Praggnanandhaa
-
Tata Steel Chess Masters: ఛాంపియన్గా ప్రజ్ఞానంద
టాటా స్టీల్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్-2025కు ఎండ్ కార్డ్ పడింది. ఈ టోర్నీ విజేతగా భారత గ్రాండ్మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద(Praggnanandhaa) నిలిచాడు. నెదర్లాండ్స్లోని విక్ ఆన్ జీ వేదికగా జరిగిన టై బ్రేకర్లో వరల్డ్ ఛాంపియన్ డి గుకేశ్పై ప్రజ్ఞానంద విజయం సాధించాడు. కాగా అంతకుముందు చివరి రౌండ్లో గుకేశ్, ప్రజ్ఞానానంద ఇద్దరూ తమ మ్యాచ్లలో ఓటమి చవిచూశారు.జర్మన్ గ్రాండ్ మాస్టర్ జీఎమ్ విన్సెంట్ ప్రగ్నందందాను ఓడించగా.. గుకేష్ను అర్జున్ ఎరిగైసి ఖంగుతిన్పించాడు. దీంతో 8.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్న గుకేశ్, ప్రజ్ఞానంద.. టైటిల్ కోసం టైబ్రేకర్లో తలపడ్డారు. టైబ్రేకర్లో తొలి గేమ్లో గుకేష్ విజయం సాధించగా, రెండో గేమ్లో ప్రజ్ఞానంద గెలుపొందాడు.ఫలితంగా విజేతను తేల్చేందుకు సడన్ డెత్ నిర్వహించాల్సి వచ్చింది. ఇందులో ప్రజ్ఞానంద విజయం సాధించి టైటిల్ను సొంతం చేసుకున్నాడు. ఈ టోర్నీ చివరి రౌండ్(13వ రౌండ్)లో ప్రజ్ఞానంద 2741 పాయింట్లతో అగ్రస్ధానంలో నిలవగా.. దొమ్మరాజు గుకేశ్(2777) రెండో స్ధానంలో నిలిచాడు.చదవండి: టీ20 వరల్డ్ కప్ విజేతలకు బీసీసీఐ భారీ నజరానా.. ఎన్ని కోట్లంటే? -
‘పరాయి స్త్రీలను తాకను’.. ఇంత పొగరు పనికిరాదు!
టాటా స్టీల్ చెస్ టోర్నమెంట్లో(Tata Steel Chess Tournament) ఉజ్బెకిస్తాన్ గ్రాండ్ మాస్టర్ నొదిర్బెక్ యకుబొయేవ్(Nodirbek Yakubboev) వ్యవహరించిన తీరు వివాదానికి దారి తీసింది. భారత గ్రాండ్ మాస్టర్ ఆర్.వైశాలి(R Vaishali)తో గేమ్ సందర్భంగా నొదిర్బెక్ ఆమెతో కరచాలనం చేయడానికి నిరాకరించాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. అతడిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.క్షమించండిఈ నేపథ్యంలో నొదిర్బెక్ ‘ఎక్స్’ వేదికగా క్షమాపణలు తెలిపాడు. తాను ఉద్దేశపూర్వకంగా ఎవరినీ కించపరచలేదని.. తన వల్ల తెలిసోతెలియకో పొరపాటు జరిగి ఉంటే క్షమించాలని కోరాడు. అయినప్పటికీ అతడి వ్యవహార శైలిపై మాత్రం విమర్శలు ఆగటం లేదు. ఇంత పొగరు పనికిరాదుద్వంద్వ ప్రమాణాలు పాటించే వారు ఎప్పటికీ ఉన్నత శిఖరాలకు చేరుకోలేరంటూ నెటిజన్లు అతడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మత విశ్వాసాల పేరిట మహిళల పట్ల వివక్ష చూపించడం తగదంటూ హితవు పలుకుతున్నారు. ఇంత పొగరు పనికిరాదంటూ మండిపడుతున్నారు.అసలేం జరిగిందంటే.. నెదర్లాండ్స్లోని విక్ ఆన్ జీ వేదికగా టాటా స్టీల్ చెస్ టోర్నమెంట్ జరుగుతోంది. ఇందులో భాగంగా నాలుగో రౌండ్లో ఆర్.వైశాలితో నొదిర్బెక్ ముఖాముఖి తలపడ్డాడు. అయితే, ఆలస్యంగా వేదిక వద్దకు చేరుకున్న నొదిర్బెక్.. గేమ్ ఆరంభం కావడానికి ముందు కర్టెసీలో భాగంగా వైశాలి కరచాలనం చేసేందుకు చేయి ముందుకుచాచగా.. నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. అవసరం లేదన్నట్లుగా సైగ చేస్తూ తన కుర్చీలో కూర్చున్నాడు.విజయం తర్వాత షేక్ హ్యాండ్ ఇవ్వలేదుఇక ఈ గేమ్లో నొదిర్బెక్పై వైశాలి గెలుపొందింది. గేమ్కు ముందు ఎదురైన చేదు అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని విజయం తర్వాత అతడికి షేక్ హ్యాండ్ ఆఫర్ చేయకుండా మిన్నకుండిపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట చక్కర్లు కొట్టగా.. నొదిర్బెక్ తాను కావాలని ఇలా చేయలేదంటూ సంజాయిషీ ఇచ్చుకున్నాడు.పరాయి స్త్రీలను తాకను‘‘ఇండియాలోని ప్రతిభావంతులైన చెస్ క్రీడాకారులైన వైశాలి, ఆమె సోదరుడు ప్రజ్ఞానందల పట్ల నాకు గౌరవం ఉంది. నా ప్రవర్తన వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగి ఉంటే.. క్షమించండి. నాకు ఏది సరైంది అనిపిస్తే అదే చేస్తాను.పరాయి స్త్రీలతో నేను కరచాలనం చేయలేను. ఇక మహిళలు హిజాబ్ లేదంటే బుర్ఖా ధరించాలా లేదా అన్నవి పూర్తిగా వారి నిర్ణయాలు. 2023లో దివ్యతో నేను పొరపాటుగా అలా వ్యవహరించాను. ఈరోజు గేమ్ ఆడేటపుడు నా ప్రత్యర్థి బుల్మాగాకు ముందే చెప్పాను.షేక్ హ్యాండ్ నాకు ఇష్టం ఉండదని. తను అందుకు అంగీకరించింది. అయితే, కొంతమంది మర్యాదపూర్వక పలకరింపునకు చిహ్నంగా నమస్తే అయినా చెప్పాలని కోరారు. ఏదేమైనా.. దివ్య, వైశాలిలతో గేమ్లకే ముందే నేను మహిళలతో షేక్ హ్యాండ్కు విరుద్ధం అని చెప్పి ఉంటే.. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి తలెత్తి ఉండేది కాదు’’ అని నొదిర్బెక్ వివరణ ఇచ్చాడు. కాగా అంతకుముందు మరో భారత గ్రాండ్మాస్టర్ దివ్యతో గేమ్కు ముందు ఆమె ముంజేయికి ముంజేయి తాకించి.. విష్ చేశాడు. ఇక చెన్నైకి చెందిన చెస్ సంచలనం ఆర్.ప్రజ్ఞానందకు తోడబుట్టిన అక్క వైశాలి అన్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరు గ్రాండ్మాస్టర్లు ప్రస్తుతం టాటా స్టీల్ చెస్ టోర్నమెంట్తో బిజీగా ఉన్నారు. మరోవైపు.. 23 ఏళ్ల నొదిర్బెక్ 2019లో గ్రాండ్ మాస్టర్ హోదా పొందగా.. 23 ఏళ్ల వైశాలి ప్రపంచ బ్లిట్జ్ చాంపియన్షిప్ చరిత్రలో పతకం నెగ్గిన మూడో భారతీయ ప్లేయర్గా ఇటీవలే చరిత్ర సృష్టించింది. చదవండి: షమీ రీఎంట్రీ.. మళ్లీ వాయిదా?!.. గంభీర్తో సమస్యా?A renowned Uzbek chess Grandmaster, Nodirbek, refused to shake hands with India's Women's Grandmaster Vaishali.Does religion influence sports? However, he was seen shaking hands with other female players earlier. pic.twitter.com/fGR61wvwUP— Ayushh (@ayushh_it_is) January 27, 2025 -
ముగింపు మెరవాలి!
న్యూయార్క్: ఈ ఏడాది భారత చెస్ క్రీడాకారులు విశ్వవేదికపై అదరగొట్టారు. ప్రతిష్టాత్మక ఒలింపియాడ్లో భారత పురుషుల, మహిళల జట్లు స్వర్ణ పతకాలతో మెరిపించగా... క్లాసికల్ ఫార్మాట్లో దొమ్మరాజు గుకేశ్ కొత్త ప్రపంచ చాంపియన్గా అవతరించాడు. క్యాడెట్ ప్రపంచ చాంపియన్షిప్లో హైదరాబాద్ చిన్నారి దివిత్ రెడ్డి పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఇక పలు అంతర్జాతీయ టోర్నమెంట్లలో పలువురు భారత గ్రాండ్మాస్టర్లు టాప్–3లో నిలిచి తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది చివరి అంతర్జాతీయ టోర్నమెంట్ అయిన ప్రపంచ ర్యాపిడ్, బ్లిట్జ్ చాంపియన్షిప్ పోటీలకు నేడు తెర లేవనుంది. న్యూయార్క్లో ఆరు రోజులపాటు ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ జరగనుంది. భారత్ నుంచి ఓపెన్ విభాగంలో 9 మంది గ్రాండ్మాస్టర్లు, మహిళల విభాగంలో 8 మంది క్రీడాకారిణులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. ప్రపంచ ర్యాపిడ్, బ్లిట్జ్ చాంపియన్షిప్ పోటీల్లో భారత్కు మంచి రికార్డే ఉంది. ఫలితంగా ఈ ఏడాది ఆఖరి టోర్నీలోనూ భారత క్రీడాకారులు పతకాలు సాధించి సూపర్ ఫినిషింగ్ ఇవ్వాలని ఆశిద్దాం. 2017లో విశ్వనాథన్ ఆనంద్ ర్యాపిడ్ ఫార్మాట్లో ప్రపంచ చాంపియన్ అయ్యాక మరో భారత ప్లేయర్ ఈ విభాగంలో టాప్–3లో నిలువలేదు. ఇక ఓపెన్ విభాగంలో ర్యాపిడ్, బ్లిట్జ్ ఫార్మాట్లలో నార్వే దిగ్గజం మాగ్నస్ కార్ల్సన్ డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగనున్నాడు. మహిళల ర్యాపిడ్ విభాగంలో అనస్తాసియా బొడ్నారుక్ (రష్యా), బ్లిట్జ్ విభాగంలో వాలెంటీనా గునీనా (రష్యా) తమ ప్రపంచ టైటిల్స్ను కాపాడుకుంటారో లేదో వేచి చూడాలి. భారత్ నుంచి ఎవరెవరంటే.... ఓపెన్ విభాగం (ర్యాపిడ్, బ్లిట్జ్): ఇరిగేశి అర్జున్, ప్రజ్ఞానంద, రౌనక్ సాధ్వాని, సందీపన్ చందా, అరవింద్ చిదంబరం, హర్ష భరతకోటి, ప్రణవ్, దీప్తాయన్ ఘోష్, కార్తీక్ వెంకటరామన్. మహిళల విభాగం (ర్యాపిడ్, బ్లిట్జ్): కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, దివ్య, వైశాలి, వంతిక అగర్వాల్, సాహితి వర్షిణి, పద్మిని రౌత్, నూతక్కి ప్రియాంక. ఫార్మాట్ ఎలా అంటే... ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్షిప్ ఓపెన్ విభాగంలో మొత్తం 13 రౌండ్లను స్విస్ ఫార్మాట్లో... మహిళల విభాగంలో 11 రౌండ్లను స్విస్ ఫార్మాట్లో నిర్వహిస్తారు. నిర్ణీత రౌండ్ల తర్వాత రెండు విభాగాల్లో అత్యధిక పాయింట్లు సాధించిన ప్లేయర్లు విజేతగా నిలుస్తారు. ప్రపంచ బ్లిట్జ్ చాంపియన్షిప్ను రెండు దశల్లో నిర్వహిస్తారు.ముందుగా ఓపెన్ విభాగంలో 13 రౌండ్లను స్విస్ ఫార్మాట్లో... మహిళల విభాగంలో 11 రౌండ్లను స్విస్ ఫార్మాట్లో ఏర్పాటు చేశారు. నిర్ణీత రౌండ్ల తర్వాత టాప్–8లో నిలిచిన వారు రెండో దశ (నాకౌట్)కు అర్హత పొందుతారు. నాకౌట్ దశలో అజేయంగా నిలిచిన ప్లేయర్లు విజేతలుగా అవతరిస్తారు. టైమ్ కంట్రోల్ ఎంతంటే... ర్యాపిడ్ ఫార్మాట్లో ఒక్కో గేమ్ 15 నిమిషాలు జరుగుతుంది. తొలి ఎత్తు నుంచి ప్రతి ఎత్తుకు 10 సెకన్లు జత కలుస్తాయి. బ్లిట్జ్ ఫార్మాట్లో ఒక్కో గేమ్ 3 నిమిషాలు జరుగుతుంది. తొలి ఎత్తు నుంచి ప్రతి ఎత్తుకు 2 సెకన్లు జత కలుస్తాయి. నిర్ణీత రౌండ్ల తర్వాత ప్లేయర్లు సమంగా పాయింట్లు సాధిస్తే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్ను వర్గీకరించి విజేతలను నిర్ణయిస్తారు. ప్రైజ్మనీ ఎంతంటే... ర్యాపిడ్ ఫార్మాట్ ఓపెన్ విభాగంలో టాప్–40లో నిలిచిన ప్లేయర్లందరికీ ప్రైజ్మనీ ఇస్తారు. విజేతకు 90 వేల డాలర్లు (రూ. 76 లక్షలు), రెండో స్థానంలో నిలిచిన ప్లేయర్కు 70 వేల డాలర్లు (రూ. 59 లక్షలు), మూడో స్థానంలో నిలిచిన ప్లేయర్కు 56 వేల డాలర్లు (రూ. 47 లక్షలు) అందజేస్తారు. బ్లిట్జ్ ఫారామ్ట్ ఓపెన్ విభాగంలోనూ టాప్–40లో నిలిచిన ఆటగాళ్లకు ప్రైజ్మనీ లభిస్తుంది. చాంపియన్గా 90 వేల డాలర్లు (రూ. 76 లక్షలు), రెండో స్థానంలో నిలిచిన వారికి 70 వేల డాలర్లు (రూ. 59 లక్షలు), మూడో స్థానం పొందిన ఆటగాడికి 42 వేల డాలర్లు (రూ. 35 లక్షలు) అందజేస్తారు. ర్యాపిడ్ ఫార్మాట్ మహిళల విభాగంలో టాప్–20లో నిలిచిన వారందరికీ ప్రైజ్మనీ దక్కుతుంది. విజేతకు 60 వేల డాలర్లు (రూ. 51 లక్షలు), రెండో స్థానంలో నిలిచిన క్రీడాకారిణికి 40 వేల డాలర్లు (రూ. 34 లక్షలు), మూడో స్థానంలో నిలిచిన ప్లేయర్కు 28 వేల డాలర్లు (రూ. 23 లక్షలు) లభిస్తాయి. బ్లిట్జ్ ఫార్మాట్ మహిళల విభాగంలోనూ టాప్–20లో నిలిచిన ప్లేయర్ల ఖాతాలో ప్రైజ్మనీ చేరుతుంది. చాంపియన్కు 60 వేల డాలర్లు (రూ. 51 లక్షలు), రెండో స్థానంలో నిలిచిన ప్లేయర్కు 40 వేల డాలర్లు (రూ. 34 లక్షలు), మూడో స్థానం పొందిన ప్లేయర్కు 20 వేల డాలర్లు (రూ. 17 లక్షలు) లభిస్తాయి.4 ప్రపంచ ర్యాపిడ్, బ్లిట్జ్ చాంపియన్షిప్లో భారత స్టార్, ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి కోనేరు హంపి సాధించిన పతకాలు. ర్యాపిడ్ ఫార్మాట్లో 2012లో కాంస్యం నెగ్గిన హంపి, 2019లో స్వర్ణ పతకాన్ని, 2023లో రజత పతకాన్ని సాధించింది. బ్లిట్జ్ ఫార్మాట్లో హంపి 2022లో రజతం సొంతం చేసుకుంది. -
రన్నరప్ ప్రజ్ఞానంద
కోల్కతా: టాటా స్టీల్ చెస్ ఇండియా ర్యాపిడ్ టోర్నమెంట్ ఓపెన్ విభాగంలో భారత గ్రాండ్మాస్టర్ ఆర్.ప్రజ్ఞానంద రన్నరప్గా నిలిచాడు. 10 మంది గ్రాండ్మాస్టర్ల మధ్య 9 రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో ప్రజ్ఞానంద, సో వెస్లీ (అమెరికా) 5.5 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్ను వర్గీకరించగా... ప్రజ్ఞానందకు రెండో స్థానం, సో వెస్లీకి మూడో స్థానం లభించాయి. నార్వే దిగ్గజం మాగ్నస్ కార్ల్సన్ 7.5 పాయింట్లతో ర్యాపిడ్ టోర్నీ చాంపియన్గా నిలిచాడు. భారత గ్రాండ్మాస్టర్లు నిహాల్ సరీన్ (4 పాయింట్లు) ఆరో ర్యాంక్లో, ఇరిగేశి అర్జున్ (3.5 పాయింట్లు) ఎనిమిదో ర్యాంక్లో, విదిత్ (3 పాయింట్లు) తొమ్మిదో ర్యాంక్లో, ఎస్ఎల్ నారాయణన్ (3 పాయింట్లు) చివరిదైన పదో ర్యాంక్లో నిలిచారు. వంతికకు మూడో స్థానం ఇదే టోర్నీ మహిళల ర్యాపిడ్ విభాగంలో భారత యువ క్రీడాకారిణి వంతిక అగర్వాల్ 5 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. 7.5 పాయింట్లతో అలెక్సాండ్రా గొర్యాక్చినా (రష్యా) చాంపియన్గా అవతరించింది. 5.5 పాయింట్లతో నానా జాగ్నిద్జె (జార్జియా) రన్నరప్గా నిలిచింది. భారత్కే చెందిన ద్రోణవల్లి హారిక (4.5 పాయింట్లు) ఐదో ర్యాంక్లో, దివ్య దేశ్ముఖ్ (3.5 పాయింట్లు) ఏడో ర్యాంక్లో, వైశాలి (3.5 పాయింట్లు) ఎనిమిదో ర్యాంక్లో, కోనేరు హంపి (3 పాయింట్లు) చివరిదైన పదో ర్యాంక్లో నిలిచారు. -
ప్రజ్ఞానందకు ఐదు...గుకేశ్కు ఆరు
సెయింట్ లూయిస్ (అమెరికా): సింక్ఫీల్డ్ కప్ అంతర్జాతీయ క్లాసికల్ చెస్ టోర్నమెంట్ను భారత గ్రాండ్మాస్టర్లు ప్రజ్ఞానంద, దొమ్మరాజు గుకేశ్ అజేయంగా ముగించారు. చివరిదైన తొమ్మిదో రౌండ్ గేమ్లను కూడా వీరిద్దరు ‘డ్రా’ చేసుకోవడం విశేషం. ఎనిమిదో రౌండ్లోనే టైటిల్ను ఖరారు చేసుకున్న అలీరెజా ఫిరూజా (ఫ్రాన్స్)తో జరిగిన తొమ్మిదో రౌండ్ గేమ్ను ప్రజ్ఞానంద 47 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. వెస్లీ సో (అమెరికా)తో జరిగిన గేమ్ను గుకేశ్ 35 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. పది మంది మేటి గ్రాండ్మాస్టర్ల మధ్య జరిగిన ఈ టోరీ్నలో ప్రజ్ఞానంద, గుకేశ్, వెస్లీ సో 4.5 పాయింట్లతో ఉమ్మడిగా నాలుగో స్థానంలో నిలిచారు. మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్ను వర్గీకరించగా... ప్రజ్ఞానందకు ఐదో స్థానం, గుకేశ్కు ఆరో స్థానం, వెస్లీ సోకు ఏడో స్థానం ఖరారయ్యాయి. 6 పాయింట్లతో అలీరెజా ఫిరూజా టైటిల్ను దక్కించుకోగా...5.5 పాయింట్లతో ఫాబియానో కరువానా (అమెరికా) రన్నరప్గా నిలిచాడు. -
గుకేశ్ ఖాతాలో ఏడో ‘డ్రా’
సెయింట్ లూయిస్: సింక్ఫీల్డ్ కప్ అంతర్జాతీయ క్లాసికల్ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్మాస్టర్లు దొమ్మరాజు గుకేశ్, ప్రజ్ఞానంద వరుసగా ఏడో ‘డ్రా’ నమోదు చేశారు. టాప్ సీడ్, ప్రపంచ మూడో ర్యాంకర్ ఫాబియానో కరువానా (అమెరికా)తో జరిగిన గేమ్ను గుకేశ్ 60 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. ఇయాన్ నిపోమ్నిషి (రష్యా)తో జరిగిన గేమ్ను ప్రజ్ఞానంద 19 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. పది మంది మేటి గ్రాండ్మాస్టర్ల మధ్య తొమ్మిది రౌండ్లపాటు జరుగుతున్న ఈ టోర్నీలో అలీరెజా ఫిరూజా (ఫ్రాన్స్) ఐదు పాయింట్లతో ఒంటరిగా అగ్రస్థానంలో ఉన్నాడు. నాలుగు పాయింట్లతో కరువానా రెండో స్థానంలో నిలిచాడు. 3.5 పాయింట్లతో గుకేశ్, మాక్సిమి లాచెర్ (ఫ్రాన్స్), నొదిర్బెక్ అబ్దుసత్తరోవ్ (ఉజ్బెకిస్తాన్), వెస్లీ సో (అమెరికా), ప్రజ్ఞానంద సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నారు. -
బ్లిట్జ్లోనూ ఆఖరి స్థానమే!
సెయింట్ లూయిస్ (అమెరికా): భారత గ్రాండ్మాస్టర్ ఆర్. ప్రజ్ఞానందకు ‘గ్రాండ్ చెస్ టూర్’లో సెయింట్ లూయిస్ అంచె పోటీలు ఏమాత్రం కలిసిరాలేదు. బ్లిట్జ్ ఈవెంట్లోనూ అతను ఆఖరి స్థానంలో నిలిచాడు. ఇంతకుముందు ర్యాపిడ్ కేటగిరీలో నాలుగు పాయింట్లతో చివరి స్థానంలో నిలిచాడు. అయితే శనివారం ముగిసిన బ్లిట్జ్ కేటగిరీలో కాస్త మెరుగైన ప్రదర్శన కనబరిచి 8 పాయింట్లు సాధించినా చివరకు ఆఖరి స్థానమైతే తప్పలేదు. మొత్తానికి గ్రాండ్ చెస్ టూర్ ఈవెంట్లో అతని ఖాతాలో 12 పాయింట్లు (4+8) ఉన్నాయి. ఈ టోర్నీకి ముందు మూడో ర్యాంకులో ఉన్న ప్రజ్ఞానంద... తాజా నిరాశాజనక ఫలితాలతో ఐదో స్థానానికి పడిపోయాడు. ఫ్రాన్స్ గ్రాండ్మాస్టర్ అలిరెజా ఫిరోజా 23 పాయింట్లతో సెయింట్ లూయిస్ అంచె ఈవెంట్లో విజేతగా నిలిచాడు. అతను ర్యాపిడ్లో 11, బ్లిట్జ్లో 12 పాయింట్లు గెలుపొందాడు. అమెరికా ఆటగాళ్లు వెస్లీ సొ (20 పాయింట్లు), హికరు నకముర (19.5), లెవొన్ అరోనియన్ (19) వరుసగా 2, 3, 4 స్థానాల్లో నిలిచారు. తర్వాతి టోర్నీ సింక్యూఫీల్డ్ కప్లో ప్రజ్ఞానందతో పాటు భారత్ నుంచి డి.గుకేశ్ బరిలో ఉన్నాడు. -
భారత చెస్ చరిత్రలో చారిత్రక ఘట్టం
భారత చెస్ చరిత్రలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. ఫిడే రేటింగ్ లిస్ట్లో (ర్యాంకింగ్స్) తొలిసారి ముగ్గురు భారత గ్రాండ్మాస్టర్లు టాప్-10లో నిలిచారు.2024 జులై నెల ర్యాంకింగ్స్లో అర్జున్ ఎరిగైసి నాలుగో స్థానంలో, డి గుకేశ్ ఏడులో, ఆర్ ప్రజ్ఞానానంద ఎనిమిదో స్థానంలో నిలిచారు. భారతీయ చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ 11వ స్థానంలో నిలిచాడు. అరవింద్ చితంబరం ఏకంగా 18.5 ఎలో రేటింగ్ పాయింట్లు మెరుగుపర్చుకుని 44వ స్థానం నుంచి 29 స్థానానికి ఎగబాకాడు. జులై నెల పురుషుల రేటింగ్ లిస్ట్ టాప్ 100 జాబితాలో ఏకంగా పది మంది భారతీయులు (అర్జున్ ఎరిగైసి, డి గుకేశ్, ప్రజ్ఞానంద, విశ్వనాథన్ ఆనంద్, విదిత్ సంతోష్ గుజరాతీ, అరవింద్ చితంబరం, హరికృష్ణ పెంటల, నిహాల్ సరిన్, ఎస్ ఎల్ నారాయణన్, సద్వాని రౌనక్) ఉండటం గమనార్హం.మహిళల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. జులై నెల రేటింగ్ లిస్ట్ టాప్-14లో ముగ్గురు భారతీయులు ఉన్నారు. ద్రోణవల్లి హారిక రెండో స్థానాన్ని తిరిగి కైవసం చేసుకుంది. ఇటీవలే బాలికల జూనియర్ వరల్డ్ టైటిల్ను గెలిచిన దివ్య దేశ్ముఖ్ నాలుగు స్థానాలు మెరుగుపర్చుకుని 24వ స్థానం నుండి 20వ స్థానానికి ఎగబాకింది. -
ప్రపంచ రెండో ర్యాంకర్పై ప్రజ్ఞానంద... ప్రపంచ మూడో ర్యాంకర్పై వైశాలి సంచలన విజయాలు
నార్వే చెస్ టోర్నీలో భారత గ్రాండ్మాస్టర్లు, తోబుట్టువులైన ప్రజ్ఞానంద, వైశాలి సంచలన ప్రదర్శన కొనసాగిస్తున్నారు. స్టావెంజర్ నగరంలో జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక టోర్నీ పురుషుల విభాగం ఐదో రౌండ్లో ప్రజ్ఞానంద 77 ఎత్తుల్లో ప్రపంచ రెండో ర్యాంకర్ ఫాబియానో కరువానా (అమెరికా)పై గెలిచాడు. ఇదే టోర్నీ మూడో రౌండ్లో ప్రజ్ఞానంద ప్రపంచ నంబర్వన్ కార్ల్సన్ను ఓడించిన సంగతి తెలిసిందే. ఇదే వేదికపై జరుగుతున్న మహిళల టోర్నీ ఐదో రౌండ్ గేమ్లో ప్రజ్ఞానంద సోదరి వైశాలి తెల్ల పావులతో ఆడి ‘అర్మగెడాన్’ గేమ్లో ప్రపంచ మూడో ర్యాంకర్ టింగ్జీ లె (చైనా)పై 76 ఎత్తుల్లో గెలిచింది. వీరిద్దరి మధ్య క్లాసికల్ గేమ్ ‘డ్రా’ కావడంతో విజేతను నిర్ణయించేందుకు ‘అర్మగెడాన్’ గేమ్ నిర్వహించారు. ప్రపంచ చాంపియన్ జూ వెన్జున్ (చైనా), భారత స్టార్ కోనేరు హంపి మధ్య క్లాసికల్ గేమ్ 31 ఎత్తుల్లో ‘డ్రా’ అయింది. విజేతను నిర్ణయించేందుకు ‘అర్మగెడాన్’ గేమ్ నిర్వహించగా జు వెన్జున్ 64 ఎత్తుల్లో హంపిపై గెలిచింది. -
కార్ల్సన్కు ప్రజ్ఞానంద ‘చెక్’
స్టావెంజర్: భారత యువ గ్రాండ్మాస్టర్ ఆర్.ప్రజ్ఞానంద తన కెరీర్లోనే చిరస్మరణీయ విజయాన్ని సాధించాడు. గతంలో చెస్లోని మూడు ఫార్మాట్లలో (క్లాసికల్, ర్యాపిడ్, బ్లిట్జ్) ఏకకాలంలో ప్రపంచ చాంపియన్గా నిలిచిన నార్వే దిగ్గజం, ప్రపంచ నంబర్వన్ మాగ్నస్ కార్ల్సన్పై ప్రజ్ఞానంద సంచలన విజయం నమోదు చేశాడు.కార్ల్సన్ సొంతగడ్డలో జరుగుతున్న నార్వే చెస్ టోర్నీ పురుషుల విభాగం మూడో రౌండ్లో 18 ఏళ్ల ప్రజ్ఞానంద ఈ అద్భుతం చేశాడు. తెల్లపావులతో ఆడిన ప్రజ్ఞానంద 37 ఎత్తుల్లో కార్ల్సన్ ఆట కట్టించాడు. ఈ గెలుపుతో మూడో రౌండ్ తర్వాత ప్రజ్ఞానంద 5.5 పాయింట్లతో అగ్రస్థానంలోకి వచ్చాడు. గతంలో ఆన్లైన్, ర్యాపిడ్, బ్లిట్జ్ ఫార్మాట్లలో కార్ల్సన్పై భారత యువ గ్రాండ్మాస్టర్లు ప్రజ్ఞానంద, గుకేశ్, అర్జున్ గెలిచినా... క్లాసికల్ ఫార్మాట్లో మాత్రం ప్రజ్ఞానంద తొలిసారి కార్ల్సన్ను ఓడించాడు. టైమ్ లిమిట్ ఉండని క్లాసికల్ ఫార్మాట్లో కార్ల్సన్ ప్రపంచ నంబర్వన్, ప్రపంచ చాంపియన్ అయ్యాక అతడిని ఓడించిన రెండో భారతీయ ప్లేయర్గా ప్రజ్ఞానంద గుర్తింపు పొందాడు. అంతకుముందు భారత దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ ఈ ఘనత సాధించాడు. వైశాలి, హంపి గెలుపు ఇదే టోర్నీ మహిళల విభాగంలో ప్రజ్ఞానంద సోదరి వైశాలి కూడా 5.5 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండటం విశేషం. మూడో రౌండ్లో వైశాలితోపాటు భారత స్టార్ కోనేరు హంపి కూడా అర్మగెడాన్ గేమ్లలో గెలిచారు. క్లాసికల్ ఫార్మాట్లో వైశాలి–అనా ముజిచుక్ (ఉక్రెయిన్) గేమ్ 50 ఎత్తుల్లో... హంపి–లె టింగ్లీ (చైనా) గేమ్ 36 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిశాయి.విజేతను నిర్ణయించేందుకు అర్మగెడాన్ గేమ్లు నిర్వహించగా... హంపి తెల్లపావులతో ఆడి 49 ఎత్తుల్లో లె టింగ్లీపై నెగ్గగా... అనా ముజిచుక్తో నల్ల పావులతో ఆడిన వైశాలి 70 ఎత్తుల్లో గేమ్ను ‘డ్రా’గా ముగించింది. అర్మగెడాన్ నిబంధనల ప్రకారం నల్లపావులతో ‘డ్రా’ చేసుకున్న ప్లేయర్ను విజేతగా ఖరారు చేస్తారు. -
సంచలనం సృష్టించిన ప్రజ్ఞానంద.. వరల్డ్ నంబర్ వన్ ర్యాంకర్కు షాక్
భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద సంచలనం సృష్టించాడు. ప్రపంచ నంబర్ వన్ ర్యాంకర్ మాగ్నస్ కార్ల్సన్కు షాకిచ్చాడు. నార్వే చెస్ టోర్నమెంట్ ప్రజ్ఞానంద కార్ల్సన్పై ఊహించని విజయం నమోదు చేశాడు. 18 ఏళ్ల ప్రజ్ఞానందకు క్లాసికల్ ఫార్మాట్లో కార్ల్సన్పై ఇదే తొలి విజయం. Magnus Carlsen resigns!@rpraggnachess overtakes Fabiano Caruana and jumps into sole first!https://t.co/wJtLtsYIDS#NorwayChess pic.twitter.com/6DGZDqQbrG— chess24 (@chess24com) May 29, 2024మూడో రౌండ్లో తెల్ల పావులతో ఆడిన ప్రజ్ఞానంద.. కార్ల్సన్ ఎత్తులను చిత్తు చేసి పైచేయి సాధించాడు. ఈ గెలుపుతో ప్రజ్ఞానంద 5.5/9 పాయింట్లతో అగ్రస్థానానికి దూసుకెళ్లాడు. కార్ల్సన్ ఐదో స్థానానికి పడిపోగా.. వరల్డ్ నంబర్ టూ ర్యాంకర్ ఫాబియానో కారువాన రెండో స్థానంలో నిలిచాడు. -
ప్రజ్ఞానంద, విదిత్ విజయం
టొరంటో: క్యాండిడేట్స్ చెస్ టోర్నీ ఆరో రౌండ్ ఓపెన్ విభాగంలో భారత గ్రాండ్మాస్టర్లు ప్రజ్ఞానంద, విదిత్ సంతోష్ గుజరాతీ విజయాలు అందుకోగా... దొమ్మరాజు గుకేశ్ ‘డ్రా’ నమోదు చేశాడు. నిజాత్ అబసోవ్ (అజర్బైజాన్)తో జరిగిన గేమ్లో తమిళనాడు కుర్రాడు ప్రజ్ఞానంద 45 ఎత్తుల్లో... అలీరెజా ఫిరూజా (ఫ్రాన్స్)తో జరిగిన గేమ్లో మహారాష్ట్రకు చెందిన విదిత్ 40 ఎత్తుల్లో గెలుపొందారు. హికారు నకముర (అమెరికా)తో జరిగిన గేమ్ను గుకేశ్ 40 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. ఆరో రౌండ్ తర్వాత గుకేశ్ నాలుగు పాయింట్లతో నిపోమ్నిషితో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు. మహిళల విభాగం ఆరో రౌండ్లో భారత గ్రాండ్మాస్టర్లు కోనేరు హంపి, వైశాలి ఓటమి పాలయ్యారు. హంపి 48 ఎత్తుల్లో లె టింగ్జీ (చైనా) చేతిలో... వైశాలి 29 ఎత్తుల్లో కాటరీనా లాగ్నో (రష్యా) చేతిలో ఓడిపోయారు. -
ప్రజ్ఞానంద, హంపిలపైనే దృష్టి
టొరంటో: ఓపెన్, మహిళల విభాగాల్లో ప్రస్తుత ప్రపంచ చాంపియన్స్కు ప్రత్యర్థులను నిర్ణయించే క్యాండిడేట్స్ చెస్ టోర్నీకి రంగం సిద్ధమైంది. టొరంటోలో నేడు మొదలయ్యే ఈ టోర్నీలో భారత్ నుంచి ఏకంగా ఐదుగురు గ్రాండ్మాస్టర్లు బరిలో ఉన్నారు. ఓపెన్ విభాగంలో ప్రజ్ఞానంద, గుకేశ్ (తమిళనాడు), విదిత్ (మహారాష్ట్ర)... మహిళల విభాగంలో కోనేరు హంపి (ఆంధ్రప్రదేశ్), ప్రజ్ఞానంద సోదరి వైశాలి (తమిళనాడు) తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. భారత్ నుంచి ప్రజ్ఞానంద, హంపి ఫేవరెట్స్గా కనిపిస్తున్నారు. ఓపెన్ విభాగంలో 8 మంది... మహిళల విభాగంలో 8 మంది మధ్య డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో మొత్తం 14 రౌండ్ల చొప్పున టోర్నీని నిర్వహిస్తారు. అత్యధిక పాయింట్లు గెలిచిన ప్లేయర్లు విజేతగా నిలుస్తారు. క్యాండిడేట్స్ టోర్నీ ఓపెన్ విభాగం విజేత ప్రస్తుత విశ్వవిజేత డింగ్ లిరెన్ (చైనా)తో... మహిళల విభాగం విజేత ప్రస్తుత ప్రపంచ చాంపియన్ జు వెన్జున్ (చైనా)తో ప్రపంచ టైటిల్ కోసం తలపడతారు. బుధవారం కేవలం ప్రారంభోత్సవం ఉంది. గురువారం తొలి రౌండ్ గేమ్లు జరుగుతాయి. ఈ టోర్నీలో పోటీపడనున్న క్రీడాకారుల వివరాలు... ఓపెన్ విభాగం: ప్రజ్ఞానంద, గుకేశ్, విదిత్ (భారత్) , నెపోమ్నిషి (రష్యా), కరువానా, నకముర (అమెరికా), అబసోవ్ (అజర్బైజాన్), అలీరెజా ఫిరూజా (ఫ్రాన్స్). మహిళల విభాగం: హంపి, వైశాలి (భారత్), టింగ్జీ లె, టాన్ జోంగి (చైనా), కాటరీనా లాగ్నో, గొర్యాక్చినా (రష్యా), సలీమోవా (బల్గేరియా), అనా ముజిచుక్ (ఉక్రెయిన్). -
ప్రజ్ఞానందకు రెండో విజయం
ప్రాగ్ మాస్టర్స్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో భారత గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానంద రెండో విజయం నమోదు చేశాడు. భారత్కే చెందిన మరో గ్రాండ్మాస్టర్ విదిత్ సంతోష్ గుజరాతితో జరిగిన ఐదో రౌండ్ గేమ్లో ప్రజ్ఞానంద 52 ఎత్తుల్లో గెలిచాడు. డేవిడ్ నవారా (చెక్ రిపబ్లిక్)తో జరిగిన గేమ్లో భారత్కే చెందిన గ్రాండ్మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ 61 ఎత్తుల్లో ఓడిపోయాడు. ఐదో రౌండ్ తర్వాత ప్రజ్ఞానంద, గుకేశ్ 2.5 పాయింట్లతో వరుసగా నాలుగో, ఐదో ర్యాంక్లో ఉన్నారు. -
ప్రజ్ఞానంద శుభారంభం... వైశాలి ఓటమి
భారత చెస్ సంచలనం ఆర్. ప్రజ్ఞానంద అంతర్జాతీయ వేదికపై తన జోరు కొనసాగిస్తున్నాడు. చెక్ రిపబ్లిక్లో జరుగుతున్న ప్రతిష్టాత్మక ప్రేగ్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో అతను విజయంతో మొదలు పెట్టాడు. బుధవారం జరిగిన తొలి రౌండ్ పోరులో ప్రజ్ఞానంద 41 ఎత్తులో జర్మనీ గ్రాండ్మాస్టర్ విన్సెంట్ కీమర్ను ఓడించాడు. ఇటాలియన్ ఓపెనింగ్తో మొదలు పెట్టిన భారత జీఎం అటాకింగ్ గేమ్ మొదలు కీమర్ డిఫెన్స్ పని చేయలేదు. ఈ మ్యాచ్ గెలిచే క్రమంలో ప్రజ్ఞానంద ‘లైవ్ రేటింగ్’లో విశ్వనాథన్ ఆనంద్ను దాటి భారత్ తరఫున అత్యధిక రేటింగ్ నమోదు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇతర భారత ఆటగాళ్లలో రిచర్డ్ ర్యాపో (రొమానియా)తో జరిగిన గేమ్ను డి. గుకేశ్...డేవిడ్ నవారా (చెక్ రిపబ్లిక్)తో జరిగిన గేమ్ను విదిత్ గుజరాతీ ‘డ్రా’ చేసుకున్నారు. చాలెంజర్ విభాగంలో అన్టోన్ కొరొ»ొవ్ (ఉక్రెయిన్)తో జరిగిన పోరులో భారత గ్రాండ్మాస్టర్ వైశాలి ఓటమిపాలైంది. -
Tata Steel Chess Tournament: ప్రజ్ఞానంద అద్భుతం
విక్ ఆన్ జీ (నెదర్లాండ్స్): గత ఏడాది గొప్పగా రాణించిన భారత టీనేజ్ గ్రాండ్మాస్టర్ ఆర్.ప్రజ్ఞానంద కొత్త సంవత్సరంలోనూ తన జోరు కొనసాగిస్తున్నాడు. ప్రతిష్టాత్మక టాటా స్టీల్ మాస్టర్స్ చెస్ టోర్నీలో 18 ఏళ్ల ప్రజ్ఞానంద నాలుగో రౌండ్ గేమ్లో సంచలనం సృష్టించాడు. క్లాసికల్ ఫార్మాట్లో ప్రస్తుత ప్రపంచ చాంపియన్, ప్రపంచ నాలుగో ర్యాంకర్ డింగ్ లిరెన్ (చైనా)పై ప్రజ్ఞానంద గెలుపొందాడు. తమిళనాడుకు చెందిన ప్రజ్ఞానంద ఈ గేమ్లో నల్ల పావులతో ఆడుతూ 62 ఎత్తుల్లో డింగ్ లిరెన్ను ఓడించాడు. తాజా ఫలితంతో ప్రజ్ఞానంద లైవ్ రేటింగ్స్లో 2748.3 పాయింట్లకు చేరుకున్నాడు. దాంతో 2748 పాయింట్లతో భారత నంబర్వన్గా కొనసాగుతున్న దిగ్గజ ప్లేయర్ విశ్వనాథన్ ఆనంద్ను రెండో స్థానానికి పంపించి భారత కొత్త నంబర్వన్గా ప్రజ్ఞానంద అవతరించాడు. అంతేకాకుండా విశ్వనాథన్ ఆనంద్ తర్వాత క్లాసికల్ ఫార్మాట్లో ప్రపంచ చాంపియన్ను ఓడించిన రెండో భారతీయ ప్లేయర్గానూ ప్రజ్ఞానంద ఘనత సాధించాడు. వాస్తవానికి ప్రతి నెలాఖరుకు అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) వరల్డ్ రేటింగ్స్ను విడుదల చేస్తుంది. టోర్నీ జరుగుతున్న సమయంలో లైవ్ రేటింగ్స్ మార్పులు ఉంటాయి. ప్రస్తుత టాటా స్టీల్ టోరీ్నలోని తదుపరి రౌండ్లలో ప్రజ్ఞానంద తడబడితే మళ్లీ ఆనంద్ నంబర్వన్ అయ్యే అవకాశాలున్నాయి. 14 మంది మేటి గ్రాండ్మాస్టర్ల మధ్య 13 రౌండ్లపాటు టాటా స్టీల్ మాస్టర్స్ చెస్ టోర్నీని నిర్వహిస్తున్నారు. నాలుగో రౌండ్ తర్వాత ప్రజ్ఞానంద 2.5 పాయింట్లతో మరో ముగ్గురితో కలిసి ఉమ్మడిగా మూడో స్థానంలో ఉన్నాడు. భారత్కే చెందిన విదిత్ 2 పాయింట్లతో ఏడో ర్యాంక్లో, గుకేశ్ 1.5 పాయింట్లతో పదో ర్యాంక్లో ఉన్నారు. గత ఏడాది జనవరిలోనే జరిగిన టాటా స్టీల్ చెస్ టోర్నీలో డింగ్ లిరెన్పై ప్రజ్ఞానంద గెలిచాడు. ఆ తర్వాత ఏప్రిల్లో ప్రపంచ చాంపియన్షిప్ మ్యాచ్లో రష్యా గ్రాండ్మాస్టర్ నెపోమ్నిíÙని ఓడించి డింగ్ లిరెన్ కొత్త ప్రపంచ చాంపియన్గా అవతరించాడు. -
సంచలన విజయం.. ప్రజ్ఞానంద సరికొత్త చరిత్ర
చెన్నై చెస్ సంచలనం ఆర్. ప్రజ్ఞానంద సరికొత్త చరిత్ర సృష్టించాడు. కెరీర్లో తొలిసారిగా భారత టాప్ ర్యాంకర్గా నిలిచాడు. లెజెండ్ విశ్వనాథన్ ఆనందన్ను దాటుకుని మరీ అగ్రస్థానానికి ఎగబాకాడు. ప్రపంచ చాంపియన్ డింగ్ లిరెన్ను ఓడించి ఈ అరుదైన ఫీట్ నమోదు చేశాడు. టాటా స్టీల్ మాస్టర్స్ టోర్నమెంట్లో భాగంగా.. చైనాకు చెందిన లిరెన్తో బుధవారం జరిగిన పోటీ సందర్భంగా ప్రజ్ఞానంద ఈ ఘనత సొంతం చేసుకున్నాడు. నంబర్ 1 ప్రజ్ఞానంద ప్రస్తుత ఫిడే ర్యాంకింగ్స్ ప్రకారం.. ప్రజ్ఞానంద ఖాతాలో 2748.3 పాయింట్లు ఉండగా.. విశ్వనాథన్ ఆనంద్ ఖాతాలో 2748 పాయింట్లు ఉన్నాయి. ఈ క్రమంలో భారత టాప్ ర్యాంకర్గా అవతరించిన ప్రజ్ఞానంద వరల్డ్ ర్యాంకింగ్స్లో 11వ స్థానంలో కొనసాగుతున్నాడు. రెండో భారతీయ క్రీడాకారుడిగా రికార్డు అంతేకాదు.. లిరెన్పై విజయం సాధించడం ద్వారా మరో రికార్డును కూడా ఖాతాలో వేసుకున్నాడు. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత.. క్లాసికల్ చెస్లో వరల్డ్ చాంపియన్ను ఓడించిన భారత రెండో క్రీడాకారుడిగా చరిత్రకెక్కాడు. సంతోషంగా ఉంది ఈ సందర్భంగా ప్రజ్ఞానంద మాట్లాడుతూ.. బలమైన ప్రత్యర్థిని ఓడించడం అంత తేలికేమీ కాదని.. అందుకే తనకు ఈ విజయం మరింత ప్రత్యేకమైనదని పేర్కొన్నాడు. తొలిసారి వరల్డ్ చాంపియన్పై గెలుపొందడం రెట్టింపు సంతోషాన్నిస్తుందని హర్షం వ్యక్తం చేశాడు. అదానీ, సచిన్ ప్రశంసలు కాగా భారత టాప్ ర్యాంకర్గా నిలిచిన ప్రజ్ఞానందపై పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అగ్రశ్రేణి వ్యాపారవేత్త, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ తదితరులు ఎక్స్ వేదికగా ప్రజ్ఞానందను అభినందించారు. ‘‘నిన్ను చూసి దేశం గర్విస్తోంది’’ అంటూ కితాబులిచ్చారు. చదవండి: IPL 2024: హార్దిక్ వెళ్లినా నష్టం లేదు.. గిల్ కూడా వెళ్లిపోతాడు: షమీ కీలక వ్యాఖ్యలు -
కొత్త క్వీన్ వైశాలి: తోబుట్టువుతో పోటీపడి.. తమ్ముడి నీడను దాటి
‘మీ తమ్ముడు నీకంటే నాలుగేళ్లు చిన్నవాడు. కానీ గ్రాండ్మాస్టరై నాలుగేళ్లు దాటిపోయింది. మరి మీరెప్పుడు గ్రాండ్మాస్టర్ అవుతారు?’ ఏడాది కాలంగా ఎక్కడికి వెళ్లినా వైశాలిని వెంటాడుతున్న ప్రశ్న అది. ఒక్కోసారి తోబుట్టువు ఘనత కూడా తెలీకుండానే అనవసరపు అసహనాన్ని కలిగిస్తుంది. నిజానికి క్రీడల్లో ఒకరి ప్రదర్శనకు మరొకరి ఆటతో పోలికే ఉండదు. కానీ దురదృష్టవశాత్తు వైశాలికి మాత్రం ఇంట్లోనే పోటీ ఉండటంతో పోలిక సహజమైంది. దాంతో ఆమెపై ఒత్తిడి కూడా పెరిగిపోయింది. కానీ చదరంగంలో ఒత్తిడిని అధిగమించడమే అన్నింటికంటే పెద్ద సవాల్ కదా! వైశాలి కూడా అలాగే ఆలోచించింది. జీఎం కావడమే లక్ష్యంగా ఆమె బరిలోకి దిగలేదు. ప్రతిష్ఠాత్మక టోర్నీల్లో వరుసగా ఒక్కో గేమ్లో, ఆపై ఒక్కో టోర్నీలో గెలుపుపై మాత్రమే దృష్టి పెట్టి దూసుకుపోయింది. క్యాండిడేట్స్లాంటి మెగా టోర్నీకి కూడా అర్హత సాధించింది. అక్కడా ఆమె తన ప్రశాంతతను కొనసాగించింది. ఫలితంగా విజయాలు వైశాలిని వెతుక్కుంటూ వచ్చాయి. ఎట్టకేలకు 22 ఏళ్ల వయసులో చెస్ గ్రాండ్మాస్టర్ల జాబితాలో తన పేరును రాసుకుంది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో చెస్లో ఓనమాలు నేర్చుకున్న ఆ అమ్మాయి చిచ్చరపిడుగు అయిన తమ్ముడి నీడను దాటి ఇప్పుడు సొంతంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించుకుంది. మున్ముందు ఆమె సాధించబోయే ఘనతల్లో ఇది ఒక ఆరంభం మాత్రమే. ఇకపై మరిన్ని సంచలనాలు ఈ చెన్నై అమ్మాయి నుంచి రావడం ఖాయం. ఎప్పుడో 2002.. భారత్ నుంచి చెస్ గ్రాండ్మాస్టర్గా నిలిచిన తొలి మహిళగా కోనేరు హంపి గుర్తింపు.. ఆపై మరో 9 ఏళ్లు.. 2011లో రెండో భారత మహిళా గ్రాండ్మాస్టర్గా నిలిచిన ద్రోణవల్లి హారిక.. ఈ ఇద్దరు ఆంధ్రప్రదేశ్ అమ్మాయిల తర్వాత భారత చెస్లో మహిళలకు సంబంధించి ఒక తరహా శూన్యం ఆవరించింది. ఒక వైపు పురుషుల విభాగంలో ఆటగాళ్లు దూసుకుపోతుండగా, మహిళల వైపు నుంచి మాత్రం చెప్పుకోదగ్గ ప్రదర్శనే రాలేదు. అప్పుడప్పుడు, అక్కడక్కడ కొన్ని మెరుపులు కనిపించినా అవి తాత్కాలికమే. పైగా దిగువ స్థాయికే పరిమితమయ్యాయి. ఇంటర్నేషనల్ మాస్టర్ లేదా విమెన్ గ్రాండ్మాస్టర్ స్థాయికి మించి కొందరు ముందుకు సాగలేకపోయారు. అలాంటి స్థితిలో వైశాలి ప్రదర్శన గురించి ఎంత పొగిడినా తక్కువే. అక్కడే మొదలు.. 2013లో వరల్డ్ చెస్ చాంపియన్షిప్ మ్యాచ్లో విశ్వనాథన్ ఆనంద్తో తలపడేందుకు చెస్ దిగ్గజం మాగ్నస్ కార్ల్సన్ చెన్నైకి వచ్చాడు. ఏర్పాట్లు పూర్తయిన తర్వాత అసలు ఆటకు ముందు 20 మంది జూనియర్ ప్లేయర్లతో ఒకేసారి ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడేందుకు కార్ల్సన్ సిద్ధమయ్యాడు. ఈ పోరులో 12 ఏళ్ల వైశాలి మాత్రమే కార్ల్సన్ను ఓడించడంలో సఫలమైంది. ఆ ఫలితం అందరినీ ఒక్కసారిగా షాక్కు గురి చేసింది. ఎగ్జిబిషన్ మ్యాచే అయినా కార్ల్సన్పై గెలుపు అంటే ఆషామాషీ కాదు. అప్పుడు వైశాలి అందరి దృష్టిలో పడింది. ఆరేళ్ల వయసులో చాలా ఎక్కువ సమయం టీవీ చూడటంలోనే గడుపుతున్న కూతురు దృష్టి మళ్లించేందుకు తండ్రి రమేశ్బాబు చెస్ నేర్పించాడు. తర్వాతి రోజుల్లో అదే ఆమె ప్రధాన ఆసక్తిగా మారింది. స్థానికంగా పోటీ పడిన తొలి ఈవెంట్లోనే వైశాలి గెలిచి రావడంతో ఆమె పూర్తి స్థాయిలో ఆట వైపు మళ్లింది. తండ్రితో పాటు తల్లి నాగలక్ష్మి ప్రోత్సాహం, సహకారం కూడా ఆమె వేగంగా దూసుకుపోవడంలో ఉపకరించాయి. చెన్నైలోని వేలమ్మ స్కూల్, ఆ తర్వాత కాలేజ్లో.. వైష్ణవ్ ఇన్స్టిట్యూట్ కూడా వైశాలి చదరంగ ప్రదర్శనను గుర్తించి ఆమెకు అన్ని విధాలా అండగా నిలిచాయి. బ్యాంక్ ఉద్యోగి అయిన తండ్రి పోలియో కారణంగా ఎక్కడా బయటకు వెళ్లే పరిస్థితి లేకపోయింది. అయినా ఇతరత్రా ఒక తండ్రిగా కూతురికి అండగా నిలవడంలో ఆయన ఎక్కడా వెనక్కి తగ్గలేదు. తన అక్కను ఆడనీయకుండా చేస్తూ ఇబ్బంది పెట్టిన తమ్ముడు ప్రజ్ఞానంద.. తర్వాత రోజుల్లో సాధనలో ఆమెకు భాగస్వామిగా మారడమే కాదు గ్రాండ్మాస్టర్గా ఎదిగి అక్క గేమ్లను విశ్లేషించి తప్పొప్పులతో ఆమె ఆటకు సహాయకారిగా వ్యవహరించడం విశేషమే! తొలిసారి గుర్తింపుతో.. 2012.. వైశాలి చెస్ కెరీర్ను మలుపు తిప్పింది. స్లొవేనియాలో అండర్–12 బాలికల వరల్డ్ చెస్ చాంపియన్షిప్ జరిగింది. 11 ఏళ్ల వైశాలి యూరోప్లో పర్యటించడం అదే తొలిసారి. టైమ్ జోన్ భిన్నంగా ఉండటంతో భారత కాలమానం ప్రకారం రాత్రి 10.30కి గేమ్లు ప్రారంభం అయ్యేవి. దాంతో ఒక్కసారిగా అలవాటు తప్పిన సాధనతో పాటు ఇతరత్రా కూడా ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. అయితే ఇలాంటివాటిని అధిగమించి∙ఆమె చాంపియన్గా నిలవడం అద్భుతం! మూడేళ్ల తర్వాత గ్రీస్లో ఇదే తరహాలో వరల్డ్ అండర్–14 చాంపియన్షిప్ జరిగింది. ఈసారి మాత్రం ఆమె పూర్తి సన్నద్ధతతో వెళ్లింది. టాప్సీడ్గా బరిలోకి దిగిన ఆమె దానికి న్యాయం చేస్తూ టైటిల్ను సొంతం చేసుకుంది. ఇదే టోర్నీ అండర్–10 విభాగంలో తమ్ముడు ప్రజ్ఞానంద కూడా ప్రపంచ చాంపియన్గా నిలిచాడు. దాంతో రమేశ్బాబు కుటుంబంలో ఆనందం రెట్టింపయింది. ఒలింపియాడ్లో సభ్యురాలిగా.. కోవిడ్ సమయం ప్రపంచవ్యాప్త క్రీడా ఈవెంట్లపై కూడా ప్రభావం చూపించింది. అయితే ఆన్లైన్ గేమ్ల తర్వాత చెస్ ఆటగాళ్లు కొంత వరకు తమ సమస్యను పరిష్కరించుకోగలిగారు. ఈ క్రమంలో వైశాలి ఆన్లైన్లో విమెన్స్ స్పీడ్ చాంపియన్షిప్లో పాల్గొని సత్తా చాటింది. తుది ఫలితం అనుకూలంగా రాకపోయినా రెండు సంచలన విజయాలు ఆమె స్థాయిని పెంచాయి. తనకంటే ఎంతో ఎక్కువ రేటింగ్ ఉన్న ఇద్దరు అగ్రశ్రేణి క్రీడాకారిణులు అసబయెయెవా, ద్రోణవల్లి హారికలను వైశాలి ఓడించగలిగింది. ప్రపంచ చెస్లో ప్రతిష్ఠాత్మక టోర్నీ అయిన ఒలింపియాడ్ ఆమె కెరీర్లో మరో చెప్పుకోదగ్గ ఘనతగా నిలిచింది. ఇందులో విజేతైన భారత జట్టులో వైశాలి కూడా ఉంది. ఈ మెగా ఈవెంట్లో భారత్ స్వర్ణం సాధించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. తొలి సోదర, సోదరి ద్వయంగా అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలు సాధించినా గ్రాండ్మాస్టర్ హోదా దక్కించుకోవడమే వైశాలికి కీలకంగా మారింది. భారత చెస్ చరిత్రలోని 83 మంది గ్రాండ్మాస్టర్లలో ఇద్దరు మాత్రమే మహిళలు. అయితే వైశాలి శ్రమ, పోరాడేతత్వం, ఓటమిని అంగీకరించని నైజం ఆమెను కొత్త జీఎంగా నిలిపాయి. ఈ క్రమంలో కొన్ని పరాజయాలు ఎదురైనా పట్టుదలతో సాగి ఈ చెన్నై అమ్మాయి.. తన లక్ష్యాన్ని చేరింది. 2019లో ఎక్స్ట్రాకాన్ ఓపెన్లో ఆమె తొలి జీఎం నార్మ్ సాధించింది. పది మంది ప్రత్యర్థులతో తలపడగా వారిలో ఆరుగురు గ్రాండ్మాస్టర్లు. రెండో జీఎం సాధించేందుకు ఆమెకు కొంత సమయం పట్టింది. హెరాక్లియోన్లో జరిగిన ఫిషర్ ఓపెన్లో ఆమె రెండో నార్మ్ సొంతం చేసుకుంది. ఇదే జోరులో మూడో నార్మ్ వేట సాగింది. ఏడాదిన్నర లోపే ఖతర్ ఓపెన్లో పలువురు అగ్రశ్రేణి ఆటగాళ్లను ఓడించి ఎనిమిది గేమ్లలోనూ నార్మ్ సాధించడంతో ఇక జీఎం లాంఛనమే అయింది. ముగ్గురు మాజీ ప్రపంచ చాంపియన్లు మారియా ముజీచుక్, స్టెఫనోవా, జోంగి తాన్లను ఓడించడంతో పాటు 2600 రేటింగ్ దాటడంతో ఇటీవలే గ్రాండ్ స్విస్ టోర్నమెంట్లో వైశాలి జీఎం ఖాయమైంది. ప్రపంచ చెస్లో గ్రాండ్మాస్టర్లుగా నిలిచిన తొలి సోదర, సోదరి ద్వయంగా వైశాలి, ప్రజ్ఞానంద నిలిచారు. ఇకపై కూడా తమ్ముడి నీడలో కాకుండా తన ఆటతో, ఎత్తుకు పైఎత్తులతో చదరంగంలో మరిన్ని శిఖరాలు అధిరోహించాలని వైశాలి ధ్యేయంగా పెట్టుకుంది. -∙మొహమ్మద్ అబ్దుల్ హాది -
వైశాలి సరికొత్త చరిత్ర.. తమ్ముడు ప్రజ్ఞానందతో కలిసి ప్రపంచ రికార్డు
Vaishali- R Praggnanandhaa: చెస్ క్రీడాకారిణి వైశాలి రమేశ్ చరిత్ర సృష్టించింది. భారత్ తరఫున గ్రాండ్మాస్టర్గా నిలిచిన మూడో మహిళగా రికార్డు సాధించింది. IV Elllobregat- 2023 ఓపెన్లో భాగంగా శనివారం నాటి గేమ్తో రేటింగ్ పాయింట్లలో 2500 మార్కును దాటి ఈ ఫీట్ నమోదు చేసింది. ఇక గ్రాండ్మాస్టర్ హోదా సాధించడంతో పాటు తన సోదరడు ఆర్. ప్రజ్ఞానందతో కలిసి మరో ప్రపంచ రికార్డును కూడా వైశాలి తన ఖాతాలో వేసుకుంది. చెన్నైకి చెందిన వైశాలికి చెస్ యువ సంచలనం ప్రజ్ఞానంద సొంత తమ్ముడు. తమ్ముడితో కలిసి ప్రపంచ రికార్డు ఇప్పటికే గ్రాండ్మాస్టర్గా ఎన్నో విజయాలు అందుకున్న ప్రజ్ఞానంద ఫిడే వరల్డ్కప్-2023 రన్నరప్గానూ నిలిచిన విషయం తెలిసిందే. ఇక తాజాగా వైశాలి కూడా గ్రాండ్మాస్టర్ కావడం, క్యాండిడేట్స్ టోర్నీకి అర్హత సాధించడంతో చెస్ చరిత్రలో.. ఈ ఘనత సాధించిన తొలి సోదర-సోదరీ(తోబుట్టువులు) ద్వయంగా వీళ్లిద్దరు అరుదైన రికార్డు సాధించారు. సీఎం స్టాలిన్ అభినందనలు ఇక చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్, కోనేరు హంపి, హారిక ద్రోణవల్లి, దివ్యేందు బరువా, ఆర్. ప్రజ్ఞానంద తదితర గ్రాండ్మాస్టర్లతో పాటు వైశాలి కూడా ఈ జాబితాలో చేరింది. ఈ నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ వైశాలికి శుభాకాంక్షలు తెలియజేశారు. తమిళనాడు నుంచి తొలి మహిళా గ్రాండ్మాస్టర్గా చరిత్ర సృష్టించారంటూ ప్రశంసించారు. అక్కాతమ్ముళ్లిద్దరూ కలిసి క్యాండిడేట్స్ టోర్నీకి అర్హత సాధించారని.. మిమ్మల్ని చూసి తామంతా గర్విస్తున్నామని ఎక్స్ వేదికగా స్టాలిన్ ప్రశంసలు కురిపించారు. చదవండి: ప్రజ్ఞానంద కుటుంబం గురించి తెలుసా?! ఆ తల్లికేమో ‘భయం’.. అందుకే తండ్రితో పాటు! చదవండి: వీరూ.. ఈరోజు నిన్ను వదిలే ప్రసక్తే లేదని చెప్పా: పాక్ మాజీ బౌలర్ Huge congrats, @chessvaishali, on becoming the third female Grandmaster from India and the first from Tamil Nadu! 2023 has been splendid for you. Alongside your brother @rpragchess, you've made history as the first sister-brother duo to qualify for the #Candidates tournament.… pic.twitter.com/f4I89LcJ5O — M.K.Stalin (@mkstalin) December 2, 2023 -
భారత చెస్ చరిత్రలో గొప్ప క్షణాలు.. ఒకేసారి రెండు అద్భుత విజయాలు
Isle of Man- Vidit Gujrathi, Vaishali R claim titles: ఫిడే గ్రాండ్ స్విస్ చెస్ ఈవెంట్లో భారత గ్రాండ్మాస్టర్లు ఆర్. వైశాలి, విదిత్ గుజరాతి అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో విదిత్ గుజరాతి ఓపెన్ చాంపియన్గా అవతరించగా.. ఆర్.వైశాలి మహిళా విభాగంలో టైటిల్ విజేతగా నిలిచింది. వన్డే వరల్డ్కప్-2023లో భాగంగా టీమిండియా సౌతాఫ్రికాపై ఘన విజయం సాధించిన వేళ చెస్ టోర్నీలో వీరిద్దరు డబుల్ ధమాకా అందించారు. అదే విధంగా ఈ విజయంతో క్యాండిడేట్స్ టోర్నమెంట్కు అర్హత సాధించారు వైశాలి, విదిత్. అక్కడా సత్తా చాటి వరల్డ్ చెస్ చాంపియన్షిప్నకు క్వాలిఫై కావాలనే పట్టుదలతో ఉన్నారు. కాగా స్విస్ టోర్నీలో ర్యాంకింగ్స్లో తమకంటే ఎంతో మెరుగ్గా ఉన్న ప్లేయర్లను ఓడించి మరీ వైశాలి, విదిత్ ఈ మేరకు విజయం అందుకోవడం విశేషం. ఓపెన్ టోర్నీలో 15వ సీడ్గా బరిలోకి దిగిన విదిత్.. ఫిబియానో కరువానా, హికరు నకమురా, అలీరెజా ఫిరౌజాలతో పాటు భారత గ్రాండ్మాస్టర్లు డి. గుకేశ్, ఆర్, ప్రజ్ఞానందలతో పోటీపడి విజేతగా నిలిచాడు. మరోవైపు.. మహిళల విభాగంలో 12వ సీడ్గా పోటీకి దిగిన వైశాలి.. ఫైనల్ రౌండ్లో పెద్దగా పోరాడాల్సిన పనిలేకుండానే బత్కుయాగ్ మోంగోటుల్పై గెలిచి టైటిల్ సొంతం చేసుకుంది. కాగా చెన్నైకి చెందిన రమేశ్బాబు వైశాలి.. ప్రఖ్యాత చెస్ ప్లేయర్, సంచలన విజయాలకు కేరాఫ్ అయిన ఆర్. ప్రజ్ఞానంద అక్క అన్న విషయం తెలిసిందే. ఇక ఫిడే వరల్డ్కప్లో రన్నరప్గా నిలిచిన ప్రజ్ఞానంద ఇప్పటికే క్యాండిడేట్స్ టోర్నీకి అర్హత సాధించాడు. తాజాగా వైశాలి సైతం క్వాలిఫై అయింది. ఈ నేపథ్యంలో ప్రజ్ఞానంద హర్షం వ్యక్తం చేశాడు. చదవండి: Virat Kohli: అవును.. కోహ్లి స్వార్థపరుడే! ముమ్మాటికీ స్వార్థపరుడే..!! -
భారత చెస్ జట్ల గెలుపు.. హంపి, హారిక, వంతిక, వైశాలి అద్భుతంగా ఆడి..
Asian Games 2023- Chess: ఆసియా క్రీడల టీమ్ చెస్ ఈవెంట్లో భారత పురుషుల, మహిళల జట్లు మూడో రౌండ్లో గెలుపొందాయి. ఇరిగేశి అర్జున్, ప్రజ్ఞానంద, గుకేశ్, పెంటేల హరికృష్ణలతో కూడిన భారత జట్టు 3–1తో కజకిస్తాన్ను ఓడించింది. మరోవైపు... కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, వంతిక అగర్వాల్, వైశాలిలతో కూడిన భారత జట్టు 3.5–0.5తో ఇండోనేసియాపై గెలిచింది. మూడో రౌండ్ తర్వాత భారత మహిళల జట్టు ఆరు పాయింట్లతో టాప్ ర్యాంక్లో... ఐదు పాయింట్లతో భారత పురుషుల జట్టు రెండో ర్యాంక్లో ఉన్నాయి. భారత్, కొరియా మ్యాచ్ ‘డ్రా’ ఆసియా క్రీడల మహిళల హాకీ ఈవెంట్లో భారత జట్టు తొలి ‘డ్రా’ నమోదు చేసింది. ఆదివారం దక్షిణ కొరియాతో జరిగిన పూల్ ‘ఎ’ మూడో లీగ్ మ్యాచ్ను భారత్ 1–1 గోల్తో ‘డ్రా’ చేసుకుంది. కొరియా తరఫున చో హైజిన్ (12వ ని.లో), భారత్ తరఫున నవ్నీత్ కౌర్ (44వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. ప్రస్తుతం మూడు మ్యాచ్ల తర్వాత భారత్, కొరియా ఏడు పాయింట్లతో సమంగా ఉన్నా... మెరుగైన గోల్స్ అంతరం కారణంగా భారత్ టాప్ ర్యాంక్లో, కొరియా రెండో ర్యాంక్లో ఉంది. లీగ్ దశ తర్వాత టాప్–2లో నిలిచిన జట్లు సెమీఫైనల్కు అర్హత సాధిస్తాయి. భారత్ తమ చివరి లీగ్ మ్యాచ్ను హాంకాంగ్తో మంగళవారం ఆడుతుంది. -
‘ప్రజ్ఞ’కు పట్టం.. 18 ఏళ్ల వయస్సులో ఎన్నో సంచలనాలు
నవంబర్ 2013.. విశ్వనాథన్ ఆనంద్, మాగ్నస్ కార్ల్సన్ మధ్య వరల్డ్ చెస్ చాంపియన్షిప్ మ్యాచ్.. వేదిక చెన్నైలోని హయత్ రీజెన్సీ హోటల్.. ఎనిమిదేళ్ల కుర్రాడొకడు టోర్నీ జరిగినన్ని రోజులు తన కోచ్తో పాటు అక్కడే తచ్చాడుతూ కనిపించాడు. ప్రేక్షకుల మధ్యలో కూర్చొనే అవకాశం వచ్చినప్పుడు ఇద్దరు దిగ్గజాల మధ్య పోరులో ఎత్తులు, పైఎత్తులను గమనించడం.. లేదంటే హోటల్ లాబీలో చెస్తో సంబంధం ఉన్న ఎవరైనా ఆట గురించి మాట్లాడుతుంటే ఆసక్తిగా వినడం.. అన్ని రోజులూ అతనిది అదే దినచర్య! ఆ సమయంలో అతనొక ఔత్సాహిక ఆటగాడు, చెస్ అభిమాని మాత్రమే. అతనే కాదు అతని కోచ్ కూడా ఊహించలేదు.. సరిగ్గా దశాబ్ద కాలం తర్వాత ఆ ‘ప్రజ్ఞ’ ప్రపంచ స్థాయికి చేరుతుందని. ఆ కుర్రాడు.. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ప్రపంచ కప్ ఫైనల్కు చేరిన రెండో భారతీయుడిగా నిలుస్తాడని.. అదే కార్ల్సన్తో విశ్వ వేదికపై తలపడతాడని! అద్భుతమైన ప్రతిభతో ఇప్పుడు భారత్లో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్త గుర్తింపు కూడా దక్కించుకున్న ఆ బాల మేధావి పేరు ఆర్. ప్రజ్ఞానంద. గత ఏడాది మే నెలలో చెస్ ఏబుల్ మాస్టర్స్ ఆన్లైన్ ర్యాపిడ్ టోర్నమెంట్ జరుగుతోంది. అదే సమయంలో ప్రజ్ఞానంద తన 11వ తరగతి పరీక్షలకు సిద్ధమయ్యాడు. స్టడీ బ్రేక్ అంటూ పరీక్షల మధ్యలో కొంత విరామం ఇవ్వడంతో అతను ఈ టోర్నీలో పాల్గొనాలని నిశ్చయించుకున్నాడు. కార్ల్సన్, వీయీ, అనీశ్ గిరి, డింగ్ లారెన్ లాంటి స్టార్లు ఉన్న ఈ టోర్నీలో ‘నేనేమాత్రం ముందుకు వెళ్లగలను?’ అనే సందేహం ఉండటంతో పరీక్షల గురించి పెద్దగా ఆలోచించలేదు. కానీ ఈ టోర్నీలో వచ్చిన అద్భుతమైన ఫలితాలు ఫైనల్ వరకు తీసుకెళ్లాయి. దాంతో ఒకే సమయంలో పగలు, రాత్రి అటు చెస్, ఇటు పరీక్షలు అంటూ మేనేజ్ చేయాల్సి వచ్చింది. తెల్లవారుజామున 4 గంటల వరకు గేమ్ ఆడి మళ్లీ 7 గంటలకు అతను పరీక్షకు హాజరయ్యాడు. ఆ శ్రమ వృథా కాలేదు. ఆ టోర్నీలో ఆల్టైమ్ గ్రేట్ మాగ్నస్ కార్ల్సన్ను ఓడించడంలో అతను సఫలమయ్యాడు. మూడు నెలల వ్యవధిలో కార్ల్సన్ను రెండోసారి ఓడించడంతో అతని గత విజయం గాలివాటు కాదని, ప్రజ్ఞానంద ఎంతో ప్రత్యేకమైన ఆటగాడనేది ప్రపంచానికి తెలిసింది. 12 ఏళ్ల 10 నెలల 13 రోజుల వయసులో గ్రాండ్మాస్టర్ హోదా సాధించి ప్రపంచ చెస్లో రెండో పిన్న వయస్కుడిగా గుర్తింపు పొందిన ఈ చెన్నై చిచ్చరపిడుగు ఆపై కూడా అంతే వేగంగా దూసుకుపోయాడు. అక్క చూపిన దారిలో.. ప్రజ్ఞానంద.. ఆరంభంలో ఆసక్తితో కాకుండా అనుకోకుండానే చదరంగపు ఎత్తులు నేర్చుకున్నాడు. తమిళనాడు స్టేట్ కార్పొరేషన్ బ్యాంక్లో తండ్రి రమేశ్బాబు మేనేజర్. పోలియో బాధితుడైన ఆయన తన పిల్లలను సరదాగా ఆటల కోసం బయటకు తీసుకెళ్లడంలో ఇబ్బంది పడేవాడు. పెద్దమ్మాయి వైశాలి ఎక్కువసేపు టీవీ చూడటం, వీడియో గేమ్లకే అతుక్కుపోయేది. దాంతో దానిని నివారించేందుకు తనకు ఆట గురించి ఏమీ తెలియకపోయినా ఆయన తన కూతురును ముందుగా చెస్ వైపు నడిపించాడు. ఆటలో ఓనమాలు నేర్చుకున్న తర్వాత ఆమె ఆసక్తి పెంచుకొని చదరంగం బోర్డుపైనే ఎక్కువ సమయం గడపడం మొదలుపెట్టింది. అక్క ఆటను చూస్తూ వచ్చిన చిన్నారి ప్రజ్ఞానంద కూడా చెస్ నేర్చుకున్నాడు. ఇప్పుడు అక్కను దాటి అగ్రస్థానానికి చేరాడు. వైశాలి కూడా ఇప్పుడు భారత చెస్లో చురుకైన ప్లేయర్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇంటర్నేషనల్ మాస్టర్, మహిళా గ్రాండ్మాస్టర్గా కూడా వైశాలి సత్తా చాటుతుండగా.. మరో వైపు తమ్ముడు ప్రపంచ కప్ రన్నరప్ స్థాయికి చేరాడు. కోచ్ చూపిన బాటలో.. ప్రజ్ఞానంద గెలుపు ప్రస్థానంలో కోచ్ రమేశ్దే కీలక పాత్ర. సహజమైన ప్రతిభను గుర్తించి చాలా చిన్న వయసులోనే సానబెట్టడంలో ఆయన దూరదృష్టి పని చేసింది. చెన్నైలోని చెస్ గురుకుల్ అకాడమీలో ఆయన వద్ద దాదాపు నాలుగు వందల మంది శిక్షణ పొందుతుండగా వారిలో ప్రజ్ఞ ప్రియ శిష్యుడయ్యాడు. అందుకే ఈ సంచలనం గురించి రమేశ్కు తెలిసినంతగా మరెవరికీ తెలీదు. ‘పిల్లలు బొమ్మలతో ఆడుకుంటూ గంటలు గంటలు గడిపే వయసులో ప్రజ్ఞానంద ఈ స్థాయికి చేరాడు. ప్రతిభతోపాటు కష్టపడే తత్వం కూడా ఉంది ఆ పిల్లాడికి! అందుకే ఇంకా ఏదో సాధించాలంటూ అతడిపై అనవసరపు ఒత్తిడి పెంచను. అతను తర్వాతి గేమ్లో గ్రాండ్మాస్టర్ సాధిస్తాడని తెలిసి కూడా దాన్ని బయటకు వెలిబుచ్చకుండా బరిలోకి దించాను. ఆటలో గెలుపుతో పాటు ఓటములూ ఉంటాయనే విషయం అతనికి ఇప్పుడు అర్థమైంది. ఓడినా తన రొటీన్ను మార్చుకోడు కాబట్టి మానసికంగా సమస్య లేదు. పెద్దగా స్నేహితులు కూడా లేరు. కాబట్టి సమయం దొరికితే నేనే అతనితో సరదాగా టేబుల్ టెన్నిస్ ఆడతాను. ఏడాదిగా అతను అద్భుతాలు చేస్తున్నాడు. అవి అలాగే కొనసాగుతాయని నా నమ్మకం’ అన్నారు కోచ్. అన్నీ సంచలనాలే.. ప్రజ్ఞానందకు ఇటీవలే 18 ఏళ్ల నిండాయి. ఇప్పటికే అతను అంతర్జాతీయ చెస్లో ఎన్నో విజయాలు అందుకున్నాడు. ఇటీవల కార్ల్సన్తో తలపడి ప్రపంచ కప్ ఫైనల్లో రన్నరప్గా నిలవడం అతని కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శన. అయితే చిన్న వయసులోనే వరుసగా సాధించిన సంచలనాల జాబితా కూడా పెద్దదే! 10 ఏళ్ల వయసులోనే ఇంటర్నేషనల్ మాస్టర్ అయి ఆపై రెండేళ్ల తర్వాత గ్రాండ్మాస్టర్గా అవతరించాడు. అంతకు ముందే ప్రపంచ యూత్ చెస్ చాంపియన్షిప్లో అండర్–8, అండర్–10 విభాగాల్లోనూ విజేతగా నిలిచాడు. కార్ల్సన్ను ఓడించిన అతి పిన్న వయస్కుడు కూడా అతనే. ఆనంద్, హరికృష్ణ తర్వాత ఈ దిగ్గజాన్ని ఓడించిన మూడో భారతీయుడు ప్రజ్ఞానందే కాగా, మొత్తం 3 సార్లు అతను ఈ ఫలితాన్ని పునరావృతం చేయడం విశేషం. 14 ఏళ్ల వయసులో అంతర్జాతీయ టోర్నీ ఎక్స్ట్రాకాన్ ఓపెన్ (డెన్మార్క్)లో విజేతగా నిలవడంతో అతనికి తొలిసారి ప్రత్యేక గుర్తింపు దక్కింది. ఆ తర్వాత యూత్ అండర్–18 వరల్డ్ చాంపియన్షిప్ కూడా అతని ఖాతాలోనే చేరింది. ఇప్పుడు ప్రపంచ చాంపియన్కు సవాల్ విసిరే ఆటగాడిని ఎంపికచేసే ప్రతిష్ఠాత్మక క్యాండిడేట్స్ టోర్నీకీ ప్రజ్ఞ అర్హత సాధించాడు. అతని విజయాలకెప్పుడూ అమ్మ నాగలక్ష్మి తోడుంటూ వచ్చింది. ఇటీవలి వరల్డ్ కప్ సమయంలోనే ఆమె పైనా అందరి దృష్టి పడింది. చిన్నప్పటి నుంచి కొడుక్కి తోడుగా.. అతని ఏర్పాట్లన్నీ చూస్తూ.. మ్యాచ్ల కోసం విదేశాలకు వెళ్లినప్పుడూ ఏమాత్రం లోటు రానివ్వకుండా.. తన చేతివంటతో బిడ్డపై చూపించే ఆ తల్లి ప్రేమ కూడా ఆటల సమయంలో ఆ చిన్నారికి అదనపు బలమవుతోంది. ప్రజ్ఞానంద ఎంతో ప్రతిభావంతుడనడంలో ఎలాంటి సందేహం లేదు. అతని ఆట గురించి ఒక ప్రత్యేక అంశం నన్ను ఆకట్టుకుంటోంది. ‘డ్రా’కు అవకాశం ఉన్న మ్యాచ్లలో కూడా ఎక్కడా అతను తగ్గకుండా మిడిల్ గేమ్లో అనూహ్యమైన ఎత్తులతో అతను ఫలితం వైపు తీసుకెళ్తాడు. వేర్వేరు టోర్నమెంట్లలో గేమ్లను ఎంచుకునే విషయంలోనూ ఎంతో పరిణతి ప్రదర్శిస్తున్నాడు. అతను కెరీర్లో ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహిస్తాడు. – విశ్వనాథన్ ఆనంద్ ♦మొహమ్మద్ అబ్దుల్ హాది -
ప్రజ్ఞానందకు మూడో స్థానం
ప్రతిష్టాత్మక టాటా స్టీల్ చెస్ ఓపెన్ బ్లిట్జ్ టైటిల్ను అలెగ్జాండర్ గ్రిషుక్ (రష్యా) గెలుచుకున్నాడు. కోల్కతాలో శనివారం ముగిసిన ఈ టోర్నీలో 12 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. రెండు సార్లు వరల్డ్ బ్లిట్జ్ చాంపియన్ అయిన గ్రిషుక్ ఈ టోర్నీ లోనూ సత్తా చాటాడు. మొత్తం టోర్నీ లో అతను ఒకే ఒక రౌండ్లో ఓడాడు. ఉజ్బెకిస్తాన్కు చెందిన అబ్దుస్సతరోవ్ రెండో స్థానం (11 పాయింట్లు) సాధించగా...భారత టీనేజ్ సంచలనం ఆర్.ప్రజ్ఞానంద (11)కు మూడో స్థానం దక్కింది. ఇతర భారత ఆటగాళ్లలో అర్జున్ ఇరిగేశి (4వ), పెంటేల హరికృష్ణ (6వ), విదిత్ గుజరాతీ (7వ), డి.గుకేశ్ (8వ) టాప్–10లో ముగించారు. నాలుగు రౌండ్లలో వరుసగా ఓటమి లేకుండా నిలిచినా...ఆ తర్వాత అబ్దుస్సతరోవ్, గ్రిషుక్, విదిత్ చేతుల్లో పరాజయం పాలు కావడంతో ప్రజ్ఞానంద వెనుకబడిపోయాడు. భారత నంబర్వన్ గుకేశ్ చివరి రోజు 9 రౌండ్లలో ఆరింటిలో ఓటమిపాలయ్యాడు. 18 ఏళ్ల ప్రజ్ఞానంద ఇటీవల జరిగిన ప్రపంచ కప్ చెస్ టోర్నీ ఫైనల్లో కార్ల్సన్ చేతిలో ఓడి రన్నరప్గా నిలిచాడు. -
ప్రజ్ఞానందకు మూడో స్థానం
కోల్కతా: టాటా స్టీల్ ఇండియా చెస్ ర్యాపిడ్ ఓపెన్ టోర్నీలో భారత యువ గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానంద మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. పది మంది మేటి గ్రాండ్మాస్టర్ల మధ్య నిర్ణీత తొమ్మిది రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో ప్రజ్ఞానంద, అలెగ్జాండర్ గ్రిషుక్ (రష్యా), విదిత్ సంతోష్ గుజరాతి (భారత్) ఐదు పాయింట్లతో సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్ను వర్గీకరించారు. ప్రజ్ఞానందకు మూడో ర్యాంక్, గ్రిషుక్కు నాలుగో ర్యాంక్, విదిత్కు ఐదో ర్యాంక్ లభించాయి. గురువారం జరిగిన చివరి మూడు రౌండ్లలో 18 ఏళ్ల ప్రజ్ఞానంద సహచరులు విదిత్, ఇరిగేశి అర్జున్లపై గెలిచి భారత నంబర్వన్ దొమ్మరాజు గుకేశ్ చేతిలో ఓడిపోయాడు. 4.5 పాయింట్లతో గుకేశ్ ఆరో స్థానంలో నిలిచాడు. 3 పాయింట్లతో అర్జున్ తొమ్మిదో స్థానంలో, పెంటేల హరికృష్ణ 2.5 పాయింట్లతో చివరిదైన పదో స్థానంలో నిలిచారు. 7 పాయింట్లతో ఫ్రాన్స్ గ్రాండ్మాస్టర్ మాక్సిమి వచీర్ లాగ్రెవ్ చాంపియన్గా అవతరించగా... 5.5 పాయింట్లతో తైమూర్ రజబోవ్ (అజర్బైజాన్) రన్నరప్గా నిలిచాడు. నేడు, రేపు బ్లిట్జ్ ఫార్మాట్లో టోర్నీ జరుగుతుంది. -
ఫ్లైట్లో ఇండియన్ చెస్ స్టార్.. క్యాబిన్ క్రూ వినూత్న అభినందనలు!
భారత చెస్ యువ సంచలనం, ఇండియన్ చెస్ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానందకు అంతటా ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ ప్రపంచ కప్ ఫైనల్లో ఆడి భారత్కు పేరు ప్రఖ్యాతులను తీసుకొచ్చిన ప్రజ్ఞానందకు ఇండిగో ఎయిర్లైన్స్ క్యాబిన్ క్రూ వినూత్నంగా అభినందనలు తెలిపారు. ఇటీవల ఇండిగో విమానంలో తల్లితో కలిసి ప్రయాణించిన ప్రజ్ఞానందకు విమానంలో ఉన్న క్యాబిన్ సిబ్బంది ఒక నోట్ అందించారు. చెస్ స్టార్ ప్రజ్ఞానంద, అతని తల్లితో కలిసి క్యాబిన్ క్రూ మెంబర్ దిగిన ఫొటోతో పాటు సిబ్బంది స్వయంగా రాసిన అభినందన నోట్ చిత్రాన్ని ఇండిగో సంస్థ ఎక్స్(ట్విటర్)లో షేర్ చేసింది. భారత చెస్ గ్రాండ్మాస్టర్ మాస్టర్ ప్రజ్ఞానంద తమ ఫ్లైట్లో ప్రయాణించడం గౌరవంగా ఉందని, మొట్టమొదటి ప్రపంచ కప్ ఫైనలిస్ట్గా నిలిచిన యువ ఛాంపియన్కు అభినందనలు అంటూ ప్రశంసించింది. ప్రజ్ఞానందను విమానంలో ఆన్బోర్డ్ చేయడం తమకు నిజంగా గౌరవం, సంతోషాన్ని కలిగిస్తోందని, దేశానికి ఎనలేని గౌరవాన్ని తీసుకొచ్చిన ఆయన అందరికీ స్ఫూర్తి అంటూ క్యాబిన్ క్రూ స్వయంగా రాసి సంతకాలు చేసి ప్రజ్ఞానందకు అందించారు. అజర్బైజాన్లో జరిగిన ఫిడే ప్రపంచ కప్ ఫైనల్కు చేరి యావత్ దేశం దృష్టిని ఆకర్షించిన ప్రజ్ఞానంద.. ప్రపంచ నంబర్ 1 మాగ్నస్ కార్ల్సెన్తో తలపడి రన్నరప్గా నిలిచారు. దీంతో ప్రజ్ఞానందకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్వయంగా అభినందించారు. అలాగే మహీంద్రా గ్రూప్ ఛైర్మన్, పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ప్రత్యేకంగా ప్రశంసించి మహీంద్రా ఎక్స్యూవీ400 ఎలక్ట్రిక్ ఎస్యూవీని బహుమతిగా అందించారు. ✈️ Taking chess to new heights! 🏆 We were honored to have Indian chess grandmaster Master R Praggnanandhaa on board. Congratulations to the young champion on becoming the first-ever World Cup finalist!#goIndiGo #IndiaByIndiGo pic.twitter.com/RmwcMjmy3H — IndiGo (@IndiGo6E) August 31, 2023 -
విశ్వనాథన్ ఆనంద్ను వెనక్కి నెట్టి.. నంబర్ 1గా యువ సంచలనం
D Gukesh Replaces Viswanathan Anand: యువ గ్రాండ్మాస్టర్ డి గుకేశ్ సంచలనం సృష్టించాడు. గత మూడు దశాబ్దాలుగా భారత చెస్ ప్రపంచాన్ని ఏలుతున్న దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ రికార్డును బ్రేక్ చేశాడు. 1986 జూలై నుంచి ఇండియా నంబర్ 1గా కొనసాగుతున్న ఆనంద్ను గుకేశ్ అధిగమించాడు. ఈ విషయాన్ని ఫిడే శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. తాజా ఫిడే ర్యాంకింగ్స్(సెప్టెంబరు 1 నుంచి)లో 17 ఏళ్ల ఈ చెన్నై గ్రాండ్ మాస్టర్ ఎనిమిదో ర్యాంకు సాధించాడు. తొలిసారి టాప్-10లో చోటు దక్కించుకుని.. ఆనంద్ కంటే ముందు వరుసలో నిలిచాడు. ఐదుసార్లు వరల్డ్ చాంపియన్ అయిన విశ్వనాథన్ ఆనంద్ ప్రస్తుతం తొమ్మిదో ర్యాంకులో కొనసాగుతున్నాడు. 37 ఏళ్ల రికార్డు బద్దలు ఈ నేపథ్యంలో తన మెంటార్ ఆనంద్ పేరిట ఉన్న 37 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టి గుకేశ్ భారత్ తరఫున నెంబర్ 1 ర్యాంకర్గా అవతరించాడు. ఆగష్టు 1 నుంచి రేటింగ్ మెరుగుపరచుకుంటూ మూడు స్థానాలు ఎగబాకిన గుకేశ్ ప్రస్తుతం 2758 పాయింట్లు కలిగి ఉండగా.. ఆనంద్ స్కోరు 2754. ఇదిలా ఉంటే.. ఫిడే వరల్డ్కప్-2023 రన్నరప్గా నిలిచిన ఆర్ ప్రజ్ఞానంద 2727 పాయింట్లతో 19వ ర్యాంకు సాధించి.. భారత్ తరఫున టాప్-3లో నిలిచాడు. ఇక వీరి ముగ్గురితో పాటు విదిత్ సంతోష్ గుజరాతి(27వ ర్యాంకు), అర్జున్ ఇరిగేసి(తెలంగాణ- 29వ ర్యాంకు) టాప్-30లో చోటు దక్కించుకున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ పి. హరికృష్ణ 31వ స్థానంలో కొనసాగుతున్నాడు. కాగా డి గుకేశ్ ఇటీవల ముగిసిన ఫిడే వరల్డ్కప్ టోర్నీలో క్వార్టర్ఫైనల్స్ చేరిన విషయం విదితమే. చదవండి: పాకిస్తాన్తో అంత ఈజీ కాదు.. విధ్వంసకర ఆటగాళ్లు వీరే! అయినా టీమిండియాదే It's official! Gukesh is India's #1 in the #FIDErating list! 🔥 The 17-year-old prodigy makes history by overtaking the five-time World Champion Vishy Anand and terminating his uninterrupted 37-year reign as India's top-rated player! 📷 Stev Bonhage pic.twitter.com/paDli9hslX — International Chess Federation (@FIDE_chess) September 1, 2023 -
‘మేధావి’కి ఘన స్వాగతం
చెన్నై: ప్రపంచకప్ చెస్ టోర్నీలో అద్భుత ప్రదర్శనతో ఫైనల్ వరకు చేరిన భారత యువ గ్రాండ్మాస్టర్ ఆర్.ప్రజ్ఞానంద తన స్వస్థలం చెన్నై చేరుకున్నాడు. ప్రతిష్టాత్మక చదరంగ వేదికపై తనదైన ముద్ర వేసి తిరిగొచ్చిన ఈ 18 ఏళ్ల కుర్రాడిని సొంత నగరం ఆత్మీయంగా అక్కున చేర్చుకుంది. అతనికి విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఒకవైపు ఆత్మీయులు, సన్నిహితులు ఆనందంగా తమవాడికి వెల్కమ్ చెప్పగా, మరోవైపు తమిళనాడు ప్రభుత్వం అధికారికంగా స్వాగత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఆ రాష్ట్ర సాంప్రదాయ నృత్యాలు కరగట్టం, ఒయిలట్టంలతో విమానాశ్రయం బయట కళాకారులు ప్రజ్ఞానందకు స్వాగతం పలికారు. పూలు, శాలువాలు, పుష్పగుచ్చాలతో మిత్రులు, అభిమానులు ప్రజ్ఞను ముంచెత్తారు. ‘నాకు లభించిన ఈ స్వాగతం పట్ల చాలా సంతోషంగా ఉన్నాను’ అంటూ జాతీయ పతాకాన్ని చేతిలో ప్రదర్శిస్తూ ప్రజ్ఞానంద వ్యాఖ్యానించాడు. అతని తల్లి నాగలక్ష్మి కూడా తన ఆనందాన్ని దాచుకోలేకపోయింది. అనంతరం ప్రజ్ఞానంద, అతని తల్లిదండ్రులు నాగలక్ష్మి, రమేశ్బాబులను తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, క్రీడా శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ సన్మానించారు. ఈ సందర్భంగా ప్రజ్ఞానందకు జ్ఞాపికతోపాటు రూ. 30 లక్షలు నగదు పురస్కారం అందజేశారు. అజర్బైజాన్లోని బాకులో జరిగిన ‘ఫిడే’ వరల్డ్ కప్ ఫైనల్లో వరల్డ్ నంబర్వన్ మాగ్నస్ కార్ల్సన్ చేతిలో ఓడిన ప్రజ్ఞానంద రన్నరప్గా నిలిచాడు. -
ఆనంద్ మహీంద్ర గిప్ట్కు: ప్రజ్ఞానంద రియాక్షన్ ఇదీ!
RPraggnanandhaa Reacts Parents Long Term Dream పారిశ్రామికవేత్త, బిలియనీర్ తన తల్లి దండ్రులకు ప్రకటించిన బహుమతిపై భారత చెస్ గ్రాండ్ మాస్టర్, ఫైడ్ చెస్ ప్రపంచ కప్ రన్నర్ అప్ ఆర్ ప్రజ్ఞానంద స్పందించారు. ఒక ఎలక్ట్రిక్ కారుకోసం కల గన్న తన అమ్మా నాన్నల చిరకాల వాంఛను ("లాంగ్ టర్మ్ డ్రీమ్") తీర్చినందుకు ధన్యవాదాలు సార్ అంటూ ప్రజ్ఞానంద ట్వీట్ చేశారు. తన కృతజ్ఞతను తెలియజేయడానికి పదాలు లేవు...చాలా ధన్యవాదాలు అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రజ్ఞానంద సాధించిన ఘనతకు గౌరవంగా అతని తల్లిదండ్రులకు ఆల్-ఎలక్ట్రిక్ SUVని బహుమతిగా ఇవ్వాలని ఆనంద్ మహీంద్రా నిర్ణయించిన సంగతి తెలిసిందే. (ప్రజ్ఞానంద తల్లిదండ్రులకు ఆనంద్ మహీంద్ర అదిరిపోయే గిఫ్ట్) కాగా పిల్లవాడి ఆసక్తిని గమనించి, ప్రోత్సహించిన ప్రజ్ఞానంద పేరెంట్స్ నాగలక్ష్మి రమేష్బాబులను ఆనంద్ మహీంద్ర అభినందించారు. ఇందులో భాగంగానే వారికి ఆల్ ఎలక్ట్రిక్ SUV XUV400ని ఇవ్వనున్నట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అంతేకాదు దేశంలో తల్లిదండ్రులు దీన్ని ప్రేరణగా తీసుకోవాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే మహీంద్ర ఆల్ ఎలక్ట్రిక్ SUV XUV400ని ప్రత్యేక ఎడిషస్ను ఆ దంపతులకు ఇవ్వనున్నామని మహీంద్రా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఈవో బదులిచ్చారు. దీంతో సోషల్ మీడియాలో వైరల్గా మారిన సంగతి తెలిసిందే. No words to express my Gratitude 🙏 Thankyou very much @anandmahindra sir and @rajesh664 sir It is a long term dream of my parents to own an EV car thanks for making it a reality! https://t.co/YWCK1D99ik — Praggnanandhaa (@rpragchess) August 29, 2023 Sky is the limit! @rpragchess and @GM_JKDuda showed us that the mind of a genius knows no bounds! #chess #mind pic.twitter.com/TWzvPefBNV — WR_Chess_Masters (@wr_chess) August 29, 2023 -
ప్రజ్ఞానంద జట్టుకు టైటిల్
డసెల్డార్ఫ్ (జర్మనీ): గతవారం ప్రపంచకప్ టోర్నమెంట్లో రజత పతకం గెలిచి సంచలనం సృష్టించిన భారత యువ గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానంద మరోసారి ఆకట్టుకున్నాడు. ప్రపంచ ర్యాపిడ్ టీమ్ చెస్ చాంపియన్షిప్లో ప్రజ్ఞానంద రాణించి తన జట్టు విజేతగా అవతరించడంలో కీలకపాత్ర పోషించాడు. అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) ఆధ్వర్యంలో స్విస్ ఫార్మాట్లో 12 రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో జర్మనీ వ్యాపారవేత్త, చెస్ ప్లేయర్ అయిన వాదిమ్ రోసెన్స్టీన్ (డబ్ల్యూఆర్) జట్టు 22 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. డబ్ల్యూఆర్ జట్టుకు గ్రాండ్మాస్టర్లు ప్రజ్ఞానంద, సో వెస్లీ (అమెరికా), నోదిర్బెక్ (ఉజ్బెకిస్తాన్), నిపోమ్నిషి (రష్యా), క్రిస్టాఫ్ (పోలాండ్), కీమర్ (జర్మనీ), హు ఇఫాన్ (చైనా), కోస్టెనిక్ (స్విట్జర్లాండ్), వాదిమ్ రోసెన్స్టీన్ (జర్మనీ) ప్రాతినిధ్యం వహించారు. ప్రజ్ఞానంద మొత్తం ఏడు గేమ్లు ఆడి ఆరు గేముల్లో గెలిచి, మరో గేమ్ను ‘డ్రా’గా ముగించి 6.5 పాయింట్లు సాధించాడు. భారత దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్, విదిత్ సంతోష్ గుజరాతి, డానిల్ దుబోవ్ తదితరులు సభ్యులుగా ఉన్న ఫ్రీడమ్ జట్టు 20 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజత పతకం సొంతం చేసుకుంది. పుణేకు చెందిన ఎంజీడీ1 జట్టు 18 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించింది. ఎంజీడీ1 జట్టు తరఫున భారత గ్రాండ్మాస్టర్లు హరికృష్ణ, హారిక, అర్జున్, నిహాల్ సరీన్, రౌనక్, ఆదిత్య మిట్టల్, శ్రీనాథ్ నారాయణన్, గునే మమద్జాడా (అజర్బైజాన్) పోటీపడ్డారు. వ్యక్తిగత విభాగాలకొస్తే బోర్డు–1పై హరికృష్ణ కాంస్యం, బోర్డు–3పై విదిత్, అర్జున్ రజత, కాంస్య పతకాలను నెగ్గారు. బోర్డు–7పై హారిక రజత పతకం దక్కించుకుంది. -
ప్రజ్ఞానంద తల్లిదండ్రులకు ఆనంద్ మహీంద్ర అదిరిపోయే గిఫ్ట్
ఫిడే వరల్డ్ కప్లో ప్రపంచ నెంబర్ వన్ ఆటగాడు మాగ్నస్ కార్ల్సన్కు ముప్పు తిప్పలు పెట్టిన భారత గ్రాండ్ మాస్టర్ 18 ఏళ్ల ప్రజ్ఞానంద్ తల్లి దండ్రులకు తీపి కబురు అందించారు పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర. సాధారణంగా క్రీడల్లొ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లకు మహీంద్ర అండ్ మహీంద్రకు చెందిన స్పెషల్ ఎడిషన్ కార్లను ఇవ్వడం ఆయనకు అలవాటు. తాజాగా ప్రజ్ఞానంద విషయంలో మాత్రం వినూత్నంగా ఆలోచించారు. ఒక యూజర్ సలహాకు స్పందిస్తూ చాలా మంది, ప్రజ్ఞానందకు థార్ బహుమతిగా ఇవ్వమని కోరుతున్నారు. కానీ బుర్రలో మరో ఆలోచన ఉంది అంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు పనిలో పనిగా తల్లిదండ్రులు ఒక చక్కటి సలహా కూడా ఇచ్చాడు. వీడియో గేమ్లకు బదులుగా మేథస్సును పెంచే తమ పిల్లలకు చెస్ ఆటను నేర్పించాలనే సలహా ఇచ్చారు.ఈ నేపథ్యంలో తమ కుమారుడిని చిన్నప్నటినుంచి చదరంగం క్రీడలో ప్రోత్సహించి, ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు కృతజ్ఞతగా, ప్రోత్సాహకంగా ప్రజ్ఞానంద పేరేంట్స్కు బంపర్ ఆఫర్ ప్రకటించారు. (రిలయన్స్ ఏజీఎం: రిలయన్స్ బోర్డుకు నీతా అంబానీ రాజీనామా) అలా వారి ప్రోత్సాహంతో ప్రపంచంలోనే అతి పిన్న వయసులో గ్రాండ్ మాస్టర్ టైటిల్ సాధించిన ప్రజ్ఞానంద తల్లిదండ్రులు నాగలక్ష్మి రమేష్బాబు గౌరవించనున్నారు. ఈ దంపతులకు మహీంద్ర XUV4OO EVని బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించారు. దీనికి పరి శీలించాల్సిందిగా కంపెనీకి చెందిన రాజేష్కు ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. దీంతో తక్షణమే స్పందించిన రాజేష్ త్వరలోనే ప్రజ్ఞానంద తల్లిదండ్రులకు ఆల్ ఎలక్ట్రిక్ SUV XUV400 ప్రత్యేక ఎడిషన్ అందించనున్నట్టు వెల్లడించారు. దీంతో నెటిజన్లు అమేజింగ్ సార్ అంటూ ఆనంద్ మహీంద్రను ప్రశంసించారు. ఈ టోర్నీలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుని, ఫైనల్లో పోరాడిన ఓడి ప్రజ్ఞానందను అభినందించారు. కాగా తమిళనాడులోని చెన్నైలో 2005లో జన్మించిన రమేశ్బాబు ప్రజ్ఞానంద చిన్న వయసు నుంచి చెస్లో రాణిస్తూ చెస్ సంచలనంగా మారి దేశానికి గర్వకారణంగా నిలిచిన సంగతి తెలిసిందే. (గోల్డెన్ బోయ్ నీరజ్ ప్రైజ్మనీ ఎంతో తెలుసా? ) Congratulations @rpragchess for your spectacular achievement.Thanks @anandmahindra for the idea of recognising PARENTS of @rpragchess Shrimati Nagalakshmi & Shri Rameshbabu.The All Electric SUV XUV400 would be perfect-our team will connect for a special edition and delivery — Rajesh Jejurikar (@rajesh664) August 28, 2023 -
అప్పుడే నాకు తెలియకుండా నా ఫోటోలు తీశారు! ఇంకా ఎన్నో గెలవాలి!
బాకు (అజర్బైజాన్): ప్రపంచకప్లో ఫైనల్ చేరిన సంచలనం సృష్టించిన భారత గ్రాండ్మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద ప్రదర్శనపై అతని తల్లి నాగలక్ష్మి సంతోషం వ్యక్తం చేసింది. అతని కెరీర్ ఆరంభం నుంచి అన్నింటా తోడుగా ఉంటూ వచ్చిన నాగలక్ష్మి వరల్డ్ కప్లోనూ ప్రజ్ఞానంద వెన్నంటే నిలిచింది. అతను ఫైనల్ చేరడంతో పాటు క్యాండిడేట్స్ టోర్నీకి కూడా అర్హత సాధించడం గొప్పగా అనిపిస్తోందన్న ఆమె... తన కొడుకు ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉందని వ్యాఖ్యానించింది. ‘‘ప్రపంచకప్లో ప్రజ్ఞానంద ఫైనల్ వరకు రావడం చాలా సంతోషంగా ఉంది. పైగా క్యాండిడేట్స్కు అర్హత సాధించడం దానిని రెట్టింపు చేసింది. అతను మున్ముందు మరిన్ని విజయాలు సాధించాలి. అర్జున్తో క్వార్టర్ ఫైనల్ జరుగుతున్నప్పుడు ప్రజ్ఞ ఏం చేస్తున్నాడనే ఉత్కంఠతోనే అలా చూస్తూ ఉండిపోయాను. అప్పుడే నాకు తెలియకుండా కొందరు నా ఫోటోలు తీశారు. అవే జనంలోకి వెళ్లాయి. చివరకు ఆ మ్యాచ్లో మా అబ్బాయి గెలిచాడు’ అని నాగలక్ష్మి గుర్తు చేసుకుంది. -
Chess World Cup 2023: రాజూ బంటూ అమ్మే
చదరంగంలో పావులు కదపాలంటే బుద్ధికి బృహస్పతిలా ఉండాలి. కాని ఆ బృహస్పతిని కని, పెంచడానికి అమ్మ అమ్మలా ఉంటే చాలు. అమ్మకు ఎత్తుకు పై ఎత్తు తెలియదు ప్రేమ తప్ప. తన బిడ్డను రాజు చేయాలనే తపన తప్ప. అందుకు తాను బంటుగా మారేందుకు సిద్ధం కావడం తప్ప. చెస్ వరల్డ్ కప్ 2023లో సంచలనంగా నిలిచిన ఆర్. ప్రజ్ఞానందకు రాజుగా, బంటుగా ఉంటూ తీర్చిదిద్దిన తల్లి నాగలక్ష్మి కథ ఇది. అజర్బైజాన్లో జరిగిన ‘చెస్ వరల్డ్ కప్ 2023’ ఫైనల్స్లో ఒక అడుగు దూరంలో టైటిల్ కోల్పోయాడు 18 ఏళ్ల ప్రజ్ఞానంద. అతడు ఓడినా గెలిచినట్టే. ప్రపంచ దేశాల నుంచి 206 మంది గ్రాండ్ మాస్టర్లు పాల్గొన్న ఈ భారీ వరల్డ్ కప్లో ఇంత చిన్న వయసులో రన్నరప్గా నిలవడం సామాన్యం కాదు. కాకలు తీరిన యోధులను ఓడించి మరీ ఈ స్థానాన్ని దక్కించుకోవడమే కాదు దాదాపు 66 లక్షల రూపాయల ప్రైజ్ మనీ గెలుచుకున్నాడు. భారతదేశం గర్వించేలా చెస్లో వెలుగులీనుతున్న ఈ కుర్రవాడి విజయం వెనుక అతని తల్లి నాగలక్ష్మి ఉంది. అందుకే చెస్ అభిమానులే కాదు దేశదేశాల గ్రాండ్ మాస్టర్లు కూడా ప్రజ్ఞానందకు వెన్నంటి వుంటూ తోడ్పాటునందిస్తున్న నాగలక్ష్మిని ప్రశంసిస్తున్నారు. ఆమెను చూసి ముచ్చట పడుతున్నారు. టీవీ అలవాటు మాన్పించడానికి చెన్నైలో స్థిరపడ్డ తెలుగు కుటుంబం రమేశ్ బాబు, నాగలక్ష్మిలకు కుమార్తె వైశాలి పుట్టాక ప్రజ్ఞానంద పుట్టాడు. ప్రజ్ఞానందకు నాలుగున్నర ఏళ్లు ఉన్నప్పుడు వైశాలి ఎక్కువగా టీవీ చూస్తున్నదని కూతురి ధ్యాస మళ్లించడానికి చెస్ బోర్డు తెచ్చి పెట్టింది నాగలక్ష్మి. వైశాలి చెస్ ఆడుతుంటే చిన్నారి ప్రజ్ఞా కూడా ఆడటం మొదలెట్టాడు. అతడు చెస్ నేర్చుకున్న పద్ధతి, అంత చిన్న వయసులో గెలుస్తున్న తీరు చూస్తే అతడు బాల మేధావి అని తల్లికి అర్థమైంది. మరోవైపు వైశాలి కూడా చెస్లో రాణించసాగింది. ఇక నాగలక్ష్మి తన జీవితాన్ని తన ఇద్దరు పిల్లల ఆట కోసం అంకితం చేయాలని నిశ్చయించుకుంది. అనుక్షణం వెన్నంటే ప్రజ్ఞానంద ఏడేళ్ల వయసుకే అండర్ సెవెన్లో జాతీయ టైటిల్ గెలిచాడు. పదేళ్ల వయసుకు ఇంటర్నేషనల్ ప్లేయర్ అయ్యాడు. 12 ఏళ్లకు గ్రాండ్ మాస్టర్ అయ్యాడు. అప్పుడైనా ఇప్పుడైనా ఉదయం నుంచి రాత్రి వరకూ చెన్నైలో వేరే దేశంలో అతని వెన్నంటే ఉంటుంది నాగలక్ష్మి. ‘ప్రజ్ఞా ఏ పోటీకి వచ్చినా తోడుండే నాగలక్ష్మి ఒక మూల కూచుని దేవుణ్ణి ప్రార్థిస్తూ కూచోవడం మా అందరికీ అలవాటైన దృశ్యం’ అంటాడు త్యాగరాజన్ అనే కోచ్. ఇతను చెస్లో ప్రజ్ఞాకు మొదటి పాఠాలు నేర్పాడు. ‘ఉదయం పది నుంచి సాయంత్రం 7 వరకూ చెస్ పాఠాలు నడిచేవి. ఆ తర్వాత రెండు మూడు గంటల హోమ్వర్క్ ఇచ్చేవాణ్ణి. ప్రజ్ఞానంద ఇల్లు చేరాక ఆ హోమ్వర్క్ అయ్యేవరకు నాగలక్ష్మి తోడు ఉండేదట. రాత్రి పదికి ఇంటి పనులు మొదలెట్టుకుని మళ్లీ ఉదయం ఆరు గంటలకు కొడుకు కోసం నిద్ర లేచేదట’ అని తెలిపాడు అతడు. చెస్ తెలియని అమ్మ కొడుకు చెస్లో ప్రపంచ విజేత స్థాయి ఆటగాడైనా నాగలక్ష్మికి ఇప్పటి వరకూ చెస్ ఆడటం తెలియదు. ‘మా అబ్బాయిని చూసుకోవడమే నాకు సరిపోతుంది. ఆట ఎక్కడ నేర్చుకోను’ అంటుందామె నవ్వుతూ. ప్రజ్ఞానంద శాకాహారి. బయటి ఆహారం తినడు. అందుకని ఏ ఊరికి ఆట కోసం బయలుదేరినా, విదేశాలకు ప్రయాణం కట్టినా నాగలక్ష్మి చేసే మొదటిపని లగేజ్లో ఒక ఇండక్షన్ స్టవ్వు, కుక్కరు, బియ్యం, మసాలాలు పెట్టుకోవడం. ‘ఎక్కడకు వెళ్లినా వాడికి వేడివేడి అన్నం, రసం చేసి పెడతాను. మైండ్ హాయిగా ఉండి బాగా ఆడాలంటే నచ్చిన ఆహారం తీసుకోవాలి’ అంటుంది నాగలక్ష్మి. చెస్ వరల్డ్ కప్ సెమీ ఫైనల్స్లో అమెరికా దిగ్గజ గ్రాండ్మాస్టర్ ఫాబియానో కరువానాను ఓడించి ప్రజ్ఞానంద ఫైనల్స్కు చేరినప్పుడు నాగలక్ష్మి కళ్లల్లో కనిపించి మెరుపును ఎవరో ఫొటో తీస్తే ఆ ఫొటో వైరల్ అయ్యింది. ‘మావాడు ఆట ఆడేంతసేపు వాడి కళ్లల్లో కళ్లు పెట్టి చూడను. ఎందుకంటే వాడి కళ్లు చూస్తే వాడి ఆట ఎలా సాగుతున్నదో నాకు తెలిసిపోతుంది. నాకు తెలిసిపోయినట్టుగా వాడికి తెలియడం నాకు ఇష్టం ఉండదు’ అంటుంది నాగలక్ష్మి. కార్ పార్కింగ్లో బంధువులు కూతురు, కొడుకు ఇంట్లో చెస్ ప్రాక్టీస్ చేస్తుంటే ఇంటిని వీలైనంత నిశ్శబ్దంగా ఉంచుతుంది నాగలక్ష్మి. వాళ్లింట్లో టీవీ పెట్టే ఎంతో కాలమైపోతూ వుంది. ‘మా ఇంటికి బంధువులొచ్చినా, స్నేహితులొచ్చినా కింద కార్ పార్కింగ్ దగ్గరే పలకరించి పంపేస్తాను... పిల్లలు డిస్ట్రబ్ కాకూడదని’ అంటుందామె. అందుకే సెమీ ఫైనల్స్ గెలిచిన ప్రజ్ఞాను అభినందిస్తూ రష్యా దిగ్గజం గ్యారీ కాస్పరోవ్ ‘నీకు మీ అమ్మ ఇచ్చే మద్దతు ప్రత్యేకమైనది’ అని ట్వీట్ చేశాడు. నాగలక్ష్మి లాంటి తల్లి ప్రేమకు పిల్లలు ఎప్పుడూ బంట్లే. వారి మనసులో ఆ తల్లి ఎప్పుడూ రాజే. -
టైటిల్ కార్ల్సన్కు... ప్రశంసలు ప్రజ్ఞానందకు
గత దశాబ్దకాలంగా పురుషుల చెస్లో మాగ్నస్ కార్ల్సన్కు ఎదురులేదు. ఈ నార్వే సూపర్స్టార్ క్లాసికల్, ర్యాపిడ్, బ్లిట్జ్ ఫార్మాట్లలో ప్రపంచ చాంపియన్గా నిలిచాడు. చెస్లో అత్యుత్తమ రేటింగ్ కూడా అందుకున్నాడు. అయితే అగ్రశ్రేణి చెస్ ఆటగాళ్ల మధ్య రెండేళ్లకోసారి నాకౌట్ పద్ధతిలో జరిగే ప్రపంచకప్ టో ర్నీలో మాత్రం కార్ల్సన్ శిఖరాన నిలువలేకపోయాడు. ఈసారి మాత్రం నిలకడైన ఆటతీరుతో కార్ల్సన్ తన కెరీర్లో తొలిసారి ప్రపంచకప్ టైటిల్ను సాధించాడు. కార్ల్సన్కు టైటిల్ దక్కినా అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం భారత యువ గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానందనే. తన అసమాన పోరాటపటిమతో... ఊహకందని ఎత్తులతో... తనకంటే ఎంతో మెరుగైన ప్రత్యర్థులను బోల్తా కొట్టిస్తూ... తమిళనాడుకు చెందిన 18 ఏళ్ల ఈ టీనేజర్ రెండో ప్రయత్నంలోనే ఈ టోర్నీలో ఫైనల్కు చేరాడు. కార్ల్సన్కు ఆద్యంతం గట్టిపోటీనిచ్చాడు. అనుభవలేమితో తుది మెట్టుపై తడబడ్డా... భవిష్యత్లో ప్రపంచ చాంపియన్ అయ్యే లక్షణాలు తనలో పుష్కలంగా ఉన్నాయని ప్రజ్ఞానంద చాటుకున్నాడు. బాకు (అజర్బైజాన్): ఇన్నాళ్లూ భారత చెస్ అంటే ముందుగా విశ్వనాథన్ ఆనంద్ పేరు గుర్తుకొచ్చేది. కానీ ఇక నుంచి ఆనంద్తోపాటు తమిళనాడు కుర్రాడు ప్రజ్ఞానంద పేరు కూడా అభిమానుల మదిలో మెదులుతుంది. గత 25 రోజులుగా అజర్బైజాన్ రాజధాని బాకులో జరిగిన ప్రపంచకప్ టో ర్నీలో ఆరంభం నుంచి మేటి ఆటగాళ్లను మట్టికరిపించిన ఈ తమిళనాడు కుర్రాడు తుదిపోరులో నార్వే దిగ్గజం మాగ్నస్ కార్ల్సన్ను బోల్తా కొట్టించలేకపోయాడు. నిర్ణీత రెండు క్లాసికల్ గేముల్లో ప్రజ్ఞానంద నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొని ‘డ్రా’తో సంతృప్తి పడ్డ 32 ఏళ్ల కార్ల్సన్ టైబ్రేక్లోని ర్యాపిడ్ గేముల్లో తన అనుభవాన్నంతా ఉపయోగించి గట్టెక్కాడు. తొలి గేమ్లో నల్ల పావులతో ఆడిన కార్ల్సన్ 47 ఎత్తుల్లో ప్రజ్ఞానందపై గెలుపొంది... రెండో గేమ్లో తెల్ల పావులతో ఆడి 22 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకొని ఓవరాల్గా 2.5–1.5తో విజయాన్ని ఖరారు చేసుకున్నాడు. ఐదుసార్లు ప్రపంచ చాంపియన్గా నిలిచిన కార్ల్సన్ 156 మంది ఆటగాళ్ల మధ్య నాకౌట్ పద్ధతిలో నిర్వహించే ప్రపంచకప్ టోర్నీలో మాత్రం తొలిసారి విజేతగా నిలిచాడు. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్లో ఫాబియానో కరువానా (అమెరికా) 3–1తో నిజాత్ అబసోవ్ (అజర్బైజాన్)పై గెలిచాడు. విజేతగా నిలిచిన కార్ల్సన్కు 1,10,000 డాలర్లు (రూ. 90 లక్షలు), రన్నరప్ ప్రజ్ఞానందకు 80 వేల డాలర్లు (రూ. 66 లక్షలు), మూడో స్థానం పొందిన కరువానాకు 60 వేల డాలర్లు (రూ. 49 లక్షలు)... నాలుగో స్థానంలో నిలిచిన అబసోవ్కు 50 వేల డాలర్లు (రూ. 41 లక్షలు) ప్రైజ్మనీగా లభించాయి. ఈ ప్రపంచకప్ టోర్నీలో టాప్–3లో నిలిచిన ముగ్గురు ప్లేయర్లు వచ్చే ఏడాది జరిగే క్యాండిడేట్ టోర్నీకి అర్హత సాధించారు. తనకు సరైన పోటీనిచ్చే వారు లేకపోవడంతో ప్రపంచ చాంపియన్íÙప్లో పాల్గొనే ఆసక్తి లేదని గత ఏడాది ప్రకటించిన కార్ల్సన్ క్యాండిడేట్ టో ర్నీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. దాంతో రన్నరప్ ప్రజ్ఞానంద, కరువానా, అబసోవ్ క్యాండిడేట్ టో ర్నీకి అర్హత పొందారు. క్యాండిడేట్ టోర్నీ విజేత ప్రస్తుత ప్రపంచ చాంపియన్ డింగ్ లిరెన్ (చైనా)తో ప్రపంచ చాంపియన్షిప్ మ్యాచ్ ఆడతారు. ఒక్కో రౌండ్ దాటి... 2019 ప్రపంచకప్లో తొలిసారి బరిలోకి దిగిన ప్రజ్ఞానంద నాలుగో రౌండ్లో వెనుదిరిగాడు. ఈసారి మాత్రం ఈ తమిళనాడు కుర్రాడు అద్భుత ప్రదర్శనతో అదరగొట్టాడు. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఈ టోర్నీ చరిత్రలో ఫైనల్ చేరిన రెండో భారతీయ ప్లేయర్గా గుర్తింపు పొందాడు. ఓవరాల్గా ఈ టోర్నీలో భారత్ నుంచి ఓపెన్ విభాగంలో పది మంది గ్రాండ్మాస్టర్లు పోటీపడగా ఒకరు ఫైనల్కు, మరో ముగ్గురు క్వార్టర్ ఫైనల్కు చేరడం విశేషం. ♦ 2690 రేటింగ్తో ప్రపంచ ర్యాంకింగ్స్లో 29వ స్థానంలో ఉన్న ప్రజ్ఞానందకు తొలి రౌండ్లో ‘బై’ లభించింది. ♦ రెండో రౌండ్లో 2599 రేటింగ్ ఉన్న ఫ్రాన్స్ గ్రాండ్మాస్టర్ మాక్సిమి లగార్డె (ఫ్రాన్స్)పై 1.5–0.5తో గెలిచాడు. ♦ మూడో రౌండ్లో చెక్ రిపబ్లిక్ గ్రాండ్మాస్టర్, 2689 రేటింగ్ ఉన్న డేవిడ్ నవారా (చెక్ రిపబ్లిక్)ను ప్రజ్ఞానంద ఓడించాడు. ♦ నాలుగో రౌండ్లో ప్రజ్ఞానంద ప్రపంచ రెండో ర్యాంకర్, 2787 రేటింగ్ ఉన్న హికారు నకముర (అమెరికా)పై టైబ్రేక్లో 3–1తో సంచలన విజయం సాధించాడు. ♦ ఐదో రౌండ్లో 1.5–0.5తో ఫెరెంక్ బెర్కెస్ (హంగేరి)పై గెలిచాడు. ♦ క్వార్టర్ ఫైనల్లో ప్రజ్ఞానంద భారత్కే చెందిన మరో గ్రాండ్మాస్టర్, 2710 రేటింగ్ ఉన్న ఇరిగేశి అర్జున్పై టైబ్రేక్లో 5–4తో సంచలన విజయం సాధించాడు. ♦ ప్రపంచ మూడో ర్యాంకర్, 2782 రేటింగ్ ఉన్న ఫాబియానో కరువానా (అమెరికా)తో జరిగిన సెమీఫైనల్లో ప్రజ్ఞానంద టైబ్రేక్లో 3.5–2.5తో గెలుపొంది ఫైనల్ చేరాడు. -
అక్క చేసిన ఆ పని వల్లే.. ఇలా! ఆ తల్లికేమో ‘భయం’.. అందుకే తండ్రితో పాటు!
గత మూడు రోజులుగా రెండు దేశాల క్రీడా ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూసిన క్షణాలు.. వరల్డ్ నంబర్ 1 మాగ్నస్ కార్ల్సన్తో ప్రజ్ఞానంద ఫైనల్ పోరు.. టైబ్రేక్స్లో తేలిన ఫలితం.. ఎట్టకేలకు 18 ఏళ్ల కుర్రాడిపై అనుభవజ్ఞుడైన 32 ఏళ్ల కార్ల్సన్దే పైచేయి అయింది.. జగజ్జేతగా అవతరించిన అతడికే FIDE World Cup దక్కింది. దిగ్గజ ఆటగాడి చేతిలో ఓడితేనేమి.. చిన్న వయసులోనే ఇక్కడి దాకా చేరుకున్న మన ప్రజ్ఞానంద ఎప్పుడో అందరి మనసులు గెలిచేశాడు. పిట్టకొంచెం కూత ఘనం అనే మాటను నిజం చేస్తూ కార్ల్సన్ను ఢీకొట్టడమే గాక విజయం కోసం చెమటోడ్చేలా చేశాడు. ఎత్తులకు పైఎత్తులు వేస్తూ గెలుపు కోసం నిరీక్షించేలా చేశాడు. ప్రపంచకప్ ఫైనల్లో పోటీ పడిన ఈ ఇద్దరిలోనూ ఓ సారూప్యత ఉంది. కార్ల్సన్ చెస్ లెజెండ్గా అవతరించడంలో అతడి తండ్రి పాత్ర ఉంటే.. చెన్నై కుర్రాడు ప్రజ్ఞానంద ప్రయాణం ఇక్కడిదాకా సాఫీగా సాగడానికి ముఖ్య కారణం అతడి తల్లి! PC: @photochess/FIDE Twitter) చెస్ హాల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రజ్ఞానంద కళ్లు తన తల్లి నాగలక్ష్మి కోసం వెదుకుతాయి. లేనిపోని హంగూ ఆర్భాటాలతో సందడి చేసే వాళ్లలో ఒకరిగా గాకుండా తమ ఇంట్లోనే ఉన్నంత సాదాసీదాగా.. ఏ హడావుడీ లేకుండా ఓ పక్కన నిలబడి ఉంటారామె! నిండైన చీరకట్టులో అందరిలో ప్రత్యేకంగా ఉన్న ఆమె కనబడగానే ప్రజ్ఞానంద ముఖంలో ఎక్కడాలేని సంతోషం.. గెలిచినా.. ఓడినా సరే! పరిగెత్తుకు వెళ్లి తల్లిని హత్తుకోవడం అతడికి అలవాటు. అతడి కళ్లలో భావోద్వేగపు తాలూకు ఛాయలు.. ఆమె ఆప్యాయపు చూపుల ప్రేమతో అలా చెమ్మగిల్లుతాయి. మ్యాచ్ ఫలితం ఏమిటన్న అంశంతో ఆమెకు సంబంధం లేదు. అసలు ఆ విషయం గురించి కొడుకును ఒక్క మాటా అడగరు! గెలుపోటములతో ఆమెకు పని లేదు. చెస్ బోర్డులోని 64 గడులు, వాటితో వేసే క్లిష్టమైన ఎత్తులు, పైఎత్తులు కూడా ఆమెకు పెద్దగా తెలియదు. మేధావులతో ఢీకొట్టే తన చిన్నారి కుమారుడు ఎలా ఆడుతున్నాడు అన్న విషయమూ ఆమెకు పట్టదు. తన కొడుకుతో తను ఉండాలంతే! ఎలాంటి పరిస్థితుల్లోనైనా అతడికి అండగా నిలబడాలి. తనకు నచ్చినా నచ్చకపోయినా.. కొడుకుతో పాటే ప్రయాణాలు చేయాలి. అతడిని కంటికి రెప్పలా కాచుకోవాలి. ఆ తల్లి మనసుకు తెలిసింది ఇదే! గత దశాబ్దకాలంగా.. చిన్నపిల్లాడి నుంచి.. గ్రాండ్ మాస్టర్గా ఎదిగి ఈరోజు ఈ స్థాయికి చేరేదాకా ఆ మాతృమూర్తి కొడుకు కోసం తన సమయాన్నంతా కేటాయించింది. కుమారుడి విజయాలకు సాక్షిగా గర్వపడే క్షణాలను ఆస్వాదిస్తోంది. ఎక్కడున్నా సరే.. తన అమితమైన ప్రేమతో పాటు కొడుకుకు ఇష్టమైన సాంబార్, టొమాటో రైస్ వడ్డిస్తూ అతడికి కావాల్సిన సౌకర్యాలు అందిస్తూ ఆ తల్లి తన ప్రయాణం కొనసాగిస్తోంది. ఇవన్నీ ప్రత్యక్షంగా చూసిన వాళ్లకు.. పరోక్షంగా విన్న వాళ్లకూ ‘‘నా విజయాలకు ముఖ్య కారణం మా అమ్మే’’ అన్న ప్రజ్ఞానంద మాటలు నూటికి నూరుపాళ్లు నిజమే అనిపించడంలో ఆశ్చర్యం లేదు! అక్క చేసిన ఆ పని వల్లే.. చెస్ ప్రపంచంలో భారత్ను మరో స్థాయికి తీసుకువెళ్లడంలో తన వంతు పాత్ర పోషిస్తున్న ప్రజ్ఞానందది సాధారణ కుటుంబం. తండ్రి రమేశ్బాబు బ్యాంకు ఉద్యోగి కాగా.. తల్లి నాగలక్ష్మి ‘గృహిణి’. ప్రజ్ఞానందకు సోదరి వైశాలి ఉంది. ఆమె కూడా చెస్లో రాణిస్తోంది. చిన్నతనంలో వైశాలి టీవీకే అతుక్కుపోవడం గమనించిన నాగలక్ష్మి ఆమె ధ్యాసను మళ్లించేందుకు చెస్ బోర్డు కొనిచ్చింది. ఆ సమయంలో నాలుగేళ్లన్నరేళ్ల ప్రజ్ఞా కూడా ఆటపై ఆసక్తి కనబరచడంతో కోచింగ్ ఇప్పించారు ఆ తల్లిదండ్రులు. అలా బాల మేధావిగా పేరొందిన ప్రజ్ఞానంద అంచెలంచెలుగా ఎదుగుతూ పదేళ్లకే ఇంటర్నేషనల్ మాస్టర్ అయ్యాడు. కార్ల్సన్ను ఓడించి ఎప్పటికప్పుడు ప్రతిభను నిరూపించుకుంటూ 16 ఏళ్ల వయసులో మహామహులకే సాధ్యం కాని రీతిలో కార్ల్సన్ను ఓడించి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. ఏడాది కాలంలో ఏకంగా మూడుసార్లు అతడిపై మూడు సార్లు గెలుపొంది చెస్ ప్రపంచానికి కొత్త రారాజు రాబోతున్నాడనే సంకేతాలు ఇచ్చాడు. ప్రతిష్టాత్మక టైటిల్కు అడుగుదూరంలో నిలిచినా ర్యాంకింగ్స్లో టాప్-10 చోటు దక్కించుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతానని నమ్మకంగా చెబుతున్నాడు. PC: Amruta Mokal ఆ తల్లికి ‘భయం’.. అందుకే తండ్రి అలా ఇక నార్వే స్టార్ కార్ల్సన్ విషయానికొస్తే.. ప్రజ్ఞాకు తల్లి నాగలక్ష్మి ఎలాగో.. అతడికి తండ్రి హెన్రిక్ అలాగే! మేనేజర్గా, మార్గనిర్దేశకుడిగా కార్ల్సన్ను ముందుకు నడిపిస్తున్నాడు. ఎల్లవేళలా కొడుకుతోనే ఉంటూ అతడికి ఏ ఇబ్బంది కలగకుండా చూసుకుంటున్నాడు. మాగ్నస్ కార్ల్సన్ తల్లి సిగ్రూన్ కెమికల్ ఇంజనీర్. ఆమెకు చెస్ ఆడటం తెలుసు. కానీ ఎప్పుడూ కొడుకు మ్యాచ్లు చూసేందుకు ఆవిడ రాదు. ఒత్తిడిని తట్టుకోవడం... భావోద్వేగాలను అదుపు చేసుకోవడంలో సిగ్రూన్ బలహీనురాలు కాబట్టే తానే ఎప్పుడూ కార్ల్సన్ వెంట ఉంటానని ఐటీ కన్సల్టెంట్ అయిన హెన్రిక్ ఓ సందర్భంలో చెప్పాడు. అన్నట్లు ఈ దంపతులకు మాగ్నస్తో పాటు ముగ్గురు కూతుళ్లు కూడా ఉన్నారు. వీళ్లంతా పజిల్ ప్రపంచానికి పరిచయస్తులేనండోయ్! -సుష్మారెడ్డి యాళ్ల చదవండి: Minnu Mani: అమ్మానాన్న వద్దన్నారు! పట్టువీడలేదు.. ఏకంగా టీమిండియాకు! ఆ జంక్షన్కు ఆమె పేరు He said "Your photo on Twitter was huge!" I said, "It is because you ARE huge!" @rpragchess and his lovely mum are IN THE #FIDEWorldCup2023 FINAL ♥️ pic.twitter.com/2bJP21yBGN — PhotoChess (@photochess) August 21, 2023 -
ప్రజ్ఞానందపై ఆనంద్ మహీంద్రా ట్వీట్.. నువ్వు 'రన్నరప్' కాదు..
ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం.. మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ చైర్మన్ 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఎన్నెన్నో ఆసక్తికరమైన అంశాలను ట్విటర్ వేదికగా పోస్ట్ చేస్తూ ఉంటాడు. ఇందులో భాగంగానే తాజాగా మరో ట్వీట్ చేసాడు. ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. చదరంగంలో (చెస్) అందరి ద్రుష్టి తనవైపు తిప్పుకున్న 'ప్రజ్ఞానంద' (Praggnanandhaa) ఫైనల్ స్టేజిలో రన్నర్గా నిలిచాడు. ఈ గేమ్లో కార్ల్సన్ అద్భుత విజయం సాధించి విన్నర్ టైటిల్ సొంతం చేసుకున్నారు. ఇదీ చదవండి: ఎవరీ 'మాయా టాటా'? లక్షల కోట్ల 'టాటా' సామ్రాజ్యానికి వారసురాలు ఈమేనా? దీనిపైన ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేస్తూ నువ్వు 'రన్నరప్' కాదు @rpragchess. ఇది మీ గొప్పతనానికి 'రన్-అప్' మాత్రమే. మరో సారి పోరాడటానికి అనేక యుద్దాలు నేర్చుకోవడం అవసరం అంటూ.. నువ్వు నేర్చుకున్నావు, మళ్ళీ పోరాడతావు మనమందరం మళ్ళీ అక్కడ ఉంటామని ట్వీట్ చేసాడు. దీనికి ఇప్పటికీ వేల సంఖ్యలో లైకులు వచ్చాయి, కొంతమంది నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ కూడా చేస్తున్నారు. You aren’t the ‘runner-up’ @rpragchess This is simply your ‘run-up’ to Gold and to greatness. Many battles require you to learn & live to fight another day. You’ve learned & you will fight again; and we will all be there again…cheering you on loudly. 🇮🇳👏🏽👏🏽👏🏽 #praggnanandha https://t.co/2L0U1cZD4E — anand mahindra (@anandmahindra) August 24, 2023 -
పోరాడి ఓడిన ప్రజ్ఞానంద.. జగజ్జేతగా కార్ల్సన్
బకూ (అజర్బైజాన్): ఫైవ్ టైమ్ వరల్డ్ చెస్ ఛాంపియన్, వరల్డ్ నంబర్ వన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే) తన తొలి వరల్డ్కప్ టైటిల్ను కైవసం చేసుకున్నాడు. భారత యువ గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానందతో ఇవాళ (ఆగస్ట్ 24) జరిగిన ఫైనల్ టైబ్రేక్స్లో కార్ల్సన్ అద్భుత విజయం సాధించి జగజ్జేతగా అవతరించారు. 🏆 Magnus Carlsen is the winner of the 2023 FIDE World Cup! 🏆 Magnus prevails against Praggnanandhaa in a thrilling tiebreak and adds one more prestigious trophy to his collection! Congratulations! 👏 📷 Stev Bonhage #FIDEWorldCup pic.twitter.com/sUjBdgAb7a — International Chess Federation (@FIDE_chess) August 24, 2023 హోరాహోరీగా సాగిన టై బ్రేక్స్లో ప్రజ్ఞానంద తొలి గేమ్ కోల్పోగా.. రెండో గేమ్ను ఇరువురు డ్రాకు అంగీకరించడంతో కార్ల్సన్ విజేతగా నిలిచాడు. ప్రజ్ఞానంద రన్నరప్తో సరిపెట్టుకున్నాడు. టోర్నీ ఆధ్యాంతం దూకుడుగా ఆడిన ప్రజ్ఞానంద ఫైనల్లో కార్ల్సన్ ఎత్తుల ముందు చిత్తయ్యాడు. అంతకుముందు ఫైనల్లో భాగంగా జరిగిన రెండు గేమ్ల్లో కార్ల్సన్, ప్రజ్ఞానంద తలో గేమ్ గెలవడంతో టైబ్రేక్స్ ద్వారా విజేతను నిర్ణయించాల్సి వచ్చింది. Praggnanandhaa is the runner-up of the 2023 FIDE World Cup! 🥈 Congratulations to the 18-year-old Indian prodigy on an impressive tournament! 👏 On his way to the final, Praggnanandhaa beat, among others, world #2 Hikaru Nakamura and #3 Fabiano Caruana! By winning the silver… pic.twitter.com/zJh9wQv5pS — International Chess Federation (@FIDE_chess) August 24, 2023 Fabiano Caruana clinches third place in the 2023 FIDE World Cup and secures a ticket to the #FIDECandidates tournament next year, after prevailing against Nijat Abasov in the tiebreaks. Congratulations! 👏 📷 Stev Bonhage #FIDEWorldCup pic.twitter.com/Z35mDJJMwz — International Chess Federation (@FIDE_chess) August 24, 2023 -
రెండో గేమ్లో కార్ల్సన్తో గట్టి పోరాటమే చేయాలి: ప్రజ్ఞానంద
బకూ (అజర్బైజాన్): ప్రపంచకప్ చెస్ టోర్నీ ఓపెన్ విభాగం టైటిల్ కోసం భారత యువ గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానంద, వరల్డ్ నంబర్వన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే) మధ్య జరిగిన తొలి గేమ్ ‘డ్రా’గా ముగిసింది. తమిళనాడుకు చెందిన 18 ఏళ్ల ప్రజ్ఞానంద ఈ గేమ్లో తెల్ల పావులతో ఆడాడు. 35 ఎత్తుల తర్వాత ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో ఇద్దరూ ‘డ్రా’కు సమ్మతించారు. ‘తొలి గేమ్లో నేను ఏ దశలోనూ ఇబ్బంది పడలేదు. రెండో గేమ్లో కార్ల్సన్తో గట్టి పోరాటమే చేయాల్సి ఉంటుంది. అతడిని నిలువరించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తా’ అని ప్రజ్ఞానంద వ్యాఖ్యానించాడు. వీరిద్దరి మధ్య నేడు రెండో గేమ్ జరుగుతుంది. ఈ గేమ్లో కార్ల్సన్ తెల్ల పావులతో ఆడతాడు. ఈ గేమ్లో గెలిచిన ప్లేయర్కు ప్రపంచకప్ టైటిల్ లభిస్తుంది. ఒకవేళ రెండో గేమ్ కూడా ‘డ్రా’ అయితే గురువారం టైబ్రేక్ గేమ్ల ద్వారా విజేతను నిర్ణయిస్తారు. -
ప్రజ్ఞానందపై విజయసాయి రెడ్డి ప్రశంసలు
భారత యువ గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానందపై వైఎస్సార్సీపీ నేత, ఎంపీ విజయసాయి రెడ్డి ప్రశంసలు కురిపించారు. ప్రపంచకప్ చెస్ టోర్నీ ఓపెన్ విభాగంలో ఫైనల్కు చేరిన ప్రజ్ఞానందను అభినందించారు. చిన్న వయసులోనే ఉన్నత శిఖరాలు అధిరోహిస్తూ మనందరినీ గర్వపడేలా చేశాడని కొనియాడారు. వరల్డ్ నంబర్ 3ని ఓడించి.. ఫైనల్ పోరులో వరల్డ్ నంబర్ 1తో పోటీ పడుతున్న ప్రజ్ఞానందకు విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా ఆల్ ది బెస్ట్ చెప్పారు. కాగా అజర్బైజాన్లోని బకూ వేదికగా టైటిల్ కోసం ప్రజ్ఞానంద- మాగ్నస్ కార్ల్సన్ మధ్య మంగళవారం పోరు ఆరంభమైంది. కాగా అంతకుముందు ప్రపంచ మూడో ర్యాంకర్ ఫాబియానో కరువానా (అమెరికా)తో జరిగిన సెమీఫైనల్లో ప్రజ్ఞానంద 3.5–2.5తో విజయం సాధించాడు. తద్వారా ఫైనల్ చేరి.. వచ్చే ఏడాది జరుగనున్న క్యాండిడేట్ టోర్నీకి అధికారికంగా అర్హత సాధించాడు. ఇక భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ప్రపంచకప్ టోర్నీలో ఫైనల్ చేరిన రెండో భారతీయ ప్లేయర్గా 18 ఏళ్ల ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించాడు. -
చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద.. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత!
బకూ (అజర్బైజాన్): భారత యువ గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానంద పెను సంచలనం సృష్టించాడు. ప్రపంచకప్ చెస్ టోర్నీ ఓపెన్ విభాగంలో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ప్రపంచ మూడో ర్యాంకర్ ఫాబియానో కరువానా (అమెరికా)తో జరిగిన సెమీఫైనల్లో 18 ఏళ్ల ప్రజ్ఞానంద 3.5–2.5తో గెలుపొందాడు. ఫైనల్ చేరడంద్వారా ప్రజ్ఞానంద వచ్చే ఏడాది జరిగే క్యాండిడేట్ టోర్నీకి అధికారికంగా అర్హత సాధించాడు. దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ప్రపంచకప్ టోర్నీలో ఫైనల్ చేరిన రెండో భారతీయ ప్లేయర్గా ప్రజ్ఞానంద గుర్తింపు పొందాడు. నిరీ్ణత రెండు క్లాసికల్ గేమ్లు ముగిశాక ప్రజ్ఞానంద, కరువానా 1–1తో సమంగా ఉండటంతో విజేతను నిర్ణయించేందుకు సోమవారం టైబ్రేక్ గేమ్లు నిర్వహించారు. 25 నిమిషాల నిడివిగల రెండు ర్యాపిడ్ గేమ్లు కూడా ‘డ్రా’గా ముగియడంతో స్కోరు 2–2తో సమమైంది. అనంతరం 10 నిమిషాల నిడివిగల రెండు ర్యాపిడ్ గేమ్లను ఆడించారు. తొలి గేమ్లో తమిళనాడు కుర్రాడు ప్రజ్ఞానంద 63 ఎత్తుల్లో గెలిచాడు. ఫైనల్ రేసులో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన రెండో గేమ్లో కరువానా ‘డ్రా’ చేసుకోవడంతో ప్రజ్ఞానంద విజయం ఖరారైంది. ప్రపంచ నంబర్వన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే)తో ప్రజ్ఞానంద ఫైనల్లో తలపడతాడు. రెండు క్లాసికల్ గేమ్లలో భాగంగా వీరిద్దరి మధ్య తొలి గేమ్ నేడు జరుగుతుంది. చదవండి: Asia Cup 2023: రాహుల్, శ్రేయస్ పునరాగమనం -
Champions Tour Finals Chess Tourney: తొలి రౌండ్లోనే ఓడిన అర్జున్, ప్రజ్ఞానంద
చాంపియన్స్ టూర్ ఫైనల్స్ చెస్ టోర్నీలో భారత యువ గ్రాండ్మాస్టర్లు ఇరిగేశి అర్జున్, ప్రజ్ఞానంద తొలి రౌండ్లో ఓడిపోయారు. అమెరికాలో ఈ టోర్నీ జరుగుతోంది. తొలి రౌండ్ మ్యాచ్లో అర్జున్ 0.5–2.5తో క్రిస్టాఫ్ డూడా (పోలాండ్) చేతిలో... ప్రజ్ఞానంద 1.5–2.5తో షఖిర్యార్ (అజర్బైజాన్) చేతిలో ఓడారు. -
కార్ల్సన్కు ‘చెక్’
మయామి: ఎఫ్టీఎక్స్ క్రిప్టో కప్ అంతర్జాతీయ ర్యాపిడ్ చెస్ టోర్నీలో భారత యువ గ్రాండ్మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద రన్నరప్గా నిలిచాడు. వరల్డ్ నంబర్వన్, ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే)ను కంగు తినిపించినప్పటికీ ప్రజ్ఞానంద ఒక్క పాయింట్ తేడాతో రెండో స్థానానికి పరిమితమయ్యాడు. ఆఖరి రౌండ్ మ్యాచ్లో భారత ఆటగాడు 4–2తో కార్ల్సన్పై విజయం సాధించాడు. ఒక మ్యాచ్ నాలుగు గేములుగా జరిగే ఈ టోర్నీలో ఇద్దరు హోరాహోరీగా తలపడటంతో 2–2తో సమమైంది. ఈ దశలో విజేతను నిర్ణయించేందుకు బ్లిట్జ్లో రెండు టైబ్రేక్స్ను నిర్వహించగా రెండు గేముల్లోనూ ప్రజ్ఞానందే గెలిచాడు. అయితే ఓవరాల్గా నార్వే సూపర్ గ్రాండ్మాస్టర్ 16 మ్యాచ్ పాయింట్లతో టోర్నీ విజేతగా నిలువగా, భారత టీనేజ్ సంచలనం 15 పాయింట్లతో రన్నరప్తో సరిపెట్టుకున్నాడు. మేటి ర్యాంకింగ్ ఆటగాళ్లను కంగుతినిపించిన భారత ఆటగాడికి 5, 6వ రౌండ్ గేమ్ల్లో ఎదురైన ఓటములు ప్రతికూలమయ్యాయి. -
FTX Crypto Cup: కార్ల్సన్ను ఓడించిన ప్రజ్ఞానంద.. కానీ విజేత మాత్రం అతడే!
మయామి: ఎఫ్టీఎక్స్ క్రిప్టో కప్ అంతర్జాతీయ ర్యాపిడ్ చెస్ టోర్నీలో భారత యువ గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానంద రన్నరప్గా నిలిచాడు. టోర్నీలో చివరిదైన ఏడో రౌండ్లో ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ను మరోసారి ఓడించాడు. సోమవారం నాటి బ్లిట్జ్ టై బ్రేకర్లో విజయం సాధించాడు. అయితే, ఓవరాల్గా టాప్ స్కోరు సాధించిన కార్ల్సన్ టోర్నీ విజేతగా నిలవగా.. ప్రజ్ఞానంద రన్నరప్తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక అంతకు ముందు పోలాండ్ గ్రాండ్మాస్టర్ జాన్ క్రిస్టాఫ్ డూడాతో జరిగిన ఆరో రౌండ్ మ్యాచ్లో 17 ఏళ్ల ప్రజ్ఞానంద 2–4తో ఓడిపోయాడు. నిర్ణీత నాలుగు ర్యాపిడ్ గేమ్ల తర్వాత ఇద్దరూ 2–2తో సమంగా నిలిచారు. విజేతను నిర్ణయించేందుకు రెండు బ్లిట్జ్ గేమ్లను నిర్వహించగా... రెండింటిలోనూ డూడా గెలుపొందాడు. ఈ క్రమంలో ఎనిమిది మంది గ్రాండ్మాస్టర్ల మధ్య జరుగుతున్న ఈ టోర్నీలో ఆరో రౌండ్ తర్వాత ప్రజ్ఞానంద 13 పాయింట్లతో రెండో స్థానంలో, ప్రపంచ చాంపియన్ కార్ల్సన్ (నార్వే) 15 పాయింట్లతో తొలి స్థానంలో నిలిచారు. అయితే, చివరిదైన ఏడో రౌండ్లో కార్ల్సన్ను ఓడించిప్పటికీ ఓవరాల్గా పాయింట్ల పరంగా వెనుకబడ్డ ప్రజ్ఞానందకు నిరాశ తప్పలేదు. కాగా గత ఆర్నెళ్ల కాలంలో ప్రజ్ఞానంద.. కార్ల్సన్ను ఓడించడం ఇది మూడో సారి కావడం విశేషం. మరిన్ని క్రీడా వార్తలు మెద్వెదెవ్కు చుక్కెదురు సిన్సినాటి ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నంబర్వన్ మెద్వెదెవ్ (రష్యా) పోరాటం ముగిసింది. సెమీఫైనల్లో ఏడో ర్యాంకర్ సిట్సిపాస్ (గ్రీస్) 7–6 (8/6), 3–6, 6–3తో టాప్ సీడ్ మెద్వెదెవ్ను ఓడించి తొలిసారి ఈ టోర్నీలో ఫైనల్కు చేరాడు. టైటిల్ కోసం ప్రపంచ 152వ ర్యాంకర్ బోర్నా చొరిచ్ (క్రొయేషియా)తో సిట్సిపాస్ ఆడతాడు. రెండో సెమీఫైనల్లో చొరిచ్ 6–3, 6–4తో తొమ్మిదో ర్యాంకర్ కామెరాన్ నోరీ (బ్రిటన్)పై గెలుపొందాడు. కాంస్యం కోసం భారత్ పోరు టెహ్రాన్: ఆసియా అండర్–18 పురుషుల వాలీబాల్ చాంపియన్షిప్లో భారత జట్టు కాంస్య పతకం కోసం పోరాడనుంది. ఆదివారం జరిగిన రెండో సెమీఫైనల్లో భారత్ 15–25, 19–25, 18–25తో ఆతిథ్య ఇరాన్ జట్టు చేతిలో ఓడిపోయింది. నేడు కాంస్యం కోసం జరిగే మ్యాచ్లో దక్షిణ కొరియాతో భారత్ ఆడుతుంది. తొలి సెమీఫైనల్లో జపాన్ 37–39, 25–22, 25–21, 25–14తో కొరియాను ఓడించి నేడు ఇరాన్తో ఫైనల్ పోరుకు సిద్ధమైంది. చదవండి: Ned Vs Pak 3rd ODI: పాపం.. జస్ట్ మిస్! ఆ తొమ్మిది పరుగులు చేసి ఉంటే! కనీసం.. -
FTX Crypto Cup: ప్రజ్ఞానంద ఓటమి
మయామి: ఎఫ్టీఎక్స్ క్రిప్టో కప్ అంతర్జాతీయ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్లో భారత యువ గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానంద జైత్రయాత్రకు బ్రేక్ పడింది. ఈ టోర్నీలో వరుసగా నాలుగు విజయాలు సాధించిన 17 ఏళ్ల ప్రజ్ఞానంద ఐదో రౌండ్లో వియత్నాం గ్రాండ్మాస్టర్ క్వాంగ్ లియెమ్ లీ చేతిలో 0.5–2.5తో ఓడిపోయాడు. ప్రస్తుత ఆసియా చాంపియన్ అయిన క్వాంగ్ లియెమ్ లీ, ప్రజ్ఞానంద మధ్య తొలి గేమ్ 41 ఎత్తుల్లో ‘డ్రా’ అయింది. రెండో గేమ్లో క్వాంగ్ 50 ఎత్తుల్లో... మూడో గేమ్లో 43 ఎత్తుల్లో ప్రజ్ఞానందపై గెలుపొందాడు. ఫలితం తేలిపోవడంతో నాలుగో గేమ్ను నిర్వహించలేదు. ఎనిమిది మంది గ్రాండ్మాస్టర్ల మధ్య రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరుగుతున్న ఈ టోర్నీలో ఐదో రౌండ్ తర్వాత కార్ల్సన్ (నార్వే) 13 పాయింట్లతో టాప్ ర్యాంక్లో... ప్రజ్ఞానంద 12 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నారు. -
ప్రజ్ఞానంద ‘హ్యాట్రిక్’ విజయం.. దిగ్గజ ఆటగాడితో సంయుక్తంగా
మయామి: ఎఫ్టీఎక్స్ క్రిప్టో కప్ అంతర్జాతీయ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్లో భారత యువ గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానంద ‘హ్యాట్రిక్’ విజయం సాధించాడు. తొలి రెండు రౌండ్లలోనూ మేటి ర్యాంకర్లకు చెక్ పెట్టిన ఈ టీనేజ్ సంచలనం గురువారం జరిగిన మూడో రౌండ్లో 2.5–1.5తో అమెరికన్ గ్రాండ్మాస్టర్ హాన్స్ నీమన్పై విజయం సాధించాడు. వరుస విజయాలతో 17 ఏళ్ల ప్రజ్ఞానంద ఇప్పుడు వరల్డ్ నంబర్వన్, ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే)తో కలిసి 9 పాయింట్లతో సంయుక్తంగా అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు. ప్రతీ మ్యాచ్లోనూ నాలుగు ర్యాపిడ్ గేమ్లు జరిగే ఈ టోర్నీలో గురువారం జరిగిన పోరులో మొదటి గేమ్లో ఓడినప్పటికీ భారత ఆటగాడు అద్భుత ప్రదర్శనతో పుంజుకున్నాడు. రెండు, నాలుగో గేముల్లో గెలిచాడు. మూడో గేమ్ డ్రా అయ్యింది. తాజా విజయంతో అతని ఖాతాలో మరో రూ. 5.94 లక్షలు (7500 డాలర్లు) ప్రైజ్మనీ జమ అయ్యింది. -
ప్రజ్ఞానంద మరో సంచలన విజయం.. ఈసారి ఎనిమిదో ర్యాంకర్పై..!
మయామి: ఎఫ్టీఎక్స్ క్రిప్టో కప్ అంతర్జాతీయ ర్యాపిడ్ చెస్ టోర్నీలో భారత యువ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద వరుసగా రెండో విజయం నమోదు చేశాడు. తొలి రౌండ్లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ అలీరెజా ఫిరూజా (ఫ్రాన్స్)ను ఓడించిన 17 ఏళ్ల ప్రజ్ఞానంద... రెండో రౌండ్లో ఎనిమిదో ర్యాంకర్ అనీశ్ గిరి (నెదర్లాండ్స్)పై గెలిచాడు. నేపాల్ సంతతికి చెందిన అనీశ్ గిరితో జరిగిన రెండో రౌండ్ మ్యాచ్లో ప్రపంచ 89వ ర్యాంకర్ ప్రజ్ఞానంద 2.5–1.5తో నెగ్గాడు. తొలి మూడు గేమ్లు ‘డ్రా’ కాగా నాలుగో గేమ్లో ప్రజ్ఞానంద 81 ఎత్తుల్లో గెలిచి విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. ఈ గెలుపుతో ప్రజ్ఞానందకు 7,500 డాలర్లు (రూ. 5 లక్షల 94 వేలు) ప్రైజ్మనీగా లభించాయి. ఎనిమిది మంది గ్రాండ్మాస్టర్ల మధ్య రౌండ్ రాబిన్ లీగ్లో ఈ టోర్నీ జరుగుతోంది. రెండో రౌండ్ తర్వాత ప్రపంచ చాంపియన్ కార్ల్సన్ (నార్వే), ప్రజ్ఞానంద ఆరు పాయింట్లతో టాప్ ర్యాంక్లో ఉన్నారు. -
ప్రజ్ఞానంద సంచలనం
మయామి: ఎఫ్టీఎక్స్ క్రిప్టో కప్ అంతర్జాతీయ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్లో భారత యువ గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానంద సంచలనంతో శుభారంభం చేశాడు. అమెరికా వేదికగా ఎనిమిది మంది మేటి గ్రాండ్మాస్టర్ల మధ్య లీగ్ పద్ధతిలో ఈ టోర్నీ జరుగుతోంది. తొలి రౌండ్ మ్యాచ్లో తమిళనాడుకు చెందిన 17 ఏళ్ల ప్రజ్ఞానంద 2.5–1.5తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ అలీరెజా ఫిరూజా (ఫ్రాన్స్)పై గెలుపొందాడు. ఈ విజయంతో ప్రజ్ఞానందకు 7,500 డాలర్ల (రూ. 5 లక్షల 94 వేలు) ప్రైజ్మనీ లభించింది. ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే), లెవాన్ అరోనియన్ (అమెరికా), జాన్ క్రిస్టాఫ్ డూడా (పోలాండ్), లియెమ్ లీ (వియత్నాం), హాన్స్ నీమెన్ (అమెరికా), అనీశ్ గిరి (నెదర్లాండ్స్) కూడా ఈ టోర్నీలో ఆడుతున్నారు. -
Chessable Masters final: రన్నరప్గా భారత టీనేజ్ సంచలనం
చెన్నై: నిలకడైన ప్రదర్శనతో చెస్ఏబుల్ మాస్టర్స్ ఆన్లైన్ టోర్నమెంట్లో ఫైనల్ చేరిన భారత టీనేజ్ సంచలనం రమేశ్బాబు ప్రజ్ఞానందకు ఫైనల్లో నిరాశే ఎదురైంది. చైనా గ్రాండ్ మాస్టర్, ప్రపంచ రెండో ర్యాంకర్ డింగ్ లిరెన్ చేతిలో ప్రజ్ఞానంద ఓటమి పాలయ్యాడు. ప్రతిష్టాత్మక టోర్నీలో రన్నరప్గా నిలిచాడు. అయినప్పటికీ తన అద్భుత ప్రదర్శనతో ప్రత్యర్థితో పాటు క్రీడా ప్రముఖుల ప్రశంసలు అందుకుంటున్నాడు. ప్రజ్ఞానందను అభినందిస్తూ.. ‘‘నాకసలు మాటలు రావడం లేదు. అతడిని ప్రశంసించేందుకు పదాలు సరిపోవడం లేదు. ప్రాగ్(ప్రజ్ఞానంద) చాలా బాగా ఆడుతున్నాడు. అతడికి ఇప్పుడు కేవలం 16 ఏళ్లే. ఏ ఆటలోనైనా ఇది చాలా చిన్న వయస్సు. అతడికి ఎంతో భవిష్యత్తు ఉంది. 15 ఏళ్ల కంటే చిన్నవయసులో ఈ చెన్నై కుర్రాడు గ్రాండ్మాస్టర్ అయ్యాడు’’ అంటూ కామెంటేటర్, గ్రాండ్మాస్టర్ డేవిడ్ హావెల్ కొనియాడాడు. వెనుకబడి.. తిరిగి పుంజుకుని కాగా ఆర్.ప్రజ్ఞానంద తొలి అంచెలో వెనుకబడ్డాడు. డింగ్ లిరెన్తో జరిగిన తొలి అంచె ఫైనల్లో 1.5–2.5 స్కోరుతో వెనుకబడిపోయాడు. మొదటి రౌండ్లో ఓడిన భారత కుర్రాడు... రెండో గేమ్ గెలిచి స్కోరును సమం చేశాడు. అయితే, వెంటనే చైనా గ్రాండ్మాస్టర్ మూడో రౌండ్లో గెలిచి 2–1తో ఆధిక్యంలో నిలువగా... నాలుగో రౌండ్ డ్రాగా ముగిసింది. మరో నాలుగు గేముల రెండో అంచె ఫైనల్ పోరులో తిరిగి పుంజుకున్న ప్రజ్ఞానంద విజయంతో ముగించాడు. మొదటి సెట్లో 1.5-2.5తో గేమ్ను కోల్పోయిన అతడు.. రెండో సెట్లో 2.5-1.5తో పైచేయి సాధించాడు. ఈ క్రమంలో టై బ్రేకర్ నిర్వహించగా అనువజ్ఞుడైన లిరెన్ విజేతగా అవతరించాడు. 🎉 Congrats to Ding Liren on winning the @chessable Masters! What a performance by the World No. 2. But you gotta give it to the young @rpragchess for putting up a fierce battle.@ginger_gm: "It's been one of the best chess days ever...really high quality chess!" #ChessChamps pic.twitter.com/L0jqjWvRCH — Meltwater Champions Chess Tour (@ChampChessTour) May 26, 2022 Game 4 ends in a draw which means .@rpragchess wins the 2nd match in the @Chessable Masters finals. The winner will now be decided in Blitz. What an incredible performance by Pragg - are we watching a future World Champion in action? ➡️https://t.co/FUqldh5SJT#ChessableMasters pic.twitter.com/jyqxAQm28L — Meltwater Champions Chess Tour (@ChampChessTour) May 26, 2022 -
భారత యంగ్ గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానంద పెను సంచలనం..
భారత యంగ్ గ్రాండ్మాస్టర్ రమేశ్బాబు ప్రజ్ఞానంద పెను సంచలనం నమోదు చేశాడు. మెల్ట్వాటర్ చాంపియన్స్ చెస్ టూర్.. చెసెబుల్ ఆన్లైన్ మాస్టర్స్ టోర్నమెంట్లో ఫైనల్లో అడుగపెట్టాడు. బుధవారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో డచ్ గ్రాండ్ మాస్టర అనిష్ గిరిని 3.5-2.5తో ఓడించి చెసెబుల్ మాస్టర్స్ చెస్ టోర్నీలో ఫైనల్ చేరిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు. నాలుగు గేమ్ల పాటు 2-2తో సమానంగా ఉన్నప్పటికి.. కీలకమైన టై బ్రేక్లో ప్రజ్ఞానంద విజృంభించి అనిష్గిరిపై సంచలన విజయం సాధించాడు. కాగా తొలి గేమ్లో ఓడినప్పటికి ప్రజ్ఞానంద ఫుంజుకొని రెండోగేమ్లో విజయం సాధించాడు. మళ్లీ మూడో గేమ్లో అనిష్ గిరి మొదట ఆధిక్యంలో కనిపించినప్పటికి.. ప్రజ్ఞానంద ఎత్తుకు పై ఎత్తులు వేసి 2-1తో ఆధిక్యంలోకి వెళ్లాడు. కీలకమైన నాలుగో గేమ్లో అనిష్ గిరి విజయం సాధించడంతో 2-2తో మ్యాచ్ టై బ్రేక్కు దారి తీసింది. టై బ్రేక్లో 33వ ఎత్తులో అనిష్ చేసిన తప్పు ప్రజ్ఞానందకు కలిసొచ్చింది. మ్యాచ్ అర్థరాత్రి దాటిన తర్వాత కూడా సాగడంతో మ్యాచ్ పూర్తైన తర్వాత ప్రజ్ఞా.. ''నాకు ఉదయం 8:45 గంటలకు స్కూల్ ఉంది.. ఇప్పుడు సమయం ఉదయం రెండు దాటింది. స్కూల్కు వెళ్లగలనా'' అంటూ పేర్కొన్నాడు. కాగా ప్రజ్ఞానంద ప్రదర్శనపై కోచ్ ఆర్బీ రమేశ్ సంతోషం వ్యక్తం చేశాడు. ఇక ప్రజ్ఞానంద ఫైనల్ పోరులో చైనాకు చెందిన ప్రపంచ నెంబర్-2 డింగ్ లిరెన్తో ప్రజ్ఞానంద తలపడనున్నాడు. కాగా డింగ్ లిరెన్.. సెమీఫైనల్లో ప్రపంచ నెంబర్ వన్ మాగ్నస్ కార్లసన్ను 2.5- 1.5తో ఓడించి ఫైనల్లో అడుగుపెట్టాడు. చదవండి: కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు.. తిట్టిన నోరు మెచ్చుకునేలా చేసింది బ్రూస్ లీ ఆరాధించిన భారత్ ఫహిల్వాన్ ఎవరో తెలుసా? చెస్ వరల్డ్ చాంపియన్కు మరోసారి షాకిచ్చిన 16 ఏళ్ల భారత కుర్రాడు -
చెస్ వరల్డ్ చాంపియన్కు మరోసారి షాకిచ్చిన భారత కుర్రాడు
చెస్ వరల్డ్ చాంపియన్.. నార్వే గ్రాండ్మాస్టర్ మాగ్నస్ కార్ల్సన్కు 16 ఏళ్ల భారత యంగ్ గ్రాండ్మాస్టర్ రమేశ్బాబు ప్రజ్ఞానంద మరోసారి షాక్ ఇచ్చాడు. చెస్బుల్ మాస్టర్స్ ఆన్లైన్ రాపిడ్ చెస్ టోర్నమెంట్లో భాగంగా శుక్రవారం ఐదో రౌండ్లో ప్రజ్ఞానంద.. కార్ల్సన్తో తలపడ్డాడు. డ్రా దిశగా సాగుతున్న మ్యాచ్లో కార్ల్సెన్ 40వ ఎత్తుగడలో పెద్ద తప్పు చేశాడు. ఇది ప్రజ్ఞానందకు కలిసొచ్చింది. దీంతో కార్ల్సన్కు చెక్ పెట్టిన ప్రజ్ఞా మ్యాచ్ను కైవసం చేసుకోవడంతో పాటు 12 పాయింట్లు సాధించాడు. కార్ల్సన్పై గెలుపుతో ప్రజ్ఞానంద నాకౌట్ స్టేజ్ అవకాశాలను సజీవంగా ఉంచుకున్నాడు. ఓవరాల్గా చెస్బుల్ మాస్టర్స్లో రెండోరోజు ముగిసేసరికి కార్ల్సన్ 15 పాయింట్లతో మూడో స్థానంలో.. 12 పాయింట్లతో ప్రజ్ఞానంద ఐదో స్థానంలో ఉన్నాడు. ఇక కార్ల్సన్ను ప్రజ్ఞానంద ఓడించడం ఇది రెండోసారి. ఇంతకముందు గత ఫిబ్రవరిలో ఆన్లైన్ ర్యాపిడ్ చెస్ టోర్నీ ఎయిర్థింగ్స్ మాస్టర్స్లో కేవలం 39 ఎత్తుల్లోనే కార్ల్సెన్ను చిత్తుగా ఓడించి ప్రజ్ఞానంద సంచలనం సృష్టించాడు. తమిళనాడుకు చెందిన ప్రజ్ఞానంద.. 12 ఏళ్ల వయసులోనే గ్రాండ్ మాస్టర్ టైటిల్ సాధించి, భారత దిగ్గజ చెస్ ప్లేయర్ విశ్వనాథన్ ఆనంద్ రికార్డును బద్దలు కొట్టాడు. విశ్వనాథన్ ఆనంద్ 18 ఏళ్ల వయసులో గ్రాండ్ మాస్టర్ హోదా దక్కించుకోగా, ప్రజ్ఞానంద 12 ఏళ్ల వయసులోనే ఆ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ క్రమంలో గ్రాండ్ మాస్టర్ హోదా దక్కించుకున్న ఐదో అతి పిన్న వయస్కుడిగా ప్రజ్ఞానంద ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. చదవండి: ప్రపంచ నం.1 ఆటగాడికి షాకిచ్చిన 16 ఏళ్ల భారత కుర్రాడు Magnus Carlsen blunders and Praggnanandhaa beats the World Champion again! https://t.co/J2cgFmhKbT #ChessChamps #ChessableMasters pic.twitter.com/mnvL1BbdVn — chess24.com (@chess24com) May 20, 2022 -
రెక్యావిక్ ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నీ విజేత ప్రజ్ఞానంద
చెన్నై: ప్రతిష్టాత్మక రెక్యావిక్ ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో భారత యువ గ్రాండ్మాస్టర్ ఆర్.ప్రజ్ఞానంద విజేతగా నిలిచాడు. ఐస్లాండ్ రాజధాని రెక్యావిక్లో జరిగిన ఈ టోర్నీలో తమిళనాడుకు చెందిన 16 ఏళ్ల ప్రజ్ఞానంద నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత 7.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి టైటిల్ సొంతం చేసుకున్నాడు. 150 మంది క్రీడాకారులు పాల్గొన్న ఈ టోర్నీలో ప్రజ్ఞానంద ఆరు గేముల్లో గెలిచి, మూడు గేమ్లను ‘డ్రా’ చేసుకొని అజేయంగా నిలిచాడు. చాంపియన్గా నిలిచిన ప్రజ్ఞానందకు 5 వేల యూరోలు (రూ. 4 లక్షల 12 వేలు) ప్రైజ్మనీగా లభించాయి. 58 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ టోర్నీలో విజేతగా నిలిచిన నాలుగో భారతీయ చెస్ ప్లేయర్గా గుర్తింపు పొందాడు. గతంలో పెంటేల హరికృష్ణ (2006), అభిజిత్ గుప్తా (2010, 2016), భాస్కరన్ ఆధిబన్ (2018) ఈ ఘనత సాధించారు. చదవండి: IPL 2022: ఒకే ఓవర్లో 28 పరుగులు.. బేబీ ‘ఏబీ’ విధ్వంసం.. వీడియో వైరల్ -
చదరంగపు బాలరాజు
టీవీ కార్టూన్ షోలు తెగ చూస్తున్న పాపను దాని నుంచి దూరం చేయడానికి తల్లితండ్రులు అనుకోకుండా చేసిన ఓ అలవాటు ఆ పాపతో పాటు మూడేళ్ళ వయసు ఆమె తమ్ముడి జీవితాన్నీ మార్చేసింది. కాలగతిలో చదరంగపు క్రీడలో అక్క గ్రాండ్ మాస్టర్ అయితే, తమ్ముడు ఇంటర్నేషనల్ గ్రాండ్ మాస్టర్గా ఎదిగాడు. ఏకంగా ఇప్పుడు ప్రపంచ ఛాంపియన్నే ఓడించి, అబ్బురపరిచాడు. సరైన సమయంలో సరైన మార్గదర్శనం చేస్తే పిల్లలు ఏ స్థాయికి ఎదగగలరో, ఇంటిల్లపాదినే కాదు... ఇండియాను ఎంత గర్వించేలా చేస్తారో చెప్పడానికి ప్రత్యక్ష సాక్ష్యం – తమిళనాడుకు చెందిన టీనేజ్ అక్కాతమ్ముళ్ళు వైశాలి, ప్రజ్ఞానంద. ఇంటా, బయటా తెలిసినవాళ్ళంతా ప్రగ్గూ అని పిలుచుకొనే పదహారేళ్ళ ఆర్. ప్రజ్ఞానంద చదరంగంలో తన ఆరాధ్యదైవమైన వరల్డ్ ఛాంపియన్ మ్యాగ్నస్ కార్ల్సన్ను సోమవారం తెల్లవారుజామున ఓడించి సంచలనం రేపాడు. క్లాసికల్, ర్యాపిడ్, ఎగ్జిబిషన్ – ఇలా ఏ ఫార్మట్ గేమ్లలోనైనా కలిపి మన విశ్వనాథన్ ఆనంద్, తెలుగు తేజం పెంటేల హరికృష్ణ తరువాత కార్ల్సన్ను ఓడించిన మూడో భారత క్రీడాకారుడిగా ప్రగ్గూ చరిత్ర సృష్టించాడు. నార్వేకు చెందిన కార్ల్సన్ అయిదుసార్లు ప్రపంచ ఛాంపియన్. కొంతకాలంగా ప్రపంచ చదరంగానికి మకుటం లేని మహారాజు. అలాంటి వ్యక్తిని ఓడించడం ఆషామాషీ కాదు. అరవై నాలుగు గడులు... మొత్తంగా చకచకా 39 ఎత్తులు... అంతే.... కార్ల్సన్కు చెక్ పెట్టి, ప్రగ్గూ నమ్మలేని విజయాన్ని నమోదు చేశాడు. వరుసగా మూడు విజయాలు సాధించిన ప్రపంచ విజేతకు బ్రేకులు వేశాడు. ఆన్లైన్లో సాగే ర్యాపిడ్ చెస్ పోటీ ‘ఎయిర్థింగ్స్ మాస్టర్స్’ ప్రారంభ విడతలోనే ఈ అద్భుతం ఆవిష్కృతమైంది. 31 ఏళ్ళ కార్ల్సన్పై గతంలో విశ్వనాథన్ ఆనంద్ 19 సార్లు, హరికృష్ణ 2 సార్లు గెలిచారు. వారి కన్నా అతి పిన్న వయసులోనే, కార్ల్సన్ వయసులో సగమున్న బుడతడైన ప్రగ్గూ ఈ ఘనత సాధించడం గమనార్హం. ప్రపంచ ఛాంపియన్ను ఓడించి, చదరంగంలో అగ్రశ్రేణి వరుసను అటుదిటు చేసిన ఈ బాలమేధావి అమాయకంగా అన్నమాట మరింత కాక రేపింది. ప్రపంచ ఛాంపియన్పై జరిగే మ్యాచ్ కోసం ప్రత్యేకించి వ్యూహమేమీ అనుకోలేదనీ, ఆస్వాదిస్తూ ఆడానే తప్ప మరేమీ చేయలేదనీ ఈ టీనేజర్ అనడం విశేషం. ఆట మొదలుపెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి తెల్లపావులతో ఆడేవారికి ఓ రకంగా సానుకూలత ఉంటుందని భావించే చెస్లో నల్ల పావులతో ఆరంభించి, ఈ కీలక మ్యాచ్లో నెగ్గాడీ బాలరాజు. మొత్తం 16 మంది ఆటగాళ్ళ మధ్య 15 రౌండ్ల పాటు జరిగే టోర్నీ ఇది. ఇందులో ఈ మ్యాచ్కు ముందు ప్రగ్గూ ప్రపంచ అగ్రశ్రేణి చెస్ ఆటగాళ్ళు పదిమందిలో నలుగురితో తలపడి, రెండు విజయాలు, ఒక డ్రా, ఒక పరాజయంతో తన ప్రతిభను క్రీడాలోకం ఆగి, చూసేలా చేశాడు. ఆత్మీయుల మొదలు విశ్వనాథన్ ఆనంద్, దిగ్గజ క్రికెటర్ సచిన్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ దాకా విభిన్న రంగాల ప్రముఖుల ప్రశంసలు పొందాడు. కరోనా కాలంలో చెస్ పోటీల క్యాలెండర్ తారుమారై, నిరాశలో పడి, కాస్తంత వెనకపట్టు పట్టిన ఈ చిచ్చరపిడుగుకు ఇది సరైన సమయంలో దక్కిన భారీ విజయం. కోచ్ ఆర్బీ రమేశ్ చెప్పినట్టు ప్రతిభావంతుడైన ప్రగ్గూలో ఆత్మవిశ్వాసం పెంచి, సుదీర్ఘ ప్రస్థానానికి మార్గం సుగమం చేసే విజయం. శ్రీనాథ కవిసార్వభౌముడు అన్నట్టే ‘చిన్నారి పొన్నారి చిరుత కూకటినాడె...’ ప్రగ్గూ తన సత్తా చూపడం మొదలుపెట్టాడు. ముచ్చటగా మూడేళ్ళకే అక్కను చూసి ఆడడం మొదలుపెట్టిన ఈ బుడతడు 2013లో వరల్డ్ అండర్–8 కిరీటధారి అయ్యాడు. పదేళ్ళ, పదినెలల, 19 రోజుల వయసుకే 2016లో ఇంటర్నేషనల్ గ్రాండ్ మాస్టరయ్యాడు. అప్పటికి ఆ ఘనత సాధించిన అతి పిన్నవయస్కుడిగా గిన్నిస్ రికార్డ్స్లోకి ఎక్కాడు. మొత్తం మీద ఇప్పుడు చరిత్రలో పిన్న వయసు గ్రాండ్ మాస్టర్లలో అయిదోవాడిగా నిలిచాడు. భారత కాలమానంలో బాగా పొద్దుపోయి, రాత్రి 10 దాటాకెప్పుడో మొదలయ్యే తాజా టోర్నీ కోసం నిద్ర వేళల్ని మార్చుకోవడం సహా పలురకాల సన్నాహాలు చేసుకున్నాడు ప్రగ్గూ. చెన్నై శివార్లలోని పాడి ప్రాంతంలో మధ్యతరగతి నుంచి వచ్చిన ఈ బాల మేధావికి చెస్, బ్యాంకు ఉద్యోగం చేసే పోలియో బాధిత తండ్రి, ప్రతి టోర్నీకీ సాయంగా వచ్చే తల్లి, చెస్లో ప్రవేశానికి కారణమైన 19 ఏళ్ళ అక్క, కోచ్ రమేశ్... ఇదే ప్రపంచం. గత ఏడాది ‘న్యూ ఇన్ చెస్ క్లాసిక్’ పోటీలో సైతం వరల్డ్ ఛాంపియన్ కార్ల్సన్పై పోటీని డ్రా చేసిన ఘనుడీ బాలుడు. భారత ఆటగాళ్ళలో 16వ ర్యాంకులో, ప్రపంచంలో 193వ ర్యాంకులో ఉన్న ఇతను చెస్లో భారత ఆశాకిరణం. ఒకప్పుడు తానూ ఇలాగే చిన్న వయసులోనే, ఇలాంటి మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చినవాడే కావడంతో విశ్వనాథన్ ఆనంద్ ఈ బాల మేధావిని అక్కున చేర్చుకొన్నారు. వరల్డ్ ఛాంపియన్పై గెలుపు లాంటివి భారత ఆటగాళ్ళకు అప్పుడప్పుడు కాకుండా, తరచూ సాధ్యం కావాలంటే ప్రగ్గూ లాంటి వారికి ఇలాంటి సీనియర్ల చేయూత అవసరం. 1988లో ఆనంద్ తొలి ఇండియన్ గ్రాండ్ మాస్టరయ్యారు. అప్పటి నుంచి చెస్ పట్ల పెరిగిన ఆసక్తితో, 73 మంది మన దేశంలో గ్రాండ్ మాస్టర్లు ఎదిగొచ్చారు. మూడు దశాబ్దాల పైగా దేశంలో చదరంగానికి ప్రతీకగా మారిన 51 ఏళ్ళ ఆనంద్ పరంపర ప్రగ్గూ మీదుగా అవిచ్ఛిన్నంగా సాగాలంటే... ప్రభుత్వాలు, క్రీడా సమాఖ్యలు, దాతల అండదండలు అతి కీలకం. ఇలాంటి మాణిక్యాలను ఏరి, సానబడితే, ప్రపంచ వేదికపై రెపరెపలాడేది మన భారత కీర్తి పతాకమే. -
శ్రీశ్వాన్కు కాంస్యం
ముంబై: సొంతగడ్డపై జరిగిన ప్రపంచ యూత్ చెస్ చాంపియన్షిప్లో భారత క్రీడాకారులు మెరిశారు. శనివారం ముగిసిన ఈ మెగా ఈవెంట్లో భారత్కు ఒక స్వర్ణం, మూడు రజతాలు, మూడు కాంస్య పతకాలతో కలిపి మొత్తం ఏడు పతకాలు లభించాయి. భారత్కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ కుర్రాడు మరాలాక్షికరి శ్రీశ్వాన్ అండర్–14 ఓపెన్ విభాగంలో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నాడు. నిర్ణీత 11 రౌండ్ల తర్వాత నిజామాబాద్ జిల్లాకు చెందిన 13 ఏళ్ల శ్రీశ్వాన్ 8 పాయింట్లతో మరో ఐదుగురితో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్ను వర్గీకరించగా... శ్రీశ్వాన్కు మూడో స్థానం లభించింది. భారత్కే చెందిన ఎల్.ఆర్.శ్రీహరి (తమిళనాడు) రెండో స్థానంలో నిలిచి రజతం గెల్చుకున్నాడు. ఈ విభాగంలో అజర్బైజాన్కు చెందిన ఐదిన్ సులేమాన్లి 9 పాయింట్లతో విజేతగా నిలిచి స్వర్ణ పతకాన్ని గెల్చుకున్నాడు. ఈ టోరీ్నలో శ్రీశ్వాన్ ఏడు గేముల్లో గెలుపొంది, రెండింటిని ‘డ్రా’ చేసుకున్నాడు. మరో రెండు గేముల్లో ఓడిపోయాడు. ఈ ఏడాది జూలైలో బార్సిలోనాలో జరిగిన టోరీ్నలో శ్రీశ్వాన్ మూడో అంతర్జాతీయ నార్మ్ (ఐఎం)ను సాధించి... తెలంగాణ తరఫున పిన్న వయస్సులో అంతర్జాతీయ మాస్టర్ (ఐఎం) హోదా పొందిన ప్లేయర్గా గుర్తింపు పొందాడు. అండర్–18 ఓపెన్ విభాగంలో 14 ఏళ్ల తమిళనాడు గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానంద చాంపియన్గా అవతరించి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ప్రజ్ఞానంద ఏడు గేముల్లో గెలిచి, నాలుగు గేమ్లను ‘డ్రా’ చేసుకొని తొమ్మిది పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. అండర్–18 బాలికల విభాగంలో వంతిక అగర్వాల్ భారత్కు రజతం అందించింది. అండర్–14 బాలికల విభాగంలో దివ్య దేశ్ముఖ్ రెండో స్థానంలో, రక్షిత మూడో స్థానంలో నిలిచి వరుసగా రజత, కాంస్య పతకాలు అందించారు. అండర్–16 ఓపెన్ విభాగంలో అరోన్యాక్ ఘోష్ కాంస్యం గెలిచాడు. -
‘గ్రాండ్మాస్టర్’ ప్రజ్ఞానంద
న్యూఢిల్లీ: ప్రపంచ చెస్ చరిత్రలో పిన్న వయస్సులో గ్రాండ్మాస్టర్ (జీఎం) హోదా పొందిన రెండో ప్లేయర్గా... భారత్ తరఫున జీఎం అయిన పిన్న వయస్కుడిగా చెన్నై కుర్రాడు ప్రజ్ఞానంద గుర్తింపు పొందాడు. ఇటలీలో జరుగుతున్న గ్రెడైన్ ఓపెన్లో శనివారం జరిగిన ఎనిమిదో రౌండ్ గేమ్లో ప్రజ్ఞానంద 33 ఎత్తుల్లో ఇటలీ గ్రాండ్మాస్టర్ లూకా మోరోనిపై గెలుపొందాడు. ఈ ప్రదర్శనతో ప్రజ్ఞానందకు జీఎం హోదా లభించేందుకు అవసరమైన మూడో జీఎం నార్మ్ ఖాయమైంది. 12 ఏళ్ల 10 నెలల 14 రోజుల వయస్సులో ప్రజ్ఞానంద జీఎం హోదా పొంది... భారత్ తరఫున జీఎం అయిన పిన్న వయస్కుడిగా ఇప్పటిదాకా పరిమార్జన్ నేగి (ఢిల్లీ–13 ఏళ్ల 4 నెలల 22 రోజులు) పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. మరోవైపు ప్రపంచంలో పిన్న వయస్సులో జీఎం అయిన రికార్డు సెర్గీ కర్జాకిన్ (రష్యా–12 ఏళ్ల 7 నెలలు) పేరిట ఉంది.