ponguru narayana
-
తెలుగు రచయితల సభలా లేక...
ఈ మధ్య విజయవాడలో ప్రపంచ తెలుగు రచయితల మహా సభలు జరిగాయి. అయితే వీటి తీరు చూస్తే అవి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సభలు అనిపిస్తుంది. ఒక కులం వారి ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు ఏర్పాటు చేశారా? అనిపించకమానదు. అదే సమయంలో తెలుగు భాషోద్దణ పేరుతో ఆంధ్రప్రదేశ్లోని పేద పిల్లలకు విద్యను దూరం చేయడానికి కుట్ర జరుగుతుందా అన్న అనుమానమూ రాకమానదు. ధనిక ఆసాములంతా ఒక చోట చేరి కడుపు నిండిన కబుర్లు చెప్పుకున్నట్లుగా ఉందన్న భావన కలుగుతుంది. వీరి మాటలు ప్రభుత్వ స్కూళ్లను నీరు కార్చి, ప్రైవేటు విద్యా వ్యవస్థను ప్రోత్సహించేలా ఉన్నాయి. ఈ రచయితల సభలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రముఖులు లేదంటే వారికి మద్దతు ఇచ్చే మేధావి వర్గానికి చెందినవారే ఎక్కువగా ఉన్నారన్న అభిప్రాయం వచ్చింది. వేదికకు రామోజీరావు పేరు పెట్టడం, ఆయన కోడలు శైలజ వచ్చి తెలుగు గురించి ఉపన్యాసం ఇవ్వడం వంటివి ఈ సభల అజెండాను స్పష్టం చేస్తోంది. ఈ సభలలో పాల్గొన్న ప్రముఖులు ఎవరైనా తమ పిల్లలు, లేదా మనుమళ్లు తెలుగు మాధ్యమంలోనే చదువుతున్నారని చెప్పినట్లు కనిపించలేదు. ప్రధాన అతిధిగా పాల్గొన్న సుప్రీంకోర్టు మాజీ ఛీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఈసారి మరింతగా ఓపెన్ అయ్యారు. ఇంగ్లీష్ మీడియంకు సంబంధించి జగన్ ప్రభుత్వం గతంలో విడుదల చేసిన జీవోని రద్దు చేయాలని ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుకు సూచించారు. బహుశా ఇదంతా ముందస్తుగానే ఒక అవగాహనతో జరిగి ఉంటుందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. జగన్ టైమ్లో విద్య, వైద్య రంగాలకు విశేష ప్రాధాన్యత లభించింది. ‘నాడు నేడు’ కార్యక్రమం కింద స్కూళ్లు, ఆసుపత్రుల రూపురేఖలను మార్చివేశారు. ఆంగ్ల మాధ్యమంతోపాటు సీబీఎస్ఈ, టోఫెల్, ఐబీ వంటి జాతీయ, అంతర్జాతీయ సిలబస్లను ప్రవేశపెట్టి పేద పిల్లలకు అతి ఖరీదైన విద్యను ఉచితంగా అందించడానికి జగన్ కృషి చేశారు. అది సహజంగానే పెత్తందారి వర్గానికి నచ్చదు. ప్రైవేటు స్కూళ్లలో ఖర్చు చేసి చదువుకుంటున్న తమ పిల్లలకు, ప్రభుత్వ స్కూళ్లలో చదువుకునే పిల్లలకు తేడా లేకుండా పోవడం కూడా అంతగా నచ్చదు. అలాంటి తరుణంలో ప్రభుత్వ స్కూళ్లలో చదివే పిల్లలు ఐక్య రాజ్య సమితి వరకు వెళ్లారు.ప్రైవేటు స్కూళ్ల పిల్లలతో పోటీ పడి ఆంగ్లంలో మాట్లాడగలిగే స్థితికి చేరుకుంటున్నారు. అలాగని తెలుగును తక్కువ చేయలేదు. తెలుగును నిర్భంద సబ్జెక్ట్గా చేర్చారు. అయినా కొందరు హైకోర్టుకు వెళ్లారు.ప్రభుత్వానికి అడ్డంకులు సృష్టించారు.జగన్ వెనక్కి తగ్గకుండా ద్విభాష పుస్తకాలు తయారు చేయించారు. దీని తర్వాత కూడా ఈ ఫ్యూడల్ శక్తులకు తృప్తి కలగలేదు. ఇప్పుడు రచయితల సభల పేరుతో ప్రభుత్వ విద్యపై విరుచుకుపడ్డారని అనుకోవాలి. ప్రస్తుత పరిస్థితిలో ఆంగ్ల మాధ్యమంలో చదువుకోక పోతే దేశ, విదేశాలలో మన పిల్లలు పోటీ పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి. చైనాలో ఆ భాషలోనే చదువుతున్నారు కదా అని కొందరు అనవచ్చు. కాని అక్కడి పరిస్థితి వేరు. మన దేశ వాతావరణం వేరు. అయినా చైనాకు చెందిన లక్షల మంది ఇప్పుడు ఆంగ్ల భాషను అభ్యసించి అమెరికా తదితర దేశాల దారి పడుతున్న విషయాన్ని విస్మరించరాదు. ఎన్వీ రమణ ఉపన్యాసాన్ని పరిశీలించండి. ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఆంగ్ల మాద్యమం ప్రవేశ పెడుతూ వైకాపా ప్రభుత్వం తెచ్చిన ‘జీవో8’ను రద్దు చేయాలని అన్నారు. ఆ జీవో పై ఒకరు హైకోర్టుకు వెళ్లి విజయం సాధించారని, దానిపై అప్పటి ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లిందని, ఇప్పుడు ఆ స్పెషల్ లీవ్ పిటిషన్ ను ఉపసంహరించుకోవాలని ఆయన ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. బహుశా చంద్రబాబు ప్రభుత్వంతో ఉన్న అవగాహన వల్లే ఇలా మాట్లాడి ఉంటారా? అని ప్రముఖ విద్యా వేత్త కంచె ఐలయ్య ప్రశ్నించారు. గత ప్రభుత్వం తెలుగు భాషను అణచివేయడానికో, అభివృద్ది చేయడానికో ఆ జీవో తెచ్చిందని రమణ అన్నారు. నిజంగా అంత పెద్ద స్థాయికి వెళ్లిన వ్యక్తి ఇలా మాట్లాడడం శోచనీయం. ఆంగ్లంలోనే ఉద్యోగాలు వస్తాయని అనుకోవడం భ్రమ అని ఆయన చెబుతున్నారు. ప్రజలు తెలుగు భాషను ఆదరిస్తే ప్రభుత్వాలు దిగివస్తాయని మాజీ చీఫ్ జస్టిస్ అన్నారు. సరిగ్గా ఇదే అంశంపై రమణ స్వయంగా కొన్ని గ్రామాలకు, ప్రభుత్వ స్కూళ్లకు వెళ్లి పిల్లలు, వారి తల్లిదండ్రుల అభిప్రాయాలు తెలుసుకుంటే బాగుంటుంది కదా! తెలుగు భాషకు ఎవరూ వ్యతిరేకం కాదు. దానిని రక్షించుకోవల్సిందే. కాని అదే సమయంలో పేదల బతుకు తెరువు కూడా ముఖ్యమే అన్న సంగతి గుర్తుంచుకోవాలి. పైరవి చేసుకుని ఉద్యోగాలు సంపాదించుకోవడమో, ఉన్నత స్థాయికి చేరుకోవడం అందరికి సాధ్యం కాదు. మంచి విద్య వారికి కీలకంగా ఉంటుంది. ఇప్పుడు అమెరికా వెళ్లి స్థిరపడిన లక్షలాది మంది తెలుగువారు ఆంగ్లం నేర్చుకున్న తర్వాతే వెళ్లగలిగారన్నది వాస్తవం. అంతెందుకు! ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ రచయిత, మాజీ ఎంపీ యార్గగడ్డ లక్ష్మీప్రసాద్ కుమారుడు అమెరికాలోనే నివసిస్తున్నారు. ఆయనకు ఆంగ్లంపై పట్టు వచ్చాకే వెళ్లగలిగారా? లేదా? తెలుగు మీడియంలోనే చదువుకుని ఉంటే అది సాధ్యం అయ్యేదా? ఒకవేళ సాధ్యమైనా ఎంత కష్టపడి ఉండాలి? మార్గదర్శి చిట్ ఫండ్స్ ఎండీ శైలజా కిరణ్ కూడా తెలుగు గురించి మాట్లాడారు. మరి వారి ఆధ్వర్యంలో నడిచే పబ్లిక్ స్కూల్ లో తెలుగు మీడియం ఉందో, లేదో చెప్పి ఉండాల్సింది. ఆమె కుంటుంబంలోని పిల్లలంతా ఎక్కడ, ఏ భాషలో చదివారో చెప్పినట్లు లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ ఆంగ్ల మీడియంలోనే చదివారు. ఇప్పుడు మనుమడు దేవాన్ష్ కూడా ఇంగ్లీష్ మీడియంలో అభ్యసిస్తున్నారు కదా? ఇటీవల దేవాన్ష్ చెస్లో మెడల్ సాధించారని వార్తలు వచ్చాయి. ఆయన తెలుగు మీడియంలో చదివి ఉంటే ఈ చెస్ లో గెలవగలిగేవారా అని కంచె ఐలయ్య ప్రశ్నించారు.ప్రైవేటు స్కూళ్లలో అత్యధిక శాతం ఆంగ్ల మీడియమే ఉంది కదా? రాష్ట్ర మంత్రి నారాయణకు చెందిన విద్యా సంస్థలలో ఏ మీడియం ఉందో చెప్పాలి కదా? ఇంకా నయం. ఆయనను ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పెట్టలేదు. ప్రభుత్వ స్కూళ్లలోనే తెలుగు మీడియం ఎందుకు? ప్రైవేటు స్కూళ్లలో కూడా అదే ప్రకారం తెలుగు మీడియం ఉండాలని వీరంతా ఎందుకు డిమాండ్ చేయలేదు? ఇక్కడే వీరి స్వార్దం కనిపిస్తుంది. రామోజీ జ్ఞాపకార్డం అంతా శుభోదయం అని పలకరించుకోవాలని శైలజా కిరణ్ సూచించారు. తెలుగు మీద అంత ప్రేమ ఉంటే కనీసం తెలుగు రాష్ట్రాలలో అయినా తమ సంస్థ మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థ పేరులో ఆంగ్లం లేకుండా చూసుకోవాలి కదా! చిట్ ఫండ్స్ను తెలుగీకరించిన తర్వాత ఆమె సలహాలు ఇస్తే బాగుంటుందని కొందరు వ్యంగ్యంగా అంటున్నారు. ఈనాడు దినపత్రికలో తెలుగు రచయితల సభల వార్తలను కవర్ చేసిన సందర్భంలో పలు ఆంగ్ల పదాలు ఎందుకు వాడారో తెలియదు. ఉదాహరణకు కేబీఎన్ కళాశాల అని అన్నారే కాని, దానిని తెలుగులో రాయలేదు. సుప్రీంకోర్టు, జస్టిస్ వంటి ఆంగ్ల పదాలనే వినియోగించారు. నెట్ లో పెట్టిన వార్తల కింద ఎడిషన్ నేమ్, ఆంధ్రప్రదేశ్ అని, పేజ్ నెంబర్ అంటూ ఆంగ్ల ఆక్షరాలతోనే రాశారు. అంటే దాని అర్థమేమిటి? తెలుగు భాషను రక్షించుకుంటూనే ఆంగ్ల భాషపై తెలుగు పిల్లలు పట్టు పెంచుకుంటేనే వారికి భవితవ్యం ఉందన్నది వాస్తవం. అందుకే 95 శాతం మంది ప్రజలు తమ పిల్లలను ఆంగ్ల మీడియంలోనే చదివించుకుంటున్నారు. ప్రైవేటు విద్యాసంస్థలలో అయితే అది నూటికి నూరు శాతం ఉంటోంది. ప్రభుత్వ విద్యా సంస్థలలోనే ఎందుకు తెలుగు మాధ్యమం అన్నదానికి ఈ పెద్దలు ఎవరూ సమాధానం చెప్పలేరు. ఇప్పటికే ఏపీలో కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తోందన్న విమర్శలు ఉన్నాయి. ఇక ఇలా ఆంగ్ల మీడియం కూడా పూర్తిగా ఎత్తివేస్తే ఏపీలో పేద పిల్లలు ప్రైవేటు స్కూళ్లలో చదివించలేని పరిస్థితి ఏర్పడుతుంది. అంతిమంగా వారి చదువులకు గండం ఏర్పడుతుంది. తెలుగు రచయితల సభ చివరికి పేదల పాలిట శాపంగా మారితే వారి రచనలకే విలువ లేకుండా పోతుంది.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఎవరిని వదిలిపెట్టం.. మంత్రి నారాయణ కనుసన్నల్లోనే సాకేష్ పై దాడి..
-
ఖజానాలో డబ్బుల్లేవు.. ఇప్పుడేమీ చేయలేం
పాలకొల్లు సెంట్రల్: ఖజానాలో డబ్బుల్లేవని.. ఇప్పట్లో పనులేవీ చేయలేమని మునిసిపల్ శాఖ మంత్రి పొంగూరి నారాయణ వ్యాఖ్యానించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా పెంకుళ్లపాడు టిడ్కో గృహాల సముదాయంలో మీడియాతో మాట్లాడుతూ.. పాలకొల్లులో నిర్మించిన టిడ్కో ఇళ్లు గందరగోళంగా ఉన్నాయన్నారు. వీటిని సరిచేద్దామంటే ఖజానాలో నిధులు లేవని, ఇప్పట్లో ఏమీ చేయలేమని తేల్చి చెప్పారు.నిధులు లేనందున ఈ విషయమై ముఖ్యమంత్రితో చర్చించి త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు. డబ్బులుంటే అన్ని పథకాలూ ఒకేసారి అమలు చేసేవాళ్లమని, డబ్బులు లేకపోవడంతో చంద్రబాబు చాణక్యంతో ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నామని తెలిపారు. దీపావళికి మూడు గ్యాస్ సిలిండర్ల పథకం అమలు చేస్తామన్నారు. జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ 7,150 మంది టిడ్కో లబ్ధిదారుల్లో 640 మంది బ్యాంకు రుణాలు తీసుకోలేదని, వారికి ఉచితంగా ఇళ్లు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చామని తెలిపారు. దీనిపై ముఖ్యమంత్రితో మాట్లాడి ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. -
ప్రపంచ బ్యాంక్ వద్దన్నది.. అయినా అమరావతే రాజధాని
అమరావతి ప్రాంతం రాజధానికి పనికిరాదని, ఇక్కడ నిర్మాణాలు చేపట్టొద్దని ప్రపంచ బ్యాంకు చెప్పింది. అయినా ఇక్కడే రాజధాని నిరి్మస్తాం. నవంబర్లో పనులు ప్రారంభిస్తాం. ఇక్కడ ముంపు భయం లేకుండా వచ్చే వర్షాకాలానికల్లా వాగులు, కాలువలను విస్తరిస్తాం. నెదర్లాండ్స్ టెక్నాలజీ వినియోగించి అమరావతిలోని వాగులు, కాలువలపై రిజర్వాయర్లు నిరి్మస్తాం. – రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణసాక్షి, అమరావతి/తాడికొండ: అమరావతి ప్రాంతం రాజధానికి పనికిరాదని, ఇక్కడ నిర్మాణాలు చేపట్టొద్దని ప్రపంచ బ్యాంకు చెప్పిందని, అయినప్పటికీ ఇక్కడే రాజధాని నిర్మిస్తామని, నవంబర్లో పనులు ప్రారంభిస్తామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. గతంలో అమరావతి ప్రాంతాన్ని పరిశీలించిన ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు, నిపుణులు ఈ ప్రాంతం రాజధాని నిర్మాణానికి పనికిరాదని నివేదిక ఇచ్చినట్టు మంత్రి గుర్తు చేశారు. ఇటీవలి వరదల్లో దాదాపు 11.43 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చినా 2,017 చదరపు కిలోమీటర్ల అమరావతి ప్రాంతానికి ఏమీ కాలేదని చెప్పారు. మంత్రి సోమవారం విజయవాడలోని సీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో, గుంటూరు జిల్లా తాడికొండలో మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం మూడు ముక్కలాటతో అమరావతిని నాశనం చేసిందన్నారు. 2014–19 మధ్య 30 వేల మంది అమరావతిలో పనిచేశారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని అన్నారు. కృష్ణానది, బుడమేరు వరదలు విజయవాడలోని 32 డివిజన్లు, కొన్ని గ్రామాలను ముంచేసినా అమరావతికి ఏమీ కాలేదని చెప్పారు. గత ప్రభుత్వం అమరావతి మునిగిపోతుందని ప్రచారం చేసిందని, కానీ కృష్ణా నది వల్ల రాజధానికి ఎలాంటి ఇబ్బందీ లేదని అన్నారు. ఇక్కడ ముంపు భయం లేకుండా వచ్చే వర్షా కాలానికల్లా కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్స్ను విస్తరిస్తామని తెలిపారు. అమరావతి సేఫ్ జోన్లో ఉందని, రాజధాని డిజైన్ సమయంలోనే వరద సమస్య లేకుండా కాల్వలు, రిజర్వాయర్లకు ప్రతిపాదనలు చేశామని అన్నారు. -
టీడీఆర్ బాండ్ల స్కామ్లో కారుమూరిని ‘ఫిక్స్’ చేద్దాం
సాక్షి, అమరావతి: ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ (టీడీఆర్) బాండ్ల జారీ వ్యవహారంలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును ఇరికించాలన్న లక్ష్యంతో గురువారం శాసన సభలో పెద్ద చర్చే జరిగింది. టీడీఆర్ బాండ్ల జారీలో భారీ అవకతవకలు జరిగాయని మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ చెప్పడం, ఇందులో కారుమూరిని ‘ఫిక్స్’ చేయాలని కొందరు సభ్యులు కోరడం, నివేదిక రాగానే అలాగే చేద్దామని మంత్రి చెప్పడం చూస్తే అంతా ఓ ప్రణాళిక ప్రకారం చర్చ జరిగిందని విశ్లేషకులు అంటున్నారు. గురువారం శాసన సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రి బదులిస్తూ గడిచిన ఐదేళ్లలో 3,301 టీడీఆర్ బాండ్లు జారీ చేశారని చెప్పారు. తణుకు, విశాఖ, గుంటూరు, తిరుపతిలో బాండ్ల జారీలో ఆరోపణలు రావడంతో శాఖాపరంగా, ఏసీబీతో కూడా విచారణ చేయిస్తున్నామన్నారు. తణుకులో 27.96 ఎకరాలకు రూ.63.24 కోట్లకు బాండ్లు జారీ చేయాల్సి ఉండగా, ఏకంగా రూ.754.67 కోట్లకు జారీ చేశారన్నారు. అంటే రూ.691.43 కోట్ల స్కామ్ జరిగిందని, ఇందుకు బాధ్యులైన ముగ్గురు అధికారులను ఇప్పటికే సస్పెండ్ చేసామని మంత్రి వివరించారు. రాబోయే 15 రోజులు బాండ్ల జారీని పూర్తిగా నిలిపివేసినట్లు తెలిపారు. దీనిపై ఎమ్మెల్యేలు అరిమిల్లి రాధాకృష్ణ, గోరంట్ల బుచ్చెయ్యచౌదరి మాట్లాడుతూ.. సూత్రధారులపై చర్యలు తీసుకోవాలే తప్ప చిన్న చిన్న ఉద్యోగులపై కాదని అన్నారు. తణుకు స్కామ్లో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు హస్తముందని, ఆయన్ని ఖచి్చతంగా ఈ కేసులో ఇరికించాల్సిందే (ఫిక్స్)నని డిమాండ్ చేశారు. దీనికి మంత్రి బదులిస్తూ విచారణ నివేదిక రాగానే తప్పకుండా కారుమూరిని ఫిక్స్ చేద్దామని చెప్పారు. తిరుపతి, విశాఖ, గుంటూరులో కూడా అప్పటి ఎమ్మెల్యేలపై కేసులు నమోదు చేద్దామని మంత్రి అన్నారు. రాష్ట్రంలో 3.13 లక్షల టిడ్కో ఇళ్ల నిర్మాణం, మౌలిక వసతుల కల్పనను డిసెంబర్ నెలాఖరులోగా పూర్తి చేస్తామని మంత్రి నారాయణ మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
పట్టణాల్లో వసతులు మెరుగుపరుస్తాం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని పట్టణాభివృద్ధి సంస్థ (యూడీఏ)ల పరిధిలో మౌలిక వసతులను మెరుగు పరుస్తామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ఆయన గురువారం సచివాలయంలో 20 పట్టణాభివృద్ధి సంస్థల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. సీఆర్డీఏ సహా రాష్ట్రంలోని 20 యూడీఏల పరిధిలో వేసిన లే అవుట్లలో విద్యుత్తు, రోడ్లు, తాగు నీరు, పార్కులు, మురుగు నీటి పారుదల వ్యవస్థ ఏర్పాటు చేయడం యూడీఏలో ప్రధాన లక్ష్యమన్నారు. నెల్లూరు, కడప లేఅవుట్లలో అవకతవకలు జరిగినట్లు ఫిర్యాదులు అందాయని, వాటిపై విచారణకు కమిటీని వేశామన్నారు. ఆ కమిటీ నివేదిక వచ్చాక బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. గతంలో తణుకు మున్సిపాలిటీలో టీడీఆర్ బాండ్ల జారీలో అవకతవకలు జరిగాయని చెప్పారు. దీనిపైనా విచారణ చేయించి బాధ్యుల పై చర్యలు తీసుకుంటామని చెప్పారు. నిలిచిపోయిన ఎంఐజీ, టిడ్కో గృహాల నిర్మాణాన్ని కూడా ప్రారంభిస్తామని తెలిపారు. గతంలో తమ ప్రభుత్వ హయాంలో ప్రతి ఇంటికీ 24 గంటలు తాగు నీరందించడానికి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా రూ.5,300 కోట్లు కేటాయించామని, ఈ నిధుల్లో గత ప్రభుత్వం రూ.240 కోట్లే వెచ్చి0చిందన్నారు. మిగిలిన నిధుల వినియోగానికి కాల పరిమితిని పెంచాలని ఆ బ్యాంకుకు లేఖ రాసినట్టు చెప్పారు. 2023–24లో వచ్చిన రూ.1100 కోట్లను కూడా దారి మళ్లించిందన్నారు. ఈ సమావేశంలో డీటీసీపీ విద్యుల్లత, పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ చీఫ్ ఆనందరావు పాల్గొన్నారు. -
‘రింగ్’లో మింగారు!
సాక్షి, అమరావతి: రాజధాని.. ఇన్నర్ రింగ్ రోడ్.. కావేవీ భూ దోపిడీకి అనర్హం అన్నట్టుగా టీడీపీ పెద్దలు చెలరేగిపోయారు. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో మార్పులు చేసి తమ భూముల విలువ భారీగా పెంచుకున్నారు. 2014–19 మధ్య టీడీపీ హయాంలో సీఆర్డీఏ చైర్మన్ హోదాలో చంద్రబాబు, వైస్ చైర్మన్గా ఉన్న పొంగూరు నారాయణ బరితెగించి వ్యవహరించారు.లింగమనేని రమేశ్తో క్విడ్ ప్రో కోకు పాల్పడిన ఈ కేసులో నారా లోకేశ్ కూడా ప్రధాన పాత్ర పోషించారు. లింగమనేని భూముల మార్కెట్ విలువ రూ.177.50 కోట్ల నుంచి రూ.877.50 కోట్లకు.. రాజధాని నిర్మాణం అనంతరం ఏకంగా రూ.2,130 కోట్లకు చేరేలా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ను ఖరారు చేయడం భారీ దోపిడీకి నిదర్శనం. సీఐడీ దర్యాప్తులో ఈ కుంభకోణం పూర్తి ఆధారాలతో బట్టబయలైంది. ‘హెరిటేజ్ ఫుడ్స్’కు కానుక..లింగమనేని కుటుంబానికి కల్పించిన ప్రయోజనానికి ప్రతిగా కంతేరులో హెరిటేజ్ ఫుడ్స్కు 10.4 ఎకరాలు పొందారు. ఐఆర్ఆర్ అలైన్మెంట్ను ఆనుకుని లింగమనేని కుటుంబానికి చెందిన 355 ఎకరాలతోపాటు హెరిటేజ్ ఫుడ్స్ భూములు ఉండటం గమనార్హం. క్విడ్ ప్రో కోలో భాగంగా లింగమనేని రమేశ్ కృష్ణా కరకట్ట మీద ఉన్న తన అక్రమ బంగ్లాను చంద్రబాబుకు ఇచ్చారు. ఆ ఇంటిని ఉచితంగా ఇచ్చినట్లు ఆయన చెబుతుండగా నాడు చంద్రబాబు ప్రభుత్వం నుంచి హెచ్ఆర్ఏ ఎందుకు పొందారన్న ప్రశ్నకు సమాధానం లేదు.తమ భూముల విలువ పెరిగేలా..ఇన్నర్రింగ్ రోడ్డు అలైన్మెంట్ ఖరారుకు ముందు లింగమనేని కుటుంబం ఆ ప్రాంతంలో ఎకరా భూమి రూ.8 లక్షల రిజిస్టర్ విలువ చొప్పున విక్రయించగా మార్కెట్ ధర రూ.50 లక్షలు ఉంది. అంటే ఆ భూముల మార్కెట్ విలువ రూ.177.50 కోట్లు. ఇక ఇన్నర్రింగ్ రోడ్డు అలైన్మెంట్ ఖరారు తరువాత ఎకరా రూ.36 లక్షల రిజిస్టర్ విలువ చొప్పున విక్రయించింది. అంటే రిజిస్టర్ విలువే నాలుగున్నర రెట్లు పెరిగింది. మార్కెట్ ధర ఎకరా రూ.2.50 కోట్లు పలికింది. 355 ఎకరాల విలువ మార్కెట్ ధర ప్రకారం అమాంతం రూ.887.50 కోట్లకు పెరిగింది. అమరావతి పూర్తయితే ఎకరా విలువ సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో ఎకరా రూ.4 కోట్లకు చేరుతుందని చంద్రబాబు అప్పట్లోనే ప్రకటించారు. ఇక ఇన్నర్ రింగ్ రోడ్డును ఆనుకుని ఉన్న భూముల విలువ ఎకరా రూ.6 కోట్లకు చేరుతుందని అంచనా వేశారు. అంటే అమరావతి పూర్తయితే ఆ 355 ఎకరాల విలువ ఏకంగా రూ.2,130 కోట్లకు చేరుతుందని అంచనా. తద్వారా హెరిటేజ్ ఫుడ్స్ 9 ఎకరాల విలువ అమరావతి పూర్తయితే రూ.54 కోట్లకు చేరుతుందని లెక్కతేలింది. హెరిటేజ్ ఫుడ్స్ ఒప్పందం చేసుకున్న మరో నాలుగు ఎకరాల విలువ రూ.24 కోట్లకు చేరుతుంది. సీఆర్డీఏ తొలి అలైన్మెంట్ ప్రకారం ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని చేపడితే నారాయణ విద్యా సంస్థల భవనాలను భూ సేకరణ కింద తొలగించాల్సి వస్తుంది. దీంతో నారాయణ అలైన్మెంట్ను 3 కి.మీ. తూర్పు దిశగా మార్పించారు. పవన్ కళ్యాణ్కు 2.40 ఎకరాలుజనసేన అధినేత పవన్ కళ్యాణ్కు కూడా ఇన్నర్ రింగ్ రోడ్డు అవినీతిలో వాటా ఇచ్చారు. ఈ రోడ్డు అలైన్మెంట్కు సమీపంలో ఆయనకు 2.4 ఎకరాల భూమి ఉంది. లింగమనేని కుటుంబం నుంచి ఆ భూములను ప్రభుత్వ ధర ప్రకారం ఎకరా రూ.8 లక్షలు చొప్పున కొనుగోలు చేసినట్టు చూపించారు. ల్యాండ్ పూలింగ్ నుంచి మినహాయింపు కల్పించిన భూమినే పవన్ కళ్యాణ్కు ఇవ్వడం గమనార్హం. ఏ1 చంద్రబాబు.. ఏ2 నారాయణ.. ఏ14 లోకేశ్ఇన్నర్రింగ్ రోడ్ అలైన్మెంట్ కుంభకోణం కేసులో సీఐడీ ఇప్పటికే విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో చార్జ్షీట్ దాఖలు చేసింది. ఈ కేసులో ఏ–1గా చంద్రబాబు, ఏ–2గా పొంగూరి నారాయణలను పేర్కొంది. ఐపీసీ 120(బి), 409, 420, 34, 35, 37, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13(2), రెడ్విత్ 13(1)(సి),(డి)ల ప్రకారం కేసు నమోదు చేసింది. అలైన్మెంట్ బాబుది.. ముద్ర కన్సల్టెన్సీదిఇన్నర్ రింగ్ రోడ్ కోసం సీఆర్డీయే అధికారులు తొలుత 94 కి.మీ. పొడవుతో ఓ అలైన్మెంట్ను రూపొందించారు. అయితే దానివల్ల తమ భూముల విలువ పెరగదని గుర్తించిన టీడీపీ పెద్దలు అలైన్మెంట్ను మార్చేశారు. 3 కి.మీ. దక్షిణం వైపు జరిపేసి తాడికొండ, కంతేరు, కాజాలోని చంద్రబాబు, లింగమనేని కుటుంబాలకు చెందిన 355 ఎకరాలు, హెరిటేజ్ ఫుడ్స్కు చెందిన 13 ఎకరాలను ఆనుకుని వెళ్లేలా ఖరారు చేశారు. ఆ విషయాన్ని గోప్యంగా ఉంచి ఇన్నర్ రింగ్ రోడ్డుకు అటూ ఇటూ భారీగా భూములు కొన్నారు. అనంతరం ఎస్టీయూపీ కన్సల్టెన్సీ ద్వారా తాము ఖరారు చేసిన అలైన్మెంట్ను ఆమోదించుకున్నారు.ఐఆర్ఆర్ కేసులో నిందితులుఏ–1: చంద్రబాబుఏ–2: నారాయణఏ–3: లింగమనేని రమేశ్ఏ–4: లింగమనేని వెంకట సూర్య రాజవేఖర్ఏ–5: కేపీవీ అంజని కుమార్ (రామకృష్ణ హౌసింగ్ కార్పొరేషన్)ఏ–6: హెరిటేజ్ ఫుడ్స్ఏ–7: ఎల్ఈపీఎల్ ప్రాజెక్ట్స్ఏ–14: నారా లోకేశ్ -
అమరావతికి రూ.లక్ష కోట్లు
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి అభివృద్ధి పనులను రెండున్నరేళ్లలో పూర్తి చేస్తామని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. పాత మాస్లర్ ప్లాన్ ప్రకారమే రాజధానిలో నిర్మాణాలు చేపడతామన్నారు.మూడు దశల్లో రాజధాని పనులు పూర్తి చేసేందుకు రూ.లక్ష కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసినట్లు మంత్రి వెల్లడించారు. ఆదివారం ఉదయం వెలగపూడిలోని సచివాలయం రెండో బ్లాక్లో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.ప్రపంచంలో ఐదు అత్యుత్తమ రాజధానుల్లో ఒకటిగా తీర్చిదిద్దే లక్ష్యంతో అమరావతి నిర్మాణాన్ని చేపట్టినట్లు చెప్పారు. అత్యుత్తమ డిజైన్ రూపొందించి సింగపూర్, చైనా, జపాన్, రష్యా, మలేసియా తదితర దేశాలను సందర్శించామన్నారు. అమరావతి నిర్మాణాన్ని మూడు దశల్లో పూర్తి చేయాలని నిర్ణయించామని, తొలిదశలో భాగంగా రూ.48 వేల కోట్లతో మంత్రులు, కార్యదర్శులు, అధికారులు, ఉద్యోగులకు నివాస భవనాల నిర్మాణం, మౌలిక వసతుల కల్పన పనులు చేపట్టామన్నారు.తొలిదశ పనులకు గతంలోనే టెండర్లు పిలిచి దాదాపు రూ.9 వేల కోట్ల చెల్లింపులు కూడా చేసినట్లు తెలిపారు. ఈ నిర్మాణాలు దాదాపు 90 శాతం పూర్తైనట్లు పేర్కొన్నారు. తొలి దశలో సిటీ నిర్మాణం పూర్తి చేసి రెండో దశలో మెట్రో రైల్ నిర్మాణ పనులు చేపడతామని ప్రకటించారు. రాజధాని విషయంలో గతంలో రూపొందించిన మాస్టర్ ప్లాన్నే ఇప్పుడూ అమలు చేస్తామని, అయితే అంచనా వ్యయాన్ని ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పరిశీలించాల్సి ఉందన్నారు. 217 చ.కి.మీ మేర అమరావతి నిర్మాణం రాజధానిలో ల్యాండ్ పూలింగ్ కోసం 2015 జనవరి 1న నోటిఫికేషన్ ఇవ్వగా అదే ఏడాది ఫిబ్రవరి 28 నాటికి ఎలాంటి వివాదాలు లేకుండా 34 వేల ఎకరాలను రైతులు ప్రభుత్వానికి ఇచ్చారని మంత్రి నారాయణ తెలిపారు. రాజధాని అభివృద్ధి విషయంలో గత ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. మొత్తం 217 చ.కి.మీ విస్తీర్ణంలో అమరావతి నిర్మాణాన్ని చేపడతామని, సుమారు 3,600 కి.మీ మేర రోడ్లు నిరి్మస్తామని వివరించారు.రూ.48 వేల కోట్లతో చేపట్టిన ఈ తొలిదశ పనులు పూర్తవగానే రెండో దశలో గన్నవరం విమానాశ్రయాన్ని అమరావతితో కలుపుతూ మెట్రో రైలు ప్రాజెక్టును చేపట్టనున్నట్టు వెల్లడించారు. ఈ ఖర్చు గత మాస్టర్ ప్లాన్ ప్రకారం అంచనా వేశామని, మరోసారి టెండర్లు పిలిచి సవరించే అవకాశం ఉందన్నారు. అధికారులతో సమీక్షించి 15 రోజుల్లో దీనిపై పూర్తి సమాచారాన్ని ప్రజలకు తెలియ చేస్తామన్నారు.మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారాయణకు పురపాలక, పట్టణాభివృద్ది శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్షి్మ, సీడీఎంఏ శ్రీధర్, సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్, అదనపు కమిషనర్ కట్టా సింహాచలం, విజయవాడ మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్, సీఆర్డీఏ చీఫ్ ఇంజనీర్లు ఎన్వీఆర్కే ప్రసాద్, సీహెచ్ ధనుంజయ్ తదితరులు శుభాకాంక్షలు తెలియచేశారు. అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపై అంచనాలకు ఆదేశం అన్న క్యాంటీన్లను మూడు వారాల్లోగా వంద చోట్ల పునరుద్ధరిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. సీఎం చంద్రబాబు తొలి ఐదు సంతకాల్లో అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ కూడా ఉందన్నారు. గతంలో తమ ప్రభుత్వ హయాంలో 203 క్యాంటీన్ల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించగా 184 చోట్ల ప్రారంభించినట్లు చెప్పారు. వాటిని తిరిగి వినియోగంలోకి తెచ్చేందుకు రెండు మూడు రోజుల్లో అంచనాలు అందజేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. -
అత్యుత్తమ రాజధానిగా అమరావతి
నెల్లూరు (స్టోన్హౌస్పేట): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని అద్భుతంగా అభివృద్ధి చేసి, ఐదు అత్యుత్తమ రాజధానుల సరసన నిలిపేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నట్లు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి పొంగూరు నారాయణ చెప్పారు. నెల్లూరు రూరల్ మండలం చింతారెడ్డిపాళెంలోని నారాయణ మెడికల్ కళాశాల ఆవరణలోని తన స్వగృహంలో మంత్రి శనివారం మీడియాతో మాట్లాడుతూ.. 2015 జనవరిలో అమరావతి రాజధాని నిర్మాణానికి కేవలం 58 రోజుల్లో 34 వేల ఎకరాల భూములను రైతులు అందజేశారని, ముఖ్యమంత్రి చంద్రబాబుపై నమ్మకంతోనే తమ భూములను రాజధాని ఏర్పాటుకు కేటాయించారని మంత్రి గుర్తుచేశారు. వివిధ దశల్లోనే నిలిచిపోయిన భవనాలను పూర్తిచేసేందుకు చర్యలు చేపట్టినట్లు మంత్రి తెలిపారు. సుమారు రెండున్నరేళ్లలోనే అమరావతి రాజధాని నిర్మాణాన్ని పూర్తిచేసేందుకు కృషిచేస్తామన్నారు. సీఎం చంద్రబాబు మరోసారి రాజధానిని అభివృద్ధి చేసే బాధ్యతను తనపై ఉంచారని, ఆయన నమ్మకాన్ని నిలబెట్టేందుకు రాజధాని అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తానన్నారు. మున్సిపాలిటీల అభివృద్ధికి పెద్దపీట..ఇక 2014 నుంచి 2019 వరకు తమ పాలనలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి రాష్ట్రంలోని 114 మున్సిపాల్టీల్లో పెద్దఎత్తున పార్కులు, రోడ్లు, డ్రైనేజీలు, డివైడర్లు, పాఠశాలల్లో మౌలిక వసతులు మొదలైన అభివృద్ధి పనులు చేపట్టామని మంత్రి నారాయణ చెప్పారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసిన క్షణాల్లోనే ప్లాన్ అప్రూవల్ ఇచ్చేలా చర్యలు చేపట్టామన్నారు. ఎటువంటి చార్జీలు కూడా ప్రజల నుంచి వసూలుచేయలేదన్నారు. గత ప్రభుత్వం ప్రజలపై పన్నుల భారం మోపిందని, చెత్త పన్నుతో ప్రజలు బాగా ఇబ్బందులుపడ్డారని మంత్రి చెప్పారు. అధికారులతో సమీక్షించి దీనిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. త్వరలో టిడ్కో ఇళ్ల పూర్తిపై దృష్టిసారిస్తామని.. అలాగే, అధికారులతో సమావేశమై మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులు, పెండింగ్ అంశాలపై చర్చిస్తామన్నారు. -
మాస్టారూ.. ఎవరీమె?
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నారాయణ విద్యాసంస్థల అధినేతగా మాజీ మంత్రి పొంగూరు నారాయణ ఎన్నికల వేళ సత్యాన్ని సమాధిచేసి తన రాజకీయ పదవి కోసం తాళి కట్టిన భార్యనే కాదనుకున్నాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నారాయణతో మూడు దశాబ్దాల పాటు అన్యోన్య దాంపత్య జీవితం పంచుకున్న ఆమె ప్రస్తుతం ఎవరు? అనేది ప్రశ్నార్థకంగా మారింది.ఎన్నికల అఫిడవిట్లో తనకు ఒక భార్య, కుమార్తెను మాత్రమే చూపారు. రెండో భార్య ఆమె కుమార్తెను చూపించకపోవడంతో గత నాలుగు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అభివృద్ధి మంత్రాన్ని పఠిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న నారాయణ మహిళలను వంచించిన విషయంలో సింహపురి మహిళలకు ఏమని సమాధానం చెబుతారు.తప్పుల కుప్ప.. ఆ ‘అఫిడవిట్’ టీడీపీ నెల్లూరు ఎమ్మెల్యే అభ్యర్థి నారాయణ చిక్కుల్లో పడ్డాడు. భారత ఎన్నికల సంఘం నిబంధనలను సవాల్ చేస్తూ తన నామినేషన్ పత్రంతో సమర్పించిన అఫిడవిట్లో తప్పుడు సమాచారం పొందుపరిచారు. ఎన్నికల సంఘం నియమావళి ప్రకారం ఒక భార్య ఉన్న వారే రాజ్యాంగబద్ధ పదవులకు అర్హులు. ఇంకో భార్య ఉన్నప్పటికీ విడాకులు అయినా ఇచ్చి ఉండాలి. అయితే నారాయణ విద్యా సంస్థల అధినేతగా నారాయణ వ్యక్తిగత జీవితం ‘తెరిచిన పుస్తకం’. నారాయణకు ఇద్దరు భార్యలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. 2014లో ఇలా.. 2014లో ఎమ్మెల్సీ నామినేషన్ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్లో తన భార్య పి. రమాదేవిగా, శారిణి (రెండో భార్య ఇందిర కుమార్తె), కుమారుడు నిషింత్ను డిపెండెంట్లుగా చూపించారు. వీరు కొడుకు, కూతురు అయినప్పటికి మిగతా ఐఐఐలోవారు తన సంతానంగా సృష్టంగా పేర్కొనకపోవడం విశేషం. 2019 ఎన్నికల్లో ఇలా.. 2019 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా సమర్పించిన అఫిడివిట్లో కేవలం తన భార్య రమాదేవిని మాత్రమే చూపించారు. అయితే అంతకు ముందే కుమారుడు నిషాంత్ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో కుమార్తె శారిణిని అఫిడవిట్లో సంతానంగా, డిపెండెంట్లుగా పేర్కొనకపోవడం గమనార్హం. 2024లో (ప్రస్తుతం)ఇలా.. 2024 సార్వత్రిక ఎన్నికల్లో సమర్పించిన అఫిడవిట్లో తన భార్య రమాదేవిని మాత్రమే చూపించారు. కానీ ఎక్కడా కుమార్తెలు ఉన్నట్లుగా చూపించకపోగా, శారిణి, సింధూర వద్ద అప్పులు తీసుకున్నట్లు అఫిడవిట్లో చూపించడం గమనార్హం. ఇందిర నారాయణ రెండో భార్యే? పొంగూరు ఇందిర రెండో భార్యే అనడానికి అనేక ఆధారాలు ఉన్నాయి. 1996లో ఏర్పాటు చేసిన నారాయణ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ సంస్థలో ఇందిర భర్త పొంగూరు నారాయణగా ఆమె చైర్మన్ హోదాతో ఉన్నట్లు ట్రస్ట్ బోర్డులో రిజి్రస్టేషన్ డాక్యుమెంట్లు నిర్థారణ చేస్తున్నాయి. ఇందిర నిర్వహణ కమిటీలో కూడా కోశాధికారిగా ఉన్నట్లు తెలుస్తోంది. 2014లో మాత్రం ఎన్నికల కోసం ఆమెతో రాజీనామా చేయించారు.2011 నుంచి 2020 వరకు నారాయణ ఎడ్యుకేషన్ సోసైటికి చెందిన ఐసీఐసీఐ బ్యాంక్ అకౌంట్లో లావాదేవీల విషయంలో కూడా ఇందిర సంతకం ఉంది. అయితే ఆమెతో కోర్టు ద్వారా విడాకులు తీసుకున్నట్లు ఎప్పుడు, ఎలా, ఎక్కడ అనే ఆధారాల్లేవు. ఆమె పాస్పోర్టు పరిశీలించినా నారాయణ భార్యగా తేటతెల్లం అవుతుంది. ఆమె పేరుతో ఉన్న ఆస్తుల రిజిస్టర్ డాక్యుమెంట్లను పరిశీలించినా ఇదే విషయం ప్రస్ఫుటం అవుతుంది.ఇందిర కుమార్తె శారిణి పాస్పోర్ట్లో తన తండ్రి నారాయణగా ఉన్నట్లు సమాచారం. అయితే నారాయణ మంత్రి అయ్యాక వీకీపీడియాలో మాత్రం భార్య రమాదేవి, కుమార్తెలు సింధూర, శారిణి, కుమారుడు నిషాంత్ (లేట్) అనే విషయాలు నమోదు చేసి ఉండడం విశేషం. కన్యాదానం చేసి.. తర్వాత మసి పూసి నారాయణ గతంలో మంత్రి పదవి చేపట్టిన తర్వాత కొంత కాలానికి కుమారుడు హైదరాబాద్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. తర్వాత కొన్నాళ్లకు తన కుమార్తె శారిణి (రెండో భార్య కుమార్తె)కి టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు కుమారుడు రవితేజతో వివాహం జరిగింది.ఆ వివాహ సందర్భంలో నారాయణ, ఇందిర దంపతులుగా వ్యవహరించి కన్యాదానం చేశారు. అలాగే నారాయణ ఎడ్యుకేషనల్ సోసైటీ మేనేజ్మెంట్ కమిటీ మెంబర్గా శారిణి, రవితేజగా వ్యవహరిస్తున్నారు. అన్ని సందర్భాల్లో ఇందిరను భార్యగా చూపిస్తున్న నారాయణ ఎన్నికల అఫిడవిట్లో మాత్రం చూపించకపోవడం విశేషం. టీడీపీకి ఆర్థిక దన్ను టీడీపీకి నారాయణ ఆర్థిక వెన్నుదన్నుగా నిలుస్తూ చంద్రబాబు అండతో రాజధాని ప్రాంతంలో వేలాది ఎకరాల భూ కుంభకోణానికి పాల్పడ్డారు. అనేక అవినీతి బాగోతాల్లో నారాయణ పాత్రధారుడుగా ఉన్నారు. ఇక విద్యా సంస్థల్లో అయితే పేపర్ల లీకేజీల నుంచి అనేక అడ్డదారులు తొక్కారు. వీటి నుంచి బయటపడాలని 2019లో నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నారాయణ అవినీతి బాగోతాలన్నీ బయటపడ్డాయి. ఈ కేసులన్నీ మెడకు చుట్టుకోవడంతో కేసుల నుంచి బయటపడేందుకు ఈ ఎన్నికల్లో గెలవాలని రూ.వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇప్పటికే టీడీపీకి సైతం దాదాపు రూ.900 కోట్ల ఎన్నికల ఫండ్ను అందజేసినట్లు ప్రచారం జరుగుతోంది.నెల్లూరు సిటీలో కూడా వైఎస్సార్సీపీ అభ్యర్థిగా నిలబెట్టిన ఒక సామాన్యుడిపై ఓడిపోతాననే భయంతో రూ.100 కోట్లు వరకు ఖర్చు చేసేందుకు కూడా వెనుకాడడం లేదని ఆ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అక్రమాలపై ప్రశ్నిస్తున్న వైఎస్సార్సీపీ నారాయణ ఎన్నికల అక్రమాలపై ఇప్పుడు వైఎస్సార్సీపీ దృష్టి సారించింది. 2014లో ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు ఆయన ఎన్నికల కమిషన్కు సమర్పించిన అఫిడవిట్పై అప్పట్లో టీడీపీ ప్రభుత్వం ఉండడంతో వైఎస్సార్సీపీ నేతలు దృష్టి సారించలేదు. 2019 ఎన్నికలప్పుడు కూడా ఆయన వ్యక్తిగత అఫిడవిట్పై దృష్టి కేంద్రీకరించలేదు.తాజాగా జరుగుతున్న ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైఎస్సార్సీపీ గతంలో, ఇప్పుడు సమర్పించిన అఫిడవిట్లను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. తన అఫిడవిట్లలో తనకు ఇద్దరు భార్యలు, ముగ్గురు సంతానం ఉన్నట్లు ఎక్కడా చూపించకపోవడంపై నిశితంగా ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైంది. ప్రధానంగా నారాయణ భార్యగా రికార్డుల్లో ఉన్న ఇందిరతో విడాకులు తీసుకున్నట్లు ఎక్కడా ఆధారాలు లేవు.ఆయనకు ముగ్గురు సంతానం అనేదానికి సైతం ఆధారాలు సేకరించారు. ప్రస్తుతం కుమారుడు చనిపోయినప్పటికీ ముగ్గురు సంతానం అనే నిబంధన నారాయణకు వర్తిస్తుందని ఎన్నికల కమిషన్ నియమావళి చెబుతోంది. వీటిపై దృష్టిసారించిన వైఎస్సార్సీపీ నారాయణ అఫిడవిట్పై పోరాటం చేయడానికి సిద్ధమైంది. ఆస్తుల్లోనూ తప్పుడు సమాచారమే? దేశ వ్యాప్తంగా నారాయణ విద్యాసంçస్థలను నెలకొల్పి వేలకోట్ల ఆస్తులను సొంతం చేసుకున్న నారాయణ ఎన్నికల ఆఫిడవిట్లో ఆస్తులపై తప్పుడు సమాచారం ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. ఆయన కుటుంబ ఆస్తులు విలువ రూ.824.05 కోట్లుగా చూపారు. ఆయన తోపాటు మొదటి భార్య రమాదేవి పేరిట ఆస్తులున్నట్లు పేర్కొన్నారు. వారిద్దరి పేర్లతో అప్పులు కూడా రూ.189.59 కోట్లుగా చూపారు. కానీ దేశ వ్యాప్తంగా వేల కోట్ల ఆస్తులు పోగేసుకున్న నారాయణ అఫిడవిట్లో కొన్నింటినే చూపారని చెప్పుకోవాలి. కేసుల్లో దిట్ట నారాయణపై అఫిడవిట్లో చూపిన ప్రకారం ఎనిమిది కేసులు నమోదయిన్నాయి. నారాయణ తమ్ముడు భార్య నెల్లూరు నగరంలోని బాలాజీనగర్ స్టేషన్లో వరకట్నం, వేధింపుల కేసు నమోదు చేయించింది. అలాగే చిత్తూరులో ప్రశ్నాపత్రాల లీక్ చేసిన అభియోగంతో కేసు నమోదయింది.అలాగే నారాయణ విద్యాసంస్థల్లో చదువుకునే విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న కేసులో కడప జిల్లా బి కోడూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.. మిగిలిన ఐదు కేసులు అమరావతితో భూముల విషయంలో సీఐడీ కేసులు నమోదు చేసింది.. అమరావతి భూముల మాస్టర్ డిజైనింగ్ అక్రమాలు, దళితుల భూములు కొనుగోలు, మంత్రిగా తన విధులను దుర్వినియోగం చేశారన్న అభియోగాలపై సీఐడీ కేసులు నమోదు చేసినట్లు చూపారు. నామినేషన్ స్క్రూట్నిలో అభ్యంతరాలు నెల్లూరులోని శుక్రవారం జరిగిన నామినేషన్ల స్క్రూట్ని సమయంలో నెల్లూరు నగర టీడీపీ అభ్యర్థి నారాయణ నామినేషన్ సందర్భంగా పొందుపరిచిన అఫిడవిట్పై స్థానిక వైఎస్సార్సీపీ అభ్యర్థి ఖలీల్ అహ్మద్ పలు అభ్యంతరాలను తెలిపారు. నారాయణకు రెండు పెళ్లిళ్లు అధికారికంగా అయినట్లు పలు ఆధారాలతో సహ రిటర్నింగ్ అధికారికి చూపించారు. అఫిడవిట్లో రెండో భార్యను ఎక్కడ చూపించలేదని. రెండో భార్య కుమార్తె శారిణి ఉన్నట్లు చూపించారు.నారాయణ ఎడ్యుకేషన్ సోసైటీ ఏర్పాటు నుంచి ఆయన భార్యగా ఇందిరను చూపించారని, కుమార్తె శారిణి కూడా సోసైటి మేనేజ్మెంట్ మెంబర్గా ఉందని, వారి పాస్పోర్ట్లు పరిశీలించినా వాస్తవాలు తెలుస్తాయయని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఆయా అభ్యంతరాల ఆధారంగా నారాయణ నామినేషన్ను తిరస్కరించాలని ఫిర్యాదు చేసినా రిటర్నింగ్ అధికారి ఆ అభ్యంతరాలు పరిగణలోకి తీసుకోకపోవడం గమనార్హం. -
మాకు ఇదేమి ఖర్మ నారాయణా..!
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: భారీగా ఫీజులు చెల్లించి తమ విద్యా సంస్థల్లో పిల్లలకు మంచి విద్యను అందించాల్సిన టీడీపీ నేత, మాజీ మంత్రి పొంగూరు నారాయణ తన స్కూళ్లు, కాలేజీలను రాజకీయాలకు వేదికగా మార్చేశారు. చంద్రబాబు బినామీగా, టీడీపీ నేతగా, మాజీ మంత్రిగా చిరపరిచితుడైన నారాయణ ఈసారి ఎన్నికల్లో టీడీపీ తరపున నెల్లూరు నగర అభ్యర్థిగా పోటీకి సిద్ధమవుతున్నారు. దీంతో నారాయణ విద్యా సంస్థల్లోనే రాజకీయ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నారు. సంస్థలో ఉద్యోగులు, ఉపాధ్యాయులతో ఎన్నికల పనులు చేయిస్తున్నారు. ఉన్నత చదువులు చదువుకుని పిల్లలకు పాఠాలు చెప్పడానికి వచ్ఛిన ఉపాధ్యాయులను ఎన్నికల ప్రచారం కోసం విద్యార్థుల ఇళ్లకు పంపుతున్నారు. ఈ దఫా ఓటు టీడీపీకే వెయ్యాలని ప్రాథేయపడేలా చేస్తున్నారు. బలవంతంగా ఎన్నికల ఉచ్చులోకి.. 2019 ఎన్నికల్లో నెల్లూరు నగర నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా ఓడిపోయిన నారాయణ నాలుగున్నరేళ్లపాటు నెల్లూరుకు ముఖం చాటేశారు. ఆయనపై టీడీపీ కేడర్లో తీవ్ర అసంతృప్తి ఉంది. దీంతో ఈసారి టీడీపీకి ప్రచారం చేయడం కోసం తన విద్యాసంస్థల ఉద్యోగులు, ఉపాధ్యాయులను బలవంతంగా ఎన్నికల ఉచ్చులోకి లాగారు. ఇప్పటికే కొందరు ఉపాధ్యాయులు, ఉద్యోగులను రోజువారీ విధుల నుంచి తప్పించి ఎన్నికల విధులు అప్పజెప్పినట్లు సమాచారం. దాదాపు 500 మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులను కలిపి నారాయణ టీం (ఎన్ టీం)గా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఆ బృందంతో గతంలో నెల్లూరు నగర నియోజకవర్గంలో ఓటర్ల వెరిఫికేషన్ చేయించారు. ప్రతి ఇంటికీ వెళ్లి ఓటర్ల ఆధార్ కార్డులు, బ్యాంకు ఖాతా సమాచారం, వారి మొబైల్కొచ్చే ఓటీపీ అడగడంతో ప్రజలు వారికి దేహశుద్ధి చేసిన ఘటనలు ఉన్నాయి. అయినా, నారాయణ ఇప్పుడు ఎన్నికల ప్రచారం కోసం వారిని ఉపయోగిస్తున్నారు. ప్రధానంగా నెల్లూరు నగర, రూరల్ నియోజకవర్గాల్లో ప్రచారం చేయిస్తున్నారు. ప్రతి రోజూ విద్యార్థుల ఇళ్లకు వెళ్లి.. ఎంపిక చేసిన ఉపాధ్యాయులు ఆ విద్యా సంస్థల్లో చదివే విద్యార్థుల అడ్రెస్లు సేకరించి, ఒక్కొక్కరూ రోజుకు ముగ్గురు విద్యార్థుల ఇళ్లకు వెళుతున్నారు. తల్లిదండ్రులతో ఎన్నికలపై చర్చిస్తున్నారు. ఈ దఫా ఓట్లు టీడీపీకే వేయాలని వారిపై ఒత్తిడి తెస్తున్నారు. ఎవరైనా ఎదురు తిరిగితే తమ యాజమాన్యం ఒత్తిడిపై వచ్చామని, ఏమీ అనుకోవద్దని ప్రాధేయపడుతున్నారు. ఉపాధ్యాయులు విద్యార్థుల ఇళ్లను సందర్శించినట్లు ఫొటోలు దిగి విద్యా సంస్థల వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేస్తున్నారు. మాట వినకపోతే డిస్మిస్ లేదా బదిలీ ఉన్నత చదువులు చదివిన తమకు వేతనం తక్కువైనప్పటికీ గౌరవప్రదమైన ఉద్యోగం అని చెప్పుకునేందుకు ఎక్కువ మంది నారాయణ విద్యా సంస్థల్లో చేరుతున్నారు. ఏళ్ల తరబడి అదే సంస్థలో పని చేస్తున్నారు. నారాయణ ప్రత్యక్ష ఎన్నికల్లోకి వచ్ఛిన 2019 నుంచి నారాయణ సంస్థల ఉద్యోగులు, ఉపాధ్యాయులను రాజకీయ పనులకు వాడుకుంటున్నారు. ఉద్యోగులను భయపెట్టి మరీ ఎన్నికల పనులు చేయిస్తున్నారని విద్యాసంస్థ ఉద్యోగులు, ఉపా«ద్యాయులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు తిరస్కరించిన ఉద్యోగులను పలు సాకులతోఉద్యోగం నుంచి తొలగించడమో, సుదూర ప్రాంతాలకు బదిలీ చేయడమో చేస్తున్నారని ఓ ఉద్యోగి వాపోయారు. -
ఎన్నికల ప్రచారానికి జనసేన జెండాలు వద్దు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రాష్ట్రంలో టీడీపీ, జనసేనల మధ్య పొత్తు పొడిచినా నెల్లూరు నగరంలో మాత్రం ఆ రెండు పార్టీల కలయికకు పచ్చనేతలు ససేమిరా అంటున్నారు. రానున్న ఎన్నికల్లో జనసేనతో కలిసి ఎన్నికల సమరానికి వెళ్లేందుకు టీడీపీ నెల్లూరు నగర అభ్యర్థి పొంగూరు నారాయణ ఇష్టపడడం లేదని తెలుస్తోంది. ఎన్నికల ప్రచారానికి కూడా కేవలం టీడీపీ జెండాతోనే వెళుతున్నారు. ఓవైపు జనసేన అధినేత పవన్కళ్యాణ్ మాత్రం టీడీపీ నేతలు అవమానించినా వారితో కలిసి పనిచేయాలని పిలుపునివ్వడంతో ఏం చేయాలో అర్థంకాక జనసేన నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఆశలు ఆవిరై.. జనసేన నెల్లూరు నగర సీటుపై మొదటి నుంచి ఆశలు పెంచుకుంది. జిల్లాలో జనసేన పార్టీ ఒంటరిగా పోటీ చేసే పరిస్థితి లేకపోవడంతో టీడీపీతో పొత్తు కుదిరితే నెల్లూరు సీటు తమకే వస్తుందని ఆ పార్టీ నేత మనుక్రాంత్రెడ్డి ఎంతగానో ఆశపడ్డారు. అందుకు తగినట్లుగానే పార్టీ కీలకనేత నాదెండ్ల మనోహర్తో సన్నిహితంగా మెలిగేవాడు. ఈ నేపథ్యంలో నెల్లూరు నగర సీటు టీడీపీ అధినేత చంద్రబాబు బినామీగా ఉన్న మాజీ మంత్రి పొంగూరు నారాయణకు ఓకే చేయడంతో జనసేన నేతల ఆశలపై నీళ్లు చల్లినట్లైంది. నారాయణ టీడీపీ–జనసేన ఉమ్మడి అభ్యర్థి అయినప్పటికీ జనసేన నేతలను పూచికపుల్లలా తీసేశాడు. నియోజకవర్గ పరిధిలో జరిగే ఏ కార్యక్రమాలకూ వారిని ఆహ్వానించడం లేదు. దీంతో జనసేన నేతలు నారాయణతో కలవలేక తమకు జరుగుతున్న అవమానాలకు మనస్సులోనే కుంగిపోతున్నారు. అవకాశం వచ్చినప్పుడు తామేంటో చూపిస్తామంటూ గుర్రుగా ఉన్నారు. కోవర్టును పెట్టి.. మాజీ మంత్రి నారాయణ ఆది నుంచి జనసేనలో చీలిక తెచ్చేందుకు పావులు కదిపాడు. ఆ పార్టీలో తన కోవర్టును ఏర్పాటు చేసుకుని రెండు గ్రూపులుగా విడిపోయేలా చేశాడు. మనుక్రాంత్కు వ్యతిరేకంగా ఉన్న వర్గాన్ని కూడగట్టి పార్టీ నేతలను విడగొట్టేలా తన కోవర్టును ఉపయోగించాడు. అనుకున్నట్లే కోవర్టు ద్వారా మనుక్రాంత్ను దెబ్బతీశాడు. జిల్లాలో ‘గ్లాసు’ను పట్టించుకోకుండా చేసి నారాయణ తన పంతం నెగ్గించుకున్నాడు. -
నారాయణ ‘నల్ల’ పుట్ట!
సాక్షి, అమరావతి: ఒక్క దెబ్బకు రెండు పిట్టలు..! ఇటు పన్నుల ఎగవేత అటు నల్లధనం చేరవేత! ఇవన్నీ నారాయణ విద్యాసంస్థల అధినేత, మాజీ మంత్రి పొంగూరు నారాయణ అవినీతి పొంగులు! అవినీతికి తెగబడి పోగేసిన నల్లధనాన్ని తరలించేందుకు ఆయన ఏకంగా ‘ఎన్స్పై’ అనే కంపెనీనే ఏర్పాటు చేసుకోవడం గమనార్హం. తన కుమార్తె పొంగూరు సింధూర, అల్లుడు పునీత్ కొత్తప్ప డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్న ‘ఎన్స్పై’ ద్వారా టీడీపీ హయాంలో నారాయణ భూ దోపిడీకి పాల్పడ్డారు. మరోవైపు ఎన్స్పైరా ద్వారా కొనుగోలు చేసిన స్కూలు బస్సులను నారాయణ విద్యా సంస్థలు కొనుగోలు చేసినట్లు రవాణా శాఖకు తప్పుడు లెక్కలు చూపించి పన్ను రాయితీలు పొందారు. నారాయణ విద్యా సంస్థల ద్వారా నల్లధనం తరలింపు, అక్రమ రాయితీలకు ఎన్స్పైరను వాడుకున్నట్లు సోమవారం నెల్లూరులో ఏపీ డైరెక్ట్రేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (ఏపీఎస్ డీఆర్ఐ) నిర్వహించిన సోదాల్లో వెల్లడైంది. ఎన్స్పై నిర్వాకాలు ఇవిగో.. నిధులు మళ్లించేందుకే.. నారాయణ విద్యా సంస్థలకు మౌలిక వసతుల కల్పన, ఉద్యోగులకు జీతాల చెల్లింపు పేరుతో ‘ఎన్స్పైర మేనేజ్మెంట్ సర్వీసెస్’ కంపెనీ ఏర్పాటైంది. అయితే ఆ ముసుగులో తమ అక్రమ ఆదాయాన్ని తరలించేందుకు నారాయణ దీన్ని వాడుకున్నట్లు వెలుగులోకి వచ్చింది. నారాయణ విద్యా సంస్థలకు అన్ని రకాల చెల్లింపులు నిర్వహిస్తున్నందుకు ఎన్స్పైరకు 10 శాతం కమిషన్ చెల్లిస్తున్నట్లు రికార్డుల్లో చూపిస్తూ ఇతర సంస్థల నుంచి భారీగా నిధులు మళ్లించారు. వివిధ సేవల పేరుతో నిధులు మళ్లించి అక్రమ ఆస్తులు సమకూర్చుకున్నారు. అమరావతి భూ దందా.. టీడీపీ హయాంలో రాజధాని ముసుగులో చంద్రబాబు, నారాయణ ద్వయం అమరావతిలో సాగించిన భూ దోపిడీకి ఎన్స్పైరను ప్రధాన సాధనంగా వాడుకున్నారు. అందుకోసం ఎన్స్పైరలో ఇతర కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టినట్లు చూపారు. ఒలంపస్ క్యాపిటల్ ఏసియా క్రెడిట్ అండ్ సీఎక్స్ పార్టనర్స్ మ్యాగజైన్ అనే కంపెనీ 2016లో ఏకంగా రూ.400 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు చూపడం గమనార్హం. 2018లో మోర్గాన్ స్టాన్లీ ప్రైవేట్ ఈక్విటీ ఏసియా, బన్యాన్ ట్రీ గ్రోత్ క్యాపిటల్ అనే సంస్థలు 75 మిలియన్ డాలర్లు (రూ.613.27 కోట్లు) పెట్టుబడి పెట్టినట్లు రికార్డుల్లో చూపారు. రెండు విడతల్లో ఎన్స్పైరలోకి రూ.1,013.27 కోట్లు వచ్చి చేరాయి. ఇలా భారీగా నల్లధనాన్ని ఎన్స్పైరలోకి మళ్లించినట్లు తెలుస్తోంది. అనంతరం నల్లధనాన్ని ఎన్స్పైర నుంచి రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేశారు. నారాయణ సమీప బంధువు కేవీపీ అంజనికుమార్ ఆ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్గా ఉండటం గమనార్హం. నారాయణ సిబ్బంది, మరి కొందరిని తమ బినామీలుగా మార్చుకుని రామకృష్ణ హౌసింగ్ బ్యాంకు ఖాతాల నుంచి వారి వ్యక్తిగత ఖాతాల్లోకి నిధులను మళ్లించారు. అనంతరం వారి ద్వారా ఆ నగదు డ్రా చేశారు. ఎలాంటి పరిహారం ఇవ్వకుండా అసైన్డ్ భూములను టీడీపీ సర్కారు తీసుకుంటుందని బడుగు, బలహీనవర్గాల రైతులను భయపెట్టారు. ఆ రైతుల అసైన్డ్ భూములను తమ బినామీలైన ఉద్యోగులు, ఇతరులకు అతి తక్కువకు విక్రయించేలా కథ నడిపించారు. నిబంధనలకు విరుద్ధంగా వందల ఎకరాల అసైన్డ్ భూములను బినామీల ద్వారా హస్తగతం చేసుకున్నారు. తర్వాత నారాయణ బినామీలే సీఆర్డీఏకు ఆ భూములను ఇచ్చినట్లు చూపించి వారికే భూసమీకరణ ప్యాకేజీ వచ్చేలా చేశారు. ఆ విధంగా 617.65 ఎకరాలకు గాను రూ.3,737 కోట్ల విలువైన భూసమీకరణ ప్యాకేజీ స్థలాలను పొందారు. అక్రమంగా బస్సుల కొనుగోలు రాయితీ నెల్లూరు కేంద్రంగా నెలకొల్పిన ఎన్స్పైర కార్యకలాపాలన్నీ హైదరాబాద్ కేంద్రంగానే సాగుతున్నాయి. ఎన్స్పైర రూ.20.80 కోట్లతో హైదరాబాద్లో 92 బస్సులను కొనుగోలు చేసి నారాయణ విద్యా సంస్థలకు లీజుకు ఇచ్చినట్టు రికార్డుల్లో చూపించారు. నారాయణ విద్యా సంస్థలు అందుకు ప్రతి నెల అద్దె చెల్లిస్తున్నట్టు పేర్కొన్నారు. రవాణా శాఖకు సమర్పించిన రికార్డుల్లో మాత్రం ఆ 92 బస్సులను నారాయణ విద్యా సంస్థలే కొనుగోలు చేసినట్టు చూపడం గమనార్హం. తద్వారా విద్యా సంస్థల కోటాలో భారీగా పన్ను రాయితీ పొందారు. ఓ వ్యాపార సంస్థ ఎన్స్పైర కొనుగోలు చేసిన బస్సులను విద్యా సంస్థ కోసం కొనుగోలు చేసినట్టు తప్పుడు వివరాలు సమర్పించి అడ్డదారిలో పన్ను రాయితీలు పొందారు. ఎన్స్పైరకు ప్రతి నెల 92 బస్సులకు సంబంధించి అద్దె చెల్లిస్తున్నట్టు చూపిస్తూ కంపెనీలోకి నల్లధనాన్ని తరలిస్తున్నారు. అంతేకాకుండా నారాయణ విద్యా సంస్థలకు వివిధ సేవలు అందిస్తున్నట్టు పేర్కొంటూ ఎన్స్పైర బ్యాంకు ఖాతాల్లోకి భారీగా నిధులు మళ్లిస్తున్నారు. నారాయణ నల్లధనాన్ని తరలించేందుకు ఎన్స్పైరను వాడుకుంటున్నారు. సోమవారం నెల్లూరులో ఎన్స్పైరతో సంబంధం ఉన్నవారి నివాసాల్లో నిర్వహించిన సోదాల్లో అధికారులు రూ.1.81 కోట్లు నగదు స్వాదీనం చేసుకున్నారు. ఆ కంపెనీ వ్యవహారాలను పూర్తి స్థాయిలో పరిశీలిస్తే భారీగా నల్లధనం వెలుగులోకి రావడం ఖాయమని డీఆర్ఐ వర్గాలు పేర్కొంటున్నాయి. రూ.10 కోట్ల పన్నుల ఎగవేత లెక్క చూపని రూ.1.81 కోట్లు, కీలక పత్రాలు స్వాదీనం సాక్షి ప్రతినిధి, నెల్లూరు: విద్యా సంస్థల వాహనాలకు పన్ను రాయితీ ఉంటుంది. దీంతో వాహనాలు ఎన్స్పై ద్వారా కొనుగోలు చేసినప్పటికీ నారాయణ విద్యాసంస్థలు కొనుగోలు చేసినట్లు రవాణా శాఖకు తప్పుడు సమాచారం ఇచ్చి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కింద రూ.4.48 కోట్లు జీఎస్టీ రిటర్న్ల రూపంలో పొందారు. ఈ మోసాన్ని గుర్తించిన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ విభాగం రవాణా శాఖ కమిషనర్కు ఫిర్యాదు చేసింది. రూ.10.23 కోట్ల పన్ను చెల్లించాల్సి ఉండగా రూ.22.35 లక్షలు మాత్రమే చెల్లించినట్లు గుర్తించారు. దీనిపై నెల్లూరు బాలాజీనగర్ పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు సోమవారం నారాయణ విద్యా సంస్థలతో పాటు అనుబంధ సంస్థల్లో విస్తృత తనిఖీలు చేపట్టి పలు కీలక పత్రాలు స్వాదీనం చేసుకున్నారు. లెక్కల్లో చూపని రూ.1.81 కోట్ల నగదును ఆదాయపన్ను శాఖకు అప్పగించనున్నట్లు ఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి వెల్లడించారు. ఈ వ్యవహారంపై నారాయణ డైరెక్టర్ పునీత్పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
మాజీ మంత్రి పొంగూరు నారాయణ నివాసంలో పోలీసుల తనిఖీలు
-
టీడీపీ నేత నారాయణపై పొంగూరు ప్రియ ఫైర్
-
మళ్ళీ వెలుగులోకి టీడీపీ నారాయణ బండారం.. మరదలు ప్రియా షాకింగ్ నిజాలు
-
మాజీ మంత్రి నారాయణ ఉమనైజర్.. పొంగూరు ప్రియ సంచలన వ్యాఖ్యలు
-
మాజీ మంత్రి నారాయణ ఉమనైజర్.. పొంగూరు ప్రియ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి: నారాయణ ఒక ఉమనైజర్.. అతడిని ఎవరు నమ్మొద్దంటూ మాజీ మంత్రి నారాయణపై ఆయన మరదలు పొంగూరు ప్రియ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. క్యాన్సర్తో బాధపడుతున్నా.. నేను చాలా ఆవేదనతో ఈ వీడియో పెడుతున్నాననంటూ సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేశారు. సొంత కుటుంబ సభ్యులనే వేధిస్తున్న మాజీ మంత్రి నారాయణను నెల్లూరు ప్రజలు నమ్మి దయచేసి మోసపోవద్దు. ఇంట్లో ఆడవాళ్లని వేధిస్తూ టార్చర్కు గురిచేసే నారాయణ ప్రజలకు ఏం చేస్తాడంటూ ప్రియ ప్రశ్నించారు. పెళ్లయిన రెండో రోజు నుంచే బావ నారాయణ లైంగిక వేధింపులు మొదలుపెట్టాడని.. ఆయనకు లొంగకపోవడంతో 29 ఏళ్లుగా ఆయన పెట్టే బాధలు భరిస్తున్నానని.. ఆయన స్త్రీలోలుడు. నారాయణ విద్యా సంస్థల్లో పనిచేసే కొందరు మహిళలు ఆయన దగ్గరకు వెళ్లాల్సిందే. సోదరి వరుసైన వారు స్నానం చేస్తున్నప్పుడు బాత్రూమ్లోకి తొంగి చూసేవాడు. ఈ విషయం మొదట్లో వాళ్ల వాళ్లే చెప్పారు. తాను లొంగకపోవడంతో వేధింపులు ప్రారంభించాడని గతంలో కూడా ఆమె ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఆమె రాయదుర్గం పోలీస్స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసింది. ఇదీ చదవండి: ‘గ్లాసు’కు రేటు కట్టిన మాజీ మంత్రి నారాయణ -
‘గ్లాసు’కు రేటు కట్టిన మాజీ మంత్రి నారాయణ
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జిల్లాలో రాజకీయ సమీకరణలు ఊపందుకున్నాయి. ఇప్పటికే టీడీపీ – జనసేన పార్టీలు పొత్తు కుదుర్చుకుని రానున్న ఎన్నికల్లో పోటీ చేసేలా ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఈ రెండు పార్టీల పొత్తు నేపథ్యంలో జిల్లాలో జనసేనకు ఏ సీటు కేటాయిస్తారనే దానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. కాగా జనసేన నేతలు మాత్రం నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే ఆలోచనతో సీటు కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే టీడీపీ నుంచి మాజీ మంత్రి పొంగూరు నారాయణ నెల్లూరు సిటీ నియోజకవర్గంలో పోటీ చేసేందుకు సిద్ధమైన నేపథ్యంలో ఆ స్థానాన్ని వదులుకుంటే ‘గ్లాసు’ నేతలకు బంపర్ ఆఫర్ ఇస్తానని ప్రకటించినట్లు ప్రచారం ఉంది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో టీడీపీ – జనసేన పార్టీల మధ్య పొత్తు కుంపటి రగులుతోంది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు ఖరారు కావడంతో ఆ రెండు పార్టీలు కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ క్రమంలో నూతన జిల్లాలో జనసేన పార్టీ స్థానం ఎక్కడనేది ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. జనసేన మాత్రం నెల్లూరు నగర నియోజకవర్గం వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నెల్లూరు నగర నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నట్లు మాజీ మంత్రి పొంగూరు నారాయణ ప్రచారం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే టీడీపీ – జనసేన పొత్తులో భాగంగా నారాయణకు ఎసరు పెట్టే అవకాశం ఉండడంతో సీటు కోసం గ్లాసుకు ఖరీదు కట్టినట్లు రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. నెల్లూరు నగర సీటు వదులుకుంటే జనసేనకు బంపర్ ఆఫర్ ఇస్తానని ప్యాకేజీ ప్రకటించినట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. ‘ఉనికి’పాట్లు ప్రస్తుతం జిల్లాలో అటు తెలుగుదేశం, ఇటు జనసేన పార్టీలు ఉనికి కోసం పోరాడుతున్నాయి. జిల్లాలోని ఏ నియోజకవర్గంలోనూ ఆ రెండు పార్టీలకు ప్రస్తుతం ఆశించిన స్థాయిలో ప్రజల మద్దతు లేకపోవడం గమనార్హం. 2019 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో ఒక్క సీటు కూడా గెలుచుకోలేక పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన తెలుగుదేశం పార్టీ.. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తన ఉనికిని కాపాడుకునేందుకు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య కుదిరిన పొత్తు ద్వారా బలం పెంచుకోవాలని భావిస్తోంది. అయితే ఈ రెండు పార్టీల పొత్తు జిల్లాలో వికటించే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రధానంగా ఏ నియోజకవర్గాన్ని జనసేన పార్టీకి కేటాయిస్తారనే అంశంపై స్పష్టత లేనప్పటికీ జిల్లాలో జనసేనకు సీటు కావాలని ఆ పార్టీ నేతలు పట్టుబడుతున్నట్లు సమాచారం. సీటు వదులుకుంటే బంపర్ ఆఫర్ ప్రస్తుతం జనసేన నేతలు నెల్లూరు నగర నియోజకవర్గం సీటు కావాలని పట్టుబడుతున్నట్లు ప్రచారం ఉండగా, నాదెండ్ల మనోహర్ ద్వారా నగర సీటు కోసం విశ్వప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో నెల్లూరు నగర సీటు జనసేనకు కేటాయించే పరిస్థితి వస్తే మాజీ మంత్రి నారాయణను ఒప్పించే ప్రయత్నం చేయాలి. ఇప్పటికే నెల్లూరు నగర నియోజకవర్గంలో పోటీ చేస్తానంటూ ప్రకటించుకున్న నారాయణ తన సొంత ఎన్నికల టీంను రంగంలోకి దింపి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఉన్న పళంగా సీటు జనసేనకు కేటాయిస్తే తన పరువు పోతుందని భావించి జనసేనకు బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం ఉంది. జిల్లాలో నెల్లూరు నగర సీటు తప్పించి ఏ సీటు అడిగినా టీడీపీ అధినేత చంద్రబాబును ఒప్పించడమే కాకుండా జనసేన అభ్యర్థికి అయ్యే ఎన్నికల ఖర్చు మొత్తం తానే చూసుకుంటాననడంతోపాటు జనసేన నేతలకు మరో ప్రత్యేక ప్యాకేజీ కూడా ఆఫర్ చేశారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో జనసేన నేతలు ప్యాకేజీ ఆఫర్తో పునరాలోచనలో పడ్డట్లు సమాచారం. నెల్లూరు నగరం సీటు కాకుంటే నెల్లూరు రూరల్ సీటుపై దృష్టిపెడుతున్నట్లు కూడా మరో ప్రచారం ఉంది. నెల్లూరు రూరల్ సీటు ఆశిస్తే తప్పక టీడీపీ అధినేతను ఒప్పించి, ఎన్నికల ఖర్చు, ప్యాకేజీ కూడా ఇప్పించేందుకు మాజీ మంత్రి నారాయణ తెర వెనుక ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లు ప్రచారం ఉంది. మరి జనసేనకు ప్యాకేజీ ఆఫర్ ఎంత మేర పనిచేస్తుందో వేచి చూడాలి. జిల్లాల పునర్విభజన తరువాత జిల్లా 8 (నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, ఆత్మకూరు, కోవూరు, సర్వేపల్లి, ఉదయగిరి, కావలి, కందుకూరు) నియోజకవర్గాలకు పరిమితమైంది. ఈ నియోజకవర్గాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో జనసేనకు పెద్దగా ఆదరణ లేదు. పైగా ఆయా నియోజకవర్గాల్లో ఆ పార్టీకి అభ్యర్థులు కూడా ప్రస్తుతం లేరు. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మనుక్రాంత్రెడ్డి ప్రస్తుతం కొనసాగుతున్నారు. జనసేన పార్టీలో క్రియాశీలకంగా ఉన్న నాదెండ్ల మనోహర్తో ఉన్న అనుబంధం, పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న నేపథ్యంలో టీడీపీ పొత్తుతో నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి మనుక్రాంత్రెడ్డి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. -
ఇదేమి పని ‘నారాయణా’
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నారాయణ విద్యా సంస్థల ఉద్యోగులు, ఉపాధ్యాయులు టీడీపీ ఎన్నికల ఉచ్చులో ఇరుక్కున్నారు. తమ విద్యాసంస్థల అధినేత, టీడీపీకి చెందిన మాజీ మంత్రి పొంగూరు నారాయణ రాజకీయంలో సమిధలైపోతున్నారు. వారి చేత నారాయణ ఓటర్ల వెరిఫికేషన్ పేరుతో ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఇలా వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్న నారాయణ సిబ్బంది, ఉపాధ్యాయులకు ప్రజలు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగిస్తున్నారు. మూడురోజుల క్రితమే నెల్లూరు నగరం మూలాపేట డివిజన్లో ఓటర్ల వెరిఫికేషన్ పేరుతో వ్యక్తిగత సమాచారం సేకరిస్తున్న నారాయణ సంస్థ ఉద్యోగినికి స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. తాజాగా మంగళవారం నగరంలోనే 42వ డివిజన్ మన్సూర్నగర్లో ఇదే తరహాలో నారాయణ విద్యా సంస్థల ఉపాధ్యాయుడు ఓటర్ల వెరిఫికేషన్ పేరుతో వ్యక్తిగత సమాచారం సేకరిస్తుండగా స్థానికులు ఆగ్రహించి అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఎన్ టీంగా ఏర్పాటు నారాయణ టీడీపీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన ఆయన 2024 ఎన్నికల్లో నెల్లూరు నుంచి మరోసారి బరిలోకి దిగేందుకు సమాయత్తం అవుతున్నారు. నాలుగున్నరేళ్ల పాటు నెల్లూరుకు ముఖం చాటేసిన ఆయనపై టీడీపీ కేడర్లో తీవ్ర అసంతృప్తి ఉంది. ఆయన కోసం పనిచేయడానికి టీడీపీ నేతలెవరూ ముందుకు రావడంలేదు. దీంతో తన విద్యా సంస్థల ఉద్యోగులు, ఉపాధ్యాయులను రంగంలోకి దింపుతున్నారు. దాదాపు 150 మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులతో నారాయణ టీం (ఎన్ టీం)గా ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఆ బృందంలోని వారితో నెల్లూరు నగరంలో ఓటర్ల వెరిఫికేషన్ పేరుతో ప్రజల వ్యక్తిగత సమాచారం తీసుకుంటున్నారు. ప్రతి ఇంటికీ వెళ్లి ఓటర్ల ఆధార్ కార్డులు, బ్యాంకు ఖాతా సమాచారం, వారి మొబైల్కు వచ్చే ఓటీపీని కూడా అడుగుతుండడంతో స్థానికుల్లో ఆందోళన ఏర్పడింది. తమ ఓట్లు తొలగిస్తారని స్థానికులు వారిని అడ్డుకుంటున్నారు. నెల్లూరు నగరంలో మూడు రోజుల్లోనే ఇద్దరు ఉపాధ్యాయులు దేహశుద్ధి చేయించుకొన్నారు. ఇదేం ఖర్మ నారాయణా.. అంటున్న ఉద్యోగులు నారాయణ విద్యా సంస్థల్లో అధ్యాపకులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులుగా అనేక మంది పనిచేస్తున్నారు. 2014 ఎన్నికల వరకు నారాయణ టీడీపీకి ఆర్థికంగా తోడ్పాటు అందిçస్తూ ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు బినామీగా వ్యవహరించేవారు. 2014లో టీడీపీ అధికారంలోకి రావడంతో నారాయణను చంద్రబాబు ఎమ్మెల్సీగా చేసి మంత్రి పదవి ఇచ్చారు. 2019 ఎన్నికల్లో నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి నారాయణ సంస్థల ఉద్యోగులు, ఉపాధ్యాయులను రాజకీయ ఉచ్చులోకి దింపుతున్నారు. ఒకవేళ ఎవరైనా నిరాకరిస్తే ఏదో ఒక సాకుతో ఉద్యోగం నుంచి తొలగించడం.. లేదా దూర ప్రాంతాలకు బదిలీ చేయడం చేస్తున్నట్లు ఓ ఉద్యోగి వెల్లడించారు. ఇప్పుడు ఉద్యోగులు ప్రజల చేతిలో తన్నులు తింటున్నారు. మాకు ఇదేం ఖర్మ అంటూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
మాజీ మంత్రి నారాయణ గుట్టుమట్లు నాకు తెలుసు.. : పొంగూరి ప్రియ
సాక్షి, అమరావతి: ఏపీ సీఐడీకి విజ్ఞప్తులు చేస్తూ మాజీ మంత్రి పొంగూరు నారాయణ మరదలు పొంగూరు ప్రియ శనివారం మీడియాకు విడుదల చేసిన వీడియోలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సోమవారం జరిగే విచారణలో నారాయణ ఏమీ తెలియదని, గుర్తులేదని చెప్పే అవకాశం ఉందని.. కానీ నారాయణకు అన్నీ తెలుసని ఆమె ఆ వీడియోలో పేర్కొన్నారు. ఎక్కడెక్కడ బినామీల పేరిట ఆయనకు స్థలాలు ఉన్నాయో తనకు తెలుసునన్నారు. ఈ కేసులో భాగంగా తనను కూడా విచారించాలని.. అలా చేస్తే దర్యాప్తునకు సహాయం చేసినట్టవుతుందన్నారు. ఈ మేరకు సీఐడీకి విజ్ఞప్తి చేస్తున్నా అన్నారు. నారాయణ కేసు విచారణలో ఇన్నర్ రింగ్ రోడ్డు దగ్గర తన స్థలం ఆయనకు గుర్తు ఉందన్నారు. ‘మీ విచారణలో మాత్రం ఆయనకు ఇవేమీ గుర్తు రావు. కాబట్టి మీ ఎంక్వైరీలో నన్ను కూడా విచారిస్తే అన్ని విషయాలు చెబుతా. ఒక పర్సన్ వల్ల తీగలాగితే డొంక కదులుతుంది. రింగ్ రోడ్ భూముల విషయంలో ఆయన ఏమేం చేశారో మీకు తెలుస్తుంది. ఆ పర్సన్ ఎవరో ఎంక్వైరీలో మీకు నేను చెబుతాను. ఒక రకంగా ఈ సమాచారం దర్యాప్తులో మీకు హెల్ప్ అవుతుంది’ అని ఆ వీడియోలో పొంగూరి ప్రియ పేర్కొన్నారు. -
Oct 4th 2023 : చంద్రబాబు కేసు అప్డేట్స్
LIVE : Chandrababu Remand In Rajamaundry Central Prison, Cases Scams, Political Comments And Court Hearings Ground updates 07:28 PM, అక్టోబర్ 04, 2023 ఫైబర్ నెట్ స్కాంలో బాబు ముందస్తు బెయిల్పై విచారణ రేపటికి వాయిదా రేపు ఉదయం 10:30 గంటలకు వాదనలు వింటామన్న హైకోర్టు 05:44 PM, అక్టోబర్ 04, 2023 ఏబీఎన్, టీవీ-5 తీరుపై ఏఏజీ పొన్నవోలు సుధాకర్రెడ్డి తీవ్ర ఆగ్రహం ►ఏబీఎన్, టీవీ-5లో కోర్టు వాదనలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ►ఏబీఎన్, టీవీ-5 దిగజారి ప్రవర్తిస్తున్నాయి ►ఏబీఎన్, టీవీ-5 దుర్మార్గంగా ప్రచారం చేస్తున్నాయి ►పచ్చి అబద్ధాలను ప్రసారం చేస్తున్నారు ►కోర్టు నా వాదనలకు అడ్డుపడినట్టు ప్రసారం చేశారు ►కోర్టు నన్ను తిట్టినట్టుగా ప్రచారం చేస్తున్నారు ►బుట్టలో వేసుకో.. పడకపోతే బురద చల్లు.. ఇదే విధానాలతో ఏబీఎన్,టీవీ-5 ఛానెళ్లు నడుస్తున్నాయి ►ప్రభుత్వం తరఫున నేను నా బాధ్యతలు నిర్వర్తిస్తున్నా ►నాపై ఇష్టమొచ్చినట్లు దుష్ప్రచారం చేస్తున్నారు. 05:07 PM, అక్టోబర్ 04, 2023 స్కిల్ స్కామ్లో చంద్రబాబు బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా ►విచారణ రేపటికి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు ►రేపు ఉదయం 11 గంటలకు తిరిగి విచారించనున్న కోర్టు 04:05 PM, అక్టోబర్ 04, 2023 ఏసీబీ కోర్టు: సీఐడీ తరఫున ఏఏజీ పొన్నవోలు వాదనలు ►సీమెన్స్ కంపెనీ పేరుతో స్కిల్ స్కామ్కు పాల్పడ్డారు ►కేబినెట్ ఆమోదంతో ఎంవోయూ జరిగిందనడం అవాస్తవం ►చంద్రబాబు మాజీ పీఏ శ్రీనివాస్ విదేశాలకు పారిపోయారు ►శ్రీనివాస్ పాస్పోర్ట్ సీజ్ చేసేలా కోర్టు ఆదేశాలివ్వాలి 03:47 PM, అక్టోబర్ 04, 2023 ఏపీ హైకోర్టులో ఫైబర్ నెట్ స్కాం కేసు విచారణ ►చంద్రబాబు ముందస్తు బెయిల్పై హైకోర్టులో విచారణ ►సీఐడీ తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు ►చంద్రబాబు తరఫున సిద్ధార్థ్ అగర్వాల్ వాదనలు 03:39 PM, అక్టోబర్ 04, 2023 ►స్కిల్ స్కాంలో లోకేష్ ముందస్తు బెయిల్పై విచారణ వాయిదా ►ఈ నెల 12కు వాయిదా వేసిన హైకోర్టు 03:03 PM, అక్టోబర్ 04, 2023 సీఐడీ తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు ►స్కిల్ స్కాం కేసు దర్యాప్తు కీలక దశలో ఉంది: ఏఏజీ ►చంద్రబాబు బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేయాలి ►చంద్రబాబుకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారు ►శ్రీనివాస్, మనోజ్ విదేశాలకు పారిపోవడం వెనుక బాబు హస్తం ఉంది ►స్కిల్ స్కాంలో రూ.371 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం ►డొల్ల కంపెనీల పేరుతో నిధులు దోచుకున్నారు ►2017లోనే పన్నుల ఎగవేతపై జీఎస్టీ హెచ్చరించింది ►సీబీఐ విచారణ చేయాలని జీఎస్టీ కోరింది ►ఈ కేసు కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణలో ఉండగానే 2018లో 17ఏ సవరణ జరిగింది ►ఈ కేసులో చంద్రబాబుకు 17ఏ వర్తించదు ►స్కిల్ స్కాంలో అన్ని ఆధారాలు కోర్టు ముందు ఉంచాం ►బాబు పాత్ర ఉందని సీఐడీ గుర్తించిన వివరాలు పరిశీలించాలి ►స్కిల్ స్కాం కేసు.. ఇదేమీ ఫిక్షన్ స్టోరీ కాదు ►ఆధారాలున్నాయి కాబట్టే బాబును కస్టడీ కోరుతున్నాం ►జీవో నం.4 కంటే ముందే సీమెన్స్ సంస్థతో ఎంవోయూ ►సీమెన్స్తో ఎంవోయూను జీవో నం.4లో ఎందుకు చూపలేదు 02:54 PM, అక్టోబర్ 04, 2023 ►చంద్రబాబు బెయిల్ పిటిషన్పై ఏసీబీ కోర్టులో విచారణ ►సీఐడీ తరఫున వాదనలు ప్రారంభించిన ఏఏజీ పొన్నవోలు సుధాకర్రెడ్డి 01:30 PM, అక్టోబర్ 04, 2023 చంద్రబాబు బెయిల్ పిటీషన్ పై లంచ్ బ్రేక్ ►చంద్రబాబు తరపున వాదనలు పూర్తి ►మధ్యాహ్నం 2.30 గంటలకి మొదలు కానున్న సీఐడీ వాదనలు ►కండీషన్ బెయిలయినా ఇవ్వాలని చంద్రబాబు తరపు న్యాయవాది ప్రమోద్ కుమార్ దూబే విజ్ఞప్తి ►చంద్రబాబు పీఏ పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ పార్ధసాని విదేశాలకి పారిపోవడానికి చంద్రబాబుకి సంబందం లేదంటూ వాదనలు ►సీఐడీ తరపున వాదనలు వినిపించనున్న ఏఏజీ పొన్నవోలు సుధాకర్రెడ్డి 01:26 PM, అక్టోబర్ 04, 2023 నారా ఫ్యామిలీకి పరామర్శలు ►రాజమండ్రి : భువనేశ్వరి, బ్రాహ్మణిని పరామర్శించిన మాజీ ఎంపీ హర్షకుమార్ ► భువనేశ్వరిని పరామర్శించిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు 01:21 PM, అక్టోబర్ 04, 2023 అక్టోబర్ 10 వరకు ఢిల్లీలోనే లోకేష్ ►చంద్రబాబు అరెస్ట్ తర్వాత 21 రోజులుగా ఢిల్లీలోనే ఉన్న నారా లోకేష్ ►ఈ నెల 9 న సుప్రీం కోర్టులో చంద్రబాబు పిటిషన్ పై విచారణ ►అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సీఐడీ విచారణ ఈ నెల 10కి వాయిదా ►అప్పటి వరకు ఢిల్లీలోనే ఉండనున్న లోకేష్ 01:15 PM, అక్టోబర్ 04, 2023 చంద్రబాబు లాయర్ సుదీర్ఘ వాదనలు ►బెయిల్, కస్టడీ పిటిషన్లపై వాదనలు వినిపిస్తున్న ప్రమోద్ కుమార్ దూబే ► స్కిల్ కేసులో చంద్రబాబు వైపు ఎలాంటి తప్పిదాలు లేవు ►అప్పటి ఆర్ధికశాఖ ఉన్నతాధికారి సునీత గుజరాత్ వెళ్లి అధ్యయనం చేశారు ►సునీత అధ్యయనం చేసి సీమెన్స్ ప్రాజెక్టుకు ఎలాంటి అభ్యంతరం తెలపలేదు ► ఎలాంటి అభ్యంతరం లేకుండా ఆమోదం పొందిందన్న ఆధారాలు ఉన్నాయి ► కాస్ట్ ఎవాల్యుయేషన్ కమిటీ స్కిల్ ప్రాజెక్టు ఎక్విప్మెంట్ ధరను నిర్ధారించింది ► కాస్ట్ ఎవాల్యుయేషన్ కమిటీలో చంద్రబాబు లేరు ► కమిటీలో ఉన్న భాస్కరరావు ప్రస్తుతం మధ్యంతర బెయిల్ పై ఉన్నారు ► సుప్రీంకోర్టు నవంబర్ 16 వరకు మధ్యంతర బెయిల్ ను పొడిగించింది ► చంద్రబాబుకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా అరెస్టు చేశారు ► చంద్రబాబును అరెస్టు చేసిన తర్వాత విచారణ చేపట్టారు ► ఆ తర్వాత రెండు రోజుల కస్టడీలోనూ విచారణ చేపట్టారు ► ఇప్పుడు మళ్లీ కస్టడీ కావాలంటున్నారు..అవసరం ఏముంది? ► కేబినెట్ ఆమోదం పొందాకే సీమెన్స్ ప్రాజెక్టు అమల్లోకి వచ్చింది ►కేబినెట్ నిర్ణయంపై చంద్రబాబుపై కేసు ఎలా పెడతారు?:న్యాయవాది దూబే 01:00 PM, అక్టోబర్ 04, 2023 విజయవాడ: ఏసీబీ కోర్టులో కొనసాగుతోన్న వాదనలు ►స్కిల్ కుంభకోణం కేసులో సీఐడీ అభియోగాల్ని ప్రస్తావిస్తున్న బాబు లాయర్ దూబే ►ఉమ్మడి ఏపీలో ఓ భూ వివాదానికి సంబంధించి అప్పటి సీఎం రోశయ్య విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుని కోర్టు దృష్టికి తెచ్చిన దూబే ►క్యాబినెట్ నిర్ణయంలో ముఖ్యమంత్రులను తప్పు పట్టడం సరికాదన్న వివిధ కోర్టుల తీర్పులను ఉదహరించిన దూబే ►సీమెన్స్ ఒప్పందంపై చంద్రబాబు సంతకం చేయలేదు ►సంతకం చేసిన ఘంటా సుబ్బారావు బెయిల్ మీద ఉన్నారు ►కొన్ని ఫైళ్లు మిస్ చేశారంటూ సీఐడీ అభియోగాలు మోపింది 12:53 AM, అక్టోబర్ 04, 2023 ఏసీబీ కోర్టుకు చేరుకున్న ఏఏజీ సుధాకర్ రెడ్డి ► చంద్రబాబు పిటిషన్ విచారణ.. అడిషినల్ అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్రెడ్డి కోర్టుకు చేరుకున్నారు ► ప్రస్తుతం బెయిల్ పిటిషన్పై కొనసాగుతున్న వాదనలు ►వాదనలు వినిపిస్తున్న బాబు లాయర్ దూబే 12:18 AM, అక్టోబర్ 04, 2023 చంద్రబాబు న్యాయవాది దూబే వాదనలు ►చంద్రబాబు పిటిషన్లపై ఏసీబీ కోర్టులో కొనసాగుతోన్న విచారణ ►బెయిల్ పిటిషన్పై వాదనలు వివిపిస్తున్న బాబు లాయర్ ప్రమోద్కుమార్ దూబే ►స్కిల్ కుంభకోణం కేసులో చంద్రబాబు వైపు ఎలాంటి తప్పిదాలు లేవు ►అప్పటి ఆర్థిక శాఖ ఉన్నతాధికారి కే. సునీత గుజరాత్ వెళ్లి అధ్యయనం చేశారు ►సునీత అధ్యయనం చేసి.. సీమెన్స్ ప్రాజెక్టుకు ఎలాంటి అభ్యంతరాలు చెప్పలేదు ►సీమెన్స్ ప్రాజెక్టుకు ఎలాంటి అభ్యంతరం లేకుండా ఆమోదం పొందిందన్న విషయమై ఆధారాలు ఉన్నాయి. ►కాస్ట్ ఎవాల్యూయేషన్ కమిటీ స్కిల్ ప్రాజెక్టు ఎక్విప్మెంటు ధరను నిర్దారించింది ►ఆ కమిటీలో చంద్రబాబు లేరు ►ఆ కమిటీలో ఉన్న భాస్కరరావు ప్రస్తుతం మధ్యంతర బెయిల్ మీద ఉన్నారు ►అతనికి సుప్రీం కోర్టు నవంబర్ 16వరకు మధ్యంతర బెయిలును పొడిగించింది ►చంద్రబాబుకు ఎలాంటి నోటీసివ్వకుండా అరెస్ట్ చేశారు ►అరెస్ట్ చేసిన తర్వాత విచారణ చేపట్టారు ►ఆ తర్వాత రెండు రోజుల కస్టడీలోనూ విచారణ చేపట్టారు ►ఇప్పుడు మళ్లీ కస్టడీ కావాలంటున్నారు.. అవసరం ఏముంది? ►కేబినెట్ ఆమోదం పొందిన తర్వాతే సీమెన్స్ ప్రాజెక్టు అమల్లోకి వచ్చింది ►కేబినెట్ నిర్ణయంపై చంద్రబాబు మీద కేసు ఎలా పెడతారు? 12:00 AM, అక్టోబర్ 04, 2023 పవన్కు పోలీసుల నోటీసులు ►జనసేన అధినేత పవన్ కల్యాణ్కు కృష్ణా జిల్లా పోలీసులు నోటీసులు పంపారు ►రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసినందుకు పవన్ కు నోటీసులు ►పెడన బహిరంగ సభలో గొడవలు జరుగుతాయన్న పవన్ ►నోటీసులపై వివరణ ఇచ్చిన ఎస్పీ జాషువా ►మీరు తిరగబడి కాళ్ళు చేతులు కట్టేయండంటూ పార్టీ శ్రేణులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన పవన్ ►రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసినందుకు పవన్ కు నోటీసులిచ్చాం ►నోటీస్లకు ఇంత వరకు సమాధానం ఇవ్వలేదు ►మాకు పవన్ కళ్యాణ్ కంటే నిఘా వ్యవస్థ బలంగా వుంది ►మీకు తెలిసిన సంచారం వుంటే మాకు తెలియపరచండని పవన్ ను కోరాం ►300 పైగా సిబ్బందితో సెక్యూరిటీని ఏర్పాటు చేశాం 11:50 AM, అక్టోబర్ 04, 2023 చంద్రబాబు పిటిషన్పై మొదలైన వాదనలు ►చంద్రబాబు కేసులో ఏసీబీ కోర్టులో ప్రారంభమైన వాదనలు ►బెయిల్ పిటిషన్తో పాటు కస్టడీ, పీటీ వారెంట్ పిటిషన్లపైనా వాదనలు విననున్న ఏసీబీ జడ్జి ►వాదనలు వినిపిస్తున్న బాబు తరపు లాయర్ ప్రమోద్కుమార్ దుబే ►అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు రాకుండానే ప్రారంభమైన విచారణ ► జడ్జి సూచన మేరకు.. వాదనలు నోటు చేసుకుంటున్న సీఐడీ తరపు లాయర్లు 11:45 AM, అక్టోబర్ 04, 2023 హైకోర్టులో నారాయణ పిటిషన్ విచారణ వాయిదా ►మాజీ మంత్రి నారాయణ క్వాష్ పిటిషన్పై హైకోర్టులో విచారణ ►ఇన్నర్ రింగ్రోడ్డు కేసులో ఏ2గా నారాయణ ► విచారణకు రావాలంటూ ఇటీవలె సీఐడీ నోటీసులు ►అనారోగ్య కారణాల రీత్యా ఇంటివద్దే విచారించేలా ఆదేశించాలని హైకోర్టులో నారాయణ పిటిషన్ ►ఆ పిటిషన్పై నేడు విచారణ చేపట్టిన హైకోర్టు ►నారాయణ పిటిషన్ విచారణ నుంచి తప్పుకున్న న్యాయమూర్తి ►క్వాష్ పిటిషన్ను మరో బెంచ్కు బదిలీ చేయాలన్న న్యాయమూర్తి ►విచారణ ఎల్లుండికి వాయిదా 11:15 AM, అక్టోబర్ 04, 2023 ఏసీబీ కోర్టుకు స్పెషల్ జీపీ వివేకానంద ►ఏసీబీ కోర్టుకు హాజరైన సీఐడీ తరపు న్యాయవాది స్పెషల్ జీపీ(గవర్నమెంట్ ప్లీడర్) వివేకానంద ►మరికాసేపట్లో చంద్రబాబు పిటిషన్లపై విచారణ ►చంద్రబాబు కస్టడీ పిటిషన్తో పాటు ఫైబర్ నెట్, ఐఆర్ఆర్(రింగ్రోడ్డు కేసు) పీటీ వారెంట్లపైనా వాదనలు వినిపించనున్న జీపీ వివేకానంద ► తొలుత కొనసాగనున్న చంద్రబాబు తరపు లాయర్ల వాదనలు 11:05 AM, అక్టోబర్ 04, 2023 ఆ రెండు పిటిషన్లతో పాటు పీటీ వారెంట్లపైనా ►చంద్రబాబు బెయిల్ పిటిషన్పై వాదనలు వినాల్సిందిగా ఏసీబీ న్యాయస్ధానాన్ని కోరిన చంద్రబాబు తరపు న్యాయవాది ప్రమోద్ కుమార్ దూబే ►తమ తరపున సీనియర్ న్యాయవాదులు రావాల్సి ఉందన్న ప్రభుత్వ తరపు న్యాయవాదులు ►చాలా పిటిషన్లు పెండింగులో ఉన్నందున వాదనలకు ఎక్కువ సమయం పడుతుందన్న చంద్రబాబు తరపు న్యాయవాదులు ►అయితే.. రెగ్యులర్ కాల్స్ అటెండ్ చేసి వాదనలు వింటానన్న ఏసీబీ జడ్జి ►ఈలోగా.. చంద్రబాబు తరపు న్యాయవాదుల వాదనలను నోట్ చేసుకోవాలని ప్రభుత్వ తరపు న్యాయవాదులకు జడ్జి సూచన ►కాసేపట్లో చంద్రబాబు పిటిషన్లపై ప్రారంభం కానున్న విచారణ ►మొదటగా వాదనలు వినిపించనున్న చంద్రబాబు తరపు న్యాయవాదులు ►బెయిల్, కస్టడీ పిటిషన్లతో పాటు సీఐడీ దాఖలు చేసిన ఫైబర్ నెట్, ఐఆర్ఆర్(రింగ్రోడ్డు కేసు) పీటీ వారెంట్ల పైనా విచారించనున్న ఏసీబీ కోర్టు 10:47 AM, అక్టోబర్ 04, 2023 వీడిన ఉత్కంఠ.. బాబు పిటిషన్లపై కాసేపట్లో విచారణ ►విజయవాడ ఏసీబీ కోర్టులో కస్టడీ, బెయిల్ పిటిషన్లపై కొనసాగనున్న విచారణ ►కోర్టుకు చేరుకున్న చంద్రబాబు తరపు న్యాయవాది దూబే ► ఇంటరాగేషన్లో చంద్రబాబు సహకరించలేదని.. ఐదు రోజుల కస్టడీ కోరుతున్న ఏపీ సీఐడీ ► రాజమండ్రి జైలులోనే రెండ్రోజులపాటు కస్టడీకి తీసుకుని విచారించిన సీఐడీ ►కాలయాపన చేసిన చంద్రబాబు.. అందుకే మరోసారి కస్టడీ కోరుతూ పిటిషన్ ► స్కిల్ స్కాంలో బెయిల్ కోరుతూ చంద్రబాబు తరపు లాయర్ల పిటిషన్ 10:14 AM, అక్టోబర్ 04, 2023 చంద్రబాబు పిటిషన్ల విచారణపై సందిగ్ధం? ►ఎన్ఐఏ దాడులకు నిరసనగా.. బాయ్కాట్ పిలుపు ఇచ్చిన విజయవాడ బార్ అసోషియేషన్ ►ఇవాళ విజయవాడ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్లపై జరగాల్సిన విచారణ ►స్కిల్ స్కాం కేసులో చంద్రబాబును మరో ఐదు రోజుల కస్టడీ కోరిన ఏపీ సీఐడీ ►బెయిల్ ఇవ్వాలంటూ చంద్రబాబు లాయర్ల వాదన ►సుప్రీంలో ఎస్ఎల్పీ పిటిషన్ పెండింగ్లో ఉండడంతో.. 4వ తేదీ వరకు వాయిదా కోరిన బాబు లాయర్లు ►కాసేపట్లో విజయవాడ ఏసీబీ కోర్టుకు చేరుకోనున్న సీఐడీ లాయర్లు ►పిటిషన్లపై విచారణ ఉంటుందా? లేదా? అనే దానిపై కొద్దిసేపట్లో రానున్న స్పష్టత 09:45 AM, అక్టోబర్ 04, 2023 తూర్పు గోదావరిలో 144 సెక్షన్: ఎస్పీ జగదీష్ ►టీడీపీ ఛలో రాజమండ్రి జైలుకు పిలుపు ►గురువారం నిర్వహించేందుకు ప్లాన్ ►శాంతి భద్రతలకు భంగం వాటిల్లే అవకాశం ఉన్నందున.. అనుమతి లేదన్న జిల్లా ఎస్పీ జగదీశ్వర్ ►ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలకు నో పర్మిషన్ అని స్పష్టీకరణ ►144 సెక్షన్తో పాటు పోలీస్ సెక్షన్ 30 విధింపు ఉన్నట్లు ప్రకటన 09:04 AM, అక్టోబర్ 04, 2023 టీడీపీ వర్గాల్లో టెన్షన్ ►చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఢీలా పడిన టీడీపీ శ్రేణులు ►నాయకత్వం లేకపోవడంతో.. ఎటూ పాలుపోని పరిస్థితి ►చంద్రబాబు కేసుల్లో వెలువడే కోర్టు ఫలితాలపై టెన్షన్ టెన్షన్ ►ఇప్పటికే టీడీపీ చేపట్టే కార్యక్రమాలకు ప్రజాస్పందన కరువు ►చేసేది లేక.. జనాల వద్దకే వెళ్లాలని ప్రణాళికల రూపకల్పన 08:50 AM, అక్టోబర్ 04, 2023 సుప్రీంలో చంద్రబాబు ఓటుకు కోట్లు కేసు ►నేడు సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడు ఓటుకు కోట్లు కేసు విచారణ ►ఈ కేసులో చంద్రబాబు నాయుడు నిందితుడిగా చేర్చాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ ►కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేయాలని ఆర్కే మరొక పిటిషన్ కూడా ►"మనోళ్లు బ్రీఫ్డ్ మీ" వాయిస్ చంద్రబాబుదే అని ఇదివరకే నిర్ధారించిన ఫోరెన్సిక్ ►ఓటుకు కోట్లు కేసులో ఏసీబీ రిపోర్టులో చంద్రబాబు పేరును 22 సార్లు ప్రస్తావించారని పిటిషన్ లో పేర్కొన్న రామకృష్ణారెడ్డి ►కానీ చంద్రబాబు నాయుడిని నిందితుడిగా చేర్చడంలో ఏసీబీ విఫలమైంది ►ఈ కేసులో అసలు నిందితులను పట్టుకోవడంలో ఏసీబీ విఫలమైందని పిటిషన్ లో పేర్కొన్న రామకృష్ణారెడ్డి ►అందుకే ఈ కేసును సీబీఐకి బదిలీ చేయాలని పిటిషన్ లో వినతి ►విచారణ చేయనున్న జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ సంజయ్ కుమార్ ధర్మాసనం ►ఇదే కేసులో.. నిన్న రేవంత్రెడ్డి పిటిషన్ను కొట్టేసిన సుప్రీంకోర్టు 08:20 AM, అక్టోబర్ 04, 2023 పవన్లాంటి చెత్త నేత లేడు! ►గొడవలు చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది పవన్ కళ్యాణ్..? ►అయినా గొడవలు జరిగేలా మాట్లాడేది నువ్వు. ►దేశం మొత్తం మీద నీలాంటి చెత్త రాజకీయ నాయకుడు ఉండడు. :::వైఎస్సార్సీపీ ఎంపీ నందిగం సురేష్ 07:38 AM, అక్టోబర్ 04, 2023 బండారుకు ఓ మహిళ సూటి ప్రశ్న ► మంత్రి రోజాపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానారాయణ ► అరెస్ట్.. ఆపై కండిషనల్ బెయిల్ మీద విడుదల ► టీడీపీ నేతపై మండిపడుతున్న మహిళా లోకం ►టీడీపీ నాయకులు తొలుత మహిళల్ని గౌరవించడం నేర్చుకోవాలని పిలుపు. ►మీ ఇంట్లోనూ ఆడవాళ్లు ఉంటారని గుర్తు చేస్తూ.. హితవు టీడీపీ నాయకులు తొలుత మహిళల్ని గౌరవించడం నేర్చుకోవాలి. వయసు పెరగ్గానే సరిపోదు.. కాస్త జ్ఞానం, ఇంగితం కూడా ఉండాలి. మంత్రి రోజా గారి గురించి నువ్వు చేసిన అసభ్యకర వ్యాఖ్యలు.. మీ ఇంట్లో భార్య లేదా కూతురిని ఉద్దేశించి అంటే నీకు ఎలా ఉంటుంది బండారు సత్యనారాయణ? టీడీపీ నేతలు కాస్త నోరు… pic.twitter.com/4QPXKD69oc — YSR Congress Party (@YSRCParty) October 4, 2023 07:30AM, అక్టోబర్ 04, 2023 ఫైబర్ గ్రిడ్ కేసుపై ఏపీ హైకోర్టులో విచారణ ►ఫైబర్ గ్రిడ్ కేసులో లోకేష్ నిందితుడు కాదన్న అడ్వకేట్ జనరల్ ►లోకేష్ ను నిందితుడిగా చేరిస్తే 41ఏ నోటీసు ఇస్తామన్న ఏజీ ►41ఏ నోటీసును లోకేష్ అనుసరించకపోతే ప్రోసీజర్ ఫాలో అవుతామని ఏజీ చెప్పిన అంశాన్ని నోట్ చేసుకుని పిటిషన్ క్లోజ్ చేసిన న్యాయమూర్తి 07:25AM, అక్టోబర్ 04, 2023 నేడు లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ ►స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏపి హైకోర్టు విచారణ ► ఇవాళ్టి వరకు(అక్టోబర్ 4) లోకేష్ ను అరెస్ట్ చేయొద్దన్న కోర్టు ►నేడు మళ్లీ జరగనున్న వాదనలు 07:15AM, అక్టోబర్ 04, 2023 నేడు వివిధ కోర్టుల్లో కేసుల కీలక విచారణ ►ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్ల విచారణ ►IRR, ఫైబర్ గ్రిడ్ కేసుల్లో చంద్రబాబుపై పీటీ వారెంట్లు దాఖలు చేసిన సీఐడీ విచారణ అడిగే అవకాశం ►హైకోర్టులో చంద్రబాబు ఫైబర్ గ్రిడ్ కేసు ముందస్తు బెయిల్ పిటిషన్ల పై విచారణ ►IRR కేసులో మాజీ మంత్రి నారాయణ ను విచారణకు రావాలని కోరిన సీఐడీ ►తనను ఇంటి దగ్గరే విచారణ చేయాలని, లేని పక్షంలో వాయిదా వేయాలని హైకోర్టులో నిన్న నారాయణ పిటిషన్ ►నారాయణ పిటిషన్ పై ఇవాళ హైకోర్టులో విచారణ 06:52AM, అక్టోబర్ 04, 2023 10న సీఐడీ ముందుకు లోకేష్ ►అక్టోబర్ 10న CID ముందు హాజరు కావాలని లోకేష్కు హైకోర్టు ఆదేశం ►లోకేష్పై మూడు కేసులు, రింగ్రోడ్డు, ఫైబర్ గ్రిడ్, స్కిల్ స్కాం ►అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టులో లోకేష్ మరో లంచ్ మోషన్ పిటిషన్ 06:50AM, అక్టోబర్ 04, 2023 సుప్రీంలో బాబుకి దక్కని ఊరట ►సుప్రీంకోర్టులో చంద్రబాబుకు షాక్, చంద్రబాబు పిటిషన్పై విచారణ సోమవారానికి(అక్టోబర్ 9వ తేదీకి) వాయిదా ►ACB కోర్టు : చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్లు రేపు విచారణ జరిగే అవకాశం ►చంద్రబాబుపై మూడు కేసులు, స్కిల్ స్కాం, అంగళ్లు, రింగ్ రోడ్ ►ఏపీ హైకోర్టు : ఇవాళ ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాం కేసులో బాబు బెయిల్ పిటిషన్ విచారణ 06:46AM,అక్టోబర్ 04, 2023 రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు @25 ►సీఎంగా ఉన్న టైంలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కు పాల్పడ్డ టీడీపీ అధినేత చంద్రబాబు ►రెండేళ్ల దర్యాప్తు అనంతరం.. ప్రధాన నిందితుడిగా నిర్ధారించుకున్న ఏపీ సీఐడీ ►సెప్టెంబర్ 9వ తేదీన నంద్యాలలో అరెస్ట్ ► రిమాండ్ విధించిన అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ప్రత్యేక న్యాయస్థానం ►రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యూడీషియల్ రిమాండ్ మీద చంద్రబాబు ► ఖైదీ నెంబర్ 7691గా స్నేహా బ్లాక్లో ప్రత్యేక వసతులు ► కోర్టు ఆదేశాల ప్రకారం.. ఇంటి భోజనానికి అనుమతి, వైద్య సదుపాయాలు ► నేటితో (అక్టోబర్ 4)తో 25వ రోజుకు చేరిన చంద్రబాబు రిమాండ్ ► నేడు చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్లపై విచారణ -
అసైన్డ్ భూములు కొట్టేసేందుకు.. ‘నల్ల’మార్గం
సాక్షి, అమరావతి: అమరావతిలో అసైన్డ్ భూముల కుంభకోణం కేసు తీగ లాగితే నారా, నారాయణ నల్లధనం నెట్వర్క్ బట్టబయలైంది. అమరావతిలోని బడుగు, బలహీనవర్గాల అసైన్డ్ రైతులను బెదిరించి వారి భూములు కొల్లగొట్టడం కోసం నల్లధనం తరలించేందుకు చంద్రబాబు ముఠా పన్నిన పన్నాగం బయటపడింది. బంధువులు, బినామీలు, సన్నిహితులు, తమ ఉద్యోగుల పేరిట అసైన్డ్ భూములు హస్తగతం చేసుకునేందుకు వెచ్చించిన నల్లధనం గుట్టు రట్టయింది. అమరావతిలో అసైన్డ్ భూముల కుంభకోణం కేసు దర్యాప్తు చేస్తున్న సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఆ నల్లధనం నెట్వర్క్ను ఛేదించింది. అసైన్డ్ భూముల జాబితాలోని కేటగిరీ 1 నుంచి 4 వరకు ఉన్న 617.65 ఎకరాలను కొట్టేసేందుకు ఏర్పాటు చేసుకున్న ‘నల్ల’మార్గాన్ని ఆధారాలతోసహా బట్టబయలు చేసింది. బినామీల పేరిట అసైన్డ్ భూములు కొల్లగొట్టిన ముఠా జాబితా తవ్వుతుంటే.. చంద్రబాబు, లోకేశ్, నారాయణ, గంటా, ప్రత్తిపాటి, దేవినేని ఉమా ఇలా టీడీపీ పెద్దల పేర్లు బయటపడుతున్నాయి. నల్లధనం కోసం కంపెనీ ఏర్పాటు నారాయణ విద్యా సంస్థలకు మౌలిక వసతుల కల్పన, ఉద్యోగుల జీతాల చెల్లింపు కోసమని ‘ఎన్స్పైర మేనేజ్మెంట్ సర్వీసెస్’ అనే కంపెనీని ఏర్పాటు చేశారు. అసైన్డ్ భూములు కొల్లగొట్టడం కోసమే నారాయణ కుమార్తె సింధూర, అల్లుడు పునీత్ డైరెక్టర్లుగా ఎన్స్పైర కంపెనీని నెలకొల్పారు. నారాయణ విద్యా సంస్థలకు అన్ని రకాల చెల్లింపులు నిర్వహిస్తున్నందుకు ఎన్స్పైరకు 10 శాతం కమిషన్ చెల్లిస్తున్నట్లు రికార్డుల్లో చూపారు. ఇదే అవకాశంగా ఎన్స్పైరలోకి ఇతర సంస్థల నుంచి భారీగా నిధులు మళ్లించారు. ఎన్స్పైరలో ఇతర కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టినట్లు చూపడం గమనార్హం. ఒలంపస్ క్యాపిటల్ ఏషియా క్రెడిట్ అండ్ సీఎక్స్ పార్టనర్స్ మ్యాగజైన్ అనే కంపెనీ 2016లో ఏకంగా రూ. 400 కోట్లు పెట్టుబడి పెట్టినట్టు చూపించారు. ఇక 2018లో మోర్గాన్ స్టాన్లీ ప్రైవేట్ ఈక్విటీ ఏషియా, బన్యాన్ ట్రీ గ్రోత్ క్యాపిటల్ అనే సంస్థలు 75 మిలియన్ డాలర్లు (రూ. 613.27 కోట్లు) పెట్టుబడి పెట్టినట్టు రికార్డుల్లో చూపారు. దీంతో రెండు విడతల్లో ఎన్స్పైర కంపెనీలోకి రూ.1,013.27 కోట్లు వచ్చి చేరాయి. ఇలా భారీగా నల్లధనాన్ని ఎన్స్పైరలోకి మళ్లించినట్లు తెలుస్తోంది. ఎన్స్పైర టు రామకృష్ణ హౌసింగ్ నారాయణ సమీప బంధువు కేవీపీ అంజని కుమార్ రంగంలోకి వచ్చారు. ఆయన మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ను నల్లధనం తరలింపునకు మార్గంగా చేసుకున్నారు. అక్రమ నిధులను ఎన్స్పైర నుంచి రామకృష్ణ హౌసింగ్ కార్పొరేషన్ బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేశారు. అప్పటికే నారాయణ విద్యా సంస్థల సిబ్బంది, మరికొందరిని తమ బినామీలుగా ఎంపిక చేసుకున్నారు. రామకృష్ణ హౌసింగ్ బ్యాంకు ఖాతాల నుంచి ఆ బినామీల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లోకి నిధులను మళ్లించారు. వారు ఆ నగదు డ్రా చేసుకున్నారు. ప్రభుత్వం ఎలాంటి పరిహారం ఇవ్వకుండా అసైన్డ్ భూములను తీసుకుంటుందని బడుగు, బలహీనవర్గాల రైతులను అప్పటికే భయపెట్టారు. తద్వారా ఆ రైతుల అసైన్డ్ భూములను తమ బినామీలైన ఉద్యోగులు, ఇతరులకు అతి తక్కువకు విక్రయించేలా కథ నడిపించారు. నిబంధనలకు విరుద్ధంగా అసైన్డ్ భూములు తమ బినామీల ద్వారా హస్తగతం చేసుకున్నారు. తర్వాత బినామీలే సీఆర్డీఏకు ఆ భూములను ఇచ్చినట్టు చూపించి వారికే భూసమీకరణ ప్యాకేజీ వచ్చేలా చేశారు. ఆ విధంగా 617.65 ఎకరాలకు గాను రూ. 3,737 కోట్ల విలువైన భూసమీకరణ ప్యాకేజీ స్థలాలను పొందారు. జీపీఏ, సేల్డీడ్ల ద్వారా హస్తగతం కేటగిరీ 1 నుంచి 4 వరకు 617.65 ఎకరాలకు సంబంధించి రెవెన్యూ రికార్డుల్లో ఉన్న అసైన్డ్ రైతుల జాబితా, సీఆర్డీఏ రికార్డుల్లో ఉన్న రైతుల పేర్లను పరిశీలిస్తే అక్రమాల బాగోతం బయటపడుతోంది. ఈ జాబితాలో చంద్రబాబు, నారాయణ, గంటా శ్రీనివాసరావు, వారి సన్నిహితులు, బంధువులు, బినామీలే బయటపడుతున్నారు. అమరావతి పరిధిలోని అనంతవరం, కృష్ణాయపాలెం, కురగల్లు, లింగాయపాలెం, మందడం, నెక్కల్లు, నవులూరు, రాయపూడి, తుళ్లూరు, ఉద్దండరాయునిపాలెం, వెంకటపాలెం, బోరుపాలెం, నేలపాడు తదితర గ్రామాల్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులకు చెందిన 617.65 ఎకరాల అసైన్డ్ భూములను జీపీఏ, సేల్ డీడ్లు ద్వారా హస్తగతం చేసుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతుల నుంచి అసైన్డ్ భూములను బినామీల ద్వారా కొల్లగొట్టిన టీడీపీ పెద్దలు ♦ నారా చంద్రబాబునాయుడు (టీడీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి) ♦ నారా లోకేశ్ (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) ♦ పొంగూరు నారాయణ (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) ♦ గంటా శ్రీనివాసరావు (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) ♦ దేవినేని ఉమామహేశ్వరరావు (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) ♦ ప్రత్తిపాటి పుల్లారావు (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) ♦ రావెల కిశోర్ బాబు (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) ♦ తెనాలి శ్రావణ్ కుమార్ (టీడీపీ మాజీ ఎమ్మెల్యే) ♦ గుమ్మడి సురేశ్ (టీడీపీ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు వియ్యంకుడు) ♦ మండల ఎస్.ఎస్.కోటేశ్వరరావు (రియల్టర్) ♦ మండల రాజేంద్ర (రియల్టర్) ♦ కేవీపీ అంజనీ కుమార్ (రియల్టర్) ♦ దేవినేని రమేశ్ (రియల్టర్) ♦ బొబ్బ హరిశ్చంద్ర ప్రసాద్ (రియల్టర్) ♦ హరేంద్రనాథ్ చౌదరి (రియల్టర్) ♦ పొట్లూరి సాయిబాబు (సిటీ కేబుల్) ♦ దోనేపూడి దుర్గా ప్రసాద్ (రియల్టర్) రూ.16 కోట్లతో.. రూ. 816 కోట్లు కొట్టేసిన నారాయణ రాజధానిలో నారాయణ బంధువులు, బినామీల పేరిట 148 ఎకరాలు ఉన్నట్టుగా సిట్ దర్యాప్తులో వెల్లడైంది. అందుకోసం నారాయణ రూ.16.50 కోట్లను అక్రమంగా తరలించారు. అందుకు ప్రతిగా 148 ఎకరాలను పొందారు. ఆ 148 ఎకరాలకు సీఆర్డీఏ భూసమీకరణ కింద ఇచ్చింది రూ.816 కోట్లు విలువైన స్థలాల ప్యాకేజీ. ఆ భూములకు పదేళ్లపాటు కౌలు కూడా పొందగలుగుతారు. బినామీ రైతులకు సీఆర్డీఏ ఇప్పటికే చెల్లించిన కౌలు మొత్తం రూ. 50 లక్షలు మళ్లీ రామకృష్ణ హౌసింగ్ బ్యాంకు ఖాతాలో జమ చేశారు. అక్కడ నుంచి ఆ మొత్తాన్ని మళ్లీ నారాయణ విద్యా సంస్థల బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేయడం గమనార్హం. అంటే అసైన్డ్ భూములు దక్కించుకుంది నారాయణే అన్నది స్పష్టమైంది. అదే రీతిలో చంద్రబాబు, గంటా, ప్రత్తిపాటి, దేవినేని ఉమా, ఇతర టీడీపీ పెద్దలు, వారి బంధువులు బినామీల ద్వారా 617 ఎకరాల్లో ఎంత భారీ దోపిడీకి పాల్పడ్డారో స్పష్టమవుతుంది. -
దోపిడీకి రాచబాట
రాజధాని అమరావతిని చంద్రబాబు తన అవినీతికి అక్షయపాత్రగా మార్చుకున్నారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని తన అవినీతికి సాధనంగా చేసుకుని యథేచ్ఛగా దోపిడీకి పాల్పడ్డారు. అందుకు మరో ఉదాహరణ అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్. కేవలం కాగితాల మీదే ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో ఇష్టానుసారంగా మార్పులు చేసి వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టడం చంద్రబాబుకే చెల్లింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో సీఆర్డీఏ చైర్మన్గా అప్పటి సీఎం చంద్రబాబు, వైస్ చైర్మన్గా అప్పటి మంత్రి పొంగూరు నారాయణ బరితెగించి పాల్పడ్డ అవినీతి విస్మయ పరుస్తోంది. అందుకోసం లింగమనేని రమేశ్తో క్విడ్ ప్రో కోకు పాల్పడిన ఈ కేసులో చినబాబు లోకేశ్ కూడా ప్రధాన పాత్ర పోషించారు. చంద్రబాబు బినామీ, సన్నిహితుడు లింగమనేని భూముల మార్కెట్ విలువ రూ.177.50 కోట్ల నుంచి రూ.877.50 కోట్లకు.. రాజధాని నిర్మాణం అనంతరం ఏకంగా రూ.2,130 కోట్లుకు చేరేలా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ను ఖరారు చేయడం భారీ దోపిడీకి నిదర్శనం. ఈ అవినీతి పాపంలో చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్కు కూడా పిడికెడు వాటా ఇవ్వడం కొసమెరుపు. ఇంతటి భారీ అవినీతికి రాచబాట వేసిన ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ వెనుక గూడు పుఠాణీ ఇలా సాగింది. –సాక్షి, అమరావతి చంద్రబాబు అలైన్మెంట్కు కన్సల్టెన్సీ ద్వారా రాజముద్ర సీఆర్డీఏ అధికారులు 94 కిలోమీటర్ల పొడవుతో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ రూపొందించడంపై చంద్రబాబు, నారాయణ మండిపడ్డారు. ఎందుకంటే ఆ అలైన్మెంట్ ప్రకారం ఇన్నర్ రింగ్ రోడ్డు అమరావతిలోని పెద్దపరిమి, నిడమర్రు, చిన వడ్లపూడి, పెద వడ్లపూడి మీదుగా వెళ్తుంది. అంటే చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్, లింగమనేని కుటుంబానికి చెందిన భూములకు 3 కి.మీ. దూరం నుంచి నిర్మించాల్సి వస్తుంది. దాంతో తమ భూముల విలువ అమాంతం పెరగదని వారు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరి ఆదేశాలతో సీఆర్డీఏ అధికారులు ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో మార్పులు చేశారు. చంద్రబాబు, లింగమనేని కుటుంబానికి చెందిన వందలాది ఎకరాలు ఉన్న తాడికొండ, కంతేరు, కాజలను పరిగణనలోకి తీసుకున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ను 3 కి.మీ. దక్షిణానికి జరిపారు. హెరిటేజ్ ఫుడ్స్, లింగమనేని కుటుంబానికి కంతేరు, కాజలలో ఉన్న భూములను ఆనుకుని ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మించేలా 97.50 కి.మీ. మేర అలైన్మెంట్ను రూపొందించారు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచి సింగపూర్కు చెందిన సుర్బాన జ్యురాంగ్ కన్సల్టెన్సీని రంగంలోకి తీసుకొచ్చారు. అప్పటికే ఖరారు చేసిన ఇన్నర్ రింగ్ రోడ్ డిజైన్ను అమరావతి మాస్టర్ ప్లాన్లో చేర్చారు. అనంతరం ఎస్టీయూపీ అనే కన్సల్టెన్సీని నియమించారు. కానీ మాస్టర్ ప్లాన్లో పొందుపరిచిన అలైన్మెంట్కు అనుగుణంగానే ఉండాలని షరతు విధించారు. అప్పటికే సీఆర్డీఏ అధికారుల ద్వారా తాము ఖరారు చేసిన అలైన్మెంట్నే ఎస్టీయూపీ కన్సల్టెన్సీ ద్వారా ఆమోదించేలా చేశారు. తాడికొండ, కంతేరు, కాజలలో హెరిటేజ్ ఫుడ్స్, లింగమనేని భూములను ఆనుకునే అలైన్మెంట్ను ఎస్టీయూపీ ఖరారు చేసింది. రూ.177.50 కోట్ల నుంచి రూ.877.50 కోట్లు ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పుతో చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్, ఆయన బినామీ, సన్నిహితుడైన లింగమనేని రమేశ్ కుటుంబానికి చెందిన భూముల విలువ భారీగా పెరిగింది. కంతేరు, కాజలలో లింగమనేని కుటుంబానికి 355 ఎకరాలు, హెరిటేజ్ ఫుడ్స్కు చెందిన 13 ఎకరాలకు ఆనుకుని ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ ఖరారు చేశారు. చంద్రబాబు, నారాయణ తమ కుటుంబ సంస్థలు హెరిటేజ్, రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్లతోపాటు తమ బినామీ లింగమనేని రమేశ్ తన సంస్థల పేరిట ఇన్నర్ రింగ్ రోడ్డుకు అటూ ఇటూ భారీగా భూములు కొన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ ఖరారుకు ముందు లింగమనేని కుటుంబం ఆ ప్రాంతంలో ఎకరా భూమి రూ.8 లక్షల రిజిస్టర్ విలువ చొప్పున విక్రయించింది. మార్కెట్ ధర ప్రకారం ఎకరా రూ.50 లక్షలు ఉండేది. అంటే ఆ భూముల మార్కెట్ విలువ రూ.177.50 కోట్లుగా ఉండేది. కాగా ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ తర్వాత ఎకరా రూ.36 లక్షల రిజిస్టర్ విలువ చొప్పున విక్రయించింది. అంటే రిజిస్టర్ విలువే నాలుగున్నర రెట్లు పెరిగింది. కాగా మార్కెట్ ధర ప్రకారం ఎకరా రూ.2.50 కోట్లు పలికింది. అంటే 355 ఎకరాల విలువ మార్కెట్ ధర ప్రకారం అమాంతం రూ.887.50 కోట్లకు పెరిగినట్టే. ఇక రాజధాని అమరావతి నిర్మాణం పూర్తయితే ఎకరా విలువ సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో రూ.4 కోట్లకు చేరుతుందని ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు అప్పట్లోనే ప్రకటించారు. ఇక ఇన్నర్ రింగ్ రోడ్డును ఆనుకుని ఉన్న భూముల విలువ ఎకరా రూ.6 కోట్లకు చేరుతుందని అంచనా వేశారు. అంటే అమరావతి నిర్మాణం పూర్తయితే ఆ 355 ఎకరాల విలువ ఏకంగా రూ.2,130 కోట్లకు చేరుతుందని అంచనా. మార్కెట్ ధర ప్రకారం హెరిటేజ్ ఫుడ్స్ 9 ఎకరాల విలువ రూ.4.50 కోట్ల నుంచి రూ.22.50 కోట్లకు పెరిగింది. అమరావతి రాజధాని నిర్మాణం పూర్తయితే అది రూ.54 కోట్లకు చేరుతుందని లెక్క తేలింది. హెరిటేజ్ ఫుడ్స్ ఒప్పందం చేసుకున్న మరో 4 ఎకరాల విలువ కూడా రూ.24 కోట్లకు చేరుతుంది. కృష్ణా నదికి ఇవతలా అవినీతి మెలికలే కృష్ణానదికి ఇవతల విజయవాడ శివారులో నారాయణ తమ ఆస్తుల విలువ భారీగా పెంచుకున్నారు. సీఆర్డీఏ అధికారులు మొదట రూపొందించిన అలైన్మెంట్ ప్రకారం ఇన్నర్ రింగ్ రోడ్డును గుంటూరు జిల్లాలోని అమరావతి నుంచి కృష్ణా జిల్లాలోని నున్న మీదుగా నిర్మించాల్సి ఉంటుంది. అందుకోసం కృష్ణా నదిపై వంతెన నిర్మిస్తారు. గుంటూరు జిల్లాలోని నూతక్కి–కృష్ణా జిల్లా పెద్దపులిపర్రు మధ్య కృష్ణా నదిపై వంతెన నిర్మించి అక్కడ నుంచి తాడిగడప–ఎనికేపాడు మీదుగా నున్న వరకు ఇన్నర్ రింగ్రోడ్డు కొనసాగుతుంది. అయితే అలా నిర్మిస్తే ఆ ప్రాంతంలోని నారాయణ విద్యా సంస్థల భవనాలను భూసేకరణ కింద తొలగించాల్సి వస్తుంది. దీంతో ఈ అలైన్మెంట్పై నారాయణ సీఆర్డీఏ అధికారులపై తీవ్ర స్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. సీఆర్డీఏ సమావేశంలో అధికారులను పరుష పదజాలంతో దూషిస్తూ అలైన్మెంట్ను మార్చాలని ఆదేశించారు. దాంతో ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ను 3 కి.మీ. తూర్పు దిశగా మార్చారు. ఆ ప్రకారం గుంటూరు జిల్లాలో రామచంద్రాపురం–కృష్ణా జిల్లా చోడవరం మధ్య వంతెన నిర్మిస్తారు. అక్కడి నుంచి పెనమలూరు మీదుగా నిడమానూరు నుంచి నున్న వరకు ఇన్నర్ రింగ్ రోడ్డును నిర్మిస్తారు. దాంతో నారాయణ కుటుంబానికి చెందిన 9 విద్యా సంస్థల భవనాలను ఆనుకుని ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ను ఖరారు చేశారు. ఏ–1 చంద్రబాబు, ఏ–6 లోకేశ్ ఇన్నర్ రింగ్ రింగ్రోడ్డు కుంభకోణంపై సీఐడీ సమగ్ర దర్యాప్తు జరిపి కీలక ఆధారాలు సేకరించింది. ఏ–1 చంద్రబాబు, ఏ–2 నారాయణ, ఏ–3 లింగమనేని రమేశ్, ఏ–4 లింగమనేని రాజశేఖర్, ఏ–5 అంజినీ కుమార్, ఏ–6గా లోకేశ్లపై కేసు నమోదు చేసింది. ఈ కేసులో క్విడ్ ప్రో కో కింద చంద్రబాబు పొందిన కరకట్ట నివాసం, నారాయణ కుటుంబ సభ్యులకు చెందిన బ్యాంకు ఖాతాలను అటాచ్ చేయాలని సీఐడీ నిర్ణయించింది. ఈ మేరకు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసు దర్యాప్తును సీఐడీ వేగవంతం చేసింది. -
వియ్యంకుల వారి భూ విందు
సాక్షి, అమరావతి: ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా..? చంద్రబాబు బృందం అమరా వతిలో ఏకంగా రూ.5,600 కోట్ల విలువైన 1,400 ఎకరాల అసైన్డ్ భూములను కొల్లగొట్టితే ఆయన మంత్రివర్గ సహచరులు పొంగూరు నారాయణ, గంటా శ్రీనివాసరావు అదే రీతిలో భారీ భూదోపిడీకి పాల్పడ్డారు. వియ్యంకులు కూడా అయిన వారిద్దరూ బినామీల పేరిట 48 ఎకరాల అసైన్డ్ భూములను కాజేసినట్లు సీఐడీకి చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఆధారాలతో సహా వెలికి తీసింది. టీడీపీ సర్కారు ఒక్క రూపాయి కూడా పరిహారం ఇవ్వకుండానే అసైన్డ్ భూములను రాజధాని కోసం తీసుకుంటుందని బడుగు రైతులను బెదిరించి నారాయణ – గంటా తమ పన్నాగాన్ని అమలు చేశారు. అందుకోసం సీఆర్డీఏ అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారు. అసైన్డ్ భూముల చట్టాన్ని ఉల్లంఘించి తమ విద్యా సంస్థల సిబ్బంది, సమీప బంధువులు 37 మందిని బినామీలుగా చేసుకుని 142 సేల్ డీడ్ల ద్వారా 150 ఎకరాలను దక్కించుకు న్నారు. దీనిపై సిట్ అధికారులు పూర్తి ఆధారా లతో కేసు నమోదు చేశారు. రూ.18 కోట్లతో హస్త గతం చేసుకున్న ఆ 150 ఎకరాల విలువ ల్యాండ్ పూలింగ్ వర్తింపజేసిన అనంతరం అమాంతం రూ.550 కోట్లకు చేరుకోవడం గమనార్హం. బినామీల ఖాతాల్లోకి డబ్బులు.. వియ్యంకులైన పొంగూరు నారాయణ, గంటా శ్రీనివాసరావులు పన్నాగం పన్ని, అధికార బలంతో అమరావతిలో అసైన్డ్ భూములను కొల్లగొట్టారు. అనంతవరం, కృష్ణాయపాలెం, కురగల్లు, లింగాయపాలెం, మందడం, నెక్కళ్లు, నవులూరు, రాయపూడి, తుళ్లూరు, ఉద్దండరాయునిపాలెం, వెంకటపాలెంలోని అసైన్డ్ భూములపై కన్నేశారు. భూసమీకరణ కింద తీసుకునే అసైన్డ్ భూములకు ప్రభుత్వం పరిహారం ఇవ్వదని సీఆర్డీఏ, రెవెన్యూ అధికారుల ద్వారా ఆయా గ్రామాల్లోని పేద రైతులను నమ్మించారు. అనంతరం తమ బినామీలు అయిన ఆర్కే హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులతో ఆ భూములను కారు చౌకగా కొనుగోలు చేసేందుకు సంప్రదింపులు జరిపారు. అందుకోసం నారాయణ విద్యా సంస్థల ద్వారా రూ.18 కోట్లను ఆర్కే హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్కు మళ్లించారు. నారాయణ విద్యా సంస్థల సిబ్బంది, తమ సమీప బంధువులను బినామీలుగా చేసుకుని వారి పేరిట బ్యాంకు ఖాతాలు తెరిచారు. ఆర్కే హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఆ బినామీల బ్యాంకు ఖాతాల్లోకి నిధులు మళ్లించారు. అనంతరం నారాయణ విద్యా సంస్థల సిబ్బంది, తమ సమీప బంధువుల పేరిట అసైన్డ్ భూములను సేల్ డీడ్ ద్వారా హస్తగతం చేసుకున్నారు. మంగళగిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం కేంద్రంగా 37 మంది పేరుతో 142 సేల్డీడ్లు రిజిస్టర్ చేయడం గమనార్హం. ఇలా కేవలం రూ.18 కోట్లకు 150 ఎకరాలను గుప్పిట పట్టారు. ఈ వ్యవహారం అంతా 2015 సెప్టెంబరు, అక్టో బర్, నవంబరులో పూర్తి చేశారు. రూ.532 కోట్లు నష్టపోయిన అసైన్డ్ రైతులు అసైన్డ్ పేద రైతుల నుంచి 150 ఎకరాలు తమ హస్తగతం అయ్యాక నారాయణ, గంటాలు అసలు విషయాన్ని తెరపైకి తెచ్చారు. అప్పటికే చంద్రబాబు పన్నాగం ప్రకారం అసైన్డ్ భూము లకు కూడా భూసమీ కరణ ప్యాకేజీ ఇవ్వాలని నిర్ణయించారు. కానీ ఆ విషయాన్ని గోప్యంగా ఉంచారు. అసైన్డ్ భూములు తమ గుప్పిట్లోకి వచ్చిన తరువాత ఆ నిర్ణయాన్ని తాపీగా 2016 ఫిబ్రవరి లో ప్రకటించారు. అంతేకాదు అసైన్డ్ చట్టానికి విరుద్ధంగా అసైన్డ్ భూములను కొనుగోలు చేసినవారికి కూడా భూసమీకరణ ప్యాకేజీ వర్తింపజేస్తామని చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించడం గమనార్హం. తద్వారా అమరావతిలో భూముల మార్కెట్ విలువ అమాంతం పెరిగేలా చేశారు. అమరావతిలో ఎకరా మార్కెట్ విలువ రూ.4 కోట్లు అని నాడు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబే చెప్పడం గమనార్హం. నారాయణ, గంటా బినామీల ద్వారా దక్కించుకున్న 150 ఎకరాలకు భూసమీకరణ ప్యాకేజీని వర్తింపచేసుకున్నారు. దీని ప్రకారం జరీబు భూములకు ఎకరాకు వెయ్యి గజాల నివాస స్థలం, 450 గజాల వాణిజ్య స్థలం కేటాయించారు. ఈమేరకు 150 ఎకరాలకుగాను 1.50 లక్షల గజాల నివాస స్థలం, 67,500 గజాల వాణిజ్య స్థలం దక్కాయి. మార్కెట్ విలువ ప్రకారం ఆ భూముల విలువ దాదాపు రూ.550 కోట్లకు చేరింది. కేవలం రూ.18 కోట్లతో అక్రమంగా భూములను దక్కించుకుని 3 నెలల్లో ఆ భూముల విలు వను రూ.550 కోట్లకు పెంచేసుకున్నారు. అస త్య ప్రచారాలు, బెదిరింపులకు పాల్పడకుండా ఉంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ అసైన్డ్ రైతుల భూముల విలువ రూ.550 కోట్లకు పెరి గి ఆ ప్రయోజనం వారికే దక్కేది. దశాబ్దాలుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులు సాగు చేసుకుంటున్న భూములను నారాయణ, గంటా బెదిరించి కా రుచౌకగా గద్దల్లా తన్నుకుపోయారు. కాగా, నారాయణ ఇప్పటికే ముందస్తు బెయిల్పై ఉన్నారు. -
ముందస్తు బెయిల్ పిటిషన్లు ఇన్నాళ్లు పెండింగ్లోనా..!
సాక్షి, అమరావతి: అమరావతి రాజధాని ముసుగులో 1,100 ఎకరాల అసైన్డ్, లంక భూములను కాజేసిన వ్యవహారంలో 2020లో సీఐడీ నమోదు చేసిన కేసులో తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ మాజీ మంత్రి పొంగూరు నారాయణ, ఆయన సమీప బంధువులు, బినామీలు దాఖలు చేసిన వ్యాజ్యాలు దాదాపు ఏడాది కాలంగా పెండింగ్లో ఉండటంపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ముందస్తు బెయిల్ పిటిషన్లు ఏడాది పెండింగ్లో ఉండటం తామెన్నడూ చూడలేదని తెలిపింది. ఇదే సమయంలో వాదనలు వినిపించేందుకు నారాయణ, ఇతరుల తరఫు న్యాయవాదులు మరోసారి సమయం కోరడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇలానే వాయిదాలు కోరుతుంటే, నారాయణ తదితరులను అరెస్ట్ చేయవద్దంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేస్తామని, అప్పుడు తీరిగ్గా వాదనలు వినిపించుకోవచ్చునని ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి ఎలాంటి వాయిదాలు వేసే ప్రసక్తే లేదని, ఇదే చివరి అవకాశమని నారాయణ తదితరులకు హైకోర్టు స్పష్టం చేసింది. అలాగే ఒకవైపు ముందస్తు బెయిల్ పిటిషన్లు, మరో వైపు కేసు కొట్టేయాలంటూ క్వాష్ పిటిషన్లు సమాంతరంగా దాఖలు చేయడంపైనా హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇలా ఎలా రెండు రకాల పిటిషన్లు దాఖలు చేస్తారని, అవి ఎలా నిలబడతాయని ప్రశ్నించింది. ఇలాంటి ఫైలింగ్ను తామెన్నడూ చూడలేదని వ్యాఖ్యానించింది. అనంతరం తదుపరి విచారణను ఈ నెల 14కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కంచిరెడ్డి సురేష్రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వాయిదాలతో కాలం వెళ్లదీస్తున్నారు... తాజాగా ఈ వ్యాజ్యాలు బుధవారం మరోసారి విచారణకు వచ్చాయి. నారాయణ తదితరుల తరఫు న్యాయవాదులు ఎస్.ప్రణతి, అజయ్ తదితరులు స్పందిస్తూ, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా తమ తరఫున వాదనలు వినిపించాల్సి ఉందని, వ్యక్తిగత కారణాలరీత్యా ఆయన హాజరు కాలేకపోతున్నందున విచారణను వాయిదా వేయాలని కోర్టును కోరారు. దీనిపై సీఐడీ తరఫున వాదనలు వినిపిస్తున్న అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్రెడ్డి తీవ్ర అభ్యంతరం తెలిపారు. సీనియర్ న్యాయవాది పేరుతో వాయిదాల మీద వాయిదాలు తీసుకుంటున్నారని, ఇది ఎంత మాత్రం సమంజసం కాదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఏడాది కాలంగా ఇలాగే ఈ వ్యాజ్యాల్లో విచారణను సాగదీస్తూ వస్తున్నారని తెలిపారు. అరెస్ట్పై స్టేను అడ్డం పెట్టుకుని కాలం వెళ్లదీస్తున్నారని కోర్టుకు ఏఏజీ నివేదించారు. ఈ సమయంలో న్యాయస్థానం జోక్యం చేసుకుంటూ, ఇలా పదే పదే వాయిదాలు కోరుతుంటే ఏఏజీ ప్రభుత్వానికి సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందని నారాయణ న్యాయవాదులను ఉద్దేశించి వ్యాఖ్యానించింది. దాదాపు ఏడాదిగా ముందస్తు బెయిల్ పిటిషన్లు పెండింగ్లో ఉండటం ఎన్నడూ చూడలేదని, ముందస్తు బెయిల్ పిటిషన్లు, క్వాష్ పిటిషన్లు సమాంతరంగా దాఖలు చేయడం ఏంటని ప్రశ్నించింది. దీనికి నారాయణ తరఫు న్యాయవాది ఎస్.ప్రణతి స్పందిస్తూ, రెండు రకాల పిటిషన్లు దాఖలు చేయవచ్చునని, ఇందుకు సంబంధించిన తీర్పులను వాదనల సమయంలో కోర్టు ముందుంచి, సంతృప్తికర వివరణ ఇస్తామని తెలిపారు. ఆమె వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం ఈ వ్యాజ్యాల్లో తదుపరి ఎలాంటి వాయిదాలు ఇచ్చే ప్రసక్తేలేదని తేల్చి చెప్పింది. వాయిదాలు ఇవ్వడం ఇదే చివరి సారి అని పేర్కొంటూ.. తదుపరి విచారణను ఈ నెల 14కి వాయిదా వేసింది. ఏక కాలంలో రెండు పిటిషన్లా.. సీఐడీ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ నారాయణ 2022 హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇదే సమయంలో ఆయన సమీప బంధువులు, బినామీలు తమపై సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ క్వాష్ పిటిషన్లు వేశారు. నారాయణ కూడా తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ 2023లో క్వాష్ పిటిషన్ వేశారు. 2022లో ముందస్తు బెయిల్ కోసం నారాయణ దాఖలు చేసిన పిటిషన్ను అప్పట్లో విచారించిన హైకోర్టు, కేన్సర్ శస్త్రచికిత్స కోసం విదేశాలకు వెళ్లేందుకు వీలుగా మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. నారాయణ సమీప బంధువులు, బినామీలు దాఖలు చేసిన వ్యాజ్యాల్లో స్పందించిన హైకోర్టు, సీఆర్పీసీ 41ఏను అనుసరించాలని సీఐడీని ఆదేశించిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఈ వ్యాజ్యాల్లో విచారణ పలుమార్లు వాయిదా పడింది. తమకు అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు ఉండటంతో నారాయణ తదితరులు ఏదో ఒక కారణం చూపుతూ వాయిదాల మీద వాయిదాలు కోరుతూ వచ్చారు. దర్యాప్తు సంస్థ న్యాయవాదులు కూడా ఒకటి రెండు సార్లు వాయిదాలు అడిగారు. -
29 ఏళ్లుగా వేధిస్తున్నారు.. షాకింగ్ విషయాలు చెప్పిన నారాయణ మరదలు
హైదరాబాద్: ఏపీ మాజీమంత్రి పొంగూరు నారాయణపై ఆయన తమ్ముడు సుబ్రహ్మణ్యం భార్య కృష్ణప్రియ మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. 29 ఏళ్లుగా నారాయణ, భర్త సుబ్రహ్మణ్యం అలియాస్ మణి తనను మానసికంగా, లైంగికంగా వేధిస్తున్నారని ఆదివారం ఉదయం రాయదుర్గం పోలీస్స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేశారు. క్యాన్సర్తో బాధపడుతున్న తాను ఎదుర్కొన్న అనుభవాలను పోస్టు చేశానని, రాజకీయంగా వారికి ఇబ్బంది కలుగుతోందని భావించి తన ఇన్స్ట్రాగామ్ అకౌంట్ను మూసివేశారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం గచ్చి బౌలిలోని బాంబూస్ మీనాక్షి విల్లాస్ ఎదుట కృష్ణప్రియ మీడియాతో మాట్లాడారు. ఆమె ఏమన్నారంటే.. పెళ్లయిన రెండో రోజు నుంచే బావ నారాయణ లైంగిక వేధింపులు మొదలుపెట్టాడు. ఆయనకు లొంగకపోవడంతో 29 ఏళ్లుగా ఆయన పెట్టే బాధలు భరిస్తున్నాను. ఆయన స్త్రీలోలుడు. నారాయణ విద్యా సంస్థల్లో పనిచేసే కొందరు మహిళలు ఆయన దగ్గరకు వెళ్లాల్సిందే. సోదరి వరుసైన వారు స్నానం చేస్తున్నప్పుడు బాత్రూమ్లోకి తొంగి చూసేవాడు. ఈ విషయం మొదట్లో వాళ్ల వాళ్లే చెప్పారు. నేను లొంగకపోవడంతో వేధింపులు ప్రారంభించాడు. నాకు మానసిక సమస్య ఉన్నట్లుగా నా భర్త తప్పుడు సర్టిఫికెట్లు చూపించి యూట్యూబ్ వేదికగా ప్రచారం చేయడం చాలా బాధేసింది. నారాయణ మెడికల్ కాలేజీలో పనిచేసే డాక్టర్ శేషమ్మ నుంచి మెడికల్ సర్టిఫికెట్ తీసుకురావడం వారికి పెద్ద సమస్య కాదు. అలాగే, నారాయణ పిల్లలకు మానసిక సమస్యలు ఉన్నాయి. డాక్టర్ విరించి వారికి చికిత్స చేస్తున్నారు. విరించి నుంచి కూడా సర్టిఫికెట్ తేవడం పెద్ద కష్టమేమి కాదు. ఒకరోజు మా నాన్నపై అరుస్తుంటే గుంటూరులో ఓ డాక్టర్ వద్దకు తీసుకెళ్లారు. నిద్రలేమితో నిద్రమాత్రలు వేసుకుంటున్నట్లు డాక్టర్కు చెప్పాను. మానసిక ఒత్తిడితోనే నిద్రలేమి సమస్య ఉండవచ్చని డాక్టర్ చెప్పారు. నేను ఇటీవల ఏఐజీ ఆస్పత్రిలో చేరిన విషయం నిజమే. ఇక రక్త సంబంధం ఉంది కాబట్టే నారాయణకు నా భర్త పెట్గా మారాడు. కేసు నమోదు చేయలేదు: సీఐ కృష్ణప్రియ ఫిర్యాదును పరిశీలిస్తున్నామని, ఇప్పటివరకు ఎలాంటి కేసు నమోదు చేయలేదని రాయదుర్గం సీఐ మహేష్ తెలిపారు. -
విద్యార్థుల ఆత్మహత్యలనూ బయట పెడతా: నారాయణ మరదలు ప్రియ
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పొంగూరు నారాయణ అకృత్యాలపై ఆయన మరదలు ప్రియ ఇన్స్టాగామ్లో మరో వీడియో విడుదల చేశారు. నారాయణ ఆయన పరువు కోసం తనను అణచివేశారని ఆమె ఆరోపించారు. ‘నేను 29 ఏళ్లు భరించాను. ఇక భరించే శక్తి నాకు లేదు. సీతాదేవి కూడా 16 సంవత్సరాలు అరణ్యవాసం చేసింది. మరో 11 సంవత్సరాలు బిడ్డల్ని పెంచింది. మొత్తం 27 ఏళ్లు కష్టపడింది. నేను 29 ఏళ్లు నరకం అనుభవించాను. ఇప్పుడు కూడా ఇంటి విషయాలు మాట్లాడొద్దని అంటున్నారు.ఇంటి విషయాలైనా, పబ్లిక్ విషయాలైనా, నారాయణ విద్యా సంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యల విషయాలపైనా బయట పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాను. నా కళ్ల ముందు చెడు జరుగుతోంది కాబట్టి బయటపెట్టేందుకు సిద్ధమయ్యాను. ముందు నా విషయం వెలుగులోకి తెస్తాను. తర్వాత విద్యా సంస్థల విషయాలు బయటపెడతా. పరువు అంటున్నారు. మహా అంటే పది మంది ఫోన్ చేస్తారు. అంతే కదా. ఇది నా జీవితం. 29 ఏళ్లు కష్టపడ్డా. నాకు క్యాన్సర్ వస్తే పలకరించే దిక్కు లేకపోతే నా పరిస్థితి ఏమిటి? అందుకే నేను మాట్లాడతా. విద్యా సంస్థల్లో పిల్లల ఆత్మ హత్యల విషయం క్లియర్గా మాట్లాడతా. నేను ఫిజి కల్గా క్యాన్సర్ పేషంట్ను కావచ్చు. మెంటల్గా వీక్ కాను. ఒక స్త్రీ తలచుకుంటే శక్తి అవుతుందని నారాయణకు తెలియజేస్తా. నేను బతుకుతానో లేదో తెలియదు. నాకు డబ్బులివ్వరు. అయినా నా ఆస్తులమ్మైనా ట్రీట్మెంట్ చేయించుకుంటా. నేను చనిపోయే లోపు వాస్తవాలు బయటపెడతా’అని ప్రియ ఆ వీడియోలో చెప్పారు. సంచలనంగా ప్రియ వీడియోలు రెండు రోజుల క్రితం ప్రియ సోషల్ మీడియాలో మొదటి వీడియో రిలీజ్ చేశారు. బావ అయిన మాజీ మంత్రి నారాయణ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇది రెండు తెలుగురాష్ట్రాల్లో, రాజకీయ వర్గాల్లో, నారాయణ విద్యాసంస్థల్లో చర్చనీయాంశమైంది. దీంతో నారా యణ తన వియ్యంకుడు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును రంగంలోకి దింపారు. ప్రియతో రాజీకి ప్రయత్నించారు. అయితే గంటా ప్రయత్నా లు విఫలమయ్యాయి. ప్రియ మరో వీడియో విడు దల చేసి, అందులో మరిన్ని విషయాలు వెల్లడించారు. ఇది మరింత సంచలనమైంది. సోదరుడి సతీమణినే నారాయణ లైంగికంగా వేధించడంపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. ప్రియ జనసేన వీరమహిళ పొంగూరు ప్రియ జనసేన సభ్యురాలు. ఆ పార్టీ వీరమహిళగా గుర్తింపు పొందింది. తన బావ టీడీపీలో కీలక నేతగా వ్యవహరిస్తున్నప్పటికీ, ఆమె మాత్రం జనసేన అధ్యక్షుడు పవన్ అభిమానిని అని ఆమె వీడియోలో వెల్లడించింది. తన కుమారుడు పుట్టిన రోజున పవన్తో దిగిన ఫొటోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. తన ఓటు కూడా జనసేనకే వేశానని తెలిపింది. తన పార్టీ వీర మహిళగా ఉన్న ప్రియ లైంగిక వేధింపులతో నరకం చూశానంటూ సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేసినా జనసేన పార్టీ నుంచి స్పందన లేకపోవడంపై ఆ పార్టీ నేతలే అసహనం వ్యక్తం చేస్తున్నారు. మహిళల అక్రమ రవాణాలపై మాట్లాడుతున్న వవన్ కళ్యాణ్ సొంత పార్టీలోని మహిళకు అన్యాయం జరిగితే ఎందుకు నోరు మెదపడంలేదని నెటిజన్లు మండిపడుతున్నారు. ఓ వైపు కేసులు.. మరో వైపు పరువు ఓ వైపు పదో తరగతి పరీక్ష పత్రాల లీకేజీ కేసు, మరో వైపు అమరావతి భూముల వ్యవహారంలో అక్రమాల కేసుల్లో ఉన్న నారాయణకు తాజాగా సొంత మరదలు ప్రియ చేస్తున్న ఆరోపణలు మరింత ఇబ్బందిగా మారాయి. తన విద్యా సంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యల వెనుక ఉన్న చీకటి కోణాన్ని కూడా వెలుగులోకి తెస్తానని ఆమె చెప్పడం చర్చనీయాంశంగా మారింది. -
40 ఏళ్ళలో నెల్లూరు సిటీలో టీడీపీ గెలిచింది రెండుసార్లే
-
ఆ మహిళలిద్దరినీ వారి ఇళ్ల వద్దే విచారించండి
సాక్షి, అమరావతి: అమరావతి మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ డిజైన్ల ముసుగులో సాగిన భూ దోపిడీపై నమోదు చేసిన కేసులో.. తమ ముందు హాజరు కావాలంటూ సీఐడీ జారీ చేసిన నోటీసులను సవాల్ చేస్తూ మాజీ మంత్రి పొంగూరు నారాయణ, ఆయన సతీమణి రమాదేవి, నారాయణ విద్యా సంస్థల అకడమిక్ డైరెక్టర్ పొత్తూరి ప్రమీల హైకోర్టును ఆశ్రయించారు. ఆ నోటీసులను కొట్టేయాలని కోరుతూ ముగ్గురూ వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై శుక్రవారం న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్లలో ఇద్దరు మహిళలున్నారని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మహిళలను వారి ఇంటి వద్దే విచారించాల్సి ఉంటుందన్నారు. ఇదే కేసులో నారాయణను ఆయన ఇంటి వద్దే విచారించాలని హైకోర్టు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిందని గుర్తు చేశారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. మహిళలిద్దరినీ వారి ఇళ్ల వద్దే విచారించాలని సీఐడీని ఆదేశించారు. -
మాజీ మంత్రి నారాయణ కుమార్తె నివాసంలో ఏపీ సీఐడీ సోదాలు
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి నారాయణ రెండో కుమార్తె నివాసంలో ఏపీ సీఐడీ సోదాలు చేపట్టింది. హైదరాబాద్ మాదాపూర్లోని శరణి నివాసంలో సీఐడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మనీ రూటింగ్కు పాల్పడి అమరావతిలో భూముల కొనుగోలు చేసినట్లు సీఐడీ అధికారులు గుర్తించారు. దాదాపు 146 ఎకరాలు కొనుగోలు చేసినట్టుగా గుర్తించగా.. పక్కా ఆధారాలతో సోదాలు చేస్తున్నట్టుగా సీఐడీ వర్గాలు వెల్లడించాలి. -
నారాయణ క్వాష్ పిటిషన్పై రిజిస్ట్రీ అభ్యంతరం
సాక్షి, అమరావతి: పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో తన బెయిల్ను రద్దు చేస్తూ చిత్తూరు సెషన్స్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ నారాయణ విద్యా సంస్థల అధినేత, మాజీ మంత్రి పొంగూరు నారాయణ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై హైకోర్టు రిజిస్ట్రీ అభ్యంతరం లేవనెత్తింది. సెషన్స్ కోర్టు ఉత్తర్వులపై క్వాష్ పిటిషన్ దాఖలుకు వీల్లేదని, రివిజన్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని తెలిపింది. రిజిస్ట్రీ అభ్యంతరంపై న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్రావు మంగళవారం విచారణ జరిపారు. నారాయణ తరపున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపిస్తూ.. సీఆర్పీసీ సెక్షన్ 482 కింద క్వాష్ పిటిషన్ దాఖలు చేయడంపై నిషేధం లేదని అన్నారు. సెషన్స్ కోర్టు ఉత్తర్వులపై దాఖలు చేసే క్వాష్ పిటిషన్కు విచారణార్హత ఉందంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉదహరించారు. దీంతో రిజిస్ట్రీ అభ్యంతరాన్ని న్యాయమూర్తి తోసిపుచ్చారు. నారాయణ పిటిషన్కు నంబరు కేటాయించాలని ఆదేశించారు. లూత్రా వాదనలు కొనసాగిస్తూ.. బెయిల్ను రద్దు చేస్తూ జిల్లా, సెషన్స్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు చెల్లవని అన్నారు. అన్ని ఆధారాలను పరిగణనలోకి తీసుకున్న తరువాతే మేజిస్ట్రేట్ కోర్టు బెయిల్ మంజూరు చేసిందన్నారు. పైగా, అవి తాత్కాలిక ఉత్తర్వులేనని తెలిపారు. తాత్కాలిక ఉత్తర్వులపై పోలీసులు రివిజన్ పిటిషన్ దాఖలు చేయడానికి వీల్లేదని, దానికి విచారణార్హత లేదని వివరించారు. నారాయణ పబ్లిక్ సర్వెంట్ కాదని, అందువల్ల ఐపీసీ సెక్షన్ 409 కింద విచారణకు వీల్లేదన్నారు. పోలీసుల తరపున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ దుష్యంత్రెడ్డి స్పందిస్తూ.. ఈ కేసులో అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదనలు వినిపిస్తారని, అందువల్ల విచారణను వాయిదా వేయాలని కోరారు. దీంతో న్యాయమూర్తి తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. -
మాజీ మంత్రి నారాయణను ఆయన ఇంటి వద్దే విచారించండి
సాక్షి, అమరావతి: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ డిజైన్ల మార్పు ముసుగులో సాగిన భూ దోపిడీపై నమోదు చేసిన కేసులో మాజీ మంత్రి పొంగూరు నారాయణను ఆయన ఇంటి వద్దే న్యాయవాది సమక్షంలో విచారించాలని సీఐడీకి హైకోర్టు స్పష్టం చేసింది. ఎప్పుడు విచారించాలనుకుంటున్నారో నిర్ణయించాక 24 గంటల ముందు ఆ విషయాన్ని నారాయణకు తెలియచేయాలంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్రావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. నారాయణ అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో న్యాయమూర్తి ఈ ఆదేశాలిచ్చారు. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ డిజైన్ల మార్పు ముసుగులో సాగిన భూ దోపిడీపై సీఐడీ ఇటీవల కేసు నమోదు చేసింది. సీఐడీ ఆయనకు సీఆర్పీసీ సెక్షన్ 160 కింద నోటీసు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన ఆ నోటీసును రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నారాయణ తరఫున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ, పిటిషనర్ శస్త్ర చికిత్స చేయించుకున్నారని, వైద్యుల సూచన మేర మూడు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి న అవసరం ఉందన్నారు. నిబంధనల ప్రకారం 60 ఏళ్లు నిండిన వారిని వారి ఇంటి వద్దే విచారించాల్సి ఉంటుందని తెలిపారు. -
నారాయణకు చుక్కెదురు
చిత్తూరు అర్బన్: టీడీపీ నేత, నారాయణ విద్యా సంస్థల అధినేత పొంగూరు నారాయణకు చిత్తూరు జిల్లా కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పదో తరగతి పబ్లిక్ పరీక్షల సమయంలో ప్రశ్నపత్రాల మాల్ప్రాక్టీస్కు పాల్పడ్డ వ్యవహారంలో మాజీ మంత్రి నారాయణకు మేజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన బెయిల్ను రద్దు చేసింది. ఈ మేరకు చిత్తూరులోని 9వ అదనపు జిల్లా సెషన్స్ న్యాయస్థానం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 30లోపు నారాయణ కోర్టులో లొంగిపోవాలని న్యాయమూర్తి శ్రీనివాసులు ఆదేశాలిచ్చారు. నారాయణ కోర్టులో లొంగిపోయిన అనంతరం ఆయనను జుడీషియల్ రిమాండ్కు తరలించాలని తన ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 27న పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో తెలుగు కాంపోజిట్ ప్రశ్నపత్రాన్ని తిరుపతి నారాయణ పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ ఎన్.గిరిధర్రెడ్డి ‘చిత్తూరు టాకీస్’ అనే వాట్సాప్ గ్రూప్లో పోస్టు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై చిత్తూరు డీఈవో పురుషోత్తం ఇచ్చిన ఫిర్యాదుతో వన్టౌన్ సీఐ నరసింహరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఏప్రిల్ 29న తిరుపతి జిల్లా చంద్రగిరిలోని శ్రీకృష్ణారెడ్డి చైతన్య ప్రిన్సిపాల్ పి.సురేష్, తిరుపతి ఎన్ఆర్ఐ అకాడమీ ఆంగ్ల ఉపాధ్యాయుడు కె.సుధాకర్, తిరుపతి చైతన్య పాఠశాల ప్రిన్సిపాల్ ఆరిఫ్, డీన్ కె.మోహన్, గిరిధర్రెడ్డిలతోపాటు గంగాధర నెల్లూరు మండలంలో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న పవన్కుమార్రెడ్డి, బి.సోమును అరెస్టు చేశారు. వీరిలో ప్రభుత్వ ఉపాధ్యాయులు మినహా మిగిలినవాళ్లంతా గతంలో నారాయణ విద్యాసంస్థల్లో పనిచేసినవాళ్లే కావడం గమనార్హం. గిరిధర్రెడ్డి, సుధాకర్, సురేష్, పవన్కుమార్రెడ్డిలను మే 9న కస్టడీకు తీసుకుని విచారించారు. టీడీపీ నేత నారాయణ ఆదేశాలతోనే తాము ఇదంతా చేసినట్లు నిందితులు అంగీకరించారు. నారాయణ ఆదేశాలతో ఆ సంస్థ సిబ్బంది మరికొందరు కార్పొరేట్ విద్యాసంస్థల ప్రతినిధులతో కలిసి మాల్ప్రాక్టీస్కు పాల్పడ్డారని వెల్లడైంది. దీంతో నారాయణను మే 10న ఐపీసీ 5 రెడ్విత్ 8, 10 ఎగ్జామినేషన్ మాల్ప్రాక్టీస్ యాక్టు 408, 409, 201, 120 (బి) ఐపీసీ, 65 ఆఫ్ ఐటీ యాక్ట్ సెక్షన్ల కింద అరెస్టు చేశారు. ఈ వ్యవహారంలో చిత్తూరులోని నాలుగో అదనపు ఇన్చార్జ్ మేజిస్ట్రేట్ సులోచనరాణి.. నారాయణకు బెయిల్ మంజూరు చేశారు. దీనిపై పోలీసులు చిత్తూరు జిల్లా కోర్టులో సవాలు చేశారు. ఇదే కేసులో మిగిలిన నిందితులకు జుడీషియల్ రిమాండ్కు ఆదేశించారని అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తాజాగా తీర్పును వెలువరించింది. -
నారాయణ, లింగమనేని దేశం విడిచి వెళ్లరాదు!
సాక్షి, అమరావతి: అమరావతి మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ డిజైన్ల ముసుగులో సాగిన భూ దోపిడీపై ఇటీవల సీఐడీ నమోదు చేసిన కేసులో నిందితులుగా ఉన్న మాజీమంత్రి పొంగూరు నారాయణ, వ్యాపారవేత్త లింగమనేని రమేశ్, అతని సోదరుడు లింగమనేని వెంకటసూర్య రాజశేఖర్, రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్ డైరెక్టర్ కేపీవీ అంజనీకుమార్లకు హైకోర్టు ఊరటనిచ్చింది. సీఐడీ నమోదు చేసిన కేసులో వారికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కానీ, కొన్ని షరతులు విధించింది. ఈ కేసులో చార్జిషీట్ దాఖలు చేసేంత వరకు దేశంలోనే ఉండాలని నిందితులను హైకోర్టు ఆదేశించింది. ఒకవేళ దేశం విడిచి వెళ్లాలంటే సంబంధిత కోర్టు అనుమతి తీసుకోవాలని వారికి స్పష్టంచేసింది. రూ.50వేలతో రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు మంగళవారం తీర్పు వెలువరించారు. ఆళ్ల ఫిర్యాదు.. సీఐడీ కేసు.. అమరావతి ఇన్నర్ రింగ్రోడ్డు అలైన్మెంట్ డిజైన్ల మార్పు ముసుగులో భారీ భూ దోపిడీ జరిగిందంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సీఐడీకి ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా మాజీ సీఎం చంద్రబాబునాయుడు, మాజీమంత్రి పొంగూరు నారాయణ, వ్యాపారవేత్త లింగమనేని రమేశ్, అతని సోదరుడు లింగమనేని వెంకటసూర్య రాజశేఖర్, రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్ డైరెక్టర్ కేపీవీ అంజనీకుమార్ తదితరులపై సీఐడీ ఈ ఏడాది మే 9న కేసు నమోదు చేసింది. ఈ కేసులో తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ నారాయణ, లింగమనేని సోదరుడు, అంజనీకుమార్ వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు విచారణ జరిపారు. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి జూన్ 17కు తీర్పును వాయిదా వేశారు. తీర్పు రిజర్వ్ చేసిన రెండున్నర నెలల తరువాత న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. -
‘ఇంతకన్నా దిగజారుడుతనం ఏమైనా ఉందా బాబు..’
సాక్షి, అమరావతి: మాల్ ప్రాక్టీస్ తప్పు కాదని టీడీపీ చెప్పగలదా? అంటూ ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. మాల్ ప్రాక్టీస్కు పాల్పడి మళ్లీ ఎదురుదాడికి దిగుతున్నారని.. తప్పు చేసింది ఎవరైనా వదిలేది లేదని సజ్జల హెచ్చరించారు. చదవండి: కార్పొరేట్ విద్యా మాఫియా అధిపతి నారాయణ చరిత్ర ఇదే.. మాల్ ప్రాకిస్ట్పై వేగంగా స్పందించి చర్యలు తీసుకున్నామన్నారు. గతంలో ఎన్నడూ ఇంతవేగంగా చర్యలు తీసుకున్నది లేదన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటే చర్యలు తీసుకోవద్దా? ఓ మాఫియాలా ఏర్పడి మాల్ప్రాక్టీస్కు పాల్పడ్డారు. వంద శాతం ఉత్తీర్ణత కోసం ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారు. తప్పు జరిగినప్పుడు చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. రాజకీయ కక్ష అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. విప్లవకారుడు అరెస్ట్ అయినట్లు చంద్రబాబు హడావుడి చేస్తున్నారు. నారాయణ ఆ సంస్థలకు సంబంధం లేదంటారా.?. ఇప్పుడు అల్లుడు, కూతురు డైరెక్టర్లు అంటున్నారు. అయితే వాళ్లని అరెస్ట్ చేయొచ్చా.? నారాయణ గైడ్ చేసి నేరం చేయించాడని గిరిధర్ చెప్తున్నాడు. మరి అతను నేరం చేయలేదా?.ఇంతకన్నా దిగజారుడుతనం ఏమైనా ఉందా చంద్రబాబు’’ అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి దుయ్యబట్టారు. -
కార్పొరేట్ విద్యా మాఫియా అధిపతి నారాయణ చరిత్ర ఇదే..
పొంగూరు నారాయణ.. జిల్లాకు చెందిన ఈయన విద్యాసంస్థల్లో జరుగుతున్న అక్రమాలకు అంతేలేదు. పేపర్ లీకేజీలు చేయించి లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడారు. ఒత్తిడి తట్టుకోలేక ఆ కాలేజీల్లో ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. నారాయణ ప్రస్తుతం టెన్త్ పేపర్ లీకేజీ, అమరావతి ల్యాండ్ పూలింగ్లో అవినీతి కేసులో కీలక నిందితుడిగా పోలీస్ రికార్డుల్లోకెక్కారు. దీంతో ఈ మాజీ మంత్రి అవినీతి, అక్రమాల చరిత్ర చర్చనీయాంశంగా మారింది. సాక్షి, నెల్లూరు: పొంగూరు నారాయణకు ప్రత్యక్ష రాజకీయ అనుభవం లేకున్నా చంద్రబాబు 2014 సంవత్సరంలో ఏకంగా రాష్ట్ర మంత్రి పదవిని కట్టబెట్టారు. అంతేకాకుండా టీడీపీ అమరావతి రాజధాని భూములు వ్యవహారాన్ని అప్పగించారు. రాజధాని ఏర్పాటు ముసుగులో ల్యాండ్ పూలింగ్లో అక్రమాలు అలాగే ఇన్నర్ రింగ్రోడ్లో అవకతవకలు చేసినట్లు గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళగిరి సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. అందులో ఏ2 నిందితుడిగా నారాయణ ఉన్నారు. టెన్త్ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ఆయన్ను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఆది నుంచి వివాదాలే.. నారాయణ ఆయన విద్యా సంస్థలపై మొదటి నుంచి వివాదాలున్నాయి. విద్యార్థులపై అధిక ఒత్తిడి తెస్తారనే ఆరోపణలున్నాయి. తమ విద్యాసంస్థల్లో లక్షల మందిని జాయిన్ చేసుకుంటారు. కొంచెం బాగా చదివే వారిని ఎంచుకుంటారు. వారి కోసం పరీక్షల సమయంలో పేపర్ లీకేజీ చేయించి రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు తెప్పించి పబ్లిసిటీ చేయించుకోవడం పరిపాటిగా మారిందని అనేకమంది చెబుతున్న మాట. ఆ విద్యాసంస్థల్లో నిర్భంద విద్యతో మానసిక ఒత్తిడికి లోనైన విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలున్నాయి. గత టీడీపీ హయాంలోనే పదుల సంఖ్యలో విద్యార్థులు బలవన్మరాణానికి పాల్పడ్డారు. మంత్రిగా ఉన్న నారాయణపై ఎలాంటి కేసుల్లేకుండా చేసుకోవడంపై అప్ప›ట్లో ప్రభుత్వంపై ఆరోపణలొచ్చాయి. చదవండి: (ఏపీ సీఐడీ అదుపులో మాజీ మంత్రి నారాయణ) ప్రలోభాలకు గురిచేసి.. జిల్లాలో ఉన్న అన్ని విద్యాసంస్థల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించేందుకు, అలాగే ఎంపిక విద్యార్థులు టాపర్లుగా రాణించేందుకు అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి. పలు సెంటర్లో ఇన్విజిలేటర్లను ప్రలోభాలకు గురిచేశారని ప్రచారం ఉంది. ఇందుకు గానూ పలువురు విద్యార్థుల నుంచి రూ.5 వేలు చొప్పున వసూలు చేశారని చెబుతున్నారు. గుర్తింపు రద్దు చేయాలి నెల్లూరు(టౌన్): పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో బాధ్యులుగా తేలిన నారాయణ విద్యాసంస్థల గుర్తింపును వెంటనే రద్దు చేయాలని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు యశ్వంత్సింగ్ డిమాండ్ చేశారు. ఆ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలంటూ మంగళవారం జిల్లా విద్యాశాఖ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లీకేజీకి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. ధర్నా నిర్వహించిన యశ్వంత్సింగ్ తదితరులను అరెస్ట్ చేసి దర్గామిట్ట పోలీసుస్టేషనుకు తరలించారు. చదవండి: (అప్రూవర్గా మారిన వైస్ ప్రిన్సిపల్ గిరిధర్.. నారాయణ ప్రోద్బలంతోనే..) నారాయణ చరిత్ర ఇది.. ► 1979లో సాధారణ కోచింగ్ సెంటర్ ప్రారంభం. ► మూడేళ్లపాటు ట్యూషన్ చెప్పుకుంటూ 1983లో నారాయణ స్కూల్, కాలేజీలకు అనుమతులు తెచ్చుకున్నారు. ► నెల్లూరులోనే స్కూల్, కాలేజీలను నిర్వహించుకుంటూ అనంతరం దేశస్థాయిలోనే 970 బ్రాంచ్ల ఏర్పాటు. ► ఎనిమిది ప్రొఫెషనల్ కాలేజీలు, ఒక మెడికల్ కాలేజీ, రెండు ఇంజినీరింగ్ కాలేజీలు, ఒక డెంటల్ కాలేజీ, ఒక నర్సింగ్ కాలేజీ, ఒక ఫార్మసీ కాలేజీ ఏర్పాటు చేసుకుని విద్యారంగాన్ని శాసించే స్థాయికి ఎదిగారు. ► ఇద్దరి భార్యలు, ఇద్దరి కుమార్తెలతో ట్రస్టు ఏర్పాటు చేసుకుని ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి విద్యను వ్యాపారంగా మార్చుకుని రూ.వేల కోట్లకు అధిపతిగా మారారు. ► టీడీపీ అధినేత చంద్రబాబుకు బినామీగా ఉంటూ 2014 ఎన్నికల్లో రూ.వందల కోట్లను పార్టీకి ఫండ్గా ఇచ్చి మూడు జిల్లాల పార్టీ అభ్యర్థులకు ఆర్థిక సహకారం అందించారు. ► 2014లో టీడీపీ అధికారంలోకి రాగానే చంద్రబాబు తన బినామీ నారాయణకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిగా అవకాశం కల్పించారు. టీడీపీ నేతల డ్రామా విద్యార్థుల భవిష్యత్తో ఆటలాడుకున్న మాజీ మంత్రి నారాయణ అరెస్ట్పై తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తుంటే టీడీపీ నేతలు మాత్రం అక్రమ అరెస్ట్ చేశారంటూ డ్రామా చేశారు. దీంతో జిల్లా వాసులు వారి తీరును అసహ్యించుకుంటున్నారు. జిల్లాలో కార్పొరేట్ విద్య పేరుతో మాఫియాగా ఏర్పడి తల్లిదండ్రుల నుంచి అడ్డగోలు దోపిడీ చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా టెక్నో, ఈ–టెక్నో, ఒలింపియాడ్ అంటూ ప్రత్యేక కోర్సులు, ఐఐటీలో ర్యాంకులు అంటూ ప్రతి విద్యార్థి వద్ద రూ.లక్షల్లో వసూలు చేస్తున్నారు. పుస్తకాలు, యూనిఫాం పేరుతో ఇంకా వసూలు చేస్తుంటారు. నారాయణ అరెస్ట్ను తమ రాజకీయ స్వార్థం కోసం టీడీపీ వాడుకోవడంపై జిల్లావాసులు మండిపడుతున్నారు. చంద్రబాబుకు సన్నిహితుడు టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా పేరున్న నారాయణ గతంలో ఆ పార్టీ ఆర్థిక వ్యవహారాలు చక్కబెడుతుంటారు. అలాగే విద్యాసంస్థల ఉద్యోగులచే సర్వేలు చేయించి చంద్రబాబుకు అత్యంత నమ్మకస్తుడిగా మారాడు. దీంతో 2014లో టీడీపీ అధికారంలోకి రాగానే తనకు బినామీగా ఉన్న నారాయణకు మంత్రి పదవి కట్టబెట్టి ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. జిల్లాలో ఎందరో సీనియర్ నేతలు ఉన్నా వారిని కాదని నారాయణకు పదవి ఇచ్చారు. ఫలితాలను హైజాక్ చేస్తున్నారు కార్పొరేట్ పాఠశాలలు అవ కాశమున్న చోట్ల పరీక్ష ప్రశ్నపత్రాలు లీక్ చేయిస్తూ తమ స్కూళ్ల విద్యార్థులచే అన్ని జవాబులు రాయించి తెలి వైన విద్యార్థులున్న ప్రభుత్వ పాఠశాలల ఫలితాలను హైజాక్ చేస్తున్నారు. వారి వ్యాపారం పెంచుకునేందుకు దారుణమైన పరిస్థితులు సృష్టిస్తున్నారు. ఇటీవల పదో తరగతి పరీక్ష ప్రశ్నాపత్రాలు లీక్ కావడం అందులో భాగమే. ప్రభుత్వం ఇలాంటి విషయాల్లో కఠినంగా వ్యవహరించాల్సిందే. – ఎం.రవిబాబు, టీచర్, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి, చేజర్ల కార్పొరేట్ల వల్ల విద్యావ్యవస్థ నాశనం కార్పొరేట్ విద్యాసంస్థలు వ్యాపార కోణంలో ఉంటూ విద్యావ్యవస్థను దెబ్బతిసేలా పబ్లిక్ పరీక్షలను సైతం తమ ఆధీనంలోకి తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. రాజకీయ పలుకుబడితో ఎన్నో అరాచకాలు చేసిన కార్పొరేట్ విద్యాసంస్థలను ప్రభుత్వం కట్టడి చేయాల్సి ఉంది. ఈ సంస్థల వల్ల ప్రభుత్వ పాఠశాలల్లోని తెలివైన విద్యార్థులు మానసికక్షోభకు గురవుతున్నారు. దీనికి పుల్స్టాఫ్ పెట్టాలి. – తోపుగుంట మోహన్, హెచ్ఎం, చేజర్ల మెయిన్ పాఠశాల దోషులపై చర్యలు తీసుకోవాలి ప్రశ్నపత్రం లీకేజీకి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. పూర్తిస్థాయిలో విచారణ జరిపి దీనివెనుక ఉన్న దోషులపై కేసులు నమోదు చేయాలి. ఉపాధ్యాయులు తప్పు చేశారంటే నమ్మలేకున్నాం. వారిపై చర్యలు ఉపసంహరించుకోవాలి. భవిష్యత్లో ఈ రీతిలో జరగకుండా విద్య, పరీక్ష ప్రణాళికలు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. – అల్లంపాటి సురేంద్రరెడ్డి, నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, ఏపీటీఎఫ్ లీకేజీకి పాల్పడడం తప్పే.. పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీకి పాల్పడడం పెద్ద తప్పు. ఈ లీకేజీ వెనుక ఎంతటివారున్నా విచారించి వారిని కఠినంగా శిక్షించాలి. భవిష్యత్లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవాలి. – నాటకం తిరుమలయ్య, నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, పీఆర్టీయూ ప్రభుత్వ చర్యలు అభినందనీయం పరీక్షల్లో ఎప్పటినుంచో జరుగుతున్న లీకేజీ బాగోతాన్ని ఇప్పటి ప్రభుత్వం బయటపెట్టింది. గతంలో జరిగినా అప్పటి ప్రభుత్వాలు మిన్నకున్నాయి. ఇప్పటి ప్రభుత్వం నిష్పక్షపాతంగా శిక్షించే కార్యక్రమాన్ని మొదలు పెట్టింది. విద్యార్థుల భవిష్యత్తో చెలగాటుమాడుతున్న ప్రయివేట్ విద్యాసంస్థల గుర్తింపును రద్దు చేయాలి. – కృష్ణారెడ్డి, జిల్లా అధ్యక్షుడు, పీఆర్టీయూ శాఖ -
పూలింగ్.. భారీ కుట్ర
సాక్షి, అమరావతి: గత ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న నారా చంద్రబాబు నాయుడు, పొంగూరు నారాయణలు ల్యాండ్ పూలింగ్ స్కీం (జీవో 41)ను ఓ సాధనంగా ఉపయోగించుకుని వారు లబ్ధి పొందడంతో పాటు, వారికి కావాల్సిన వారికి అయాచిత లబ్ధి చేకూర్చారని రాష్ట్ర క్రైం ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (సీఐడీ) హైకోర్టుకు నివేదించింది. ఈ మొత్తం వ్యవహారంలో భారీ కుట్ర దాగి ఉందని, ఇందులో అప్పటి గుంటూరు జాయింట్ కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ కీలక పాత్ర పోషించారని పేర్కొంది. రాజధాని గ్రామాల ఒరిజినల్ రెవిన్యూ రికార్డులను శ్రీధరే మాయం చేశారని, వాటి ఆచూకీ కేవలం ఆయనకు మాత్రమే తెలుసని స్పష్టం చేసింది. ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న పలువురు తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు, కార్యకర్తలు ఆ భూములను ల్యాండ్ పూలింగ్ స్కీం కింద ప్రభుత్వానికి స్వాధీనం చేసి, అత్యంత విలువైన నివాస, వాణిజ్య ప్లాట్లు పొందారని వివరించింది. తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రైవేటు వ్యక్తులు కొందరు అసైన్డ్దారులను బెదిరించి, భయపెట్టి కారు చౌకగా భూములు కొట్టేశారని.. వాటిని స్వాధీనం చేసి ల్యాండ్ పూలింగ్ స్కీం కింద ప్లాట్లు పొందారని, ఆ తర్వాత వాటిని అమ్మేసి కోట్ల రూపాయలు వెనకేసుకున్నారని తెలిపింది. ఇందుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేసింది. రాజధాని నిర్మాణానికి సంబంధించి అసైన్డ్ భూముల బదలాయింపులో భారీ అక్రమాలు జరిగాయంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీఐడీ.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, అప్పటి మంత్రి పొంగూరు నారాయణలపై కేసు నమోదు చేసింది. సీఐడీ తమపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ చంద్రబాబు నాయుడు, నారాయణలు హైకోర్టులో వేర్వేరుగా క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన హైకోర్టు.. సీఐడీ నమోదు చేసిన కేసులో దర్యాప్తుతో పాటు తదుపరి చర్యలపై స్టే విధించింది. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని సీఐడీని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ ఆదేశాల మేరకు సీఐడీ తరఫున ఈ కేసులో దర్యాప్తు అధికారిగా వ్యవహరిస్తున్న ఎ.లక్ష్మీనారాయణ రావు కౌంటర్లు దాఖలు చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. నేరపూరిత కుట్రతోనే జీవో 41 2021 ఫ్రిబవరి 24న ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీఐడీ అదనపు డీజీ ప్రాథమిక విచారణ జరిపి, అదే ఏడాది మార్చి 12న చంద్రబాబు, నారాయణ తదితరులపై కేసు నమోదు చేశారు. వంచన, మోసపూరిత లావాదేవీలు, దురుద్దేశపూర్వకంగా వ్యవహరించడం వంటివి ప్రాథమిక విచారణలో నిర్ధారణ అయ్యాయి. ఈ కేసులో నిందితులు ఏపీసీఆర్డీఏ, ఏపీ అసైన్డ్ భూముల బదలాయింపు నిషేధ చట్టం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. భూమి లేని పేదలకు ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్ భూములతో పాటు, ప్రభుత్వ భూములను కూడా చేజిక్కించుకుని ల్యాండ్ పూలింగ్ స్కీం కింద తమకూ, తమ వారికి లబ్ధి చేకూర్చేందుకు చట్ట విరుద్ధంగా జీవో 41 (ల్యాండ్ పూలింగ్ స్కీం రూల్స్) జారీ చేశారు. తద్వారా ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం చేకూర్చారు. దురుద్దేశంతోనే ఈ జీవో జారీ చేసినట్లు దర్యాప్తులో తేలింది. చట్టం నిర్ధేశించిన విధి విధానాలకు విరుద్ధంగా వ్యవహరించేందుకు, ఖజానాకు నష్టం చేకూర్చేందుకు జీవో 41ని ఓ సాధనంగా వాడుకున్నారు. బిజినెస్ రూల్స్కు, నిర్ధేశిత విధి విధానాలకు విరుద్ధంగా నేరపూరిత కుట్రతోనే ఈ జీవోను జారీ చేసినట్లు నోట్ ఫైళ్ల ద్వారా తెలిసింది. సీఆర్డీఏ చట్టానికి విరుద్ధం జీవో 41 జారీ చేసిన తర్వాత, అంతకు ముందు దానిని మంత్రి మండలి ముందు ఉంచలేదు. ముఖ్యమంత్రి, మంత్రి మండలి ఆమోదం లేకుండానే ఈ జీవోను తీసుకొచ్చినట్లు దర్యాప్తులో తేటతెల్లమైంది. జీవో విడుదలైన తర్వాత ముఖ్యమంత్రి, సంబంధిత ఇన్చార్జ్ మంత్రి దానికి ఆమోద ముద్ర వేశారు. ఇలా చేయడం నేరం కాకపోయినా, ఈ జీవో జారీ అయిన సమయం, విధానం, దాని వెనుక ఉద్దేశాలే ప్రశ్నించదగ్గవి. రాజధాని నిర్మాణానికి సంబంధించి అత్యంత ముఖ్యమైన ల్యాండ్ పూలింగ్ విధానానికి సంబంధించిన జీవో జారీ చేయడం వెనుక విధి విధానాల పరమైన అక్రమాలు, సీఆర్డీఏ చట్ట నిబంధనల ఉల్లంఘనలు ఉండటం గమనార్హం. సీఆర్డీఏ చట్ట నిబంధనల ప్రకారం జీవో 41ని శాసనసభ ఆమోదం కోసం సభ ముందు ఉంచలేదు. 2016 ఫిబ్రవరి 17న జీవో 41 జారీ అయింది. అసైన్డ్ భూములను తీసుకోవడం నేరం ► ఏపీ అసైన్డ్ భూముల బదలాయింపు నిషేధ చట్టంలోని సెక్షన్ 3, 4, 5 ప్రకారం అసైన్డ్ భూముల సేకరణ, ఇతర లావాదేవీలు నిషిద్ధం. చట్ట విరుద్ధంగా అసైన్డ్ భూములను తీసుకుంటే, అలా తీసుకున్న వ్యక్తిని చట్టం నిర్ధేశించిన విధానం ప్రకారం ఖాళీ చేయించే అధికారం జిల్లా కలెక్టర్కు ఉంది. ► అసైన్డ్ భూములను సేకరిస్తే పడే శిక్ష గురించి సెక్షన్ 7(1) చెబుతోంది. భూమి లేని వారికి ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్ భూములను కాపాడాల్సిన బాధ్యత సంబంధిత అధీకృత అధికారిపై ఉంది. ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా కూడా విధి నిర్వహణలో చట్ట ఉల్లంఘనలకు పాల్పడటం, అసైన్డ్ భూములను చట్ట విరుద్ధంగా కలిగి ఉన్న వారిని కాపాడటం, ఆ ఆస్తి జప్తు కాకుండా రక్షించడం భారత శిక్షా స్మృతి (ఐపీసీ) కింద నేరం. ► చంద్రబాబు, నారాయణలు ఆ సమయంలో కీలక పదవుల్లో ఉన్నారు. వారి ఆమోదం లేకుండా జీవో 41 జారీ అయ్యే అవకాశమే లేదు. అసైన్డ్ భూములను కొనకూడదని తెలిసినా, వీరి మద్దతుతో టీడీపీ పెద్దలు పెద్ద సంఖ్యలో అసైన్డ్ భూములు కొనడం నేరం. దానిని గత ప్రభుత్వం రెగ్యులర్ చేయడం మరో నేరం. ► దర్యాప్తులో భాగంగా అప్పట్లో నిబంధనలను రూపొందించిన ప్రభుత్వాధికారులను సాక్షులుగా విచారించాం. ఆ రూల్, జీవో అసైన్డ్ భూముల బదలాయింపు నిషేధ చట్టానికి విరుద్ధమని స్పష్టంగా చెప్పినట్లు ఆ అధికారులు తమ వాంగ్మూలంలో పేర్కొన్నారు. ► అయినా కూడా చంద్రబాబు, నారాయణలు అధికారుల సిఫారసులను పట్టించుకోకుండా జీవో 41 జారీ చేశారు. దీనిపై తదుపరి దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో వారు ఎలాంటి రక్షణ కోరజాలరు. పథక రచన ఇట్టే అర్థమవుతోంది.. ► ప్రతిపక్షాలను వేధించేందుకే అధికార పక్షం ఇలాంటి కేసులు పెడుతోందన్న చంద్రబాబు, నారాయణ వాదనలో ఎలాంటి నిజం లేదు. ఇందుకు ఎలాంటి ఆధారాలు కూడా లేవు. సీఐడీ ప్రాథమిక విచారణ నివేదికను పరిశీలిస్తే, ఆ మొత్తం వ్యవహారంలో చంద్రబాబు, నారాయణలు ఇతరులతో కలిసి సాగించిన ‘పథక రచన’ ఏమిటో తెలుస్తుంది. ► ప్లాట్ల కేటాయింపులో అక్రమాలు, అనర్హులకు చేసిన మేళ్లు, తద్వారా సీఆర్డీఏకు జరిగిన నష్టం తదితరాలను ప్రాథమిక విచారణ నివేదిక స్పష్టంగా చూపుతోంది. ► రెవిన్యూ రికార్డుల ప్రకారం ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న వారికి అసైన్మెంట్ పట్టాలు ఇవ్వడానికి వీల్లేదు. పట్టాలు లేకుండా అక్రమంగా భూములను స్వాధీనంలో ఉంచుకుని సాగు చేస్తున్నారు. ఒక్కో అంశంపై లోతైన విచారణ జరపాల్సి ఉంది. అసైన్డ్దారులను భయపెట్టారు.. ► ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కేటగిరి 4 (శివాయి జమాదార్లు), కేటగిరి 5, 6ల కింద భూములు ఇచ్చేందుకు ముందుకొచ్చిన వారి వివరాలను ప్రాథమిక విచారణలో సీఆర్డీఏ నుంచి పొందాం. ఈ వివరాలను క్షేత్ర స్థాయి పరిశీలన ద్వారా పోల్చి చూశాం. ► కేటగిరి 4 కింద ల్యాండ్ పూలింగ్ స్కీమ్కు భూములు ఇచ్చి, అందుకు ప్రతిగా ప్లాట్లు పొందిన వారిలో తెలుగుదేశం పార్టీకి అత్యంత సన్నిహితులు, ఆ పార్టీ కార్యకర్తలు ఉన్నట్లు గుర్తించాం. మంగళరి సబ్ రిజిష్ట్రార్ కార్యాలయంలో అసైన్డ్ భూములను రిజిష్టర్ చేసేందుకు ప్రయత్నించి విఫలమైన వారిలో వీరు ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ► జీవో 41 ల్యాండ్ పూలింగ్ స్కీం రూల్స్ గురించి ముందే తెలిసిన అప్పటి అధికార పార్టీకి చెందిన వ్యక్తులు, అసైన్డ్ భూములను ప్రభుత్వం వెనక్కు తీసేసుకుంటుందని, అంతిమంగా ఆ భూములకు ఎలాంటి లబ్ధి ఉండదని అసైన్డ్ భూములున్న వారిలో భయాందోళనలు కలిగించారు. ► అంతిమంగా అసైన్డ్దారుల నుంచి భూములను అన్ రిజిష్టర్డ్ సేల్ అగ్రిమెంట్ల ద్వారా నామమాత్రపు ధరలకు తీసేసుకున్నారు. ఆ తర్వాత వీరంతా కూడా ఆ భూములను ల్యాండ్ పూలింగ్ స్కీం కింద సీఆర్ఏడీకు ఇచ్చి, జీవో 41ని అడ్డం పెట్టుకుని అందుకు ప్రతిగా నివాస, వాణిజ్య ప్లాట్లు పొందారు. ► కొందరు ఇలా పొందిన నివాస, వాణిజ్య ప్లాట్లకు అధిక ధరలకు అమ్ముకున్నారు. అంతిమంగా కోట్ల రూపాయల మేర వ్యక్తి గతంగా లబ్ధి పొందారు. ఖజానాకు భారీ నష్టం చేకూర్చారు. ఆ రికార్డుల గురించి శ్రీధర్కు మాత్రమే తెలుసు ► అప్పటి అడ్వొకేట్ జనరల్ ఇచ్చిన సలహాలు ఏవీ కూడా నోట్ ఫైళ్లలో లేవు. ఆ సలహాల సర్టిఫైడ్ కాపీలను అడ్వొకేట్ జనరల్ కార్యాలయం నుంచి పొందాం. అసైన్డ్ భూములను అమ్మడానికి వీల్లేదని, కొనుగోలుదారులను ఖాళీ చేయించాలని అడ్వొకేట్ జనరల్ స్పష్టమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. ► అయితే చంద్రబాబు, నారాయణలు అడ్వొకేట్ జనరల్ అభిప్రాయాన్ని కాలరాసి, చట్ట నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. 2014 సెప్టెంబర్ 29 – 2014 నవంబర్ 5 మధ్య గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తహసీల్దార్గా పని చేసిన మాజేటి తిరుపతి వెంకటేశ్వర్లు వాంగ్మూలాన్ని నమోదు చేశాం. ఆ సమయంలో గుంటూరు జాయింట్ కలెక్టర్గా చెరుకూరి శ్రీధర్ ఉన్నారని వెంకటేశ్వర్లు చెప్పారు. ► శ్రీధర్ మౌఖిక ఆదేశాల ప్రకారం తుళ్లూరు మండల పరిధిలోని గ్రామాలకు చెందిన ఆర్ఎస్ఆర్, ఎఫ్ఎంబీ, అడంగల్స్, 1బీ తదితర ఒరిజినల్ రికార్డులన్నింటినీ ఆయనకు అప్పగించానని, వీటి అప్పగింత విషయంలో అక్నాలజ్డ్మెంట్ తీసుకోలేదని వెంకటేశ్వర్లు తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. ► 2014 అక్టోబర్ 31న వెంకటేశ్వర్లు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో అన్నే సుధీర్బాబు తహసీల్దార్గా వచ్చారు. ► 2014– 1బీ అడంగల్ను పరిశీలిస్తే అసైన్డ్దారులు, ల్యాండ్ పూలింగ్ స్కీం కింద భూములు ఇచ్చిన వ్యక్తులు వేర్వేరు. ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న ఆక్రమణదారులు ల్యాండ్ పూలింగ్ స్కీం కింద భూములు ఇచ్చారు. ► రాజధాని గ్రామాలకు సంబంధించిన ఒరిజినల్ రికార్డులు ఎక్కడ ఉన్నాయో చెరుకూరి శ్రీధర్కు మాత్రమే తెలుసు. ఆ రికార్డులను ఆయన సంబంధిత తహసీల్దార్కు గానీ, తన తర్వాత వచ్చిన జాయింట్ కలెక్టర్కు గానీ అప్పగించలేదు. ఈ అధికారే ఆ తర్వాత సీఆర్డీఏ కమిషనర్గా నియమితులయ్యారు. ► ల్యాండ్ పూలింగ్ స్కీం జీవో 41ని అడ్డంపెట్టుకుని ఓ క్రమ పద్ధతిలో అక్రమాలకు తెరలేపి కుట్రకు పాల్పడ్డారని స్పష్టంగా తెలుస్తోంది. సీఐడీ ఇప్పటికే అన్నే సుధీర్బాబు, బ్రహ్మానందరెడ్డిలపై కేసు నమోదు చేసింది. వారి కార్యాలయాల్లో తనిఖీలు చేయగా, పలు కీలక ఫొటోలు, డాక్యుమెంట్లు, వీడియోలు లభించాయి. వీటిపై కూడా లోతుగా విచారణ జరపాల్సి ఉంది. బాబు, నారాయణల భాగస్వామ్యం ► ఈ వ్యవహారంలో మరింత లోతుగా విచారణ జరిపితే అప్పటి ప్రభుత్వానికి సన్నిహితులైన వ్యక్తుల పేర్లు, జీవో 41 ద్వారా లబ్ధి పొందిన ప్రముఖుల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఓ వర్గ ప్రజలకు ఆయాచిత లబ్ధి చేకూర్చేందుకే జీవో 41ని తీసుకొచ్చారని స్పష్టమైంది. ► ఈ కేసులో నిందితులుగా ఉన్న వ్యక్తులు, మరికొందరు నిందితులతో కలిసి తప్పుడు రిపోర్టులు తయారు చేశారు. వాటిని పబ్లిక్ రిపోర్టుల్లో చేర్చారు. అంతిమంగా సీఆర్డీకు, ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూర్చారు. దీని వెనుక లోతైన కుట్ర ఉంది. ఈ దశలో చంద్రబాబు, నారాయణలు ఈ పిటిషన్లు వేసి దర్యాప్తును అడ్డుకోవాలని చూస్తున్నారు. ► ఈ వ్యాజ్యాలు అపరిపక్వమైనవి. ప్రస్తుత అధికార ప్రభుత్వంపై పిటిషనర్లు చేస్తున్న నిందారోపణలకు ఎలాంటి ఆధారాలు లేవు. ఈ నిందారోపణలను సాకుగా చూపి కేసు కొట్టేయాలని కోరుతున్నారు. ప్రాథమిక విచారణలో చంద్రబాబు, నారాయణలకు ఈ నేరంతో భాగస్వామ్యం ఉన్నట్లు తేలింది. భారీ కుట్ర ఉందనడంలో సందేహం లేదు ► రాజధాని ప్రాంత పరిధిలోని మూడు మండలాల తహసీల్డార్లకు కలెక్టర్ కార్యాలయం 2016 జూలై 8న లేఖలు రాసింది. ఈ మూడు మండలాలకు సంబంధించిన రివెన్యూ రికార్డులు అందుబాటులో లేవని, అందువల్ల క్షేత్ర స్థాయిలో సర్వే చేసి అసైన్డ్ భూముల యజమానులు ఎవరో తేల్చాలని వారిని ఆదేశించింది. ► అప్పటి తహసీల్దార్ వాంగ్మూలం, కలెక్టర్ కార్యాలయం రాసిన లేఖలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. అయితే ఈ రెండింటినీ పరిశీలిస్తే ఈ మొత్తం వ్యవహారంలో భారీ కుట్ర ఉందనే విషయంలో ఎలాంటి సందేహాలకు తావు లేదు. ► జాయింట్ కలెక్టరే 2014లో రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. మళ్లీ కలెక్టర్ కార్యాలయమే రికార్డులు అందుబాటులో లేవని 2016లో తహసీల్దారులకు లేఖలు రాస్తుంది. అసైన్మెంట్ వివరాలను రికార్డుల నుంచి తొలగించిన విషయం ప్రాథమిక విచారణలో తేలింది. అసలు వాస్తవంగా తెర వెనుక ఏం జరిగిందనేది లోతుగా దర్యాప్తు జరిపితే తెలుస్తుంది. ఒరిజినల్ రికార్డులు ఎక్కడున్నాయో తేల్చాల్సి ఉంది. దర్యాప్తును అడ్డుకోవడానికే ఈ పిటిషన్లు ► ప్రాథమిక దశలోనే దర్యాప్తును అడ్డుకోవడానికే చంద్రబాబు, నారాయణలు ఈ వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఫిర్యాదులో నేరాన్ని రుజువు చేసే ప్రాథమిక ఆధారాలున్నప్పుడు న్యాయస్థానాలు సాధారణంగా దర్యాప్తు విషయంలో జోక్యం చేసుకోవు. ► దర్యాప్తును పూర్తి చేసేందుకు అనుమతినిస్తాయి. ప్రస్తుత కేసులో పిటిషనర్లకు వ్యతిరేకంగా నిర్ధిష్టమైన ఆధారాలున్నాయి. కాగ్నిజబుల్ నేరానికి పాల్పడ్డారనేందుకు రుజువులున్నాయి. దర్యాప్తు అన్నది పూర్తిగా పోలీసుల పరిధిలోని వ్యవహారం. ► ఇందులో సీఆర్పీసీ సెక్షన్ 482 కింద న్యాయ స్థానాలు జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. కాగ్నిజబుల్ నేరంలో దర్యాప్తు జరిపే చట్టబద్ధమైన హక్కు, బాధ్యత పోలీసులకు ఉందని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. కాగ్నిజబుల్ నేరాల్లో న్యాయస్థానాలు దర్యాప్తును అడ్డుకోరాదని కూడా చెప్పింది. ► వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఈ కేసులో మార్చి 19న ఇచ్చిన స్టే ఉత్తర్వులను ఎత్తివేయండి. ఇదే సమయంలో చంద్రబాబు, నారాయణలు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టేయండి. ఈ మొత్తం నేరంలో గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పురపాలక శాఖ మంత్రిగా ఉన్న నారాయణలకు భాగస్వామ్యం ఉంది. వారి పాత్రపై ప్రాథమిక ఆధారాలు లభించాయి. వీరిద్దరూ ఇతర నిందితులతో కలిసి ‘పథక రచన’ చేసి కుట్ర పూరితంగా వ్యవహరించారు. లోతుగా విచారణ జరిపితే అనేక కీలక విషయాలు, వ్యక్తుల పేర్లు బయటకు వస్తాయి. ఇలాంటి దశలో దర్యాప్తును నిలుపుదల చేయడానికి వీల్లేదని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. అందువల్ల గతంలో ఇచ్చిన స్టే ఉత్తర్వులను ఎత్తివేయడంతో పాటు చంద్రబాబు, నారాయణలు దాఖలు చేసిన వ్యాజ్యాలను కొట్టేయాలి. – హైకోర్టులో సీఐడీ -
అబ్రకదబ్ర... అబ్రకదబ్ర
సాక్షి, కావలి (నెల్లూరు): ప్రజలకు ఏమీ చేయకుండానే అబ్రకదబ్ర...అబ్రకదబ్రా...అని అన్నీ చేసేసినట్లుగా దబాయించగల సమర్థులు కావలి టీడీపీ నాయకులు. అందుకే కావలి పట్టణంలో గత ఐదేళ్లుగా పేదలు ఇంటి స్థలాలు ఇవ్వాలని వేడుకున్నా కనికరించని టీడీపీ నాయకులు, తామే ఇంటిని నిర్మించి ఇస్తామని చెబుతూవచ్చారు. ఇలా నాలుగేళ్లు గడిపేశారు. ఇక ఏడాదిలో ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయని, ‘అపార్ట్మెంట్ల నిర్మాణం’ అనే డూప్ సినిమాను సిద్ధం చేసుకున్నారు.ఇందుకోసం రెండు శంకుస్థాపనలు... ఫ్లాట్ల కేటాయింపులు, గృహ ప్రవేశాలు చేశారు. ఇవన్నీ కూడా మంత్రులు నారా లోకేష్, సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, పొంగూరు నారాయణ సహకారంతో పట్టణంలో ‘అపార్ట్మెంట్ల నిర్మాణం’ అనే డూప్ సినిమాను టీడీపీ నాయకులు చూపించిన వైనమిది. పట్టణంలో టీడీపీ ప్రభుత్వం ఒక పక్కాగృహం కూడా నిర్మించి ఇవ్వలేదు. కానీ గృహప్రవేశాలు మాత్రం చేసేసినట్లుగా టీడీపీ నాయకులు డూప్ సినిమాను రక్తి కట్టించారు. కానీ ఎన్నికలు వచ్చేయడంతో తమ డూప్ సినిమా అట్టర్ ఫ్లాప్ అయిందని టీడీపీ నాయకులే తలలు పట్టుకుంటున్నారు. అట్టహాసంగా శంకుస్థాపనలు చంద్రమోహన్రెడ్డిలచే కావలి టీడీపీ నాయకుడు బీద మసాన్రావు శంకుస్థాపన అట్టహాసంగా చేయించి టీడీపీ నాయకులతో వైభవంగా సన్మానం చేయించారు. అక్కడ అపార్ట్మెంట్లు నిర్మిస్తున్నామని, వాటిలో ఫ్లాట్లనే పక్కా గృహాలుగా ఇస్తామని టీడీపీ నాయకులు అర్జీదారులకు గొప్పగా చెప్పసాగారు. కాగా నిర్మాణ పనులు జరుగుతుండగా వార్డుల వారీగా టీడీపీ నాయకులు ప్రజలను అక్కడకు తీసుకెళ్లి అక్కడేదో అద్భుతమైన నిర్మాణాలు జరుగుతున్నట్లుగా ‘నిర్మాణాలు ప్రత్యక్ష వీక్షణం’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. అసలు నిర్మాణాలు పూర్తి కాకుండా, గోడలను తమకు చూపించడం ఏమిటో...వీరి పైత్యం ఏమిటో అంటూ లబ్ధిదారులు విస్తుపోయారు. కొద్దిరోజులకు అంటే గత ఏడాది అక్టోబర్ 5 వతేది మంత్రి పొంగూరు నారాయణ చేత ఫ్లాట్ల కేటాయింపులు కార్యక్రమాన్ని నిర్వహించారు. అప్పటికీ నిర్మాణాలు సగం దశలో ఉన్నాయి. అప్పుడు కూడా అసలు నిర్మాణం పూర్తికాకుండానే ఈ కేటాయింపులు ఏమిటీ.. ఎందుకు తమల్ని ఇలా సతాయిస్తున్నారని లబ్ధిదారులు టీడీపీ నాయకులపై విమర్శలతో దండయాత్ర చేశారు. అనంతరం గత ఫిబ్రవరి 9 బీద మస్తాన్రావు ఫ్లాట్లలో గృహ ప్రవేశాలు అంటూ అచ్చం నిజమైన గృహ ప్రవేశాలు ఎలా చేస్తారో అలానే చేశారు. అంటే ఇంటి గుమ్మాలకు పూలు కట్టి, పాలు పొంగించి, ఆవును ఇంట్లోకి తీసుకెళ్లడం వంటి కార్యక్రమాలు చేశారు. విచిత్రం ఏమిటంటే అప్పటికీ ఫ్లాట్లు నిర్మాణ పనులు పూర్తి కాలేదు. ఇదే విషయాన్ని అబ్దిదారులు టీడీపీ నాయకులను నిలదీసి అడిగారు. వారు ఏమో మా నాయకుడు బీద మస్తాన్రావు లబ్ధిదారులను మద్దూరుపాడు వద్ద నిర్మిస్తున్న ఫ్లాట్ల వద్దకు తీసుకురమ్మన్నాడు, మేం మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాం అంటూ చెప్పి తప్పించుకున్నారు కావలి పట్టణానికి 7,501 ఇళ్లు మంజూరు అయితే, వాటిలో 2,112 ఇళ్లు (అపార్ట్మెంట్లులో ఫ్లాట్లు) మాత్రమే పట్టణానికి 5 కిలోమీటర్లు దూరంలో ఉన్న మద్దూరుపాడు రైస్మిల్లులు వెనుక నిర్మిస్తున్నారు. మిగిలిన 5,398 ఫ్లాట్లు కావలి పట్టణానికి ఐదు కిలోమీటర్లు దూరంలో జమ్మలపాలెం గ్రామం అటవీ ప్రాంతంలో ఉన్న స్థలంలో నిర్మించడానికి గత ఫిబ్రవరి 9 వ తేది శంకుస్థాపన చేశారు. ఈ శంకుస్థాపనకు కావలి టీడీపీ నాయకుడు బీద మస్తాన్రావు తనకన్నా వీఐపీ కావలిలో ఎవరున్నారుకున్నారో ఏమో కానీ, మంత్రులు ఎవరినీ పిలవకుండానే ఆయనే దర్జాగా శంకుస్థాపన చేసేశారు. కాగా రైతులకు చెందిన ఆ భూములకు నష్టపరిహారం ఇవ్వకుండా అపార్ట్మెంట్లు నిర్మిస్తే తాము ఊరుకోమని హెచ్చరించడంతో అక్కడ నిర్మాణ పనుల వ్యవహారం కేవలం శంకుస్థాపన వరకే పరిమితమైంది. ఇప్పుడు ఈ వ్యహారం అంతా గప్చుప్ అన్నట్లుగా టీడీపీ నాయకులు ఉండిపోయారు. లబ్ధిదారులు మాత్రం టీడీపీ నాయకులు నాలుగేళ్లు ఇంటి పట్టాలు కాని, ఇళ్లు కాని ఇవ్వకుండా, కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఏడాది పాటు అపార్ట్మెంట్లో ఫ్లాట్లు సినిమా చూపించారని కామెడీగా నవ్వుకుంటున్నారు. అంతిమంగా కావలి పట్టణంలో టీడీపీ నాయకులు వ్యవహారశైలి పట్ల, పక్కా గృహాలు ఇస్తామని టీడీపీ నాయకులు భ్రమలు కల్పించి వారి చుట్టూ ఆ కాగితాలు, ఈ కాగితాలు అంటూ తిప్పుకొని తమల్ని ఏమీ లేకుండా చేశారని లబ్ధిదారులు మండిపడుతున్నారు. అపార్ట్మెంట్ల నిర్మాణంలో ప్రధాన ఘట్టాలు తొలి శంకుస్థాపన చేసింది 08 జనవరి, 2018 నారా లోకేష్, సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, మంత్రులు ఫ్లాట్ల కేటాయింపులు 05 అక్టోబర్, 2018 పొంగూరు నారాయణ, మంత్రి రెండవ శంకుస్థాపన చేసింది 06 ఫిబ్రవరి, 2019 బీద మస్తాన్రావు, టీడీపీ నాయకుడు గృహ ప్రవేశాలు 09 ఫిబ్రవరి, 2019 బీద మస్తాన్రావు, టీడీపీ నాయకుడు -
ఫ్లెమింగో ఫెస్టివల్
-
వచ్చే పండగ నాటికి పర్యాటకాభివృద్ధి
సూళ్లూరుపేట: వచ్చే ఫ్లెమింగో ఫెస్టివల్ నాటికి సూళ్లూరుపేట, తడ, దొరవారిసత్రం మండలాలతో పాటు పులికాట్ సరస్సును అభివృద్ధి చేస్తామని రాష్ర్ట పురపాలక శాఖామంత్రి పొంగూరు నారాయణ హామీ ఇచ్చారు. రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి మూడురోజుల పాటు నిర్వహించనున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2015 పురపాలకశాఖ మంత్రి పొంగూరు నారాయణ, సాంకేతిక శాఖామంత్రి పల్లె రఘునాథరెడ్డి, మహిళా శిశు సంక్షేమ శాఖామంత్రి పీతల సుజాతలు లాంఛనంగా ప్రారంభించారు. సూళ్లూరుపేట ప్రభుత్వ పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన పక్షుల పండగ వేడుకలను ఫ్లెమింగో బెలూన్ ఎగురవేసి ప్రారంభించారు. వివిధ శాఖల వారు ఏర్పాటు చేసిన స్టాల్స్ను వరుసగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ముందుగా జిల్లా కలెక్టర్ జానకి మాట్లాడారు. అ తర్వాత సభకు అధ్యక్షుడుగా స్థానిక ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ 2001 నుంచి ప్రతి ఏటా మూడురోజుల పాటు పక్షులు పండగను నిర్వహించేసి ఆ తర్వాత పులికాట్ను గాని, నేలపట్టు చెరువును గాని, భీములవారిపాళెం పడవల రేవునుగాని పట్టించుకోవడం లేదన్నారు. పండగ నిర్వహణతో పాటు ప్రకృతి ప్రసాదించిన రెండో అతిపెద్ద ఉప్పునీటి సరస్సును కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైనా ఉందన్నారు. సముద్ర ముఖద్వారాలు పూడిపోయి ఫిబ్రవరి నెలకంతా పులికాట్ ఎండిపోయే పరిస్థితికొచ్చిందన్నారు. ఏన్నో వేల కిలోమీటర్లు నుంచి సంతానోత్పత్తి చేసుకోవడానికి వస్తున్న పక్షులకు ఆశ్రయం కల్పించాలంటే ఇటు పులికాట్ను, అటు నేలపట్టును అభివృద్ధి చేయాలన్నారు. అదేవిధంగా భీములవారిపాళెం పడవల రేవులో నిరంతరాయంగా పడవ షికార్ ఉండే విధంగా అభివృద్ధి చేయాలన్నారు. పర్యాటక పరంగా ఈ మూడు ప్రాంతాలను అభివృద్ది చేయడానికి టూరిజం హబ్గా ప్రకటించి అభివృద్ధి చేయాలని కోరారు. అనంతరం మంత్రులు పీతల సుజాత, పల్లె రఘునాధరెడ్డి మాట్లాడుతూ ఎంతో అందమైన విదేశీ వలసపక్షులు వచ్చే ఈ ప్రాంతాన్ని టూరిజం హబ్గా చేసి అభివృద్ధి చేయడానికి సీఎం దృష్టికి తీసుకెళతామని చెప్పారు. ముఖ్య అతిథి మంత్రి నారాయణ మాట్లాడుతూ ఈ మూడు ప్రాంతాలను పర్యాటకరంగంలో అభివృద్ధి చేసి స్థానికంగా యువతకు ఉపాధి లభించేటట్లు చేస్తానమని చెప్పారు. టూరిజం హబ్గా ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నారని చెప్పారు. పులికాట్కు పూర్వవైభవాన్ని తెచ్చేందుకు షార్ సహకారంతో ముఖద్వారాలు పూడిక తీయిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్కుమార్, మాజీ ఎమ్మెల్యేలు పరసా, సుబ్రమణ్యం, బల్లి దుర్గాప్రసాద్, బీద మస్తాన్రావు, జేసీ ఇంతియాజ్, డ్వామా పీడీ గౌతమి పాల్గొన్నారు. సీఎం సహాయనిధికి రూ.10 వేలు విరాళం.. ఏపీ సీఎం సహాయనిధికి మునిరత్నం అనే వ్యక్తి పదివేలు చెక్కును ఫ్లెమింగో ఫెస్టివల్ సభలో జిల్లా కలెక్టర్కు అందజేశారు.అదేవిధంగా నెల్లూరుకు చెందిన కృష్ణారెడ్డి సూళ్లూరుపేట డాట్కాం అనే వెబ్సైట్ను ఐటీ మంత్రి చేతులు మీదుగా ప్రారంభం చేశారు. -
సమగ్ర సోమశిలే లక్ష్యం
సోమశిల: సోమశిల జలాశయం నుంచి రాష్ట్రమంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, పొంగూరు నారాయణ డెల్టాకు శనివారం నీటిని విడుదల చేశారు. తొలుత జలాశయం వద్ద మంత్రితో కలిసి జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, ఎమ్మెల్యేలు మేకపాటి గౌతమ్రెడ్డి, కురుగొండ్ల రామకృష్ణ, బొల్లినేని రామారావు, పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డితో పాటు అధికారులు క్రస్ట్గేట్ల వద్ద సంప్రదాయబద్ధంగా గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించారు. అనంతరం పెన్నార్డెల్టాకు వాయునాలు చెల్లించి నీటి విడుదల ప్రక్రియను ప్రారంభించారు. డెల్టాకు వెయ్యి క్యూసెక్కులు, ఉత్తర కాలువకు 50 క్యూసెక్కులను లాంఛనంగా విడుదల చేశారు. డ్యామ్సైట్ ఆఫీస్లో మంత్రులు, ఎమ్మెల్యేలు,కలెక్టర్తో కలిసి దేవినేని ఉమ విలేకరుల సమావేశం నిర్వహించారు. మంత్రి దేవినేని ఉమ మాట్లాడుతూ కృష్ణ, గోదావరి, పెన్నార్డెల్టాలలో పరిస్థితులను సమీక్షించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేశామన్నారు. వారు నవంబర్లో పరిశీలిస్తారన్నారు. వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తయితే జిల్లాకు ఎంతో మేలు కలుగుతుందన్నారు. అనంతపురం జిల్లాకు సాగు,తాగునీరు అందించేందుకు పూర్తి స్థాయిలో సమీక్షిస్తున్నామన్నారు. జలాశయం పరిధిలోని ఆయకట్టు రైతులు తమకు ఎక్కడ ఏ పని కావాలో అధికారులకు విన్నవిస్తే వెంటనే వాటిని పూర్తి చేయాలని ఆదేశించామన్నారు. నిధులు విడుదల చేసే బాధ్యత తమదేనన్నారు. సమగ్ర సోమశిలకు ప్రధాన అడ్డంకిగా ఉన్న అటవీ అనుమతులపై ఉన్నత స్థాయి అధికారులతో సమీక్షించి సాధించేందుకు కృషి చేస్తామన్నారు. హైలెవల్ కాలువకు కూడా మొదటి దశ పనులను త్వరలో ప్రారంభిస్తారన్నారు. దీంతో ఈ జిల్లాలో మెట్ట ప్రాంతాలకు సాగు, తాగునీరు అందేలా చర్యలు చేపడతామన్నారు. ఈ సమావేశంలో ఎస్ఈలు సాబ్జాన్,కోటేశ్వరరావు, ఆర్డీఓ ఎంవీ రమణ పాల్గొన్నారు. రైతు ప్రయోజనాలే ముఖ్యం : మంత్రి దేవినేని ఉమా ఆత్మకూరు/సోమశిల: రాష్ట్రంలో రైతు ప్రయోజనాలే ముఖ్యమని రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మం త్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. శనివారం సోమశిల జలాలను విడుదల చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు. గోదావరి,కృష్ణ, పెన్నా డెల్టా ప్రాజెక్ట్లను అభివృద్ధి చేసేందుకు చెరుకూరి వీరయ్య, రోశయ్య, సుబ్బారావులతో కూడిన ట్రిబ్యునల్ కమిటీ ఏర్పాటు చేశామన్నారు. ఏఎస్పేట మండలంలోని గుడిపాడు వరకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తామన్నారు. హుదూద్ తుపాను బాధితులకు జిల్లాకు చెందిన మంత్రి డాక్టర్ నారాయణ అమోఘమైన సేవలు అందించారని కొనియాడారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ మాట్లాడుతూ ఐఏబీ సమావేశంలో నిర్ణయించిన మేరకు సాగునీటిని విడుదల చేశామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యుత్, నీటిపారుదల శాఖలకు సంబంధించి ప్రతి రోజు అరగంట సేపు సమీక్ష సమావేశాలు నిర్వహించడం పరిపాటిగా చేస్తున్నారన్నారు. ఆ కృషి ఫలితంగానే ప్రస్తుతం జలాశయంలో 45 టీఎంసీల నీరు చేరిందన్నారు. భవిష్యత్లో జిల్లాలో సాగు,తాగునీటి సమస్యలు పరిష్కరించడంలో ముందుంటామన్నారు. ఈ ప్రాజెక్ట్ జాతికి అంకితం చేసి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా డెల్టాకు, నాన్డెల్టాకు ఒకే పర్యాయం నీటి విడుదల చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర మాట్లాడుతూ ఈ జిల్లాలో కేవలం మూడు స్థానాల్లోనే టీడీపీ గెలవడంతో చంద్రబాబు దగ్గర పనులు చేయించుకునే సమయంలో డిమాండ్ చేయలేకపోతున్నామన్నారు. సమావేశంలో ఆత్మకూరు నియోజకవర్గ ఇన్చార్జ్ గూటూరు మురళీ కన్నబాబు, తెలుగు రైతు సంఘం అధ్యక్షుడు రాపూరు సుందరరామిరెడ్డి, జెడ్పీ టీడీపీ ఫ్లోర్మెంబర్ వేనాటి రామచంద్రారెడ్డి, టీడీపీ గూడూరు నియోజకవర్గ ఇన్చార్జ్ జ్యోత్స్న, టీడీపీ నేతలు సడ్డా రవీంద్రారెడ్డి, ఇందూరు వెంకటరమణారెడ్డి, ఆరి కట్ల జనార్దన్నాయుడు పాల్గొన్నారు. -
తెలుగు తమ్ముళ్లకు నారాయణ వార్నింగ్!
'ఏకులా వచ్చి మేకులా తయారయ్యాడు. పిల్లలకే అనుకుంటే మనకు పాఠాలు చెబుతున్నాడు' అంటూ తెలుగు తమ్ముళ్లు చాటుగా గొణుక్కుంటున్నారు. కార్పొరేట్ విద్యాసంస్థల అధిపతి నుంచి అమాత్యపదవికి ఎదిగిన పొంగూరు నారాయణ వ్యవహారశైలి టీడీపీ నాయకులకు మింగుడుపడడం లేదు. అధినేత అండతో తమపై మంత్రి అజమాయిషీ చేస్తుండడంతో తెలుగు తమ్ముళ్లు తలలు పట్టుకుంటున్నారు. రెండు రోజుల క్రితం నెల్లూరు జిల్లాలో నిర్వహించిన టీడీపీ కార్పొరేటర్లు, నేతల సమావేశంలో నారాయణ విశ్వరూపం చూపించారు. గ్రూపు రాజకీయాలు చేస్తే ఇంటికి పంపుతానంటూ ఓ కార్పొరేటర్ కు వార్నింగ్ ఇచ్చారు. క్రమశిక్షణ పాటించకపోతే పార్టీ వదిలివెళ్లిపోవాలని చెప్పడంతో తెలుగు తమ్ముళ్లు అవాక్కయ్యారు. తమ పార్టీ అధినేత చంద్రబాబు కూడా ఇంత కటువుగా ఎప్పుడూ మాట్లాడలేదని వాపోయారు. చంద్రబాబు అండ తనకు దండిగా ఉందని, తనను ఎదిరించి ఎవరూ పార్టీలో మనలేరన్న సంకేతాలిచ్చారు మంత్రి నారాయణ. తన ముందు తోకాడిస్తే కట్ చేస్తానని హెచ్చరించారు. తనను చూసి నేర్చుకోమని విజయవాడ నేతలకు స్వయంగా చంద్రబాబే చెప్పారని గుర్తుచేశారు. పదేళ్లుగా పార్టీలో తీసుకునే వ్యూహాత్మక నిర్ణయాల్లో తాను కూడా ఉన్నానని వెల్లడించారు. ఇప్పుడు తెరముందుకు వచ్చానని, ఇక మీ ఆటలు సాగవంటూ నెల్లూరు తమ్ముళ్లను హడలుగొట్టారు. నిప్పులమూటలా నారాయణ చెలరేగిపోవడంతో టీడీపీ నేతలు నివ్వెరపోయారు. పార్టీకోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడుతున్న తమను ప్రత్యక్ష రాజకీయ అనుభవంలేని నారాయణ అంతలేసి మాటలు అనడాన్ని తెలుగు తమ్ముళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రస్తుతం పార్టీలో నారాయణ హవా నడుస్తున్నందున ఆయనకు అడ్డు చెప్పేందుకు టీడీపీ నాయకులు జంకుతున్నారు.