Pollution control
-
Pollution Control Day: భోపాల్ గ్యాస్ లీకేజీ విషాదాన్ని గుర్తు చేస్తూ..
ఈరోజు (డిసెంబర్ 2) జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం. 1984, డిసెంబర్ రెండున జరిగిన భోపాల్ గ్యాస్ లీకేజీ విషాదాన్ని గుర్తు చేస్తూ, అటువంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేసేందుకు ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తుంటారు. మధ్యప్రదేశ్లోని భోపాల్లో 1984లో యూనియన్ కార్బైడ్ కర్మాగారం నుండి విడుదలైన విషపూరిత వాయువు వేలాది మంది ప్రాణాలను బలిగొంది.పెరుగుతున్న కాలుష్యం వల్ల కలిగే సమస్యలపై అవగాహన కల్పించేందుకు కాలుష్య నియంత్రణ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. కాలుష్య ఉద్గారాల పెరుగుదల ఒక్క భారతదేశం మాత్రమే ఎదుర్కొంటున్న సమస్య కాదు. ప్రపంచమంతా కాలుష్య నియంత్రణ దిశగా పోరాడుతోంది. కాలుష్య నిర్మూలన అనేది ఏ ఒక్కరి వల్లనో, ఏ ఒక్క ప్రభుత్వం వల్లనో అయ్యే పని కాదు. ప్రపంచంలోని అన్ని దేశాలతోపాటు ప్రతిఒక్కరూ తగిన చర్యలను తీసుకుంటేనే కాలుష్యం అనేది అదుపులోకి వస్తుంది.పర్యావరణానికి హాని కలిగించేది ఏదైనా కాలుష్యమనే చెప్పుకోవచ్చు. మనుషులు భరించలేని ధ్వనులను ధ్వని కాలుష్యం అని, ఫ్యాక్టరీలు, వాహనాల నుంచి వచ్చే ఉద్గారాలను గాలి కాలుష్యం అని, పరిశ్రమల వ్యర్థ జలాలు, మురుగు నీటిని నదులు, కాలువల్లోకి మళ్లించడం ద్వారా ఏర్పడేదాన్ని నీటి కాలుష్యంగా చెప్పుకోవచ్చు. ప్రజలకు కాలుష్యంపై అవగాహన కల్పించడం జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవ లక్ష్యం. కాలుష్యం తగ్గినప్పుడు భూమి వేడెక్కకుండా ఉంటుంది. దీంతో అన్ని జీవరాశులు, మానవులు తమ మనుగడను సాగించగలుగుతాయి.రద్దీ నగరాల్లో వాహనాలను సరి-బేసి విధానాలతో నడిపించడం, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం, వ్యర్థజలాల నిర్వాహణ తదితర కార్యక్రమాలు కాలుష్యాన్ని నియంత్రించేందుకు దోహపదపడతాయి. ఇదేవిధంగా ఘన వ్యర్థాలను శుద్ధి చేసి, నిర్వహించడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించవచ్చు. క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం ప్రాజెక్ట్ ద్వారా పట్టణ ప్రాంతాల్లో కాలుష్యాన్ని తగ్గించవచ్చు.ఇది కూడా చదవండి: నేడు రైతుల ఆందోళన.. ప్రభుత్వం అప్రమత్తం -
కంపు చుట్టూ మా బతుకులు కనువిప్పని ప్రభుత్వాలు
-
ఢిల్లీని కమ్మేసిన పొగ మంచు
ఢిల్లీ: ఢిల్లీలో దట్టమైన కాలుష్యానికి తోడు పొగ మంచు అలుముకుంది. పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, ఉత్తరప్రదేశ్, హర్యానాలోని పలు నగరాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. పొగ మంచు ప్రభావంతో 30 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. క్యాట్ -3 టెక్నాలజీ లేని విమానాలపై పొగ మంచు ప్రభావం పడుతోంది. ఢిల్లీ వాయు నాణ్యత 328 పి.ఎం.తో వెరీ పూర్ కేటగిరికి చేరింది. కాలుష్యం, పొగ మంచుతో ప్రజలకు అనారోగ్య సమస్యలు తెలుత్తుతున్నాయి. ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 8 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. గరిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. చలితీవ్రత ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నందున అనవసరంగా ఇళ్ల నుంచి బయటకు రాకూడదని అధికారులు హెచ్చరికలు చేశారు. వృద్ధులు, చిన్నపిల్లలు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. మాస్క్లు తప్పనిసరిగా వాడాలని పేర్కొన్నారు. CAT III లేని విమానాలు ప్రభావితం కావచ్చని విమానయాన అధికారులు తెలిపారు. సమాచారం కోసం ప్రయాణికులు సంబంధిత ఎయిర్లైన్ను సంప్రదించాలని కోరారు. అసౌకర్యం ఏర్పడనున్న నేపథ్యంలో విచారం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. అటు.. పొగ మంచు కారణంగా 30 రైళ్లు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇదీ చదవండి: నేడు కేంద్ర అఖిలపక్ష భేటీ -
ఢిల్లీ వాసులకు అలర్ట్!
ఢిల్లీ: దేశ రాజధానిలో అనధికార ఎమర్జెన్సీ నడుస్తోంది. కొద్ది రోజులుగా కాలుష్యం ఏమాత్రం తగ్గకపోవడంతో ఢిల్లీ సర్కారు జీఆర్ఐపీ-3 నిబంధనలను కఠినతరం చేసింది. కనీసం మార్నింగ్, ఈవెనింగ్ జాగింగ్కు వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ బాణసంచా కాల్చొద్దని హెచ్చరికలు చేసింది. ఢిల్లీలో ఓ వైపు కాలుష్యం తీవ్ర స్థాయిలో కమ్ముకుంది. పంజాబ్, ఉత్తరాఖండ్, హిమాచల్ వైపు నుంచి భారీగా పొగ వస్తోంది. మరో వైపు చలి వాతావరణంతో నగరంపై పొగ నిలిచిపోయింది. ఇదే సమయంలో దీపావళి కావడంతో కాలుష్యం వీపరీతంగా పెరిగిపోయింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. "బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేయొద్దు. దోమలను చంపేందుకు కాయిల్స్, అగరబత్తులు కాల్చొద్దు. కలప, ఆకులు, పంట వ్యర్ధాలు దహనం చేయొద్దు. తరచూ కళ్లను నీటితో శుభ్రం చేసుకోవాలి. గోరు వెచ్చని నీటితో పుక్కిలించాలి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తితే వైద్యులను సంప్రదించాలి." అని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇంతటి స్థాయిలో కాలుష్యం పెరిగిపోవడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని డాక్టర్లు చెబుతున్నారు. ఢిల్లీకి పర్యాటకుల సంఖ్య కూడా భారీగా తగ్గిపోయింది. పాఠశాలలు, విద్యాసంస్థలపై తీవ్ర ప్రభావం పడింది. కొన్ని ప్రైవేట్ సంస్థలు ఆన్ లైన్ క్లాసులు జరుపుతున్నాయి. అవసరం లేకుండా బయట తిరగొద్దని డాక్టర్ల సూచిస్తున్నారు. ఇదీ చదవండి: సైనికులతో మోదీ దీపావళి వేడుకలు -
Delhi Pollution: ఆ భారం మాపైకి నెట్టేయకండి
న్యూఢిల్లీ: కాలుష్యాన్ని నియంత్రించే విషయంలో కోర్టుపైకి భారం నెట్టేసే ప్రయత్నాలు మానుకోవాలని ఢిల్లీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. ఢిల్లీలో మళ్లీ సరి–బేసి ట్రాఫిక్ విధానం తేవడంపై నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదేనని, తామెలాంటి ఆదేశాలూ ఇవ్వలేదని స్పష్టం చేసింది. సరి–బేసి విధానంతో తమకు ఎటువంటి సంబంధం లేదని, చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి ఢిల్లీలోకి ప్రవేశించే ట్యాక్సీలకు కూడా ఇదే విధానాన్ని అమలు చేయాలని తామెన్నడూ తెలపలేదని పేర్కొంది. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ ధర్మాసనం శుక్రవారం ఈ వ్యాఖ్యలు చేసింది. సరి–బేసి విధానం కాలుష్యాన్ని తగ్గించడంలో అంతగా పనిచేయదని అమికస్ క్యూరీకి చెప్పామని గుర్తు చేసింది. ‘‘మీరేం చేయాలో చెప్పడానికి మేమిక్కడ లేం. ఆ విధానం కొనసాగించొద్దు అని మేం చెప్తే, సుప్రీంకోర్టు ఆదేశించినందువల్లే కాలుష్యం ఎక్కువైందని మీరంటారు’’ అని పేర్కొంది. ఢిల్లీలో వాయు నాణ్యత మెరుగు పడినందున సరి–బేసి విధానం అమలు చేయబోమని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. -
ఢిల్లీ కాలుష్యాన్ని తగ్గించడానికి ఆనంద్ మహీంద్రా చక్కని ఉపాయం
ఢిల్లీ: దేశ రాజధానిలో ప్రజలు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఢిల్లీ సహా చుట్టుపక్కల రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనంతో సమస్య తీవ్రతరమౌతోంది. గాలిలో కాలుష్య స్థాయిలు పెరగడంతో సుప్రీంకోర్టు కూడా ప్రభుత్వాన్ని మందలించింది. కాలుష్యాన్ని తగ్గించడానికి వెంటనే ఏదైనా పరిష్కారాన్ని కనుగొనాలను సూచించింది. ఇదే క్రమంలో కాలుష్యాన్ని తగ్గించడానికి చక్కటి పరిష్కారం ఉందని ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ట్విట్టర్(ఎక్స్) లో పేర్కొన్నారు. ఢిల్లీలో కాలుష్యాన్ని రీజనరేటివ్ అగ్రికల్చర్ విధానంతో తగ్గించవచ్చని చెప్పారు. " ఢిల్లీలో కాలుష్యం తగ్గడానికి రీజనరేటివ్ అగ్రికల్చర్ విధానం ఉపయోగపడుతుంది. పంటవ్యర్థాల దహనానికి ప్రత్యామ్నాయ మార్గాలను ఈ పద్ధతి సూచిస్తుంది. అంతేకాకుండా నేలసారం కూడా పెరుగుతుంది.' అంటూ ఇందుకు సహకరించేవారి పేర్లను కూడా ఆయన ఎక్స్లో పేర్కొన్నారు. To heal Delhi’s pollution, Regenerative Agriculture MUST be given a chance. It provides a remunerative alternative to stubble burning while simultaneously increasing soil productivity. @VikashAbraham of @naandi_india stands ready to help. Let’s do it! pic.twitter.com/XvMPAghgdQ — anand mahindra (@anandmahindra) November 7, 2023 ఢిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకీ పెరిగిపోతోంది. గాలి పూర్తిగా కలుషితం కావడంతో దేశ రాజధానిలో నవంబర్ 10 వరకు పాఠశాలలకు సెలవులు కూడా ఇచ్చారు. ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ 13 నుంచి 20 వరకు వాహనాలకు సరి-భేసి విధానాన్ని కూడా అమలుపరచనుంది. ప్రస్తుతం పంజాబ్లో పంట కోతలు అయిపోయి.. ఆ వ్యర్ధాలను దహనం చేసే సమయం కావడం వల్ల ఢిల్లీలో పరిస్థితి తీవ్రతరమౌతోంది. పునరుత్పత్తి వ్యవసాయం(Regenerative Agriculture) : పునరుత్పత్తి వ్యవసాయం అనేది వ్యవసాయం చేసే విధానాల్లో ఓ పద్ధతి. పురుగు మందులు, ఎరువులు, భారీ పనిముట్లు వాడకుండా సాగు చేస్తారు. గ్రీన్ హౌజ్ ఉద్గారాలను తగ్గించే విధానాలను ఎంచుకుంటారు. జీవవైవిధ్యాన్ని పెంపొందిస్తూ పర్యావరణ అనుకూలంగా వ్యవసాయం చేస్తారు. పంట కోతలను కాల్చివేయకుండా వాటినే ఎరువుగా వాడుకునే విధానాలను అనుసరిస్తారు. ఢిల్లీ కాలుష్యాన్ని తగ్గించడానికి ఈ పద్ధతినే ప్రస్తుతం ఆనంద్ మహీంద్రా సూచించారు. ఇదీ చదవండి: కాలుష్యంపై మీకు ఏం పట్టింపు లేదా..? -
ఢిల్లీలో మళ్లీ సరి–బేసి విధానం
న్యూఢిల్లీ: ప్రజారోగ్యానికి గొడ్డలిపెట్టులా మారిన కాలుష్యాన్ని కట్టడి చేయడానికి ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలో మళ్లీ సరి–బేసి విధానాన్ని ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతోంది. ఈ నెల 13 నుంచి 20వ తేదీ వరకూ సరి–బేసి విధానం అమలు చేయనున్నట్లు ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ సోమవారం ప్రకటించారు. నవంబర్ 20 తర్వాత ఈ విధానాన్ని పొడిగించే అంశంపై అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. వాయు నాణ్యత తగ్గిపోవడం, కాలుష్యం వల్ల చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అందుకే 8వ తరగతి వరకూ ఆన్లైన్ క్లాస్లు నిర్వహించాలని సూచించారు. బోర్డు పరీక్షలకు సిద్ధమయ్యే పది, పన్నెండో తరగతి విద్యార్థులకు మినహాయింపు ఉంటుందన్నారు. -
ప్రమాదకర స్థాయిలో ఢిల్లీ వాయు కాలుష్యం
ఢిల్లీ: దేశ రాజధానిలో కాలుష్యం ఆందోళనకర స్థాయికి చేరింది. ఢిల్లీలోని ముంద్ఖా ప్రాంతంలో గురువారం గాలినాణ్యతా ప్రమాణాలు తీవ్ర స్థాయికి చేరాయి. నాణ్యతా ప్రమాణాల సూచీలో అత్యధికంగా 616 పాయింట్లకు పడిపోయిందని అధికారులు తెలిపారు. గత ఐదు రోజులుగా ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. బుధవారం ఉష్ణోగ్రత అత్యధికంగా 32.7 డిగ్రీలుగా నమోదైంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ డేటా ప్రకారం ఢిల్లీ మొత్తం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) రాత్రి 7 గంటలకు 357 వద్ద నమోదైంది. దీంతో ఢిల్లీలో వాయు నాణ్యతను మెరుగుపరచడానికి కావాల్సిన చర్యలు తీసుకోవాలని సూచిస్తూ అటవీ శాఖకు హైకోర్టు ఆదేశించింది. కలుషిత గాలి పీల్చడం వల్ల అస్తమా రోగుల సంఖ్య పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. గాలి నాణ్యత సూచిలో 0-50 ఉంటే ఆరోగ్యమైన గాలి ఉన్నట్లు, 50-100 ఉంటే సంతృప్తికరంగా ఉన్నట్లు భావిస్తారు. 101-200 ఉంటే మధ్యస్థంగా, 201-300 పేలవంగా ఉన్నట్లు గణిస్తారు. 301-400 ఉంటే అత్యంత పేలవంగా, 401-500 ఉంటే తీవ్ర స్థాయిలో గాలి నాణ్యతా ప్రమాణాలు ఉన్నట్లు భావిస్తారు. ఇదీ చదవండి: లిక్కర్ కేసులో నేడు ఈడీ ఎదుటకు సీఎం కేజ్రీవాల్ -
పోర్టు పరిసరాల్లో కాలుష్యానికి చెక్
సాక్షి, విశాఖపట్నం: మహా విశాఖ నగర పరిధిలో కాలుష్యాన్ని నియంత్రించేందుకు అవసరమైన చర్యలు చేపట్టేలా విశాఖపట్నం పోర్టు అథారిటీ, ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ మధ్య అవగాహన ఒప్పందం జరిగింది. పోర్టు చైర్మన్ డా.అంగముత్తు గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ఎండీ రాజశేఖర్రెడ్డి ఈ ఒప్పంద పత్రాలపై శనివారం సంతకాలు చేశారు. విశాఖ నగరంలో కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోవడంతో పాటు పోర్టు పరిసర ప్రాంతాలలో గాలి కాలుష్యాన్ని తగ్గించటం, కార్బన్ ఉద్గారాలను నిలువరించడమే ఈ ఎంవోయూ ముఖ్య ఉద్దేశమని చైర్మన్ డా.అంగముత్తు తెలిపారు. ఒప్పందంలో భాగంగా విశాఖపట్నం పోర్టు పరిసరాలలో గ్రీన్ బెల్ట్ను అభివృద్ధి చేయడం, పోర్టుకు వెళ్లే ప్రధాన జంక్షన్లలో రోడ్డు డివైడర్ల వద్ద పచ్చదనాన్ని పెంపొందించడం, పోర్టు కార్యాలయాలలో అవసరమైన మేరకు ల్యాండ్ స్కేపింగ్ చేయడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం తదితర పనులను ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్ అండ్ బ్యూటీఫికేషన్ కార్పొరేషన్ చేస్తుందని ఎండీ రాజశేఖర్రెడ్డి తెలిపారు. పోర్టు డిప్యూటీ చైర్మన్ దూబే, చీఫ్ ఇంజినీర్ వేణుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
అసలు పుట్టేవాళ్లే తక్కువ.. మళ్లీ నియంత్రణ గోల ఏంటి?
వాషింగ్టన్: అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ మరోసారి తప్పులో కాలేశారు. బాల్టిమోర్ లోని కొప్పిన్ స్టేట్ యూనివర్సిటీలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ మనం పొల్యూషన్(కాలుష్యం) తగ్గించుకుంటే భావితరాలు బాగుంటాయని చెప్పడానికి బదులు మనం పాపులేషన్(జనాభా) తగ్గించుకుంటే బాగుంటుందని నోరు జారారు. ఈ ప్రసంగం తాలూకు వీడియో సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించడంతో కమలా హారిస్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొప్పిన్ స్టేట్ యూనివర్సిటీ వారు నిర్వహించిన వాతావరణ పరిరక్షణపై అవగాహన కార్యక్రమంలో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్(58) ముఖ్య అతిధిగా విచ్చేశారు. అయితే కార్యక్రమం పట్ల కొంచెమైనా అవగాహన లేకుండా హాజరైన ఆమె వైట్ హౌస్ వర్గాలు ఇచ్చిన స్క్రిప్తును యధాతధంగా చదివేశారు. వారిచ్చిన స్క్రిప్టులో మొదట పాపులేషన్ అని రాసి దాన్ని సరిచేస్తూ పక్కన బ్రాకెట్లో మళ్ళీ పొల్యూషన్ అని రాశారు. అయినా కూడా కమలా హారిస్ ప్రసంగ ప్రవాహంలో పొల్యూషన్ కి బదులు పాపులేషన్ అని చదివి కొత్త తలనొప్పని తెచ్చుకున్నారు. ప్రసంగం ఆమె మాటల్లో.. ఎలెక్ట్రిక్ వాహనాలను వినియోగిస్తూ స్వచ్ఛమైన ఇంధన శక్తిపై పెట్టుబడి పెట్టి "జనాభాను తగ్గిస్తే" భావితరాలు స్వచ్ఛమైన వాయువును పీల్చుకుంటారని, పారిశుద్ధ్యమైన మంచినీరు తాగుతారని అన్నారు. ఇంధన శక్తిపై పెట్టుబడి పెట్టి జనాభాను తగ్గించడమేమిటని అక్కడివారు చాలాసేపు జుట్టు పీక్కున్నారు. చాలాసేపు సస్పెన్స్ తర్వాత గానీ వారికి అర్ధం కాలేదు.. కమలా హారిస్ పొరపాటుగా చదివారని.. ఆమె ఉద్దేశ్యం తగ్గించాల్సింది జనాభాని కాదు కాలుష్యాన్నని. తరవాత వైట్ హౌస్ వర్గాలు ఆమె ప్రసంగానికి సంబంధించిన కాపీని ప్రెస్ కు రిలీజ్ చేశారు. అందులో పాపులేషన్ పదాన్ని కొట్టేసి పొల్యూషన్ అని స్పష్టంగా రాశారు. అలవాటులో పొరపాటుగా ఆమె అదే చదివేశారు. ఇంకేముంది విమర్శకులు వారి అసంతృప్తిని వ్యక్తం చేయడానికి సోషల్ మీడియాను వేదికగా చేసుకున్నారు. అసలు పుట్టేవాళ్లే తక్కువగా ఉంటే.. జనాభా తగ్గించమంటే ఎలా? అంటూ ప్రశ్నిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ లాగే వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ కూడా అప్పుడప్పుడూ అర్ధజ్ఞానంతో వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. విషయపరిజ్ఞానం లేని మాటలు మాట్లాడుతూ పదేపదే వార్తల్లో నిలుస్తూ ఉంటారు. గతంలో కూడా ఆమె ఓ సారి కార్మికుల యూనియన్, పౌర హక్కుల నాయకుల సభలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(కృత్రిమ మేధస్సు) గురించి ప్రస్తావిస్తూ ఏఐ అంటే అది రెండక్షరాలు, యాంత్రిక సాయంతో అభ్యసించేదని అర్ధం అని చెప్పి తీవ్ర విమర్శల పాలయ్యారు. ఇది కూడా చదవండి: ఇజ్రాయెల్లో అద్భుతం.. తెగిన తలను అతికించారు.. -
ప్రకృతి వనం... ఆక్సి‘జనం’
సాక్షి, మేడ్చల్ జిల్లా: నగరీకరణ శరవేగంగా పెరుగుతోంది. దీంతోపాటే కాలుష్యమూ పెచ్చుమీరుతోంది. దీంతో తలెత్తుతున్న అనారోగ్య సమస్యలతోపాటు ఉద్యోగ, వ్యాపారాల్లో ఎదురవుతున్న మానసిక ఒత్తిళ్లు సరేసరి. వీటితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న నగరవాసులకు చక్కటి సాంత్వన కల్పిస్తున్నాయి ప్రకృతి వనం, లంగ్స్ స్పేస్. హరితహారంలో భాగంగా ఆహ్లాదం, ఆరోగ్యాన్ని పంచేందుకు ప్రభుత్వం సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. గ్రేటర్తోసహా శివారు పట్టణాలు, సెమీఅర్బన్ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే లక్షలాది మొక్కలు నాటిన సర్కారు పల్లె, పట్టణ ప్రకృతి వనాలను పెంచుతోంది. వీటిలో వాకింగ్ పాత్లు, చిల్ట్రన్ కార్నర్స్ ఏర్పాటుచేయడంతోపాటు ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు ప్రత్యేక ఏర్పాటుచేస్తోంది. 80 లక్షల వాహనాలు... ఎన్నో పరిశ్రమలు గ్రేటర్ పరిధిలో అత్యంత రద్దీగా ఉండే ప్రధాన కూడళ్లలో వాయు కాలుష్యం అవధులు దాటుతోంది. సుమారు 80 లక్షల మేర ఉన్న వాహనాలు వెదజల్లుతున్న పొగతో ‘సిటీ’జన్ల ముక్కుపుటాలు, శ్వాసకోశాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. పలుప్రాంతాల్లో బహిరంగ ప్రదేశాల్లో చెత్తను తగలబెట్టడంతో కాలుష్య తీవ్రత మరింత పెరుగుతోంది. వీటికితోడు పరిశ్రమలు వెదజల్లుతున్న కాలుష్యంతో సమీప ప్రాంతాలు పొగచూరుతున్నాయి. ఫలితంగా పీల్చే గాలిలో సూక్ష్మధూళికణాలు చేరి సమీప ప్రాంతాల్లోని ప్రజల ఊపిరితిత్తుల్లోకి చేరుతున్నాయి. ఘనపు మీటరు గాలిలో సూక్ష్మధూళికణాల (పీఎం2.5) మోతాదు 40 మైక్రోగ్రాములకు మించరాదు. కానీ పలు కూడళ్లలో అంతకు రెట్టింపు స్థాయిలో ధూళికాలుష్యం నమోదవుతోంది. పుర, పంచాయతీల్లో వనాలు పుర, పంచాయతీల్లో అర ఎకరం నుంచి 4 ఎకరాల పరిధిలో ప్రకృతి వనాలను ఏర్పాటుచేశారు. గ్రేటర్ శివారు (మేడ్చల్ జిల్లా + రంగారెడ్డి జిల్లా)లోని 29 పురపాలక సంఘాల్లో 595 పట్టణ ప్రకృతి వనాలున్నాయి. వీటిని పురపాలక సంఘాలు నిర్వహిస్తున్నాయి. అలాగే, 619 పంచాయతీల పరిధిలో 946 పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేశారు. ఉపాధి హామీ పథకం నిధులు వెచ్చించి ఎకరాకు 2,500 మొక్కల చొప్పున పెంచారు. లంగ్స్ స్పేస్ ఎక్కడెక్కడ? హైదరాబాద్ శివారుల్లో ఏడు అర్బన్ లంగ్స్ స్పేస్లున్నాయి. ►మేడిపల్లి ఫారెస్టు బ్లాకులో 100 ఎకరాల్లో శాంతివనం ►దూలపల్లి ఫారెస్టు బ్లాకులోని ప్రశాంత వనం ►నారపల్లిలోని భాగ్యనగరం నందన వనం ►బహుదూర్పల్లి ఫారెస్టు బ్లాకులోని 50 ఎకరాల్లో ►నాగారం ఫారెస్టు బ్లాకులోని 70 ఎకరాల్లో.. ►నారపల్లి–పర్వతాపూర్ ఫారెస్టు బ్లాకులోని 60 ఎకరాల్లో.. ►కండ్లకోయలోని ఆక్సిజన్ పార్కు హైదరాబాద్లో ఏడాదికి సగం రోజులకుపైగా కాలుష్యం నమోదవుతున్న ప్రాంతాలు ►బాలానగర్, ఉప్పల్, జూబ్లీహిల్స్, చార్మినార్, ప్యారడైజ్, జూపార్క్, పంజగుట్ట, కూకట్పల్లి, చిక్కడపల్లి, ఎంజీబీఎస్ మరిన్ని అభివృద్ధి చేస్తాం నగర శివారుల్లో పల్లె, పట్టణ ప్రకృతి వనాలు, లంగ్స్ స్పేస్లను మరింత అభివృద్ధి పరుస్తాం. ఇందుకోసం ప్రభుత్వ భూములను కూడా గుర్తిస్తున్నాం. పెరుగుతున్న జనాభా, నగరీకరణ నేపథ్యంలో వీటి అవసరం ఎంతో ఉంది. పెరుగుతున్న కాలుష్యం కట్టడికి ఇవి ఎంతగానో దోహదపడుతున్నాయి. – డా.ఎస్. హరీశ్, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ స్వచ్ఛమైన గాలి.. ప్రకృతి వనాలు, లంగ్ స్పేస్లు స్వచ్ఛమైన గాలిని అందిస్తున్నాయి. కాలుష్యం బారి నుంచి రక్షిస్తున్నాయి. సెలవు రోజుల్లో కుటుంబ సభ్యులతో కలిసి వెళుతున్నాం. రోజంతా అక్కడే ఉండాలనిపిస్తుంది. – కె. ఆంజనేయులు, పోచారం గొప్ప ఉపశమనం.. నారపల్లి–పర్వతాపూర్లోని 60 ఎకరాల్లో ఉన్న అర్బన్ లంగ్స్ స్పేస్ పిల్లలతోపాటు పెద్దలనూ ఆహ్లాదపరుస్తోంది. నగరానికి సమీపంలో ఉండటం వల్ల ప్రతీ రోజు ఉదయం, సాయంత్రం వేళల్లో పెద్ద సంఖ్యలో మహిళలు, వృద్ధులు వస్తారు. ఆటపాటలతో అందరూ ఆనందంలో మునిగితేలుతారు. –పి. రవికిరణ్, పీర్జాదిగూడ -
వాహనదారులకు అలర్ట్.. ఆ సర్టిఫికెట్ లేకపోతే నో పెట్రోల్, డీజిల్
వాహనాదారులకు ఢిల్లీ ప్రభుత్వం షాకిచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్య నియంత్రణ కోసం ఆమ్ ఆద్మీ పార్టీ సర్కార్ కీలక నిరయం తీసుకుంది. బంకుల్లో పెట్రోల్, డీజిల్ కావాలంటే తప్పనిసరిగా పొల్యూషన్ సర్టిఫికెట్(పీయూసీ) ఉండాలనే నిబంధన విధించింది. వివరాల ప్రకారం.. ఢిల్లీలో ప్రతీ శీతాకాలం గాలి కాలుష్య తీవ్రత బాగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో కాలుష్య నియంత్రణ కోసం అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం.. పీయూసీ సర్టిఫికెట్ను తప్పనిసరి చేసింది. పీయూసీ సర్టిఫికెట్ లేకుండా బంకుల్లో పెట్రోల్, డీజిల్ను పోయరని స్పష్టం చేసింది. అక్టోబర్ 25 నుంచి ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని ఢిల్లీ పర్యావరణశాఖ మంత్రి గోపాల్రాయ్ శనివారం తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి గోపాల్రాయ్ మాట్లాడుతూ సెప్టెంబర్ 29న పర్యావరణం, రవాణా, ట్రాఫిక్ అధికారులతో సమావేశం సందర్భంగా కాలుష్య నియంత్రణకు ప్రణాళిక, విధివిధానాలను చర్చించినట్టు తెలిపారు. కాగా, పీయూసీ సర్టిఫికెట్కు సంబంధించిన నోటిఫికేషన్ తర్వలోనే విడుదలవుతుందని వెల్లడించారు. అంతేకాకుండా అక్టోబర్ 6వ తేదీ నుంచి యాంటీ డస్ట్ క్యాంపెయిన్ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. అక్కడ నిర్మాణ స్థలాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి కాలుష్యాన్ని అరికట్టనున్నట్లు స్పష్టం చేశారు. దీంతో, కాలుష్య నియంత్రణ కొంత మేరకు సాధ్యమవనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. Vehicle owners will not be provided fuel at petrol pumps in Delhi without showing a valid pollution under control certificate from October 25, Environment Minister Gopal Rai said @AapKaGopalRai #Petrol #Environment https://t.co/yz1zlIw4Sz — The Telegraph (@ttindia) October 1, 2022 -
మార్పును ఎదుర్కొనేలా మారాలి!
వాతావరణ మార్పు సమస్య, కనిపిస్తున్న వాస్తవం. ఇదో అతిపెద్ద ప్రపంచ సమస్య అనేదీ అంతే నిజం. కానీ ఏ ఒక్క దేశమో దీన్ని ఎదుర్కోలేదు. అలాగని ఏ దేశమూ దీన్ని విస్మరించలేదు కూడా! ఈ ఏడాది ఈజిప్టులో జరగనున్న కాప్–27, ఇండోనేసియాలో నిర్వహించనున్న జీ–20 సదస్సులో ఇది చర్చకు రానుంది. ప్రపంచం ఆర్థిక సంక్షోభంలో కూరుకునివున్న తరుణంలో ఈ చర్చ ఎటుపోతుందో తెలీదు. అయితే భారత్ మాత్రం తన వాగ్దానం మేరకు 2070 నాటికి కర్బన ఉద్గారాలను సున్నాకు చేర్చాల్సి ఉంది. ఈ దీర్ఘకాలిక లక్ష్యాన్ని నెరవేర్చడం కోసం శిలాజేతర ఇంధనాల ఉత్పత్తిని పెంచడం, పర్యావరణ అనుకూల హైడ్రోజన్ వినియోగాన్ని ప్రోత్సహించడం, ప్రజారవాణా వ్యవస్థను విస్తృతం చేయడం, మెరుగైన డిజైన్ల ద్వారా ఇళ్లల్లో విద్యుత్ వినియోగాన్ని తగ్గించడం లాంటి స్వల్పకాలిక లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. మనం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యల్లో ఒకటి, వాతావరణ మార్పుల ప్రభావం. పైగా ఇది ఏ ఒక్క దేశానికో సంబంధించిన సమస్య కాదు. అందరి సహకారం లేకపోతే ఏమాత్రం పరిష్కరించలేని సమస్య కూడా. ప్రపంచస్థాయిలో మూకుమ్మడి ప్రయత్నంతోనే గట్టెక్కగల ఈ సమస్య... ఈ ఏడాది ఈజిప్టులో జరగనున్న ‘కాప్–27’ సమావేశాలతోపాటు, నవంబరులో ఇండోనేసియాలో నిర్వహించనున్న జీ–20 సదస్సు సమావేశాల్లోనూ చర్చకురానుంది. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే, అభివృద్ధి చెందిన దేశాలు... రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, యూరప్లో పెరిగిన గ్యాస్ ధరలు, ద్రవ్యో ల్బణ నియంత్రణ చర్యలు ఆర్థిక మాంద్యానికి దారితీస్తాయేమో అన్న అందోళనల మధ్య నలుగుతున్న తరుణంలో ఈ ముఖ్యమైన అంశం మళ్లీ చర్చకు రావడం! అమెరికా – చైనాల మధ్య రాజకీయాలు నిత్యం రగులుతూండటం కూడా ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. ఈ పరిస్థి తుల నేపథ్యంలో వాతావరణ మార్పుల సమస్య నుంచి గట్టెక్కేందుకు భారత్ అనుసరించాల్సిన వ్యూహమేమిటి? వైఖరేమిటి? ఇక్కడ రెండు ముఖ్యమైన అంశాలను గుర్తుపెట్టుకోవాలి. మొదటిది: జీ–20, కాప్–27 సదస్సుల్లో వాతావరణానికి సంబంధించి మన వ్యూహ మేమిటో ఎలా వివరిస్తామన్నది. రెండోది: వాతావరణ మార్పుల నిర్వహణ కోసం అభివృద్ధి చెందుతున్న దేశాలకు ధనిక దేశాలు నిధులివ్వాలన్న అంశంపై మన వైఖరి. వాతావరణ మార్పుల ప్రభావాన్ని నియంత్రించేందుకు భారత్ లక్ష్యాలేమిటన్నది గత ఏడది గ్లాస్గోలో జరిగిన కాప్–26 సదస్సులో ప్రకటించాం. దీని ప్రకారం 2070 నాటికి కర్బన ఉద్గారాలను శూన్య స్థితికి చేర్చాలి. స్థూల జాతీయోత్పత్తి పెరుగుదలతో ఎక్కువయ్యే కర్బన ఉద్గారాలను 2005 నాటి స్థాయిలో 45 శాతం వరకూ తగ్గిం చాలి. విద్యుదుత్పత్తి మొత్తంలో 2030 నాటికి శిలాజేతర ఇంధనాల ద్వారా జరిగే ఉత్పత్తి (సౌర, పవన) సగం ఉండాలి. 2030 నాటికి సంప్రదాయేతర ఇంధన వనరుల ద్వారా 450 గిగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేయాలన్న లక్ష్యం కీలకమైంది. ఈ లక్ష్యాన్ని అందుకునేలా సరఫరా సంబంధిత సమస్యలను అధిగమిం చేందుకు అనేక చర్యలు తీసుకోవాల్సి ఉంది. అదే సమయంలో విద్యుత్తుతో నడిచే వాహనాల వినియోగం పెంచాలి. రైల్వే లైన్ల విద్యు దీకరణ వేగంగా చేపట్టాలి. ఉక్కు, ఎరువులు, పెట్రో రసాయనాల తయారీలో పర్యావరణ అనుకూల హైడ్రోజన్ వాడకాన్ని పెంచాలి. అంతేకాకుండా... మెరుగైన డిజైన్లు, పదార్థాల వాడకంతో భవనాల ద్వారా అయ్యే విద్యుత్తు ఖర్చును (లైట్లు, ఏసీల వంటివి) కూడా తగ్గించాల్సి ఉంటుంది. వీటన్నింటికీ తోడుగా ప్రజా రవాణా వ్యవస్థను మరింత విస్తృతం చేయడం ద్వారా మాత్రమే మనం కాప్–26లో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చగలం. విజయం సాధించాలంటే చాలా రంగాల్లో కృషి జరగాలి. కేంద్ర ప్రభుత్వంలోని అనేక మంత్రిత్వ శాఖలు పరస్పర అవగాహనతో ముందుకు సాగాలి. ఈ విషయాల్లో కీలకమైన ప్రైవేట్ రంగం అవస రమూ చాలానే ఉంటుంది. 2070 వరకూ తీసుకోబోయే ప్రతి విధా నాన్ని విడమర్చి చెప్పాల్సిన అవసరం లేకపోయినా, రాగల పదేళ్లలో ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నామో చెప్పడం ద్వారా అంతర్జాతీయ వేదికలపై విశ్వాసం పొందవచ్చు. ఈ వివరాలు యూఎన్ఎఫ్సీసీకి మనమిచ్చే ‘నేషనలీ డిటర్మైండ్ కాంట్రిబ్యూషన్స్’ ప్రణాళికలో లేకున్నా ఫర్వాలేదు. కానీ ఈ పదేళ్ల లక్ష్యాలు దీర్ఘకాలిక లక్ష్యాల సాధన దిశలో సక్రమంగానే ప్రయాణిస్తున్నామా, లేదా? అన్నది తెలుసు కునేందుకు ఉపయోగపడతాయి. ఈ లెక్కన రాగల పదేళ్లలో మనం అందుకోవాల్సిన లక్ష్యాలను ఒక్కటొక్కటిగా చూస్తే: 1) 2070 నాటికి కర్బన ఉద్గారాలను శూన్యస్థితికి తీసుకు రావడమంటే, బొగ్గు వినియోగాన్ని పూర్తిగా పరిహరించడమనే అర్థం. కాబట్టి విద్యుదుత్పత్తి సామర్థ్యం పెంచేందుకు శిలాజేతర ఇంధనా లను మాత్రమే వాడాలి. నిర్మాణంలో ఉన్న థర్మల్ విద్యుత్ కేంద్రా లను పరిగణనలోకి తీసుకుని బొగ్గు పతాక వినియోగం ఎప్పటికన్న అంశంపై నిర్ణయం జరగాలి. దశలవారీగా సుమారు 50 గిగా వాట్ల మేర బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తిని నిలిపివేయాలి. 2) కర్బన ఉద్గారాలు ఏ రోజుకు పతాక స్థాయికి చేరవచ్చునో కూడా ఒక తేదీ నిర్ణయించుకోవచ్చు. 3) విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కంలు) ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉందిప్పుడు. సంప్రదా యేతర ఇంధన వనరుల ద్వారా విద్యుదుత్పత్తిని పెంచేందుకు ఇది పెద్ద అవరోధం. డిస్కమ్లను ఆదుకునేందుకు నాలుగోసారి ప్రయత్నం జరుగుతోంది. ఇందుకోసం మల్టీ డెవలప్మెంట్ బ్యాంకుల సాయం తీసుకోవచ్చు. దీనివల్ల నియమ నిబంధనల ఏర్పాటు విషయంలో ఆర్థిక సంస్థలకు కొంత స్వాతంత్య్రం ఉంటుంది. ఇది రాష్ట్రాలకు కొంత నమ్మకం కల్పించి పంపిణీ వ్యవస్థలో కొంత భాగాన్ని ప్రైవేట్ పరం చేసేలా ప్రోత్సాహం లభిస్తుంది. 4) సంప్రదాయేతర వనరులు ముడి చమురు మాదిరిగా వాడుకుంటే తరిగిపోయే ఇంధనం కాదు. కాబట్టి మొత్తం విద్యుదు త్పత్తిలో వీటివాటా ఎంత పెరిగితే అంత మేలు. ఇందుకోసం గ్రిడ్ నిర్వహణ, విద్యుత్తు నియంత్రణల్లో ఎన్నో కొత్త ఆవిష్కరణలు జర గాలి. కేంద్రస్థాయి విద్యుత్తు నియంత్రణ సంస్థలు రాష్ట్రస్థాయి సంస్థ లతో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. గ్రిడ్ ఫ్లెక్సిబిలిటీ లక్ష్యంగా నియమ నిబంధనల్లో మార్పులకు ప్రాధాన్యం ఇవ్వాలి. 5) పర్యావరణ అనుకూల హైడ్రోజన్ ఉత్పత్తిని పెంచేందుకు శిలాజ ఇంధనాల స్థానంలో దీన్ని వాడే పరిశ్రమలకు తగిన రాయితీలు కల్పించి సహకారం అందించవచ్చు. 6) 2030 నాటికల్లా కర్బన ఉద్గారాలను శూన్యస్థాయికి చేరుస్తామని భారతీయ రైల్వే ఇప్పటికే ప్రకటించింది. అయితే ఇందుకోసం దేశంలో రైళ్లన్నీ విద్యుత్తుతోనే నడవాల్సి ఉంటుంది. అది కూడా సంప్రదాయేతర, కర్బన ఉద్గారాలుండని పద్ధతుల్లో ఉత్పత్తి చేసే విద్యుత్తును వాడాల్సి ఉంటుంది. అంటే దశలవారీగా ప్రస్తుత డీజిల్ ఇంజిన్లను తొలగిం చడం లేదా విద్యుత్తుతో పనిచేసేలా చేయడం అవసరం. 7) ద్విచక్ర వాహనాలు, కార్లు, త్రిచక్ర వాహనాల్లో విద్యుత్తుతో పనిచేసేవాటి భాగస్వామ్యాన్ని మరింత పెంచేందుకు వేటికి అవే ప్రత్యేకంగా లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. అంతేకాకుండా దేశవ్యాప్తంగా బ్యాటరీ ఛార్జింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. స్టేషన్ల ఏర్పాటును వేగ వంతం చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలను ప్రకటించవచ్చు. కార్బన్ న్యూట్రల్ ఆర్థిక వ్యవస్థకు మళ్లేందుకు కావాల్సిన నిధులను సమీకరించడం ఎలా అన్నది ఇప్పటికీ తెగని వివాదం. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ధనిక దేశాలు సాయం చేస్తాయని యూఎన్ఎఫ్సీసీ చర్చల్లో ఒక అవగాహనైతే కుదిరింది. 2015 నాటి ప్యారిస్ ఒప్పందంలో 2020 నాటికి ఏటా వంద బిలియన్ డాలర్లు ధనిక దేశాలు చెల్లించాలన్న తీర్మానమూ ఉంది. అయితే ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల నుంచి రావాల్సిన ఈ మొత్తం ఇప్పటివరకూ అంద లేదు. 2025 నాటికైనా అందేలా చూడాలని గత ఏడాది కాప్ సమా వేశంలో విజ్ఞప్తి చేశారు. కాప్–26లో నిర్దేశించుకున్న లక్ష్యాలను అందుకోవాలంటే ధన సహాయం అన్నది కీలకం. కానీ అభివృద్ధి చెందిన జీ–7 దేశాలు ఇప్పటివరకూ నిధుల ఊసెత్తడం లేదు. ఇండో నేసియాలో జరిగే జీ–20 సమావేశాల్లోనైనా దీనిపై ఒక గట్టి నిర్ణయం జరగడం అవసరం. వచ్చే ఏడాది జీ–20 నిర్వహణ బాధ్యతలు భారత్ చేతిలో ఉంటాయి. ఆ తరువాత బ్రెజిల్, దక్షిణాఫ్రికాల వంతు. అభివృద్ధి చెందుతున్న ఈ దేశాల నేతృత్వంలోనైనా ధనిక దేశాలు వాతావరణ మార్పుల సమస్యను అధిగమించేందుకు అవసరమైన నిధులు అందజేస్తాయని ఆశించాలి. నిధుల ఫలితం ఎలా ఉన్నా మన రోడ్మ్యాప్ మనం సిద్ధం చేసుకోవాలి. – మాంటెక్ సింగ్ అహ్లూవాలియా, ఉత్కర్ష్ పటేల్ వ్యాసకర్తలు వరుసగా ప్లానింగ్ కమిషన్ మాజీ డిప్యూటీ చైర్మన్; ‘సెంటర్ ఫర్ సోషల్ అండ్ ఎకనామిక్ ప్రోగ్రెస్’ అసోసియేట్ ఫెలో (‘ద మింట్’ సౌజన్యంతో) -
Pudami Sakshiga:అడవి సృష్టికర్త "దుశర్ల సత్యనారాయణ"
-
కాలుష్య నియంత్రణ వ్యయమూ పెట్టుబడే!
పంచభూతాలపైన అందరికీ సమాన హక్కు, సమాన బాధ్యత ఉండాలి. మనిషి మనుగడకు కీలకమైన గాలి కలుషితమైనాక జీవి మనుగడ ప్రశ్నార్థకమే కదా. శీతాకాలంలో భారతీయ నగరాల్లో జీవించడం ప్రమాదకరం. ఇవాళ ఢిల్లీ వాయు కాలుష్యంతో కొట్టుమిట్టాడుతోంది. ఇది ఏ ఒక్క నగరానికో సంబంధించిన సమస్య కాదు. గ్లాస్గోలో జరిగిన కాప్ 26 శిఖరాగ్ర సమావేశ నేపథ్యంలో, విషపూరిత వాయు కాలుష్య స్థాయులను నియంత్రించడంలో భారత్ ఎదుర్కొంటున్న సమస్యలకు ప్రాధాన్యత ఉంది. చైనా, అమెరికా, ఐరోపా కూటమి తర్వాత భారత్ ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద కార్బన్ డయాక్సైడ్ ఉద్గారకం. 2070 నాటికి గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను నికర సున్నాకి తగ్గిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. నికర సున్నా ఉద్గారాలు అంటే మానవ నిర్మిత గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలన్నీ వాతా వరణం నుండి తొలగించబడి, తద్వారా భూమి సహజ వాతావరణ సమతుల్యతను తిరిగిపొందడం. యూకే ఆధారిత నాన్–ప్రాఫిట్ క్లీన్ ఎయిర్ ఫండ్, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ప్రకారం, వాయు కాలుష్యం భారతీయ వ్యాపారాలకు సాలీనా తొంభై ఐదు బిలియన్ డాలర్ల నష్టం చేకూరుస్తోంది. దేశ జీడీపీలో దాదాపు మూడు శాతం వాయు కాలుష్య పర్యవసానాల్ని ఎదుర్కోవడానికి ఖర్చవుతుందని బ్లూమ్బెర్గ్ నివేదించింది. 2024 నాటికి ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థగా రూపొందాలనే భారతదేశ ఆకాంక్షను ఈ పరిణామాలు అడ్డుకునే ప్రమాదం లేకపోలేదు. (చదవండి: క్రిప్టో కరెన్సీ నియంత్రణకు సమయం ఇదే!) మానవుల శ్రేయస్సు, తద్వారా ఆర్థికవ్యవస్థపై వాయుకాలుష్య ప్రతికూల ప్రభావాల దృష్ట్యా, వాయు కాలుష్య నిర్వహణ ప్రాధాన్యత సంతరించుకుంది. ఎయిర్ క్వాలిటీ సూచిక రెండు వందల ఒకటి నుంచి మూడువందల పాయింట్ల మధ్య ఉంటే ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న ఏ వ్యాధీలేని సాధారణ మానవులు సైతం అనారోగ్య సమస్యలుఎదుర్కొనే అవ కాశం ఉంటుంది. మూడువందల పాయింట్లు మించితే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాల్సి ఉంటుంది. ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ సుమారు ఐదు వందలు పాయింట్లు తాకడం గమనార్హం. ‘శీతాకాల కార్యాచరణ ప్రణాళిక’లో భాగంగా ఢిల్లీలో ధూళి నియంత్రణ, పూసా బయో– డికంపోజర్ను ఉపయోగించడం, స్మోగ్ టవర్లను ఏర్పాటు చేయడం, గ్రీన్ వార్ రూమ్లను బలోపేతం చేయడం, వాహనాల ఉద్గారాలను తనిఖీ చేయడంపై దృష్టి సారించారు. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో రైతులు కొయ్యకాళ్ళు కాల్చడం వల్ల సమస్య మరింత జఠిల మైంది. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అక్టో బర్ 24 నుంచి నవంబర్ 8 వరకు ఢిల్లీ కాలుష్య కారకాల్లో సగం వాహనాలే ఉన్నాయని పేర్కొంది. (చదవండి: తీరప్రాంత రక్షణలో మన ఐఎన్ఎస్ విశాఖపట్టణం) ఈ సంవత్సరం కర్ణాటక, ఢిల్లీ, హరియాణా, ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్, ఛత్తీస్ఘఢ్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు దీపావళి బాణసంచా పేల్చడంపై ఆంక్షలు విధించాయి. దేశంలోని అన్ని నగరాలు నవంబర్ మాసంలో వాయు కాలుష్య కోరల్లో చిక్కుకొని నివాస యోగ్యం కాని ప్రాంతాలుగా మారుతున్నాయి. పర్యావరణ ప్రమాదాలకు గురయ్యే అవకాశం వున్న నగరాలు మొత్తం ఆసియాలోనే ఉండటం గమనార్హం. వరదలతో సతమతమవుతున్న జకార్తా ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా, ఢిల్లీ తర్వాతి స్థానంలో ఉంది. చెన్నై, ఆగ్రా, కాన్పూర్, జైపూర్, లక్నో, ముంబై వాయు కాలుష్య పరంగా అత్యంత కలుషితమైన నగరాలు. (చదవండి: చట్టాల రద్దుతో మారనున్న రాజకీయం) పంటవ్యర్థాలతో వాయుకాలుష్యానికి ఆస్కారం లేకుండా ‘టకాచార్’ వంటి యంత్రాల ద్వారా ఉపయో గకరమైన ఇంధనంగా మలచవచ్చు. దీంతో వాయు నాణ్యత, రైతుల ఆదాయం పెరగటమేకాక నిరుద్యో గులకు ఉపాధి దొరకుతుంది. కాలుష్య నియంత్రణ ప్రణాళికకు తోడ్పడే వ్యవస్థీకృత జ్ఞానం అభివృద్ధి చెంద వల్సి వుంది. నాన్–బయోడీగ్రేడబుల్ వ్యర్థాల రీసైక్లింగ్, అప్ సైక్లింగ్ను ప్రోత్సహించాలి. బయోడీగ్రేడబుల్ వ్యర్థాలను బయోగ్యాస్గా మార్చడానికి బలమైన కార్యాచరణ కావాలి. కాప్ 26లో ఉద్ఘాటించిన విధంగా 2030 నాటికి భారతదేశం తన శక్తి అవసరాల్లో 50 శాతం పునరుత్పాదక ఇంధనం ద్వారా తీర్చుకోగలిగితే తప్పకుండా వాయు ఉద్గారాలను గణనీయంగా నియంత్రించ గలుగుతుంది. వాయు కాలుష్య నియంత్రణ అనేది ఒక వ్యయం కాదు, దేశ భవిష్యత్తుకు అవసరమైన పెట్టుబడి. – డా. సృజన కత్తి ఐసీఎస్ఎస్ఆర్ పోస్ట్ డాక్టోరల్ రీసెర్చర్, పాండిచ్చేరి విశ్వవిద్యాలయం -
గ్లోబల్ ‘వార్నింగ్’! నేడు ప్రపంచ ధరిత్రీ దినోత్సవం
వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్ ఇలాంటి వాటి వల్ల మనకు చాలా ముప్పు అని ఏళ్లుగా వింటునే ఉన్నాం.. నేడు (ఏప్రిల్ 22) ప్రపంచ ధరిత్రీ దినోత్సవం. ఈ సందర్భంగా ఓసారి మన ధరిత్రిపై ఓ లుక్కేద్దామా.. దాని ప్రస్తుత పరిస్థితి ఏంటో తరచి చూద్దామా.. పెనంపై కాల్చినట్లు.. కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. మొదట్లో కాస్త మెల్లగా మార్పు వచ్చినా.. గత ముప్పై నలభై ఏళ్లుగా వేడి వేగం అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలను రికార్డు చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి (అంటే సుమారు 250 ఏళ్ల నుంచి) పరిశీలిస్తే.. టాప్–20 అత్యంత వేడి సంవత్సరాల్లో 19 సంవత్సరాలు 2001–2021 మధ్య నమోదైనవే. ఇప్పటివరకూ భూమ్మీద నమోదైన అత్యంత వేడి సంవత్సరంగా 2020 నిలిచింది. 1981 నుంచి సగటున ఏటా 0.18 డిగ్రీల ఉష్ణోగ్రత పెరుగుతూ వస్తోంది. అంతకు ముందటితో పోలిస్తే ఇది రెండింతలు పెరుగుదల. మంచు మరుగుతోంది.. భూమి మీద మంచు కప్పి ఉండే ప్రాంతాల విస్తీర్ణం ఏటా పడిపోతోంది.భూమి ఉత్తర అర్ధభాగంలో మంచు ఏర్పడటం బాగా తగ్గిపోయిందని ఉపగ్రహ పరిశీలనలో గుర్తించారు. నిత్యం మంచుతో కప్పి ఉండే అంటార్కిటికాలో ఏటా 15 వేల కోట్ల టన్నులు, గ్రీన్ల్యాండ్లో 27,800 కోట్ల టన్నుల మంచు కరిగిపోతోంది. హిమాలయాలు సహా ప్రపంచవ్యాప్తంగా పర్వ తాలపై హిమనీనదాలు వేగంగా తరిగిపోతున్నాయి. సముద్రం పోటెత్తుతోంది.. భూమ్మీద మంచు కరిగిపోతుండటంతో ఏటా సముద్ర జలాల ఎత్తు పెరిగి.. భూభాగం మునిగిపోతోంది. సముద్రాలు 2006 నుంచి సగటున ఏటా 3.6 మిల్లీమీటర్ల మేర ఎత్తు పెరుగుతున్నాయి. అంతకుముందటితో పోలిస్తే ఇది రెండింతలు కావడం గమనార్హం. ఈ శతాబ్దం ముగిసే సమయం అంటే.. 2100 నాటికి సముద్ర జలాలు 35 సెంటీమీటర్లు, అంతకన్నాపైగా పెరుగుతాయని అంచనా. గత శతాబ్దంలో పెరిగింది 20 సెంటీమీటర్లే. నీళ్లు నిప్పులా మండుతున్నాయి.. భూమ్మీద 70 శాతం ఉపరితలం సముద్రాలదే. భూమిపై అదనంగా పెరిగిపోతున్న వేడిలో 90 శాతం వరకు సముద్రాల్లోకి చేరుతోంది. సముద్రాల్లో పైన సుమారు 100 మీటర్ల మేర నీటిపొర గత 40 ఏళ్లలో 0.33 డిగ్రీల సెల్సియస్ వేడెక్కింది. అంతా కార్బన్డయాక్సైడే.. వాతావరణంలో కార్బన్డయాక్సైడ్ ప్రమాదకర స్థాయిలో పెరుగుతోంది. 1958 నాటితో పోలిస్తే ఇప్పుడు 25 శాతం ఎక్కువగా ఉంది. 60 ఏళ్లతో పోల్చితే ఏటా కార్బన్ డయాక్సైడ్ పెరిగే శాతం ఇప్పుడు 100 రెట్లు పెరిగింది. సముద్రంపై యాసిడ్ దాడి.. వాతావరణంలో పెరిగిపోతున్న కార్బన్డయాౖMð్సడ్లో రోజు సగటున 2 కోట్ల టన్నుల మేర సముద్రాలు పీల్చుకుంటున్నాయి. దీనితో సముద్ర జలాల్లో ఆమ్లత్వం పెరిగిపోతోంది. పారిశ్రామిక విప్లవం వచ్చాక అంటే సుమారు గత 70, 80 ఏళ్లలో సముద్ర ఉపరితల జలాల ఆమ్లత్వం (యాసిడిటీ) 30 శాతం పెరిగింది. ఇది అంతకుముందటితో పోలిస్తే 100 రెట్లు ఎక్కువ. దీనివల్ల సముద్ర ప్రాణుల మనుగడపై ప్రభావం పడుతోంది. -
విశాఖలో బీఎస్–6 ఇంధన ఉత్పత్తి
సాక్షి, విశాఖపట్నం: కాలుష్య నియంత్రణకు సంబంధించి విశాఖపట్నం ప్రముఖ పాత్ర పోషించనుంది. వాహనాల నుంచి వెలువడే ఉద్గారాలను నియంత్రించేందుకు అవసరమైన భారత్ స్టేజ్–6 (బీఎస్–6) ఇంధనం ఉత్పత్తి చేసేందుకు విశాఖ కేంద్రంగా హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్పీసీఎల్) త్వరలోనే కార్యకలాపాలు ప్రారంభించనుంది. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రపంచంలోనే అతిపెద్ద రియాక్టర్లు విశాఖకు చేరుకున్నాయి. బీఎస్–6 వాహనాలు వినియోగించాలని ఏడాది కిందటే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. బీఎస్–4 వాహనాలతో పోలిస్తే.. బీఎస్–6 వాహనాల నుంచి వచ్చే కాలుష్యం చాలా తక్కువ. బీఎస్–6 పెట్రోల్ వాహనం నుంచి నైట్రోజన్ ఆక్సైడ్ 25 శాతం వరకు తక్కువ వెలువడుతుంది. దీనికి కారణం.. ఆయా వాహనాలకు అనువైన పెట్రోల్ తయారు చేయడమే. బీఎస్–6కి అవసరమైన ఇంధన వనరుల ఉత్పత్తికి విశాఖ కేంద్రం కానుంది. కాలుష్య ఉద్గారాల్ని తగ్గించేలా బీఎస్–6 ప్రమాణాలకు అనుగుణంగా ఇంధనాలు ఉత్పత్తి చేసే వ్యవస్థకు హెచ్పీసీఎల్ కొద్ది రోజుల్లో శ్రీకారం చుట్టనుంది. విశాఖలో హెచ్పీసీఎల్ విస్తరణలో ఆధునిక ప్రాజెక్టులో భాగంగా.. బీఎస్–6 పెట్రోల్, డీజిల్ ఉత్పత్తి చేపట్టనుంది. ఇందుకుగాను రిఫైనరీ ప్రాజెక్టు విస్తరణలో అత్యంత కీలకమైన భారీ రియాక్టర్లు విశాఖకు చేరుకున్నాయి. అత్యంత కీలకమైన మూడు ఎల్సీ మ్యాక్స్ (లుమ్మస్ సిటీస్ మ్యాక్స్) రియాక్టర్లను విశాఖ రిఫైనరీలో ఏర్పాటు చేస్తారు. ఎల్ అండ్ టీ సంస్థ వీటిని తయారుచేసి గుజరాత్లో హెచ్పీసీఎల్ ప్రధాన కార్యాలయానికి అప్పగించింది. ఇప్పటికే రెండు రియాక్టర్లను సముద్రమార్గం ద్వారా విశాఖ తీసుకొచ్చారు. త్వరలో మూడో రియాక్టర్ వచ్చిన తరువాత వీటిని అమరుస్తారు. 67.817 మీటర్ల పొడవు, 12.2 మీటర్ల వెడల్పుతో ఉన్న ఒక్కో రియాక్టర్ బరువు 2,105 టన్నులు. ప్రపంచంలోనే అతిపెద్దవైన ఈ మూడు రియాక్టర్లు దేశంలో తొలిసారి ఆర్.యు.ఎఫ్. (రిసిడ్యూ అప్గ్రేడేషన్ ఫెసిలిటీ) క్రూడ్ ఆయిల్ నుంచి బీఎస్–6 డీజిల్ను తీసేందుకు ఉపయోగపడనున్నాయి. సల్ఫర్ అత్యధికంగా ఉండే ముడి చమురును కూడా.. బీఎస్–6 ప్రమాణాలకు అనువైన అధిక నాణ్యత కలిగిన పెట్రోల్, డీజిల్గా మార్చే ప్రక్రియను ఇక్కడ చేపడతారు. త్వరలోనే పనులు ప్రారంభం విస్తరణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటికే ప్రపంచంలోనే అతిపెద్ద రియాక్టర్లు హెచ్పీసీఎల్కు చేరుకున్నాయి. త్వరలో మూడో రియాక్టర్ కూడా రానుంది. వీటి ద్వారా బీఎస్–6 వాహనాలకు అవసరమైన ఇంధనాన్ని ఉత్పత్తి చేసి.. హెచ్పీసీఎల్ మరో ముందడుగు వేయనుంది. చమురు ఉత్పత్తుల్ని మెరుగుపరచడమే కాకుండా ఫీడ్ స్టాక్ పెంచేందుకు కూడా ఈ రియాక్టర్లు ఉపయోగపడతాయి. – రతన్రాజ్, హెచ్పీసీఎల్ విశాఖ రిఫైనరీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ -
ఈ సైకిల్.. స్పీడ్ 80 మైలేజీ 90
సాక్షి, చిత్తూరు: కాలుష్య నివారణకు ఉపయోగపడే ఈ (ఎలక్ట్రిక్ ) బైసైకిల్ను సొంతంగా రూపొందించారు చిత్తూరు జిల్లాకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి అమర్నాథ్. దామలచెరువు మండలానికి చెందిన కృష్ణమూర్తి, షకీల దంపతుల కుమారుడు అమర్నాథ్ సిక్కిం నీట్ కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నారు. సెలవుల్లో ఇంటికి వచ్చిన తను ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు వినూత్నంగా ఆలోచించారు. రూ.80 వేలు వెచ్చించి పర్యావరణహిత ఈ–బైసైకిల్ను తయారు చేశారు. దీని వివరాలను అమర్నాథ్ సోమవారం మీడియాకు వెల్లడించారు. మొదట గేర్ సైకిల్ను కొనుగోలు చేసి, గేర్లు తొలగించానన్నారు. ఆన్లైన్లో పలు వెబ్సైట్లు, కంపెనీల నుంచి విడిభాగాలు, బ్యాటరీ కోనుగోలు చేశానన్నారు. మొదటిసారి ప్రయోగం కాబట్టి ఖర్చు ఎక్కువ అయిందని, కంపెనీలు సహకారం అందిస్తే మరింత తక్కువ ధరకే వినియోగదారులకు వీటిని అందుబాటులోకి తీసుకురావచ్చని చెప్పారు. ఈ బైసైకిల్ ప్రత్యేకతలు.. ►మోటార్కు 72 వాట్స్ డీసీ పవర్ చార్జింగ్ కనెక్షన్ ►గంటకు 80 కిలోమీటర్ల వేగం ►రెండు గంటలు చార్జింగ్ చేస్తే 90 కిలోమీటర్లు నడుస్తుంది ►బ్యాటరీ చార్జింగ్ అయిపోతే ఫెడల్ సాయంతో తొక్కే సౌలభ్యం -
కాలుష్య నివారణకు కేజ్రీ నిర్ణయం: స్విచ్ ఢిల్లీ
న్యూఢిల్లీ: దేశంలోనే అత్యంత కలుషిత నగరంగా దేశ రాజధాని న్యూఢిల్లీ ఉంటోంది. కాలుష్య నివారణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. తాజాగా ఢిల్లీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలో కాలుష్యం తగ్గించేందుకు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచేందుకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ‘స్విచ్ ఢిల్లీ’ అనే కొత్త కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రారంభించారు. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలని ఢిల్లీ ప్రభుత్వం గురువారం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సీఎం కేజ్రీవాల్ స్విచ్ ఢిల్లీ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. కాలుష్యాన్ని నివారించేందుకు ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలనే కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. బడా కంపెనీలు, స్ధానిక సంక్షేమ సంఘాలు, మార్కెట్ సంఘాలు, మాల్స్, సినిమా హాళ్ల నిర్వాహకులు తమ ప్రాంగణాల్లో చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటుచేయాలని సూచించారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. యువత తమ తొలి వాహనంగా ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేయాలని చెప్పారు. ‘స్విచ్ ఢిల్లీ’ కార్యక్రమంతో ఎలక్ట్రిక్ వాహనాల ప్రయోజనాలను వివరించనున్నారు. ఈ వాహనాల వాడకంతో కాలుష్యం ఎలా తగ్గుతోందని చెబుతుందని సీఎం అరవింద్ తెలిపారు. పాత పెట్రోల్, డీజిల్ వాహనాల బదులు ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలు వాడాలని సూచించారు. కాలుష్య రహిత ఢిల్లీ ఏర్పాటుకు సహకరించాలని పిలుపునిచ్చారు. 2020లో ఎలక్ట్రిక్ వాహన విధానం తీసుకురావడంతో ఢిల్లీలో 6 వేల ఎలక్ట్రిక్ వాహనాలు ప్రజలు కొనుగోలు చేశారని సీఎం కేజ్రీవాల్ వివరించారు. మరింత ప్రోత్సహించేందుకు ఢిల్లీవ్యాప్తంగా 100 చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు కోసం ప్రభుత్వం టెండర్లను జారీ చేసిందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అరవింద్ తెలిపారు. आइए प्रदूषण के ख़िलाफ़ एक जंग मिलकर लड़ें, अपने वाहनों को Electric vehicle पर Switch करें। pic.twitter.com/QNLCdDWYHq — Arvind Kejriwal (@ArvindKejriwal) February 4, 2021 -
‘కాలుష్య’ వాహనాలపై కొరడా
సాక్షి, అమరావతి: కాలుష్య నియంత్రణ పాటించని వాహనాలపై కొరడా ఝుళిపించేందుకు రవాణా శాఖ సమాయత్తమైంది. నిబంధనలు, ప్రమాణాలు పాటించని వాహనాల పర్మిట్లు, రిజిస్ట్రేషన్ కార్డులు సస్పెన్షన్ చేసేందుకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలకు రవాణా అధికారులు రంగంలోకి దిగారు. రవాణా అధికారులు నిర్వహించే పొల్యూషన్ టెస్ట్లలో ఫెయిలైయితే వాహనం రిజిస్ట్రేషన్ రద్దు చేయనున్నారు. వాహనాల యజమానులు ఎప్పటికప్పుడు కాలుష్య పరీక్షలు చేయించుకోవాలని రవాణా శాఖ సూచించింది. పొల్యూషన్ పరీక్షలు చేయించి ప్రతి వాహనదారుడు పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికెట్ పొందాలి. కార్లు, ఇతర వాహనాలకు కార్బన్ మోనాక్సైడ్ 0.3 శాతం, హైడ్రో కార్బన్ 200 పీపీఎంలోపు ఉండాలి. కాలుష్య ఉద్గారాలు ఇంతకు మించి ఉంటే రవాణా శాఖ చర్యలు తీసుకుంటుంది. కాలం చెల్లిన వాహనాలపైనా అధికారులు దృష్టి సారించారు. -
మన గాలి వెరీ'గుడ్'
సాక్షి, హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు తొలిసారిగా హరిత జోన్ (గ్రీన్జోన్)లో స్థానం సంపాదించాయి. నెలకు పైగా లాక్డౌన్ కొనసాగుతుండడంతో వాయు కాలుష్యం గణనీయంగా తగ్గి పలు నగరాలు, పట్టణాల్లో గాలి నాణ్యత పెరిగింది. గతంలో ఏ కాలంలోనైనా (ముఖ్యంగా వేసవిలో) ఈ స్థాయిలో మెరుగైన వాయునాణ్యత రికార్డయిన దాఖలాల్లేవు. లాక్డౌన్తో వాహనాలు, పరిశ్రమలు, ఇతర త్రా రూపాల్లోని కాలుష్యం తగ్గి పోవడంతో మొదటిసారి రెండు రాష్ట్రాల్లోని ముఖ్యమైన నగరాలు, పట్టణాలు ‘గ్రీన్జోన్’లో స్థానం పొందాయి. హైదరాబాద్, అమరావతి, విశాఖ, రాజమండ్రి వంటి నగరాలు మెరుగైన పాయింట్లు సాధించా యి. తాజాగా కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి వెల్లడించిన గణాంకాల ప్రకారం.. పలు నగరాల్లో వాయు నాణ్యతలో గణనీయమైన మార్పులొచ్చాయి. గత వర్షాకాలంలో నమోదైన వాయు నాణ్యత స్థాయిలో ఈ నగరాలు, పట్టణాల్లో ప్రస్తుతం గాలి నాణ్యత నమోదైందంటే లాక్డౌన్ ఎంత మార్పు తెచ్చిందో అర్థం చేసుకోవచ్చు. వాయు నాణ్యత 0–50 పాయింట్లుగా ఉంటే దానిని గ్రీన్జోన్గా పరిగణిస్తారు. దక్షిణాది నగరాలే ‘గుడ్’: లాక్డౌన్ కాలంలో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు వాయు నాణ్యతసూచీలో ‘గుడ్’ కేటగిరీ సాధించడం విశేషం. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాల తో పాటు దక్షిణాదిలోని నగరాలు కూడా ఈ కోవలోకే చేరాయి. ఉత్తరాది రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో వాయునాణ్యత పరిస్థితి కొంత బాగుపడినా, మొత్తంగా దక్షిణాది నగరాలతో పోలిస్తే ఉత్తరాది నగరాలు ఇంకా మెరుగైన స్థితి సాధించలేదు. దేశవ్యాప్తంగా.. గతేడాది ప్రపంచంలోనే అత్యంత కాలుష్యం బారినపడిన 20 నగరాల్లో మన దేశంలోని 14 నగరాలు నిలవగా, ఇప్పుడు సుదీర్ఘ లాక్డౌన్తో ఈ పరిస్థితిలో గణనీయ మార్పు వచ్చింది. మునుపెన్నడూ లేనివిధంగా నగరాలు, పట్టణాల్లో ప్రజలు స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటున్నారు. న్యూమోనియా వంటి వ్యాధులతో పోరాడేందుకు స్వచ్ఛమైన వాయువు దోహదపడుతుందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. గత నెలలో వాయునాణ్యతను పరీక్షించినపుడు దాదాపు సగం నగరాలు మాత్రమే ‘శాటిస్ఫాక్టరి’ కేటగిరీలో ఉన్నాయి. లాక్డౌన్ సమయంలో దేశవ్యాప్తంగా 103 నగరాల్లో 90శాతానికి పైగా నగరాల్లో వాయు నాణ్యత మెరుగుపడి, ‘గుడ్’ కేటగిరిలోకి చేరినట్టు సీపీసీబీ గణాంకాలు చెబుతున్నాయి. ఈ నగరాల్లో ‘గాలి’ మారింది.. బుధవారం (ఏప్రిల్ 22) మధ్యాహ్నం 3.15కి సమీర్ యాప్ ద్వారా ఏక్యూఐ డేటాను సీపీసీబీ అప్డేట్ చేసింది. అందులోని లెక్కల ప్రకారం.. 25 పాయింట్లతో ఆంధ్రప్రదేశ్లోని అమరావతి టాప్లో నిలిచింది. హైదరాబాద్లో మొత్తంగా వాయునాణ్యత 47 పాయింట్లుగా నమోదైంది. ఇంకా నగరంలోని జూబ్లీహిల్స్లోని ఇక్రిశాట్ కాలనీ వద్ద 38 పాయిం ట్లు, హైదరాబాద్ వర్సిటీ వద్ద 42, ఎర్రగ డ్డ సమీపంలో 46, బొల్లారం ఇండస్ట్రియ ల్ ఏరియా వద్ద 48, శివార్లలోని ముత్తంగి చెరువు సమీపంలో 51, జూ పార్కు వద్ద 55 పాయింట్లుగా వాయునాణ్యత నమోదైంది. దక్షిణాది నగరాలు, తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బుధవారం నమోదైన వాయు నాణ్యత స్థాయిలివీ.. గాలికీ ఓ లెక్కుంది! వాయు నాణ్యత (ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్– ఏక్యూఐ) కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) ‘సమీర్ యాప్’ ద్వారా ఆన్లైన్ లో వెల్లడిస్తుంటుంది. ఏక్యూఐ 50 పాయింట్ల లోపు ఉంటే స్వచ్ఛమైన గాలి ప్రజలకు అందుతున్నట్టు లెక్క. 50 – 100 పాయింట్లు నమోదైతే గాలి నాణ్యతగా ఉన్నట్టు. అంతకుమించి తే ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. -
మ.. మ.. మాస్క్!
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా మాస్కులకు డిమాండ్ పెరిగింది. ఒకప్పుడు నగరాల్లో కాలుష్యాన్ని తట్టుకునేందుకు, డస్ట్ ఎలర్జీ ఉన్నవారు, సిమెంట్, ఫార్మా కంపెనీల్లో పని చేసేవారు మాత్రమే మాస్కులు వినియోగించేవారు. కానీ, ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసులకు చికిత్స చేసే వైద్యులు, 24 గంటల పాటు గస్తీ విధులు నిర్వహిస్తున్న పోలీసులు, గ్రామం నుంచి పట్టణం దాకా పౌరులందరూ మాస్కులు ధరిస్తున్నారు. ఇందులో అభివృద్ధి చేసిన విధానం, దుమ్ము, ధూళి, బ్యాక్టీరియా, వైరస్లను అడ్డుకునే సామర్థ్యాన్ని బట్టి అనేక రకాలు ఉన్నాయి. బెంగళూరుకు చెందిన వర్సో హెల్త్ కేర్.కామ్ అందించిన వివరాల ప్రకారం.. ఏ మాస్క్ దేనిని ఎంత మేర అడ్డుకుంటుందో చూద్దామా..? -
ప్రత్యామ్నాయ పంటలతోనే ఢిల్లీ కాలుష్యానికి చెక్
న్యూఢిల్లీ: గాలి కాలుష్యంతో వారం రోజులుగా ఢిల్లీ వాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ మంగళవారం ఉత్తర భారతంలో కాలుష్య పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. ఢిల్లీ, పంజాబ్, హరియాణా ఉన్నతాధికారులతో ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ పి.కె. మిశ్రా రెండు రోజులుగా జరిపిన వరుస సమావేశాలనంతరం ప్రధాని మొత్తంగా పరిస్థితుల్ని సమీక్షించారు. శీతాకాలంలో ఢిల్లీలో వాయు కాలుష్యం పెరగడానికి పొరుగున ఉన్న పంజాబ్, హరియాణాలో పంట వ్యర్థాలను కాల్చడమే కారణమని విమర్శలు వస్తున్న నేపథ్యంలో రైన్ఫెడ్ ఏరియా అథారిటీ (ఎన్ఆర్ఏఏ), కొన్ని ప్రతిపాదనలు చేసింది. కేవలం వరిపైనే ఆధారపడకుండా వివిధ రకాల ఇతర పంటల్ని పండించడానికి రైతుల్ని మళ్లిస్తే పంట వ్యర్థాల్ని కాల్చడం తగ్గుతుందని ఎన్ఆర్ఏఏ సీఈవో అశోక్ దాల్వాయ్ పేర్కొన్నారు. తద్వారా ఢిల్లీ వాయు కాలుష్యానికి అడ్డుకట్ట వేయొచ్చునని తెలిపారు. వరి దేశంలో అన్ని చోట్లా పండుతుందని అలాంటప్పుడు వరి పంటకి బదులు గోధుమ వంటి ఇతర పంటలవైపు రైతుల్ని మళ్లించడానికి ప్రోత్సాహకాల్ని ఇస్తే పంట వ్యర్థాల దహనం తగ్గుతుందని అన్నారు. తక్కువ కాల వ్యవధిలో చేతికొచ్చే వరిలో ఇతర రకాల్ని పండించడానికి రైతులు మొగ్గుచూపేలా చర్యలు తీసుకుంటే సెప్టెంబర్ నాటికల్లా పంట చేతికొస్తుందని, అప్పుడు శీతాకాలంలో పంట వ్యర్థాల్ని కాల్చడమనే సమస్య ఉత్పన్నం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. పంట వ్యర్థాల్ని ఎరువులుగా మార్చాలి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ భాగెల్ పంట వ్యర్థాల్ని పొలాల్లో ఎరువులుగా మారిస్తే ఈ పరిస్థితికి శాశ్వత పరిష్కారం లభిస్తుందని సూచించారు. çహరియాణా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ పంట వ్యర్థాల్ని కాల్చడమనేది కాలుష్యానికి 20 శాతం మాత్రమే కారణమని, వాటిని తగులబెట్టకుండా రైతులకు ప్రత్యామ్నాయాల్ని చూపిస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది రైతులకు పంట వ్యర్థాలను నిర్వీర్యం చేసే 15 వేల మిషన్లను ఇప్పటి వరకు పంపిణీ చేశామన్నారు. ఇక పంజాబ్లో వరి పంట నుంచి వచ్చే గడ్డిని కాల్చే బదులుగా దానిని సేకరించి ఉత్తరప్రదేశ్లో ఉన్న ఆవుల మేతకు తరలించాలని అఖిల భారత కిసాన్ యూనియన్ సమన్వయ కర్త యుధ్వీర్ సింగ్ ప్రభుత్వానికి సూచించారు. పెరిగిన వాయు వేగం.. తగ్గిన ఢిల్లీ కాలుష్యం ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో గాలి వేగం గంటకి 40 కి.మీ.లకు పెరగడంతో కాలుష్యం తగ్గుముఖం పట్టింది. గాలిలో నాణ్యత సూచి మంగళవారం 365 నుంచి మధ్యాహ్నం 331కి తగ్గింది.. ఢిల్లీతో పాటు ఎన్సీఆర్ పరిధిలో గ్రేటర్ నోయిడా, ఫరీదాబాద్ గుర్గావ్, ఘజియాబాద్ ప్రాంతాల్లో కూడా పరిస్థితి కాస్త మెరుగైంది. ‘పశ్చిమాదిన ఏర్పడిన మహా తుపాను పరిస్థితులు, వాతావరణంలో మార్పుల కారణంగా వచ్చే రెండు మూడు రోజుల్లో వాయవ్య భారతంలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఢిల్లీ, కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజా»Œ ,æహరియాణా, రాజస్తాన్, యూపీలో ఈదురుగాలులతో వర్షాలు కురవడం వల్ల కాలుష్యం తగ్గే అవకాశం ఉంది’అని వాతావరణ శాఖ తెలిపింది. -
ఇంట్లోనూ సురక్షితంగా లేరు
న్యూఢిల్లీ: ఢిల్లీ, ఎన్సీఆర్ పరిధిలో కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోవడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని సుప్రీంకోర్టు మండిపడింది. తీవ్రమైన కాలుష్యంతో ప్రజలు విలువైన ప్రాణాలు కోల్పోతున్నారని, వారి ఆయుర్దాయం తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం చేసింది. జస్టిస్ అరుణ్ మిశ్రా, దీపక్ గుప్తాలతో కూడిన డివిజన్ ఇలాంటి వాతావరణంలో మనుషులెవరైనా జీవించగలరా అని ప్రశ్నించింది. ప్రజలు ప్రాణాలు కోల్పేయే పరిస్థితి వచ్చినా ప్రభుత్వ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం సరైనది కాదని మండిపడింది. ఇళ్లల్లో సురక్షితంగా లేకపోవడం అంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ప్రజల జీవించే హక్కుని కాలరాసినట్టేనని ఘాటుగా విమర్శించింది. ఈ పరిస్థితి కంటే ఎమర్జెన్సీ పరిస్థితులు చాలా మెరుగ్గా ఉంటాయని జస్టిస్ మిశ్రా వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వాలూ బాధ్యత వహించాలి పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్లు పంట వ్యర్థాలను కాల్చడం నిలిపివేయాలని ఆదేశించింది. పంట వ్యర్థాలు తగులబెట్టడమే కాలుష్యానికి కారణమైతే ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల నుంచి గ్రామ పంచాయతీల వరకు అందరూ బాధ్యత వహించాలని పేర్కొంది. బాధ్యత వహించాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్నికల గిమ్మిక్కుల మీద ఉన్న శ్రద్ధ మరి దేని మీద లేదని విమర్శించింది. ఢిల్లీ, ఎన్సీఆర్ పరిధిలో అన్ని రకాల నిర్మాణాలను, కూల్చివేతలను, చెత్తను కాల్చడాన్ని తమ తదుపరి ఆదేశాలు వచ్చేవరకు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. పర్యావరణ నిపుణుల్ని కోర్టులో ప్రవేశపెట్టాలని సుప్రీం ఆదేశంతో కోర్టుకు హాజరైన పర్యావరణ కాలుష్య నివారణ, నియంత్రణ మండలి (ఈపీసీఏ) చైర్మన్ భూరేలాల్ పొరుగు రాష్ట్రాల్లో తగలబెడుతున్న పంట వ్యర్థాల కారణంగానే ఢిల్లీని కాలుష్యం కమ్మేస్తోందని ఆయా రాష్ట్రాల ప్రధానకార్యదర్శులని పిలిచి మాట్లాడాలని సూచించారు. నాలుగైదు రోజులతో పోల్చి చూస్తే ఢిల్లీలో కాలుష్యం కాస్తో కూస్తో తగ్గింది. కానీ గాలి నాణ్యత సూచీ మాత్రం తీవ్రస్థాయిలోనే ఉంది. సోమవారం ఉదయం గాలి నాణ్యత సూచి 438కి తగ్గింది. అయినప్పటికీ ఈ కాలుష్యాన్ని తీవ్రంగానే పరిగణించాల్సి ఉంటుంది. కారు పూల్లో సీఎం ముఖ్యమంత్రి కేజ్రీవాల్, రాష్ట్ర ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్, కార్మిక మంత్రి గోపాల రాయ్తో కలిసి కారు పూల్ విధానంతో ఒకే కారులో సచివాలయానికి వచ్చారు. ఇక ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తన ఇంటి నుంచి సైకిల్పై సెక్రటేరియెట్కి వచ్చారు. కాగా, బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ విజయ్ గోయెల్ సరిబేసి కార్ల ప్రయాణం నిబంధనల్ని అతిక్రమించారు. సోమవారం సరి సంఖ్యలో ఉన్న కార్లను మాత్రమే బయటకు తీసుకురావాలి. కానీ గోయెల్ బేసి సంఖ్యలో ఉన్న కారులో ప్రయాణించడంతో పోలీసులు ఆయనను ఆపి రూ.4వేల జరిమానా విధించారు. ఈ కార్ల విధానాన్ని తప్పుపట్టిన గోయెల్ ఇదంతా కేజ్రివాల్ చేస్తున్న ఎన్నికల స్టంట్ అని వ్యాఖ్యానించారు. బాబోయ్ ఢిల్లీలో షూటింగ్ ఢిల్లీలో షూటింగ్ చేయడం అత్యంత కష్టంగా మారిందని బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి కాలుష్యంలో అందరూ ఎలా ఉంటున్నారో ఆలోచిస్తే దడ పుడుతోందన్నారు. ‘వైట్ టైగర్’ షూటింగ్ కోసం ఢిల్లీలో ఉన్నపుడు తన ముఖానికి మాస్క్ ధరించిన ఫొటోని ఆమె తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ‘ముఖం అంతా కప్పి ఉంచే మాస్క్లు, ఎయిర్ ప్యూరిఫయర్లు ఉండటంతో మనం బతికిపోయాం. ఇంతటి దారుణమైన పరిస్థితుల్లో నిలువ నీడ లేని వారి పరిస్థితి ఏమిటి ? ఢిల్లీవాసులందరూ సురక్షితంగా ఉండాలని అందరూ ప్రార్థించండి’ అని ప్రియాంక తన పోస్టులో పేర్కొన్నారు. మాస్క్తో ప్రియాంక చోప్రా -
పర్యావరణ విధ్వంసాన్ని ఉపేక్షించం
సాక్షి, అమరావతి : పర్యావరణ విధ్వంసాన్ని సహించేది లేదని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. మన పర్యావరణాన్ని, ప్రకృతిని సంరక్షించుకోకపోతే, భవిష్యత్ తరాలు ఎలా బతకగలుగుతాయనే ఆలోచన చేయకపోతే చాలా ఇబ్బందులు వస్తాయని చెప్పారు. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణలో మనం దేశానికి మార్గదర్శకంగా నిలవాలని, ఇందులో భాగంగా అత్యుత్తమ విధానాలను అనుసరిస్తున్న వివిధ దేశాల్లోని పద్ధతులను అధ్యయనం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణపై నెలలోగా అత్యుత్తమ విధానాలను సూచిస్తూ ప్రతిపాదనలు రూపొందించాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఆ ప్రతిపాదనలకు అనుగుణంగా అసెంబ్లీలో బిల్లులు పెట్టి చట్టం తీసుకు వద్దామని చెప్పారు. దేశానికే మార్గదర్శకంగా పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ విధానం ఉండాలని స్పష్టీకరించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన రాష్ట్రంలో అడవుల పెంపకం, కాలుష్య నియంత్రణ, పర్యావరణ పరిరక్షణపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పరిశ్రమల కాలుష్యాన్ని తొలగించే బాధ్యత సర్కారుదే పరిశ్రమల కాలుష్యాన్ని తొలగించే బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుందని, ఆ మేరకు గ్రీన్ ట్యాక్స్ విధిస్తామని సీఎం స్పష్టం చేశారు. ప్రస్తుత కాలుష్య నియంత్రణ బోర్డు, సంబంధిత వ్యవస్థల్లో సమూల ప్రక్షాళన చేయాలని సూచించారు. విశాఖపట్నం కాలుష్యంతో అల్లాడుతోందని, దీనిని నియంత్రించకపోతే తీవ్ర ఇబ్బందులు తప్పవన్నారు. ఈ నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణకు, కాలుష్య నియంత్రణకు విశాఖ నగరంలో పెద్దపీట వేయాలని సూచించారు. పరిశ్రమలు ఏమైనా వస్తున్నాయంటే.. రెడ్ కార్పెట్ వేస్తామని, అయితే వాటి నుంచి ఎలాంటి కాలుష్యం వస్తుందనే దానిపై మనం ఆలోచించడం లేదన్నారు. వాతావరణానికి, పర్యావరణానికి ఎలాంటి భంగం కలుగుతుందనే దానిపై దృష్టి పెట్టడం లేదని, ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని మాత్రమే ఆలోచిస్తున్నామన్నారు. కాలుష్య నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ పట్ల సమగ్ర అవగాహన, పరిజ్ఞానం, అంకిత భావం ఉన్న వారు ఈ వ్యవస్థల్లో ఉండాలని చెప్పారు. పరిశ్రమలు నడుపుతున్న వారికి వేధింపులకు గురవుతున్నామనే భావన రానీయకూడదని సూచించారు. ఈ అంశాలన్నింటినీ సమగ్రంగా ఆలోచించి ఉత్తమ విధానాలను మనం అనుసరించాలని అన్నారు. గ్రామ వలంటీర్ల ద్వారా మొక్కల పంపిణీ గ్రామ వలంటీర్లు ప్రతి ఇంటికీ నాలుగు మొక్కలు పంపిణీ చేయాలని, చెట్లను పెంచడంలో వారి సహకారం తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ మేరకు గ్రామ వలంటీర్లందరికీ మొక్కలు అందుబాటులో ఉంచాలన్నారు. మొక్కలను పెంచడానికి కాల్వ గట్లను పూర్తి స్థాయిలో వినియోగించాలని సూచించారు. అనంతపురం, కడప ప్రాంతాల్లో అడవులను పెంచడంపై దృష్టి సారించాలని, తద్వారా ఆ ప్రాంత నైసర్గిక స్వరూపాన్ని మార్చాల్సిందిగా సీఎం సూచించారు. పంట కాల్వలను కాపాడుకోవాలని, అవి కాలుష్యానికి గురవ్వకుండా నిరోధించాలని చెప్పారు. ఉభయ గోదావరి జిల్లాల్లో పూర్తి స్థాయిలో కాల్వలను పరిరక్షించేందుకు ‘మిషన్ గోదావరి’ పేరుతో పర్యావరణ పరిరక్షణ కార్యక్రమం చేపట్టాలని ఆదేశించారు. దీనిపై సరైన ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులకు సూచించారు. ఆక్వా పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలను శుద్ధి చేయాలని.. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో వేస్ట్ మేనేజ్మెంట్ వ్యవస్థ తప్పనిసరిగా ఉండాలన్నారు. ఇ–వేస్ట్ కోసం కాల్ సెంటర్ ఇ–వేస్ట్ కోసం కాల్ సెంటర్ను ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. లక్ష టన్నుల వ్యర్థాలు ఫార్మా కంపెనీల నుంచి వస్తే అందులో సుమారు 30 శాతం మాత్రమే శుద్ధి చేస్తున్నారని, మిగతా 70 శాతం వాతావరణంలోకి వదిలేస్తున్నారని సీఎం తెలిపారు. హేచరీ జోన్గా ప్రకటించిన ప్రాంతాల్లో ఫార్మా కంపెనీలకు అనుమతి ఇచ్చారన్నారు. ఇవాళ ఏపీ నుంచి పెద్ద ఎత్తున సముద్రపు ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయని, ఇందులో మనం దేశంలోనే నంబర్ వన్గా ఉన్నామని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హేచరీ జోన్గా ప్రకటించిన తర్వాత ఆ ప్రాంతాల్లో ఫార్మా కంపెనీలకు ఎలా అనుమతి ఇచ్చారో అర్థం కావడం లేదన్నారు. ఫార్మా కంపెనీల కోసం ఇప్పటికే మనం ఫార్మా సిటీలను ఏర్పాటు చేశామని, అక్కడే వాటిని పెట్టుకునేలా వారికి అనుతులు ఇచ్చి ఉండాల్సిందన్నారు. వేస్ట్ మేనేజ్మెంట్, మురుగు నీటి పారిశుధ్యంపై దృష్టి పెట్టాలని, మురుగు నీటిని శుద్ధి చేసిన తర్వాతే విడిచి పెట్టాలని సూచించారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్పై ఫ్రెంచి ప్రతినిధి బృందంతో చర్చించానని తెలిపారు. అటవీ శాఖ వద్ద ఉన్న ఎర్ర చందనాన్ని ఏకమొత్తంగా అమ్మే పద్ధతిలో కాకుండా విడతలుగా అమ్మితే ప్రభుత్వానికి మేలు జరుగుతుందని చెప్పారు. వాల్యూ యాడ్ చేసి విక్రయిస్తే ప్రభుత్వానికి మరింత మేలు జరుగుతుందని సూచించారు. ఈ విషయంలో అంతర్జాతీయంగా చైనా, జపాన్ సంస్థలతో చర్చలు జరపాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అటవీ, పర్యావరణ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
థర్మల్.. డేంజర్ బెల్!
సాక్షి, అమరావతి: థర్మల్ విద్యుత్ కేంద్రాలు వెదజల్లే విషవాయువులు ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతు న్నాయని కేంద్ర పర్యావరణ శాఖ మరోసారి రాష్ట్రాలను హెచ్చరించింది. కాలుష్య నియంత్రణ దిశగా ఆంధ్రప్రదేశ్లో ఏమాత్రం చర్యలు చేపట్టకపోవడాన్ని ప్రశ్నించింది. పర్యావరణ శాఖ తాజాగా పంపిన నివేదికలో పలు అంశాలను ప్రస్తావించింది. రాజధాని నగరం అమరావతికి అతి సమీపంలోని నార్లతాతారావు థర్మల్ విద్యుత్ కేంద్రం (ఎన్టీటీపీ)లో దశాబ్దాల క్రితం థర్మల్ యూనిట్లు ఏర్పాటు చేశారు. అప్పట్లో ఇవి జనావాసాలకు దూరంగా ఉన్నాయి. ఇప్పుడు అతి సమీపంలోనే రాజధానితో పాటు పెద్ద ఎత్తున కాలనీలు వెలిశాయి. దీంతో ప్రజలు అతి భయంకరమైన విషవాయువుల బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అదీగాక నైట్రోజన్, సల్ఫ్యూరిక్ యాసిడ్స్ వల్ల భయంకరమైన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని తేల్చి చెప్పింది. కడపలోని ఆర్టీపీపీ, నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నంతో పాటు పలు ప్రైవేటు విద్యుత్ కేంద్రాలకు సమీపంలోనూ ఇలాంటి ప్రమాదకర పరిస్థితి ఉన్నట్టు తెలిపింది. 10 కిమీ వరకూ డేంజరే థర్మల్ విద్యుత్ కేంద్రాలకు 10 కిలోమీటర్ల పరిధిలో భయంకరమైన పరిస్థితులున్నాయని పర్యావరణ శాఖ అధ్యయనంలో వెల్లడైంది. థర్మల్ కేంద్రాల్లో కాల్చే బొగ్గు నుంచి వెలువడే కాలుష్యం గుండె జబ్బులు, దీర్ఘకాలిక శ్వాసకోస వ్యాధులు, ఆస్తమా తదితర రుగ్మతలకు కారణమవుతుందని తెలిపింది. గడచిన ఐదేళ్లుగా రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాల వద్ద దాదాపు 90 వేల మంది ఆస్తమాకు గురైనట్టు తేలింది. ప్రాణాంతక వ్యాధుల వల్ల మృత్యువాత పడే ఐదేళ్లలోపు పిల్లల సంఖ్య గడచిన నాలుగేళ్లుగా ఎక్కువగా ఉందని పేర్కొంది. కాలుష్యం బారిన పడి ఆనారోగ్యానికి గురవుతున్న వారిలో పేదలు, మైనార్టీలు, వృద్ధులు, చిన్నారులు ఎక్కవగా ఉన్నారు. వీరు ఆరోగ్యం కోసం చేసే వ్యయం కోట్లలో ఉంటోంది. ఆంధ్రప్రదేశ్లో ఈ బొగ్గు వినియోగం వల్ల పార్టిక్యులేట్ మ్యాటర్ – 2.5 (పిఎం 51,500 టన్నులు), పిఎం 10 (1,07,500 టన్నులు), సల్ఫర్డై ఆక్సైడ్ 1,99,500 టన్నులు), నైట్రిక్ ఆక్సైడ్ (1,87,500 టన్నులు), కార్బన్మోనాక్సైడ్(1,04,000 టన్నులు) వెలువడినట్టు నివేదిక వెల్లడించింది. గాలిలో కలిసిన ధూళికణాలు 2.5 మైక్రాన్స్ (మనిషి వెంట్రుక మందంలో 30వ వంతు కన్నా చిన్నవి), పరిమాణంలో ఉంటే, నేరుగా ఊపిరితిత్తులోకి వెళ్ళి ఆ తర్వాత రక్తంలో కలుస్తాయి. అనారోగ్యానికి కారణమవుతాయి. సముద్ర జీవులకూ ముప్పే రాష్ట్రంలో సముద్ర తీర ప్రాంతాల్లో ఏర్పాటైన థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి వెలువడే విష రసాయనాలను సముద్రంలోకే విడుస్తున్నారు. దీని వల్ల మత్స్య తదితర జీవులకూ తీవ్ర నష్టం వాటిల్లుతోంది. థర్మల్ విద్యుత్ కేంద్రాల పరిధిలో అసాధారణంగా 40–50 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకూ ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి. దీని వల్ల ఆ పరిసరాల్లోని వరి, మామిడి, జీడిమామిడి, కొబ్బరి తోటలు అంతరించిపోతున్నాయి. చిమ్నీ పొగ ద్వారా వెలువడిన వాయువులతో ఆమ్ల వర్షాలు వస్తున్నాయి. ఇవి పంటలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని పర్యావరణ శాఖ పేర్కొంది. ప్లాంట్ నుంచి వచ్చే బూడిదను 30 ఏళ్ల వరకూ నిల్వ చేయడం వల్ల మత్స్య సంపద, సహజ నీటి వనరులకు నష్టం వస్తోంది. ఈ నేపథ్యంలో అత్యధికంగా కాలుష్యం వెదజల్లే థర్మల్ ప్లాంట్లలో ఉత్పత్తి ఆపివేయాలని సూచించింది. వీలుకాని పక్షంలో సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్ తగ్గించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. దీనికి వేల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుందని, ఇంత మొత్తం ఏపీ జెన్కో సమకూర్చుకునే స్థితిలో లేదని అధికారులు అంటున్నారు. ఏదేమైనప్పటికీ కాలుష్య నియంత్రణ దిశగా తీసుకునే చర్యలపై నివేదిక ఇవ్వాలని కేంద్ర పర్యావరణ శాఖ రాష్ట్ర విద్యుత్ సంస్థలను కోరింది. -
విశాఖ పోర్టు లాభం రూ. 200 కోట్లు
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం పోర్టు గడిచిన ఐదేళ్లలో ఆర్థిక, నైపుణ్యత, మౌలిక సదుపాయాలు తదితర అన్ని రంగాల్లోనూ గణనీయమైన అభివృద్ధిని సాధించిందని పోర్టు ట్రస్ట్ చైర్మన్ ఎంటీ కృష్ణబాబు వెల్లడించారు. ప్రతి ఏటా ఐదు శాతం వృద్ధి రేటు సాధించడమే కాకుండా దేశంలోనే శుభ్రమైన పోర్టుగా వరుసగా మూడేళ్లు జాతీయ స్థాయిలో రెండో స్థానంలో నిలిచిందన్నారు. గ్రీన్ ఇండస్ట్రీ, గ్రీన్ పోర్టు అవార్డులను కూడా సొంతం చేసుకుందని చెప్పారు. పోర్టు అభివృద్ధి కోసం తన హయాంలో చేపట్టిన కార్యక్రమాలను కృష్ణబాబు శుక్రవారం విశాఖలో మీడియాకు వివరించారు. 2017–18లో 63.54 మిలియన్ టన్నుల మేర ఎగుమతులు, దిగుమతులు జరిగితే 2018–19లో 65.3 మిలియన్ టన్నులకు పెరిగాయని, తద్వారా రూ. 200 కోట్ల లాభాలను ఆర్జించి పోర్టు రికార్డు నెలకొల్పిందని తెలిపారు. రూ. 300 కోట్ల ఖర్చుతో పోర్టు ఛానల్ లోతును 11 మీటర్ల నుంచి 14.5 మీటర్లకు పెంచామని, దీనివల్ల లక్ష టన్నులకు మించిన నౌకలు కూడా ఇన్నర్ హార్బర్లలోకి వచ్చే వెసులుబాటు కలిగిందని చెప్పారు. 85 ఏళ్ల కిందట ఏర్పడిన పోర్టును ప్రస్తుత టెక్నాలజీకి అనుగుణంగా ఆధునికీకరిస్తున్నామని, ఇందుకోసం విశాఖ పోర్టు ట్రస్ట్ రూ. 1,200 కోట్లు ఖర్చు చేస్తే, ప్రైవేటు సెక్టార్ నుంచి రూ. 2,500 కోట్లు పెట్టుబడులు పెట్టారన్నారు. విలాసవంతమైన భారీ క్రూయిజ్ల నిర్మాణం కోసం రూ. 77 కోట్లు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. పోర్టు కాలుష్య తీవ్రతను తగ్గించేందుకు కాన్వెంట్ కూడలి నుంచి సీ హార్స్ జంక్షన్ వరకు 7.5 మీటర్ల ఎత్తులో రక్షణ గోడ నిర్మించామని వివరించారు. కాలుష్య నియంత్రణ కోసం గడిచిన 8 ఏళ్లలో రూ. 5 వేల కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. సాగరమాల ప్రాజెక్టు కింద పోర్టు రోడ్డును నాలుగు వరుసలకు విస్తరించడంతో పాటు షీలానగర్ నుంచి సబ్బవరం వరకు కొత్తగా నిర్మిస్తున్న జాతీయ రహదారికి అనుసంధానమయ్యేలా పనులు జరుగుతున్నాయన్నారు. -
కాలుష్య ప్రమాణాలు పాటించకుంటే చర్యలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఫార్మా కంపెనీలు నిర్దేశిత కాలుష్య నియంత్రణ ప్రమాణాలు పాటిం చకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని పరిశ్రమ ల మంత్రి కె. తారకరామారావు హెచ్చరించారు. పరిశ్రమల అభివృద్ధితో పాటు వాతావరణ సమతుల్యాన్ని కాపాడేందుకు తమ ప్రభుత్వం ప్రాధా న్యం ఇస్తుందని ఆయన చెప్పారు. శనివారం కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయంలో ఆయన బల్క్ డ్రగ్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (బీడీఎంఏ) ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ దేశ ఫార్మా రాజధానిగా హైదరాబాద్ను తయారు చేసేందుకు తమ ప్రభుత్వం సహకారం అందిస్తుందని, అందులో భాగంగా ఫార్మాసిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ సిటీ ఏర్పాటులో కాలుష్య సమస్య లేకుండా అత్యుత్తమ సాంకేతిక పద్ధతులను పాటిస్తున్నామన్నారు. ‘ఔటర్’ వెలుపలికి కాలుష్య పరిశ్రమలు హైదరాబాద్లోని కాలుష్య కారక పరిశ్రమలను ఔటర్రింగ్ రోడ్డు అవతలకు తరలించే ప్రయత్నం చేస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. క్లస్టర్ల వారీగా పరిశ్రమల అభివృద్ధికి కృషి చేస్తున్నా మన్నారు. రాష్ట్రంలోని పారిశ్రామిక వాడల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో కంపెనీలు పాలుపంచుకోవాలని కోరారు. మంత్రి విజ్ఞప్తి మేరకు పటాన్ చెరు, బొల్లారం ప్రాంతాల్లో చెరువులు, జలవనరుల అభివృద్ధిలో పాలుపంచుకునేందుకు కంపెనీల ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. -
ఛూ మంతర్.. కాలుష్యం ఖాళీ!
బైకు వేసుకుని అలా ఒక్క రౌండ్ బయటికెళ్లండి.. తిరిగి వచ్చేసరికి తెల్లషర్టు కొద్దో గొప్పో మసిబారిపోతుంది. వాహనాల పొగతో వస్తున్న కాలుష్యం అంతుంది మరి! నిజమేగానీ.. ఏం చేస్తాం. సర్దుకుపోక తప్పదు కదా అనుకుంటున్నారా? అవసరం లేదంటోంది గ్రావికీ ల్యాబ్స్. వాహనాల కాలుష్యం తగ్గించేందుకు ప్రపంచవ్యాప్తంగా బోలెడన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. మెరుగైన ఇంజన్లు తయారు చేస్తున్నారు. హైబ్రిడ్ కార్లు ప్రవేశపెడుతున్నారు. అయినాసరే.. కాలుష్యం మాత్రం తగ్గట్లేదు. దీంతో ఈ సమస్యను గ్రావికీ ల్యాబ్స్కు చెందిన అనిరుద్ధ్ శర్మ పూర్తిగా కొత్త కోణంలో చూశాడు. ఈ ముంబై కుర్రాడు నాలుగేళ్లుగా కాలుష్యాన్ని తగ్గించేందుకు ఓ వినూత్న యంత్రాన్ని తయారు చేసే పనిలో పడ్డాడు. ఇటీవలే విజయవంతంగా పరీక్షించాడు. ఈ యంత్రం ఏం చేస్తుందో తెలుసా.. వాహనాల పొగలో ఉండే కాలుష్యాన్ని పీల్చేస్తుంది. కాల్ ఇంక్ నుంచి ఎయిర్ ఇంక్ వరకు.. ఈ యంత్రం పేరు కాల్ ఇంక్! చిన్నసైజు గొట్టంలా ఉండే ఈ పరికరాన్ని వాహనాలు పొగ గొట్టాలకు బిగించుకుంటే చాలు. దాంట్లోంచి వచ్చే పొగ మొత్తం దాదాపు ఫిల్టర్ అయిపోతుంది. మసిలాంటి పదార్థం కాల్ ఇంక్లో మిగులుతుంది. స్టాటిక్ ఎలక్ట్రిసిటీ సాయంతో ఇది పనిచేస్తుంది. మరి దీన్నేం చేస్తారంటే.. ముందు కొన్ని రసాయనాలతో శుద్ధి చేసి కేన్సర్ కారక పదార్థాలను తొలగిస్తారు. ఆ తర్వాత మిగిలేది నల్లటి కార్బన్ ఇంకు మాత్రమే. దీన్ని పెన్నుల్లో, ప్రింటర్లలో ఇంకుగా వాడుకోవచ్చని అనిరుద్ధ్ చెబుతున్నాడు. దీనికి ఎయిర్ ఇంక్ అని పేరు పెట్టారు. ఇటీవల హాంకాంగ్కు చెందిన ఓ సంస్థతో కలసి ఎయిర్ ఇంక్ను పరీక్షించారు. మొత్తం 2,500 గంటల పాటు గాలిని శుభ్రం చేసి సేకరించిన మసితో 150 లీటర్ల ఇంకును తయారు చేశారు. ఒక్కో కాల్ ఇంక్ మసితో నిండేందుకు కొన్ని వారాల సమయం పడుతుంది. ఆ తర్వాత గ్రావికీ ల్యాబ్స్ వాటిని ఎయిర్ ఇంక్గా మారుస్తారు. ప్రస్తుతానికి ఈ కాల్ ఇంక్ పరికరాలను డీజిల్ జనరేటర్లతో పాటు లారీలు, కార్లకు బిగించుకునే అవకాశముంది. మోటార్ బైక్ల కోసం కూడా ఈ యంత్రాలు సిద్ధం చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. కళాకారులతో నిధుల సేకరణ.. కాలుష్యాన్ని ఇంకుగా మార్చాలని అనిరుద్ధ్ నాలుగేళ్ల కిందే భావించాడు. తన ఆలోచనను ఆచరణలోకి తీసుకొచ్చేందుకు మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)కి చెందిన మీడియా ల్యాబ్లో పనిచేశాడు. వేర్వేరు రంగాల నిపుణుల సహకారంతో కాల్ ఇంక్ను అభివృద్ధి చేశాడు. ప్రస్తుతం వాణిజ్య స్థాయి ఉత్పత్తికి కిక్స్టార్టర్ ద్వారా నిధులు సేకరించే ప్రయత్నాల్లో ఉన్నారు. నిధులు అందించే వారికి ఎయిర్ ఇంకుతో దేశ విదేశాల్లోని కళాకారులు తయారు చేసిన కళాకృతులను బహుమతిగా ఇస్తున్నారు. ఇప్పటికే 41 వేలకుపైగా డాలర్లు వచ్చిపడ్డాయి. వేర్వేరు పద్ధతుల్లో దాదాపు 1.6 లక్షల కోట్ల లీటర్ల గాలిని శుద్ధి చేసి 1,600 కోట్ల మైక్రో గ్రాముల కాలుష్యాన్ని ఇంకుగా మార్చినట్లు గ్రావికీ వెబ్సైట్ చెబుతోంది. ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న ‘చక్ర్’అనే మరో సంస్థ కూడా కాలుష్యాన్ని ఇంకుగా మార్చేందుకు ఓ యంత్రాన్ని రూపొందించింది. కాల్ ఇంక్తో పోలిస్తే దీని సైజు చాలా ఎక్కువ! – సాక్షి నాలెడ్జ్ సెంటర్ కాల్ ఇంక్ యంత్రాన్ని తయారుచేసిన అనిరుద్ధ్ శర్మ బృందం -
కనువిప్పు కలిగించని ‘కాలుష్యం’
సరిగ్గా 33 ఏళ్ల క్రితం 1984 డిసెంబర్ 2న మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ నగరంలో ‘యూనియన్ కార్బైడ్ కెమికల్స్’ ఫ్యాక్టరీలో నుంచి విషవాయువులు వెలువడి నగరంలోని వేలాదిమంది ప్రజలను నిమిషాలలో మట్టుబెట్టాయి. ఈ ఘోరకలిని అందరూ గుర్తుంచుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 2ను ‘జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం’గా ప్రకటించింది. భోపాల్ దుర్ఘటన వల్ల 8 నుంచి 10 వేల మంది మరణించగా, మొత్తంగా 25,000 మంది ఈ గ్యాస్ లీకేజీ అనంతర పరిణామాలతో మరణించినట్లు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాకుండా పరోక్షంగా 5 లక్షలమందికి పైగా ప్రజలు అనారోగ్యాల బారినపడ్డారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పారిశ్రామిక కాలుష్య ఘోరకలి. అయితే ఈ విషాదాంతం ప్రపంచ దేశాలకు ఒక కనువిప్పు కాగా, భారతదేశంలో మాత్రం ప్రభుత్వాలకు కనువిప్పు కలుగలేదు. సంఘటన జరిగి నేటికి 33 సంవత్సరాలు కావస్తున్నా, ఇప్పటికీ దాదాపు రెండున్నర లక్షల మంది వైద్యం చేయించుకుంటూనే ఉన్నారు. ఇంకా విషవాయువు వెలువడిన ప్రాంతం చుట్టుప్రక్కల ప్రజలు జీవచ్ఛవాల్లా బతుకుతున్నారు. బాధాకరమైన విషయమేమిటంటే సంఘటన జరిగి 33 ఏళ్లు కావస్తున్నా ఇప్పటికీ ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాల్లో విషపదార్థాల తొలగింపు పూర్తి కాలేదు. అక్కడి భూగర్భ జలాలపై ఇంతవరకు 15 అధ్యయనాలు జరిగినా వ్యర్థాల తొలగింపు, భూగర్భ జలాల శుద్ధి జరగలేదు. నేటికీ ప్రమాద బాధితులు నష్టపరిహారం కోసం కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఈ ప్రమాదానికి కారణమైన ‘‘యూనియన్ కార్బైడ్ కెమికల్స్’’ యజమాని ప్రమాదం జరిగిన నాలుగు రోజుల తరువాత భారత్కు వచ్చాడు. అతడిని 1984 డిసెంబర్ 7న అరెస్ట్ చేశారు. అయితే ఎంత త్వరగా అరెస్ట్ చేశారో అంతే త్వరగా ప్రధాన నిందితుడు వారెన్ అండర్సన్ ‘భారత్కు మళ్లీ తిరిగి వస్తానని హామీ ఇచ్చి’ ప్రభుత్వ లాంఛనాలతో అమెరికాకు వెళ్ళిపోయాడు. యూనియన్ కార్బైడ్ సంస్థను యాజమాన్యం మరో కంపెనీకి అమ్మడం వలన బాధితులు ఎవరిని ఆశ్రయించాలో తెలియడం లేదు. ఇంతా చేస్తే బాధితులకు దక్కిన తలసరి నష్టపరిహారం కూడా 15 వేలకు మించలేదు. ప్రపంచీకరణ పేరుతో అభివృద్ధి చెందిన దేశాలు వర్థమాన దేశాల ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. విదేశీ కంపెనీలు అభివృద్ధి పేరుతో భారత్ లాంటి వర్థమాన దేశాలలో పరిశ్రమలు స్థాపించి లాభాలు పిండుకొంటున్నాయి. మన ప్రభుత్వాల ఉదాసీనత వలన దేశ ప్రజల ప్రాణాలు, దేశ పర్యావరణాన్ని ఫణంగా పెట్టి పారిశ్రామిక అభివృద్ధి జరుగుతోంది. భోపాల్ దుర్ఘటనలో మరణించినవారంతా పేదప్రజలే కావడంతో ప్రమాదంలో మరణించిన వారి సంఖ్యను లెక్కపెట్టకుండా సామూహికంగా ఖననం చేశారు. అభివృద్ధి అంటే పర్యావరణ పరిరక్షణ, దేశ ప్రజ లకు పూర్తి రక్షణతో కూడిన అభివృద్ధి ఉండాలి. అంతేకానీ ప్రజల ప్రాణాలను ఫణంగా పెట్టి పారిశ్రామిక కాలుష్యానికి కారణమవుతున్న ఇలాంటి దుర్ఘటనలు ఇకనైనా ప్రభుత్వాలకు కనువిప్పు కలిగించాలి. దేశంలో ఎన్నో పర్యావరణ చట్టాలున్నా, వాటిని సమగ్రంగా అమలు చేయడం లేదు. ముఖ్యంగా పారిశ్రామిక పర్యావరణ చట్టాలను అమలు చేయడంలో ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి. ఆయా కంపెనీల యాజమాన్యాలకు పూర్తి ఆదేశాలు అందించాలి. అలా చేసినప్పుడే భోపాల్ లాంటి దుర్ఘటనలు మళ్లీ ఉత్పన్నం కాకుండా చూసుకోగలం. (నేడు జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం) - మోతి రవికాంత్, వ్యవస్థాపకులు సేఫ్ ఎర్త్ ఫౌండేషన్ ‘ 99633 24239 -
‘సరి–బేసి’కి ఎన్జీటీ అంగీకారం
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో వాహనాల సరి–బేసి విధానాన్ని ఏ ప్రాతిపదికన అమలు చేసేందుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) అంగీకరించింది. సరి సంఖ్య నంబర్ ప్లేట్ ఉన్న వాహనాలు ఒకరోజు, బేసి సంఖ్య ఉన్న వాహనాలు మరో రోజు రోడ్లపైకి రావచ్చని జస్టిస్ స్వతంత్ర కుమార్ నేతృత్వంలోని ఎన్జీటీ కోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ద్విచక్రవాహనదారులు, ప్రభుత్వ ఉద్యోగులు, మహిళలు కూడా ఈ నిబంధన తప్పనిసరిగా పాటించాలని కోరింది. చెత్తను తీసుకెళ్లే వాహనాలు, అగ్నిమాపక యంత్రాలు, అంబులెన్స్లకు మాత్రమే ఈ నిబంధన నుంచి ఎన్జీటీ మినహాయింపు ఇచ్చింది. కాలుష్యం లెవల్ 300 దాటితే తప్పనిసరిగా సరి- బేసి విధానం తీసుకురావాలని ఆదేశించింది. సోమవారం నుంచి శుక్రవారం వరకు సరి-బేసి విధానాన్ని అమలు చేయనున్నారు. కాగా సరి, బేసి విధాన అమలులో ఢిల్లీ ప్రభుత్వం విఫలమైందని గ్రీన్ ట్రిబ్యునల్ తలంటింది. 15 ఏళ్లు నిండిన పాత కాలం నాటి వాహనాలను కూడా ప్రభుత్వం రద్దు చేయాలని సూచించింది. నగరాన్ని మింగేస్తున్న వాయు కాలుష్యాన్ని నియంత్రించాలంటే ఈ విధానాన్ని పాటించాల్సిందేనని గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించింది. -
‘సరి–బేసి’కి ప్రాతిపదికేంటి?
న్యూఢిల్లీ: ఢిల్లీలో వాహనాల సరి–బేసి విధానాన్ని ఏ ప్రాతిపదికన అమలు చేయబోతున్నారో తెలపాలని జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాలుష్యాన్ని నియంత్రించడంలో భాగంగా ఈ నెల 13 నుంచి ఐదు రోజుల పాటు వాహనాల సరి–బేసి విధానాన్ని పాటించాలని కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. గతంలో రెండు సార్లు సరి–బేసి విధానాన్ని పాటించిన సమయంలో కూడా గాలిలో పీఎం 10, పీఎం 2.5 రేణువుల స్థాయి ఏమాత్రం తగ్గలేదని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు(సీపీసీబీ), ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ(డీపీసీసీ) ఇచ్చిన నివేదికల ఆధారంగా ఎన్జీటీ రాష్ట్ర ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించింది. ‘వాహనాల సరి–బేసి విధానాన్ని ఈ రకంగా అమలు చేయడానికి వీల్లేదు. ఈ విధానంతో ప్రజల్ని మరిన్ని వ్యక్తిగత వాహనాలు కొనాల్సిందిగా మీరు ప్రోత్సహిస్తున్నారు. సరి–బేసి విధానంతో ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని మీరు నిరూపించేవరకు దీని అమలుకు మేం అనుమతివ్వం’ అని జస్టిస్ స్వతంతర్ నేతృత్వంలోని బెంచ్ తెలిపింది. సరి–బేసి విధానం ఓ ప్రహసనంగా మారిందని వ్యాఖ్యానించింది. సరి–బేసి విధానం అమలు సందర్భంగా ఢిల్లీలో ప్రజలందరూ ఢిల్లీ రవాణా సంస్థ(డీటీసీ) నడిపే బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని ప్రభుత్వం తెలిపింది. కాలుష్య నియంత్రణతో పాటు ప్రజా రవాణాను వాడుకునేలా ఢిల్లీ వాసుల్ని ప్రోత్సహించడానికే ఈ చర్య తీసుకున్నట్లు రాష్ట్ర రవాణా మంత్రి కైలాశ్ గెహ్లాట్ తెలిపారు. -
కాలుష్య నియంత్రణకు టాస్క్ఫోర్స్: కేటీఆర్
- కాలుష్యం తగ్గించాలని ప్రజల నుంచి ఒత్తిడి - పరిశ్రమల యాజమాన్యాలతో సమావేశమైన మంత్రి సాక్షి, హైదరాబాద్: రాజధానిలో కాలుష్య నియంత్రణకు జీహెచ్ఎంసీ, కాలుష్య నియం త్రణ మండలి, పోలీసులు, పరిశ్రమ వర్గాల తో కూడిన టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు వెల్లడించారు. పరిశ్రమ వర్గాల సలహా మేరకు ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేస్తామని, పీసీబీ అధికారులు, పరిశ్రమ వర్గాలతో కామన్ గ్రూప్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. పారిశ్రామిక కాలుష్యం తగ్గించాలని ప్రజల నుంచి తీవ్ర ఒత్తిడి ఉందని, ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపడతామని చెప్పారు. పారిశ్రామిక కాలుష్యం తగ్గించే చర్యల్లో భాగంగా వివిధ పరిశ్రమల యాజమాన్యాలతో మంగళవారం సనత్నగర్లోని పీసీబీ కార్యాలయంలో మంత్రి కేటీఆర్, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న సమావేశమయ్యారు. కాలుష్య నియంత్రణ, పారిశ్రామిక వ్యర్థాల నియంత్రణపై ప్రభుత్వ ఆలోచనలను చర్చించారు. హైదరాబాద్ నుంచి కాలుష్య కారక పరిశ్రమలను ఔటర్ రింగ్రోడ్డు వెలుపలికి తరలించాలన్న జీవో 20ని తప్పకుండా అమలు చేస్తామని కేటీఆర్ తెలిపారు. పరిశ్రమలు తరలి వెళ్లే వరకు జీరో లిక్విడ్ డిశ్చార్జి వంటి అధునాతన ఏర్పాట్లు చేసుకుని వ్యర్థాలను అరికట్టాలని కోరారు. పరిశ్రమలు పెరుగుదలకు సహకరిస్తూనే, చట్టాల అమల్లో కచ్చితంగా ఉంటామన్నారు. పరిశ్రమల తరలింపునకు ఔటర్ రింగ్రోడ్డు వెలుపల 17 ప్రాంతాలు గుర్తించామని, వాటిలో క్లస్టర్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆయా క్లస్టర్లలో ప్రభుత్వం కల్పించాల్సిన మౌలిక వసతుల కల్పన పూర్తయ్యాకే, పరిశ్రమలను తరలిస్తామన్నారు. తరలించా ల్సిన పరిశ్రమల్లో 50 శాతానికి పైగా లైఫ్ సైన్సెస్, ఫార్మా కంపెనీలే ఉన్నాయని, వీటిని అంతర్జాతీయ సౌకర్యాలతో కూడిన ఫార్మాసిటీ కేంద్రంగా ఉంటుందన్నారు. మూడోవంతు గ్రీన్బెల్ట్: మంత్రి జోగు రామన్న పరిశ్రమల్లో మూడో వంతు గ్రీన్ బెల్ట్ నిర్వహణకు హరితహారం కార్యక్రమం ద్వారా కార్యాచరణ కచ్చితంగా అమలు చేస్తామని జోగు రామన్న తెలిపారు. కాలుష్య నివారణ చట్టాలను ప్రభుత్వం కట్టుదిట్టంగా అమలు చేస్తుందన్నారు. ప్రభు త్వ యంత్రాంగం తరఫున తీసుకోవాల్సిన చర్యలపై సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కాలుష్య నియంత్రణకు ప్రభు త్వం సహకరిస్తుందని, ప్రమాణాలను ఉల్లం ఘించే వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. ముఖ్యంగా నాలాల్లోకి వ్యర్థాలను వదిలే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామన్నా రు. సీసీ టీవీ నెట్వర్క్, రాత్రి సమయాల్లో నూ పెట్రోలింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. టోక్కో క్లీన్ ఎయిర్ అథారిటీ మాదిరిగా హైదరాబాద్లోనూ అథారిటీ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. -
విస్తరించనున్న ఘన వ్యర్థాల నిర్వహణ
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఘన వ్యర్థాల నిర్వహణ మరిన్ని ప్రాంతాలకు విస్తరించ నుంది. ఈ మేరకు అధికారులు చర్యలు చేపట్టారు. కేవలం మున్సిపల్ ప్రాంతాలకే కాకుండా ప్రతీ పట్టణ, స్థానిక సంస్థలలో నూ, నోటిఫైడ్ టౌన్షిప్ లు, రైల్వే, ఎయిర్పోర్ట్, డిఫెన్స్ సంస్థలు, ప్రత్యేక ఆర్థిక మండళ్లు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, దేవాలయాలు, చారిత్రక ప్రదేశాలకు కూడా వర్తింపచేస్తూ నిబంధనలను సవరించారు. రాష్ట్రంలో వెలువడే ఘన వ్యర్థాల నిర్వహ ణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని అటవీ, పర్యావరణ శాఖ ఆదేశించింది. గతంలోని మున్సిపల్ ఘన వ్యర్థాల (మేనేజ్మెంట్, హాండ్లింగ్) నిబంధనలు, 2000ను ఉపసం హరిస్తూ గత ఏప్రిల్లో ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు, 2016ను కేంద్ర పర్యావరణ శాఖ సవరించింది. అందుకు అనుగుణంగా ఈ వ్యర్థాలు ఎక్కడి నుంచి వస్తున్నాయన్న దానిపై ప్రధానంగా దృష్టి నిలిపారు. ఈ వ్యర్థాలను రికవరీ, రీ యూస్, రీసైకిల్ చేసేందుకు చర్యలు చేపడుతు న్నారు. ఈ నిబంధనల నిర్వహణలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల్లోని వివిధ శాఖలు, స్థానిక సంస్థల యంత్రాంగాలు, కాలుష్య నియంత్రణ మండళ్లకు వేర్వేరు బాధ్యతలను అప్పగించారు. ఘనవ్యర్థాల సేకరణకు వివిధ స్థాయిల్లో బాధ్యతలు ఎక్కడి నుంచైతే ఈ వ్యర్థాలు వస్తాయో అక్కడే వాటిని విడదీసి, మూడుస్థాయిల్లో తడి (బయో డీగ్రేడబుల్), పొడి (ప్లాస్టిక్, పేపర్, చెక్క, మెటల్ తదితరాలు), డొమస్టిక్ హాజర్డాస్ వేస్ట్ (డైపర్స్, నాప్కిన్స్, ఖాళీ కంటెయినర్లు, తదితరాలు)మూడు విడివిడి బిన్లలో నింపి ఈ వ్యర్థాలను సేకరించే వారికి అందజేయాల్సి ఉంటుంది. ఈ ఘన వ్యర్థా లు ఎక్కడ నుంచి అయితే వస్తాయో దీనికి సంబంధించిన వారు అక్కడే వాటిని పడేయ డం, కాల్చివేయడం లేదా పాతిపెట్టడం, బహిరంగ ప్రదేశాల్లో విసిరేయకుండా, డ్రైనేజీల్లో లేదా పక్కనే ఉన్న నీటి వనరులు, కాలువల్లో పడేయడం వంటివి చేయకుండా జాగ్రత్తలు పాటించాలని నిర్దేశించింది. అయిదువేల చదరపు మీటర్లకు పైబడి ఉన్న అన్ని గేటెడ్ కమ్యూనిటీస్, సంస్థలు , హోటళ్లు, రెస్టారెంట్లు, రెసిడెంట్ వెల్పేర్, మార్కెట్ అసోసియేషన్లు, తదితరాలు ఈ ఘనవ్య ర్థాలను తమ తమ స్థాయిల్లోనే స్థానికసంస్థల సహకారంతో విడదీసేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) ఆదేశించింది. -
ఎన్విరాన్మెంటల్ పోస్టుల్లో.. ‘బయోటెక్నాలజీ’కి అన్యాయం
ఇతర రాష్ట్రాల్లో అవకాశం.. ఇక్కడ మాత్రం నో సాక్షి, హైదరాబాద్: అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్(ఏఈఈ) పోస్టులకు కాలుష్య నియంత్రణ మండలి ఇచ్చిన విద్యార్హతల్లో బయో టెక్నాలజీ విద్యార్థులను అన్యాయం జరిగింది. ఇటీవల టీఎస్పీఎస్సీ 26 ఏఈఈ పోస్టుల భర్తీకి ప్రకటించిన నోటిఫికేషన్లో బీటెక్ బయో టెక్నాలజీ అభ్యర్థులకు అవకాశం ఇవ్వలేదు. దీంతో వారంతా ఆందోళనలో పడుతున్నారు. తమకు అవకాశం కల్పించాలంటూ టీఎస్పీఎస్సీ, కాలుష్య నియంత్రణ మండలి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇటు ప్రైవేటు రంగంలో ఉద్యోగ అవకాశాలు లేక, అటు ప్రభుత్వ విభాగాల్లోనూ అవకాశం రాక ఆందోళనలో మునిగిపోతున్నారు. పదిహేనేళ్ల కింద బీటెక్ బయో టెక్నాలజీకి బాగా డిమాండ్ ఉండేది. కానీ ఆ కోర్సును పూర్తి చేసిన అభ్యర్థులకు సరైన ఉద్యోగావకాశాలు మాత్రం లభించడం లేదు. ప్రైవేటు రంగంలో బయో టెక్నాలజీకి అవకాశాల్లేవు. ఇక ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ అవకాశం ఇవ్వనపుడు ఆ కోర్సును నిర్వ హించడం ఎందుకని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. తాము ఎంతగా విజ్ఞప్తి చేస్తున్నా.. కాలుష్య నియంత్రణ మండలి కూడా పట్టించుకోకుండా అన్యాయం చేసిందని వాపోతున్నారు. ఢిల్లీ, రాజస్థాన్లోని కాలుష్య నియంత్రణ మండళ్లలో భర్తీ చేసిన ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ పోస్టులకు బీటెక్ బయో టెక్నాలజీ అభ్యర్థులు అర్హులుగా ప్రకటించాయి. కానీ మన రాష్ట్రంలో మాత్రం విభిన్నంగా వ్యవహరిస్తుండడంతో ఆ కోర్సు చేసిన 30 వేల మంది ఆవేదన చెందుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వ జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. -
పీసీబీ నోటీసులు ఇవ్వకుండా సీజ్
హైకోర్టును ఆశ్రయించిన రసాయన కంపెనీలు, గోదాముల యజమానులు సాక్షి, హైదరాబాద్: మేడ్చల్ జిల్లా దుండిగల్ మండలం దూలపల్లి పరిధిలో రసాయన కంపెనీలు, గోదాములను సీజ్ చేస్తూ జిల్లా కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వులపై ఆయా కంపెనీలు, గోదాముల యజమానులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై సోమవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకర నారాయణలతో కూడిన ధర్మాసనం విచారించింది. కాలుష్యానికి కారణమవుతున్నాయంటూ పీసీబీ నోటీసులు ఇవ్వకుండానే ఏకపక్షంగా వాటిని సీజ్ చేశారని పిటిషనర్లు కోర్టుకు వివరించారు. తమ గోదాములను తెరిచేందుకు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఈ సమయంలో కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) తరఫు న్యాయవాది ఓ నివేదికను ధర్మాసనం ముందుంచారు. సీజ్ చేసిన రసాయన కంపెనీలు, గోదాములు తీవ్ర వాయు, జల కాలుష్యానికి కారణమవుతున్నాయని ఆ నివేదికలో స్పష్టంగా ఉన్న నేపథ్యంలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం సాధ్యం కాదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇదే అంశానికి సంబంధించి ఇప్పటికే దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంతో వీటిని కూడా జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. -
2030లో స్మార్ట్సిటీలు ఎలా ఉంటాయి?
ప్రపంచంలోని 60 శాతం జనాభా 2030 నాటికి స్మార్ట్ సిటీలలో నివసిస్తారని మేధావులు భావిస్తున్నారు. అప్పటికి ప్రజల జీవన విధానం ఎలా ఉంటుంది? జీవన ప్రమాణాలు ఎలా ఉంటాయి? ఇప్పటిలాగే అప్పుడు కూడా రాజకీయ నాయకుల దయాదాక్షిణ్యాలు, వారి నిర్ణయాలపైనే ప్రజల జీవితాలు ఆధారపడతాయా? అన్న అంశంపై ప్రపంచంలోని సాంకేతిక నిపుణులు, మేధావుల మధ్య చర్చ నడుస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే రోజురోజుకు అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానమే ప్రజల జీవితాలను నిర్దేశిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటివరకు ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని పట్టణ ప్రణాళికలను అమలు చేయగా, స్మార్ట్ సిటీల్లో ప్రజల అవసరాల కన్నా సాంకేతిక పరిజ్ఞానానికే ఎక్కువ విలువనిస్తారు. ముందస్తు ప్రణాళికల ద్వారా ఇంతకుముందు పట్టణాలను నిర్మించగా స్మార్ట్ సిటీలను అప్పటికప్పుడు కావల్సిన అవసరాలకు అనుగుణంగా నిర్మిస్తుంటారు. అన్ని సమస్యలకు సాంకేతిక పరిష్కారాలే ఉంటాయి. ఉదాహరణకు చైనా రాజధాని బీజింగ్ నగరంలోలాగా వాయు కాలుష్యం తీవ్రంగా ఉంటే వాయువులోని కాలుష్యాన్ని గ్రహించి స్వచ్ఛమైన వాయువును వదిలే టవర్లు ప్రతి అపార్ట్మెంట్లో, ప్రతి ఇంటిలో ఉంటాయి. బీజింగ్ వాయు కాలుష్యాన్ని నిర్మూలించేందుకు 23 అడుగుల ఎత్తయిన టవర్ ద్వారా ప్రయోగాలు జరుపుతున్న విషయం తెలిసిందే. చెట్లు, పుట్టలతో గ్రామీణ వాతావరణం కనుమరుగై పట్టణాల పేరుతో కాంక్రీట్ నగరాలు ఏర్పడ్డాయి. దానివల్ల పర్యావరణ పరిస్థితులు కూడా దెబ్బతిన్నాయి. సాంకేతిక పరిజ్ఞానం వల్ల కాంక్రీట్ కట్టడాలే స్మార్ట్ సిటీల్లో పచ్చని చెట్లతో కళకళలాడే రోజులు వస్తాయి. ఈ రోజు నగరంలో ఉష్ణోగ్రత ఎంతుంది? వాయుకాలుష్యం శాతమెంత? ధ్వని కాలుష్యం ఎంతుంది? ట్రాఫిక్ ఎక్కడెక్కువుంది? ఎక్కడ తక్కువుంది? ఇలాంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరించి పంపించే సెన్సర్లు ఉంటాయి. ఆ డేటాను బట్టి రియల్ టైమ్లో, రియల్ పరిష్కారాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది. ఇలా పలు పరిస్థితులను ఒకే పరికరం అంచనా వేసే పద్ధతి ఇప్పటికే చికాగో నగరంలో ప్రవేశపెట్టారు. ఈ పరికరాలు అక్కడ వీధి విద్యుత్ స్తంభాలకు ఏర్పాటు చేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వల్ల అపార్ట్మెంట్ కల్చర్ కూడా మారవచ్చని, మళ్లీ ప్రజలు సమూహాలుగా జీవించే అవసరం రావచ్చని నిపుణులు భావిస్తున్నారు. రాజకీయ నాయకులు ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా సాంకేతిక పరిజ్ఞానంపైనే ఆధారపడాల్సి వస్తుందని అంటున్నారు. -
పీసీబీలో 65 పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు
టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీకి చర్యలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వివిధ రకాల కాలుష్య నియంత్రణ, నివారణపై ప్రభుత్వం దృష్టి సారిం చింది. కాలుష్యంతో ముడిపడిన అంశాలకు సంబం ధించిన సవాళ్లను అధిగమించాలని నిర్ణయించింది. ముందుగా కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ)ని బలోపేతం చేసి, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేలా సిద్ధం చేయాలని భావిస్తోంది. దీనికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని, యంత్రాంగాన్ని, సిబ్బందిని సమకూర్చుకోవాలని నిర్ణయించింది. దానిలో భాగంగా పీసీబీలో పోస్టుల భర్తీని చేపట్టి, కాలుష్య నియంత్రణ చర్యలను చేపట్టనుంది. శాస్త్ర సాంకేతిక, మానవ వనరుల పెంపు దలకు ప్రాధాన్యతనివ్వనుంది. వివిధ రకాల వాయు, జల నాణ్యత కేంద్రాల నుంచి వచ్చిన సమాచారం, వివరాలను విశ్లేషించేందుకు ప్రత్యేక సాఫ్ట్వేర్ను రూపొందించాలనే ఆలోచనతో ఉంది. త్వరలోనే నోటిఫికేషన్: పీసీబీకి అవసరమైన 65 పోస్టుల భర్తీకి సంబంధించి టీఎస్పీఎస్సీకి అటవీ, పర్యావరణ శాఖ ప్రతిపాదనలు పంపించింది. ఎగ్జిక్యూ టివ్ ఇంజనీర్-26, అనలిస్ట్లు- 24, మినిస్టీరియల్ సిబ్బంది-15 పోస్టులకు గానూ త్వరలోనే నోటిఫికేషన్ వెలువడే అవకాశాలున్నట్లు సమాచారం. -
విచారణ ఏకపక్షం
కర్నూలు (కొండారెడ్డి ఫోర్టు): జేఆర్సీ కేసీవీఆర్ క్రస్సర్ మిషన్ ఏర్పాటుపై స్థానిక కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విచారణ ఏకపక్షంగా సాగింది. బనగానపల్లె మండలం భానుముక్కల సమీపంలో ఎమ్మెల్యే బీసీ జనార్దన్రెడ్డి భార్య బీసీ ఇందిర ఈ మిషన్ను ఏర్పాటు చేశారు. దీంతో పంటలు దెబ్బతిని నష్టం వస్తుండడంతో ఐదుగురు రైతులు హైకోర్టును ఆశ్రయించారు. కాలుష్య నియంత్రణ మండలి అధికారులను విచారణకు హైకోర్టు ఆదేశించింది. దీంతో సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయంలో జాయింట్ చీఫ్ ఎన్విరాన్మెంట్ ఇంజినీరు రాజేంద్రరెడ్డి ఆధ్వర్యంలో బృందం హైకోర్టుకు వెళ్లిన రైతులు గడ్డం వెంగళరెడ్డి, గడ్డం నాగేశ్వరి, వడ్డే రామాంజనమ్మ, వడ్డే శివమ్మ, వడ్డే చిన్న ఈశ్వరయ్యలతో సమావేశమయ్యారు. క్రస్సర్ మిషన్ అన్ని నిబంధలను పాటిస్తున్నట్లు చెప్పారు. రైతులు తమ పొలాలపై కూరుకున్న దుమ్ము, ధూళి ఫొటోలు, వీడియోలను అధికారులకు చూపించగా అవి పాతవని కొట్టిపారేశారు. వ్యవసాయాధికారులతో విచారణ చేయిస్తామని హామీ ఇవ్వడంతో బాధిత రైతులు తమకు న్యాయం జరగదని వెళ్లిపోయారు. పొలాలను అమ్మేసుకుంటే మంచిది... సమావేశంలో పాల్గొన్న అధికారులు అధికార పార్టీ ప్రజాప్రతినిధి ఒత్తిడికి తలొగ్గారు. పంట పొలాలను అమ్ముకుంటే మంచిదని రైతులకు సలహా ఇచ్చినట్లు అన్నదాతలు పేర్కొన్నారు. స్వయంగా అధికారులే ఇలా చెప్పుతుండడంతో తమకు న్యాయం జరగదని పేర్కొన్నారు. అయితే తామేమి అలాంటి ప్రతిపాదన చేయలేదని జేసీఈఈ రాజేంద్ర రెడ్డి వివరణ ఇచ్చారు. విచారణలో పాల్గొన్న ఎమ్మెల్యే తమ్ముడు.. కాలుష్య నియంత్రణ మండలి అధికారుల విచారణలో ఎమ్మెల్యే బీసీ జనార్దన్రెడ్డి తమ్ముడు బీసీ రామనాథ«రెడ్డి, ఆయన అనుచరులు పాల్గొన్నారు. వారి ఎదుటనే విచారణ చేయడంపై బాధితులు అభ్యంతరం వ్యక్తం చేసినా పట్టించుకోలేదు. -
పరిశీలించండి!
సాక్షి, చెన్నై : వాహన కాలుష్య నియంత్రణపై పరిశీలనకు ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ప్రత్యేకంగా పెట్రోల్, డీజిల్ ఆటోల అనుమతులకు కల్లెం వేస్తూ ఈ ఆదేశాలు జారీ కావడంతో ఆటోవాలాల్లో కలవరం బయలు దేరింది. రాష్ట్రంలో వాహనాల సంఖ్య నానాటికి పెరుగుతున్నాయి. మోటారు సైకిళ్లు, నాలుగు చక్రాల వాహనాలతో పాటుగా ఆటోల సంఖ్య కూడా ఈ పెరుగుదల్లో ఉన్నాయి. వీటిలో నుంచి వెలువడే పొగతో కాలుష్యం కోరలు చాచింది. ఈ పరిస్థితుల్లో నామక్కల్కు చెందిన పి భూపాలన్ మద్రాసు హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించే రీతిలో ఇక, పెట్రోల్, డీజిల్తో నడిచే ఆటోలకు అనుమతులు ఇవ్వకూడదని, గ్యాస్తో నడిచే ఆటోల మీద దృష్టి పెట్టాలంటూ 2014లో రాష్ట్ర ప్రభుత్వం ఓ ఉత్తర్వులు జారీ చేసినట్టు అందులో వివరించారు. ప్రధానంగా చెన్నైలో పెరుగుతున్న కాలుష్యాన్ని పరిగణలోకి తీసుకున్నట్టుగా ఈ ఉత్తర్వులు జారీ చేయబడినట్టుందని గుర్తు చేశారు. అదే సమయంలో ఈరోడ్లో పెరుగుతున్న కాలుష్యాన్ని గుర్తు చేస్తూ తాను సమర్పించిన వినతి పత్రానికి స్పందన వచ్చిందని, అయితే, ఆ ఉత్తర్వులు ఇంత వరకు అమలు కాలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. వాహన కాలుష్య పెరిగి ఉన్నదని, ప్రధానంగా పెట్రోల్, డీజిల్తో నడిచే ఆటోల సంఖ్య పెరగడంతో పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారి ఉన్నదన్న విషయాన్ని పరిగణించాలని కోర్టుకు సూచించారు. కాలుష్య కోరల్లో రాష్ట్ర వ్యాప్తంగా అనేక నగరాలు,పట్టణాలు చిక్కి ఉన్నాయని,దీనిని పరిగణలోకి తీసుకుని ఆ ఉత్తర్వుల అమలుకు ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. ఈ పిటిషన్ను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్, న్యాయమూర్తి పుష్పా సత్యనారాయణన్లతో కూడిన బెంచ్ గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్ వాదనలతో ఏకీభవిస్తూ, పెట్రోల్ , డీజిల్లతో నడిచే ఆటోలను ఎందుకు నిషేధించ కూడదూ..? అన్న ప్రశ్నను బెంచ్ తెర మీదకు తెచ్చింది. అనుమతుల వ్యవహారంలో ఇది వరకు ఇచ్చిన ఉత్తర్వుల్ని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించింది. ఇంతలో కాలుష్య నియంత్రణ మండలి తరపున ప్రభుత్వ న్యాయవాది కమలనాథన్ జోక్యం చేసుకుని, ఆ ఉత్తర్వుల అమలు ప్రభుత్వ పరిశీలనలో ఉందని వివరించారు. అయితే, త్వరితగతిన పరిశీలన పూర్తి చేయాలని, ఉత్తర్వుల అమలు దిశగా చర్యలు వేగవంతం చేయాలని సూచిస్తూ, నాలుగు వారాల గడువును ప్రభుత్వానికి బెంచ్ కేటాయించింది. పెట్రోల్, డీజిల్ ఆటోల నిషేధం వ్యవహారంలో ప్రభుత్వం తీసుకోనున్న చర్యలతో కూడిన నివేదికను మార్చి 24వ తేదిన కోర్టుకు సమర్పించాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణను అదే రోజుకు వాయిదా వేశారు. కాగా, మీటర్లను పక్కన పెట్టి ప్రయాణికుల నుంచి ముక్కు పిండి మరీ చార్జీలను దండుకుంటున్న ఆటో వాలాలకు తాజాగా కోర్టు జారీ చేసిన ఆదేశాలు షాక్ ఇచ్చినట్టు అయింది. ఈ నిషేధం అమల్లోకి వస్తే, ఇక, పెట్రోల్, డీజిల్ ఆటోలు గ్యాస్కు మారాల్సిందే. ఇది సాధ్యం అయ్యేనా, అదే సమయంలో ఆయా వాహన ఉత్పత్తి సంస్థలు ఈ వ్యవహారంపై ఎలా స్పందిస్తాయోనన్నది వేచి చూడాల్సిందే. -
పర్యావరణ అనుమతుల్లేకుండా పనులా?
♦ అవి లేకుండా మేమెలా పనులకు గ్రీన్సిగ్నల్ ఇస్తాం? ♦ భద్రాద్రి విద్యుత్ కేంద్ర నిర్మాణ పనులపై హైకోర్టు ప్రశ్నలు ♦ హరిత ట్రిబ్యునల్ ఉత్తర్వులపై స్టే ఇవ్వలేమని తేల్చి చెప్పిన ధర్మాసనం సాక్షి, హైదరాబాద్ : ఖమ్మం జిల్లా, మణుగూరులో 1,180 ఎకరాల్లో తెలంగాణ జెన్కో నిర్మిస్తున్న భద్రాద్రి విద్యుత్ కేంద్ర నిర్మాణ పనులను నిలిపేస్తూ జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించేం దుకు హైకోర్టు నిరాకరించింది. పర్యావరణ అనుమతులు (ఈసీ) లేకుండా ఎలా పనులు చేస్తారని జెన్కోను ప్రశ్నించింది. పర్యావరణ అనుమతులు లేనప్పుడు పనుల కొనసాగింపునకు తామైనా ఎలా ఆదేశాలు ఇస్తామని ప్రశ్నిం చింది. అనుమతులు తెచ్చుకుని ఏ పనులైనా చేసుకోవచ్చని స్పష్టం చేసింది. హరిత ట్రిబ్యునల్ ఉత్తర్వులపై స్టే కోసం అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి పలు రకాలుగా అభ్యర్థించినా ఫలితం లేకుండా పోయింది. ఎన్జీటీ ఉత్తర్వులపై స్టే ఇవ్వడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. ప్రతివాదులుగా ఉన్న కేంద్ర పర్యావరణశాఖ కార్యదర్శి, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి, ఎన్జీటీలో ఫిర్యాదు చేసిన మానవ హక్కుల ఫోరం ప్రధా న కార్యదర్శి కన్నెబోయిన వెంకట నరసయ్యకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని వీరిని ఆదేశించింది. తదుపరి విచారణను సంక్రాంతి సెలవుల తరువాత చేపడతామంది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్లతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసిం ది. భద్రాద్రి విద్యుత్ కేంద్ర నిర్మాణ పనులను నిలిపేయాలంటూ ఎన్జీటీ గత నెల 12న జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులపై స్టే విధించాలం టూ తెలంగాణ ఇంధన శాఖ కార్యదర్శి, జెన్కో చైర్మన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని బుధవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫున అడ్వొకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి వాదనలు వినిపిస్తూ, తమకు నోటీసులు జారీ చేయకుండా ఎన్జీటీ తమ పరోక్షంలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ప్రాజెక్టు పనులను పూర్తి చేసేందుకు రెండేళ్ల సమయం పడుతుందని, ప్రస్తుతం పునాది పనులే జరుగుతున్నాయని తెలిపారు. ఈ పనుల వల్ల పర్యావరణానికి వచ్చిన ఇబ్బందులు ఏమీ లేవని, పర్యావరణ అనుమతుల కోసం దరఖాస్తు చేశామని వివరించారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు పనులెలా ప్రారంభిస్తారని ప్రశ్నించింది. దీనికి రామకృష్ణారెడ్డి సమాధానమిస్తూ తన వాదనను మళ్లీ వినిపించారు. పునాది నిర్మాణం వల్ల పర్యావరణానికి హాని జరగదని, ఆ మేరకు హామీ కూడా ఇస్తున్నామన్నారు. దీనికి ధర్మాసనం పర్యావరణ అనుమతులు అవసరమని నిబంధనలు చెబుతున్నప్పుడు, ఆ అనుమతులు లేకుండా ఏ స్థాయి పనులు కూడా ప్రారంభించడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. అనుమతులు తీసుకుని వాటిని చేసుకోవచ్చునని, నిబంధనలకు విరుద్ధంగా తాము ఉత్తర్వులు ఇవ్వబోమని స్పష్టం చేసింది. ఈ వ్యాజ్యాన్ని సంక్రాంతి సెలవుల పూర్తయిన వెంటనే విచారిస్తామని, అప్పటి వరకు వచ్చిన నష్టం ఏమీ ఉండబోదని తెలిపింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ విచారణను వాయిదా వేసింది. -
ప్రధాని జీతమూ పెరగాల్సిందే!: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీ రాష్ట్ర ఎమ్మెల్యేల వేతనాల పెంపును సీఎం కేజ్రీవాల్ సమర్థించుకున్నారు. ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడకుండా వేతనాలు పెంచామన్నారు. ‘ప్రధానికన్నా ఎమ్మెల్యేలకు ఎక్కువ వేతనం ఉందని పత్రికలో చూశాను. ప్రధాని జీతం రూ.లక్ష కన్నా తక్కువ ఉంటే.. ఆయన జీతమూ పెంచాల్సిందే’ అని శనివారం హిందుస్తాన్ టైమ్స్ నాయకత్వ సదస్సులో అన్నారు. ఢిల్లీలో కాలుష్య నియంత్రణకు జనవరి 1నుంచి అమల్లోకి తెద్దామనుకున్న చైనా తరహా (సరి-బేసి వాహనాలను ఒకరోజు మార్చి ఒకరోజు వాడటం) పథకం అమలులో ప్రజలకు ఇబ్బందులు ఎదురైతే.. ఆపేస్తామన్నారు. -
వాయుకాలుష్యంపై శాస్త్రీయ అంచనా అవసరం
స్వతంత్ర సంస్థ ద్వారా కారణాల అన్వేషణ {పభుత్వ రంగ సంస్థలకు జీవీఎంసీ పార్కుల దత్తత స్పెషల్ టాస్క్ ఫోర్స్ తొలిసారి భేటీ విశాఖపట్నం : నగరంలో వాయుకాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. ముఖ్యంగా పారిశ్రామిక, వాణిజ్య, నివాస, తీర ప్రాంతాల్లో కాలుష్య స్థాయిని శాస్త్రీయంగా అంచనా వేస్తేకానీ నియంత్రణకు ఏ స్థాయిలో ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఒక నిర్ణయానికి రాలేరు. ప్రస్తుతం నగరంలో ఒకటి రెండు ప్రాంతాల్లో మాత్రమే వాయుకాలుష్య అంచనా పరికరాలున్నాయి. వీటిని నగరమంతా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది...’ అని కాలుష్య నియంత్రణపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్ టాస్క్ఫోర్స్ కమిటీ సూచించింది. కమిటీ తొలి భేటీ శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో విశాఖ పోర్టు ట్రస్ట్ చైర్మన్ ఎం.టి.కృష్ణబాబు అధ్యక్షతన జరిగింది. నగరంలో పలు ప్రాంతాల్లో వాయు కాలుష్య స్థాయిని అధ్యయనం చేసి విశ్లేషించి అందుకు కారణమయ్యే సంస్థలను గుర్తించే బాధ్యతలను గీతం విశ్వవిద్యాలయంతో కలిసి పనిచేసే బాధ్యతను పర్యావరణ నిపుణులు ప్రొ.ఎస్.రామకృష్ణారావుకు అప్పగిస్తూ ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. పారిశ్రామిక సంస్థలు, కాలుష్య నియంత్రణ మండలి వద్ద లభించే సమాచారంతో పాటు తాము స్వతంత్రంగా కొన్ని ప్రాంతాల నుంచి నమూనాలను సేకరించి కాలుష్య కారకులపై విశ్లేషణ జరపాలని ప్రొ.రామకృష్ణారావును సమావేశం కోరింది. నగరంలో ప్రస్తుత కాలుష్యం జాతీయ సగటు కంటే తక్కువగానే ఉందని కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి ప్రసాద్ వివరించారు. క్రీడాసదుపాయాల గురించి చర్చిస్తూ ఏదైనా ఒక ప్రాంతంలో కనీసం 20 ఎకరాల స్థలాన్ని గుర్తించినట్లయితే భారీ క్రీడా సముదాయాన్ని నిర్మించే అవకాశం ఉంటుందని పోర్టు ట్రస్ట్ చైర్మన్ కృష్ణబాబు వివరించారు. అథ్లెటిక్స్, ట్రాక్స్, ఇండోర్ స్టేడియం వంటివాటిని నిర్మించవచ్చునని, ఆ బాధ్యతను తాను చేపడతామని కలెక్టర్ యువరాజ్ చెప్పారు. ఇక నగర సుందరీకరణలో భాగంగా జీవీఎంసీలోని ప్రధాన పార్కులన్నీ పారిశ్రామిక సంస్థలకు అప్పగించినట్లయితే ఆయా సంస్థలు అభివృద్ధి చేసేలా ప్రతిపాదనలు తయారు చేసే బాధ్యతను జీవీఎంసీ కమిషనర్ ప్రవీణ్కుమార్కు అప్పగించారు. అలాగే కేజీహెచ్లో ప్రస్తుతం పారిశ్రామిక సంస్థలు ఇవ్వడానికి అంగీకరించిన నిధులతోనే అదనపు భవనాలు నిర్మించేలాప్రణాళిక రూపొందించుకోవాలని ఆస్పత్రి సూపరింటెండెంట్కు సూచించారు. సీపీ అమిత్గార్గ్, వుడా వైస్ చైర్మన్ టి.బాబూరావు నాయుడు, హెచ్పీసీఎల్ జీఎంలు జీఎస్ ప్రసాద్శర్మ, విఎస్ షనాయ్, కేజీహెచ్ సూపరింటెండెంట్ డా.మధుసూదనరావు పాల్గొన్నారు. -
పల్లెలపై కాలుష్యం పంజా
ప్రకృతికి నెలవైన పచ్చని పల్లెలు కాలుష్యం కోరల్లో చిక్కుకుంటున్నాయి. స్వచ్ఛమైన గాలి విషతుల్యమవుతోంది. పరిశ్రమల నుంచి వెలువడుతున్న దుర్వాసనతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. పరిశ్రమల ఇష్టారాజ్యంతో పంట పొలాలు నిస్సారంగా మారుతున్నాయి. ఇవేమీ పట్టించుకోని కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు పరిశ్రమలకు కొమ్ముకాస్తూ అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు కొండాపూర్ మండల ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. -కొండాపూర్ కొండాపూర్ మండల పరిధిలోని తేర్పోల్, చెర్లగోపులారం, మల్లెపల్లి, ఎదురుగూడెం, గుంతపల్లి గ్రామాల్లో నాలుగు మద్యం పరిశ్రమలు, పది టైర్ల పరిశ్రమలు ఉన్నాయి. మద్యం పరిశ్రమల నుంచి వెలుబడుతున్న వ్యర్థాలు, కాలుష్యంతో సమీపంలోని పొలాల్లో ఏ పంట వేసినా పండడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే టైర్లను కాల్చి ఆయిల్ తీసే క్రమంలో వచ్చే పొగ, దుర్వాసనతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. పగలు.. రాత్రి తేడా లేకుండా... పగలు, రాత్రీ అనే తేడా లేకుండా పరిశ్రమలు వ్యర్థాలను యథేచ్చగా బయటకు వదులుతున్నాయని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. రాత్రి అయితే పరిస్థితి మరింత దారుణంగా తయారైందని పేర్కొంటున్నారు. ముక్కుపుటాలు అదిరే దుర్వాసనతో నిద్రకూడా పట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలుషితమైన గాలి పీల్చడం వల్ల చిన్నారులు శ్వాసకోశ వ్యాధులకు గురవతున్నారని చెప్పారు. ఇదే క్రమంలో గొల్లపల్లికి చెందిన ఓ మహిళకు గర్భస్రావం జరిగినట్లు గ్రీవెన్స్డేలో కలెక్టర్కు ఫిర్యాదు చేసినా సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రజల ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న పరిశ్రమపై చర్యలు తీసుకోవాలని గతంలో గుంతపల్లి గ్రామస్తులు టైర్ల పరిశ్రమ ఎదుట పలుమార్లు ధర్నా నిర్వహించినా... అధికారులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు కూడా కంపెనీల యాజమాన్యాలకే వత్తాసు పలుకుతున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కాలుష్యాన్ని విడుదల చేస్తున్న పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. భయంగా ఉంది నేను నిత్యం తేర్పోల్ నుంచి సంగారెడ్డికి ద్విచక్ర వాహనంపై వెళ్తుంటాను. గ్రామ శివారులోని టైర్ల పరిశ్రమ నుంచి వచ్చే పొగ రోడ్డును కమ్మేస్తోంది. సాయంత్రం వేళ కంపెనీ దరిదాపుల్లోకి వెళ్లాలంటే భయమేస్తుంది. - ప్రభు, తేర్పోల్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం కంపెనీల నుంచి వస్తున్న కాలుష్యంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అనేక మంది రోగాలపాలవుతున్నారు. రాత్రి వేళ నిద్రకూడా పట్టడం లేదు. అధికారు లు స్పందించి కాలుష్య నివారణకు చర్య తీసుకోవాలి. -చంద్రమోహన్, గొల్లపల్లి -
ఆరు సూత్రాలు
కాలుష్య నియంత్రణపై కేఎస్పీసీబీ మార్గదర్శకాలు అగ్నిహోత్రంలో ఔషధ మూలికల వినియోగం మద్యంపై గ్రీన్ట్యాక్స్ ఇంధన వాడకంపై పరిమితులు సాధ్యాసాధ్యాలపై నిర్ణయం తీసుకోనున్న ప్రభుత్వం బెంగళూరు : రోజు రోజుకూ పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యాన్ని నివారించే దిశగా కర్ణాటక పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (కేఎస్పీసీబీ)అడుగులు వేస్తోంది. రాష్ట్ర రాజధానితో పాటు రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో వాతావరణ కాలుష్యాన్ని తగ్గించే దిశగా ఓ మార్గదర్శకాలను రూపొందించి ప్రభుత్వానికి అందజేసింది. ఈ మార్గదర్శకాల అమలులోని సాధ్యాసాధ్యాలను చర్చించి ఓ నిర్ణయం తీసుకునేందుకు వీలుగా నిపుణుల కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రజల అభిప్రాయాల నుంచే... ఈ మార్గదర్శకాలను రూపొందించేందుకు ఆరు నెలలుగా కేఎస్పీసీబీ ఆధ్వర్యంలో బెంగళూరుతో పాటు హుబ్లీ, మైసూరు, మంగళూరు తదితర ప్రాంతాల్లో సమావేశాలను నిర్వహించారు. ఈ సమావేశాల్లో కేఎస్పీసీబీ అధికారులతో పాటు వివిధ స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు, పర్యావరణ ప్రేమికులు, స్థానికులు ఇలా అన్ని వర్గాల వారిని భాగస్వాములను చేశారు. ఆయా ప్రాంతాల్లోని వాతావరణ కాలుష్యం నివారణకు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి వంటి అంశాలను వారి నుంచే సేకరించారు. ఈ సూచనలు, సలహాలన్నింటినీ క్రోడీకరిసూ కేఎస్పీసీబీ ఓ తుది నివేదికను తయా రు చేసింది. ప్రధానమైన ఆరు సూచనలు...... వాతావరణ కాలుష్య నివారణకు ఈ నివేదికలో కేఎస్పీసీబీ ప్రధానంగా ఆ రు సూచనలు చేసింది. వాటిలో ‘అగ్నిహోత్ర’, ‘మద్యంపై గ్రీన్ట్యాక్స్’, ‘ఇం ధన పరిమితి విధింపు’, ‘రహదారుల పైన నీటి చిలకరింపు’, ‘ప్రభుత్వ ఉ ద్యోగుల విద్యుత్ వినియోగంపై ఆం క్షలు’, ‘తక్కువ మైలేజీ వాహనాలపై ని షేధం’ ప్రధాన మైనవి కాగా మరో 47 సూచనలను నివేదికలో పొందుపరి చారు. ఏ సూచన వల్ల ఏఏ ఉపయోగం.... అగ్నిహోత్ర : ఇది వైదిక కార్యక్రమాల్లో ఒకటిగా చెప్పబడే కార్యక్రమం. అగ్నిహోత్రలో భాగంగా హోమగుండంలో ఔషధ మూలికలను వేసి హోమగుం డాన్ని వెలిగిస్తారు. తద్వారా వచ్చే పొగ ఆయా పరిసరాల్లోని హానికర వాయువులను తొలగిస్తుంది. ఈ కారణంగా స్వచ్ఛమైన గాలి అందుతుంది. అందువల్ల ‘అగ్నిహోత్ర’ను ప్రస్తుతం నిర్వహిస్తున్న ‘బస్ డే’ తరహాలో నెలకోసారి ప్రభుత్వం తరఫున బెంగళూరుతో పాటు ఇతర ప్రముఖ నగరాల్లో నిర్వహించాల్సిందిగా నివేదికలో పేర్కొంది. గ్రీన్ట్యాక్స్ : మద్యం, ధూమపానంపై గ్రీన్ట్యాక్స్ విధించి, తద్వారా లభించే నిధులను సంప్రదాయేతర విద్యుత్(సౌర, పవన) ఉత్పత్తి చేసే వారికి స బ్సిడీ ఇవ్వడంతో పాటు పర్యావరణ పరిరక్షణ చర్యలకు ఈ మొత్తాన్ని ఖర్చుచేయడం. ఇంధనం వినియోగంపై పరిమితులు : వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని త గ్గించి, ప్రజా రవాణాను పెంచేం దుకు గాను ఇంధనం వినియోగంపై పరిమితులు విధించేందుకు నివేదికలో సూచనలో చేశారు. ఇందులో భాగంగా వ్యక్తిగత వాహనాలకు సంబంధించి కార్లకు నెలకు 100 లీటర్లు, ద్విచక్ర వాహనానికి నెలకు 25 లీటర్ల ఇంధన పరిమితిని విధించాలని సూచించారు. తక్కువ మైలేజీ వాహనాలపై నిషేధం : 20కిలోమీటర్ల కంటే తక్కువ మైలేజీ ఇచ్చే వాహనాలను బెంగళూరులో నిషేధించాలని సూచనలు చేసింది. తద్వా రా పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని త గ్గించేందుకు ఆస్కారం ఉంటుందని పే ర్కొంది. కరెంటు వాడకంలో ఆంక్షలు : ఉదయం సమయాల్లో ప్రజా నాయకు లు, ప్రభుత్వ ఉద్యోగుల కార్యాల యా ల్లో ఏసీలు, లైట్ల వినియోగాన్ని పూ ర్తిగా నిలిపివేయాలి. తద్వారా వి ద్యుత్ వాడకాన్ని తగ్గించడంతో పాటు ప్రజ లకు మార్గదర్శకులుగా నిలవాలి. రోడ్లపై నీటి చిలకరింపు : నగరంలోని వేస్ట్ వాటర్ని ట్రీట్ చేసి ఆ నీటిని నగరంలోని ప్రధాన రహదారులపై చిలకరిస్తూ ఉండాలి.తద్వారా దుమ్ము, ధూ ళి రేగకుండా ఉండడంతో పాటు భూ తాపం కాస్తంత తగ్గేందుకు అవకాశం ఉంటుంది. ఈ విధానం ఇప్పటికే జపాన్లో అమల్లో ఉంది. -
కోనసీమ కాలుష్య నియంత్రణకు నిపుణుల కమిటీ
- పలు శాఖల అధికారులు, ఇద్దరు ఎమ్మెల్యేలతో కమిటీ ఏర్పాటు - చమురు సంస్థల కార్యకలాపాలతో ఎదురయ్యే కాలుష్యానికి ఇక కళ్లెం అమలాపురం టౌన్ : కాలుష్య కోరలకు పచ్చని కోనసీమ కునరిల్లుతోంది. ముఖ్యంగా ఈ సీమలో చమురు సంస్థల తవ్వకాలు, కార్యకలాపాల వల్ల కాలుష్య పరిస్థితులు అనివార్యమవుతున్నాయి. పచ్చని,ప్రశాంత కోనసీమలో చమురు సంస్థల కార్యకలాపాలు అధికమైన తర్వాతే ఇక్కడ కాలుష్య కష్టాలు పెరిగిపోయాయన్న వాదన, ఆరోపణ ఈ ప్రాంత ప్రజాప్రతినిధుల, ప్రజల నుంచి కొన్ని దశాబ్దాలుగా వినిపిస్తూనే ఉన్నాయి. కోనసీమలో కాలుష్య నియంత్రణకు.. పర్యవేక్షణకు నిపుణులతో కూడిన ఓ కమిటీని నియమించాలన్న డిమాండు కొన్నేళ్లుగా పెండింగ్లో ఉంది. ప్రజాప్రతినిధులు, ప్రజల ఒత్తిడితో ఎట్టకేలకు ఏడుగురి నిపుణులతో కూడిన కమిటీని నియమించింది. ఈ మేరకు జీఓ ఆర్టీ నెం.35 పేరుతో ఉత్తర్వులు కూడా జారీ చేసింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, పరిశ్రమలు, రెవెన్యూ, ప్రజాప్రతిధులు, నిష్ణాతులైన వారితో ఈ కమిటీని ఏర్పాటుచేశారు. నిపుణుల కమిటీ విధులు ఇలా.. ఈ కమిటీ కోనసీమలో కాలుష్యానికి దారి తీస్తున్న ప్రాంతాల్లో పర్యటించి స్వయంగా పరిశీలించాలి. ఆ కాలుష్యం ఏ పరిశ్రమ నుంచి లేదా ఏ సంస్థ నుంచి వస్తుంది. లేదా ఎవరైనా వ్యక్తులు, సంస్థల నిర్లక్ష్యం వస్తుందా.. అనే దానిపై కమిటీ అధ్యయనం చేసి ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు ఓ నివేదకి పంపించాలి. కోనసీమలో పలు చమురు సంస్థలు కార్యకలాపాలు సాగిస్తున్న నేపథ్యంలో ప్రజలు ఆరోపిస్తున్న.. ఇబ్బంది పడుతున్న పరిస్థితులపై కూడా కమిటీ నిరంతరం ఓ కంటి కనిపెట్టనుంది. కాలుష్యం వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఫిర్యాదు రూపంలో స్వీకరించనుంది. ఎన్విరాల్మెంట్ , ఫారెస్ట్, సైన్స్ అండ్ టెక్నాలిజీ డిపార్లమెంట్ల సంయక్త ఆధ్వర్యంలో ఈ కమిటీ పనిచేయనుంది. కమిటీలో ఎవరెవరు...? మొత్తం ఆరుగురు సభ్యులతో ఈ కమిటీ ఏర్పాటైంది. ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (విశాఖపట్నం) జాయింట్ చీఫ్ ఎన్విరాల్మెంట్ ఇంజినీరు కమిటీ కన్వీనర్గానే కాకుండా ఒక సభ్యుడిగా వ్యవహరిస్తారు. కాకినాడ ఇండస్ట్రీస్ జాయింట్ డెరైక్టర్, కాకినాడ ఫ్యాక్టరీస్, బోయలర్స్ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్, అమలాపురం ఆర్డీఓ, కాకినాడ జేఎన్టీయూ పెట్రోలియం ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ కేవీ రావు, అమలాపురం, రామచంద్రపురం ఎమ్మెల్యేలు అయితాబత్తుల ఆనందరావు, తోట త్రిమూర్తులును కమిటీ సభ్యులుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీ తొలి భేటీ కోనసీమ కాలుష్య నియంత్రణకు నియమించిన నిపుణుల కమిటీ తొలి భేటి కలెక్టర్ అరుణకుమార్ సమక్షంలో కాకినాడలో గురువారం సమావేశమైంది. కమిటీ విధి విధానాలపై చర్చించింది. అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు కోనసీమలో కాలుష్య నియంత్రణకు ఓ నిపుణుల కమిటీ నియమించాలన్న డిమాండును ఆయన పదవి చేపట్టగానే తెరమీదుకు తీసుకుని వచ్చారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి కాలుష్య కష్టాలను వివరించారు. తొలిభేటీలో కూడా ఎమ్మెల్యే ఆనందరావు కోనసీమలో చమురు సంస్థల వల్ల అనివార్యమతున్న కాలుష్యం.. కమిటీ ద్వారా ఎలా నియంత్రించాలనే అంశంపై ఆయన మాట్లాడారు. -
హరిత భవనాల నిర్మాణమే నినాదం కావాలి
సెంట్రల్ యూనివర్సిటి: దేశంలో హరిత భవనాల నిర్మాణమే నినాదంగా మారాలని ఢిల్లీ మెట్రో రైల్ ఎండీ మనూ సింగ్ తెలిపారు. హైదరాబాద్లో 12వ అంతర్జాతీయ గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్ సదస్సు ప్రారంభంకానున్న సందర్భంగా సీఐఐ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్చా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మెట్రో రైల్ మనూ సింగ్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా గ్రీన్ బిల్డింగ్ మూమెంట్ యజ్ఞంలా సాగుతుందని తెలిపారు. అభివృద్ధి చెందిన అమెరికా, జపాన్, చైనా వంటి దేశాలు వేగవంతమైన హరిత భవన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయన్నారు. అభివృద్ధికి సూచకంగా హరిత భవనాలు, నిర్మాణాలు నిలుస్తాయని తెలిపారు. వివిధ రంగాలలో అభివృద్ధి సాధించడం ఎంత ముఖ్యమో, హరిత భవనాలను నిర్మించడం అంతే ముఖ్యం అన్నారు. నివాసిత ప్రాంతాలలో విరివిగా చెట్లు నాటడం కాలుష్యాన్ని నివారించడమేనన్నారు. నగరాల్లో గ్రీన్ బిల్డింగ్లను నిర్మించడం సవాలుగా మారిందని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. చర్చా కార్యక్రమంలో ఇండియా గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ చైర్మన్ ప్రేమ్ సింగ్ జైన్, గుజరాత్ కాలుష్య నియంత్రయ బోర్డు చైర్మన్ మిస్త్రీ, క్యారియర్ ఇండియా అసిస్టెంట్ డెరైక్టర్ దీరజ్ బద్వా తదితరులు పాల్గొన్నారు. 12వ వరల్డ్ గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్కు వేదికైన హైదరాబాద్... 12వ అంతర్జాతీయ హరిత భవన సదస్సుకు హైదరాబాద్ వేదికైంది. గురువారం నుండి 6వ తేది వరకు కొనసాగే ఈ సదస్సులో ప్రపంచ వ్యాప్తంగా 5000 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ సదస్సులో పలు సమస్యాత్మక అంశాలను చర్చించనున్నారు. సదస్సు మూడు రోజుల పాటు కొనసాగనుంది. -
పర్యావరణానికి జై..
మట్టి వినాయక ప్రతిమలకు పెరిగిన ఆదరణ అధికారులు, స్వచ్ఛంద సంస్థల విస్తృత ప్రచారం నగరంలో 24 కేంద్రాల ద్వారా మట్టి విగ్రహాల పంపిణీ కాజీపేటలో రూపుదిద్దుకున్న పేపర్ వినాయకుడు నేడు వాడవాడలా కొలువుదీరనున్న బొజ్జ గణపయ్య జిల్లా వ్యాప్తంగా సుమారు పది వేల మండపాల ఏర్పాటు సాక్షి, హన్మకొండ: నవరాత్రి పూజలు అందుకోవడానికి బొజ్జ గణపయ్య నేడు కొలువుదీరనున్నాడు. కొనుగోలు కేంద్రాల నుంచి విగ్రహాలను భక్తులు మండపాలకు తరలిస్తున్నారు. విగ్రహాలను తరలిస్తున్న వాహనాలతో గురువారం రోడ్లు నిండిపోయాయి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన విగ్రహాల తయారీ వల్ల పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుందని జరిగిన ప్రచారం ఈ సారి బాగా ప్రభావం చూపించింది. మట్టితో చేసిన గణపతి విగ్రహాలు కొనుగోలు చేయడాన్ని ప్రజలు తమ బాధ్యతగా గుర్తించారు. దీంతో మట్టి గణపతులు తయారు చేసిన కేంద్రాల వద్ద గతం కంటే ఎక్కువగా సందడి నెలకొంది. భక్తులకు వీలైనన్ని మట్టి విగ్రహాలు అందించేందుకు అధికారులతో పాటు స్వచ్చంద సంస్థలు ముందుకు వచ్చాయి. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు 24 ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసి రెండు వేల మట్టి విగ్రహాలను భక్తులకు అందిస్తున్నారు. ఇందులో గురువారం నాటికే వెయ్యి విగ్రహాలు భక్తులకు అందించారు. వీటితో పాటు జిల్లా కాలుష్య నియంత్రణ మండలి, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(కుడా) సంయుక్తంగా ఒక్కొక్కటీ నాలుగున్నర అడుగుల ఎత్తు, డెబ్బై కేజీల బరువు ఉన్న 20 మట్టి విగ్రహాలను తయారు చేశారు. జిల్లా ఉత్సవ కమిటీ ఎంపిక చేసిన 20 గణేశ్ మండళ్లకు ఈ విగ్రహాలను అందిస్తున్నారు. వీటిని నగరం, జిల్లాలో ముఖ్యమైన కూడళ్లలో ఏర్పాటు చేయనున్నారు. భారీ మట్టి విగ్రహం తయారీ కోసం ఒక్కదానికి రూ.4,200 ఖర్చయింది. వీరితో పాటు జిల్లా నలుమూలలా వివిధ స్వచ్చంద సంస్థల ఆధ్వర్యంలో వందలాది విగ్రహాలను తయారు చేసి భక్తులకు అందించారు. నగరంలో లేబర్ కాలనీ చేయూత సేవాసంస్థ, పీసీఆర్ ప్రొడక్షన్స్ సంస్థ, యాడ్ స్పేస్ సంస్థలతో పాటు వివిధ పాఠశాలలు మట్టి విగ్రహాలను భక్తులకు పంపిణీ చేశారు. కాగా, హైదరాబాద్కు చెందిన సేవ్ సంస్థ నెలన్నర రోజుల పాటు శ్రమించి ఏకశిలపార్కు కేంద్రంగా 360 మట్టి విగ్రహాలను తయారు చేసింది. వీటిని కొనుగోలు చేసేందుకు గురువారం రాత్రి వరకు వాహనాలు బారులుదీరే ఉన్నాయి. గతానికంటే ఎక్కువ గణపతి మండళ్లు, ఉత్సవ కమిటీలు నవరాత్రి ఉత్సవాలు నిర్వహించాలంటే పోలీసు శాఖ నుంచి తప్పని సరిగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. గతేడాది వరంగల్ రూరల్ పోలీస్ పరిధిలో 4338 పందిళ్లు ఏర్పాటు కాగా.. ఈ ఏడు ఆ సంఖ్య 5,200కు చేరుకుంది. అదేవిధంగా అర్బన్ పోలీస్ పరిధిలో గతేడాది దాదాపు 4213 మండపాలు ఏర్పాటు కాగా.. ఈ ఏడు ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసు వర్గాలు అంటున్నాయి. వీటితో పాటు వీధుల్లో స్థానిక యువకుల ఆధ్వర్యంలో మరికొన్ని మండపాలు వెలుస్తున్నాయి. మొత్తంగా ఈ సారి అధికారిక లెక్కల ప్రకారమే జిల్లా వ్యాప్తంగా సుమాదారు పదివేల మండపాల్లో గణపయ్యలు కొలువుదీరనున్నారు. ఎన్నికలతో పెరిగిన కల వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్కు త్వరలో ఎన్నికలు జరగనున్న దృష్ట్యా స్థానిక నాయకులు తమ అనుచరవర్గంలో ఉత్సాహం నింపేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అందులో భాగంగా గణేశ్ విగ్రహాలను ఇప్పిస్తున్నారు. తమ సొంత ఖర్చుతో విగ్రహాలు కొనుగోలు చేసి అనుచరగణానికి ఉచితంగా పంపిణీ చేశారు. గతంతో పోల్చితే నగరంలో ఈసారి కొత్తగా ఐదు వందల నుంచి వెయ్యి వరకు గణేశ్ మంటపాలు ఏర్పాటు కానున్నాయి. మరోవైపు జిల్లా వ్యాప్తంగా కొత్తగా ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారికి ఇదే తొలి వినాయక చవితి కావడంతో వారు సైతం మండపాల ఏర్పాటు, విగ్రహాలు స్పాన్సర్ చేయడంలో చొరవ చూపించారు. దానితో ఈ ఏడు జిల్లా వ్యాప్తంగా రెండు వేలకు పైగా కొత్త మండపాలు ఏర్పాటవుతున్నాయి. జాగ్రత్తలు పాటిస్తే మేలు.. భక్తజనుల ఆధ్వర్యంలో ఏర్పాటైన పదివేలకు పైగా గణేశ్ మండపాల్లో సరైన జాగ్రత్తలు తీసుకుంటే నవరాత్రుల ఉత్సవాలు కనుల పండువగా జరుగుతాయి. ఇందుకోసం స్థానికంగా ఉన్న పెద్దలు చొరవ చూపించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మండపాల్లో ఏర్పాటు చేసిన విద్యుత్ తీగల పట్ల జాగ్రత్తలు పాటించాలి. మండపాల వద్ద మద్యం సేవించడం, జూదం ఆడటం వంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే సహించేది లేదని ఇప్పటికే పోలీసుశాఖ హెచ్చరికలు జారీచేసింది. అదేవిధంగా ఉదయం 6గంటల నుంచి రాత్రి 10 గంటల వర కే సౌండ్ సిస్టమ్ వినియోగించాలని భక్తులకు, గణేశ్ ఉత్సవ కమిటీలకు విజ్ఞప్తి చే సింది. మండపాల వద్ద ఎవరైనా అనుమానస్పద వ్యక్తులు సంచరిస్తున్నట్లుగా అ నుమానం వస్తే సమీపంలో ఉన్న పోలీసులకు సమచారం అందించడం ఉత్తమం. -
టోఫెల్ పరీక్ష వివరాలు?
ఎంఎస్సీ (ఎన్విరాన్మెంటల్ సైన్స్) కోర్సును ఆఫర్ చేస్తున్న యూనివర్సిటీల వివరాలను తెలపండి? -సూర్య, నిజామాబాద్.ఎన్విరాన్మెంటల్ సైన్స్లో పీజీ చేసిన వారికి ప్రభుత్వ సంస్థలతోపాటు ప్రైవేట్ కంపెనీలు/ఆర్గనైజేషన్స్లో విస్తృత స్థాయిలో అవకాశాలుంటాయి. ఈ క్రమంలో టెక్స్టైల్ మిల్స్, రిఫైనరీలు, ఫెర్టిలైజర్ ప్లాంట్స్, వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు, డిస్టలరీలు, మైన్స్, తదితర పరిశ్రమలు వీరికి కెరీర్ అవెన్యూస్గా నిలుస్తున్నాయి. ఆయా పరిశ్రమలు కాలుష్య స్థాయిని పర్యవేక్షించడానికి ఆర్ అండ్ డీ విభాగంలో వీరి సేవలను వినియోగించుకుంటున్నాయి. సస్టెయినబిలిటీ డెవలప్మెంట్, పొల్యూషన్ కంట్రోల్ వంటి అంశాల్లో పని చేస్తున్న స్వచ్ఛంద సంస్థలు, అంతర్జాతీయ ఆర్గనైజేషన్స్ కూడా ఎన్విరాన్మెంటలిస్ట్లను నియమించుకుంటున్నాయి. ప్రభుత్వ పరంగా ఫారెస్ట్రీ, వైల్డ్ లైఫ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, అర్బన్ ప్లానింగ్, వాటర్ రీసోర్సెస్, అగ్రికల్చరల్, వంటి ఏజెన్సీలు/సంస్థల్లో వివిధ హోదాల్లో అవకాశాలు ఉంటాయి. అందిస్తున్న యూనివర్సిటీలు: ఉస్మానియా యూనివర్సిటీ-హైదరాబాద్ ప్రవేశం: రాత పరీక్ష ఆధారంగా వెబ్సైట్: www.osmania.ac.in శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ-తిరుపతి ప్రవేశం: రాత పరీక్ష ఆధారంగా వెబ్సైట్: www.svuniversity.in ఆంధ్రా యూనివర్సిటీ-విశాఖపట్నం ప్రవేశం: రాత పరీక్ష ఆధారంగా వెబ్సైట్: www.andhrauniversity.edu.in సీబీఐలో సబ్-ఇన్స్పెక్టర్ స్థాయి పోస్టులను ఏవిధంగా భర్తీ చేస్తారు? -చరణ్, షాద్నగర్.సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ)లో 50 శాతం సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) నేరుగా భర్తీ చేస్తుంది. 25 శాతం పోస్టులను డిపార్ట్మెంట్లో ఐదేళ్లు రెగ్యులర్ సర్వీస్లో పని చేసే అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్స్(ఏఎస్ఐ)లను సీనియారిటీ, ఫిట్నెస్ ప్రాతిపదికన, మిగతా 25 శాతం పోస్టులను డిపార్ట్మెంటల్ పోటీ పరీక్షల ద్వారా భర్తీ చేస్తుంది. సీబీఐలో ఎస్ఐ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ గ్రాడ్యుయేట్ లెవల్ పరీక్ష నిర్వహిస్తుంది. ఈ పరీక్ష రెండు విభాగాలుగా ఉంటుంది. రాత పరీక్ష (ఆబ్జెక్టివ్టైప్), కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్ ఉంటాయి. వయసు 20 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. డిగ్రీ ఉత్తీర్ణులైన వారు అర్హులు.వివరాలకు: htpp://sss.nic.in రైల్వే శాఖలో డాక్టర్ల ఉద్యోగాలను ఏవిధంగా భర్తీ చేస్తారు? -వేణు, ఆదిలాబాద్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించే కంబైన్డ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీఎంఎస్ఈ) ద్వారా రైల్వే శాఖలో డాక్టర్ పోస్టులను భర్తీ చేస్తుంది. అసిస్టెంట్ డివిజనల్ మెడికల్ ఆఫీర్స్ హోదా కల్పిస్తారు. హోదాలో జూనియర్ స్కేల్ పోస్ట్ ఇన్ సెంట్రల్ హెల్త్ సర్వీసెస్, మెడికల్ ఆఫీసర్ ఇన్ ది మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ ఇన్ న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ పోస్టుల భర్తీ కూడా సీఎంఎస్ఈ ద్వారానే చేపడతారు. సీఎంఎస్ఈలో రెండు దశలు ఉంటాయి. అవి.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ (పర్సనాలిటీ టెస్ట్). ఈ రెండు దశలకు కలిపి మొత్తం 600 మార్కులు కేటాయించారు. ఇందులో రాత పరీక్షకు 500మార్కులు, ఇంటర్వ్యూకు 100 మార్కు లు. రాత పరీక్షను ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ఇందులో పేపర్-1, 2.. రెండు పేపర్లు ఉంటాయి. ఇందులో ఒక్కో పేపర్కు 250 మార్కుల చొప్పున కేటాయించారు. పేపర్-1లో.. జనరల్ ఎబిలిటీ (30 ప్రశ్నలు), జనరల్ మెడిసిన్ (70 ప్రశ్నలు), పిడియాట్రిక్స్ (20 ప్రశ్నలు) అంశాలు ఉంటాయి. పేపర్-2లో సర్జరీ (40 ప్రశ్నలు). గైనకాలజీ అండ్ ఆబ్స్టెట్రిక్స్ (40 ప్రశ్నలు), ప్రివెంటివ్ అండ్ సోషల్ మెడిసిన్ (40 ప్రశ్నలు) అంశాలనిస్తారు. ప్రతి పేపర్కు సమయం: రెండుగంటలు. రాత పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా ఇంటర్వ్యూ (పర్సనాలిటీ టెస్ట్)కు అభ్యర్థులను పిలుస్తారు. నోటిఫికేషన్లో పేర్కొన్న ఖాళీలకు 1:2 చొప్పున రాత పరీక్ష నుంచి అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. పరీక్ష, ఇంటర్వ్యూలో విజయం సాధించినవారిని ప్రతిభ, ఖాళీల ఆధారంగా వివిధ విభాగాల్లో నియమిస్తారు. సీఎంఎస్ఈ అర్హత: ఎంబీబీఎస్ ఉత్తీర్ణులు, చివరి సంవత్సరం చదువుతున్న వారు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే చివరి సంవత్సరం చదువుతున్న వారు ఇంటర్వ్యూ సమయానికి సర్టిఫికెట్ అందించడం తప్పనిసరి. వివరాలకు: www.upsc.gov.in, టోఫెల్ పరీక్ష వివరాలను తెలపండి? రేవతి, మెదక్.అమెరికాలో విద్యనభ్యసించాలనుకునే నాన్-ఇంగ్లిష్ స్పీకింగ్ విద్యార్థుల ఆంగ్ల భాష సామర్థ్యాన్ని పరీక్షించేందుకు ఉద్దేశించిన పరీక్షల్లో టోఫెల్ ఒకటి. ఈ పరీక్షను అమెరికాకు చెందిన ఇంగ్లిష్ టెస్టింగ్ సర్వీస్ (ఈటీఎస్) సంస్థ నిర్వహిస్తుంది. కేవలం అమెరికాలోనేకాకుండా 130 దేశాల్లోని కాలేజీలు/యూనివర్సిటీలు టోఫెల్ స్కోర్ను పరిగణనలోకి తీసుకుంటున్నాయి. ఇందులో నాలుగు విభాగాలు ఉంటాయి. అవి.. రీడింగ్ (60-80 నిమిషాలు, 35-56 ప్రశ్నలు), లిజనింగ్ (60-90 నిమిషాలు, 34-51 ప్రశ్నలు), స్పీకింగ్ (20 ప్రశ్నలు, 6 టాస్క్లు), రైటింగ్ (50 నిమిషాలుు, 2 టాస్క్లు). ఇంటర్నెట్ ఆధారితంగా ఈ పరీక్షను సంవత్సరానికి 50 సార్లకుపైగా నిర్వహిస్తారు. మన దేశంలో హైదరాబాద్తోపాటు అన్ని ప్రధానకేంద్రాల్లో టోఫెల్ టెస్టింగ్ సెంటర్లు ఉన్నాయి. ఆయా కేంద్రాలకు కేటాయించిన పరీక్ష తేదీలను పరిగణనలోకి తీసుకుంటూ ఆన్లైన్/ఫోన్/ఈ-మెయిల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. టోఫెల్ స్కోర్ రెండేళ్లపాటు చెల్లుబాటవుతుంది. వివరాలకు: www.ets.org -
భారం: ఆ దేశాలకు ఒక బరువైన సమస్య...!
ప్రపంచానికి ఇప్పుడు పెద్ద సమస్య ఏమిటి? ఏ సమస్య పరిష్కారం కోసం చాలా దేశాల ప్రభుత్వాలు కంకణం కట్టుకొని ప్రయత్నిస్తున్నాయి? ఏ విషయంలో కృషి చేసిన వారిని ప్రభుత్వాలు ప్రత్యేకంగా అభినందిస్తున్నాయి? వారికి బహుమతులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నాయి?! ఇలాంటి ప్రశ్నలు ఎదురైతే.. మనలో చాలా మంది ‘పచ్చదనం పరిశుభ్రత’ ‘అడవుల పెంపకం’ ‘కాలుష్య నియంత్రణ’ తరహా సమాధానం ఇచ్చేసుకొంటాం. అయితే ఈ రంగాల్లో కృషి చేస్తున్న వారి విషయం ఎలా ఉన్నా.. ఇప్పుడు ప్రపంచానికి ఒక ‘బరువైన’ సమస్య తలనొప్పిగా తయారైంది. ఆ సమస్యను పరిష్కరించడానికి అనేక దేశాల ప్రభుత్వాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అదే ‘ఊబకాయం’. దుబాయ్లో బంగారం ఇస్తున్నారు! ఒక కిలోగ్రాము బరువు తగ్గారంటే ఒక గ్రాము బంగారం ఉచితం అనే బంపర్ ఆఫర్ను అమల్లో పెట్టింది దుబాయ్ ప్రభుత్వం. ఆ దేశ ప్రభుత్వానికి ప్రజల ఊబకాయం నిద్రలేకుండా చేస్తోంది. ఎలాగైనా సరే వాళ్లందరి బరువును తగ్గించాలని, ఫిట్గా ఉంచాలని అక్కడి ప్రభుత్వం తీవ్రంగా కృషిచేస్తోంది. నిజానికి దుబాయ్ ప్రభుత్వం ప్రతిదానికీ రాయితీలు ఇస్తుండటంతో ఆ దేశప్రజలకు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేకపోతోంది. శారీరక శ్రమ చేయాల్సిన అవసరం తగ్గింది. చిన్న చిన్న పనులకు కూడా పరాయి దేశాల నంచి కూలీలను తెచ్చుకొనే సంస్కృతి ఉందక్కడ. దీంతో శారీరకంగా ఏమాత్రం కష్టపడని జనాలు ఊబకాయులు అవుతున్నారు. ఇప్పుడు దుబాయ్లో దాదాపు 40 శాతం మంది ఊబకాయం బాధితులే అంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. రాయితీలతో ప్రజలను ఇలా తయారు చేసిన ప్రభుత్వం ఇప్పుడు అలాంటి విధానాలతోనే వారి బరువును తగ్గించడానికి పాటుపడుతోంది. ‘బరువు త గ్గండి బంగారం పొందండి’ అంటూ పదేపదే బంపర్ ఆఫర్లతో జనాలను ప్రలోభపరుస్తోంది. అయితే దీనికి వస్తున్న స్పందన అంతంత మాత్రమేనట! బ్రిటన్ పీఎం స్వయంగా రంగంలోకి దిగాడు! దుబాయ్లాగే పౌరుల ఊబకాయత్వంతో బాగా ఇబ్బందులు పడుతున్న దేశం బ్రిటన్. ఇక్కడ కూడా దాదాపు 30 శాతం ప్రజలు మితిమీరిన బరువుతో ఏ పనీ చేయలేకపోతున్నారట. ఆఖరికి సొంత పనులకు కూడా వీళ్లకు సహాయకుడు ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. అలాగే చిన్నపిల్లల్లో కూడా ఊబకాయ సమస్య తీవ్రస్థాయికి చేరింది. వాళ్లు తీసుకొనే ఆహారంలో కొవ్వులు ఎక్కువగా ఉంటున్నాయనీ, దీంతో శరీరాల్లో ప్రమాదకరమైన కొలెస్ట్రాల్ పెరిగిపోతోందనీ వైద్యులు నిర్ధారిస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు బ్రిటన్ ప్రధాని కామెరూన్. ప్రతి వారాంతంలోనూ క్యాలరీ, షుగర్ ఫ్రీ ఆహారాన్ని తీసుకొంటానని ఆయన ప్రకటించారు. శని, ఆదివారాల్లో కామెరూన్ తన శరీరంలోకి అదనపు క్యాలరీలు చేరకుండా చూసుకొంటూ అందరికీ ఆదర్శంగా నిలిచే ప్రయత్నం చేస్తున్నారు. తను పత్యం పాటిస్తున్నాడు కాబట్టి దేశంలో తనను అభిమానించే వాళ్లు ఆ విషయంలో ఆదర్శంగా తీసుకొంటారనీ, దీని వల్ల కొంతమేర అయినా ఊబకాయ సమస్య తగ్గుతుందనీ కామెరూన్ ఆశ. కేవలం దుబాయ్, బ్రిటన్లే కాదు. ఆర్థికంగా పుష్టిగా ఉన్న దేశాల్లో, ప్రజలకు రాయితీలను ఇచ్చి పెంచుతున్న అనేక దేశాలలో ఊబకాయం (ఒబేసిటీ) ఒక తీవ్రమైన సమస్యగా మారుతోంది. దాన్ని నివారించడానికి ఎవరి పాట్లు వాళ్లు పడుతున్నారు. ఎందుకంటే ఊబకాయం దేశాల ఉత్పాద కతను తగ్గిస్తోంది. మానవ వనరుల్లో సోమరితనాన్ని పెంచుతోంది. ఇది భవిష్యత్తులో వైద్య పరంగానూ భారం అయ్యే ప్రమాదం ఉంది. చాలా దేశాల్లో ఇలా మితిమీరి తినడం, శారీరక శ్రమ చేయపోవడం జాతీయ విపత్తులుగా మారుతున్నాయి. ఏదేమైనా ప్రమాదాన్ని మొదట గుర్తించిన దేశాలు ఈ రెండు. వీటి సరసన నడవడానికి మరికొన్ని దేశాలు సిద్ధంగా ఉన్నాయి. -
త్వరలో నక్షత్ర వనం
కాలుష్య నియంత్రణే లక్ష్యం బృహన్ మహారాష్ట్ర కామర్స్ కళాశాల వినూత్న ఆలోచన పింప్రి, న్యూస్లైన్: కాలుష్య నియంత్రణపై పుణేలోని బృహన్ మహారాష్ట్ర కామర్స్ కళాశాల దృష్టి సారించింది. ఇందులోభాగంగా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కళాశాల ఆవరణలో నక్షత్ర వనాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ వనంలో నక్షత్రాలకు సంబంధించి (భరణి నక్షత్రం, ఉసిరి)న మొక్కలను నాటనున్నారు. ఒక్కో మొక్క ఒక్కో ఔషధ గుణం కలిగి ఉండడంతో నగర వాసులకు ఆరోగ్య సమస్యల నుంచి కూడా కొంత మేర ఊరట లభిస్తుందని సదరు కళాశాల ప్రిన్సిపల్ చంద్రకాంత్ రావల్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక్కో మొక్క వద్ద మొక్కకు సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేసే ఓ పట్టికను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. అనేక పురాణ శాస్త్రాలు నక్షత్రాల ప్రభావాన్ని తెలి యజేస్తున్నాయన్నారు. అందువల్లనే ఈ వనాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. నక్షత్రా ల స్వభావాన్ని బట్టి మొక్కల ఎంపిక జరిగిందని రావల్ తెలిపారు. ఆకాశంలో ప్రతి నక్షత్రానికి ఒక ప్రత్యేకత ఉన్నట్లే ఈ నక్షత్ర మొక్క కూడా ప్రత్యేకతను కలిగి ఉంటుందన్నారు. ఈ నక్షత్ర వనానికి అత్యధిక ప్రాధాన్యమిస్తున్నామన్నారు. ఇందుకు సంబంధించి స్థల సేకరణ కూడా జరిగిందని తెలిపారు. లాండ్ స్కేపింగ్ పను లు పూర్తయిన వెంటనే నక్షత్ర నమూనా ప్రకారం మొక్కలను నాటుతామన్నారు. అశ్విని నక్షత్రానికి సంబంధించిన ముష్ఠి (కుప్పిలు) మొక్కలను నాటతామన్నారు. ఈ మొక్క ఔషధ గుణం కలిగినదని, చర్మ సంబంధ వ్యాధులు, కండరాల నొప్పు లు, కఫ, వాత రోగాలకు బాగా ఉపకరిస్తుందన్నా రు. అదేవిధంగా భరణి నక్షత్రానికి సంబంధించిన మొక్కను ఉసిరిగా గుర్తించారని, ఈ మొక్క రక్తాన్ని వృద్ధి చేయడంతోపాటు జ్వరాలు, దగ్గు, వైరస్, ఫంగస్ను నిర్మూలిస్తుంది. కాలేయం పనితీరును మెరుగుపరుస్తుందన్నారు. జ్యేష్ఠ నక్షత్రం కోసం దేవదారు మొక్కను నాటనున్నామన్నారు. అదేవిధంగా అనురాధ-పొగడ, విశాఖ- వికంకట, స్వాతి- మద్ది, చిత్త-బిల్వం, హస్త-అడవి మామిడి, ఉత్తర- జువ్వి, పూర్వ- మొదుగ, మఖ-సోమి, ఆశ్లేష- చంపేయ, పుష్యమి-రావి చెట్టు, పునర్వసు-వెదురు, ఆరుద్ర- మిరియాలు, మృగశిర-సండ్ర, రోహిణి-నేరేడు, కృత్తిక-అత్తి, భరణి-ఉసిరిక, అశ్విని-ముష్టి, రేవతి-విప్ప, ఉత్తరాభాద్ర-మామిడి, పూర్వాభాద్ర-వేప, శతభిషం-కదంబం, ధనిష్ట-జమ్మి, శ్రవణ-జిల్లేడు, ఉత్తరాషాఢ-పనస, పూర్వాషాఢ-వంజుల, మూల-సరుజ నక్షత్రాలకు సంబంధించి 27 మొక్కలను నాటాలని కళాశాల యాజమాన్యం నిర్ణయించింది. -
‘కాలుష్య’ పరిశ్రమలపై న్యాయ పోరాటం
ఫిబ్రవరిలో విచారణకు పిల్! కేంద్ర అటవీ శాఖకు ‘ఫోరం ఫర్ సస్టైనబుల్ ఎన్విరాన్మెంట్’ లేఖ సాక్షి, సిటీబ్యూరో: కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి జారీచేసిన నిబంధనలను తుంగలోకి తొక్కి గ్రేటర్ పర్యావరణాన్ని హననం చేస్తున్న కాలుష్య కారక పరిశ్రమలపై న్యాయపోరాటానికి పలు స్వచ్ఛంద సంస్థలు, పర్యావరణ వేత్తలు సన్నద్ధమవుతున్నారు. పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా 1999 నుంచి అమల్లో ఉన్న నిషేధానికి నిలువెల్లా తూట్లు పొడిచి పబ్బం గడుపుకుంటున్న వారిపై ఇటీవల రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానంలో స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కొందరు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఫిబ్రవరి మొదటి వారంలో విచారణకు రానున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. మరోవైపు తమ పరిశ్రమలను నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలుగా విస్తరిస్తూ.. అపరిమిత ఉత్పత్తులకు పాల్పడుతున్న వారి నిర్వాకాలను కట్టడి చేయాలని కోరుతూ ఫోరం ఫర్ సస్టైనబుల్ ఎన్విరాన్మెంట్ సంస్థ ప్రతినిధి సజ్జల జీవానందరెడ్డి కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖకు లేఖ రాసినట్లు సమాచారం. నిబంధనలకు తూట్లు... నగర శివార్లలోని జీడిమెట్ల, పాశమైలారం, రంగారెడ్డి, మెదక్, నల్లగొండ, మహబూబ్నగర్ జిల్లాల్లోని కొన్ని బల్క్ డ్రగ్, ఫార్మా పరిశ్రమలు వదులుతున్న జల, వాయు కాలుష్యంతో పర్యావరణానికి తీవ్ర హాని కలుగుతోందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి గతంలో స్పష్టంచేసింది. 2010లో దీనికి సంబంధించి పర్యావరణ కాలుష్య సూచీని విడుదల చేసింది. 2010లో పర్యావరణ కాలుష్య సూచీ ప్రమాదకర స్థాయిలో 70.7గా ఉంటే... 2011 నాటికి 74.58కు... 2013 నాటికి అత్యధికంగా 76.05కు చేరుతుందని పేర్కొంది. అయితే కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి వెల్లడించిన వాస్తవాలను పరిశ్రమల లాబీ మార్చేసింది. ఆయా ప్రాంతాల్లో పర్యావరణ కాలుష్య సూచీ కేవలం 47.33 శాతానికి తగ్గినట్లు చూపుతూ తప్పుడు నివేదికను సృష్టించింది. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, పీసీబీ అప్పిలేట్ అథారిటీ, రాష్ట్ర పరిశ్రమల శాఖలోని ఉన్నతాధికారులకు భారీగా ముడుపులు ముట్టజెప్పి తమ దారిలోకి తెచ్చుకుంది. అంతేకాదు ఆయాకంపెనీల నుంచి వెలువడుతున్న నీటిలో కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ (సీఓడీ), వాయు కాలుష్యంలో నైట్రోజన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, ధూళిరేణువులు, సూక్ష్మ ధూలికణాల మోతాదును తక్కువగా చూపడం సంచలనం సృష్టించింది. సుప్రీం మార్గదర్శకాలూ బేఖాతరు సుప్రీం మార్గదర్శకాలను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం 1999 ఏప్రిల్ 20న జారీచేసిన నిషేధ ఉత్తర్వుల (జి.ఓ.ఎం.ఎస్.నెం.62) ప్రకారం... నగర శివార్లు, రంగారెడ్డి, మహబూబ్నగర్, నల్లగొండ, మెదక్ జిల్లాల పరిధిలోని బల్క్డ్రగ్, ఫార్మా కంపెనీలు తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచకూడదు. ప్రస్తుతం ఉన్న పరిశ్రమలకు కిలోమీటరు పరిధిలో ఎలాంటి విస్తరణ చర్యలు చేపట్టకూడదు. జల, వాయు కాలుష్య చట్టాలను ఉల్లంఘించే పనులకూ పాల్పడరాదు. కానీ..పరిశ్రమల లాబీ ఈ నిషేధానికి తెలివిగా తిలోదకాలిచ్చేలా చేసింది. ప్రభుత్వ పెద్దలను ఏడాదిగా అన్ని విధా లా ప్రసన్నం చేసుకొని 2013 జూలై 25న నిషేధం ఉత్తర్వులకు సవరణ చేస్తూ జి.ఓ.ఎం.ఎస్.నెం.64 జారీ అయ్యేలా చేసింది. దీని ప్రకారం జీరో లిక్విడ్ డిస్చార్జి (జల, వాయు, ఘన కాలుష్య ఉద్గారాలు పరిమితులకు లోబడి) ఉండే విధంగా ఉపకరణాలను ఏర్పాటు చేసుకున్న తరవాత... ఉత్పత్తి సామర్థ్యం, విస్తరణ చర్యలు చేపట్టుకోవచ్చన్న సాకు తో నిషేధాన్ని ఎత్తివేసేలా చేసింది. ఈ ఉత్తర్వులతో సుమారు 250 బడా కంపెనీలు తమ ఉత్పత్తులను అనూహ్యంగా పెంచుకునేందుకుగేట్లు బార్లా తెరిచినట్లైంది. దీంతో పరిశ్రమల లాబీ ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. చాలా పరిశ్రమలు తూతూ మంత్రం చర్యలు తీసుకొని చేతులు దులుపుకున్నాయి తప్ప ఎక్కడా కాలుష్య ఉద్గారాలను కట్టడి చేసే ఉపకరణాలను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసిన దాఖలాలు లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. -
టపాసుల మోత
=భారీ శబ్దాలు వెలువడే సామగ్రిని అధికంగా కాల్చిన సిటీజనులు =పెరిగిన దీపావళి ధ్వని కాలుష్య ప్రమాణాలు సనత్నగర్, న్యూస్లైన్ : ఢాం... ధన్... ధనాధన్... పేలుళ్లు, శబ్దాలతో నగరం మోతెక్కి పోయింది. ఈ దీపావళికి టపాసుల ధరలే కాదు.. ధ్వని కాలుష్య ప్రమాణాలూ కాస్త పైకి ఎగబాకాయి. బాణాసంచా ధరలు పెరిగినా టపాసుల మోత మాత్రం తగ్గలేదని కాలుష్య నియంత్రణ మండలి లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ధరలు పెరగడంతో కొనుగోళ్లు తక్కువగా జరిగినప్పటికీ... శబ్దాలు ఎక్కువగా వెలువడే టపాసులకు నగరవాసులు అధిక ప్రాధాన్యమిచ్చినట్లు తెలుస్తోంది. పీసీబీ అధికారుల లెక్కల ప్రకారం గత ఏడాది దీపావళితో పోలిస్తే ఈ సారి ఒక డెసిబల్ నుంచి 13 డెసిబల్స్ మేర ధ్వని కాలుష్య ప్రమాణాలు పెరిగాయి. అయితే పీసీబీ అధికారులు మాత్రం దీనికి మరోభాష్యం చెబుతున్నారు. గత ఏడాది వర్షాలు పడిన నేపథ్యంలో వాతావరణంలో తేమశాతం అధికంగా ఉండి టపాసులు మోత అక్కడికక్కడే ఉండిపోయిందని, అందుకే ప్రమాణాలు తక్కువగా నమోదయ్యాయని వివరిస్తున్నారు. ఈసారి వాతావరణం అందుకు భిన్నంగా పొడిగా ఉండడంతో శబ్దాల తీవ్రత అధికంగా నమోదు అయినట్లు చెబుతున్నారు. ఈ దీపావళికి సిటీలోని రెసిడెన్షియల్, ఇండస్ట్రియల్, కమర్షియల్ ప్రాంతాల్లోని శబ్ద కాలుష్య ప్రమాణాలు ఎలా ఉన్నాయో పీసీబీ నమోదు చేసింది. వాటిని సోమవారం విడుదల చేసింది. కూకట్పల్లి జేఎన్టీయూ ఎదురుగా గల ప్రగతినగర్లో గత సంవత్సరం అత్యధికంగా 99 డెసిబల్స్ నమోదు కాగా ఈసారి అత్యధికంగా 112 డెసిబల్స్కు చేరింది. నగర శివారు ప్రాంతమైన ప్రగతినగర్లోనే ఈ విధంగా ఉంటే కూకట్పల్లి, కేపీహెచ్బీ, ఎల్బీనగర్ వంటి రెసిడెన్షియల్ ప్రాం తాల్లో మరింత ఎక్కువగా నమోదై ఉంటు ందని పీసీబీ అధికారులే చెబుతున్నారు. ఇక ఇండస్ట్రీయల్ ఏరియాకు సంబంధించి ఉప్పల్లో నమోదు చేయగా రెండు డెసిబల్స్ మేర పెరిగాయి. అలాగే వాణిజ్య ప్రాంతమైన ప్యారడైజ్లో ఒక డెసిబల్ పెరిగింది. కాలుష్యంపై స్పృహ పెరిగిందా...? రికార్డుల ప్రకారం శబ్దకాలుష్యంలో పెరుగుదల కనిపించినా... వాతావరణంలో వ్యత్యాసాన్ని పరిగణలోనికి తీసుకుంటే గత ఏడాదితో పోలిస్తే ఈ సారి తక్కువగానే శబ్దాలు వెలువడినట్టేనని పీసీబీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు కాలుష్యంపై సృ్పహ పెరిగిందని పీసీబీ అధికారులు చెబుతుండగా, మరికొందరు ధరల పెరుగుదల నేపథ్యంలో తక్కువ కొనుగోళ్లు జరిగాయంటున్నారు. గత ఏడాది లాగే వాతావరణంలో పరిస్థితులు ఉంటే తప్పకుండా తక్కువ ప్రమాణాలు నమోదై ఉండేవని అంటున్నారు.