peacock
-
‘నెమలి కర్రీ’ వీడియోతో బుక్కయ్యాడు
తంగళ్లపల్లి (సిరిసిల్ల): ‘ట్రెడిషినల్ పికాక్ కర్రీ రెసిపీ’ అంటూ ఓ యూట్యూబర్ తన చానల్లో వీడియో పోస్టు చేసి అడ్డంగా బుక్కయ్యాడు. రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన కోడం ప్రణయ్కుమార్ శ్రీటీవీ అనే యూట్యూబ్ చానల్లో నెమలి వంట చేయడం గురించి వీడియో పోస్టు చేశాడు. ఈ విషయంపై ‘యూట్యూబ్లో నెమలికూర వంటకం’ అనే శీర్షికతో ‘సాక్షి’లో ఆదివారం ప్రచురితమైన కథనానికి అటవీ అధికారులు స్పందించారు.తంగళ్లపల్లిలో వంట చేసిన స్థలాన్ని పరిశీలించి, ప్రణయ్కుమార్ను అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ఫారెస్ట్ రేంజ్ అధికారి కల్పనాదేవి మాట్లాడుతూ, వంటకాన్ని స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపనున్నట్లు తెలిపారు. ఇప్పటికే నెమలి పేరుతో వీడియో పెట్టినందుకు అటవీచట్టం ప్రకారం కేసు నమోదు చేశామని, పలు అటవీ జంతువులు, పక్షుల వంటకాల వీడియోలు కూడా పోస్టు చేసినట్లు గుర్తించామన్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొన్నారు. తనిఖీలలో ఫారెస్టు సెక్షన్ అధికారి శ్రవణ్కుమార్, బీట్ ఆఫీసర్ ఎంఏ ఖలీమ్, సిబ్బంది పాల్గొన్నారు. -
యూట్యూబ్లో నెమలికూర వంటకం
తంగళ్లపల్లి (సిరిసిల్ల): జాతీయ పక్షిని చంపడం చట్టరీత్యా నేరం. అయితే ఓ యూట్యూబర్ ఏకంగా ‘ట్రెడిషినల్ పికాక్ కర్రీ రెసిపీ’ అంటూ తన యూ ట్యూబ్ చానల్లో పోస్టు చేశాడు. దీంతో ఇది వైరల్గా మారింది. తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన కోడం ప్రణయ్కుమార్ అనే వ్యక్తి కొన్నా ళ్లుగా శ్రీటీవి అనే యూట్యూబ్ చానల్ నిర్వహిస్తున్నాడు.అయితే శనివారం తన యూట్యూబ్ చానల్లో ‘నెమలి కూర సంప్రదాయ పద్ధతిలో ఎలా వండాలి’ అంటూ పెట్టిన వీడియో వైరల్గా మారింది. ఈ వీడియోను చూసిన వారందరూ విస్తుపోయారు. అంతేకాకుండా అడవిపంది కూర వండటం గురించిన వీడియో కూడా సదరు యూట్యూబ్ చానల్లో దర్శనమివ్వడం గమనార్హం. పోలీసులు, అటవీశాఖ అధికారులు ఈ వీడియోపై నిజానిజాలు తెలుసుకొని సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు. -
అలా పట్టించుకోకుండా వెళ్లిపోతే ఎలా? : హిల్లేరియస్ వీడియో వైరల్
నెమలి మన జాతీయ పక్షి. అందమైన అపురూపమైన పక్షి. ఆడ నెమలిని ఇంప్రెస్ చేసేందుకు మగ నెమలి పురి విప్పి నాట్యం చేస్తుంది. గున గున అడుగులేస్తూ ఆడ నెమలి వెంట తిరుగుతుంది. ఈ నాట్యం చేసేటప్పుడు తన పింఛాన్ని చుట్టూ వృత్తం లాగా చేస్తుంది. ఒక్కోసారి విసినకర్రలా వంచి అందంగా నాట్యం చేస్తుంది. ప్రేయసి సంతృప్తి చెంది, చెంతక చేరేదాకా మగ నెమలికి ఈ తిప్పలు తప్పవు. అకస్మాత్తుగా మబ్బులు కమ్మేసి, చినుకులు పడినపుడు, ప్రధానంగా వడగళ్లు పడినపుడు సంతోషంతో పింఛంతో మగ నెమలి చేసే నాట్యం వర్ణశోభితంగా, అత్యంత రమణీయంగా ఉంటుంది కదా. తాజాగా గ్రేట్ ఆర్గస్ నెమలి ఆడ నెమలిని ఆకట్టుకునేందుకు పాట్లు, దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. నేచర్ ఈజ్ అమేజింగ్ అనే ట్విటర్ హ్యాండిల్ షేర్ చేసిన ఈ వీడియో దాదాపు 30 లక్షలకు పైగా వ్యూస్ను సాధించడం విశేషం. వాస్తవానికి ఈ వీడియో 2021లో ఫ్లోరిడాలోని బే లేక్లోని డిస్నీస్ యానిమల్ కింగ్డమ్లోని మహారాజా జంగిల్ ట్రెక్లో తీసింది. ఇపుడు మళ్లీ సందడి చేస్తోంది. ఈ తతంగం అంతా చూసి నెటిజన్లు చతురోక్తులతో స్పందిస్తున్నారు. ఇంత చేసినా అలా వెళ్లిపోతే ఎలా అంటూ ఫన్నీ కమెంట్లు పెడుతున్నారు. A male Pheasant is trying to impress her but she is not impressed! 😂 pic.twitter.com/dqfAj2icz4 — Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) March 20, 2024 An incredible leucistic peacock! (Video Laurel Coons) pic.twitter.com/H0eO6ID6TM — Natural Science & History (@joehansenxx) March 20, 2024 This is so so beautiful 🦚🥰😍 pic.twitter.com/XHwbmH5lUC — Aisha Abbasi (@aisha_FCB) March 20, 2024 -
మహిళపై నెమలి దాడి
కర్ణాటక: మహిళపై ఒక నెమలి పదేపదే దాడి చేస్తుండడంతో విసిగిపోయిన ఆమె నెమలిపై చర్యలు తీసుకోవాలని అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేసిన సంఘటన చెన్నపట్టణ తాలూకా అరళాళుసంద్ర గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామం నివాసి లింగమ్మ బాధితురాలు. ఇంటి వద్ద తాను పనిచేసుకుంటుండగా ఒక నెమలి తరచూ ఎగురుకుంటూ వచ్చి తనను ముక్కుతో పొడుస్తూ గాయపరుస్తోందని, ఆస్పత్రిలో చేరి చికిత్స కూడా తీసుకుంటున్నానని అందువల్ల నెమలిని పట్టుకుని తనకు రక్షణ కల్పించాలని అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేసింది. రామనగర జిల్లాలో ఏనుగులు, ఎలుగుబంట్లు, చిరుత దాడులతో ఇప్పటికే విసిగిపోయిన ప్రజలకు నెమళ్లు కూడా దాడి చేస్తుండడం కలవరపెడుతోంది. -
Photo Feature: ‘నాట్య’ మయూరం
మండల పరిధిలోని ఫైజాబాద్ శివారులోని పొలాల్లో పురివిప్పిన మయూరం చూపరులను ఆకట్టుకుంది. కురిసిన వర్షాలకు పచ్చగా చిగురించిన గడ్డిపై అందంగా మయూరం పురివిప్పడంతో ‘సాక్షి’ క్లిక్ మనిపించింది. – చిలప్చెడ్(నర్సాపూర్) -
ఆ సినిమా చూసి ఏడ్చేశాను : మహేశ్ బాబు
సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్నారు. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 12 విడుదలై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేశ్కు జంటగా కీర్తి సురేష్ నటించింది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో వసూళ్లను రాబడుతోంది. ఇదిలా ఉండగా రీసెంట్గా మహేశ్ పీకాక్ మ్యాగజైన్ నిర్వహించిన ర్యాపిడ్ ఫైర్ ఛాలెంజ్లో ఎదురైన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. తాను తరచుగా బ్యూటిఫుల్ అనే పదం వాడుతానని తెలిపారు. హాలీవుడ్ మూవీ లయన్ కింగ్ చూసి ఏడ్చినట్లు పేర్కొన్నారు. ఒకవేళ తాను డైరెక్టర్ అయితే 'ఒక్కడు' మూవీని రీక్రియేట్ చేస్తానని ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసిన మహేశ్ అల్లూరి సీతారామరాజు సినిమా తన ఆల్టైమ్ ఫేవరేట్ మూవీ అని చెప్పుకొచ్చారు. -
‘ద పీకాక్’ మ్యాగజైన్పై మహేశ్, ఫొటో షేర్ చేసిన సూపర్ స్టార్
Mahesh Babu Stuns On The Peacock Magazine: సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట ప్రమోషన్స్తో బిజీగా ఉన్నారు. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 12న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో మహేశ్ వరుస ఇంటర్య్వూలు, ప్రెస్మీట్లతో బిజీ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో సోమవారం ప్రముఖ మ్యాగజైన్ కవర్ పేజీపై కనిపించి తన ఫ్యాన్స్ను సర్ప్రైజ్ చేశారు ఆయన. ద పీకాక్ మేగజీన్ కవర్ పేజీ కోసం ఆయన ఇటీవల ఫొటోషూట్లో పాల్గొన్నారు. ఈ విషయాన్ని మహేశ్ స్వయంగా తెలిపారు. చదవండి: మహేశ్-రాజమౌళి మూవీపై అప్డేట్ ఇచ్చిన రచయిత విజయేంద్ర ప్రసాద్ మ్యాగజైన్ కవర్ పేజీపై ప్రచురించిన తన ఫొటోను ట్విటర్లో షేర్ చేస్తూ ద పీకాక్ మ్యాగజైన్కు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ మ్యాగజైన్ కోసం జరిగిన ఫొటోషూట్ మొత్తం చాలా సరదాగా, ఉల్లాసంగా జరిగిందని ఈ సందర్భంగా మహేశ్ పేర్కొన్నారు. ఆ షూట్ కోసం కష్టపడ్డ ద పీకాక్ మ్యాగజైన్ జర్నలిస్టులు ఫాల్గుణి, షేన్లకు మహేశ్ స్పెషల్గా థ్యాంక్స్ చెప్పారు. కాగా ద పీకాక్ మ్యాగజైన్పై మహేశ్తో పాటు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కూడా కనిపించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఇందుకోసం ఇచ్చిన ఫొటోషూట్ను ఆమె తన ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. Humbled and honoured to be starring on the cover of #ThePeacockMagazine. The shoot and the overall experience was so much fun! Thank you @falgunipeacock and @shanepeacock. Here’s to many more! 🤗 pic.twitter.com/pbaoVkcc4f — Mahesh Babu (@urstrulyMahesh) May 10, 2022 -
అప్పుడు ధైర్యం లేదు, ఇప్పుడు ఏమైనా చేయగలను : సమంత
స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉంటోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉంటూ తనకు సంబంధించిన అప్డేట్స్ని షేర్ చేస్తుంది. తాజాగా సమంత ఓ ప్రముఖ మ్యాగజైన్ కోసం నెమలి మాదిరిగా స్టన్నింగ్ ఫోజులిచ్చింది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను షేర్ చేస్తూ సమంత ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. 'నా స్కిన్టోన్తో నేను కంఫర్టబుల్గా ఉండేందుకు నాకు కొంత సమయం అయితే పట్టింది..కానీ చాలా సినిమాలు చేసిన అనంతరం ఇప్పుడు ఏదైనా సెక్సీ సాంగ్ కానీ హార్డ్ కోర్ యాక్షన్ సహా ఢిపరెంట్ రోల్స్ చేయడానికి నాపై నాకు నమ్మకం వచ్చింది. ఇంతకుముందు నాలో ఈ ధైర్యం లేదు. కానీ ఇప్పడు నేను ఏదైనా చేయగలను అనే నమ్మకం వచ్చింది. వయసుతో పాటు ఇచ్చిన మెచ్యురిటీ ఇది' అంటూ సమంత పేర్కొంది. ఇక సామ్ లేటెస్ట్ సమంత ఫోటోపై రియాక్ట్ అయిన హీరోయిన్ తమన్నా బ్యూటీ అంటూ కామెంట్ చేసింది. కాగా హరి, హరీష్ దర్శకత్వంలో సమంత నటించిన యశోద సినిమాకు విడుదలకు రెడీ అవుతుంది. సైన్స్ ఫిక్షన్గా తెరకెక్కతున్న ఈ సినిమా ఆగస్టు 12న విడుదల కానుంది. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
తెల్లటి నెమలిని ఎప్పుడైనా చూశారా? వీడియో వైరల్
white peacock captured in flight: సాధారణంగా నెమలి అంటే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. నెమళ్లు ఎక్కడైన కనిపిస్తే చిన్నా పెద్ద అనే తారతమ్యం లేకుండా తన్మయంతో చూస్తుంటారు. నిజానికి తెల్లటి నెమళ్లు గురించి గానీ అవి ఉంటాయని గానీ ఎవ్వరికీ తెలియదు. ఈ వైరల్ వీడియో చూస్తే కచ్చితంగా పాల నురుగులాంటి ఒక అత్యద్భుతమైన నెమలి ఉందని ఒప్పుకుంటారు. వివరాల్లోకెళ్తే....ఉత్తర ఇటాలియన్ ద్వీపం ఐసోలా బెల్లాలోని బరోక్ గార్డెన్లోని శిల్పం వద్ద ఒక అరుదైన దేవతా పక్షిలా కనువిందు చేసింది. తొలుత ఈ పక్షిని చూసిన వెంటనే ఏంటిది అనిపిస్తుంది. దాన్ని నిశితంగా చూస్తే గాని అది తెల్లటి నెమలి అని అవగతమవదు. అంతేకాదు దాని ఈకలు తెల్లగా దేవతా పక్షి అనిపించేలా మెరుస్తూ ఉంటాయి. అయితే ఇవి లూసిజం అని పిలువబడే జన్యు పరివర్తన అని శాస్తవేత్తలు అంటున్నారు. ఇవి ఎక్కువగా బంధింపబడే ఉంటాయని చెబుతున్నారు. వీటి జనాభా కూడా చాలా తక్కువేనని అంటున్నారు. White peacock in flight..🦚😍 pic.twitter.com/CnBNbSoprO — 𝕐o̴g̴ (@Yoda4ever) April 29, 2022 (చదవండి: నాగుపాముతోనే నాగిని డ్యాన్స్.. కటకటాల వెనక్కి నెట్టిన పోలీసులు) -
మరణాన్ని తట్టుకోలేకపోయింది.. కడదాకా వెంటపడింది
మనుషులకు మల్లే పశుపక్ష్యాదులు భావోద్వేగాలు ప్రదర్శిస్తాయని చాలా సందర్భాల్లో చూసి ఉంటాం. పిల్లల కోసం అల్లలాడిపోవడం, ఆపదలో అవసరమైతే పోరాడడం, యజమానుల పట్ల విశ్వాసం, ఆప్యాయత-ప్రేమల్ని ప్రదర్శించడం ఈ కోవలోకే చెందుతాయి కూడా. అయితే మృతి చెందిన తన నేస్తాన్ని పూడ్చడానికి వెళ్తుంటే.. ఆ బాధను తట్టుకోలేక ఓ పక్షి చేసిన పని నెటిజనుల హృదయాన్ని కరిగిస్తోంది. వివరాల్లోకి వెళితే.. రాజస్తాన్లోని కుచేర ప్రాంతంలో రామస్వరూప్ బిష్ణోయ్ అనే వ్యక్తి ఇంటి వద్ద రెండు నెమళ్లు సందడి చేసేవి. ఎక్కడి నుంచో వచ్చిన వాటికి రోజూ ధాన్యం గింజలు వేస్తున్నాడాయన. అలా నాలుగేళ్లు గడిచిపోయింది. అయితే అందులో ఓ నెమలి మృతి చెందింది. దీంతో ఇద్దరు వ్యక్తులను పురమాయించి ఆ నెమలిని పూడ్చమని చెప్పాడు రామస్వరూప్. నెమలి మృతదేహాన్ని పూడ్చడానికి తీసుకువెళ్లున్న క్రమంలో.. పాపం మరో నెమలి దాని వెంట పరుగులు తీసింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ పర్వీన్ కాస్వాం తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘నెమలి తన సహచర నెమలిని విడిచి ఉండలేకపోతోంది. హృదయాన్ని కదిలించే వీడియో’ అని కామెంట్ జతచేశారు. అలా పరుగులు తీసిన నెమలి.. ఖననం చేసేదాకా ఆ నెమలి అక్కడే ఉందని ఆయన తెలిపారు. ఇదిలా ఉంటే ఆ నెమలి పరుగులు తీసిన వీడియోను 1.26 లక్షల మంది వీక్షించారు. నెమలి వీడియో వీక్షించిన నెటిజనులు హార్ట్ టచింగ్ వీడియో అంటూ కామెంట్లు చేస్తున్నారు. ‘మనుషుల కంటే పక్షులు, పశువులకే ప్రేమ అధికంగా ఉంటుంది!’, ‘ఆ నెమలి ఎంత బాధ అనుభవిస్తోందో.. పక్షి ప్రేమికులకు తెలుస్తుంది’, ‘దేవుడి సృష్టి చాలా గొప్పదని.. ప్రేమ, అనుబంధాలకు సంబంధించి ఆ నెమలి ఆధునిక మానవుని కళ్లు తెరిపిస్తోంది’, ‘నువ్వు లేక నేనుండలేను నేస్తం.. నువ్వు ఎక్కడికి పోతున్నావ్!’ అని నెటిజనన్లు కామెంట్లు చేస్తున్నారు. The peacock doesn’t want to leave the long time partner after his death. Touching video. Via WA. pic.twitter.com/ELnW3mozAb — Parveen Kaswan (@ParveenKaswan) January 4, 2022 -
బైకర్పై దాడి.. వ్యక్తి, నెమలి మృతి
తిరువనంతపురం: కేరళలో విషాదం చోటు చేసుకుంది. జనావాసంలోకి వచ్చిన ఓ నెమలి హంగామా సృష్టించింది. ఎగురుతూ వెళ్లి బైక్ మీద వస్తున్న ఓ వ్యక్తిని తగలడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో నెమలి మృతి చెందగా.. తీవ్రంగా గాయపడిన బైకర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఐదు రోజుల క్రితం చోటు చేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు.. కేరళ అయ్యంతోల్ ప్రాంతానికి చెందిన ప్రమోద్ అనే వ్యక్తి ప్రైవేట్ ఆస్పత్రిలో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఐదు రోజుల క్రితం ప్రమోద్ తన భార్య వీణతో కలిసి బైక్ మీద వెళ్తున్నాడు. ఇంతలో అటుగా ఎగురుతూ వచ్చిన నెమలి.. బైక్ మీద ఉన్న ప్రమోద్ ఛాతీలో పొడిచింది. ఈ క్రమంలో ప్రమోద్ బ్యాలెన్స్ కోల్పోయి.. పక్కనే ఉన్న కంపోజిషన్ గోడకు గుద్దుకున్నాడు. ఈ ఘటనలో నెమలి అక్కడికక్కడే మృతి చెందగా ప్రమోద్, అతడి భార్య తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించారు. కానీ ప్రమోద్ తీవ్ర గాయాలపాలు కావడంతో అతడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సందర్భంగా ఓ ఫారెస్ట్ అధికారి మాట్లాడుతూ.. ‘‘ఇతర పక్షుల్లాగా నెమళ్లు ఎక్కువ ఎత్తు.. దూరం ఎగరలేవు. అందుకే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ మధ్య కాలంలో ఈ ప్రాంతంలో నెమళ్లు జనావాసంలోకి రావడం బాగా పెరిగింది’’ అని తెలిపాడు. -
Peacock: మయూర వయ్యారం.. కళ్లారా వైభోగం
పచ్చని ప్రకృతి ఒడిలో మయూరాలు వయ్యారాలు పోయాయి. ఆనందంతో పురివిప్పి నాట్యమాడాయి. గురువారం ఉదయం 10.30 గంటల సమయంలో ఆహ్లాదకర వాతావరణం నెలకొనగా.. నెమళ్లు అందంగా నాట్యమాడుతూ, గెంతులేస్తూ అటువైపు వెళ్లిన వారికి కనువిందు చేశాయి. నిజామాబాద్ జిల్లా మక్లూర్ మండలం బొకన్పల్లి గ్రామ శివారులో ఈ నెమళ్ల సందడిని ‘సాక్షి’కెమెరా క్లిక్మనిపించింది. – సాక్షి ఫొటోగ్రాఫర్, నిజామాబాద్ -
‘బిగ్బాస్’ బ్యూటీపై నెమలి దాడి..
-
‘బిగ్బాస్’ బ్యూటీపై నెమలి దాడి.. వీడియో వైరల్
‘బిగ్బాస్’బ్యూటీ, బాలీవుడ్ టీవి నటి దిగంగన సూర్యవంశిపై నెమలి దాడి చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియో ప్రకారం ఒక అందమైన నెమలి దగ్గరకు దిగంగన వెళ్లింది. అది అలాగే చూస్తూ ఉండడంతో నవ్వుతూ మరింత దగ్గరకు వెళ్లింది. నెమలి మెల్లిగా ముందుకు వచ్చి అకస్మాత్తుగా దిగంగనపై దాడిచేసింది. దీంతో భయానికి లోనైన దిగంగన.. గట్టిగా అరుస్తూ చేతులతో నెమలిని కిందికి తోసేసింది. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అయింది. బాలీవుడ్లో పలు సీరియళ్లలో నటించిన దిగంగన..‘ఏక్ వీర్ కి అర్దాస్ ... వీరా’తో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ సిరియల్ వల్లే..హిందీ బిగ్బాస్-9లోకి వెళ్లింది. అనంతరం పలు సినిమాల్లో నటించిది. తెలుగులో యువహీరో కార్తికేయతో కలిసి ‘హిప్పీ’సినిమాలో నటించింది. ప్రస్తుతం గోపిచంద్ హీరోగా నటిస్తున్న సీటీమార్ చిత్రంలో రెండో హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాలో మరో హీరోయిన్గా తమన్నా నటిస్తున్న విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
ఎలుగుబంటి విత్ పింఛం
కొన్ని చాలా సడెన్గా జరుగుతాయి.. కన్నార్పేలోపే మాయమైపోతుంటాయి కూడా.. ఇక్కడ కనిపించే చిత్రం కూడా అలాంటిదే.. బైజూపాటిల్ అనే ఫొటోగ్రాఫర్ కాస్త చురుకు కాబట్టి.. వెంటనే ఇలా క్లిక్మనిపించేశాడు.. చూశారుగా.. ఎలుగుబంటి విత్ పింఛం.. రాజస్తాన్లోని రణతంబోర్ జాతీయ పార్కులో పర్యాటకులు జీప్లో వెళ్తుండగా.. నెమలి పింఛం విప్పి ఆడటం మొదలుపెట్టింది.. వారు చూస్తున్నారు.. అంతలో ఒక ఎలుగుబంటి అలా వచ్చి.. నిల్చుని చూడటం.. బైజూపాటిల్ తన కెమెరా కంటిలో దీన్ని బంధించేయడం చకచకా జరిగిపోయాయి. -
మయూరానికి ప్రేమతో...
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ ఆదివారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో నెమలికి ఆహారం అందిస్తున్న దృశ్యమిది. ఇదే కాంపౌండ్లో ఆఫీసు భవనాలు ఉన్నాయి. వీటి మధ్య నిత్యం మోదీ మార్నింగ్ వాక్ చేస్తుంటారు. ప్రధాని నడక, ఇతర వ్యాయామాలు చేస్తుంటే పరిసరాల్లో నెమళ్లు తచ్చాడుతుంటాయట. వీటి స్వేచ్ఛకు భంగం వాటిల్లకుండా చూసుకుంటారాయన. ప్రకృతి ప్రేమికుడైన మోదీ తన నివాసంలో పక్షులు గూళ్లు పెట్టుకునేందుకు వీలుగా ఎత్తైన స్తంభాలతో కూడిన ఆకృతులను కూడా ఏర్పాటు చేశారు. ఆదివారం వాకింగ్ చేస్తున్నపుడు తన దగ్గరకు వచ్చిన నెమళ్లకు మోదీ కింద కూర్చొని మరీ ఇలా ఆహారం అందించారు. తన మార్నింగ్ వాక్ దృశ్యాలతో కూడిన 107 సెకన్ల నిడివిగల వీడియోను ప్రధాని సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. -
కంటి చూపు పోగొట్టిన సెల్ఫీ
చెన్నై,తిరువొత్తియూరు: సెల్ఫీ తీస్తున్న సమయంలో రైతు కన్నును నెమలి పొడవడంతో అతను ఆ కంటి చూపును కోల్పోయే అవకాశం ఉన్నట్లు వైద్యులు చెప్పారు. కృష్ణగిరి జిల్లా డెంకినీకోట మారుదాంపల్లెకి చెందిన రామచంద్రారెడ్డి (60) రైతు. అతని ఇంటికి సమీపంలో రోజూ మధ్యాహ్నం సమయంలో ఆహారం కోసం ఒక నెమలి వచ్చి వెళ్లేది. దీన్ని గమనించిన అదే ప్రాంతానికి చెందిన రైతు బాలాజీ (33) ఆ నెమలి పక్కన నిలబడి సెల్ఫీ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆదివారం మధ్యాహ్నం నెమలి వచ్చిన వెంటనే దాని పక్కకు వెళ్లి నిలబడి సెల్ఫోన్లో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో నెమలి హఠాత్తుగా బాలాజీ ఎడమకంటిని తన ముక్కుతో పొడిచింది. ఈ ఘటనలో అతని కంటి నుంచి రక్తం వెలువడింది. అతన్ని చికిత్స కోసం హోసూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ తరువాత మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ అతనికి డాక్టర్లు కంటి చూపు రావడం చాలా కష్టమని తెలిపారు. నెమలిని సోమవారం గ్రామ ప్రజలు పట్టుకున్నారు. విషయం తెలుసుకున్న డెంకినీ కోట అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకుని నెమలిని విడిపించి ఐఆర్ అటవీశాఖ ప్రాంతంలో వదలిపెట్టారు. -
ఆనంద నాట్యం
కడప :అట్లూరు మండలం తంభళ్లగొంది పంచాయతీ పరిధిలో నబీ ఆభాద్ గ్రామం ఉంది. గ్రామంలో 25 కుటుంబాల వారు నివసిస్తున్నారు. అంతా ముస్లింలే. ఆ గ్రామంలోకి రెండేళ్ల క్రితం లంకమల్లేశ్వర అభయారణ్యం నుంచి ఒక నెమలి పిల్ల వచ్చింది. దాన్ని గ్రామస్తులు చేరదీసి కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. ఇప్పుడు ఆ నెమలి పెద్దదై గ్రామంలో కోళ్లతో కలిసి కలియ తిరుగుతూ రోజూ ఉదయం, సాయంత్రం పురి విప్పి నాట్యం చేస్తోంది.æ ఈ గ్రామం కడప–బద్వేలు ప్రధాన రహదారి పక్కనే ఉండటంతో ఆ దారి వెంట వెళ్లే వారు సైతం నెమలి నాట్యాన్ని ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఆ గ్రామస్తులు నెమలిని ప్రేమగా పెంచుకుంటున్న తీరును చూస్తుంటే వారికి సలాం కొట్టాలనిపించక మానదు. -
‘వావ్.. ట్రాఫిక్ జామ్ అయితే ఎంత బాగుందో’
నెమలి కనిపిస్తే ఎప్పుడు పురివిప్పి నాట్యం చేస్తుందా అని ఎదురు చుస్తాం. అంత అద్భుతంగా ఉంటుంది మరి దాని అందం. అదే పదుల సంఖ్యలో నెమళ్లు రోడ్లపైకి వచ్చి తిరుగుతుంటే ఎలా ఉంటుంది. చూడటానికి రెండు కళ్లు సరిపోవు. అలా చూస్తూ ఉండిపోవాల్సిందే. దేశమంతా లాక్డౌన్ ఉండటంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. దీంతో అడవి జంతువులన్ని రోడ్లపైకి వచ్చి స్వేచ్ఛగా విహరించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల లాక్డౌన్కు సడలింపులు ఇచ్చిన అనంతరం రోడ్లపై వాహనాల రాకపోకలు పెరిగిపోయాయి. ఈ క్రమంలో రద్దీగా ఉన్న రోడ్డుపైకి అనుకొని అతిథులు వచ్చి వాహనదారులకు కాస్తా ట్రాఫిక్ జామ్ కలిగించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో ట్రెండ్ అవుతోంది. కొన్ని నెమళ్లు గుంపులుగా రోడ్డుపైకి అడ్డంగా వచ్చాయి. వాటిలో ఒకటి ఒక్కసారిగా పురివిప్పి అందంగా కనిపించింది. ఈ దృశ్యాలను భారతీయ అటవీశాఖ అధికారి పర్వీన్ కస్వాన్ తన ట్విటర్లో షేర్ చేశారు. ‘జాతీయ పక్షితో అద్భుతమైన ట్రాఫిక్ జామ్’ అంటూ ట్విటర్లో షేర్ చేసిన ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఇప్పటి వరకు దీనిని లక్షా ఇరవై వేల మంది వీక్షించారు. నెమళ్ల కారణంగా రోడ్డుపై వెళుతున్న వాహనాలకు కొంత ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అయితే దీనిని విసుగ్గా భావించకుండా ఆసక్తిగా తిలకిస్తున్నారు. ‘వావ్ .... ఎంత ఆసక్తికరమైన, ఆహ్లాదకరమైన ట్రాఫిక్ జామ్.. గంటల కొద్ది ట్రాఫిక్లో ఇరుకున్న ఇబ్బందిగా అనిపించదు. ’’అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. (కరోనా : అనుకోని అతిధి వైరల్ వీడియో) -
కరోనా : అనుకోని అతిధి వైరల్ వీడియో
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ , లాక్డౌన్ సంక్షోభ కాలంలో నాలుగ్గోడలకే పరిమితమైన మీ ఇంటికి అనుకోని అతిధి వస్తే ఎలా వుంటుంది. అదీ ఒక అందమైన సోయగాల మయూరం వచ్చి వయ్యారంగా తలుపు తడితే..ఏం చేస్తారు..సరిగ్గా ఇలాంటి అనుభవమే ఎదురైంది ఓ నెటిజనుడికి. దీంతో పరవశించిపోయిన గుంజన్ మెహతా అనే యూజర్ ఈ అపురూప దృశ్యాన్ని తమ కెమెరాలో బంధించి ట్విటర్లో పోస్ట్ చేశారు. ఎక్కడినుంచి తెలీదుగానీ, ఒక నెమలి కిటికీ మీద వాలి..ఎంతో పొందిగ్గా.. టక్..టక్.టక్.. ఎవరైనా ఉన్నారా లోపల అన్న చందంగా ముక్కుతో పొడుస్తున్న ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. టీ, కాఫీ ఇచ్చి అతిథి మర్యాదలు చేయమంటే కొందరు చమత్కరిస్తోంటే.. పాపం ఆకలేస్తోందేమే.. కొద్దిగా తృణధాన్యాలు, కాస్త నీరు ఇవ్వండి అని మరికొందరు సూచిస్తున్నారు. కోరలు చాచిన కరోనా వైరస్ నుంచి తప్పించుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతోంది. మనుషులంతా ఇంటికే పరిమితమవుతున్నారు. ఆహారం, నీరు లభ్యం కాక కొన్ని మూగ జీవులు, పక్షులు అల్లాడుతున్నాయి. మరోవైపు అన్ని రవాణా సేవలు నిలిచిపోవడంతో కాలుష్యం గణనీయంగా తగ్గి ప్రకృతి సేదతీరుతోంది. చదవండి : మరో మెగా డీల్కు సిద్ధమవుతున్న అంబానీ -
నెమలి సోయగం.. అద్భుతమైన వీడియో!
అటవీ శాఖ అధికారి సుశాంత నందా సోషల్ మీడియాలో అరుదైన వీడియోలు షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటారు. తాజాగా.. అందమైన ఈకలను రెపరెపలాడిస్తూ నెమలి చెట్టుపైకి ఎగురుతున్న అద్భుత దృశ్యాలు చూసే అవకాశం తన ఫాలోవర్లకు కల్పించారు. ‘‘నెమలి ఇలాగే ఎగురుతుంది. దాని తోకలోని ఈకలు దాదాపు ఆరు అడుగుల పొడవు ఉంటాయి. శరీరం పొడవు కంటే అవే 60 శాతం ఎక్కువ’’అంటూ ట్విటర్లో పోస్ట్ చేసిన వీడియోకు వారంతా ఫిదా అవుతున్నారు.(ఇళ్ల ముందు నుంచే కనిపిస్తున్న మంచుకొండలు) ఇక ఇప్పటికే లక్షకు పైగా వ్యూస్ సాధించిన ఆ వీడియో రాజస్తాన్లోని రణతంబోర్ జాతీయ పార్కులో తీశారు. వైల్డ్లైఫ్ ఫొటోగ్రాఫర్ హర్షా నరసింహమూర్తి గతేడాది తన కెమెరాలో ఈ దృశ్యాలను బంధించారు. రెండు నెమళ్లు నడుస్తూ వెళ్తుండగా... అందులో ఒకటి తన పింఛం సోయగాన్ని ప్రదర్శిస్తూ ఓ కొమ్మపై వాలింది. ఈ అద్భుత వీడియోను చూసిన నెటిజన్లు హర్షతో పాటు అతడి వీడియోను షేర్ చేసినందుకు సుశాంత్ నందాను అభినందించకుండా ఉండలేకపోతున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఓ లుక్కేయండి.(‘ఘోస్ట్ ఆఫ్ మౌంటేన్’.. ఇవి అందమైనవి!) -
నెమలి ఆర్డర్ చేస్తే టర్కీ కోడి వచ్చింది..!
సాధారణంగా పెళ్లి వేడుకల్లో వివాహం చేసుకునే జంట అందమైన, రంగురంగుల ఆకృతిలో ఉండే కేకులను కట్ చేసి తమ అనందాన్ని రెట్టింపు చేసుకుంటారు. ఈ క్రమంలోనే జార్జియాకు చెందిన రెనా డేవిస్ అనే పెళ్లి కూతురు తన వివాహ వేడుకకు నెమలి ఆకారంలో ఉన్న కేకును 300 డాలర్లు ఖర్చు చేసి మరి ఆన్లైన్లో ఆర్డర్ చేసింది. కేకు కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూసిన తాను కేకు వచ్చాక దాన్ని చూసి షాక్కు గురైంది. ఆ కేకు పూర్తిగా తాను పంపించిన నెమలి ఆకారానికి భిన్నంగా ఉండటంతో సదరు పెళ్లి కూతురు అగ్గి మీద గుగ్గిలంలా మారింది. తాను వృత్తాకారంలో ఉండే పదార్థం మీద కూర్చున్న నెమలి.. తన పింఛము కన్నులు నీలం, ఆకుపచ్చ రంగులతో చిన్న బుట్ట కేకులుగా ఉండే కేకును ఆర్డర్ చేసింది. అయితే అందమైన కేకు కోసం వేచి చూసిన రెనాకు చేదు అనుభవం ఎదురైంది. వింత ఆకారంలో తయారు చేయబడిన కేకును రేనా వదిన అన్నెట్ హిల్ ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. ‘కేకును తయారు చేసే పదార్థం తెల్లగా లేదు. కుష్టి రోగం వచ్చిన నెమలి లేదా ఓ టర్కీ కోడిలా కేకు మాకు దర్శనమిచ్చిందని వ్యంగ్యంగా తెలిపారు. కనీసం ఆ పక్షికి తోక కూడా సరిగా లేదని మండిపడ్డారు. ఎటునుంచి చూసినా ఆ పక్షి ఆకారం తాము ఆర్డర్ చేసిన నెమలి ఆకృతిలో మాత్రము లేదని’ హిల్ పేర్కొన్నారు. ఇంత వికృతంగా తయారుచేయబడిన ఈ కేకు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో చివరగా సంబంధిత బేకరీ సిబ్బంది కేకు డబ్బులను తిరిగి ఇచ్చినట్టు హిల్ తెలిపారు. -
మైమరపించి.. ఆపై మరణించి..
చిత్తూరు, భాకరాపేట : అడవుల్లో నుంచి ఓ నెమలి గ్రామంలోకి వచ్చి పురి విప్పి నాట్యమాడుతూ గ్రామస్తులను మైమరపిస్తూ ప్రాణాలు వదిలిన ఘటన చిన్నగొట్టిగల్లు మండలం దిగవూరు పంచాయతీ గాజులవారిపల్లెలో జరిగింది. గ్రామస్తుల కథనం మేరకు.. చాలారోజులుగా ఓ నెమలి తరచూ గ్రామంలోకి వచ్చి కొంతసేపటి తర్వాత వెళ్లిపోయేది. గ్రామస్తులు కూడా నెమలి రాక కోసం చూసేవారు. క్రమంగా అది ఆ గ్రామంలో ఓ భాగమైంది. అది శుక్రవారం ఉదయం ఓ చెట్టు కింద నాట్యమాడింది. గ్రామస్తులు తమ మొబైల్ ఫోన్లలో ఫొటోలు, వీడియోలు తీశారు. నెమలి హఠాత్తుగా గిలగిలమంటూ కొట్టుకుని కింద పడిపోయింది. గ్రామస్తులు పరిశీలించ గా అప్పటికే ప్రాణాలు వదిలేసింది. దీంతో గ్రామస్తులు ఆవేదన చెందారు. గ్రామంలో చంటి బిడ్డలు ఏడిస్తే నెమలిని చూపిం చి వారికి బువ్వ పెట్టేవారమని, ఉదయం, సాయంత్రం వేళల్లో పురివిప్పి నాట్యం ఆడుతుంటే చూడడానికి కన్నులు చాలవని గ్రామస్తులు చెప్పారు. వెంటనే భాకరాపేట ఫారెస్టు అధికారులకు సమాచారం తెలియజేయడంతో వారు వచ్చి తీసుకెళ్లి పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి జూపార్క్కు పంపించారు. గాజులవారిలపల్లె గ్రామస్తులు మాత్రం నెమలి చనిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అటవీశాఖ అధికారులు సైతం ఆ గ్రామస్తులు నెమలిపై చూపిన ప్రేమకు ఆశ్చర్యానికి లోనయ్యారు. -
మయూరం.. వయ్యారం
కోస్గి : మేఘాలు కమ్ముకున్న వేళ.. ఆనంద పరవశంలో ఓ మయూరం తన పురివిప్పి చేసిన నాట్యం అందరిని ఆకట్టుకుంది. ఆదివారం సాయంత్రం పట్టణ శివారులోని బిజ్జారపు బావుల కాలనీ సమీపంలోని ఓ రైతు పొలంలో ఇదిగో ఇలా నాట్యమాడుతూ అబ్బురపరిచింది. పురివిప్పి నాట్యం చేస్తున్న నెమలి -
నెమలి జన్యుక్రమాన్ని కనుగొన్నారు
సాక్షి, న్యూఢిల్లీ : మన జాతీయ పక్షి నెమలి జన్యు క్రమాన్ని భోపాల్లోని ఐఐఎస్ఆర్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. నెమలి పురివిప్పినప్పుడు అందంగా కనిపించే నెమలి పించాలు నెమలికి ఎలా వచ్చాయి? బరువు ఎక్కువగా ఉన్నప్పటికీ నెమలి ఎలా గాల్లోకి సులువగా ఎగురగలుగుతుందన్నది నెమలికి సంబంధించిన రెండు ప్రత్యేక అంశాలు. ఏడాదిన్నర కృషితో ఇప్పుడు నెమలి జన్యుక్రమాన్ని పరిశోధకులు కనుగొనడంతో ఈ రెండు ప్రత్యేక అంశాలు దానికి ఎలా సిద్ధించాయో! సులభంగానే తెలుసుకోవచ్చు. నెమలిలో మొత్తం 15,970 జన్యువులు, 110 కోట్ల డీఎన్ఏ జతలు ఉన్నాయని పరిశోధకులు కనుగొన్నారు. నెమలికి దగ్గరిగా ఉండే మన నాటు కోడి, టర్కీ కోడితోని పోల్చి చూడగా నెమలిలో 99 జన్యువులు వేరుగా ఉన్నాయి. నెమలి పిండం ఎదగడానికి, దానిలో రోగ నిరోధక శక్తి పెరగడానికే ఈ జన్యువులు ఎక్కువగా ఉపయోగపడుతున్నాయని వారు తేల్చారు. 99 భిన్నమైన జన్యువులు కనిపించడం తమకు నూతనోత్సాహాన్ని కలిగిస్తోందని ‘బీ10కె ప్రాజెక్ట్’ నిర్వాహకుల్లో ఒకరైన గోజీ జాంగ్ వ్యాఖ్యానించారు. 2020 నాటికి అన్ని పక్షి జాతుల జీనోమ్ను కనుగొనడమే తమ ప్రాజెక్ట్ లక్ష్యమని ఆయన తెలిపారు. కోళ్లు ఏడెనిమిది ఏళ్లు జీవిస్తుండగా, టర్కీ కోళ్లు పదేళ్లు జీవిస్తాయి. నెమళ్లు మాత్రం 25 సంవత్సరాలు జీవిస్తాయి. కోళ్లకన్నా నెమళ్లు ఎక్కువ కాలం జీవించడానికి కారణం అందులో ప్రత్యేకంగా కనిపిస్తోన్న 99 జన్యువులే కారణమని శాస్త్రవేత్తలు తెలిపారు. నెమళ్లలో ఆడ నెమళ్లే తమతో లైంగికంగా జతకట్టే మగనెమళ్లను ఎంపిక చేసుకోవడం వీటిలో ఉండే మరో ప్రత్యేకత. అందుకే ఆడ నెమళ్ల దష్టిలో పడేందుకు మగ నెమళ్లు పురివిప్పి నాట్యమాడుతున్నట్లుగా తిరుగుతాయి. మగ నెమలి పించాల్లో ఎన్ని కనులు ఉన్నాయనే అంశం ఆధారంగానే వాటి లైంగిక జీవితం ఆధారపడుతుంది. సాధారణంగా ఆడ నెమళ్ళు ఎక్కువ ఈకలపై ఎక్కువ కన్నులున్న నెమళ్లనే జోడిగా ఎంపిక చేసుకుంటాయి. వాటి లైంగిక పటుత్వానికి నెమలి కన్నులు ప్రతీకగా నిలుస్తున్నాయని, ఈ విషయంలో మరిన్ని పరీక్షలు నిర్వహించాల్సి ఉందని పరిశోధకులు తెలిపారు. -
వివాదంగా మారిన నెమలి అంత్యక్రియలు
న్యూఢిల్లీ: సాధారణంగా యుద్ధాల్లో వీరమరణం పొందిన జవాన్లకు త్రివర్ణ పతాకం కప్పి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపిస్తారు. కానీ చనిపోయిన నెమలికి త్రివర్ణ పతాకం కప్పి అంత్యక్రియలు నిర్వహించి వివాదంలో చిక్కుకున్నారు ఢిల్లీ పోలీసులు. గత శుక్రవారం ఢిల్లీలోని తిలక్ మార్గ్ పోలీస్ స్టేషన్ పరిసరాల్లో చనిపోయిన నెమలిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దానిని త్రివర్ణ పతాకంలో చుట్టి బాక్స్లో తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. దీంతో ఈ ఘటన వివాదస్పదంగా మారింది. పోలీసులు అలా అంత్యక్రియలు నిర్వహించడం సబబు కాదని పలువురు వన్యప్రాణి ప్రేమికులు ఆరోపిస్తున్నారు. ‘ వన్యప్రాణి సంరక్షణ ప్రకారం ఇలాంటి పక్షులు చనిపోతే రాష్ట్ర అటవీ శాఖ వాటికి పోస్ట్మార్టం నిర్వహించి అంత్యక్రియలు నిర్వహిస్తుంది. ఇది పోలీసులు చేయాల్సిన పని కాదు’ అని వన్యప్రాణి సంరక్షణ కార్యకర్త గౌరి మౌలేక్ పేర్కొన్నారు. దీనిపై పోలీసులు స్పందిస్తూ..‘ నెమలి మన జాతీయ పక్షి కాబట్టి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చాం. మేం ప్రొటోకాల్ను పాటించాం. రాబోయే రోజుల్లో కూడా ఇలాగే నెమళ్లు చనిపోయినట్లు మా దృష్టికి వస్తే వాటికి కూడా ఇలాగే అధికారిక లాంఛనాలతోనే అంత్యక్రియలు నిర్వహిస్తాం’ అని తెలిపారు. -
విమానంలోకి ఇంత పెద్ద నెమలా?
న్యూజెర్సీ, అమెరికా : కుక్క, పిల్లి తదితర పెంపుడు జంతువులను యజమానులు తమతో పాటు ఊర్లకు తీసుకెళ్లడం మన అందరం చూశాం. నెమలిని పెంచుకుంటున్న ఓ మహిళ దాన్ని కూడా ఊరికి తీసుకెళ్దామని ఎంచక్కా ఎయిర్పోర్టుకు తీసుకొచ్చేసింది. ఇందుకోసం నెమలికి సైతం ప్రత్యేకంగా టికెట్ను కూడా తీసింది. ఈ ఘటన నెవార్క్ లిబర్టీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో చోటు చేసుకుంది. అయితే, నెమలి విమానంలో ప్రయాణించేందుకు ఎయిర్లైన్స్ సంస్థ ఒప్పుకోలేదు. గత నెలలో అమెరికాకు చెందిన విమానయాన సంస్థలు పెట్స్ను క్యారీ చేయడంపై కఠిన నిబంధనలు తీసుకొచ్చాయి. దీంతో నెమలికి కూడా ప్రత్యేకంగా టికెట్ తీసుకున్నానని, దయచేసి దాన్ని కూడా ప్రయాణించనివ్వాలన్న మహిళ అభ్యర్థనను ఎయిర్లైన్స్ ఉద్యోగులు తోసిపుచ్చారు. దీంతో ‘ఎమోషనల్ సపోర్ట్ యానిమల్’ నిబంధనల ప్రకారం తన పక్షిని విమానంలో తీసుకెళ్లే హక్కుందని మహిళ ఎయిర్లైన్స్ ఉద్యోగులతో వాదనకు దిగారు. ఈ సంఘటన మొత్తాన్ని చిత్రీకరించిన ఓ వ్యక్తి సదరు మహిళ, నెమలి ఫొటోలను సోషల్మీడియాలో పోస్టు చేశారు. దీంతో అవి ఫోటోలు వైరల్ అయ్యాయి. ‘ఎమోషనల్ సపోర్ట్ ఎనిమల్’ షరతులతో నెమలి ప్రయాణించడం సాధ్యం కాదని ఎయిర్లైన్స్ అధికారులు తెలిపారు. నెమలి ఆకారంలో, బరువులో నిబంధనలకు మించి ఉందని వెల్లడించారు. ఇదిలావుండగా అంతపెద్ద సైజు ఉన్న నెమలి విమాన సీట్లో ఎలా పడుతుందని?, టికెట్లో నెమలి పేరును ఏం రాశారని?, ఎమోషనల్ సపోర్ట్ పికాక్ ఎక్కడ దొరుకుతుందంటూ? నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. -
విద్యుదాఘాతంతో నెమలి మృతి
సి.బెళగల్ : సి.బెళగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో జాతీయపక్షి నెమలి విద్యుదాఘాతంతో మృతిచెందింది. అడవి నుంచి వచ్చిన నెమలి తీగలపై వాలే క్రమంలో విద్యుదాఘాతానికి గురై కింద పడింది. స్థానిక బీసీ హాస్టల్ విద్యార్థులు రక్షించే ప్రయత్నం చేయగా అప్పటికే మృతి చెందింది. నెమలి కళేబరాన్ని స్థానిక పోలీసులకు అప్పగించగా వారు ఖననం చేశారు. -
ఆడ నెమళ్లకు తోడు అక్కర్లేదా?
న్యూఢిల్లీ: మగ నెమలిని జాతీయ పక్షిగా గుర్తించినప్పుడు ఆవును మాత్రం జాతీయ జంతువుగా ఎందుకు గుర్తించరని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ రాజస్థాన్ జడ్జీ ఎంసీ శర్మ నెమళ్ల గురించి ఓ వింతైన విషయం చెప్పారు. మగ నెమళ్లు జీవితాంతం బ్రహ్మచారులుగా ఉంటాయని, వాటి కన్నీళ్లను తాగడం ద్వారా ఆడ నెమళ్లలో సంతానోత్పత్తికి బీజం పడుతుందని ఆయన కొత్త విషయం చెప్పారు. ఆడ, మగ నెమళ్లు ఎలా కలసుకుంటాయో జియోగ్రఫికల్ ఛానళ్లు చూసిన వాళ్లు ఇటు జడ్జీ వ్యాఖ్యల వీడియో క్లిప్పింగులను, అటు నెమళ్ల మేటింగ్ వీడియోలను ట్విట్టర్లో పోస్ట్చేసి షేర్ చేసుకుంటున్నారు. మానవ పరిణామ క్రమం సిద్ధాంతాన్ని వివరించిన చార్లెస్ డార్విన్కు మగ నెమళ్లకు తోక ఎందుకు అంత పెద్దగా ఉంటుంది, ఎందుకు అంత అందంగా ఉంటుందన్న విషయం ఓ అర్థంకాక అప్పట్లో తలపట్టుకు తిరిగారట. ఆయన రాసిన ‘సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్’ సిద్ధాంతం ప్రకారం పర్యావరణ పరిస్థితులకు అనుగుణంగా ఏ జాతి జంతువైనా, పక్షి అయినా మనుగడ సాగిస్తుంది. అలా మనుగడ సాగించలేని జాతులు అంతరించి పోతాయి. లేదా మనుగడ సాగించే జాతుల ఆకతిలో, అవయవాల్లో మార్పులు వస్తాయన్నది ఆయన సిద్ధాంతం. ఆయన 1859లో ‘ది ఆరిజన్ ఆఫ్ స్పీసెస్’ (జాతుల మూలాలు) అంటూ ఓ పుస్తకం కూడా రాశారు. అప్పుడే ఆయన బుర్రలో ఓ అనుమానం తలెత్తింది. సులువుగా గాలిలోకి ఎగరడానికి, వేగంగా దూసుకుపోవడానికి మగ నెమళ్లకు పొడవైన ఈకలతో కూడిన తోక అడ్డం పడుతోంది. అలా అడ్డం పడుతున్న తోక కాల క్రమంలో ఎందుకు అంతరించి పోవడం లేదన్నది ఆయన అనుమానం. ఈ అనుమానాన్ని నివత్తి చేసుకోవడం కోసం నెమళ్లపై ఆయన మరింత లోతుగా అధ్యయనం జరిపారు. అప్పుడు అసలు విషయం ఆయనకు అర్థం అయింది. మగ నెమళ్ల తోకలను బట్టి ఆడ నెమళ్లు తోడును వెతుక్కుంటాయని తేలింది. పైగా ఆ తోకలు అంత అందంగా ఉండడానికి కారణం కూడా ఆడ నెమళ్లను ఆకర్షించడానికేనని కూడా డార్విన్ అర్థం చేసుకున్నారు. అంటే తోకకు సెక్స్ ప్రయోజనం ఉండడం వల్ల అది అంతరించి పోవడం లేదన్నది ఆయన థియరీ. మగ నెమళ్లు పురివిప్పి నాట్యం చేసేదే ఆడ నెమళ్లను ఆకర్షించడానికని, ఆడ నెమళ్లు తమ రుతు క్రమాన్నిబట్టి వాటికి స్పందిస్తాయని పక్షి ప్రేమికుడు, పక్షుల అలవాట్లపై పుస్తకాలు రాసిన ప్రముఖ రచయిత బెర్నార్డ్ పియర్స్ బ్రెంట్ మరింత వివరంగా చెప్పారు. -
రోడ్డుపైకి వచ్చిన మయూరం
మడకశిర రూరల్ : అటవీ ప్రాంతంలో మేత, నీరు లేక వన్యప్రాణులు గ్రామాల్లోకి వస్తున్నాయి. ఆదివారం మండలంలోని గుడ్డంపల్లి సమీపంలోని ప్రధాన రోడ్డుపైకి నెమలి వచ్చింది. కొద్దిసేపు రోడ్డుపైనే అటూ ఇటూ తిరిగి సమీపంలో ఇళ్ల ముందున్న నీరు తాగింది. అనంతరం సమీపంలోని పొదల్లోకి వెళ్లింది. అధికారులు స్పందించి అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల కోసం మేత, నీటి సౌకర్యం కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. -
జనారణ్యంలోకి జాతీయ పక్షి
అప్పుడే ఎండలు మండుతున్నాయి. భూగర్భ జలాలు అడుగుంటాయి. తాగునీటి కోసం జనమే కాదు.. వన్యప్రాణులు సైతం విలవిల్లాడిపోతున్నాయి. దాహార్తిని తీర్చుకునేందుకు అడవులు వదిలి జనారణ్యంలోకి వన్యప్రాణులు వచ్చేస్తున్నాయి. అందుకు మడకశిర మండలం ఆదిరెడ్డిపాళ్యం సమీపంలోని ప్రధాన రహదారిపైకి ఓ నెమలి ఒయ్యారంగా నడుచుకుంటూ వచ్చిన దృశ్యం ఆ మార్గంలో రాకపోకలు సాగించిన వారందరినీ గురువారం ఆకట్టుకుంది. కాసేపటికి అక్కడే ఉన్న కోళ్ల మధ్యలోకి చేరుకుంది. వన్యప్రాణులకు మేత, నీరు ఏర్పాటు చేయాలని స్థానికులు అటవీ అధికారులను కోరారు. - మడకశిర రూరల్ -
చెర్రీ.. సరదాగా కాసేపు..!
-
చెర్రీ.. సరదాగా కాసేపు..!
ప్రస్తుతం సుకుమార్ సినిమా కోసం మేకోవర్ అవుతున్న రామ్ చరణ్ కాలీ సమయాన్ని సరదాగా గడుపుతున్నాడు. ఇందులో భాగంగా తన ఫాంలో టైం పాస్ చేస్తున్న మెగా పవర్ స్టార్ ను అనుకోని అతిథి పలకరించింది. మన జాతీయ పక్షి నెమలి చరణ్ ఫాంలో దర్శనమిచ్చింది. ఆ నెమలి చరణ్ గడిపిన సరదా సమయాన్ని తన అభిమానుల కోసం వీడియో రూపంలో ఫేస్ బుక్ పేజ్ లో పోస్ట్ చేశాడు చరణ్. ధృవ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న చరణ్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా కోసం రెడీ అవుతున్నాడు. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్ పల్లెటూరి యువకుడిగా కనిపిస్తున్నాడు. చరణ్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తుండగా మరో కీలక పాత్రలో కోలీవుడ్ యువ నటుడు వైభవ్ కనిపించనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ మూవీ ఈ నెల 20న సెట్స్ మీదకు వెళ్లనుంది. -
రాములోరి సాక్షిగా నెమలి కాల్చివేత
పోలీసుల అదుపులో నిందితులు మెదక్ రూరల్: తొగిట రామాలయం సమీపంలో జాతీయపక్షిని దుండగులు కాల్చివేసిన సంఘటన మెదక్ మండల పరిధిలోని తొగిట గ్రామంలో శనివారం రాత్రి జరిగింది. ఫారెస్టు అధికారులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం రైతులైన దేవునికూచన్పల్లి గ్రామానికి చెందిన పంతెం దుర్గయ్య, ఎరుకల భూమలయ్య, ఎరుకల బక్కయ్యలు తొగిట, దేవుని కూచన్పల్లి సరిహద్దులోని రామాలయం సమీపంలో శనివారం రాత్రి నెమలిని చంపి కాలుస్తున్నారు. ఈ విషయాన్ని గమనించిన పశువుల కాపరులు తొగట గ్రామస్తులకు చెప్పడంతో వారు నిందితులను పట్టుకొని ఫారెస్టు అధికారులకు సమాచారం అందించారు. ఫారెస్టు అధికారులు ఘటనాస్థలికి చేరుకుని నెమలి కళేబరాన్ని స్వాధీనం చేసుకొని నిందితులను అదుపులోని తీసుకున్నారు. కాగా, ట్రాన్స్ఫార్మర్కు తగిలి నెమలి చనిపోయిందని, దానిని కాల్చామని నిందితులు చెప్పారు. పూర్తిస్థాయి విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని ఫారెస్టు డిప్యూటీ రేంజర్ మనోజ్కుమార్ తెలిపారు. ఆయన వెంట బీట్ ఆఫీసర్లు ప్రియాంక, ప్రవీణ్ తదితరులు ఉన్నారు. -
ఫారెస్ట్ అధికారికి నెమలి అప్పగింత
కూనూరు (భువనగిరి అర్బన్) : అటవీప్రాంతం నుంచి ఓ నెమలి ఆదివారం మండలంలోని కూనూరు గ్రామంలో జనవాసాల్లోకి వచ్చింది. దీంతో గ్రామస్తులు ఆ నెమలిని పట్టుకుని ఫారెస్ట్ అధికారికి సమాచారం అందజేశారు. వెంటనే గ్రామానికి చేరుకున్న అధికారి సీహెచ్.వెంకటయ్యకు నెమలిని అప్పగించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అబ్బగాని వెంకట్గౌడ్, పాశం శివానంద్, వెంకట్, అఫ్రిద్, గ్రామస్తులు పాల్గొన్నారు. -
పాప భయంపై ఫొటోషాప్ పోట్లాట
ఒక్కసారిగా పురివిప్పిన నెమలిని ఎక్కడ తనను పొడుచుకుతింటుందోనన్న భయంతో ప్రాణాలు అరచేతిలోపెట్టుకుని పరుగుపెడుతోన్న ఈ ఆరేళ్ల పాప ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సమస్యలన్నీ ఇప్పుడా పాపను చుట్టేశాయి. సంబంధంలేని ఎన్నెన్నో సంఘటనల్లోకి ఆమెను లాగేశారు. ఇదంతా ఎలా జరిగిందంటే.. ప్రఖ్యాత న్యూస్ నెట్ వర్కింగ్ సైట్ రెడిట్ లో ఓ పాఠకుడు తన కూతురి ఫొటోను పోస్ట్ చేశాడు. కూతురిని తీసుకుని చిన్నపిల్లల పార్కుకు వెళ్లామని, అయితే ఆ సందర్శన అనుకున్నంత సజావుగా (నెమలిని చూసి పాప భయపడిపోవడం వల్ల) జరగలేదని ఫొటో కింద కామెంట్ పెట్టాడు. రెడిట్ లో జూన్ 26న ఈ ఫొటో పోస్ట్ అయిన కొద్ది గంటల్లోనే ఫొటోషాప్ కొట్లాట మొదలైంది. ఒక వ్యక్తి .. పాప భయాన్ని బ్రెగ్జిట్ తో ముడిపెడుతూ నెమలిని యురోపియన్ యూనియన్(ఈయూ)గా, పాపను ఈయూ నుంచి భయపడి పారిపోతున్న బ్రిటన్ గా పోల్చుతూ ఫొటోలో మార్పులు చేశాడు. ఇంకొకడు.. అలాకాదంటూ పాపను ట్రంప్ తో పోల్చాడు. ట్రంప్ (పాప) పరుగు పందెంలో ఉస్సేన్ బోల్ట్ తో పోటీపడుతున్నట్లు ఫొటోషాప్ చేశాడు. ఇలా పాప భయంపై లెక్కకు మిక్కిలిగా పుట్టుకొచ్చిన ఫొటోషాప్డ్ ఫొటోల పోట్లాట ఇంటర్నెట్ లో నడుస్తూనేఉంది.. -
కోకిలమ్మ మౌనరాగం
స్వగతం కాకిలా కారునలుపు కాకున్నా, నల్లగానే ఉంటాను నేను. వర్షం వచ్చినప్పుడు నెమలిలా పురివిప్పలేను కానీ, వసంతం వచ్చిందంటే మాత్రం కుహూ కుహూ రాగాలను కమ్మగా పాడుకుంటాను. అందుకే కాబోలు... ప్రాచీన ప్రబంధకారుల నుంచి, ఆధునిక కవుల వరకు నన్ను తలుచుకోనివారు లేరు, నా ప్రస్తావన తేకుండా కావ్యాలూ, కవితలూ అల్లినవారు లేరు. ఎవరైనా కమ్మగా పాడితే చాలు... నాతోనే పోలుస్తారు అందరూ! మూడేళ్ల పసివారి దగ్గర నుంచి, మూడుకాళ్ల ముదుసలి వారి వరకూ నా గొంతును ఇష్టపడని వారుండరు. నేను కుహూ అన్నప్పుడల్లా వారు కూడా కుహూ అంటారు. అలా నా గొంతుతో ఎవరైనా గొంతు కలిపారంటే మహా ఇష్టం నాకు. ఎవ రైనా నన్ను అనుకరిస్తే, నేను సంతోషంగా బదులిస్తాను. అవునూ.. మా పుట్టుపూర్వోత్తరాలు మీకు పూర్తిగా తెలియవు కదూ! మాలో మొత్తం 54 రకాలున్నాయి. యూరప్ ఖండంలో రెండే రకాలు ఉన్నాయి కానీ మిగిలిన మా జాతులన్నీ కూడా ఆఫ్రికా, ఆసియా, ఆస్ట్రేలియా ఖండాల్లో జీవిస్తున్నాయి! ఒక చిన్న విషయం... మీరు అసహ్యించుకోనంటే చెబుతా... మేము మావి చిగుళ్లు మాత్రమే తింటామని మీరనుకుంటారు కానీ, మాకు గొంగళిపురుగులన్నా ఇష్టమే. కంటికి కనిపిస్తే చాలు... అమాంతం కిందికి దిగి, గుటకాయ స్వాహా చేసేదాకా మాకు తోచదు. ఇంకోటి... మాలో మగకోకిలలు పాడలేవు. ఆడకోకిలలు మాత్రమే పాడగలవు. అన్నట్టు మేము గూళ్లు కట్టుకోలేం. పిల్లల్ని పొదగలేం. ఎందుకంటే మాకు చేతకాని విద్యలు అవి. వేరే పక్షులు ముఖ్యంగా అవి మమ్మల్ని అంత తొందరగా కనుక్కోలేవు కదా అనే ధైర్యంతో మేము కాకి గూళ్లలో మా గుడ్లు పెడతాం. అట్లాగని గుడ్లు పెట్టేసి ఊరుకోం. మేము పెట్టిన గుడ్లను అవి పొదుగుతున్నాయో లేదో కూడా ఓ కంట కనిపెట్టి ఉంటాం. మా గుడ్ల నుంచి పిల్లలు బయటికొచ్చి, కాస్త పెద్దయ్యాక మా గొంతును గుర్తుపట్టి కాకులు మా పిల్లల్ని నిర్దాక్షిణ్యంగా పొడిచి వెళ్లగొడతాయి. అయినా సహించి ఊరుకుంటాం. ఎందుకంటే పాపం అవే కదా, మా గుడ్లని పొదిగి పిల్లల్ని చేసింది అనే జాలితో! అవి వెళ్లగొట్టిన తర్వాత మా పిల్లల్ని మేం అక్కున చేర్చుకుంటాం. పండ్లు, ఆకులు, చిగుళ్లు పెట్టి ప్రేమగా పెంచుకుంటాం. మాకొచ్చిన రాగాలనే మా పిల్లలకు నేర్పిస్తాం. మండు వేసవి అన్నా, మావిచిగుళ్లన్నా ప్రాణం నాకు. మామిడి పూత పూసిందంటే ప్రాణం లేచొస్తుంది. తెలియకుండానే మా గొంతు విచ్చుకుంటుంది. అప్రయత్నంగానే రాగాలు పలుకుతాం మేము. అందుకే మా మీద మీ సినీ కవులు ఎన్ని పాటలు రాశారో! ఎవరైనా బాగా పాడారంటే మాతోనే పోలుస్తారు గాన కోకిల అని. గుర్రం జాషువా గారినయితే కవి కోకిల అని బిరుదిచ్చారు. ఆవిడెవరూ... ఆ... సరోజినీ నాయుడు. ఆమె చక్కగా రాయడమే కాదు.. గొంతెత్తి కమ్మగా పాటలు పాడేదని నైటింగేల్ ఆఫ్ ఇండియా అన్నారామెని. అసలు సినిమా వాళ్లు మా మీద ఎన్నెన్ని పాటలు కట్టారో తెలుసా? ఆ పాటలకు పురస్కారాలు కూడా పుచ్చుకున్నారు కానీ, మమ్మల్ని మాత్రం పట్టించుకోలేదు. అయినా మేమేమీ చిన్నబుచ్చుకోము లేండి... ఆ పాటలు విని మాలో మేమే పొంగిపోతుంటాం. మా పక్షి జాతికంతటికీ చెట్లంటే చాలా ఇష్టం. కాదు, ప్రాణం. చెట్లే మా నివాస స్థావరం. మీరు మాత్రం మీ నివాస స్థానం కోసం మా నివాస స్థావరాలను నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తున్నారు. మేము ఎక్కడ ఉండాలి? మా బతుకు ఏం కావాలి? అడవుల్లోకెళ్లి తలదాచుకుందామనుకుంటే అక్కడికీ అడుగుపెట్టేస్తున్నారు. ఇది చాలా అన్యాయం. ఇప్పటికే మేము ఇదివరకటంత బాగా మీకు వినిపించట్లేదు. మీరిలాగే చేస్తుంటే మీ పిల్లలకు మీరు మా బొమ్మల్ని తప్ప మమ్మల్ని చూపించలేరు. మా కుహు కుహూలు ఇక మీకు నహీ నహీ! - బాచి -
వడదెబ్బకు ముగ్గురి మృతి
ఎండ@ 42.4 నేలకొరిగిన నెమలి, పలు పావురాలు సిటీబ్యూరో: భానుడు భగ్గున మండుతున్నాడు. నగరంలో పగటిపూట నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. నగరంలో శనివారం 42.4 డిగ్రీల గరిష్ట, 28.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉక్కపోతకు వడగాల్పులు తోడవడంతో నగరవాసి తట్టుకోలేక పోతున్నాడు. గ్రేటర్లో శనివారం ఒక్క రోజే ముగ్గురు మృతి చెందగా, ఒక నెమలి సహా పలు పావురాలు నేలకొరిగాయి. కాచిగూడ రైల్వేస్టేషన్కు ఎదురుగా ఓ గుర్తుతెలియని వృద్ధురాలు(60), మలక్పేటలోని ఓ ట్రాన్స్పోర్టు కార్యాలయంలో టైపిస్టుగా పని చేస్తు న్న గోపాలు(80) వడదెబ్బతో వృతి చెందారు. పంజగుట్ట గాంధీతాతా నగర్కు చెందిన ఇరుగుల లక్ష్మయ్య (50) కూలి కోసం వెంకటరమణకాలనీ అడ్డాలో నిలబడి ఉన్నాడు. ఉద యం 11 గంటల సమయంలో ఒక్కసారిగా కుప్పకూలి వుృతి చెందాడు. కుత్బుల్లాపూర్ సర్కిల్ రంగారెడ్డినగర్ డివిజన్ గాంధీనగర్ పారిశ్రామిక ప్రాంతంలో జాతీయపక్షి అయిన నెమలి మృతి చెంది ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. నాంపల్లి రైల్వేస్టేషన్, అబిడ్స్, చార్మినార్, మక్కామసీదు పరిసరాల్లో పావురాలు భారీగా వుృతి చెందారుు. వడగాల్పులకు ఉక్కపోత తోడవడంతో మధ్యాహ్నం సమయంలో విద్యుత్ వినియోగం రెట్టింపైంది. సాధారణంగా ఈ సమయంలో 45-48 మిలియన్ యూనిట్లు మాత్రమే వినియోగం జరగాల్సి ఉండగా, ఈ ఏడాది ఎండ తీవ్రత వల్ల రోజువారి విద్యుత్ వినియోగం 52-54 మిలియన్ యూనిట్లకు చేరుకుంది. విద్యుత్ డిమాండ్ అనూహ్యంగా పెరుగుతుండటంతో డిస్ట్రిబ్యూషన్ లైన్లు ఒత్తిడికి తట్టుకోలేక తరచూ ట్రిప్పవుతున్నాయి. -
సినిమాకొచ్చిన నెమలి!
వి.కోట : అసలే ఎండలు మండిపోతున్నాయి. అడవుల్లో కూడా పచ్చదనం కరువైపోతోంది. పిట్టల్లా జనం వేసవి తాపానికి రాలుతున్నారు. వేసవి తాపం నుంచి ఉపశమనం కోసం అన్నట్టు ఎంచక్కా ఓ నెమలి అడవి నుంచి పట్నం బాట పట్టింది. అలా..అలా..ఎగురుతూ ఓ సినిమా థియేటర్పై వాలింది. అప్పటికే ఫస్ట్షో మొదలైంది. కొత్త సినిమా కావడంతో ‘గబ్బర్సింగ్’ ఫ్యాన్స్ సందడి ఎక్కువగానే ఉంది. బయట నుంచి కొందరు నెమలిని చూసారు. ‘సినిమాకు నెమలొచ్చిందిరోయ్’ అంటూ కేకలు వేసి హడావుడి చేయడంతో అది కాస్తా బెదిరిపోయింది. అక్కడి నుంచి కేబిన్రూంలోకి ప్రవేశించింది. ఐదారు నిమిషాలు అటూఇటూ అక్కడే తిరిగిన నెమలి థియేటర్ సిబ్బంది కేబిన్లోకి రూంలోకి రావడంతో మళ్లీ బెదిరిపోయింది. ఈ సినిమాకో దండం సామీ అనే లెవెల్లో గ్రౌండ్ ఫ్లోర్లోకి పరుగులు తీసి ఓ రూమ్లోకి వెళ్లింది. దీంతో థియేటర్ సిబ్బంది ఆ రూమ్కు గడి పెట్టి, అటవీ సిబ్బందికి సమాచారం చేరవేశారు. సినిమాకు శుభం కార్డు పడేవేళకు నెమలి గురించి తెలియడంతో ప్రేక్షకులు సైతం నెమలిని చూసేందుకు ఆసక్తి చూపారు. సెకండ్షోకు వచ్చిన వారు ఇది ‘సర్దార్’ ఫ్యాన్ ఏమోనంటూ సరదాగా జోకులేసుకున్నారు. శనివారం రాత్రి ఈ సంఘటన వి.కోటలో చోటుచేసుకుంది. ఇక, ఆదివారం ఉదయం థియేటర్ వద్ద నెమలిని స్వాధీనం చేసుకున్న అటవీ సిబ్బంది మళ్లీ దానిని అటవీ ప్రాంతంలో వదలడం ఆలస్యం.. బతుకుజీవుడా!.. అంటూ మళ్లీ అడవి బాట పట్టింది! -
టవరెక్కిన మయూరం
హైదరాబాద్: ప్రాణం తీసుకోవాలనుకున్న వాళ్లో.. బెదిరించాలనుకున్న వాళ్లో.. టవరెక్కడం ఈ మధ్య మనం చూస్తేనే ఉన్నాం.. కానీ అనుహ్యంగా తన ప్రాణాలు రక్షించుకోవడం కోసం జాతీయపక్షి నెమలి టవరెక్కింది. ఈ అరుదైన సంఘటనకు నగరంలోని గాజులరామారం వేదికైంది. స్థానికంగా ఉన్న అటవీ ప్రాంతం నుంచి జన సంచారంలోకి వచ్చిన నెమలిని కాకులు తరమడంతో.. ప్రాణరక్షణ కోసం మేస్త్రీ నగర్లోని హైటెన్షన్ టవరెక్కింది. ఈ దృశ్యాన్ని తమ సెల్ఫోన్లలో బంధించడానికి స్థానికులు ఎగబడుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. హైటెన్షన్ వైర్లు కావడంతో పోలీసులు కూడా ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. నాలుగు గంటల నుంచి ప్రాణాలకోసం పోరాడుతున్న మయూరం ప్రస్తుతం ఒక టవర్ నుంచి మరో టవర్ పైకి దూకూతోంది. -
మయూరం.. వయ్యారం
సాయంకాలం.. చుట్టూ పంట పొలాలు.. రోడ్డుకిరువైపులా పచ్చని చెట్లు.. ఆకాశంలో కమ్మకున్న మేఘాలు.. దోబూచులాడుతూ మబ్బుల మాటున సూరీడు.. ఆహ్లాదకరమైన వాతావరణం. ఎక్కడి నుంచి వచ్చిందో ఓ మయూరం తుర్రుమంటూ రోడ్డుకు అడ్డంగా ఇలా ఎగురుకుంటూ వెళ్లింది. శుక్రవారం శంషాబాద్ మండలం నర్కూడ సమీపంలో షాబాద్ రోడ్డుపై గాలిలో ఎగురుతూ నాట్యమయూరాన్ని 'సాక్షి' కెమెరా క్లిక్ మనిపించింది... - శంషాబాద్ రూరల్ -
మాయిరే.. మయూరే!
జంట కంఠాల ఒంటరి మయూరం ఏంటా అని ఆశ్చర్యపోతున్నారా..! ఎవరూ నేర్పకుండానే వయ్యారి నడకలు అబ్బిన నెమలికి.. ఈ విద్య కూడా వచ్చేమోనని అనుకోకండి. మాదాపూర్ నుంచి హైటెక్స్ వెళ్లే దారిలో బండలమాటున తిరగాడుతున్న నెమళ్లు ఇదిగో ఇలా కెమెరాకు చిక్కాయి. జంట మయూరాలు భలేగా ఉన్నాయి కదూ. వీటికి అల్లంత దూరాన మరో మయూరం ఇలా ఠీవీగా నిల్చుని దర్జాగా సిటీ చూస్తోంది. -
గర్వభంగం!
అనగనగా ఒక సారి ఒక నెమలి పురివిప్పి నాట్యం చేస్తూ ఆనందిస్తోంది. రంగు రంగుల పింఛంతో నెమలి మరింత అందంగా ఉంది. తన అందమైన పింఛాన్ని చూసుకుని ఎంతో గర్వపడింది. కొంతసేపటికి అక్కడికి ఒక పెద్ద కొంగ వచ్చింది. అది నెమలితో కబుర్లు చెప్పాలనుకుంది. కానీ నెమలి బోసిగా ఉన్న కొంగ తోకను చూసి అసహ్యించుకుంది. ‘‘నా వైపు అలా ఎందుకు చూస్తున్నావు?’’ అని నెమలిని కొంగ అడిగింది. అందుకు నెమలి నవ్వుతూ ‘‘నీ తోకని చూసి నవ్వొస్తోంది. ఈకలు ఏమిటి అలా ఉన్నాయి? అందంలేదు, పొడవూ లేవు. నన్ను చూడు ఎంత అందంగా ఉన్నానో’’ అంది. ఇక అంతటితో ఊరుకోక దాన్ని మరింత ఏడిపించాలని, ‘‘చూశావా! ప్రకృతి నీకు ఎంత అన్యాయం చేసిందో! బలమైన పక్షివే, కాని ఏం లాభం నీ తోక ఏమాత్రం ఆకర్షణీయంగా ఉండదు. నిన్ను చూస్తే జాలి వేస్తోంది’’ అని అంది. నెమలికి బుద్ధి చెప్పాలని కొంగ అనుకుంది. ‘‘నీకేం తెలుసు? ప్రకృతి అందరికీ, అన్నింటికి ఎప్పుడూ సమన్యాయమే చేస్తుంది. నీకు అందమైన రెక్కలు, పింఛమూ ఉంటే నా తోక ఆకర్షణీయంగా ఉండదు. కాని నేను ఆకాశంలో మబ్బుల్ని తాకుతూ ఎగిరిపోగలను, నీకు ఆ అదృష్టం లేదుగదా!’’ అన్నది. నెమలి తన పొరపాటును గ్రహించి కొంగను క్షమించమని కోరింది. -
మాతృ మయూరి..
మాది మచిలీపట్నం. చిన్నప్పటి నుంచే ఫొటోగ్రఫీపై ఆసక్తి. 1967 నుంచి అమ్మ కొనిచ్చిన యాషిక టీఎల్పీ కెమెరాతో ఫొటోలు తీసేవాడిని. 1968లో మచిలీపట్నంలోని హిందూ కాలేజీకి అప్పటి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ కందుబాయీ కసాంజీ దేశాయి వచ్చారు. ఏడో తరగతి చదువుతున్న నేను అప్పుడా దృశ్యాన్ని కెమెరాలో బంధించా. పల్లె అందాలను నా కెమెరా నేత్రంతో చూసేవాణ్ని. 1974లో జేఎన్టీయూ నుంచి డిప్లొమా ఇన్ ఫొటోగ్రఫీ సర్టిఫికెట్ అందుకున్నాను. ఏటా వనవాసం.. 1980 నుంచి నా మనసు వైల్డ్లైఫ్ ఫొటోగ్రఫీపై మళ్లింది. ఏటా రాజస్థాన్లోని భరత్పుర అడవుల్లోకి వెళ్లేవాణ్ని. మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనా ఫొటోగ్రఫీ మీద నాకున్న ఆసక్తి వాటిని అధిగమించేలా చేసింది. రాజస్థాన్లోని రన్థమ్బోర్ అడవులు, కర్ణాటకలోని బండిపూర్ అడవుల్లో కలియ తిరిగాను. రన్థమ్బోర్ అడవిలో తీసిన చిరుత ఫొటోకు ఎన్నో ప్రశంసలు వచ్చాయి. ఎర్రగడ్డలోని మెడికల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్లో ఫొటోగ్రాఫర్గా పనిచేస్తూనే ఏడాదిలో కొన్ని రోజులు అడవుల బాట పట్టేవాణ్ని. మరిచిపోలేని క్లిక్.. 1980 అక్టోబర్ లో రాజస్థాన్లోని భరత్పుర అడవులకు వెళ్లా. ఒకరోజు తోటి మిత్రులతో కలసి మధ్యాహ్నం లంచ్ చేసి ముందుకు కదిలాను. కొంత దూరం వెళ్లాక పిల్ల నెమళ్లతో ఉన్న నెమలి కనిపించింది. ముందుగా నీటి కాలువ. తన పిల్లలు నీటిలో కొట్టుకుపోతాయేమోనని కాలువ దాటకుండా నెమలి బిక్కముఖంతో దిక్కులు చూస్తోంది. ఆ దృశ్యం కంటపడగానే.. నేను బ్యాగ్లో నుంచి కెమెరా బయటకు తీశాను. రెప్పపాటు వ్యవధిలో ఆ నెమలిని, పిల్లల కదలికలను నా కెమెరాలో బంధించా. నేను తీసిన ఫొటోల్లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్స్ అని చెప్తాను. టెక్నికల్ యాంగిల్... వైల్డ్లైఫ్ ఫొటోగ్రఫీ అంటే జంతువు హావభావాలే కాదు.. చుట్టూ ఉన్న ప్రకృతి ప్రతిబింబించాలి. ఫొటోగ్రఫీపై పట్టు, వైల్డ్లైఫ్ మీద ఆసక్తి ఉన్నప్పుడే ఇందులో రాణించగలం. ఫొటోలు తీసేందుకు నికోన్ ఎఫ్ఈ 300 ఎంఎం టెలిఫొటో వాడాను. ఫిక్స్డ్ లెన్స్ 300 ఎంఎం, 400 ఎంఎం వాడేది. వైల్డ్లైఫ్ ఫొటోగ్రఫీ పూర్తిగా నేచురల్ లైటింగ్పై ఆధారపడి ఉంటుంది. ప్రజెంటర్: వాంకె శ్రీనివాస్ -
ఉద్యాన‘వన’ మయూరాలు..
నిరంతరం రణగొణ ధ్వనుల మధ్య సతమతమయ్యే మెట్రో నగరంలో వనచరాలైన మయూరాలు కనిపించడం అరుదైన దృశ్యం. వన మయూరాలు కాకుంటేనేం..? ఉద్యాన‘వన’ మయూరాలు కెమెరా కంటికి చిక్కాయి. కేబీఆర్ పార్కులోని పచ్చని పరిసరాల్లో చెట్లపై వాలుతూ, నేలపై నడయాడుతూ రాజసంగా సంచరిస్తున్న నెమళ్లు సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి. -
'నెమలి వద్దు... వెంకన్న బొమ్మ కావాలి'
హైదరాబాద్: బీజేపీ ఉపాధ్యక్షురాలు, కేంద్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి నజ్మా హెప్తుల్లా విలక్షణ నాయకురాలు. ముక్కుసూటిగా మాట్లాడడం, తనకు నచ్చింది చేయడం ఆమెకు అలవాటు. తాజాగా హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ఆమె తన సహజ ధోరణి ప్రదర్శించారు. ఆంధప్రప్రదేశ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నిర్వహించిన శిక్షణకు తరగతులకు ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆమె సభా కమిటీల ప్రాధాన్యతను వివరించారు. కార్యక్రమం ముగిసిన అనంతరం ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆమెకు నెమలి బొమ్మ ఉన్న జ్ఞాపికను అందజేయబోయారు. అయితే వెంకటేశ్వరస్వామి చిత్రం ఉన్న జ్ఞాపిక కావాలని ఆమె అడిగి తీసుకోవడంతో అక్కడుకున్న వారంతా ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యారు. లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కు అంతకుముందు వెంకటేశ్వరస్వామి బొమ్మ ఉన్న జ్ఞాపికను కోడెల బహూకరించారు. -
నెమలి హత్య, పిల్లి దోషి, పోలీసుల సస్పెన్షన్
అనగనగా ఒక నెమలి. అది రాజుగారింట్లో హాయిగా ఆడుకుంటుంది. ఒక రోజు ఎక్కడినుంచో ఒక పిల్లి దాని దగ్గరికి వచ్చింది. రెండూ కాసేపు పలకరించుకున్నాయి. ఆ తరువాత కొద్ది సేపటికి పిల్లికి ప్రేమ ఎక్కువైపోయి నెమలి గొంతును కసక్కుమని కొరికేసింది. ఆ నెమలి కాస్తా చచ్చి ఊరుకుంది. రాజుగారికి పట్టలేనంత కోపం వచ్చింది. నా ప్రియమైన నెమలిని చచ్చిపోనిస్తారా. 'ఠాఠ్... వీల్లేదు' అని ఆయన హుంకరించారు. అయితే పిల్లి దొరకలేదు. దాంతో ఆయన కాపలా కాస్తున్న ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేసి పారేశారు. 'పాడు పిల్లి ఇంతపని చేస్తుందనుకోలేదు,' అని పాపం ఆ పోలీసులు లబోదిబో మంటున్నారు. ఈ సంఘటన జరిగింది పాకిస్తానీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ గారి ఫార్మ్ హౌస్ లో. ఈ ఫార్మ్ హౌస్ రాయ్విండ్ అనే చోట ఉంది. ఆ మధ్య మనదేశంలో ఒక మంత్రిగారి గేదెలు చెప్పాపెట్టకుండా టూర్ కి వెళ్లిపోతే పోలీసులను సస్పెండ్ అయ్యారు. మరి పొరుగుదేశంలోని ప్రధానమంత్రి గారింట్లో నెమలి చనిపోతే ఆ మాత్రం శిక్ష పడకూడదా మరి? -
నెమలీక... దేనికి ప్రతీక?
నమ్మకం నెమలీకను అశుభంగా భావించేవాళ్లు కూడా కొందరు ఉన్నారు. మధ్య ఐరోపా ప్రాంతాల వారికి నెమలీకను చూస్తే టై. నెమలీకల మీద ఉండే కన్నుల్ని చూస్తే... దురదృష్టం వేయి కళ్లతో తమనే చూస్తోందన్నట్టుగా ఫీలవుతారు వారు. నిద్రపోయేటప్పుడు తలవైపున గానీ నెమలీక ఉందో... ఆ మనిషి చచ్చిపోతాడని అంటారు. అందుకే పొరపాటున కూడా వాటిని ఇంట్లో పెట్టుకోరు. ఓ సినిమాలో హీరోయిన్ని హీరోగ్యాంగ్ ర్యాగింగ్ చేయాలనుకుంటుంది. ఆమె చేతిలో ఉన్న పుస్తకాన్ని వారు లాక్కుంటారు. దాన్ని తెరిచి చూస్తే నెమలీక కనిపిస్తుంది. ‘ఇది ఎందుకు?’ అంటే... ‘పిల్లల్ని పెడుతుంది’ అంటూ అమాయకంగా చెబుతుందా అమ్మాయి. ఆమె మాట విని కుర్రాళ్లంతా నవ్వుతారు. సినిమాలో కాబట్టి నవ్వి ఉంటారు. కానీ ఇప్పటికీ నెమలీకను పుస్తకంలో పెడితే పిల్లల్ని పెడుతుందని నమ్మేవాళ్లు బోలెడంతమంది ఉన్నారు. వాటిని పుస్తకంలో పెట్టడమే కాదు... కొబ్బరి చెట్టుకు ఉండే తెల్లని పిండిలాంటి పదార్థాన్ని తెచ్చి, ఆ నెమలీకకు మేత కూడా వేస్తుంటారు. అసలీ నమ్మకం ఎక్కడి నుంచి పుట్టింది, ఎవరు దీన్ని ఏర్పరిచారు అని అడిగితే మాత్రం ఎవ్వరూ మాట్లాడరు. ఎందుకంటే, ఎవరికీ తెలియదు కాబట్టి. ప్రపంచంలోని పలు దేశాల్లో నెమలీకలను దాచుకోవడం కనిపిస్తుంది. వాళ్ల పురాణాలు, చరిత్రలో నెమలికి చాలా ప్రాముఖ్యమైన స్థానం ఉంది. అందుకే వాళ్ల జీవితాల్లోకి నెమలీక వచ్చి చేరింది. గ్రీకు పురాణాల్లో హెరా అనే దేవత ఉంది. అసలు నెమలిని సృష్టించింది ఆవిడేనంటారు వాళ్లు. ఆర్గస్ అనే దేవుడికి ప్రతీకగా ఆమె నెమలిని సృష్టించిందట. ఆర్గస్కి వంద కన్నులు ఉంటాయట. ఆ కన్నులకు ప్రతీకలుగా నెమలి పింఛంలో ఇన్ని కన్నులను పెట్టిందని అంటారు. ఆర్గస్ జ్ఞానదేవుడు కాబట్టి నెమలి కూడా జ్ఞానానికి ప్రతీక అని వారు నమ్ముతారు. నెమలి ఈకలను దాచుకుంటే, జ్ఞానసంపద వారిని వదిలిపోదని విశ్వసిస్తారు. అదే రోమన్లు అయితే నెమళ్లను రాజపక్షులుగా భావించేవారు. రాణుల దగ్గర ఇవి ఉండేవట. అందుకే నెమలి రాజసానికి గుర్తు అంటారు వారు. పలు ఆసియా దేశాలవారు నెమలిని క్వాన్-యిన్ అనే దేవతకు ప్రతీకగా పేర్కొంటారు. క్వాన్-యిన్ ప్రేమకి, దయకి, నమ్మకానికి గుర్తు. అందుకే ఆ దేవుడిని విశ్వసించేవారు నెమలి ఈకను తమతో ఉంచుకుంటే, తమ ప్రేమ ఫలిస్తుందని నమ్ముతారు. అంతేకాదు, క్వాన్-యిన్ మరణించలేదని, కేవలం అంతర్థానమయ్యిందని, తన భక్తులను కాపాడుతూ తమ మధ్యనే తిరుగుతూ ఉంటుందని కూడా అనుకుంటారు. అందుకే నెమలి ఈకను దగ్గర ఉంచుకుంటే, ఆ దేవత తమతో ఉన్నట్టేనంటారు. మంగోలు యుద్ధవీరులైతే సమరానికి వెళ్లేటప్పుడు నెమలీకలను ధరించేవారు. అలా చేస్తే తప్పక విజయం వరిస్తుందని వారి నమ్మకం! భారత దేశంలో కూడా నెమలికి ప్రాముఖ్యం ఉంది. కుమారస్వామికి నెమలి వాహనం అని హిందూ పురాణాల్లో ఉంది. అందుకే నెమలిని పవిత్రంగానే చూస్తారు మన దేశంలో. అలాగే మరికొన్ని మతాల్లో నెమలిని పారదర్శకతకు, నిష్కాపట్యానికి చిహ్నంగా భావిస్తారు. మరికొన్ని మతాల్లో నెమలిని ధైర్యానికి, నిజాయతీకి, వినయ విధేయతలకు, క్రమశిక్షణకు కూడా ప్రతీకగా భావించడం జరుగుతోంది. నెమలీకను తమ దగ్గర ఉంచుకుంటే ఆ లక్షణాలు తమకూ అబ్బుతాయని బలంగా విశ్వసించేవారు కోకొల్లలు. అయితే పురాణాల్లో ఆధారాలు ఉన్నవాటి సంగతి వదిలేస్తే... మిగతావారికి ఆ నమ్మకం కలగడానికి కారణం వేరే ఉంది. నెమళ్లు చాలా ప్రొటెక్టివ్గా ఉంటాయి. అంటే తమతో జతకట్టిన వాటిని, తమకు పుట్టిన పిల్లలను ఎంతో ప్రేమగా చూస్తాయి. ఏ ఆపదా రాకుండా కాపాడుకోవాలని తపన పడుతుంటాయి. అలాగే వాటి జీవన విధానం కూడా ఓ క్రమ పద్ధతిలో ఉంటుంది. ఆహార సేకరణ నుంచి... ప్రతి విషయంలోనూ అవి ఓ చక్కని క్రమశిక్షణను కలిగివుంటాయి. బహుశా ఆ లక్షణాల వల్లే వాటిని ప్రేమాభిమానాలకు, క్రమశిక్షణకు ప్రతీకలుగా భావించడం మొదలుపెట్టి ఉంటారనే వాదన ఉంది. ఇలా వాదనలు, అభిప్రాయాలు తప్ప... ఇలాంటి కొన్ని నమ్మకాలకు కచ్చితమైన ఆధారాలను చూపించడం కాస్త కష్టమే! -
అరణ్యం: నెమలి కూనను ఏమంటారు?
నెమళ్లలో మూడు రకాలున్నాయి. మొదటి రకం బ్లూ పీకాక్. శ్రీలంక, భారతదేశాల్లో ఎక్కువగా ఉంటాయివి. రెండో రకం గ్రీన్ పీకాక్. ఇవి ఎక్కువగా జావా, మయన్మార్ ప్రాంతాల్లో ఉంటాయి. ఇక మూడో రకమైన కాంగో పీకాక్లు ఆఫ్రికా వర్షారణ్యాల్లో ఉంటాయి! నెమళ్లు అన్నిటినీ పీకాక్స్ అనేస్తాం. నిజానికి అలా అనకూడదు. మగవి మాత్రమే పీకాక్స్. ఆడవాటిని ‘పీహెన్స్’ అనాలి. అలాగే నెమలి పిల్లల్ని ‘పీ చిక్స్’ అనాలి. అన్నిటినీ కలిపి మాట్లాడాల్సి వస్తే ‘పీహౌల్’ అని వ్యవహరించాలి. అలాగే నెమళ్ల గుంపును పార్టీ అనిగానీ, ప్రైడ్ అనిగానీ అనాలి! ఇవి వేగంగా పరుగెత్తలేవు. అందుకే శత్రువులు దాడి చేస్తారని అనుమానం రాగానే చెట్లెక్కేస్తాయి. ఆ భయంతోనే రాత్రిళ్లు చెట్లమీదే నిద్రపోతాయి! పింఛం అన్ని నెమళ్లకూ ఉంటుందని అనుకుంటారు చాలామంది. కానీ అది నిజం కాదు. కేవలం మగ నెమళ్లకే పింఛం ఉంటుంది. ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే... నెమలి బరువులో అరవై శాతం దాని పింఛానిదే! ఆడ నెమళ్లు తమ జంటను చాలా జాగ్రత్తగా ఎంచుకుంటాయి. పొడవు, దారుఢ్యం, పింఛంలోని రంగులను చూసి మరీ నచ్చినవాటిని ఎంపిక చేసుకుంటాయట! నెమళ్లు ఎంతో అందంగా ఉంటాయి కానీ వాటి అరుపు కర్ణకఠోరంగా ఉంటుంది. హఠాత్తుగా వింటే ఆ అరుపు స్త్రీ ఏడుపులా అనిపిస్తుంది! నెమళ్లు చాలా పిరికివి. పులులు, సింహాలే అక్కర్లేదు... పిల్లులు, కుక్కలకు కూడా జడిసిపోతాయి! కాకి తోక... పాము మెడ! డార్టర్... ఈ ఫొటోలో ఉన్న పక్షి పేరు. చూస్తేనే తెలిసిపోతోందిగా... పాములా గోచరిస్తున్న మెడే దీనికి ప్రత్యేక త అని! శరీరం కనిపించకుండా, వట్టి మెడే బయటకు కనబడితే... కచ్చితంగా దీన్ని పాము అనుకునే ప్రమాదం ఉంది. ఈ పక్షులు నాలుగు రకాలు. ఒక్కో రకం ఒక్కో ప్రాంతంలో కనిపిస్తాయి. అన్హింగా అనేవి ఆమెరికాలోను, అన్హింగా రుఫా అనేవి ఆఫ్రికాలోను, అన్హింగా నోవెహాలిండీ అనేవి ఆస్ట్రేలియాలోను కనిపించే డార్టర్ జాతులు. ఇక మనదేశంలో ఓరియెంటల్ డార్టర్లు ఉంటాయి. మెడతో పాటు ఈ పక్షికి మరో ప్రత్యేకత ఉంది. అదేంటంటే, సీజన్ని బట్టి దీని ఒంటి రంగులో మార్పు వస్తుంది. ఒక్కోసారి నల్లగాను, ఇంకోసారి ముదురు గోధుమవర్ణంలోను, మరికొన్నిసార్లు బూడిదరంగులోను... ఇలా ప్రకృతిలో వచ్చే మార్పుల కారణంగా దాని ఒంటి వర్ణం మార్పులు సంతరించుకుంటూ ఉంటుందట! మరువలేని నేస్తం... టోనీ! ఆమిర్ఖాన్ మేనల్లుడు, బాలీవుడ్ హీరో అయిన ఇమ్రాన్ ఖాన్కి జంతువులంటే కేవలం ప్రేమ కాదు... పిచ్చి! ఎక్కడ ఏ జంతువు దీనంగా రోడ్ల మీద కనిపించినా ఇంటికి తీసుకొచ్చేస్తారట ఇమ్రాన్. టోనీ అనే కుక్కని అలాగే తీసుకొచ్చారు. ఓరోజు రోడ్డుమీద గాయాలతో కనిపించిన టోనీని తీసుకొచ్చి, వైద్యం చేయించారు. అప్పట్నుంచీ అది ఆయన ప్రపంచమైపోయింది. క్షణం తీరిక దొరికినా దానితోనే గడిపేవారు. కానీ ఓరోజు ఫుడ్ పాయిజన్ అయి హఠాత్తుగా మరణించింది టోనీ. ఆ విషయం వినగానే షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని మరీ వచ్చేశారు ఇమ్రాన్. తన జీవితంలో అత్యంత దురదృష్టకరమైన రోజు అదేనని ఇప్పటికీ చెబుతుంటారాయన!