ఆనందమే వేరు. ఎవరు ఎన్ని ఖరీదైన బహుమతులు ఇచ్చిన భర్త ఇచ్చే బహుమతి కోసం ఎదురు చూస్తుంటుంది. భార్య ఎప్పుడు భర్త ఇచ్చే బహుమతిలో ఖరీదు చూడదు. అందులోని ప్రేమనే చూస్తుంది. అయితే భార్యలకి ఉన్న అదృష్టం ప్రతేకత ఉన్న రోజులని గుర్తు పెట్టుకోవడం. అందుకే భార్యలు భర్త పుట్టినరోజుని, పిల్లల పుట్టిన రోజుని, పెళ్లి రోజుని, అనుకుంటే ఇరుగు పొరుగు వాళ్ళ పుట్టినరోజులు కూడా గుర్తుపెట్టుకోగలదు. కానీ భర్త తన భార్య పుట్టిన రోజుని గుర్తు పెట్టుకోవాలి అనుకున్నా.. పని హడావిడిలో మరిచిపోతుంటాడు.ఇలా భార్య పుటిన రోజుని మర్చిపోతే జైలు శిక్ష పడుతుంది అని మీకు తెలుసా..? అది కూడా ఏకంగా ఐదేళ్లు. అవును ఇది నిజం. పసిఫిక్ మహాసముద్రంలోని పాలినేషియన్ ప్రాంతంలో సమోవా అనే అందమైన ద్వీపం ఉంది. ఇక్కడ ఎవరైన పెళ్ళైన వ్యక్తి తన భార్య పుట్టిన రోజుని పొరపాటున మర్చిపోతే జైలు శిక్ష పడుతుంది. తన భర్త తన పుట్టిన రోజుని మర్చిపోయారని భార్య గనుక ఫిర్యాదు చేస్తే.. తప్పనిసరిగా శిక్ష పడుతుంది. ఇక్కడ భార్య పుట్టిన రోజును మరిచిపోతే మాత్రం.. తప్పకుడా అది నేరం కింద లెక్క.ఇక్కడి రూల్ ప్రకారం.. అనుకుని మరిచిపోయాడా.. లేదంటే.. అనుకోకుండా మరిచిపోయాడా అనేది చూడరు. మరిచిపోయాడు అంతే.. దీనితో న్యాయపరమైన చిక్కుల్లో పడతాడు భర్త. అయితే ఈ చట్టంలో కాస్త వెసులుబాటు ఉంది. మెుదటిసారి భార్య పుట్టినరోజును మరిచిపోతే.. కాస్త చూసి చూడనట్టుగా వ్యవహరిస్తారు. మరోసారి అలా చేయోద్దని.. పోలీసులు హెచ్చరిస్తారు. మళ్లీ అదే రిపీట్ చేశారనుకో.. తప్పు అవుతుంది. జైలు రూపంలో శిక్ష పడుతుంది. మన దేశంలో ఇలాంటి చట్టాలు అమలులో ఉంటే.. చాలా మంది భర్తలు జైలుకే వెళ్తారేమో.(చదవండి: పచ్చి జామకాయ కంటే కాల్చిందే బెటర్! ఎన్ని ప్రయోజనాలంటే..!) -
కాలచక్ర భ్రమణంలో మార్పులెన్నో!
చాలామంది వచ్చే సంవత్సరం బతుకు ఎలా సాగుతుందని తెలుసుకోవాలి అనుకుంటారు. మరికొందరికి వచ్చే వారంలో విశేషాలు తెలియాలని ఆత్రం. రానున్న తరాల తీరు, మనుషుల బతుకు గురించి తెలుసుకోవాలనే వారు కూడా ఉన్నారు. నిజంగా తెలివి తెలిసిన తర్వాత కూడా వేల ఏళ్లు గడిచాయి. ఈ మధ్యన జరిగిన ఒక పరిశోధన ప్రకారం మన దేశంలో 54 వేల సంవత్సరాల కాలం నుంచి మనుషులు ఉన్నట్టు ఆధారాలు కనిపించాయి. ఇప్పటికి పదివేల సంవత్సరాల మునుపు వ్యవసాయం మొదలైంది. అప్పటి వరకు మనిషి ప్రకృతి మీద ఆధారపడి మాత్రమే బతికాడని అర్థం. వ్యవసాయం వచ్చిన తర్వాతే నగరాలు పుట్టుకొచ్చాయి. నగరాలు వచ్చాయి అంటే నాగరికత వచ్చిందని అర్థం. ఇప్పుడేమో ఏకంగా 21వ శతాబ్దిలోకి వచ్చేశాము మనము! ఉత్త రోజులు వస్తాయి అని అందరూ ఎదురుచూచిన కాలం ఇదేనేమో? కొంతకాలం పోతే నీళ్లు ఉండవు, తిండి ఉండదు, చివరకు గాలి కూడా ఉండదు, అంతా సర్వనా శనం అవుతుంది లాంటి మాటలు తరచుగా వినబడుతున్నాయి. అది నిజమేనేమో? ఇప్పటికే కొన్ని చోట్లలో మంచినీళ్లు దొరకక పెట్రోల్ కొన్నట్టు లీటర్ల ప్రకారం నీళ్లు కొంటున్నారట! అయినప్పటికీ మనిషి జాతి మరో లక్ష సంవత్సరాలు మనగలగడం మాత్రం గ్యారెంటీ అంటున్నారు మరికొందరు! అటువంటి పరిస్థితులలో మనిషి మనుగడ ఏ రకంగా ఉంటుంది? యువాల్ నోవా హరారి లాంటివారు రానున్న కాలంలో బ్రతుకులను గురించి తమ ఊహలను బయట పెట్టి సంచలనం సృష్టించారు. మనకు గతం గురించి తెలుసు కనుక, ఆ విషయాలు, వివరాల ఆధారంగా భవిష్యత్తును కూడా ఊహించడానికి వీలవుతున్నది. మనుషులు ఇలాగే ఉంటారా? మునుముందు కూడా ఈ రకంగానే మాట్లాడతారా? ఎక్కడ బతుకుతారు?ప్రకృతి మనకోసం ఇలాగే మిగిలి కొనసాగుతుందా? మనిషి విశ్వం లోతులలోకి వెళ్ళగలుగుతాడా? మనకు కావ లసిన కనీసపు వనరులు మిగులుతాయా? దొరుకుతూనే ఉంటాయా? ఎన్నో ప్రశ్నలు! వాటికి జవాబులు కూడా! ఈ ప్రశ్నలన్నీ వెనకటి నుంచి అడుగుతున్నవే. సాహస యాత్రికులు ఈ రకం ప్రశ్నలు ప్రేరణతో ప్రపంచమంతా తిరిగి కొత్త ప్రాంతాలను కనుగొన్నారు. భూమి పొరలలోని ప్లేట్ల కదలిక, మరిన్ని మార్పుల కారణంగా కొత్త భూభాగాలు వెలుగులోకి వస్తాయి అంటున్నారు సైంటిస్టులు. హవాయి ప్రాంతంలో సముద్రంలోనే అగ్నిపర్వతాల పేలుళ్ల కారణంగా ఎన్నో దీవులు పుట్టాయి. అలాంటి దీవులు అక్కడక్కడ మరిన్ని పుట్టే వీలు కూడా ఉంది. అవి ప్రపంచమంతా సముద్రంలో ఎక్కడయినా పుట్టవచ్చు. హవాయి ప్రాంతంలో సముద్రంలో లోహియీ అనే అగ్ని పర్వతం మునిగి ఉంది. సముద్రమట్టంలో వచ్చే మార్పులను దృష్టిలో ఉంచుకుంటే అక్కడ ఒక కొత్త దీవి పుట్టడం తప్పదనిపిస్తుంది. అంటే బయటపడుతుంది. యూరప్, ఆఫ్రికా తీరాల వెంట కూడా కొత్త దీవులు పుడతాయి. ఈ రెండు ఖండాలు ఏటా రెండున్నర సెంటీమీటర్ల చొప్పున వాయవ్యం వైపు కదులుతున్నాయి. మరో కొన్ని మిలియన్ సంవత్సరాలలో జిబ్రాల్టర్ సంధి మూసుకుపోతుంది. అట్లాంటిక్ నీరు అందకుంటే మధ్యధరాసముద్రం ఎండి పోతుంది. ఆఫ్రికా ఖండం తోసుకువచ్చి కలిసే లోపల, దక్షిణ యూరప్ తీరాలలో కొత్త ప్రాంతాలు బయటపడతాయి. అవి జరగడానికి చాలా కాలం పడుతుంది. మానవ ఆవిర్భావం నుంచి జరిగిన మార్పులు మనకు ఫాస్ట్ ఫార్వ ర్డ్గా కనిపిస్తున్నాయి. రానున్న మార్పులను మనం స్లో మోషన్లో చూడాలి. అసలు మార్పుల గురించి మనకు ఆలోచన అంటూ ఉంటే, చూడడం వీలు కుదురుతుంది. శుభకృతు, శోభకృతు అని రెండు సంవత్సరాలు గడిచాయి. వాటిలో ఎంత శుభం జరిగింది, ఎంతటి శోభ కుది రింది అని అందరూ ఆలోచించుకోవాలి. ప్రమాది సంవ త్సరంలో ప్రమాదాలు మాత్రమే జరుగుతాయి అను కుంటే అంతకంటే అమాయకత్వం లేదు. ఇక ఈ ఉగాది నుంచి మొదలయ్యే సంవత్సరం పేరు క్రోధి అంటున్నారు. క్రోధం అంటే కోపం అని అర్థం. సంవత్సరాల పేర్లను బట్టి ఏమీ జరగదు. ప్రపంచం మొదటి నుంచి ఒకే రకంగా ముందుకు సాగుతున్నది. ఇప్పుడు కూడా అదేరకంగా సాగు తుంది. క్రోధి అని పేరుగల సంవత్సరంలో కూడా ఎప్పటి లాగే మంచి చెడులు కలగలుపుగా ఉంటాయని అనుకుంటే ఇక సమస్య ఉండదు. డా‘‘ కె.బి. గోపాలం వ్యాసకర్త సైన్స్ అంశాల రచయిత -
ఇండోనేషియాను వణికిస్తున్న వరుస భూ ప్రకంపనలు
శక్తివంతమైన భూ ప్రకంపనలతో ఇండోనేషియా ఉలిక్కిపడుతోంది. తాజాగా.. రిక్టర్ స్కేల్పై దాదాపు 6.9 తీవ్రతతో ప్రకంపనలు నమోదు అయ్యాయి. మరిన్ని ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు వణికిపోతున్నారు. ది నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజి వెల్లడించిన వివరాల ప్రకారం.. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 10 గంటల సమయంలో బాందా సముద్ర ప్రాంతంలో శక్తివంతమైన ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై 6.9 తీవ్రత నమోదు అయ్యింది. అంబోన్కు 370 కిలోమీటర్ల దూరంలో.. 146 కిలోమీటర్ల లోతున భూకంపం సంభవించినట్లు తెలుస్తోంది. బాందా సముద్రంలో టానింబర్ దీవులకు దగ్గర్లో భూకంప కేంద్ర నమోదు అయ్యిందని ఇండోనేషియా వాతావరణ, భూభౌతిక విభాగం ప్రకటించింది. ఈ దీవి జనాభా లక్షా 27 వేలు. అయితే సునామీ హెచ్చరికలు జారీ చేయని ఇండోనేషియా వాతావరణ, భూభౌతిక విభాగం.. మరిన్ని ప్రకంపనలు సంభవిస్తాయని మాత్రం హెచ్చరించింది. ఏడాది వేల భూకంపాలు ఇండోనేషియా జనాభా 27 కోట్లను పైనే. ‘రింగ్ ఆఫ్ ఫైర్’గా పిలిచే అగ్నిపర్వతాల జోన్లో ఈ దేశం ఉంది. పసిఫిక్ మహాసముద్రాన్ని చుట్టుముట్టిన టెక్టోనిక్ ప్లేట్ల బెల్ట్గా పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ను చెబుతుంటారు. ఈ కారణంగానే అత్యంత భూకంప క్రియాశీల ప్రాంతాలలో ఒకటిగా ఇండోనేషియా ఉంది. అందుకే ఆ దేశాన్ని భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వత విస్ఫోటాలు వెంటాడుతూనే ఉన్నాయి. 2004లో 9.1 తీవ్రతతో ఏర్పడిన భూకంపంతో హిందూ మహాసముద్రంలో వచ్చిన సునామీ అనేక దేశాల్లో తీవ్ర విషాదం నింపింది. ఒక్క ఇండోనేషియాలోనే దాదాపు 2.3లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక.. గడిచిన 24 గంటల్లో ఇండోనేషియాలో మూడు భూకంపాలు సంభవించాయి. రిక్టర్ స్కేల్పై వరుసగా 7, 6.9, 5.1 తీవ్రతతో నమోదు అయ్యాయి. గత వారంగా 15సార్లు భూమి కంపించింది. నెల వ్యవధిలో 68 సార్లు భూమి కంపించగా.. ఏడాది కాలంగా 782సార్లు భూ ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేల్పై 1.5 తీవ్రతతో చిన్నపాటి ప్రకంపనల నుంచి శక్తివంతమైన ప్రకంపనలే వాటిల్లాయి ఇక్కడ. 2020లో ఇండోనేషియాలో 8,260సార్లు భూకంపాలు సంభవించాయి. కానీ, అంతకు ముందు ఏడాదిలో 11,500 సార్లు భూమి కంపించింది. -
ఏనుగు చెవులు లాంటి అరుదైన ఆక్టోపస్! విస్తుపోయిన శాస్త్రవేత్తలు
సముద్ర గర్భంలో లభించే ప్రతి ఒక్క జంతువు ఓ అద్భుతం అనే చెప్పాలి. ఇప్పటికీ ఏదో ఒక వింత వింత జలచరాలు కనిపిస్తూనే ఉంటాయి. సముద్ర గర్భంలో మనిషికి అంతుపట్టని ఎన్నో గమ్మత్తు విషయాలు చెబుతూనే ఉంటుంది. ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. అచ్చం అలాంటి అరుదైన ఘటనే పసిఫిక్ మహాసముద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..ఉత్తర పసిఫిక్ మహాసముద్రంలో అత్యంత అరుదైన డంబో ఆక్టోపస్ కనిపించింది.రిమోట్ పనిచేసే ఓషన్ ఎక్స్ప్లోరేషన్ ట్రస్ట్ వాహనంలో అమర్బడిన డీప్ సీ కెమెరా ఈ ఫోటోని తీసింది. ఈ అరుదైన ఆక్టోపస్ దాదాపు 7 వేల కిలోమీటర్ల లోతులో నివశిస్తుంది. వీటిని ప్రంపచంలోనే అందమైన ఆక్టోపస్లుగా పిలుస్తారట. ఈ ఆక్టోపస్లకి చెవులు "డంబో ది ఎలిఫెంట్" వలే ఉంటాయట. అంటే చెవులు వలె కనిపించే రెక్కలు ఏనుగు చెవుల మాదిరిగా పెద్దగా ఉండటంతో అలా పిలుస్తారు. ప్రత్యేకమైన చెవిలాంటి రెక్కలతో కదులుతుంది. అందుకు సంబంధించిన వీడియోని ఓషన్ ఎక్స్ ప్లోరేషన్ ట్రస్ట్ యూట్యూబ్లో పోస్ట్ చేసింది. ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది మీరు ఓ లుక్కేయండి. (చదవండి: 'అత్యంత స్వచ్ఛమైన గాలి' లభించేది ఇక్కడే..బాటిల్లో నింపి..) -
పనామా ట్రాఫిక్జామ్!
అంతర్జాతీయ వర్తకానికి అతి కీలకమైన పనామా కాలువ నానాటికీ చిక్కిపోతోంది. దాంతో భారీ సరుకు రవాణా నౌకల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. కొద్ది రోజులుగా ఎప్పుడు చూసినా వందలాది నౌకలు బారులు తీరిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. దాంతో పనామాకు ప్రత్యామ్నాయంగా మరో కాలువ ఉండాలన్న వాదన మళ్లీ తెరమీదకొచి్చంది. పసిఫిక్, అట్లాంటిక్ మహా సముద్రాలను కలిపే కీలకమైన పనామా కాలువలో నీటి పరిమాణం కొన్నాళ్లుగా బాగా తగ్గుతోంది. దాంతో నీటి మట్టం గణనీయంగా తగ్గిపోయి భారీ నౌకల ప్రయాణానికి ప్రతిబంధకంగా మారింది. ఓ మోస్తరు నౌకలు ఆచితూచి, అతి నెమ్మదిగా కదలాల్సి వస్తోంది. దీంతో విపరీత జాప్యం జరుగుతోంది. ఫలితంగా భారీ నౌకలు కాలువను దాటి అటు అట్లాంటిక్, ఇటు పసిఫిక్ వైపు వెళ్లడానికి రోజుల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. ప్రస్తుతం కనీసం 250కిపైగా భారీ నౌకలు తమవంతు ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. కారణమేమిటి? పనామా కాలువకు ప్రధానంగా నీటిని సరఫరా చేసే రెండు రిజర్వాయర్లు కొద్ది్ద కాలంగా నీటి ఎద్దడితో అల్లాడుతున్నాయి. వాటి పరీవాహక ప్రాంతాల్లో నెలకొన్న తీవ్ర వర్షాభావమే అందుకు అసలు కారణం. మళ్లీ తెరపైకి ’ఆ కాలువ’ పనామా కాలువ పరిమితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ కాలువ ఉండాలన్న ప్రతిపాదన మళ్లీ తెర మీదికి వస్తోంది. ఇది కొత్తదేమీ కాదు. 1900 తొలి నాళ్లలో అమెరికా ముందు రెండు ప్రతిపాదనలు ఉండేవి. ఒకటి పనామా కాగా మరోటి నికరాగ్వా గుండా కాలువ నిర్మాణం. పనామాకే అమెరికా సెనేట్ ఓటు వేయడంతో నికరాగ్వా గుండా నిర్మాణం అనేది ప్రతిపాదనలకే పరిమితమైంది. ఆ మార్గంలో చురుకైన అగ్ని పర్వతాలు ఉండటం సైతం ఆ ప్రాజెక్టు ఆదిలోనే ఆగడానికి ప్రధాన కారణం. అదీకాక నికరాగ్వా మార్గంతో పోలిస్తే తక్కువ దూరం ఉండటమూ పనామాకు కలిసొచి్చన అంశాల్లో ఒకటి. దీంతో ఆనాడు కనుమరుగైన ఆ ప్రతిపాదన తాజాగా ఇప్పుడు కొత్త రెక్కలు కట్టుకుని ముందుకు వాలింది. ► ఎలాగైనా దాని నిర్మాణం పూర్తి చేస్తానని చైనాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఒకరు ముందుకొచ్చారు. ► 2013 ఏడాదిలో హెచ్కేఎన్డీ అనే చైనా కంపెనీ నికరాగ్వా కాలువ నిర్మాణానికి సిద్ధపడింది కూడా. నికరాగ్వా దేశ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. 50 ఏళ్ల పాటు దాని నిర్వహణ అధికారాలు సంపాదించింది. కానీ ఇదీ కాగితాలకే పరిమితం అయింది. అంత ఈజీ కాదు... నికరాగ్వా గుండా కాలువ నిర్మాణానికి ఎన్నో అడ్డంకులు ఉన్నాయి. ఎందుకంటే... ► పశి్చమాన పసిఫిక్, తూర్పున అట్లాంటిక్ను కలుపుతూ రెండు కాలువలు తవ్వాలి. ఈ కాలువల మధ్యలోనే నికరాగ్వా సరస్సు ఉంటుంది. ► అట్లాంటిక్ వైపు 25 కిలోమీటర్లు, పసిఫిక్ వైపు 100 కిలోమీటర్ల పొడవునా ఈ కాలువలను తవ్వాల్సి ఉంటుంది. ► దీని నిర్మాణానికి కనీసం 40 బిలియన్ డాలర్లు ఖర్చు అవుతుందని అంచనా. ► ఇంత భారీ వ్యయంతో కాలువ నిర్మాణం చేపట్టాలంటే దాని ద్వారా అంతకు మించి ఆదాయం ఉంటుందన్న భరోసా కావాలి. ► ఇంత భారీ కాలువ నిర్మాణమంటే పర్యావరణపరంగా ఎంతో పెద్ద సవాలే. ► నిర్మాణం కారణంగా సతతహరిత అరణ్యాలు తుడిచి పెట్టుకుపోతాయని పర్యావరణవేత్తలు ఆందోళనలు చేశారు. ఇదీ పనామా కథ ► మధ్య అమెరికాలో ఉన్న బుల్లి దేశం పనామా. ► అక్కడ నిర్మించిన కృత్రిమ కాలువే పనామా కాలువ. ► ఇది ఉత్తర, దక్షిణ అమెరికా ఖండాలను కలుపుతుంది. ► దీని పొడవు 80 కిలోమీటర్లు. ► పనామా కాలువ మధ్యలో గతూన్ అనే కృత్రిమ సరస్సు ఉంటుంది. అలజేలా అనే మరో కృత్రిమ సరస్సు ఈ కాలువకు రిజర్వాయర్గా ఉంది. ► ఇటు పసిఫిక్ మహా సముద్రం, అటు అట్లాంటిక్ మహా సముద్రం వైపు కరేబియన్ సముద్రాన్ని విడదీసే ఇస్తుమస్ ఆఫ్ పనామను ఆనుకుని పనామా కాలువ ఉంటుంది. ► పనామా కాలువ గుండా ఏటా 270 బిలియన్ డాలర్ల విలువైన సరుకు రవాణా జరుగుతోంది. ► పనామా గుండా 170 దేశాలకు సరుకులు వెళ్తాయి. ఏం జరగనుంది? ► సరుకు నౌకలు దీర్ఘ కాలం పాటు ఇలా వేచి ఉండటం కారణంగా రవాణా వ్యయం విపరీతంగా పెరుగుతుంది. ► దాంతో ధ్రవీకృత సహజ వాయువు తదితర ఇంధనాల ధరలకు అమాంతం రెక్కలొస్తాయి. ► ఇది అంతిమంగా చాలా దేశాల్లో, అంటే అంతర్జాతీయంగా ధరల పెరుగుదలకు దారి తీస్తుంది. ► చివరకు ద్రవ్యోల్బణం పెరిగి పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు అల్లాడే పరిస్థితి రావచ్చు. ‘పనామాలో ఇప్పుడున్నది కనీవినీ ఎరగని అసాధారణ పరిస్థితి. చాలా ఆందోళనకరం కూడా’ – మిషెల్ వైస్ బోక్మ్యాన్, లాయిడ్స్ లిస్ట్ ఇంటెలిజెన్స్లో సీనియర్ విశ్లేషకుడు – సాక్షి, నేషనల్ డెస్క్ పనామా కాలువ ప్రవేశ మలుపు వద్ద తమ వంతు కోసం వేచి చూస్తున్న వందలాది ఓడలు -
అణుజలం.. ఆందోళన స్వరం
జపాన్లో 12 ఏళ్ల క్రితం భూకంపం, సునామీ ధాటికి దెబ్బతిన్న ఫుకుషిమా దైచీ అణు విద్యుత్ కేంద్రం నుంచి వ్యర్థ జలాలను çపసిఫిక్ మహా సముద్రంలోకి విడుదల చేయడం ఆందోళన రేపుతోంది. చైనా, దక్షిణ కొరియాతో పాటు స్వదేశంలో కొన్ని సంస్థల అభ్యంతరాలను బేఖాతర్ చేస్తూ జపాన్ ప్రభుత్వం రేడియో ధార్మిక జలాలను విడుదల చేస్తోంది. ఈ నీటి విడుదల ఎంతవరకు సురక్షితం ? జపాన్ వాదనలేంటి ? నిపుణులు ఏమంటున్నారు ? ఫుకుషిమా ప్లాంట్ నుంచి పసిఫిక్ సముద్రంలోకి వ్యర్థ జలాల విడుదల వివాదాస్పదం 2011, మార్చి 11. జపాన్ను తీవ్ర భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేలుపై 9.0గా నమోదైన ఈ తీవ్ర భూకంపంతో సునామీ ముంచెత్తింది. చెర్నోబిల్ అణు ప్రమాదం తర్వాత అంతటి విధ్వంసం జరిగింది. ఫుకుషిమా అణు విద్యుత్ ప్లాంట్లోని మూడు అణు రియాక్టర్లలోని కూలింగ్ వ్యవస్థలు దెబ్బ తిన్నాయి. దీంతో అణు రియాక్టర్లను చల్లార్చడం తప్పనిసరి అయింది. అప్పట్నుంచి భారీగా అణు వ్యర్థ జలాలు పేరుకుపోయాయి. ప్రమాదం జరిగిన పన్నెండేళ్లకు ఐక్యరాజ్య సమితికి చెందిన ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఏఈఏ) అనుమతితో జపాన్లోని టోక్యో ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ (టెప్కో) అణు జలాలను శుద్ధి చేసి పసిఫిక్ మహా సముద్రంలోకి విడుదల చేసే వివాదాస్పద కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. అణుజలాలతో సముద్రంలో జీవజాలం ప్రమాదంలో పడుతుందని, పర్యావరణానికి, మానవాళి ఆరోగ్యానికి ముప్పు ఉంటుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నా జపాన్ ఆగడం లేదు. జపాన్ నుంచి దిగుమతయ్యే సముద్ర ఉత్పత్తులపై చైనా నిషేధం విధించింది. జపాన్, దక్షిణ కొరియాలో ఈ జలాల విడుదల ఆపాలంటూ నిరసనలు పెరుగుతున్నాయి. అణు జలాల శుద్ధి ఇలా..! ► రేడియో ధార్మికత కలిగిన వ్యర్థ జలాలను దశల వారీగా శుద్ధి చేస్తారు. అడ్వాన్స్డ్ లిక్విడ్ ప్రాసెసింగ్ సిస్టమ్ (ఎల్పీఎస్) ద్వారా తొలి దశలో శుద్ధి చేస్తారు. ► జలాల్లో ఉన్న 62 రకాల రేడియో ధార్మిక మూలకాలను ఎల్పీఎస్ శుద్ధి చేస్తుంది. కానీ ట్రిటియం మూలకాన్ని మాత్రం అది ఫిల్డర్ చేయలేదు. ► అందుకే నీటిలో ఈ ట్రిటియం మూలకాల సాంద్రతను తగ్గించడానికి నీళ్లను మరింతగా డైల్యూట్ చేసే ప్రక్రియ చేపట్టింది టెప్కో. ట్రిటియం సాంద్రతనుæ జాతీయ భద్రతా ప్రమాణాలు నిర్దేశించిన ప్రమాణాల కంటే 40% తక్కువగా నీటిని డైల్యూట్ చేస్తోంది. జపాన్ ఏమంటోంది ? ప్రపంచంలో ఏ అణు ప్లాంట్ అయినా వ్యర్థ జలాలను సముద్రంలోకి వదిలి పెట్టడం సాధారణంగా జరిగేదేనని ఇప్పుడే ఎందుకు వివాదాస్పదం చేస్తున్నారని జపాన్ ప్రశి్నస్తోంది. సెసియం–137, స్ట్రాంటియం–90 కంటే ట్రిటియం వల్ల ముప్పు తక్కువేనని జపాన్లో నిపుణుల అభిప్రాయంగా ఉంది. ‘‘ట్రిటియం మూలకాలున్న నీళ్లని డైల్యూట్ చేసి సముద్రంలోకి విడిచిపెట్టడం వల్ల ప్రజల ఆరోగ్యానికి, పర్యవరణానికి ముప్పేమీ లేదు. అణుబాంబుల్ని పరీక్షించిన తర్వాత విడుదలయ్యే రేడియో ధార్మికత కన్నా శుద్ధి చేసిన అణుజలాల ద్వారా సముద్రంలో కలిసే రేడియో ధార్మికత అతి తక్కువ. ఇది కూడా కాలక్రమంలో క్షీణించిపోతుంది. దీని కోసం ఆందోళనలు అవసరం లేదు’’అని వియన్నా యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీకి చెందిన రేడియాలజిస్టు జార్జ్ స్టెయిన్హాజర్ అభిప్రాయపడ్డారు. పొల్యూషన్కి సొల్యూషన్ అంటే డైల్యూషన్ అని ఇంగ్లిషులో అంటారని నీటిని శుద్ధి చేస్తూ పోతే హానికరం కాదని స్పష్టం చేశారు. ఆ జలాలు విషతుల్యమేనా ? ప్రపంచంలో ఇతర దేశాలు సముద్రంలోకి అణు జలాలు విడుదల చేసినా వారు తీసుకున్న జాగ్రత్తలు జపాన్ తీసుకోవడం లేదని పర్యావరణ పరిరక్షణ వ్యవస్థ గ్రీన్పీస్ ఆరోపిస్తోంది. ఈ వ్యర్థ జలాల్లో అత్యంత ప్రమాదకరమైన స్ట్రాంటియం–90 సహా మూలకాలున్నాయంటోంది. మరో మార్గం లేదా ? జపాన్ ప్రభుత్వం, టెప్కో అత్యంత వేగంగా, తక్కువ ధరకి అయిపోతుందని సముద్రంలోకి అణుజలాలను పంప్ చేస్తున్నారని పర్యావరణ వేత్తలు ఆరోపిస్తున్నారు. ఈ జలాల నిల్వ కి మరిన్ని ట్యాంకుల్ని ఏర్పాటు చేయాలని, లేదంటే మరిగించి ఆవిరి రూపంలో వదుల్చుకోవాలని సూచిస్తున్నారు. ట్యాంకుల్లో నిల్వ ఉంచడాన్ని జపాన్ వ్యతిరేకించింది. భూకంపాలు అధికంగా వచ్చే ఆ ప్రాంతంలో ట్యాంకుల్లో భద్రపరిస్తే లీకయి భూగర్భంలో కలిస్తే మరింత ప్రమాదకరమని అంటోంది. ఇక నీళ్లను ఆవిరిగా మార్చడం, సముద్రంలోకి విడుదల చేయడం మధ్య పెద్దగా తేడాలేదని వాదిస్తోంది. మొత్తమ్మీద ఈ నీటి విడుదల కార్యక్రమం మున్ముందు ఎలాంటి ఉద్రిక్తతల్ని పెంచుతుందో వేచి చూడాలి. వ్యర్థ జలాలు ఎంత ఉన్నాయి ? ► ఫుకుషిమా–దైచీ అణు విద్యుత్ కేంద్రం ధ్వంసమైనప్పట్నుంచి అణు రియాక్టర్లను నిరంతరం చల్లగా ఉంచడానికి రోజుకి 170 టన్నుల నీటిని వాడాల్సి వస్తోంది. ► 13.4 కోట్ల టన్నుల వ్యర్థ జలాలు ఇప్పటికే పేరుకుపోయాయి. ► 1,046 ట్యాంకుల్లో వ్యర్థజలాలను భద్రపరిచారు. ► ఈ అణు జలాలను శుద్ధి చేసి వాటిలో రేడియో ధార్మికత తగ్గించి సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ► విద్యుత్ ప్లాంట్ నుంచి సముద్రంలోకి ఒక కిలోమీటర్ సొరంగం తవ్వి ఆ మార్గం ద్వారా వదులుతున్నారు. ► ఈ మొత్తం ప్రక్రియ పూర్తి కావడానికి ఏకంగా 30 ఏళ్లు పడుతుందని ఒక అంచనా ► 2024 మార్చి నాటికి 31వేల టన్నులకు పైగా జలాలను సముద్రంలోకి పంపాలని నిర్వాహక సంస్థ టెప్కో ప్రణాళికలు వేసింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఫ్యుకుషిమా నుంచి అణు జలాల విడుదల
ఒకుమా: జపాన్ను 12 ఏళ్ల క్రితం కుదిపేసిన పెను భూకంపం, సునామీతో దెబ్బ తిన్న ఫ్యుకుషిమా అణు ప్లాంట్ నుంచి వ్యర్థ జలాలను పసిఫిక్ సముద్రంలోకి విడుదల చేసే కార్యక్రమం మొదలైంది. ఇరుగు పొరుగు దేశాల నిరసనల మధ్య గురువారం నాడు తొలి విడతగా శుద్ధి చేసిన వ్యర్థ జలాలను సముద్రంలోకి విడుదల చేసే ప్రక్రియను మొదలు పెట్టినట్టు టోక్యో ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ (టెప్కో) ప్రకటించింది. వివిధ దశల్లో శుద్ధి చేసిన జలాలు అణు ప్లాంట్లోని కంట్రోల్ రూమ్ నుంచి విడుదల ప్రారంభానికి సంబంధించిన వీడియో కవరేజ్ను జపాన్ మీడియా లైవ్లో చూపింది. గురువారం మధ్యాహ్నం 1.30 గంటలకు నీటి విడుదల కార్యక్రమం మొదలైనట్టుగా అణుప్లాంట్ ఆపరేటర్ చెప్పారు. ఈ అణు జలాల విడుదలపై సొంత దేశంలో వివిధ స్వచ్ఛంద సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. నీటి విడుదలతో సముద్ర జలాలు విషతుల్యంగా మారి మత్స్య సంపదకు అపార నష్టం చేకూరుతుందని జపాన్, చైనా, దక్షిణకొరియా సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పర్యావరణం, మనుషుల ఆరోగ్యంపై దీని ప్రభావం ఉంటుందని జపాన్ ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. అయితే జపాన్ ప్రభుత్వం తన చర్యను సమర్థించుకుంది. అణు ప్లాంట్ను మూసేయాలంటే జలాలు విడుదల చేయక తప్పదని స్పష్టం చేసింది. 13.4 కోట్ల టన్నుల వ్యర్థ జలాలు వెయ్యి ట్యాంకుల్లో భద్రపరిచామని, ఆ ట్యాంకులకు ప్రమాదమేదైనా జరిగితే మరింత ముప్పు వాటిల్లుతుందని టెప్కో పేర్కొంది. అణు జలాలను శుద్ధి చేసి అవి సురక్షితమని తేలాక విడుదల చేస్తున్నట్టు సెంటర్ ఫర్ రేడియేషన్ రీసెర్చ్ డైరెక్టర్ టోనీ హూకర్ చెప్పారు. జపాన్ సీఫుడ్పై నిషేధం: చైనా జపాన్ది పూర్తిగా స్వార్థపూరిత, బాధ్యతారహిత చర్య అని చైనా మండిపడింది. జపాన్ నుంచి సీఫుడ్పై నిషేధం విధించింది. జపాన్ చేస్తున్న పనితో సముద్రంలో మత్స్య సంపదకి, వాతావరణానికి ఎంత ముప్పు ఉంటుందో ఎవరూ అంచనా వేయలేరని ఒక ప్రకటనలో దుయ్యబట్టింది. జపాన్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందంటూ వివిధ దేశాలు జలాల విడుదలను ఖండిస్తున్నాయి. -
Fukushima nuclear disaster: పసిఫిక్లో ‘అణు’ అలజడి
టోక్యో: జపాన్లో భూకంపంతో దెబ్బతిన్న ఫ్యుకుషిమా అణు రియాక్టర్ నుంచి వ్యర్థ జలాలను గురువారం నుంచి సముద్రంలోకి విడుదల చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ ప్లాంట్ను మూసివేయాలంటే వ్యర్థ జలాలను ఫసిఫిక్ మహా సముద్రంలోకి వదిలేయాక తప్పదని జపాన్ ప్రధాన మంత్రి ఫ్యుమియో కిషిదా మంగళవారం చెప్పారు. కేబినెట్ మంత్రులతో సమావేశమైన ఆయన ఈ వ్యర్థ జలాలను ప్రణాళికా బద్ధంగా సముద్రంలోకి పంపాలని ఇందు కోసం ప్లాంట్ సిబ్బంది సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. సముద్రంలో పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే ఈ నెల 24 నుంచి నీటి విడుదల కార్యక్రమం ప్రారంభమవుతుంది. 2011 మార్చి 11న సంభవించిన తీవ్రమైన భూకంపం అనంతరం ముంచెత్తిన సునామీకి ఈ ప్లాంట్ దెబ్బ తింది. అప్పట్నుంచి ఈ వ్యర్థ జలాలను జపాన్ నిల్వ చేసి ఉంచింది. కానీ ఇప్పుడు వాటిని నిల్వ చేయడానికి చోటు సరిపోక సముద్రంలోకి వదలాలని నిర్ణయించింది. ఈ నీటిని సముద్రంలోకి విడుదల చేయడంపై చుట్టుపక్కల దేశాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. జపాన్ దగ్గర దాదాపుగా 13.4 లక్షల టన్నుల వ్యర్థ జలాలు ఉన్నాయి. వీటిని దశలవారీగా శుద్ధి చేసి సముద్రంలోకి వదులుతారు. ఇలా చెయ్యడానికి కనీసం 30 ఏళ్లు పడుతుందని అంచనా. ఈ నీళ్లను సముద్రంలోకి విడిచి పెట్టడం వల్ల మత్స్య సంపదకు తీరని నష్టం వాటిల్లుతుందని ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నీటి విడుదలకి ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఏఈఏ) ఇప్పటికే అంగీకరించింది. జపాన్ పసిఫిక్ సముద్రాన్ని తన సొంత మురికి కాల్వగా భావిస్తోందని చైనా, దక్షిణ కొరియా వంటి దేశాలు విమర్శిస్తున్నాయి. కార్చిచ్చును కేర్ చేయని ఇల్లు! హవాయి: అమెరికాలోని హవాయి దీవిలో ఇటీవల చెలరేగిన కార్చిచ్చు తీవ్ర విషాదాన్ని మిగిలి్చంది. గత వందేళ్లలో ఇది అత్యంత తీవ్రమైన ప్రకృతి విపత్తు అని స్థానికులు చెబుతున్నారు. కార్చిచ్చు ధాటికి వందలాది ఇళ్లు కాలి బూడిదయ్యాయి. రిసార్ట్ నగరమైన ‘లాహైనా’ బూడిద కుప్పగా మారిపోయింది. ఇక్కడ దాదాపు అన్ని ఇళ్లు మంటల్లో చిక్కుకొని నేలమట్టమయ్యాయి. మంటల తీవ్రతకు వంద మందికిపైగానే మరణించారు. కానీ, ఒక ఇల్లు మాత్రం చెక్కుచెదరకుండా స్థిరంగా నిలిచి ఉండడం ఆశ్చర్యపరుస్తోంది. ఈ ఇల్లు ఫొటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. లాహైనా సిటీలో రివర్ ఫ్రంట్ వీధిలో ఈ ఇల్లు ఉంది. చుట్టుపక్కల ఉన్న ఇళ్లన్నీ మంటల్లో కాలిపోయాయి. ఇదొక్కటే ఎప్పటిలాగే మెరిసిపోతూ కనిపిస్తోంది. ఇది నిజమేనా? ఫొటోలో ఏదైనా మార్పులు చేశారా? అని నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై భవన యజమాని ట్రిస్ మిలికిన్ స్పందించారు. అది నిజమైన ఫొటో అని స్పష్టం చేశారు. 100 సంవత్సరాల క్రితం నాటి ఈ చెక్క ఇంటిని రెండేళ్ల క్రితం కొనుగోలు చేశామని, పాత పైకప్పును తొలగించి, లోహపు పైకప్పు వేయిచామని తెలిపారు. చుట్టుపక్కల గడ్డి లేకుండా బండలు పరిచామని వెల్లడించారు. ఈ జాగ్రత్తల వల్లే తమ ఇల్లు మంటల్లో చిక్కుకోలేదని పేర్కొన్నారు. కార్చిచ్చులో నిప్పు రవ్వలు తమ ఇంటిపై పడినా లోహపు పైకప్పు వల్ల ఎలాంటి నష్టం జరగలేదని ట్రిస్ మిలికిన్ వివరించారు. -
మూడు నెలలపాటు నడిసంద్రంలో..
మెక్సికో సిటీ: సుమారు మూడు నెలల పాటు సముద్రంలో నిస్సహాయ స్థితిలో పెంపుడు కుక్కతో గడిపిన ఓ వ్యక్తి ఎట్టకేలకు సురక్షితంగా ఒడ్డుకు చేరారు. నమ్మశక్యంకాని ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. తిమోతీ లిండ్సే షడ్డక్(54) అనే ఆ్రస్టేలియా వాసి పెంపుడు కుక్క బెల్లాతో కేటమారన్ రకం పడవలో పసిఫిక్ సముద్రంలో విహరిస్తున్నాడు. ఆ సమయంలో ఆ పడవ మరమ్మతుకు గురయింది. అలా సముద్ర జలాల్లో తీరానికి 1,200 మైళ్ల దూరంలో ఆ ఇద్దరూ మూడు నెలలుగా ఉండిపోయారు. అనూహ్యంగా ఇటీవల అటుగా టునా చేపల వేటకు వెళ్లిన మెక్సికో వాసుల కంట పడ్డారు. -
అతడు సముద్రాన్ని జయించాడు.. 60 రోజుల పాటు ఒక్కడే..
సిడ్నీ: ఆస్ట్రేలియాకు చెందిన ఓ నావికుడు రోజుల తరబడి సముద్రంలో ఒంటరిగా గడిపాడు. తన పడవ ప్రయాణం మధ్యలో చిక్కుకుపోవడంతో సముద్రంలో దిక్కుతోచని స్థితిలో గుండెధైర్యంతో కాలాన్ని నెట్టుకొచ్చాడు. పడవలో అతనికి తోడుగా అతని పెంపుడు కుక్క మాత్రమే ఉంది. రెండు నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మెక్సికో ఓడ ఒకటి అటుగా రావడంతో వారు అతనిని గుర్తించి రక్షించారు. ఆస్ట్రేలియా నావికుడు టిమ్ షాడోక్ తన పెంపుడు కుక్క బెల్లాతో కలిసి మెక్సికో తీరంలోని లా పాజ్ నగరం నుండి 6000 కిలోమీటర్లు ప్రయాణించి ఫ్రెంచ్ పాలినీషియా చేరుకునేందుకు ప్రయాణమయ్యాడు. కానీ దురదృష్టకర పరిస్థితుల్లో పడవలో సాంకేతిక లోపం తలెత్తి టిమ్ పసిఫిక్ మహాసముద్రం మధ్యలో చిక్కుకుపోయాడు. చుట్టూ నీరు, అలల హోరు తప్ప మరొకటి కానరాక రెండు నెలలపాటు సాగరం మధ్యలో అలమటించాడు. సముద్రం అలల తాకిడికి పడవలోని ఎలక్ట్రానిక్ సామాగ్రి బాగా దెబ్బతింది. సరైన ఆహారం లేక ఆకలికి పచ్చి చేపలను తింటూ, దాహానికి వర్షపు నీళ్లను తాగుతూ ఎలాగోలా తనతో పాటు తన కుక్క ప్రాణాలను కూడా నిలబెట్టుకున్నాడు. మెక్సికోకు చెందిన ఒక పెద్ద ఓడ వారిని గుర్తించి రక్షించింది. అప్పటికే టిమ్ షాడోక్ బాగా గడ్డం పెరిగి, బక్కచిక్కి గుర్తు పట్టలేనంతగా మారిపోయాడు. సహాయక బృందాలు అతడిని రక్షించిన తర్వాత తన పెంపుడు కుక్కతో తిరిగి మెక్సికో చేరుకుని వైద్యపరీక్షలు చేయించుకుని సరైన ఆహారం తీసుకోవాలని అన్నాడు. ఇది కూడా చదవండి: లోదుస్తుల్లో పాములు.. ఎయిర్ పోర్టులో పట్టుబడిన మహిళ -
జూన్లో వర్షాభావం
న్యూఢిల్లీ: ఫసిఫిక్ మహాసముద్రంలో ఎల్నినో ఏర్పడినప్పటికీ వాయవ్య భారత్ మినహా మిగిలిన ప్రాంతాల్లో ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదవుతుందని కేంద్ర వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే జూన్ నెలలో చాలా ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులుంటాయని తెలిపింది. దక్షిణ కర్ణాటక, ఉత్తర తమిళనాడు, రాజస్తాన్, లద్దాఖ్ మినహా మిగిలిన ప్రాంతాల్లో జూన్ నెలలో వానలు అంతగా కురిసే అవకాశాల్లేవని అంచనా వేసింది. ఫసిఫిక్ మహా సముద్రం వేడెక్కడం ఇప్పటికే ప్రారంభమైందని మన రుతుపవనాలపై ప్రభావాన్ని చూపిస్తే ఎల్నినో పరిస్థితులు ఏర్పడే అవకాశం 90శాతం ఉందని కేంద్ర వాతావరణ శాఖ పర్యావరణ పర్యవేక్షణ అధ్యయన కేంద్రం చీఫ్ డి. శివానంద చెప్పారు. అయితే వానలు కురవడానికి అనుకూలమైన ఇండియన్ ఓషన్ డిపోల్ (ఐఓడీ) హిందూ మహాసముద్రంలో ఏర్పడడం వల్ల చాలా ప్రాంతాల్లో వర్షాలు పడతాయని తెలిపారు. మధ్య భారతదేశంపై ఎల్నినో ప్రభావాన్ని ఐఓడీ సమర్థంగా ఎదు ర్కోవడం వల్ల ఏడాది మొత్తమ్మీద సాధారణ వర్షపాతం కురుస్తుందని వివరించారు. -
పసిఫిక్ ద్వీపదేశంలో భారీ భూకంపం
పోర్ట్ మోర్స్బీ: తరచూ భూకంపాల బారిన పడే ఫసిఫిక్ ద్వీపదేశం.. పపువా న్యూ గినియా Papua New Guinea మరోసారి భారీ భూకంపంతో వణికిపోయింది. భారత కాలమానం ప్రకారం.. ఈ వేకువ ఝామున 4 గంటల ప్రాంతంలో రిక్టర్ స్కేల్పై 7 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆస్తి, ప్రాణ నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. ఇది శక్తివంతమైన భూకంపమే అయినా.. ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు స్థానిక విపత్తుల విభాగం. అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించిన వివరాల ప్రకారం.. తీర ప్రాంత పట్టణమైన వెవాక్ నుంచి 97 కిలోమీటర్ల దూరంలో చంబ్రీ లేక్ కేంద్రంగా భారీ భూకంపం సంభవించింది. దాదాపు 62 కిలోమీటర్ల లోతులో సంభవించిన భూకంపం రిక్టర్ స్కేలుపై 7.0గా నమోదైంది. ఈ ప్రాంతం.. ఇండోనేషియా సరిహద్దుకు తూర్పున 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మొత్తని నేల స్వభావం వల్ల.. భూకంపం సంభవించిన ప్రాంతంలో నష్టం భారీగానే కలిగే అవకాశముందని అమెరికా జియోలాజికల్ సర్వే అభిప్రాయపడింది. అయితే.. సునామీ సంకేతాలు లేకపోవడం వల్లే హెచ్చరిక జారీ చేయలేదని అధికారులు చెప్తున్నారు. ఇదిలా ఉంటే.. తరచూ భూకంపాలతో ఈ ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. భూకంప కేంద్రానికి 250 కిలోమీటర్ల దూరంలోని హైలాండ్ ప్రావిన్స్లోనూ ప్రకంపనల ప్రభావం కనిపించింది. సుమారు 45 సెకండ్లపాటు భారీగా భూమి కంపించిందని స్థానికుడొకరు చెప్తున్నాడు. ఫసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ దేశాల్లో ఒకటిగా ఉన్న పపువా న్యూ గినియా.. బయోడైవర్సిటీకి ఫేమస్. అలాగే అక్కడ కొండ ప్రాంతాలు అధికం. భూకంపాలు సంభవించిన సమయంలో కొండచరియలు విరిగి పడడం ద్వారా భారీగా నష్టం చేస్తుంటుంది. తద్వారా పేదరికంలో ఉన్న దేశం పరిస్థితి.. నానాటికీ మరింతగా దిగజారిపోతోంది. కిందటి ఏడాది సెప్లెంబర్లో.. 7.6 తీవ్రతతో సంభవించిన భూకంపం 21 మంది బలి తీసుకుంది. ఇక 2018లో సంభవించిన భూకంపం ఏకంగా 200 మందిని పొట్టనబెట్టుకుంది. వీళ్లలో కొండచరియల కింద నలిగి మరణించిన వాళ్లే అధికం. -
పెను విషాదం.. పదుల సంఖ్యలో మరణాలు!
మనీలా: ఫిలిప్పీన్స్ దేశంలో ఘోర ప్రమాదం జరిగింది. పసిఫిక్ మహాసముద్రంలో ప్రయాణిస్తున్న ఓ నౌకలో గురువారం జరిగిన అగ్నిప్రమాదంలో దాదాపు 31 మంది మృతిచెందారు. పదుల సంఖ్యలో ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్ సముద్రంలో సహాయక చర్యలు చేపట్టింది. వివరాల ప్రకారం.. లేడీ మేరీ జాయ్-3 నౌక మిండానావో ద్వీపంలోని జాంబోంగా సిటీ నుంచి సులు ప్రావిన్స్లోని జోలో ద్వీపానికి బుధవారం అర్ధరాత్రి(భారత కాలమానం ప్రకారం) అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 31 మంది మరణించినట్టు బాసిలన్ గవర్నర్ జిమ్ సల్లిమాన్ తెలిపారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు. అయితే, నౌకలో అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే ప్రయాణికులు నీటిలో దూకేశారని అన్నారు. ప్రమాద సమయంలో నౌకలో 250 మంది ప్రయాణికులు ఉన్నట్టు స్పష్టం చేశారు. ప్రమాదం తర్వాత ఫిలిప్పీన్ కోస్ట్ గార్డ్, మత్స్యకారులు కలిసి 195 మందిని కాపాడినట్టు వెల్లడించారు. కాగా, మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారని తెలిపారు. కాగా, అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: అయ్యో పాకిస్తాన్.. రంజాన్ వేళ దారుణ పరిస్థితులు! -
ఇస్రో సరికొత్త ప్రయోగం.. భూమిపైకి ‘మేఘాట్రోఫిక్–1’ పునరాగమనం
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): నియంత్రిత పునరాగమన పద్ధతిలో సరికొత్త ప్రయోగానికి ‘ఇస్రో’ సిద్ధమైంది. 2011 అక్టోబర్ 12న పీఎస్ఎల్వీ–సీ18 రాకెట్ ద్వారా పంపించిన మేఘాట్రోఫిక్ ఉపగ్రహం కాలపరిమితికి మించి పనిచేసి, ప్రస్తుతం అంతరిక్షంలో నిరుపయోగంగా మారింది. దాదాపు 1,000 కిలోల బరువైన మేఘాట్రోఫిక్–1 (ఎంటీ–1) ఉపగ్రహాన్ని ఉçష్ణమండలంలోని వాతావరణం, వాతావరణ పరిస్థితులపై అధ్యయనం కోసం ఇస్రో, ఫ్రాన్స్ అంతరిక్ష సంస్థ (సీఎన్ఈఎస్) సంయుక్తంగా తయారుచేసి ప్రయోగించాయి. దీని కాలపరిమితి మూడేళ్లు. కానీ, 2021 దాకా సేవలందించింది. ప్రస్తుతం వ్యర్థంగా మారిన ఈ ఉపగ్రహంలో 125 కిలోల ద్రవ ఇంధనముంది. ఇది అంతరిక్షంలో పేలిపోయి ఇతర ఉపగ్రహాలకు ముప్పు వాటిల్లే ప్రమాదముందని ఇస్రో అంచనా వేసింది. ఈ నేపథ్యంలో దానిని సురక్షితంగా భూమిపైకి తీసుకొచ్చి, పసిఫిక్ మహాసముద్రంలో కూల్చేందుకు మంగళవారం సరికొత్త ఆపరేషన్కు శ్రీకారం చుట్టనున్నారు. భూమిపైకి మేఘాట్రోఫిక్–1 రీఎంట్రీ కోసం అందులో ఉన్న ఇంధనం సరిపోతుందని ఇస్రో సైంటిస్టులు చెబుతున్నారు. 26న ఎల్వీఎం3–ఎం3 ప్రయోగం లాంచ్ వెహికల్ మార్క్3–ఎం3 (ఎల్వీఎం3–ఎం3) ప్రయోగాన్ని ఈ నెల 26న నిర్వహించేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. యునైటెడ్ కింగ్డమ్కు చెందిన నెట్వర్క్ యాక్సెస్ అసోసియేట్ లిమిటెడ్, ఇండియన్ భారతి ఎంటర్ప్రైజెస్ సంయుక్త భాగస్వాములుగా వన్వెబ్ ఇండియా–2 పేరుతో 5,796 కిలోల బరువైన 36 కమ్యూనికేషన్ ఉపగ్రహాలను రెండోసారి వాణిజ్యపరంగా ప్రయోగిస్తున్నాయి. సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ ‘షార్’లోని రెండో ప్రయోగ వేదిక దీనికి వేదిక కానుంది. షార్లోని వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్లో రెండు దశల రాకెట్ అనుసంధానం పూర్తి చేశారు. క్రయోజనిక్ దశ మాత్రమే పెండింగ్లో ఉంది. ప్రయోగించబోయే 36 ఉపగ్రహాలు ఇప్పటికే షార్కు చేరుకున్నాయి. వీటికి అన్ని రకాల పరీక్షలు నిర్వహించారు. హీట్షీల్డ్లో అమర్చే పనులు జరుగుతున్నాయి. -
సంబరంగా న్యూ ఇయర్ వేడుకలు
న్యూఢిల్లీ/మెల్బోర్న్: 2022కు గుడ్బై చెబుతూ, 2023కు స్వాగతం పలుకుతూ ప్రపంచవ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. కోవిడ్ ఆంక్షల బెడద తొలగిపోవడంతో ఎక్కడ చూసినా జనం పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా వేడుకల్లో మునిగిపోయారు. పసిఫిక్ మహాసముద్రంలోని కిరిబాటి దీవులవాసులు అందరికంటే ముందుగా న్యూ ఇయర్కు ఆహ్వానం పలికారు. వారు న్యూజిలాండ్ కంటే గంట ముందే కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టారు. న్యూజిలాండ్లోని ఆక్లాండ్ స్కై టవర్ వద్ద అర్ధరాత్రికి 10 సెకన్ల ముందు నుంచి బాణసంచా వెలుగుల్లో ప్రజలు 2023కు స్వాగతం పలుకుతూ కేరింతలు కొట్టారు. చైనాలోని గ్రేట్ వాల్ వద్ద, షాంఘైలోని డిస్నీల్యాండ్లో ప్రత్యేకంగా మతాబులు కాల్చారు. ఇక ఆస్ట్రేలియాలోని విఖ్యాత సిడ్నీ హార్బర్ బ్రిడ్జిపై, సమీపంలోని ఒపెరా హౌస్ వద్ద కన్నులు మిరుమిట్లు గొలిపేలా బాణసంచా పేల్చారు. రాష్ట్రపతి శుభాకాంక్షలు..: దేశ విదేశాల్లోని భారతీయులకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. దేశ సమగ్రత, ఐక్యత, సమ్మిళిత అభివృద్ధి కోసం పునరంకితమవుదామని పిలుపునిచ్చారు. -
రష్యాలో ఒళ్లు విరుచుకున్న అగ్నిపర్వతాలు
మాస్కో: రష్యాలో రాజధాని మాస్కోకు 6,600 కిలోమీటర్ల దూరంలో పసిఫిక్ మహాసముద్రంలో కంచట్కా ద్వీపకల్పంలో రెండు అగ్నిపర్వతాలు నిద్రాణ స్థితి నుంచి మేల్కొని ఒళ్లు విరుచుకున్నాయి. భారీ పరిమాణంలో లావాను వెదజల్లుతున్నాయి. వాటినుంచి వెలువడుతున్న లావా, ధూళి మేఘాలు సుదూరాల దాకా కన్పిస్తున్నట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. అతి త్వరలో పూర్తిస్థాయిలో బద్దలయ్యే ప్రమాదముందన్నారు. శనివారం సంభవించిన గట్టి భూకంపమే ఇందుకు కారణమట. వీటిలో క్లుచెవ్స్కయా స్పోకా అగ్నిపర్వతం నుంచి గంటకు ఏకంగా పదిసార్లు భారీ పేలుళ్లు వెలువడుతున్నాయట! 4,754 మీటర్ల ఎత్తులో ఉన్న ఇది యురేషియాలోకెల్లా అత్యంత ఎత్తైన అగ్నిపర్వతం. కంచట్కా ద్వీపకల్ప ప్రాంతం ఏకంగా 30కి పైగా చురుకైన అగ్నిపర్వతాలకు నిలయం! -
అగ్నిపర్వతంపై సాహసం.. పట్టుజారితే బూడిద కూడా దొరకదు.. స్లాక్లైన్ వాక్లో గిన్నిస్ రికార్డు
-
చావుతో చెలగాటం.. అయినా ఈ సాహసాన్ని చూసేయండి
వైరల్: రఫెల్ బ్రిడి, అలెగ్జాండర్ షుల్జ్.. ఇప్పుడు తమ పనితో ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నారు. ప్రాణాల్ని పణంగా పెట్టి చేసి వీళ్ల సాహసం ఇప్పుడు వైరల్ అవుతోంది. స్వయంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ వాళ్లే ఈ జంట చేసిన సాహసాన్ని సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది మరి. నైరుతి పసిఫిక్ మహాసముద్రంలోని టన్నా ఐల్యాండ్లోని వనాటు వద్ద యసుర్ అగ్నిపర్వం మీద వీళ్లు స్లాక్లైన్ నడక సాహసం చేశారు. అగ్నిపర్వతం అడుగు నుంచి సుమారు 137 అడుగుల ఎత్తులో ఒక తాడుపై ఎలాంటి ఆధారం లేకుండా వీళ్ల నడక కొనసాగింది. కింద నుంచి అగ్నికీలలు ఎగసిపడుతున్నా సుమారు 261 మీటర్ల దూరం నడక సాగించి.. గిన్నిస్ బుక్లో చోటు దక్కించుకున్నారు ఈ ఇద్దరూ. రఫెల్ జుంగో బ్రిడి బ్రెజిల్కు చెందిన సాహసికుడు కాగా, అలెగ్జాండర్ షుల్జ్ జర్మనీకి చెందిన వ్యక్తి. సాహసమే వీళ్లిద్దరి ఊపిరి. గతంలో వీళ్లిద్దరి పేర్ల మీద పలు రికార్డులు కూడా ఉన్నాయి. -
పసిఫిక్ మహాసముద్రంలో వింత ‘పుష్ప’ జీవి గుర్తింపు
న్యూఢిల్లీ: అచ్ఛంగా విచ్చుకున్న పుష్పంలాగా ఉన్న కొత్త జీవిని పసిఫిక్ మహాసముద్రంలో పరిశోధకులు గుర్తించారు. ఓషియన్ ఎక్స్ప్లోరేషన్ ట్రస్టు ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీన పసిఫిక్ అడుగు భాగాన అన్వేషిస్తుండగా, ఈ జీవి దర్శనమిచ్చింది. సంబంధిత వీడియో దృశ్యాలను ఓషియన్ ఎక్స్ప్లోరేషన్ ట్రస్టు విడుదల చేసింది. సముద్ర ఉపరితలం నుంచి 9,823 అడుగుల(2,994 మీటర్లు) లోతున ఈ జీవి కనిపించిందని పరిశోధకులు చెప్పారు. పువ్వుకు ఉన్నట్టుగానే దీనికి కాండం, రేకుల (తంతువుల) లాంటివి ఉండడం విశేషం. కాండం వంటి భాగం 7 అడుగులు (2 మీటర్లు) కాగా, ఒక్కో తంతువు 16 అంగుళాలు (40 సెం.మీ.) పొడవున్నాయట! ఇదో భారీ సముద్ర జీవి అని చెబుతున్నారు. అయితే ఇతర సముద్ర జీవజాతుల తరహాలో కాకుండా భిన్నంగా కనిపిస్తుండడం దీని ప్రత్యేకత. ఇలాంటి వింత జీవి ఒకటి కనిపిస్తుందని ఎప్పుడూ ఊహిచలేదని పరిశోధకులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: రాబోయే పదేళ్లలో కొత్త ముప్పు.. ప్రాణాలు హరించే.. -
సాగర కన్యలు ఉన్నది నిజమే! ఔను అంటున్న జపాన్ శాస్త్రవేత్తలు
మనం సినిమాల్లో సాగర కన్యలు(మత్స్య కన్య) చూశాం. కానీ నిజంగా అవి ఉన్నాయా? అనేది మాత్రం అందరి మదిలో మెదిలే ప్రశ్నే. డిస్కవరీ ఛానెల్స్లో వాటి గురించి చెబుతుంటారు కానీ రియల్గా మాత్రం వాటిని ఎవరు చూసి ఉండే అవకాశం లేదు. అయితే జపాన్ శాస్త్రవేత్తలు మాత్రం సాగర కన్యలు ఉన్నాయంటున్నారు. వాటికి సంబంధించిన ఆధారాలతో సహా వివరిస్తున్నారు. వివరాల్లోకెళ్తే...మానవ ముఖం, తోకతో ఉన్న 300 ఏళ్ల నాటి మత్సకన్య మమ్మీని చూసి శాస్తవేత్తలు ఆశ్చర్యపోయారు. మత్స్య కన్య ఆకారంలో ఉన్న ఈ మమ్మీని జపాన్ శాస్త్రవేత్తల బృందం అధ్యయనం చేస్తోంది. 1736 మరియు 1741 మధ్యకాలంలో జపనీస్ ద్వీపం అయిన షికోకు సమీపంలోని పసిఫిక్ మహాసముద్రంలో 12 అంగుళాల మర్మమైన జీవి పట్టుబడిందని చెబుతున్నారు. ఈ మత్స్య కన్య మమ్మీ పసిఫిక్ మహాసముద్రంలో చేపలు పట్టే వలలో చిక్కుకుందని పేర్కొంటూ ఒక లేఖ దొరికిందని కూడా అన్నారు. ఆ తర్వాత ఎండిన మత్స్య కన్యను ఒక కుటుంబం పర్యవేక్షించిందని తదనంతరం అసకుచి నగరంలోని ఒక దేవాలయంలో ఉందని చెప్పారు. ఈ మమ్మీకి దంతాలు, ముఖం రెండు చేతులు, తల, నుదురుపై వెంట్రుకలు ఉన్నాయన్నారు. ఎగువ భాగం మానవ రూపంలోనూ, దిగువ భాగం చేప లక్షణాలను కలిగి ఉందని తెలిపారు. శరీరం దిగువ భాగంలో పొలుసులు, తోక-వంటి టేపర్డ్ ఎండ్ ఉంటుందని చెప్పారు. కురాషికి యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ ఆర్ట్స్ పరిశోధకులు వీటి గురించి మరింత లోతుగా అధ్యయనం చేయనుంది. జపనీస్ మత్స్యకన్యలకు అమరత్వపు పురాణం(యావో-బికుని) ఉందని, మత్స్యకన్య మాంసం తింటే ఎప్పటికీ చనిపోరు అని ఒకాయమా ఫోక్లోర్ సొసైటీకి చెందిన హిరోషి కినోషిత చెబుతున్నారు. ఈ పురాణం కుడా ఆ మత్య్స కన్య దొరికిన ఆలయంలోనే ఉందని చెప్పారు. ఆ పురాణాన్ని నమ్మే కొందరు మత్య్స కన్య పొలుసులను చెవిలో పెట్టుకుంటారని అన్నారు. ఆ మత్స్య కన్యలు అంటు వ్యాధులను దూరం చేస్తాయని జపాన్ వాసుల ప్రగాఢ నమ్మకం అని కూడా చెప్పారు. (చదవండి: చిన్ని చేతులు చేస్తున్న అద్భుతం!...రష్యా బలగాలు ముట్టడించకుండా చేసేందుకు యత్నం!) -
టోంగా సముద్రగర్భంలో.. అగ్నిపర్వతం పేలుడు
వెల్లింగ్టన్: దక్షిణ ఫసిఫిక్ సముద్రంలోని ద్వీపకల్పమైన టోంగాలో సముద్ర గర్భంలోని అగ్నిపర్వతం శనివారం బద్దలవడంతో ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి. సముద్రం లోపల ఉన్న హుంగా టోంగా హాపై అనే అగ్నిపర్వతం వరసగా రెండు రోజులు పేలడంతో టోంగా వ్యాప్తంగా బూడిద మేఘాలు కమ్ముకున్నాయి. ఈ బూడిద 19 కి.మీ.ఎత్తువరకు వ్యాపించినట్లు టోంగా జియోలాజికల్ సర్వే తెలిపింది. అమెరికా నుంచి జపాన్ వరకు తీరప్రాంతంలోని పలు దేశాలకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఎంత నష్టం జరిగిందనేది తెలియలేదు. లక్షకు పైగా జనాభా ఉన్న టోంగా తీరప్రాంతంలో భారీగా అలలు ముంచెత్తుతున్న వీడియోలను ప్రజలు సోషల్మీడియాలో షేర్చేశారు. ముప్పు తొలగిపోవడంతో అమెరికాలో సునామీ హెచ్చరికల్ని వెనక్కి తీసుకున్నారు. -
ముందుకొస్తున్న పసిఫిక్.. పలు దేశాలు గజగజ
పసిఫిక్ మహాసముద్రం దక్షిణ భాగంలో టోంగా దగ్గర అగ్నిపర్వతం భారీ శబ్ధంతో శనివారం బద్ధలైన సంగతి తెలిసిందే. ఆ ధాటికి భారీ ఎత్తున అలలు ఎగసి పడుతుండడంతో తీర ప్రాంతాలు అప్రమత్తం అవుతున్నాయి. చాలా చోట్ల సముద్ర జలాలు ముందుకు దూసుకురావడంతో.. అల్లకల్లోలం నెలకొంది. Tsunami Warning For Some Pacific Coastal Countries: ఈ పరిణామంతో టోంగాతో పాటు అమెరికన్ సమోవా, న్యూజిలాండ్, ఫిజీ, వనువాటు, చిలీ, ఆస్ట్రేలియా.. సునామీ హెచ్చరికలు జారీ చేశాయి. నాలుగు అడుగుల ఎత్తుతో అలలు ఎగసిపడగా.. టోంగా రాజధాని నుకువాలోఫా ప్రజలు వణికిపోయారు. భారీ శబ్ధంతో భూమీ కంపించడంతో పాటు సముద్రపు నీరు నగరంలోకి చొచ్చుకుని వచ్చిందని ఆస్ట్రేలియా బ్యూరో ఆఫ్ మెటియోరాలజీ ప్రకటించింది. టోంగా రాజు ప్యాలెస్ నుంచి ఇప్పటికే సురకక్షిత ప్రాంతానికి తరలిపోగా.. తన పౌరులను అప్రమత్తంగా ఉండాలంటూ పిలుపు ఇచ్చాడు. నష్టం వివరాలు అందాల్సి ఉంది. మరోవైపు అలలు ఎగసిపడే అవకాశం ఉన్నందున అమెరికా, జపాన్, సైతం ఇప్పుడు సునామీ హెచ్చరికలతో అప్రమత్తం అయ్యాయి. జపాన్ తీర ప్రాంతం వెంబడి 11 అడుగుల మేర అలలు ఎగసిపడే అవకాశం ఉందని భావిస్తోంది వాతావరణ సంస్థ. ఈ నేపథ్యంలో తీర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచిస్తోంది. మరోవైపు అమామీ ఒషీమా ద్వీపంలోకి 1.2 మీటర్ ఎత్తుతో అలలు ఎగసిపడినట్లు తెలుస్తోంది. అమెరికా, కెనడా పశ్చిమ తీరం వెంట సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. కాలిఫోర్నియా, అలస్కా వెంట చిన్నపాటి వరదల దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హవాయ్ అప్రమత్తం అయ్యింది. ఓరేగావ్ తీరం వెంట సముద్రపు అలలు ముందుకు వస్తున్నాయి. So this happened in Tonga today! Massive Underwater volcanic eruption sending shockwave across South Pacific as captured by Himawari Satellite! Tsunami just hit Tonga and some region of Fiji Island! Prayers for people there!#Tsunami pic.twitter.com/7Q4mRhNcVQ — Vishal Verma (@VishalVerma_9) January 15, 2022 Stay safe everyone 🇹🇴 pic.twitter.com/OhrrxJmXAW — Dr Faka’iloatonga Taumoefolau (@sakakimoana) January 15, 2022 వీడియో: టోంగా దగ్గర పేలిన అగ్నిపర్వతం -
పసిఫిక్లో అల్లకల్లోలం.. భారీ శబ్ధాలతో సునామీ హెచ్చరికలు
పసిఫిక్ మహాసముద్రంలోని టోంగా సమీపంలో భారీ అగ్నిపర్వతం బద్ధలైంది. ఈ ప్రభావంతో తీర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బూడిద ఆవరించింది. ఆకాశంలో 20 కిలోమీటర్ల ఎత్తు వరకు బూడిద మేఘాలు అలుముకున్నాయి. భారీ ప్రకంపనల కారణంగా.. సముద్ర జలాలు ముందుకు చొచ్చుకునిరాగా.. కొన్ని దేశాలు సునామీ హెచ్చరికలు జారీ చేశాయి. టోంగా జియోలాజికల్ సర్వీసెస్ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. పసిఫిక్లో అనేక ద్వీపదేశాలు.. మహాసముద్ర అంతర్భాగంలో అనేక అగ్నిపర్వతాలు ఉన్నాయి. టోంగాకు సమీపాన అగ్నిపర్వతం హుంగా టోంగా-హుంగా హాపై హఠాత్తుగా బద్దలైంది. ది హుంగా టోంగా హాపై అగ్నిపర్వతం.. టోంగాన్ రాజధాని నుకువాలోఫాకు 65 కిలోమీటర్ల దూరంలో ఉంది. విస్ఫోటనం తాలూకు శబ్దాలు 8 నిమిషాల పాటు కొనసాగాయి. విస్ఫోటనం తీవ్రత ఎంతగా ఉందంటే, అక్కడికి 800 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫిజీ దీవుల్లోనూ శబ్దాలు వినిపించాయట!. Stay safe everyone 🇹🇴 pic.twitter.com/OhrrxJmXAW — Dr Faka’iloatonga Taumoefolau (@sakakimoana) January 15, 2022 కాగా సముద్రంలో అగ్నిపర్వతం పేలుడును పలు శాటిలైట్లు చిత్రీకరించాయి. హిమావరీ శాటిలైట్ చిత్రీకరించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ అగ్నిపర్వతం పేలుడు ధాటికి న్యూజిలాండ్, టోంగా, ఫిజీ వంటి దేశాలకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. సముద్ర తీర ప్రాంతాల వాసులు తమ నివాసాలను వదిలి వెళ్లాలని, ఎత్తయిన ప్రదేశాలకు చేరుకోవాలని పలు దేశాల్లో అప్రమత్తం చేస్తున్నాయి. శుక్రవారం సునామీ హెచ్చరికలు వెనక్కి తీసుకున్న కొన్ని గంటలకే.. ఈ పరిణామంతో మళ్లీ హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం. మరోవైపు కొన్ని పాత, ఫేక్ వీడియోలు సైతం సునామీ పేరిట వైరల్ అవుతున్నాయి. The volcanic eruption in Tonga captured by #Himawari satellite.. Massive!😳 pic.twitter.com/1qy4FJgpvM — Raj Bhagat P #Mapper4Life (@rajbhagatt) January 15, 2022 A second tsunami event near Tonga has triggering warnings for Australia, Fiji, New Zealand, Vanuatu, Samoa, Lord Howe and Norkfolk Island. https://t.co/j72Me4KLjv pic.twitter.com/JrnMkKH6wX — The Australian (@australian) January 15, 2022 -
ఆకాశంలో నాలుగు చుక్కలు.. గ్రహాంతర వాసులులేనా!?
గ్రహాంతరవాసులు.. ఈ ప్రస్తావన వచ్చిన ప్రతిసారి మనలో ఏదో తెలియని ఉత్కంఠ, ఆసక్తి అందరిలోనూ కనిపిస్తుంది. విశ్వంలో ఏలియన్స్ ఉన్నారని వారికి మనుషుల కంటే అధిక శక్తులు ఉంటాయని, టెక్నాలజీ గురించి కూడా తెలుసని చాలాకాలం నుంచి శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. గ్రహాంతర వాసులు ఉన్నారా? లేరా? చర్చ ఈనాటిది కాదు. ఎప్పటి నుంచో ఈ విషయంపై పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. పలువురు తాము అన్ఐడెంటిఫైడ్ ఫ్లైయింగ్ ఆబ్జెక్ట్ (యూఎఫ్ఓ)లను చూశామని ఇప్పటికీ చెబుతూనే ఉన్నారు. అయితే ఒకవేళ నిజంగా ఏలియన్స్ ఆకాశం చక్కర్లు కొడితే.. అవి భూమి మీదికి ఎందుకు రాలేకపోతున్నాయని శాస్త్రవేత్తలు సైతం సందేహం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: చైనా దిగ్గజ కంపెనీలో చీకటి యవ్వారాలు.. కామ పిశాచాలపై ‘నో’ యాక్షన్ అయితే తాజాగా.. ఏలియన్స్కు సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం వార్తల్లోకి వచ్చింది. ఆకాశంలో అన్ఐడెంటిఫైడ్ ఫ్లైయింగ్ ఆబ్జెక్ట్ చక్కర్లు కొట్టిన వీడియో ప్రసుత్తం సోషల్ మీడియాలో వైరల్ మారింది. అది ఏలియన్స్ పంపిన యూఎఫ్ఓనా లేదా ఏదైనా ఏయిర్ క్రాఫ్టా? అని చర్చ జరుగుతోంది. అన్ఐడెంటిఫైడ్ ఫ్లైయింగ్ ఆబ్జెక్ట్ అంటే.. ఆకాశంలో ఎగురుతూ కనిపించే గుర్తు తెలియని వస్తువు లేదా ఏలియన్స్ ఫ్లైయింగ్ మిషిన్. ఏదైన ఏయిర్ క్రాఫ్టు లేదా స్పేస్ షిప్లు ఆకాశంలోకి ఎగిరినప్పుడు వాటికి సంబంధించిన రాడార్ సిగ్నల్స్ ఉంటాయన్న విషయం తెలిసిందే. అయితే యూఎఫ్ఓ వంటి వాటికి రాడార్ సిగ్నల్స్ ఉండవు. ఇక కొన్ని సార్లు రాడార్లుకు సంబంధించిన సిగ్నల్ కాకుండా వింత మిషన్లు ఆకాశంలో ఎగురుతూ కనిపిస్తుంటాయి! అయితే వాటివి ఇతర గ్రహాల నుంచి వచ్చిన మిషన్గా సైంటిస్టులు భావిస్తుంటారు. భూమిపై నుంచి ఎలాంటి ఫ్లైట్ లేదా స్పేస్ షిప్ గాల్లోకి ఎగిరిగినా అందుకు సంబంధించిన రాడార్ సిగ్నల్స్ ఉంటాయి. పైలెట్స్ వాటిని సులభంగానే గుర్తిస్తారు కూడా. తాజాగా ఓ పైలెట్కు ఆకాశంలో వింత ఆకారంలో యూఎఫ్ఓ కనిపించింది. పసిఫిక్ మహాసముద్రం మీదుగా ఓ పైలెట్ విమానంలో ప్రయాణిస్తున్నాడు. కొంత దూరం ప్రయాణించాక నాలుగు చుక్కలు ఒకదాని పక్కన ఒకటి ప్రయాణించిటం గమనించాడు. ఆ దృశ్యాన్ని చూసిన పైలెట్ ఆశ్చర్యానికి గురై తన కెమెరాలో బంధించాడు. కొంత దూరం ప్రయాణించిన ఆ చుక్కలు.. ఒక్కసారిగా అదృశ్యమైపోయాయి. అవి ఏలియన్స్ యూఎఫ్ఓలని నెటిజన్లు సోషల్ మీడియలో కామెంట్లు చేస్తున్నారు. యూఎఫ్వోలకు సంబంధించిన పలు వీడియోలు గతంలో చాలా సార్లు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో మాత్రం చాలా ఆశ్చర్యకరంగా ఉందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. A pilot claims he saw a fleet of #UFOs over the Pacific Ocean. The video was shot at around 39,000 feet. 🛸👽 The suspected #alien aircraft took the form of ‘weird’ rotating lights moving across the sky. 😳 What are your thoughts on the footage? 👀🤔 pic.twitter.com/N0I2WS2kYq — Chillz TV (@ChillzTV) December 7, 2021 -
అదో విచిత్రం!...సముద్రం పై కదిలే కాంతి చుక్కలు!!
మనం ప్రకృతిలో ఉండే కొన్ని రకాల వింతలను మన కళ్లతో నేరుగా చూడగలుగుతాం. అయితే ఒక్కొసారి అవి మనం నేరుగా కాకుండా వీడియోలో రికార్డు చేసినప్పుడు గమనిస్తూ ఉంటాం. అచ్చం అలానే ఇక్కడొక పైలెట్ విమానంలో ప్రయాణిస్తుండగా ఒక వీడియో తీసినప్పుడు ఒక వింత సంఘటన చోటుచేసుకుంది. (చదవండి: అక్కడ చెట్లను తొలగిస్తే.... బహుమతులు ఇస్తారట!) అసలు విషయంలోకెళ్లితే...పసిఫిక్ మహాసముద్రం మీదుగా విమానంలో ప్రయాణిస్తున్న ఒక పైలెట్ వీడియో తీసినప్పుడు ఒక వింత సంఘటన చూశాడు. ఒక మూడు కాంతి చుక్కలు ఒకేరీతీలో కదులుతు ఉంటాయి. ఈ మేరకు కొంత దూరం వరకు వెళ్లి ఆ తర్వాత కనుమరుగవ్వడం గమినించాడు. ఈ మేరకు ఈ కదులుతున్న యూఎఫ్ఓ ఫ్లీట్ని కెమరాలో బంధించడమే కాక సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. పైగా ఈ వీడియోని 39,000 అడుగుల ఎత్తులో తీశారు. దీంతో నెటిజన్లు ఇది ఇప్పటి వరకు వచ్చిన యూఎఫ్ఓ ఫ్లీట్ వీడియోలో అత్యుత్తమమైనదంటూ ఆ విచిత్రాన్ని చూసి అవాక్కవుతూ రకరకాలుగా ట్వీట్ చేశారు. (చదవండి: బాప్రే!.... నెపోలియన్ ఖడ్గం వేలంలో రూ. 21 కోట్లు పలికిందట!) A pilot claims he saw a fleet of #UFOs over the Pacific Ocean. The video was shot at around 39,000 feet. 🛸👽 The suspected #alien aircraft took the form of ‘weird’ rotating lights moving across the sky. 😳 What are your thoughts on the footage? 👀🤔 pic.twitter.com/N0I2WS2kYq — Chillz TV (@ChillzTV) December 7, 2021 -
ఈ రాక్షస చేప నోట్లో వందల పళ్లు!!.. ఇప్పటికీ రహస్యమే..
Pacific Lingcod Fish Mysterious Unknown and Shocking Facts in telugu: అనగనగా ఒక భారీ చేప. దాని నోటిలో వందల సంఖ్యలో రంపపు దంతాలు. అంతేకాదు ఆ పళ్లు వేగంగా పెరుగుతాయి. అంతేవేగంగా ఉడిపోతాయి. ఎందుకు? ఇదేదో జానపద పొడుపు కథలా ఉందే!! అని అనుకుంటున్నారా..? కథ కాదు ఇలలోనే...! ఈ రాక్షస చేప విశేషాలు మీకోసం.. ఆ చేప పేరు పసిఫిక్ లింగ్కాడ్. దాని నోటిలో 555 పదునైన దంతాలు ఉంటాయి. రోజుకు 20 పళ్లు చొప్పున ఊడిపోతాయి. మళ్లీ కొత్తవి పెరుగుతూ ఉంటాయి. ఐతే ఈ చేప దంతాలు మనుషుల దంతాలంత సైజులో కాకుండా చాలా చిన్నగా, పదునుగా ఉంటాయి. ఇలాంటి చేపలు సాధారణంగా నార్త్ పసిఫిక్ సముద్రంలో కనిపిస్తాయి. పసిఫిక్ లింగ్కాడ్ చేప యుక్తవయస్సులో 50 సెంటీమీటర్లు పెరుగుతుంది. కొన్ని సందర్భాల్లో 1.5 మీటర్ల వరకు పెరిగే అవకాశం ఉన్నట్లు అధ్యయనాలు వెల్లడించాయి. అంతేకాకుండా ఈ రకమైన చేపలకు పైన, కింద రెండు దవడలు ఉంటాయి. వీటిని ఫారింజియల్ దవడలు అంటారు. మనుషులు దవడపళ్లతో నమిలినట్లే చేపలు కూడా ఆహారాన్ని నమలడానికి ఉపయోగిస్తాయని లైవ్సైన్స్ నివేదిక తెల్పింది. చదవండి: Side Effects Of Wearing Jeans: ఆ జీన్స్ ధరించిన 8 గంటల తర్వాత.. ఐసీయూలో మృత్యువుతో.. యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్లో జీవశాస్త్రంలో పీహెచ్డీ చేస్తున్న కార్లీ కోహెన్, ఈ నివేదిక ప్రధాన రచయిత ఎమిలీ కార్ ఈ చేపల దంతాలపై అధ్యయనం చేశారు. పసిఫిక్ లింగ్కోడ్ చేపల దంతాలు మైక్రోస్కోపిక్ పరిమాణంలో ఉన్నందువల్ల వీటిని మామూలు పద్ధతుల్లో లెక్కించడం కుదరదు. అందువల్ల ప్రయోగశాలలో 20 పసిఫిక్ లింగ్కోడ్ చేపలను ఒక ట్యాంక్లో ఉంచి, నీళ్లలో ఎరుపు రంగును కలిపారు. ఫలితంగా చేపల దంతాలు కూడా ఎరుపు రంగులోకి మారాయి. ఆ తర్వాత ఈ చేపల పళ్లపై మరకలు పడేలా పచ్చ రంగుకలిపిన మరో ట్యాంక్లోకి తరలించారు. ఎమిలీ కార్ లైవ్ సైన్స్తో మాట్లాడుతూ.. ‘ఈ చేపల పళ్లను లెక్కించడానికి ఒక చీకటి గదిలో పని చేయాల్సి వచ్చింది. మైక్రోస్కోప్లో పళ్లను లెక్కించాను. ఒక్కోచేపకు దాదాపుగా వెయ్యికి పైగా పళ్లున్నాయ’ని వెల్లడించారు. చేపలకు ఎక్కువ ఆహారం ఇవ్వడం వల్ల వాటి దంతాల రిప్లేస్మెంట్ సైకిల్లో ఏవైనా మార్పులు వస్తాయేమోననే కోణంలో కూడా పరిశోధకులు ప్రయత్నించారు. ఐతే ఎటువంటి మార్పులు సంభవించలేదు. అందువల్ల పసిఫిక్ లింగ్కాడ్ చేప పళ్లకు సంబంధించిన వింత ఇప్పటికీ రహస్యంగానే ఉండిపోయింది. చదవండి: Science Facts: చీమల రక్తం అందుకే ఎర్రగా ఉండదట..! -
ఉగ్రభూతం మిమ్మల్నీ వదలదు! పాక్కు ప్రధాని హెచ్చరిక
న్యూయార్క్: ఉగ్రవాదాన్ని పెంచి పోషించే దేశాలు పాముకు పాలు పోస్తున్నామని అర్ధం చేసుకోవాలని, ఉగ్రవాదాన్ని రాజకీయ పనిముట్టుగా వాడే దేశాలు చివరకు అది తమను కూడా కబళిస్తుందని గ్రహించాలని ప్రధాని నరేంద్ర మోదీ దాయాది దేశానికి ఐక్యరాజ్యసమితి వేదికగా చురకలంటించారు. ఐరాస 76వ సమావేశంలో ప్రధాని మోదీ శనివారం పస్రంగించారు. ఉగ్రవాదులకు పాకిస్తాన్ స్వర్గధామంగా మారుతోందని పొరుగుదేశాలు గగ్గోలు పెడుతున్న సందర్భంగా ఐరాస వేదికగా ప్రధాని గట్టి హెచ్చరిక చేశారు. అఫ్గాన్, కరోనా, ఇండోపసిఫిక్, అంతర్జాతీయ సవాళ్లు.. వంటి అనేక అంశాలను ప్రధాని తన సందేశంలో ప్రస్తావించారు. ప్రస్తుతం ప్రపంచం తిరోగామి ఆలోచనా విధానాలు, అతివాద విధానాలతో సమస్యలను ఎదుర్కొంటోందన్నారు. ఇలాంటి సమయంలో ప్రపంచమంతా శాస్త్రీయాధారిత ధృక్పధాన్ని, పురోగామి మార్గాన్ని అవలంబించి అభివృద్ధి దిశగా పయనించాలని అభిలíÙంచారు. శాస్త్రీయ ధోరణులను పెంపొందించేందుకు భారత్ అనుభవాధారిత విద్యను ప్రోత్సహిస్తోందని చెప్పారు. ఇదే సమయంలో కొన్ని దేశాలు మాత్రం తీవ్రవాదాన్ని స్వీయప్రయోజనాలకు అనుకూలంగా వాడుకోవాలని తిరోగామి ఆలోచనలు చేస్తున్నాయని పరోక్షంగా పాక్పై మండిపడ్డారు. వివిధ అంతర్జాతీయ సంస్థలు చైనా విషయంలో మాటమార్చడాన్ని ప్రస్తావించారు. ఐరాస విశ్వనీయత పెంచుకోవాలని చురకలంటించారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా చర్యలను పరోక్షంగా ప్రస్తావిస్తూ సముద్రాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిదన్నారు. అఫ్గానిస్తాన్ను ఎవరూ సొంత ప్రయోజనాలకు వాడుకోకూడదని హితవు చెప్పారు. ఇంకా ప్రధాని ఏమన్నారంటే... ప్రజాస్వామ్యం: ఒక టీ అమ్ముకునే వ్యక్తి స్థాయి నుంచి ఐరాసలో భారత ప్రధానిగా ప్రసంగించేవరకు సాగిన నా జీవితం భారతీయ ప్రజాస్వామిక బలానికి నిదర్శనం. ప్రజాస్వామ్యానికి భారత్ తల్లివంటిది. ఈ ఏడాది ఆగస్టు 15న ఇండియా 75వ స్వాతంత్య్రోత్సవాలు జరుపుకుంది. భారత్లో భిన్నత్వమే బలమైన ప్రజాస్వామ్యానికి నిదర్శనం. వివిధ ప్రభుత్వాల అధినేతగా త్వరలో నేను 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంటాను. భారత్లో ప్రజాస్వామ్యం విజయవంతమైందనేందుకు నేనే నిదర్శనం. ఐరాస: ఐక్యరాజ్యసమితి సామర్థ్యాన్ని మరింత మెరుగుపరుచుకోవాలి. వివిధ దేశాలకు ఆలంబనగా ఉండాలనుకుంటే ఐరాస విశ్వసనీయతను పెంచాలి. సరైన సమయంలో సరైన చర్యలు తీసుకోకుంటే విఫలమైనట్లేనన్న చాణక్య సూక్తిని గుర్తు చేసుకోవాలి. కరోనా, వాతావరణ మార్పు తదితర అంశాల్లో ఐరాస ప్రవర్తన గురించి అనేక ప్రశ్నలు తలెత్తాయి. అఫ్గాన్ ఉదంతం ఐరాస తీరుపై ప్రశ్నల్లో వాడిని పెంచాయి. కరోనా పుట్టుక, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాకింగులు, అంతర్జాతీయ సంస్థల పనితీరు వంటివి అనేక సంవత్సరాల ఐరాస కృషిని, ఐరాసపై నమ్మకాన్ని దెబ్బతీశాయి. వీటిని దృష్టిలో ఉంచుకొని ఎప్పటికప్పుడు ఐరాసను అందరం బలోపేతం చేయాలి. అప్పుడే అంతర్జాతీయ చట్టాలు, విలువలకు రక్షణ లభిస్తుంది. కరోనా– టీకా: మహ్మమారిపై పోరు ప్రపంచప్రజలకు ఐకమత్యం విలువను తెలియజేసింది. రెండేళ్లుగా ప్రపంచ మానవాళి జీవితంలో ఒకసారి ఎదురయ్యే యుద్ధాన్ని చేస్తోంది. కలిసిఉండే కలుగు విజయమని ఈ పోరాటం మనకు తెలిపింది. దేశాల మధ్య సంపూర్ణ సహకారంతో కరోనాపై పోరు సలుపుతున్నాం. రికార్డు సమయంలో టీకాను ఉత్పత్తి చేయగలిగాం. సేవే పరమ ధర్మం అనే సూత్రంపై ఆధారపడే భారత్ కరోనా టీకా రూపకల్పనలో తొలినుంచి కీలక పాత్ర పోషించింది. వనరులు పరిమితంగా ఉన్నా సరే సమర్ధవంతంగా వాడుకొని ప్రపంచానికి తొలి డీఎన్ఏ ఆధారిత కరోనా టీకాను అందించింది. కరోనా నాసల్ టీకా అభివృద్ధిలో భారతీయ సైంటిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నారు. మానవత్వాన్ని మర్చిపోని భారత్ మరోమారు టీకాల ఎగుమతిని ఆరంభించింది. ప్రపంచంలో టీకాలు తయారుచేసే ఏ సంస్థయినా భారత్లో ఉత్పత్తి ఆరంభించవచ్చు. అభివృద్ధి: భారత్లో సంస్కరణలు ప్రపంచాభివృద్ధికి మార్గదర్శకాలు. భారత్ వృద్ధి బాటలో పయనిస్తే ప్రపంచం కూడా అదే బాటలో పయనిస్తుంది. అభివృద్ధి ఎప్పుడూ సమ్మిళితంగా అందరికీ అందేదిగా ఉండాలి. పర్యావరణం: విస్తరణ, బహిష్కరణ పోటీల నుంచి సముద్రాలను కాపాడాల్సిన అవసరం ఎంతో ఉంది. సముద్ర వనరులను ఉపయోగించుకోవాలి కానీ దురి్వనియోగం చేయకూడదు. అంతర్జాతీయ వాణిజ్యానికి సముద్రాలే కీలకం. వీటిని కాపాడాలుకోవడం కోసం అంతర్జాతీయ సమాజం ఏకతాటిపైకి రావాలి. నిబంధనల పాటింపు, స్వేచ్ఛాయుత నేవిగేషన్, వివాదాల శాంతియుత పరిష్కారం, ప్రజాస్వామిక విలువలు, రాజ్యాల సార్వ¿ౌమత్వం కోసం అంతా పాటుపడాలి. వాతావరణ మార్పు ప్రభావం భూగోళంపై తీవ్రంగా పడుతోంది. ప్రకృతికి అనుగుణ జీవనం సాగించడమే దీని నివారణకు మార్గం. పారిస్ ఒప్పందానికి అనుగుణంగా భారత్ మాత్రమే తగిన చర్యలు తీసుకుంది. అఫ్గానిస్తాన్: అఫ్గాన్లో సున్నితమైన పరిస్థితులను ఏ దేశం కూడా తమకు అనుకూలంగా మలుచుకోకుండా చూడాలి. ఎవరూ అఫ్గాన్ను స్వీయ అవసరాలకు వాడుకోకుండా నిలువరించాలి. కల్లోల అఫ్గాన్కు అంతా సాయం అందించాలి. ఆదేశంలో మైనారీ్టలకు రక్షణ లభించేందుకు కృషి చేయాలి. ‘‘మంచి పని చేసేందుకు ధైర్యంగా ముందుకు సాగితే మార్గంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ అధిగమించవచ్చు’’ అనే రవీంద్రనాధ్ టాగూర్ వ్యాఖ్యతో ప్రధాని ప్రసంగాన్ని ముగించారు. స్వదేశానికి పయనం ఐరాస సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న అనంతరం ప్రధాని మోదీ శనివారం స్వదేశానికి తిరుగుప్రయాణం అయ్యారు. పర్యటనలో ద్వైపాక్షిక, బహులపక్ష ఒప్పందాలు కుదిరాయన్నారు. 157 కళాఖండాలను అప్పగించిన అమెరికా న్యూఢిల్లీ: భారత్కు చెందిన 157 పురాతన కళాఖండాలను అమెరికా ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అప్పగించింది. ఆయన ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. కళాఖండాలను మోదీ తన వెంట స్వదేశానికి తీసుకురానున్నారు. పురాతన వస్తువుల దొంగతనం, అక్రమ రవాణాను అడ్డుకొనేందుకు కలిసికట్టుగా పనిచేద్దామని, ప్రయత్నాలను బలోపేతం చేద్దామని మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నిర్ణయించుకున్నారు. అమెరికా అప్పటించిన కళాఖండాల్లో 71 భారత ప్రాచీన సంస్కృతికి చెందినవి కాగా, 60 హిందూమతానికి, 16 బౌద్ధమతానికి, 9 జైనమతానికి చెందినవి ఉన్నాయని అధికార వర్గాలు శనివారం ఒక ప్రకటనలో వెల్లడించాయి. భారత్కు చెందిన ఈ అరుదైన కళాఖండాలను తిరిగి అప్పగించిన అమెరికాకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. అక్రమరవాణాదారులు వీటిని గతంలో భారత్లో దొంగిలించి, అంతర్జాతీయ స్మగ్లర్లకు అమ్మేశారు. పలువురి చేతులు మారి చివరకు అమెరికాకు చేరుకున్నాయి. ఇందులో 10వ, 11వ శతాబ్దానికి చెందిన విలువైన లోహ, రాతి విగ్రహాలు సైతం ఉన్నాయి. 1976 నుంచి 2013 వరకూ విదేశాల నుంచి కేవలం 13 కళాఖండాలు భారత్కు చేరుకున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. 2014లో మోదీ అధికారంలోకి వచి్చన తర్వాత వందలాది కళాఖండాలను విదేశాల నుంచి వెనక్కి రప్పించగలిగారని వివరించాయి. -
భూమ్మీద మరో మహా సముద్రం.. ఇది చాలా డిఫరెంట్!
సాక్షి సెంట్రల్ డెస్క్: భూమి ఉపరితలంపై 70% నీళ్లేనని, నాలుగు మహా సముద్రాలు ఉన్నాయని చిన్నప్పుడు బడిలో వల్లెవేసే ఉంటాం. వాటి పేర్లు బట్టీపట్టే ఉంటాం. మరి ఆ నాలుగు మహా సముద్రాలకు తోడుగా ఇప్పుడు ఇంకో మహా సముద్రం వచ్చి కలిసింది తెలుసా? ఆ నాలుగింటికి భిన్నంగా ఉండే ఈ కొత్త మహా సముద్రానికి ఎన్నో ప్రత్యేకతలు, దానితో మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఆ మహా సముద్రం విశేషాలు ఏమిటో తెలుసుకుందామా? ఇప్పటిదాకా ఆ నాలుగే.. మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నట్టు పసిఫిక్, హిందూ, అట్లాంటిక్, ఆర్కిటిక్.. ఈ నాలుగూ మహా సముద్రాలు. ఉత్తర, దక్షిణ అమెరికా ఖండాల మధ్య నిలువుగా ఉండేది అట్లాంటిక్ మహా సముద్రం.. ఆఫ్రికా, ఆసియా, ఆస్ట్రేలియా ఖండాల మధ్య హిందూ మహా సముద్రం.. ఆసియా, ఆస్ట్రేలియాలకు, ఉత్తర, దక్షిణ అమెరికాలకు మధ్య అత్యంత భారీగా ఉండేది పసిఫిక్ మహా సముద్రం.. పైన ఉత్తర ధ్రువం ప్రాంతంలో ఉండేది ఆర్కిటిక్ మహా సముద్రం.. ఇప్పుడు కొత్తగా గుర్తించినది దక్షిణ (సదరన్) మహా సముద్రం. భూమి దక్షిణ ధ్రువ ప్రాంతంలో అంటార్కిటిక్ ఖండానికి చుట్టూ ఆవరించి ఉంది. ప్రపంచ మహా సముద్రాల దినోత్సవం సందర్భంగా ఈ నెల 8వ తేదీనే నేషనల్ జియోగ్రఫిక్ సొసైటీ దీనిని కొత్త మహా సముద్రంగా గుర్తిస్తూ.. మ్యాప్లో చేర్చింది. ప్రపంచవ్యాప్తంగా దీనికి ఆమోదం రావాల్సి ఉంది. ఈ మహా సముద్రం.. చాలా డిఫరెంట్.. నిజానికి వివిధ ఖండాల మధ్య సువిశాల నీటి భాగాలను మహా సముద్రాలుగా గుర్తించారు. ఉత్తర ధ్రువంలోని ఆర్కిటిక్ మహా సముద్రం కూడా భూభాగాల మధ్యనే ఉంటుంది. కానీ దక్షిణ ధ్రువ ప్రాంతంలోని సదరన్ మహా సముద్రానికి మాత్రం సరిహద్దులుగా భూభాగాలు లేవు. చుట్టూ సముద్రాలే సరిహద్దులు. ఇదేగాక మరో ప్రత్యేకత కూడా ఉంది. ఏ మహా సముద్రానికి కూడా మధ్యలో చిన్నా, పెద్ద దీవులు తప్ప ఖండాల వంటి భారీ భూభాగాలు లేవు. కానీ సదరన్ మహా సముద్రానికి మధ్యలో అంటార్కిటిక్ ఖండం ఉంటుంది. కొత్త సముద్రం.. సరిహద్దులు ఎలా? ప్రతి మహా సముద్రాన్ని ఖండాల మధ్య సరిహద్దులతో గుర్తిస్తే.. సదరన్ మహా సముద్రాన్ని దాని చుట్టూ ఉండే భారీ సముద్ర ప్రవాహాం (ఓసియన్ కరెంట్)తో నిర్ధారించారు. అంటార్కిటిక్ ఖండానికి రెండు, మూడు వేల కిలోమీటర్ల దూరంలో చుట్టూ.. పైన ఉపరితలం నుంచి సముద్రం అడుగు వరకు అత్యంత భారీ ప్రవాహం తిరుగుతూ ఉంటుంది. దానిని ‘అంటార్కిటిక్ సర్కమ్పోలార్ కరెంట్ (ఏసీసీ)’అంటారు. పసిఫిక్, హిందూ, అట్లాంటి మహా సముద్రాల నుంచి చిన్న ప్రవాహాలు దీనిలో కలిసిపోతాయి. ఈ భారీ ప్రవాహం నుంచి మధ్యలో పాయలు పాయలుగా చిన్న ప్రవాహాలు ఏర్పడి బయటికి వెళతాయి. ఈ ఏసీసీ మాత్రం కిలోమీటర్ల కొద్దీ వెడల్పుతో.. వేల కిలోమీటర్ల పొడవున తిరుగుతూనే ఉంటుంది. భూమ్మీద వేడి, చలువ సమస్థితికి కారణమిదే.. ఏసీసీ ప్రవాహానికి బయట పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహా సముద్రాల్లో నీళ్లు బాగా ఉప్పగా, కాస్త వేడిగా, తేలికగా ఉంటే.. ప్రవాహానికి లోపల సదరన్ మహా సము ద్రంలో నీళ్లు తక్కువ ఉప్పగా, బాగా చల్లగా, కాస్త మందంగా ఉంటాయి. భూమ్మీద ఎక్కువ ఉపరితలాన్ని ఆక్రమించిన మూడు సముద్రాల నుంచి వేర్వేరు ఉష్ణోగ్రతలు ఉన్న నీళ్లు ఏసీసీ ప్రవాహంలో కలిసిపోతాయి. ప్రవాహంలో సమాన ఉష్ణోగ్రతకు చేరిన నీళ్లు.. మధ్యలో చిన్న పాయలుగా ఈ సముద్రాల్లోనే కలుస్తాయి. దీనివల్ల వేడిగా ఉన్న నీళ్లు చల్లగా, చల్లగా ఉన్న నీళ్లు వేడిగా మారుతూ.. ప్రపంచవ్యాప్తంగా సముద్రాల ఉష్ణోగ్రత స్థిరంగా ఉండటానికి కారణమవుతాయి. దీనిద్వారా మొత్తం భూమి మీద ఉష్ణోగ్రతల్లో స్థిరత్వం ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ ప్రవాహం లేకుంటే.. ప్రమాదమే.. అంటార్కిటిక్ కరెంట్ సముద్రాల్లో స్థిర ఉష్ణోగ్రతలకు తోడ్పటమే కాకుండా.. భూవాతావరణంపై చాలా ప్రభావం చూపుతుందని, అది లేకుంటే చాలా సమస్యలు ఏర్పడుతాయని శాస్త్రవేత్తలు తేల్చారు. ఏసీసీ మిగతా సముద్రాల్లోని వేడి నీళ్లు అం టార్కిటికా ఖండానికి చేరకుండా ఆపు తుంది. అది లేకుంటే వేడి నీళ్లు చేరి అం టార్కిక్ మంచు వేగంగా కరిగిపోతుంది. అంటార్కిక్ ప్రాంతంలోని మంచు, నీటి సాంద్రత ఎక్కువగా ఉండటం వంటివి అక్కడి సముద్రపు లోతుల్లో భారీ స్థాయిలో కార్బన్ నిక్షేపం అవడానికి కారణమయ్యా యి. అలాకాకుండా ఉంటే భూవాతావరణంలో కార్బన్ వాయువుల శాతం పెరిగి.. గ్లోబల్ వార్మింగ్ మరింత పెరుగుతుంది. మంచు కరగడం, గ్లోబల్ వార్మింగ్ పెరిగితే.. వరదలు, తుఫాన్లు, లోతట్టు ప్రాం తాలు మునిగిపోవడం, అధిక ఉష్ణోగ్రతలు వంటి సమస్యలకు కారణమవుతాయి. ‘గుర్తింపు’పై గొడవలెన్నో.. నిజానికి దక్షిణ మహా సముద్రానికి 1937లోనే ఈ గుర్తింపు ఇచ్చారు. కానీ ప్రపంచ దేశాల మధ్య కొన్ని వివాదాలు తలెత్తడంతో 1953లో ఆ హోదా తొలగించారు. కేవలం ఓ సముద్ర భాగంగానే పరిగణించారు. దీనికి ఉన్న ప్రత్యేకతల నేపథ్యంలో మహా సముద్రంగా గుర్తించాలని, ఆ ప్రాంతంలోని జీవజాతుల రక్షణ, ఇతర అంశాలకు అది తోడ్పడుతుందని చాలా కాలంగా శాస్త్రవేత్తలు డిమాండ్ చేస్తున్నారు. అమెరికాకు చెందిన జియోగ్రఫిక్ నేమ్స్ బోర్డ్.. 1999లో దీనికి మహా సముద్రంగా గుర్తింపు ఇచ్చింది. తాజాగా నేషనల్ జియోగ్రఫిక్ సొసైటీ మ్యాప్లలో చేర్చింది. ప్రపంచవ్యాప్తంగా సముద్రాలు, ఇతర జల భాగాలకు గుర్తింపు ఇచ్చే ‘ఇంటర్నేషనల్ హైడ్రోఫోనిక్ ఆర్గనైజేషన్ (ఐహెచ్ఓ)’ఓకే చేయాల్సి ఉంది. చదవండి: చైనాలో మరో విపత్తు! -
14 గంటలు యముడితో పోరాడాడు!
అది పసిఫిక్ మహాసముద్రం. ఆ మహాసముద్రంలో మధ్యలో ఒంటిరిగా ఓ వ్యక్తి. తన ప్రాణాలు రక్షించుకోవడానికి సర్వ శక్తులూ ఒడ్డాడు. నీటిలో ఈదుతూ 14 గంటలు యముడితో పోరాడాడు. తుదకు తానే గెలిచాడు. తన కుటుంబంలో ఆనందం నింపాడు. ఈ సంఘటన ఎలా జరిగిందంటే.. సిల్వర్ సపోర్టర్ అనే ఓడలో విడామ్ పెరివెటిలోవ్ చీఫ్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. ఈ నెల 16న ఆ ఓడ న్యూజిలాండ్లోని టౌరంగా పోర్టు నుంచి పిట్కెయిర్న్ దీవులకు సరుకులతో బయలుదేరింది. ఇంజిన్ రూంలో నైట్ డ్యూటీ విధులు ముగించుకున్న 52 ఏళ్ల విడామ్.. తెల్లవారుజామున తన కొడుకుతో ఫోన్లో మాట్లాడుతూ ఓడ డెక్ పైకి వచ్చాడు. నిద్రవస్తోందని కూడా కుమారుడికి చెప్పాడు. నిద్ర మత్తులో ఉన్న విడామ్ ఆ తర్వాత కొద్ది సేపటికే ఓడపై నుంచి సముద్రంలో పడిపోయాడు. ఇది గమనించని ఓడ సిబ్బంది ముందుకు వెళ్లిపోయారు. నీటిలో పడ్డ విడామ్ పైకి వచ్చి చూసే సరికి ఓడ దూరంగా వెళ్లిపోయింది. ఫిషింగ్ బెలూన్ ఆసరా.. లైఫ్ జాకెట్ లేదు. ఎటు చూసినా నీళ్లు. ఎటు ఈదాలో తెలియదు. నడి సంద్రంలో విడామ్ పరిస్థితి కడు దీనంగా తయారైంది. దూరంగా ఏదో నల్లగా కనబడితే ఆదేదో దీవి అనుకుని అటు ఈదడం మొదలు పెట్టాడు. చాలా సేపు ఈదిన తర్వాత దానికి దగ్గరా వచ్చాడు. అప్పడు తెలిసింది అది దీవి కాదు. చేపల వేటకు ఉపయోగించే రబ్బరు బెలూన్ అని. దాన్నే ఆసరా చేసుకున్నాడు. దాన్ని అంటిపెట్టుకుని తాను మునిగిపోకుండా చూసుకున్నాడు. తాను ఎలాగైనా బతకాలని అనుకుని ఆ బెలూన్తోనే పాటే కొంత సేపు తేలుతూ.. కొంత సేపు ఈదుతూ ఉండిపోయాడు. ఆరు గంటల తర్వాత.. విడామ్ ఓడలో లేని విషయాన్ని ఉదయం పది గంటల తర్వాత సిబ్బంది గుర్తించారు. తెల్లవారుజాము నాలుగు గంటల వరకూ విడామ్ షిప్లోనే ఉన్నట్లు నిర్దారించుకున్న సిబ్బంది.. ఎక్కడ పడిపోయి ఉంటాడో అనే అంచనా వేశారు. 400 నాటికల్ మైళ్ల దూరంలో అతను ఉండి ఉండవచ్చని నిర్దారణకు వచ్చారు. వెంటనే ఓడను వెనక్కు తిప్పారు. ఇంతలో సమీపంలోని ఆస్ట్రల్ దీవుల్లో ఉన్న ఫ్రెంచ్ వారికి సమాచారం ఇవ్వడంతో వారు కూడా విమానంలో వెతుకులాటకు బయలుదేరారు. సాయంత్రం ఆరు గంటల సమయంలో తాము అనుకున్న ప్రాంతానికి షిప్ చేరింది. అప్పటికే సముద్రంలో విడామ్ అలసిపోయాడు. దూరం నుంచి ఓడ కనబడటంతో నీరసించి ఉన్నా.. చేతిని పైకి ఎత్తి పిలిచాడు. దానిని గుర్తించిన ఓడ సిబ్బంది.. విడామ్ వద్దకు చేరుకుని ఓడ పైకి అతన్ని తీసుకొచ్చి ప్రథమ చికిత్స చేశారు. సుమారు 14 గంటల పోరాటం తర్వాత ప్రాణాలతో బయటపడ్డాడు. అతని విల్ పవర్ చూసి ఓడ సిబ్బంది ఆశ్చర్యపోయారు. విడామ్కు జేజేలు పలికారు. నౌక సిబ్బందిని విడామ్ ఓ కోరిక కోరాడు. అదేంటంటే, ఆ బెలూన్ను సముద్రంలోనే వదిలేయమని.. ఎందుకంటే అది మరొకరి జీవితాన్ని రక్షిస్తుందనే ఉద్దేశంతో. ► సముద్రంలో ప్రమాదానికి గురైన తర్వాత ఎక్కువ రోజుల బ్రతికున్న వ్యక్తిగా జపాన్కు చెందిన కెప్టెన్ ఓగురి జుకుచి రికార్డు సాధించారు. 1813లో జపాన్ నుంచి కాలిఫోర్నియాకు బయలుదేరిన ఆయన ఓడ మధ్యలో మునిగిపోయింది. వాటి శకలాలపైనే ఆయన, మరో నావికుడు ఓటోకిచి 484 రోజులు బతికి ఉన్నారు. ► ఎల్సాల్విడార్కు చెందిన అల్వెరెంగా 2012 నవంబర్లో సముద్రంలో వేటకు వెళ్లిన బోటు ప్రమాదం బారిన పడింది. 2014 జనవరి వరకు అతను బతికుండి మార్షల్ ఐలాండ్ తీరానికి చేరుకున్నాడు. ► ఆరోగ్యవంతమైన మనిషి మంచి నీళ్లు తాగకుండా 3 నుంచి 4 రోజులు బతికుండే అవకాశం ఉంది. 5 డిగ్రీలు కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉండే నీటిలో మనిషి 20 నిమిషాల కంటే ఎక్కువ సమయం బతకడం కష్టం. -
‘ఏలియన్స్ ప్రపంచంలా వింతగా ఉంది’
బీజింగ్: చైనా అరుదైన ఘనత సృష్టించింది. ఓ సబ్మెరైన్ని సముద్రం అడుగున పార్క్ చేసింది. ఆ సమయంలో దాని మీద ముగ్గురు శాస్త్రవేత్తలు ఉన్నారు. దాదాపు 10 వేల మీటర్లకు పైగా లోతున అనగా భూమి మీద గల అత్యంత లోతైన సముద్ర కందకం(ఒషియన్ ట్రెంచ్)లోకి మనుషులతో కూడిన సబ్మెరైన్ని పంపిన దృశ్యాలను లైవ్లో ప్రసారం చేసింది. చైనా ఈ విన్యాసాలను పసిఫిక్ సముద్రంలో నిర్వహించింది. ''ఫెండౌజ్ "అనే పిలవబడే సబ్మెరైన్ పసిఫిక్ మహాసముద్రంలోని మరియానా ట్రెంచ్లోకి ముగ్గురు శాస్త్రవేత్తలని తీసుకుని వెళ్లింది. చైనా అధికారిక చానెల్ సీసీటీవీలో ఇది లైవ్ స్ట్రీమ్ అయ్యింది. సబ్మెరైన్కి అమర్చిన డీప్ సీ కెమరా ఆకుపచ్చ-తెలపు వర్ణంలోని ఫెండౌజ్ నల్లని నీటిలో లోతుకు మునిగిపోతూ సముద్రపు అట్టడుగు భాగాన్ని తాకడాన్ని రికార్డు చేసి ప్రసారం చేసింది. ఫెండౌజ్ ఈ విన్యాసాలు చేయడం ఇదే రెండో సారి. ఈ నెల ప్రారంభంలో మొదటి సారిగా 10,909 మీటర్ల లోతుకు వెళ్లి జాతీయ స్థాయిలో రికార్డు సృష్టించింది. (చైనాలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన) (సబ్మెరైన్తో పాటు సముద్రం అట్టడుగు భాగానికి వెళ్లి వచ్చిన శాస్త్రవేత్తలు) ఇక ప్రపంచవ్యాప్తంగా సముద్రంలో అత్యంత లోతుకు వెళ్లిన ఘనత అమెరికన్ సబ్మెరైన్ సాధించింది. ‘అమెరికన్ ఎక్స్ప్లొరర్’ అనే సబ్మెరైన్ 2019లో సముద్రంలో 10,927 మీటర్ల లోతుకు వెళ్లి రికార్డు సృష్టించింది. ఇక సముద్రం అడుగున గల జీవ నమూనాలను రికార్డు చేయడానికి ఫెండౌజ్కి రోబోటిక్ చేతులను అమర్చారు. ఇది తన చుట్టూ ఉన్న వస్తువులను గుర్తించడానికి సోనార్ కళ్లని అమర్చారు. ఇవి ధ్వని తరంగాల సాయంతో పని చేస్తాయి. ఇక ఫెండోజ్ శక్తి సామార్థ్యాలను పరీక్షించడం కోసం పలుమార్లు దాన్ని నీటిలో మునకలు వేయించారు. ఇక సబ్మెరైన్తో పాటు సముద్రంలెరి ప్రయాణించిన శాస్త్రవేత్తలు తన అనుభవాలను వెల్లడించారు. ‘సముద్ర అడుగు భాగం ఏలియన్స్ ప్రపంచంలా.. చాలా వింతగా ఉంది. అక్కడ మనకు తెలియని ఎన్నో జాతులు, జీవుల పంపిణీ ఉంది’ అని తెలిపారు. ఇక తమ పరిశోధనల కోసం కొన్ని నమునాలను తమతో పాటు తీసుకొచ్చామన్నారు. రెండు సార్లు ట్రయల్స్ నిర్వహించిన తర్వాతే ఇది విజయవంతమయ్యిందని చెప్పగలం అని చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ శాస్త్రవేత్త జూ మిన్ తెలిపారు. -
భూ అంతర్భాగంలో భారీ నిర్మాణం
మేరిల్యాండ్: శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూ విశ్వానికి సంబంధించిన పలు రహస్యాలు కనుగొంటున్న విషయం తెలిసిందే. అదే విధంగా భూ అంతర్భాగానికి సంబంధించిన విషయాలు, రహస్యాలను తెలుసుకోవడానికి కూడా నిరంతరం పరిశోధనలు జరుగుతున్నాయి. తాజాగా శాస్త్రవేత్తలు పసిఫిక్ మహాసముద్రం కింద ఉన్న భూమిలో పరిశోధనలు చేసి భూమి లోపల ఉండే మంటిల్ పొర వద్ద ఓ భారీ నిర్మాణాన్ని కనుగొన్నారు. మేరీల్యాండ్ విశ్వవిద్యాలయానికి చెందిన డోయోన్ కిమ్, అతని సహచరులు దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలోని అగ్నిపర్వత మార్క్వాస్ దీవుల కింద ఉన్న భూమిలో ఓ కొత్త నిర్మాణాన్ని కనుగొన్నట్లు తెలిపారు. (జుకర్ బర్గ్ దంపతుల సంచలనం : ట్రంప్కు షాక్) వేల కిలోమిటర్ల అడుగున భూ అంతర్భంగంలోని ఈ నిర్మాణాన్ని కనుగొనడానికి భూకంపాలు సంభవించినప్పుడు వెలువడే తరంగాల డేటాను విశ్లేషించినట్లు వెల్లడించారు. ఈ నిర్మాణాన్ని భూమి లోపల 2900 కిలోమీటర్ల వద్ద గుర్తించామని తెలిపారు. అల్ట్రా లో వెలాసిటీ(యూఎల్వీ)జోన్ అని పిలువబడే ఈ నిర్మాణం 1000 కిలోమీటర్ల వ్యాసం, 25 కిలోమీటర్ల మందంతో ఉన్నట్లు కిమ్ తెలిపారు. భూకంపకాలు సంభవించినప్పుడు వచ్చే తరంగాలు భూమిలో వేల కిలోమీటర్లు ప్రయాణించగలవు. ఈ తరంగాల ప్రతిధ్వనుల సాయంతో భూమి ఉపరితల భౌతిక లక్షణాలతోపాటు భూగర్భంలోని పలు నిర్మాణాలను కనుగొనవచ్చుని పేర్కొన్నారు. దీనికోసం 1990 నుంచి 2018 వరకు పసిఫిక్ మహాసముద్ర తీర ప్రాంతం చూట్టూ సంభవించిన సుమారు 7000 భూకంపాలకు సంబంధించిన తరంగాల రికార్డులను విశ్లేషించినట్లు డోయోన్ కిమ్ తెలిపారు.(వాట్సాప్లో కొత్త ఫీచర్.. మల్టీ లాగిన్) -
‘శవాలు కొట్టుకుపోతున్నా ఏం చేయలేకపోయాం’
వెల్లింగ్టన్: దాదాపు నెలరోజుల పాటు పసిఫిక్ మహా సముద్రంలో కొట్టుమిట్టాడిన నలుగురు వ్యక్తులు సురక్షితంగా బయటపడినట్లు స్థానిక మీడియా తెలిపింది. కార్టెరెట్ ఐలాండ్లో క్రిస్మస్ వేడుకలు జరుపుకొనేందుకు మొత్తం 12 మంది వెళ్లగా అందులో ఎనిమిది మంది మృత్యువాత పడినట్లు బుధవారం పేర్కొంది. వివరాలు... పాపువా న్యూ గినియాలోని బౌగన్విల్లే ప్రావిన్స్కు చెందిన ఓ బృందం డిసెంబరు 22న కార్టెరెట్ ఐలాండ్కు వెళ్లారు. ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న పడవ బోల్తా పడగా.. ఏడుగురు మునిగిపోయారు. ఓ చిన్నపాపతో పాటు మరో నలుగురు బోటును గట్టిగా పట్టుకుని వేలాడుతూ.. అందులోని నీళ్లు తొలగించి.. ప్రాణాలతో బయటపడ్డారు. అయితే సరైన ఆహారం లేకపోవడంతో చిన్నపాప మరణించగా.. ఇద్దరు వ్యక్తులు, ఓ మహిళ, పన్నెండేళ్ల బాలిక మాత్రమే మిగిలారు. ఈ క్రమంలో వీరంతా సముద్ర తీరంలో దొరికిన కొబ్బరికాయలు తింటూ.. వర్షపు నీరు తాగుతూ ప్రాణాలు నిలబెట్టుకున్నారు. ఆఖరికి చేపల వేటకు బయల్దేరిన ఓ సమూహం వీరిని గుర్తించి సాయం అందించడంతో సముద్రం నుంచి బయటపడ్డారు. ఈ విషయం గురించి బాధితుడు డొమినిక్ స్టాలీ మాట్లాడుతూ... ‘‘ఎంతో సంతోషంగా బయల్దేరాం. కానీ మా ప్రయాణం విషాదంగా ముగిసింది. బోటు మునిగిపోయినపుడు మృతదేహాలను ఎలా తీసుకురావాలో.. వాటిని ఏం చేయాలో అర్థం కాలేదు. అందుకే అవి కొట్టుకుపోతున్నా పట్టించుకోలేదు. చనిపోయిన వారిలో ఓ జంట కూడా ఉంది. వారి చిన్నారిని కొన్నాళ్లపాటు రక్షించగలిగాం గానీ తర్వాత తను చనిపోయింది. ఎన్నో పడవలు మమ్మల్ని దాటుకుని వెళ్లాయి. కానీ ఎవరూ మమ్మల్ని గుర్తించలేదు. ఆఖరికి వేటకు వచ్చిన కొంతమంది జనవరి 23న మమ్మల్ని బయటకు తీసుకువచ్చారు. హోనియారాలో మమ్మల్ని డ్రాప్ చేయగా.. సమాచారం అందుకున్న అధికారులు పాపువా న్యూ గినియాకు తీసుకువెళ్లారు. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నాం’’ అని చెప్పుకొచ్చాడు. కాగా గతంలో కూడా ఓ వ్యక్తి ఇలాగే మెక్సికో పశ్చిమ తీరంలో దాదాపు 13 నెలల పాటు చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. పచ్చి చేపలు, పక్షుల మాంసం, తాబేలు రక్తం, తన ద్రవ విసర్జనాలు తాగి ప్రాణాలు నిలుపుకొన్నాడు. తొలుత అతడి గురించి వచ్చిన కథనాలను అందరూ కొట్టిపారేసినా పాలిగ్రాఫ్ పరీక్షలో అతడు చెప్పినవన్నీ నిజాలని తేలాయి. -
ఈసారీ లోటు వర్షపాతమే
న్యూఢిల్లీ: ప్రముఖ ప్రైవేటు వాతావరణ అంచనా సంస్థ స్కైమెట్ భారత రైతులకు చేదు వార్తను తెలిపింది. ఈ ఏడాది సాధారణం కంటే తక్కువస్థాయి వర్షపాతం నమోదవుతుందని స్కైమెట్ అంచనా వేసింది. నైరుతీ రుతుపవనాల ప్రభావంతో జూన్–సెప్టెంబర్ మధ్యకాలంలో దీర్ఘకాలిక సగటు(ఎల్పీఏ)లో 93 శాతం వర్షపాతం మాత్రమే నమోదయ్యే అవకాశముందని వెల్లడించింది. పసిఫిక్ మహాసముద్రంలో జలాలు సాధారణం కంటే అధికంగా వేడెక్కిన నేపథ్యంలో ఎల్నినో ఏర్పడొచ్చనీ, ఇది నైరుతీ రుతుపవనాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొంది. 1951 నుంచి 2000 వరకూ కురిసిన వర్షపాతాన్ని ఎల్పీఏగా వ్యవహరిస్తారు. ఇది 89 సెం.మీగా ఉంది. భారత్లో వ్యవసాయ రంగానికి జీవనాధారమైన నైరుతీ రుతుపవనాలు జూన్ 1న కేరళ తీరాన్ని తాకనున్నాయి. కోస్తాంధ్రలో సాధారణ వర్షమే.. ఒకవేళ ఈ అంచనాలు నిజమైతే వరుసగా రెండో ఏడాది కూడా భారత్లో లోటు వర్షపాతం నమోదైనట్లు అవుతుంది. అదే జరిగితే రుతుపవనాల తొలి అర్ధభాగంలో తూర్పు, మధ్య భారత్లోని రాష్ట్రాల్లో తీవ్రమైన వర్షపాత లోటు నెలకొంటుందని స్కైమెట్ తెలిపింది. అయితే కోస్తా ఆంధ్రా, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని చాలాప్రాంతాల్లో సీజన్ మొత్తం సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని వెల్లడించింది. ఈ విషయమై సంస్థ సీఈవో జతిన్ సింగ్ మాట్లాడుతూ..‘జూన్ నెలలో దీర్ఘకాలిక సగటులో 77 శాతం వర్షపాతం నమోదుకావొచ్చు. అదే జూలైలో కొంచెం పెరిగి 91 శాతానికి చేరుకోవచ్చు. ఇక ఆగస్టులో 102 శాతం, సెప్టెంబర్లో 99 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశముంది’ అని పేర్కొన్నారు. సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు 55 శాతం ఉండగా, సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు 30 శాతం ఉన్నాయనీ, సాధారణం కంటే ఎక్కువ–అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశాలు లేవని తేల్చిచెప్పారు. రుతుపవనాలపై ఎల్నినో ఎఫెక్ట్.. పసిఫిక్ మహాసముద్రంలోని జలాలు ఈసారి సాధారణం కంటే అధికంగా వేడెక్కాయని స్కైమెట్ సంస్థ తెలిపింది. దీని కారణంగా ఎల్నినో ఏర్పడుతుందనీ, ఇది నైరుతీ రుతుపవనాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వెల్లడించింది. ఈ విషయమై స్కైమెట్ అధ్యక్షుడు జి.పి. శర్మ మాట్లాడుతూ..‘మా అంచనాల ప్రకారం మార్చి–మే మధ్యకాలంలో ఎల్నినో ఏర్పడే అవకాశాలు 80 శాతం ఉన్నాయి. జూన్–ఆగస్టు నాటికి ఈ సగటు 60 శాతానికి పడిపోతుంది. మే–జూన్–జూలై కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఎల్నినో ఏర్పడే అవకాశాలు 66 శాతం ఉండగా, స్థిర వాతావరణం కొనసాగే అవకాశం 32 శాతం, లానినా ఏర్పడే అవకాశాలు 2 శాతం ఉన్నాయి. లానినా వల్ల పసిఫిక్లో ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. ఇది నైరుతీ రుతుపవనాలకు మంచిది’ అని పేర్కొన్నారు. హిందూ మహాసముద్రంలోని జలాలు సరైన ఉష్ణోగ్రతతో ఉన్న నేపథ్యంలో ఎల్నినో ప్రభావాన్ని కొంతవరకూ అడ్డుకునే అవకాశముందని అభిప్రాయపడ్డారు. -
దీవి మాయమైంది!
టోక్యో: దీవి మాయమవడం ఏంటని ఏంటని అనుకుంటున్నారా? అవును నిజమే.. తమ దేశానికి చెందిన ఓ చిన్న దీవి కనిపించడం లేదని జపాన్ ఆందోళన చెందుతోంది. ఆ దీవి కొట్టుకుపోయిందా లేక మరేదైనా జరిగిందా అని తెలుసుకోవడానికి సర్వే నిర్వహించాలని భావిస్తోంది. ‘ఇసాంబి హనకిట కోజిమా’ అనే దీవిని 1987లో జపాన్ కోస్ట్గార్డ్ గుర్తించింది. అయితే దాని విస్తీర్ణం మాత్రం కనుక్కోలేకపోతున్నారు. ఈ మధ్య అది సముద్ర మట్టానికి 1.4 మీటర్ల మేర పెరగడంతో జపాన్ ఉత్తర హొకైడో దీవి నుంచి కూడా స్పష్టంగా కనిపించేది. కానీ హఠాత్తుగా ఇప్పుడా దీవి కనిపించడం లేదు. అది కొట్టుకుపోయి ఉండొచ్చని కోస్ట్గార్డ్ అధికారులు చెబుతున్నారు. దీనివల్ల జపాన్ ప్రాదేశిక జలాల విస్తీర్ణం కాస్త తగ్గే అవకాశం ఉంది. కచ్చితమైన సర్వే నిర్వహిస్తేనే అది తెలుస్తుంది. పసిఫిక్ సముద్రంలోని మారుమూలల్లో ఉన్న తమ దీవులను రక్షించుకోవడానికి జపాన్ భారీగా ఖర్చు చేస్తోంది. ఇందులో కొన్ని దీవుల విషయంలో పొరుగు దేశాలైన చైనా, దక్షిణ కొరియాతో వివాదాలూ ఉన్నాయి. భారీ భూకంపాలు, సునామీలు సర్వసాధారణమైన జపాన్ తరచూ కొంత భూభాగాన్ని కోల్పోవడమో, కొత్తగా చేర్చుకోవడమో జరుగుతూనే ఉంది. 2015లో ఇలాగే 300 మీటర్ల భూభాగం సముద్రం నుంచి బయటపడి జపాన్లోని హొకైడో తీరంలో కలిసింది. -
మెక్సికోకు హరికేన్ ‘విల్లా’ ముప్పు
మెక్సికో సిటీ: పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన అత్యంత ప్రమాదకరమైన విల్లా హరికేన్ మెక్సికో వైపుగా ప్రయాణిస్తోంది. క్రమంగా శక్తిని పుంజుకుంటున్న విల్లా.. సోమవారం నాటికి(స్థానిక కాలమానం ప్రకారం) కేటగిరి–5 హరికేన్గా రూపాంతరం చెందే అవకాశముందని అమెరికా జాతీయ హరికేన్ కేంద్రం తెలిపింది. విల్లా హరికేన్ ప్రభావంతో మెక్సికో తీరంలో ఇప్పటికే గంటకు 249 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయని వెల్లడించింది. మెక్సికోలొని కబోకోరియంటెస్ నగరానికి నైరుతి దిశలో 315 కి.మీ దూరంలో విల్లా హరికేన్ కేంద్రీకృతమై ఉందంది. ఈ హరికేన్ మెక్సికో పశ్చిమ తీరంపై పెను ప్రభావం చూపనుంది. దీని ప్రభావంతో మెక్సికోలోని పలు ప్రాంతాల్లో 30 నుంచి 46 సెం.మీ మేర వర్షం కురవనుంది. -
నడిసముద్రంలో 49 రోజులు
జకార్తా: సముద్రం మధ్యలో చెక్క ఇంట్లో పనిచేస్తున్న టీనేజీ పిల్లాడు అడిలాంగ్ చెక్కఇంటితోసహా సముద్రంలోకి అలలధాటికి 2,500 కిలోమీటర్ల దూరం కొట్టుకుపోయాడు. పసిఫిక్ మహాసముద్రంలో ఎట్టకేలకు 49 రోజుల తర్వాత ఆ పిల్లాడిని రక్షించగలిగారు. ఇండోనేసియాలోని సులవెసి ద్వీపం దగ్గర్లో జరిగిందీ ఘటన. ఒక్కడే నడిసముద్రంలో 49 రోజులున్న అడిలాంగ్ ఆకలితీర్చుకునేందుకు చేపలు వేటాడి తిన్నాడు. దాహమేస్తే సముద్రపునీటిలో బట్టలు తడిపి పిండి తాగేవాడు. అటుగా వెళ్తున్న పనామా దేశానికి చెందిన ఓ పడవ బృందం ఇతడిని కాపాడింది. ఇన్ని రోజులైనా పిల్లాడు ఆరోగ్యంగానే ఉండటం విశేషం. సముద్రంలో చేపలను వెలుతురుతో ఆకర్షించేందుకు నీటిలో తేలియాడే ఇళ్లను నిర్మిస్తారు. సముద్రం అడుగుభాగంలో వేసిన లంగరు ఆధారంగా ఇల్లు నీటిపై ఒకేచోట ఉంటుంది. వెలుతురు నిరంతరంగా ఉండే బాధ్యత యజమాని ఈ పిల్లాడికి అప్పజెప్పాడు. -
9 ఏళ్ల తర్వాత తిరిగొచ్చిన ‘దెయ్యం ఓడ’
థోంగ్వా(మయన్మార్): కొన్ని సంఘటనల వెనుక మర్మమేమిటో ఎంత ఆలోచించినా అంతుపట్టదు. వాటికి సమాధానం తెలుసుకోవాలన్నా దొరకదు. తాజాగా అలాంటి సంఘటనే మరొకటి చోటుచేసుకుంది. తొమ్మిదేళ్ల క్రితం పసిఫిక్ మహాసముద్రంలో అదృశ్యమైన ఓ భారీ నౌక.. గతవారం హిందూ మహాసముద్రంలో కన్పించడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ‘దెయ్యం ఓడ’గా పిలుచుకుంటున్న సామ్ రత్లుంగి పీబీ 1600 అనే నౌక వేల టన్నుల సరుకులతో ఇండోనేషియా జెండాతో బయలుదేరింది. ఈ నౌక చివరిసారిగా 2009లో తైవాన్ సముద్ర జలాల్లో కనిపించింది. తర్వాత అది కనిపించకుండా పోయింది. పలు దేశాలకు చెందిన అధికారులు ఎంత గాలింపు చేపట్టిన షిప్ జాడ కనిపెట్టలేకపోయారు. ఎంత వెతికినా నౌక ఆచూకీ లభ్యం కాకపోవడంతో అది పసిఫిక్ మహాసముద్రంలో ఎక్కడో మునిగిపోయి ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ తీరా ఇటీవల ఆగస్టు 30వ తేదీన ఆ నౌకను మయన్మార్ తీరానికి 11 కిలోమీటర్ల దూరంలో ఆ దేశ మత్స్యకారులు గుర్తించారు. అందులోకి వెళ్లి చూడగా అందులో ఎవరూ కనబడలేదు. అందులో ఎటువంటి సరకులు కూడా లేవు. దీంతో వారు తీరప్రాంత పోలీసులకు సమాచారం అందజేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు కూడా దానిని పరిశీలించారు. అయిన కూడా ఆ నౌక ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోలేకపోయారు. 9 ఏళ్ల తరువాత నౌక వెలుగులోకి రావడంపై రకరకాలు కథనాలు వినిపిస్తున్నప్పటికీ.. ఆ నౌక ఇంతకాలం ఎక్కడ ఉంది, అందులోని సరుకులు, సిబ్బంది ఎమయ్యారు అనే ప్రశ్నలు సమాధానాలు లేనివిగానే మిగిలాయి. కాగా, 177.35 మీటర్ల పొడవు, 27.91 మీటర్ల వెడల్పుతో 2001లో ఈ ఓడను నిర్మించారు. -
భారత్ కోసం అమెరికా చరిత్రాత్మక నిర్ణయం
వాషింగ్టన్, అమెరికా : భారత్ అన్ని రంగాల్లో ప్రపంచ దేశాలతో పోటీ పడుతోంది. రక్షణ రంగంలో కూడా భారత్ పటిష్టమవుతోంది. తాజాగా పసిఫిక్ మహా సముద్రంలో భారత్కు పెరుగుతున్న ప్రాముఖ్యతను అమెరికా గుర్తించింది. అమెరికా ఆధ్వర్యంలో పసిఫిక్ సముద్రంలో ఉన్న ‘పసిఫిక్ కమాండ్’ పేరును ‘యూఎస్-ఇండో కమాండ్’ గా మారుస్తున్నట్లు అమెరికా అధికారులు బుధవారం వెల్లడించారు. పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలో భారత్కు అమెరికా ఇస్తున్నప్రాముఖ్యతకు ఈ పేరు దోహదం చేస్తుందని పెంటగాన్ అధికారులు తెలిపారు. "పసిఫిక్, హిందూ మహాసముద్ర ప్రాంతాల్లో భాగస్వామ్య దేశాలతో మరింత బలమైన బంధాన్ని కోరుకుంటున్నాం. ఈ పరిధిలోని దేశాల్లో మరింత స్థిరత్వం కోసం ఈ పేరు మార్పు దోహదపడుతుంది" అని అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి జిమ్ మాటిస్ వెల్లడించారు. భారత్కు, పసిఫిక్ మహా సముద్రానికి కనెక్టివిటీ పెరుగుతున్న తరుణంలో తాము పేరు మార్పు నిర్ణయం తీసుకున్నట్టు ఆయన వెల్లడించారు. అత్యాధునిక విమాన వాహక నౌకలతో పాటు, యుద్ధ నౌకలు కలిగి ఉన్న3.75 లక్షల సైనిక బృందం, గ్రేటర్ పసిఫిక్ సముద్ర ప్రాంతంలో నిఘా కాస్తోంది. ఈ కమాండ్కు ఇప్పటివరకూ అడ్మిరల్ హ్యారీ హారిస్ నేతృత్వం వహించారు. ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హ్యారీ హారిస్ దక్షిణ కొరియా రాయాబారిగా నియమించారు. దీంతో అడ్మిరల్ ఫిలిప్ డేవిడ్ సన్ ఆ కమాండ్కు బాధ్యతలు వహించనున్నారు. -
తేలియాడే దేశం..!
ఇప్పటి వరకు నీటిపై తేలియాడే ఇళ్లు చూశాం.. హోటళ్లు చూశాం.. చిన్న చిన్న విల్లాలను కూడా చూశాం కానీ.. ఇప్పుడు ఏకంగా నీటిపై తేలియాడే దేశాన్నే చూడబోతున్నాం. ఎక్కడంటే పసిఫిక్ మహాసముద్రంలో 2022 నాటికి నిజం కానుంది. దేశం ఏంటి తయారు చేయడం ఏంటని అవాక్కవుతున్నారా..? అమెరికాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, పేపాల్ కంపెనీ యజమాని పీటర్ థీల్ ఈ ప్రాజెక్టును చేపడుతున్నారు. తొలుత ఈ దేశంలో 300 ఇళ్లను పాలినేసియా దేశం సాయంతో నిర్మించనున్నారు. ఈ దేశానికి ‘వేరియాన్’ అనే సొంత క్రిప్టోకరెన్సీని కూడా ఏర్పాటు చేసుకోనున్నారు. పైగా ఈ దేశానికి సరిహద్దు సమస్యలు, ప్రపంచ వాణిజ్య సమస్యలు ఉండబోవని రాజకీయ విశ్లేషకుడు నథాలీ మెజా గార్సియా పేర్కొన్నారు. భవిష్యత్తులో వాతావరణ మార్పుల కారణంగా నివాసాలు కోల్పోయే శరణార్థులకు ఆశ్రయం కల్పించొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు కోసం దాదాపు రూ.300 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇక్కడ నిర్మించబోయే ప్రతి ఇల్లు కూడా పర్యావరణ హితంగా, వెదురు చెట్ల కర్రలతో నిర్మిస్తారని చెబుతున్నారు. చూద్దాం ఈ తేలియాడే దేశం కాన్సెప్ట్ సక్సెస్ అవుతుందో లేదో..! -
ఏంటా డెవిల్..?
మెక్సికో గల్ఫ్ : సముద్రలోతుల్లో పరిశోధనలు సాగిస్తున్న ఎన్ఓఏఏ ఒకియనోస్ ఎక్స్ప్లోరర్ సంస్థ పరిశోధకులకు ఒక విచిత్ర జీవి ఎదురైంది. వేల అడుగుల లోతుకి వెళ్లి అధ్యాయనం చేస్తున్న వారికి అచ్చూ డెవిల్ ఫిష్లాంటి జీవి మరొకటి కనిపించి ఆశ్చర్యపర్చింది. మెక్సికో తీరంలో ఓ స్క్విడ్ ఎరుపు రంగులో డెవిల్ ఫిష్లా కనిపించడంతో పరిశోధకులు విస్తుపోయారు. దాన్ని కొందరు దెయ్యపు చేపగా పిలువగా పరిశోధకులు మాత్రం ఇప్పటివరకూ ఎలాంటి పేరు పెట్టలేదు. మెక్సికో పసిఫిక్ తీరం జీవ వైవిధ్యానికి పెట్టింది పేరు. పగడపు దీవులు మొదలు, స్పంజికలు, ఊహలకు అందని లోతైన లోయలు, అగ్నిపర్వతాలు ఇక్కడ ఉన్నాయి. -
పసిఫిక్లో కూలిన స్కైలాబ్
బీజింగ్: చైనాకు చెందిన అంతరిక్ష ప్రయోగ కేంద్రం టియాంగంగ్–1 పసిఫిక్ మహా సముద్రంలో కూలిపోయింది. సోమవారం ఉదయం 5.45 గంటలకు (భారత కాలమానం) టియాంగంగ్–1 దక్షిణ పసిఫిక్ మహా సముద్రంలో కూలినట్లు చైనా అధికారులు వెల్లడించారు. టియాంగంగ్ వల్ల ఎక్కడా, ఎవ్వరికీ హాని జరగలేదనీ, భూ వాతావరణంలోకి ప్రవేశించిన వెంటనే వేడికి దాదాపుగా దగ్ధమైపోయినట్లు చైనాలోని మ్యాన్డ్ స్పేస్ ఇంజనీరింగ్ ఆఫీస్ తెలిపింది. సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించాలన్న ఆలోచనలో భాగంగా చైనా టియాంగంగ్–1ను 2011 సెప్టెంబరులో అంతరిక్షంలోకి పంపింది. దీని జీవితకాలం రెండేళ్లు ఉండేలా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. మొత్తం ఆరుగురు వ్యోమగాములు (ఇద్దరు స్త్రీలు, నలుగురు పురుషులు) అంతరిక్షంలో టియాంగంగ్లో పనిచేశారు. 2013 కల్లా ఇది తన ప్రధాన పనులను పూర్తి చేసినప్పటికీ టియాంగంగ్ సేవలను చైనా పొడిగించుకుంటూ వెళ్లింది. అయితే 2016లో ఇది పూర్తిగా పనిచేయడం మానేసి, నియంత్రణను కోల్పోయి కక్ష్య నుంచి పక్కకు జరగడం ప్రారంభించింది. చివరకు సోమవారం మళ్లీ భూ వాతావరణంలోకి ప్రవేశించి సముద్రంలో కూలిపోయింది. ‘మా దగ్గర ఉన్న సమాచారం మేరకు టియాంగంగ్ కూలడం వల్ల భూమిపై ఎక్కడా ఎలాంటి హానీ జరగలేదు. 8 టన్నుల బరువు, 10.4 మీటర్ల పొడవున్న టియాంగంగ్ ఆకాశంలోనే చాలా వరకు కాలిపోయింది. అది చైనా చరిత్రలో నిలిచిపోతుంది. అంతరిక్ష కేంద్రంలో పరిశోధనల గురించి ఇది మాకు ఎంతో జ్ఞానాన్ని ఇచ్చింది’ అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జెన్ షువాంగ్ చెప్పారు. -
తప్పిన ముప్పు.. కూలిన చైనా స్కైలాబ్..!
బీజింగ్: ప్రస్తుతం నిరుపయోగంగా మారిన చైనా అంతరిక్ష ప్రయోగ కేంద్రం పసిఫిక్ మహాసముద్రంలో కూలిపోయింది. టియాంగంగ్-1 (స్వర్గ సౌధం) అనే అంతరిక్ష కేంద్రం ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత 12.15 గంటలకు (భారత కాలమానం ప్రకారం) భూ వాతావరణంలోకి ప్రవేశించిందని, భూవాతావరణంలోకి రావడంతోనే దగ్ధమైన అది దక్షిణ పసిఫిక్ సముద్రంలో కూలిపోయిందని చైనా అంతరిక్ష సంస్థ పేర్కొన్నట్టు ఆ దేశ వార్తాసంస్థ జిన్హువా తెలిపింది. అమెరికా సైన్యం కూడా ఈ వార్తను ధ్రువీకరించింది. దక్షిణ పసిఫిక్ సముద్రంలో ఇది కూలిపోయిందని తెలిపింది. టియాంగంగ్-1 స్పేస్ స్టేషన్ను చైనా 2011లో ప్రయోగించింది. దీని జీవితకాలం రెండేళ్లు ఉండేలా అప్పట్లో రూపొందించారు. 2013 జూన్ కల్లా ఇది తన ప్రధాన పనులను పూర్తి చేసింది. 2016లో పనిచేయడం మానేసి కొద్దికొద్దిగా కక్ష్య నుంచి పక్కకు జరుగుతూ వస్తోంది. ‘టియాంగంగ్–1 అంతరిక్ష కేంద్రం భూమివైపుకు వస్తోంది. ఆదివారం మధ్యాహ్నానికి అది భూవాతావరణానికి 179 కి.మీ. దూరంలో ఉంది’ అని చైనా మ్యాన్డ్ స్పేస్ ఏజెన్సీ ప్రకటించడంతో ఇది భూవాతావరణంలోకి దూసుకొస్తున్న విషయంలో వెలుగులోకి వచ్చింది. అయితే టియాంగంగ్-1 భూమిపై ఏ సమయంలో, ఎక్కడ పడుతుందనే కచ్చితమైన వివరాలను ఏజెన్సీ వెల్లడించకపోవడంతో కొంత ఉత్కంఠ నెలకొంది. 8 టన్నుల బరువు, 10.4 మీటర్ల పొడవుండే టియాంగంగ్ స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్, పోర్చుగల్, గ్రీస్ తదితర దేశాల్లో పడిపోయే అవకాశం ఉందని, లేదా న్యూజిలాండ్, టాస్మానియా, అమెరికాల్లోనూ కూలొచ్చని ఊహాగానాలు వెలువడ్డాయి. అంతరిక్ష కేంద్రం కూలిపోయినా భూమిపై జరిగే నష్టం పెద్దగా ఉండబోదనీ, ఎవ్వరూ భయపడాల్సిన పని లేదని చైనా అధికారులు భరోసా ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇది సముద్రంలో కూలిపోవడంతో అంతరిక్ష శాస్త్రవేత్తలు ఊపిరి పీల్చుకున్నాయి. -
సీషెల్స్లో ఆర్మీ కేంద్రం ఏర్పాటుపై కదలిక
విక్టోరియా: పసిఫిక్ మహాసముద్రంలోని సీషెల్స్ దీవిలో మిలటరీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్న భారత్ ప్రతిపాదన పట్ల అక్కడి రాజకీయ నాయకులు సానుకూలంగా స్పందించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ 2015లో సీషెల్స్లో పర్యటించిన సమయంలో ఈ ప్రతిపాదన చేశారు. కేంద్రానికి నిధులు భారత ప్రభుత్వమే సమకూరుస్తుందని.. రెండు దేశాలు వినియోగించుకోవచ్చని ప్రతిపాదించారు. తీరప్రాంత రక్షణ, అక్రమంగా చేపలు పట్టడం, మత్తుపదార్థాల రవాణా, పైరసీ వంటి వాటిని సమర్థవంతంగా ఎదుర్కొవటంలో ఈ కేంద్రం ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. -
హమ్మయ్యా.. ఆ 22మంది భారతీయులు సేఫ్
సాక్షి, న్యూఢిల్లీ : సముద్రపు దొంగల చెర నుంచి 22 మంది భారతీయులు విడుదలయ్యారు. దీంతో ఆ భారత సెయిలర్ల కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఓడలో ఐదు రోజుల చెర అనంతరం దొంగలు వీరిని విడిచి పెట్టినట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ మలిని శంకర్ మంగళవారం వెల్లడించారు. ప్రస్తుతం ఓడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణం కొనసాగిస్తున్నట్లు సమాచారం. రూ. 52 కోట్లు విలువైన గ్యాసోలిన్ను రవాణా చేస్తున్న భారతీయ ఓడ గత ఐదు రోజులుగా ఆచూకీ లేకుండా పోయిన విషయం తెలిసిందే. వాయవ్య ఆఫ్రికా తీరంలోని బెనిన్ ఓడరేవు నుంచి బయల్దేరిన ఎంటీ మెరైన్ ఎక్స్ప్రెస్ బెనిన్లోని గినియా తీరంలో హైజాక్ అయింది. ఈ ఓడలో 22 మంది భారత సిబ్బంది ఉన్నారు. వారి నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో గ్యాసోలిన్ను చోరి చేసేందుకే షిప్ను హైజాక్ చేసివుంటారని అధికారులు భావించారు. ఆచూకీ లేకుండా పోయిన ఓడ కోసం నైజీరియా, బెనిన్ దేశాల సాయంతో భారత్ గాలింపు చర్యలు చేపట్టగా చివరికి సముద్రపు దొంగలు ఓడ సిబ్బందిని విడిచిపెట్టారు. కాగా, గత నెలలో ఇదే ప్రాంతంలో ఓ భారతీయ నౌక హైజాక్కు గురైంది. ఏమైనా భారీ మొత్తంలో నగదు చెల్లించిన తర్వాత బంధీలను దొంగల ముఠా విడిచిపెట్టి ఉండొచ్చునని ప్రచారం జరుగుతోంది. -
భారతీయ ఓడ హైజాక్..!
సాక్షి, ముంబై : రూ. 52 కోట్లు విలువైన గ్యాసోలిన్ను రవాణా చేస్తున్న భారతీయ నౌక రెండు రోజులుగా ఆచూకీ లేకుండా పోయింది. ఈ నౌకలో 22 మంది సైలర్లు ఉన్నారు. పశ్చిమ ఆఫ్రికా తీరంలోని బెనిన్ ఓడరేవు నుంచి బయల్దేరిన ఎంటీ మెరైన్ ఎక్స్ప్రెస్ నుంచి 48 గంటలుగా ఎలాంటి సమాచారం లేదు. దీంతో ఓడ హైజాక్కు గురై ఉంటుందని అనుమానిస్తున్నారు. గత నెలలో ఇదే ప్రాంతంలో ఓ భారతీయ నౌక హైజాక్కు గురైంది. గ్యాసోలిన్ను చోరి చేసేందుకే షిప్ను హైజాక్ చేసివుంటారని అధికారులు భావిస్తున్నారు. కాగా, ఆచూకీ లేకుండా పోయిన నౌక కోసం నైజీరియా, బెనిన్ దేశాల సాయంతో భారత్ గాలింపు చర్యలు చేపట్టింది. -
ఈ నెల 31 అంతరిక్షంలో వింత
న్యూఢిల్లీ : ఈ నెల 31 విశ్వంలో అద్భుతం జరగనుంది. చరిత్రలో అత్యంత అరుదైన బ్లూమూన్ సంపూర్ణ చంద్రగ్రహణం చీకట్లో కనువిందు చేయనుంది. ఈ అంతరిక్ష వింతను మధ్య ఆసియా, ఇండోనేషియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఐరోపా, అలాస్కా, కెనడా, సెంట్రల్ అమెరికా ప్రాంత ప్రజలు వీక్షించవచ్చు. సంపూర్ణ గ్రహణ సమయంలో చంద్రుడు పసిఫిక్ మహాసముద్రం మీద ప్రయాణిస్తుంటాడని సైంటిస్టులు చెబుతున్నారు. సాధారణంగా నెలలో రెండోసారి కనిపించే నిండు చంద్రుడు సంపూర్ణ గ్రహణానికి గురవడాన్ని బ్లూమూన్ అని పిలుస్తారు. ఇటువంటి అపూర్వ ఘటన 150 ఏళ్ల కిందట ఒకసారి ఆవిష్కృతమైంది. మళ్లీ ఇన్నేళ్లకు 2018 జనవరి 31న అంతరిక్షంలో బ్లూమూన్ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ అరుదైన చంద్రగ్రహణం.. మొత్తం 77 నిమిషాలపాటు కనువిందు చేయనుంది. ఈ సమయంలో చంద్రడిపై పడే భూమి దక్షిణ భాగపు నీడను స్పష్టంగా వీక్షించవచ్చు. -
సాహస మథనం
దారి తప్పిన పడవలో ఇద్దరు స్త్రీల 150 రోజుల పోరాటం సాగరాన్ని మథనం చేసినప్పుడు అమృతం పుడుతుంది. సాగరం మనిషిని మథనం చేసినప్పుడు సాహసం పుడుతుంది. 48 ఏళ్ల వయసొస్తే మన దేశంలో స్త్రీలు ఏం చేస్తారు? రిటైర్ అయ్యామని భావిస్తారు. కూతుళ్ల ప్రసవాలకు సాయం చేయడానికి సిద్ధమవుతారు. మనవలు, మనవరాళ్లతో గడపాలని అనుకుంటారు. సరిగ్గా చెప్పాలంటే జీవితం దాదాపుగా ఒక కొలిక్కి వచ్చింది... ఇంకా ఏం చేయాలి అని నిర్లిప్త పడతారు. కాని జెన్నిఫర్ ఆపెల్, తాషా ఫుఆవా అనే 48 ఏళ్ల స్త్రీలు మాత్రం అలా అనుకోలేదు. జీవితం ఇప్పుడే మొదలైంది అనుకున్నారు. సాహసం లేని జీవితం నిస్సారమైనదని, పిప్పి కంటే హీనమైనదవి భావించారు. సముద్రాన్ని సవాల్ చేసి జీవితం అంటే థ్రిల్ అని నిరూపిద్దామని అనుకున్నారు. కాని వాళ్లు ఒకటి అనుకుంటే సముద్రం ఒకటి చూపించింది. అయినా ధైర్యానిదే అంతిమ గెలుపు అని నిరూపితం అయ్యింది. ఒహావు నుంచి తహతి వరకు పసిఫిక్ సముద్రం లోతెంతో తెలుసా? 4000 మీటర్ల నుంచి 10 వేల మీటర్లు. మహా మహా ఓడలను, సముద్ర దిగ్గజాలను గడగడలాడించిన మహా సముద్రం అది. అలాంటి సముద్రంలో ఉన్న హవాయి దీవుల్లోని ‘ఒహావు’ దీవి నుంచి ‘తహతి’ దీవి వరకు అంటే 2,700 మైళ్ల దూరాన్ని ఒక పడవలో ప్రయాణించాలని అనుకున్నారు ఇద్దరు మహిళా నావికులు జెన్నిఫర్, తాషా. ఇద్దరికీ సముద్ర యానంలో అనుభవం ఉంది. ఆపెల్కు యాభై అడుగుల పొడవున్న మర పడవ ఉంది. ఆ పడవలో దాదాపు 18 రోజులు ప్రయాణించి ఒహావు నుంచి తహతికి చేరుకోవాలని పసిఫిక్లోని సుందర దీవులను చూస్తూ వెళ్లాలని వీరి ఆలోచన. నిజానికి ఇలాంటి ప్రయాణాలు ఓడల్లో చేయాలి. పడవలు పనికి రావు. వచ్చినా ప్రమాదాలు ఎక్కువ. అయినా సరే జెన్నిఫర్, తాషా ఈ ప్రయాణానికి సిద్ధమయ్యారు. మే 3, 2017న మొదలు అవును. ఆ తేదీనే వాళ్ల ప్రయాణం ఒహావు నుంచి మొదలైంది. ఒక పడవ, ఇద్దరు స్త్రీలు, తోడుగా రెండు పెంపుడు శునకాలు. వాటి పేర్లు ‘జీయస్’, ‘వాలెంటైన్’. ప్రయాణం మొదలైంది. పది పదిహేను రోజులు బాగానే సాగింది. కాని హటాత్తుగా పడవలోని ఇంజన్ సరిగ్గా పని చేయడం మొరాయించింది. అనుకున్న విధంగా ముందుకు పోవడం లేదు. ఏం చేయాలో తోచడం లేదు. మే 30న సముద్ర తుఫాను పడవను ముంచెత్తింది. దాంతో పడవలో ఉన్న కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బ తింది. పడవ పూర్తిగా మనం కోరిన దిశలో ప్రయాణించడానికి పనికి రాకుండా పోయింది. చుట్టూ 16 కోట్ల చదరపు కిలోమీటర్ల మహా పసిఫిక్ సముద్రం. మధ్యలో ఎక్కడో చీమ కంటే సూక్ష్మంగా ఒక యాభై అడుగుల పడవ. ఏం చేయాలి? తమ దగ్గర ఉన్న ఫోన్ల నుంచి ప్రమాదాన్ని సూచించే కాల్స్ చేయడం మొదలుపెట్టారు. కాని వేటికీ సమాధానం లేదు. ఆ కాల్స్ ఎవరికీ అందడం లేదు. చీకటి అవుతూ ఉంది. తెల్లవారుతూ ఉంది. శునకాలు తమ యజమానురాళ్లకు వచ్చిన కష్టాన్ని గ్రహించాయి. అవసరానికి మించిన ఉత్సాహం ప్రదర్శిస్తూ వాళ్లను ఉత్సాహపరుస్తున్నాయి. పడవలో పులుల్లా అటూ ఇటూ తిరుగుతున్నాయి. వాటి ఉనికి తప్ప ఆ ఇద్దరు స్త్రీలకు చుట్టూ ఏ ఉనికీ లేదు. పలకరించే జీవి లేదు. స్పందించే నాధుడు లేడు. పెద్దల మాట సద్దిమూట హవాయి దీవుల్లో కాకలు తీరిన నావికులు ఎందరో ఉన్నారు. తమ ప్రయాణాన్ని మొదలెట్టే ముందు ఆపెల్, తాషాలు వారిని సలహాల కోసం కలిసినప్పుడు ‘పసిఫిక్తో గేమ్సా’ అన్నట్టు చూశారు. కాని వీళ్ల పట్టుదల చూసి ఒక ముఖ్యమైన సలహా ఇచ్చారు. ‘పడవను అంగుళం కూడా ఖాళీగా ఉంచొద్దు. మీ యాత్ర నెల రోజులకు ఉద్దేశించినదైతే సంవత్సరానికి సరిపడా ఆహారం సిద్ధం చేసుకోండి. మీరెళుతున్నది పసిఫిక్ మీద. ఇవాళ బయల్దేరితే రేపేం జరుగుతుందో ఊహించలేము’ అన్నారు. అందుకు తగ్గట్టుగానే ఆపెల్, తాషాలు ఆహారాన్ని పడవలో నింపేశారు. ఆ ఒక్క విలువైన సలహానే వాళ్ల ప్రాణాలు నిలబెడుతున్నాయి. అదొక్కటే కాక తాషా పడవలో వాటర్ ప్యూరిఫైర్లను ముందు జాగ్రత్తతో ఏర్పాటు చేసింది. అందువల్ల నీటి సమస్య ఏర్పడలేదు. ప్రాణాలు ఉన్నాయి. ఊపిరి కొట్టుకుంటోంది. రోజులు గడుస్తున్నాయి. డిప్రెషన్. హెలూసినేషన్స్. మే మొదటి వారం మొదలెట్టిన ప్రయాణం జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ముగిసి అక్టోబర్కు చేరుకుంది. పడవ దాని మానాన అది ఎటో కొట్టుకుపోతోంది. అది పోయి పోయి ఏదో ఒక నేలకు చేరుకుంటుందని ఆపెల్, తాషాల ఆలోచన. కాని ఎంతకీ నేల తగలదే. ఆశ, నిరాశల మధ్య ఆపెల్, తాషాలు తమ దగ్గర ఉన్న మొత్తం పది తారా జువ్వలను కూడా దూరంగా షిప్ కనిపించినప్పుడల్లా కాల్చి అదృష్టం పరీక్షించుకున్నారు. కాని లాభం లేకపోయింది. షిప్, వెస్సెల్ కనిపించిన ప్రతిసారీ ఆశపడటం అవి తమ మానాన తాము వెళ్లిపోవడం... అంతులేని దుఃఖం... కూడగట్టుకోవాల్సిన నమ్మకం... ఈలోపు అనుకోని చుట్టాలొచ్చారు. టైగర్ షార్క్స్. రెండుసార్లు అవి పడవను చుట్టుముట్టాయి మనిషి వాసనకు. కాని కుక్కలు తమ మొరుగుళ్లతో వాటిని బెదరగొట్టగలిగాయి. లేకుంటే వాటి పంటి మధ్య ఆపెల్, తాషాలు ఉప్పు నీటిని సంతరించుకుని రుచిగా ఆహారం అయి ఉండేవి. ఆక్టోబర్ 24, వెలుతురు అప్పటికి దాదాపు 150 రోజులు సమీపించాయి. ఆహారం దాదాపు ముగియ సాగింది. లేదంటే పాడైపోవడం మొదలెట్టింది. కుక్కల ఆహారం అయితే ఇక లేనట్టే. మాట ఇద్దరూ మాట్లాడే ఓపికను కోల్పోయారు. ఇక ఇవాళో రేపో చచ్చిపోతామని వారికి అర్థమైపోయింది. ఆ లోపు దూరంగా ఒక చేపల పడవ. తైవాన్ వారిది. అంటే తాము ఇప్పుడు ఎక్కడ ఉన్నట్టు? జపాన్కి ఈశాన్యంగా 900 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. తైవాన్ పడవ కూడా వీళ్లను చూడకుండా వెళ్లిపోయేదే. ఆపెల్ తెగించి సముద్రంలో దూకి ఓడ వైపు ఈత కొట్టసాగింది. అప్పటికి గాని పడవ వాళ్లు ఆపెల్ని చూడలేదు. వెంటనే వాళ్లు అక్కడకు దగ్గరగా ఉన్న అమెరికా నావీ బేస్కు సమాచారం అందించారు. అమెరికా రక్షణ ఓడ ఆఘమేఘాల మీదకు చేరుకుని ఆపెల్ను, తాషాను వారి రెండు శునకాలను రక్షించారు. ఓడలోకి చేరుకున్నాక వాళ్లు రెండు ధారలను తనివితీరా తాగారు. ఒకటి: ఆనందంతో పొంగుతున్న అశ్రుధార, రెండు: పడవ సిబ్బంది అందించిన నీటి ధార. మళ్లీ సాహసానికే ఆపెల్, తాషా తమ పడవను నడి సముద్రంలో వదిలేశారు. అది ఎప్పటికైనా ఏదో ఒక ఒడ్డుకు చేరుకుని తమకు దక్కుతుందని ఆశ. లేకపోయినా పర్వాలేదు. కొత్త పడవను సిద్ధం చేసుకొని వచ్చే వేసవిలో మళ్లీ సముద్రం మీద పడాలని వారి ఆలోచన. ఇంత జరిగాక? అవును ఇంత జరిగాక. ఊరికే కూర్చున్నా ఎదురుపడి వెళుతున్నా జీవితం తాను ఇచ్చే షాకులు ఇస్తూనే ఉంటుంది. మరి మౌనంగా ఉండి భరించడం ఎందుకు... తిరగబడితో పోలేదా అంటారు వాళ్లు. మనకు ఏదైనా స్ఫూర్తి వస్తున్నదా ఈ కథ చదివితే? ఎందుకు రాదు... ఒక్క సాహసం వేయి తెగింపులకు లంగరెత్తదూ? సహాయక సిబ్బంది రక్షణ చర్యలు -
8వ ఖండంలో ఏం దొరికాయో తెలుసా?
న్యూజిలాండ్ : పసిఫిక్ మహా సముద్రంలో మునిగిపోయిన ఎనిమిదవ ఖండం జిలాండియాపై శాస్త్రవేత్తలు తొలిసారి పరిశోధనకు వెళ్లారు. వేల అడుగుల లోతులో ఉన్న జిలాండియాపై పాదం మోపిన శాస్త్రవేత్తలు దాదాపు 8 వేల శిలాజాలను కనుగొన్నారు. జిలాండియా ఖండం కొద్ది రోజుల క్రితం పసిఫిక్ మహా సముద్రంలో మనిగిపోయిన విషయం తెలిసిందే. దానిపై ఉన్న జీవరాశి గురించి అన్వేషించేందుకు నిర్ణయించుకున్న ఓ శాస్త్రవేత్తల బృందం సాగర గర్భంలో వేల మీటర్ల లోతుకు వెళ్లింది. అక్కడ శవాల దిబ్బగా మారిన జిలాండియా శాస్త్రవేత్తల బృందానికి దర్శనమిచ్చింది. శాస్త్రవేత్తలు కలియతిరిగిన కొద్ది ప్రాంతంలోనే వేల సంఖ్యలో జీవరాశులు ప్రాణాలు విడిచి కనిపించాయి. జిలాండియా మొత్తం విస్తీర్ణం 5 లక్షల చదరపు కిలోమీటర్లు. జిలాండియా నుంచి జంతువులు, మొక్కలకు సంబంధించిన శాంపిల్స్ను తీసుకొచ్చిన శాస్త్రవేత్తలు ఆశ్చర్యకరమైన విషయాలను వెల్లడించారు. పూర్వం జిలాండియాలో భౌగోళికంగా, వాతావరణపరంగా పరిస్థితులు భిన్నంగా ఉండేవని చెప్పారు. 40 నుంచి 50 మిలియన్ల సంవత్సరాలకు పూర్వం పసిఫిక్ మహాసముద్ర గర్భంలో సంభవించిన 'రింగ్ ఆఫ్ ఫైర్'.. అగ్నిపర్వతాల క్రీయాశీలత్వాన్ని, సముద్ర లోతును, జిలాండియా విస్తీర్ణంలో మార్పులు వచ్చేలా చేసిందని వెల్లడించారు. అప్పుడే ఆస్ట్రేలియా, అంటార్కిటికాల నుంచి జిలాండియా విడిపోయి ఉంటుందని వెల్లింగ్టన్ యూనివర్శిటీ పరిశోధకులు ఒకరు చెప్పారు. సముద్ర గర్భంలోని జిలాండియాను సందర్శించడం వల్ల భూమి చరిత్ర, న్యూజిలాండ్ పరిసర ప్రాంతాల్లో పర్వతాల పుట్టుక, టెక్టోనిక్ ప్లేట్లలో మార్పులు, సముద్రాలలో సంభవించే మార్పులు, ప్రపంచ వాతావరణంలో మార్పులపై పరిశోధనలు చేసేందుకు అవకాశం ఏర్పడిందని యూఎస్ నేషనల్ సైన్స్ షౌండేషన్కు చెందిన మరో శాస్త్రవేత్త వివరించారు. -
సురక్షితంగా భూమిని చేరిన స్పేస్ఎక్స్ వ్యోమనౌక
వాషింగ్టన్: అంతరిక్షంలోని వ్యోమగాములకు అవసరమయ్యే వస్తువులు, ఆహారాన్ని మోసుకెళ్లిన స్పేస్ ఎక్స్ తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించి, తిరిగి భూమిని (పసిఫిక్ మహాసముద్రంలోని లాంచ్ ప్యాడ్) చేరింది. ఈ విషయాన్ని స్పేస్ ఎక్స్ కంపెనీ సోమవారం వెల్లడించింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం లోని వ్యోమగాముల పరిశోధనకు అవసరమయ్యే ప్రతి చిన్న వస్తువును భూమిపై నుంచే పంపాలి. ఇప్పటిదాకా రాకెట్లు ఈ పనిని నిర్వర్తిస్తుండగా.. అవి తిరిగి భూమిని చేరే అవకాశం లేదు. దీంతో వీటి తయారీ ఖర్చు భారీగా పెరిగి పోతోంది. దీనికి పరిష్కారంగా స్పేస్ ఎక్స్ పునఃవినియోగ సామర్థ్యం కలిగిన రాకెట్లను రూపొం దించింది. గతంలో అంతరిక్షంలోకి పంపిన రాకెట్ను భూమిపైకి దింపడంలో పలుమార్లు విఫలమైన స్పేస్ ఎక్స్ కొంతకాలంగా వరుసగా సఫలీ కృతమవుతోంది. ఈ ప్రయత్నంలోభాగంగానే గతనెల 23వ తేదీన అంతరిక్షంలోకి దూసుకెళ్లిన ఈ వ్యోమనౌక అక్కడి వ్యోమగాముల కోసం అవసరమైన వస్తువులు తీసుకెళ్లడమే కాకుండా అంతరిక్షం నుంచి దాదాపు 4,000 పౌండ్ల బరువైన పరిశోధన నమూనాలను, అంతరిక్ష వ్యర్థాలను తీసుకొచ్చింది. -
సముద్రతీరంలో ఏలియన్ల సైన్యం!
పసిఫిక్ సముద్రతీరంలో ఏలియన్ సైన్యానికి చెందిన బేస్ ఇప్పుడు సోషల్మీడియలో అలజడి సృష్టిస్తోంది. కాలిఫోర్నియాకు చేరువలోని పసిఫిక్ తీరంలో ఇందుకు సంబంధించిన చిత్రాలను సెక్యూర్ టీం10 అనే వెబ్ సంస్ధ ప్రచురించింది. ఏలియన్ బేస్ విస్తీర్ణయం దాదాపు 2 మైళ్లకు పైగా ఉందని ఆ చిత్రాలను పరిశీలించిన నిపుణలు ఒకరు తెలిపారు. ఏలియన్లు అటువైపుగా ప్రయాణించి ఉండొచ్చని లేదా భవిష్యత్తులో భూమిపై దాడి చేసేందుకు వ్యూహ రచన కోసం వచ్చి ఉండొచ్చని చెప్పారు. పసిఫిక్ మహాసముద్రంలో తలదాచుకుంటూ ఈ వ్యూహాన్ని అవి కొనసాగిస్తూ ఉండొచ్చని అన్నారు. కాగా, కొన్నేళ్లు ప్రపంచవ్యాప్తంగా విశ్వంలో వేరే జీవిని గురించిన పరిశోధనలు జరగుతూ వస్తున్నాయి. ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్స్ విశ్వాంతరాళంలో మరో జీవి కచ్చితంగా ఉందని వారు మనకంటే ఎన్నో రెట్లు సాంకేతికంగా ముందున్నారని చెప్పిన విషయం తెలిసిందే. -
మహా సముద్రంలో 438 రోజులు..!
‘లైఫ్ ఆఫ్ పై’ సినిమా చూసినవారికి సముద్రంలో తప్పిపోయినవారి కష్టాలు అర్థమవుతాయి. తినడానికి తిండి లేక, తాగడానికి నీరు లేక, కప్పుకోవడానికి ఒంటినిండా గుడ్డలు లేక.. చావుకు రోజులు లెక్కబెట్టుకుంటూ బతుకుతారు వీరు. చివరకు ఏదో ఒకరోజు వీరికి మోక్షం లభిస్తుంది. మరణించినవారు సముద్రగర్భంలో కలిసిపోతారు. బతికిబట్టకట్టినవారు చరిత్రలో నిలిచిపోతారు. అలా నిలిచి గెలిచినవాడే జోస్ సాల్వడార్ అల్వరెంజా..! 2012 నవంబర్ 17.. తను ఎంతగానో నమ్ముకున్న బోటును ప్రేమగా ముద్దాడి సముద్రంలోకి బయలుదేరాడు అల్వరెంజా. సాల్వడార్కు చెందిన ఈ జాలరి.. అప్పటికి 20 ఏళ్ల క్రితమే మెక్సికోకు వలసవచ్చాడు. అక్కడే చేపలు పట్టుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఎప్పటిలాగే చియాపాస్ తీరం నుంచి చేపల వేటకు సాగరంపైకి దూకాడు. అయితే, తోడుగా అలవాటైన మిత్రుడు ‘రే పెరేజ్’ వెంట రాలేదు. వేరే ఏదో పనిమీద అతడు బయటకు వెళ్లడంతో ఆరోజు అల్వరెంజా బోటెక్కాడు 23 ఏళ్ల కార్దోబా. చాలా చురుకైన అథ్లెట్, ఆ ఊరి ఫుట్బాల్ జట్టులో మొనగాడు. కానీ, చేపల వేట మాత్రం కార్దోబాకు పూర్తిగా కొత్త. అంతకు ముందెప్పుడూ ఈ కుర్రాడితో కలిసి పనిచేసిన అనుభవం లేకపోవడంతో మొదట్లో అల్వరెంజా పెద్దగా మాట్లాడేవాడు కాదు. తర్వాత కూడా వీరిద్దరి మధ్యా పెద్దగా మాటలు సాగలేదు. బోట్లోని జీపీఎస్, సగం ఛార్జింగ్ ఉన్న మొబైల్ ఫోన్, పాతకాలం రేడియో, వైర్లెస్.. వీటితో పాటు కొద్దిపాటి చేపలవేటకు అవసరమైన పరికరాలతో కొద్ది గంటలు బాగానే వేటాడసాగారు. దాదాపు వేట పూర్తి కావస్తోందన్న సమయంలో అతి భయంకరమైన తుపాను వారిని అతలాకుతలం చేసింది. ఉవ్వెత్తున లేచిపడుతోన్న కెరటాల ధాటికి జీపీఎస్ పరికరం పాడైంది. మొబైల్, వైర్లెస్లు కూడా దాదాపుగా పనిచేయడం ఆగిపోయాయి. ఉన్నట్టుండి బోటు మోటారు చెడిపోయింది. ఈ క్రమంలో చివరగా తమను కాపాడాలంటూ తీరంలోని తమ యజమానికి అల్వరెంజో చేసిన విన్నపాలు వినిపించకుండాపోయాయి. ఇక, విధిలేని పరిస్థితుల్లో ఇద్దరూ బోటులో బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఐదురోజుల పాటు తుపాను వారిని భయపెట్టింది. తర్వాత చూసుకునేసరికి.. వారు మెక్సికో తీరానికి ఏమాత్రమూ దగ్గరగా లేరు. ఎక్కడో నడిసంద్రంలో కొట్టుకుపోతున్నారు. గమ్యం తెలీని ప్రయాణమే అయింది వారి పరిస్థితి. సముద్రపు వేట మీద అనుభవం లేని కార్దోబాకు తాము తిరిగి తీరానికి చేరుతామనే నమ్మకం పోయింది. ఏడ్చుకుంటూ కూర్చున్నాడు. దీనికి తోడు వాంతులు చేసుకుంటూ నీరసంగా తయారయ్యాడు. అతడి పరిస్థితి చూసిన అల్వరెంజా చేపలు పట్టి అతడికి ఆహారంగా ఇవ్వాలనుకున్నాడు. కానీ, దురదృష్టమేంటంటే.. చేపల వేటకు అవసరమైన పరికరాలన్నీ తుపానులో కొట్టుకుపోయాయి. దీంతో సాధారణ చేతులతోనే వేటాడటం మొదలుపెట్టాడు అల్వరెంజా. చేపలు, తాబేళ్లు పట్టుకుని వాటి మాంసాన్ని కార్దోబాకు తినిపించాడు. అయితే, ఈ మాంసం అతడి శరీరానికి అంతగా నప్పలేదు. రోజురోజుకీ నీరసంగా తయారయ్యాడు. సముద్ర ప్రయాణంలో బతికిబట్టకట్టాలంటే ఉత్సాహంగా ఉండాలని అల్వరెంజా ఎంత చెప్పినా కార్దోబా తేరుకోలేకపోయాడు. ఎప్పుడూ ఇంటిపైనే ధ్యాసతో మరింత నీరసించాడు. అలా రెండు నెలలు గడిచాయి. ఈ కాలంలో చేపలు, సముద్రపు పక్షులు, తాబేళ్లను తింటూ కాలం గడిపేవారు వీరిద్దరూ. మంచినీరు దొరక్కపోవడంతో డీహైడ్రేషన్ బారి నుంచి తప్పించుకునేందుకు మూత్రాన్ని తాగి బతికేవారు. కానీ, ఒకరోజు ఉదయాన లేచి చూసేసరికి కార్దోబా మరణించాడు. అతడి శవాన్ని పక్కనే పెట్టుకుని ఆరు రోజుల పాటు పిచ్చివాడిలా మాట్లాడుకునేవాడు అల్వరెంజా. చివరకు ఓ రోజు సముద్రంలో కార్దొబాను పడేయ్యక తప్పలేదు. అలా పద్నాలుగు నెలలు సముద్రంలోనే గడిపిన తర్వాత చిక్కి శల్యమయ్యాడు అల్వరెంజా. చివరకు అదృష్టం బాగుండి.. 2014 జనవరి 30న మార్షల్ ఐల్యాండ్స్ అనే చిన్న దీవిలో నగ్నంగా తేలాడు. వెంటనే స్థానికులు చికిత్స అందించడంతో బతికి బట్టకట్టాడు. 438 రోజుల పాటు సముద్రంలో ఒంటరిగా గడిపిన ఏకైక వ్యక్తిగా చరిత్ర సృష్టించాడు. -
ప్రాణాలకు తెగించి.. అద్భుతాన్ని ఒడిసిపట్టాడు!
ప్రకృతి అనేక అద్భుతాలకు నెలవు. కానీ అలాంటి అద్భుతాలను ఒడిసిపట్టాలంటే కొన్నిసార్లు ప్రాణాలకు తెగించి.. రిస్క్ చేయాల్సి ఉంటుంది. అలాంటి రిస్క్ను చేసి.. లావా ఎగజిమ్ముతున్న అగ్నిపర్వతానికి సంబంధించి అత్యద్భుతమైన ఫొటోలను ఫొటోగ్రాఫర్ మైక్మెజ్ తన కెమెరాలో బంధించాడు. అతడు తన ఇన్స్టాగ్రామ్లో పెట్టిన ఈ ఫొటోలు నెటిజన్లను విస్మయపరుస్తున్నాయి. పసిఫిక్ సముద్రంలోని హవాయ్ ద్వీపంలో ఉన్న కిలావయా అగ్నిపర్వతం లావా ఎగిజమ్ముతుండగా.. అక్కడి అత్యద్భుతమైన దృశ్యాలను ఈ ఫొటోగ్రాఫర్ తన కెమెరాలో బంధించాడు. ఈ ఫొటోలు నిజంగా అద్భుతంగా ఉన్నాయంటూ నెటిజన్లు కీర్తిస్తున్నారు. -
అమెరికాకు త్వరగా వెళ్లాలంటే..
న్యూఢిల్లీ: ఇండియా నుంచి అమెరికాకు విమానయానంలో భారీ మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. ప్రస్తుత ప్రయాణ సమయం కంటే మూడు గంటలు త్వరగా వెళ్లొచ్చు. ఎలాగంటే..భారత రాజధాని ఢిల్లీ నుంచి అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో నగరానికి వెళ్లే ఎయిర్ఇండియా విమానాలు త్వరలోనే కొత్తదారిలో ప్రయాణించనున్నాయి. ఢిల్లీ నుంచి తూర్పుదిశగా ఎగరనున్న విమానాలు ఫసిఫిక్ మహాసముద్రం మీద నుంచి అగ్రరాజ్యానికి చేరుకోనున్నాయి. ప్రస్తుతం ఢిల్లీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో వెళ్లే అన్ని ఎయిర్ ఇండియా విమానాలు టేకాఫ్ అయిన తర్వాత పశ్చిమదిశగా అట్లాంటిక్ మహాసముద్రం మీదనుంచి వెళుతున్నాయి. ఇంధనం ఆదాపై దృష్టి సారించిన ఏఐ ఈ మేరకు చేసిన ప్రతిపాదనలకు డెరైక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) నుంచి కూడా ఆమోదం లభించింది. విమానాలు ఢిల్లీ నుంచి తూర్పుదిశకు (పసిఫిక్ వైపుకు) వెళ్లడం వల్ల అమెరికాకు దూరం 1,400 కి.మీ పెరుగుతుంది. అయితే పసిఫిక్ ప్రాంతంలో ఉండే వాతావరణ పరిస్థితుల కారణంగా ఇంధనం, ప్రయాణ సమయం కలిసివస్తాయని అధికారులు చెబుతున్నారు. విమానాలు ఢిల్లీ నుంచి పశ్చిమ దిశలో (అట్లాంటిక్ మీదుగా) ప్రయాణించినప్పుడు.. ఎదురుగాలి బలంగా వీస్తుందని, కొన్నిసార్లు గంటకు 24 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని పేర్కొన్నారు. అంటే విమాన వేగం గంటకు 800 కిలోమీటర్లు అనుకుంటే వాస్తవేగం మాత్రం 776 కిలోమీటర్లే ఉంటుందని, ఈ కారణంగా ఇంధన వినియోగం అధికంగా ఉంటుందని.. మొత్తంగా ఎక్కువ ఖర్చవుతుందని అధికారులు చెప్పారు. అదే తూర్పుదిశగా( పసిఫిక్ మీదుగా) వెళ్లేటప్పుడు.. గాలులు విమానం ప్రయాణించే దిశలోనే గంటకు 138 కి.మీ వేగంతో వీస్తాయని, విమానం గంటలకు 800 కి.మీ వేగంతో ప్రయాణిస్తుందనుకుంటే వాస్తవవేగం గంటకు 938 కి.మీ ఉంటుంది’ అని సీనియర్ పైలట్ ఒకరు చెప్పారు. పాత మార్గంతో పోలిస్తే కొత్త దారిలో గమ్యాన్ని త్వరగా చేరుకోవచ్చని, వేసవిలో అయితే ఒక గంట ముందు, శీతాకాలంలో అయితే మూడు గంటల ముందుగానే శాన్ ఫ్రాన్సిస్కోకు చేరుకోవచ్చుని తెలిపారు. ప్రస్తుతం ఢిల్లీ-శాన్ఫ్రాన్సిస్కో మధ్య నడపడానికి బోయింగ్ 777-200 ఎల్ఆర్ విమానాన్ని ఎయిర్ ఇండియా వాడుతోంది. ఈ విమానం గాలిలో ఎగరడానికి గంటకు 9,600 లీటర్ల ఇంధనం అవసరం. పసిఫిక్ మీదుగా వెళ్తామన్న ఎయిర్ ఇండియా ప్రతిపాదనకు డీజీసీఏ (డెరైక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) ఆగస్టులోనే ఆమోదం తెలిపింది. నవంబరు నుంచి విమానాలు కొత్త మార్గంలో రాకపోకలు సాగిస్తాయి. ఢిల్లీ-శాన్ఫ్రాన్సిస్కో మార్గంలో ఎయిర్ఇండియా ప్రస్తుతం మూడు విమానాలు నడుపుతుండగా, నవంబరు నుంచి ఈ సంఖ్యను ఆరుకు పెంచనుంది. -
9న సుందర దృశ్యం!
కోల్కతా: పదేళ్ల అనంతరం ఈ నెల 9న ఆకాశంలో సుందర దృశ్యం ఆవిష్కృతం కా నుంది. సోమవారం మధ్యాహ్నం బుధ గ్రహం సూర్యుని ఒక కొన నుంచి మరో కొన మీదుగా నల్లటి చుక్క ఆకారంలో ప్రయాణం చేయనున్నట్లు పొజిషనల్ ఆస్ట్రానమీ డెరైక్టర్ సంజీబ్ సేన్ తెలిపారు. ఆ సమయంలో భూమి, సూర్యుడు, బుధుడు ఒకే సరళ రేఖపై ఉంటాయి. పలు ఆసియా దేశాలు, యూరప్, ఆఫ్రికా, గ్రీన్లాండ్, దక్షిణ అమెరికా, పసిఫిక్ మహా సముద్రం ప్రాంతాల్లో ఈ దృశ్యం ఏడున్నర గంటల పాటు కనబడుతుంది. -
పపువా న్యూ గినియాకు 663 కోట్ల రుణం
పోర్ట్ మోర్స్బీ: పసిఫిక్ మహాసముద్రంలోని ద్వీప దేశమైన పపువా న్యూ గినియాకు భారత్ శుక్రవారం రూ. 663 కోట్లు రుణ సాయం ప్రకటించింది. దీనిపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఆ దేశాధ్యక్షుడు మైఖేల్ ఓగియోల సమక్షంలో అవగాహన ఒప్పందం కుదిరింది. రెండు రోజుల పపువా న్యూగినియా పర్యటన ముగింపు సందర్భంగా ప్రణబ్, ఓగియోలు ద్వైపాక్షిక చర్చలు జరిపారు. తమ దేశంలో విస్తారంగా ఉన్న చమురు, సహజ వాయువు వనరులను భారత్తో కలసి అన్వేషించి అభివృద్ధి చేసేందుకు అంగీకరించింది. ద్వైపాక్షిక తీర భద్రత చర్యల హామీలో భాగంగా నిఘా రాడార్ వ్యవస్థ, కోస్ట్గార్డ్ నిఘా పడవలను భారత్ ఇవ్వనుంది. గాంధీజీ సందేశం నేటికీ స్ఫూర్తిదాయకం అసహనం, తీవ్రవాదంతో విసిగిపోయిన నేటి ప్రపంచానికి మహాత్మా గాంధీ బోధనలు నేటికీ స్ఫూర్తిదాయకమని రాష్ట్రపతి ప్రణబ్ పేర్కొన్నారు. పపువా న్యూగినియా వర్సిటీ విద్యార్థులనుద్దేశించి ఆయన ప్రసంగించారు. -
ఈ ఏడాది కాస్త ఎక్కువ వర్షపాతం
భారత వాతావరణ శాఖ, స్కైమెట్ సంస్థల అంచనా న్యూఢిల్లీ: పసిఫిక్ మహాసముద్రంలో బలహీన పడుతున్న ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది భారత్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతమే ఉండొచ్చని భారత వాతావరణ సంస్థ అంచనా వేసింది. వరుసగా రెండేళ్లపాటు ముఖం చాటేసిన వర్షాలు ఈ ఏడాది రైతుల్ని ఆనందంలో ముంచెత్తనున్నాయని భావిస్తున్నారు. భారత వాతావరణ శాఖ, ఓ స్వతంత్ర వాతవరణ అంచనా సంస్థ స్కైమెట్ అధ్యయనం ప్రకారం ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య దేశంలో 89 సెం.మీ. వర్షపాతం నమోదవుతుందని అంచనా వేశాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం మంచి వర్షపాతం నమోదవుతుందని అంచనా వేశాయి. ‘ఎల్నినో బలహీన పడుతుండటంతో ఈ ఏడాది మంచి వర్షపాతం నమోదవుతుంది. ఇది కచ్చితంగా రైతులకు శుభవార్తే. ఇది ఆర్థిక వ్యవస్థ పెరుగుదలపై మంచి ప్రభావం చూపుతుంద’ని స్కైమెట్ సంస్థ డెరైక్టర్ మహేశ్ పలావత్ మీడియాకు తెలిపారు. దేశవ్యాప్తంగా ఈ ఏడాది 100 నుంచి 102 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ విశ్లేషకుల అంచనా. ఈ ఏడాది జూన్లోనే సాధారణ వర్షపాతం కంటే 25 శాతం ఎక్కువగానే వర్షపాతం నమోదవుతుందని వాతావరణ ప్రమాద నిర్వహణ సంస్థకు చెందిన సీనియర్విశ్లేషకులు కంటి ప్రసాద్ తెలిపారు. ఈశాన్యభారతంలో తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని కానీ, దేశవ్యాప్తంగా చూస్తే మాత్రం ఈ ఏడాది మంచి వర్షపాతం నమోదవుతుంద న్నారు. -
రైతులారా... ఈ ద్వీపానికి రండి..!
ట్రిస్టన్ డి కన్హా... పేరు మీరెప్పుడూ విని ఉండరు. ఎక్కడో దక్షిణాఫ్రికా, అమెరికా ఖండాల మధ్య పసఫిక్ మహా సముద్రంలో ఉంటుంది ఈ బుల్లి ద్వీపం. ఏడుమైళ్ల పొడవు మాత్రమే ఉండే ఈ ద్వీపంపై వ్యవసాయం చేసేందుకు రైతులు కావాలట! దాదాపు 38 చదరపు మైళ్ల విస్తీర్ణంలో పాడిపశువుల ఆలనా పాలనా చూసుకోవడంతోపాటు, ఉద్యాన వన పంటల సాగులో నైపుణ్యమున్న రైతుకు ఉద్యోగమిస్తామని ఈ ద్వీపవాసులు ఇటీవల ఒక ప్రకటనలో తెలిపారు. విమానాశ్రయం లేని కారణంగా ఈ ద్వీపవాసులు దక్షిణాఫ్రికా నుంచి నెల, రెండు నెలలకు ఒకసారి వచ్చే నౌకల ద్వారా తమ అవసరాలను తీర్చుకుంటున్నారు. అందుకే ఉన్న కొద్దిపాటి నేలపై కాయగూరలు, పండ్లు పండించాలని నిర్ణయించారు. ఇంతకీ ఈ ద్వీపంలో ఉండే జనాభా ఎంతో మీకు తెలుసా... 300 మంది ప్రజలు 500 గొర్రెలు అంతే! -
వనౌతులో భూకంపం
సిడ్నీ: వనౌతులోని పసిఫిక్ మహాసముద్రంలో బుధవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 7.3గా నమోదు అయిందని భూకంప శాస్త్రవేత్తలు వెల్లడించారు. అయితే సునామీ వచ్చే అవకాశం లేదని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. భూకంప కేంద్రం వనౌతు రాజధాని పోర్ట్ విల్లాకు 335 కిలోమీటర్ల దూరంలో... 80 మైళ్ల అడుగున గుర్తించినట్లు తెలిపింది. ఫసిపిక్ మహాసముద్రంలో ఆస్ట్రేలియా - హవాయి దేశాల మధ్య 65 దీవుల సముదాయమే వనౌతు. ఈ చిన్న ద్వీపదేశంలో మూడు లక్షల జనాభా నివసిస్తుంటారు. -
పిట్ట కొంచెం పేరు ఘనం!
ప్లే టైమ్ చూడటానికి మన ఇళ్లల్లో కనిపించే పిచ్చుకలా కనిపిస్తున్నా పేరుకైతే ఇది ‘కింగ్బర్డ్’. ప్రధానంగా ఉత్తర అమెరికాలో కనిపిస్తూ ఉంటుంది. ఇది వలస పక్షి. సీజన్లను బట్టి సుదూర ప్రాంతం ప్రయాణించి జీవిస్తుంటుంది. మధ్య అమెరికాను మంచు దుప్పటి కప్పేసిన సమయాల్లో ఈ పక్షి జాతి పసిఫిక్ సముద్రంవైపు వెళ్లిపోతుంది. తీర ప్రాంతాల్లో వేసవి వేడి తగలగానే ఉత్తర అమెరికా మధ్యప్రాంతంలోకి వచ్చేస్తుంది. కొన్ని వేలమైళ్ల దూరం ప్రయాణించే శక్తిసామర్థ్యాలుంటాయి కింగ్బర్డ్కి. సాధారణంగా చిన్నచిన్న పక్షి జాతులకు రాబందుల నుంచి, గద్దల నుంచి ప్రమాదం పొంచి ఉంటుంది. అయితే కింగ్బర్డ్ మాత్రం అలాంటి వాటి చేతచిక్కదు. ఈ బుల్లి పక్షికి అడవి పిల్లుల, కుక్కల, నక్కల నుంచి ఎదురయ్యే ప్రమాదాలు కూడా తక్కువే. వాటన్నింటి బారి నుంచి తప్పించుకొనే అరుదైన పక్షిజాతి ఇది. 20 రోజుల వయసొచ్చే వరకూ ఈ పిట్టలు గూడుకే పరిమితమై ఉంటాయి. ఆ సమయంలో ఆడ, మగ పక్షులు రెండూ తమ పిల్లల పెంపకాన్ని బాధ్యతగా తీసుకొంటాయి. కీటకాలను, తేనెటీగలను, చిన్నచిన్న పురుగులను, చెట్లకు కాసే చిన్నచిన్న పిందెలను ఆహారంగా తీసుకొంటాయి. -
పోరాటమే ఆమె పంథా!
పసిపిక్ మహాసముద్రం తూర్పు భాగంలో ఉండే చిన్న దీవి ఫిజి. ఈ దేశాన్ని ఇంకో రకంగా పరిచయం చేయాలంటే.. మహిళలపై హింస విషయంలో ప్రపంచంలోనే తొలి స్థానం ఈ దేశానిదే. ఇక్కడ సగటున 64 శాతం మహిళలు శారీరక, లైంగిక హింసకు గురవుతున్నారు. గృహహింసకు కూడా లోటు లేదు. ఇటువంటి చోట మహిళలకు అనుకూలంగా గళం విప్పాలంటే చాలా ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం ఉండటం వల్లే రోషికాదేవ్కి ప్రపంచ స్థాయి గుర్తింపు లభించింది.‘కరేజియస్ ఉమన్’ అవార్డును దక్కేలా చేసింది. రోషికాదేవ్... ఫిజీ దేశానికి చెందిన మహిళ. ఈ యేడాదికి గానూ యూఎస్ వాళ్లు ఎంపిక చేసిన అత్యంత శక్తిసామర్థ్యాలున్న మహిళల్లో ఒకరిగా నిలిచిందామె. పేరును బట్టి ఈమె భారతీయ మూలాలున్న మహిళ అని ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఫిజిలో రాజకీయ నేతగా, వ్యాపారవేత్తగా పేరున్న ఇందర్ దేవ్ తనయ రోషికా. తండ్రి వ్యాపారాలు చూసుకొంటూ ఆస్ట్రేలియాకు వెళ్లిపోయినా... రోషికా మాత్రం సామాజిక ఉద్యమాలపై దృష్టి నిలిపింది. సామాజిక మాధ్యమాల ద్వారా యువ, మహిళా శక్తిని సమీకరించుకొంటూ రిషిక తన పోరాటపంథాను కొనసాగిస్తోంది. విశేషం ఏమిటంటే... ఇటీవల జరిగిన ఫిజి ఎన్నికల్లో రోషిక పోటీ చేసింది! కేవలం 0.2 శాతం ఓట్లతేడాతో ఓడిపోయింది. మరింత విశేషం ఏమిటంటే ఆమె రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా పోటీ చేసి ప్రధాన పార్టీకి గట్టి పోటీ ఇచ్చింది. స్వల్పతేడాతో ఓటమి పాలయ్యింది.అయితే అందుకు తానేమీ నిరుత్సాహపడలేదని.. మార్పు అనేది ఒక రోజులో రాదని, క్రమంగా సంభవిస్తుందన్నది రోషిక విశ్వాసం. ఏనాటికి అయినా ఫిజి దేశానికి దిశానిర్దేశం చేసే నేత కావాలనేది రోషిక లక్ష్యం. ఈ విషయాన్ని ఆమె గర్వంగా ప్రకటించుకొంటారు కూడా!