question paper
-
గ్రూప్–2 మెయిన్స్.. పేపర్–1 సులభం.. పేపర్–2 కొంచెం కఠినం
సాక్షి, ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్విస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఆదివారం నిర్వహించిన గ్రూప్–2 మెయిన్స్ పరీక్షలో పేపర్–1 సులభంగా ఉందని, పేపర్–2 ఓ మోస్తరు క్లిష్టతతో ఉందని సబ్జెక్ట్ నిపుణులు చెబుతున్నారు. సిలబస్కు అనుగుణంగా ప్రిపరేషన్ సాగించినవారు, ప్రామాణిక మెటీరియల్తో సిద్ధమైనవారు సులువుగా సమాధానాలు గుర్తించేలా ప్రశ్నపత్రం ఉందంటున్నారు.పేపర్–2లో ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగాల నుంచి ఎక్కువ శాతం ఇటీవల పరిణామాలపై ప్రశ్నలు అడిగారని చెబుతున్నారు. అయితే రెండు పేపర్లలోనూ అసెర్షన్ అండ్ రీజన్, స్టేట్మెంట్ ఆధారిత ప్రశ్నల సంఖ్య ఎక్కువ ఉండటంతో అన్నింటికి సమాధానాలు గుర్తించడానికి సమయం సరిపోలేదని అభ్యర్థులు పేర్కొంటున్నారు. పేపర్–1 కోర్ అంశాల నుంచే.. పేపర్–1లో రెండు సెక్షన్లలోనూ ప్రశ్నలు కోర్ అంశాల నుంచే ఉన్నాయి. సెక్షన్–ఎగా ఉన్న ఆంధ్రప్రదేశ్ సాంఘిక, సాంస్కృతిక చరిత్ర విభాగం నుంచి 75 ప్రశ్నలు ఇచ్చారు. ఇందులో ఎక్కువ శాతం.. కవులు, శాసనాలు, ఆయా రాజ్య వంశాల కళలు, చారిత్రక కట్టడాలు, సాంస్కృతిక ఉద్యమాల నుంచే అడిగారు. చోళులు, చాళుక్యులు, కాకతీయులు గురించి ప్రశ్నలు ఉన్నాయి. అదే విధంగా నిజాం రాజుల గురించిన ప్రశ్నలు కూడా ఇవ్వడం గమనార్హం. అంతేకాకుండా ఆంధ్ర ప్రాంతంలో బ్రిటిష్ పాలనకు సంబంధించిన అంశాల నుంచి కూడా ప్రశ్నలు అడిగారు. పేపర్–1 సెక్షన్ 2.. రాజ్యాంగానికి ప్రాధాన్యత పేపర్–1లోని సెక్షన్–2లో రాజ్యాంగ అధికరణలు, ప్రకరణలకు సంబంధించిన ప్రశ్నలకు ఎక్కువ ప్రాధాన్యం లభించింది. అయితే ఈ విభాగంలో డైరెక్ట్ కొశ్చన్స్ దాదాపు 50 వరకు ఉండడం అభ్యర్థులకు ఉపశమనం కలిగించే అంశమని సబ్జెక్టు నిపుణులు చెబుతున్నారు. కాగా అసెర్షన్ అండ్ రీజన్ విధానంలో అడిగిన 15 ప్రశ్నలకు విశ్లేషణాత్మక అధ్యయనం చేసినవారే సమాధానాలు ఇవ్వగలరని పేర్కొంటున్నారు. 10 ప్రశ్నలు చాలా క్లిష్టంగా ఉన్నాయని అభ్యర్థులు చెబుతున్నారు.రాజ్యాంగంలోని అంశాలు, వాటిని ఏ దేశాల నుంచి సంగ్రహించారు? ఏ ఆర్టికల్ను ‘రాజ్యాంగానికి హృదయం, ఆత్మ’ అని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వరి్ణంచారు? భారత రాజ్యాంగంలో తొలుత ఎన్ని షెడ్యూళ్లు ఉన్నాయి? ఏ కమిటీ సిఫార్సుల మేరకు ప్రాథమిక విధులను రాజ్యాంగంలో జోడించారు? 73వ రాజ్యాంగ సవరణ చట్టానికి సంబంధించి సరైన అంశం? ఆర్టికల్ 365కు సంబంధించిన ప్రశ్న, సెక్యులర్ అనే పదాన్ని ఏ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగ ప్రవేశికలో చేర్చారు? వంటి కోర్ పాలిటీ ప్రశ్నలు అడిగారు.అదేవిధంగా రాజ్యాంగ బద్ధ సంస్థలైన కాగ్, ఎన్నికల సంఘం, యూనియన్ పబ్లిక్ సర్విస్ కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్, న్యాయ వ్యవస్థ, రాజ్యాంగాన్ని ఆమోదించిన తేదీ? భారత ప్రభుత్వ చట్టం, లోక్పాల్, లోకాయుక్త చట్టం–2013 అమల్లోకి వచ్చిన సంవత్సరం? 74వ రాజ్యాంగ సవరణ చట్టం అమల్లోకి వచ్చిన తేదీ? వంటి ప్రశ్నలు, అశోక్మెహతా, రాజమన్నార్ కమిటీలపై ప్రశ్నలు కోర్ సిలబస్ నుంచే ఉన్నాయని సబ్జెక్ట్ నిపుణులు చెబుతున్నారు. పేపర్–1కు సంబంధించి సిలబస్ను పూర్తిగా చదివిన వారికి 150 మార్కులకు గాను 110కి పైగా మార్కులు వచ్చే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.పేపర్–2.. ఎకానమీ, ఎస్ అండ్ టీ.. ఇక.. రెండో పేపర్లో ఎకానమీ విభాగంలో ఎక్కువ శాతం ప్రశ్నలు సమకాలీన అంశాల నుంచే వచ్చాయి. కోర్ అంశాల నుంచి 15 వరకు మాత్రమే ప్రశ్నలు ఉన్నాయి. ఆయా విభాగాలకు సంబంధించి తాజా గణాంకాలు, పాలసీలు (రైతు భరోసా కేంద్రాలు, జల్ జీవన్ మిషన్, గోకుల్ మిషన్, పూర్వోదయ తదితర పథకాలు) గురించి ప్రశ్నలు అడిగారు. అయితే వీటిలో ఎక్కువ శాతం ప్రశ్నలు అసెర్షన్ అండ్ రీజన్, మ్యాచింగ్ టైప్ విధానంలో ఉండడంతో అభ్యర్థులకు సమాధానాలు గుర్తించడానికి సమయం సరిపోలేదు. కోర్ అంశాలపైనే దృష్టి సారించినవారు కొంత ఇబ్బంది పడ్డారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పేపర్–2లోని సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ఎక్కువగా పర్యావరణ కాలుష్యం, కాలుష్య కారకాలు, వ్యర్థాలు, వ్యాధులు, వ్యవసాయం, సేంద్రియ ఎరువులు, పక్షులు, అంతర్జాతీయ ఒప్పందాల నుంచి ప్రశ్నలు అడిగారు. అదే విధంగా పథకాలు (ఆయుష్మాన్ భారత్, ఆరోగ్య మిత్ర, స్వచ్ఛ్ భారత్ అభియాన్ తదితర) నుంచి ప్రశ్నలు వచ్చాయి. టెక్నాలజీకి సంబంధించి డిజిటల్ అరెస్ట్, పవన శక్తి ఉత్పాదనలో భారత్ స్థానం, బ్రహ్మోస్ క్షిపణి సంబంధిత ప్రశ్నలు వచ్చాయి.ఈ విభాగంలోనూ ఎక్కువగా మ్యాచింగ్ టైప్ కొశ్చన్స్, అసెర్షన్ అండ్ రీజన్ కొశ్చన్స్ ఉన్నాయి. తాజా పరిణామాలు (ఇటీవల ప్రయోగాలు)పై ఎక్కువ ప్రశ్నలు లేకపోవడం గమనార్హం. ఈ విభాగంలో ప్రశ్నలకు.. కోర్ సబ్జెక్ట్ను పూర్తిగా ఆకళింపు చేసుకున్న వారే సరైన సమాధానాలు ఇవ్వగలిగి ఉంటారని సబ్జెక్ట్ నిపుణులు పేర్కొంటున్నారు. మొత్తంగా గ్రూప్–2 మెయిన్స్ పేపర్–2లో.. పూర్తి స్థాయిలో ప్రిపరేషన్ సాగించిన అభ్యర్థులు 110–120 మార్కులు పొందే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.కోర్ టాపిక్స్ నుంచే.. గ్రూప్–2 మెయిన్స్ పేపర్–1 ఎంతో సులభంగా ఉంది. ప్రిలిమ్స్తో పోల్చితే దాదాపు అన్ని ప్రశ్నలకు సమాధానాలు గుర్తించేలా ప్రశ్నలు అడిగారు. అభ్యర్థులు అసెర్షన్ అండ్ రీజన్ కొశ్చన్స్ విషయంలో కొంత తికమక పడటం సహజం. మొత్తంగా చూస్తే ఓ మోస్తరు ప్రిపరేషన్ సాగించిన వారు 115 మార్కులు, సిలబస్పై బాగా పట్టు సాధించినవారు అంతకంటే ఎక్కువ మార్కులు పొందే అవకాశం ఉంది. పేపర్–2లో సైన్స్ అండ్ టెక్నాలజీలో కోర్ టాపిక్స్కు ప్రాధాన్యం కనిపించింది. రెండు పేపర్లలోనూ ఎక్కువగా అసెర్షన్ అండ్ రీజన్, కాంబినేషన్ టైప్ కొశ్చన్స్ ఉన్నాయి. ప్రామాణిక మెటీరియల్ చదివిన వారు సమాధానాలు ఇచ్చే విధంగానే ప్రశ్నలు ఉన్నాయి. – కృష్ణప్రదీప్, డైరెక్టర్, ట్వంటీఫస్ట్ సెంచరీ ఐఏఎస్ అకాడమీ -
వెబ్సైట్లో గ్రూప్–2 మెయిన్స్ ‘కీ’
సాక్షి, అమరావతి: గ్రూప్–2 మెయిన్స్ ప్రాథమిక ‘కీ’ని కమిషన్ వెబ్సైట్లో ఉంచినట్టు ఏపీపీఎస్సీ ప్రకటించింది.ప్రశ్నలు, జవాబులపై అభ్యంతరాలు ఉంటే అభ్యర్థులు ఈ నెల 25 నుంచి 27వరకు http://psc.ap.gov.in లో తెలపాలని విజ్ఞప్తి చేసింది. -
పోలీస్స్టేషన్లో పరీక్ష పత్రాలు
సాక్షి, అమరావతి: పదో తరగతి సమ్మెటివ్ అసెస్మెంట్–1 లెక్కల ప్రశ్నాపత్రం యూట్యూబ్లో ప్రత్యక్షమైన నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. అన్ని తరగతుల ప్రశ్నాపత్రాలను స్థానిక పోలీస్ స్టేషన్లో భద్రపరిచి, పరీక్ష జరిగే రోజు అక్కడి నుంచే తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. పరీక్ష పత్రాలకు ఎంఈవో–1, 2 ఇద్దరు కస్టోడియన్లుగా ఉండాలని ఆదేశించారు. పరీక్ష నిర్వహించే రోజు గంటముందు మాత్రమే ప్రశ్నాపత్రాలను సంబంధిత ప్రధానోపాధ్యాయులకు అందించాలని సూచించారు. సోమవారం జరగాల్సిన పదో తరగతి మేథ్స్ ప్రశ్నాపత్రం మూడు రోజుల ముందే సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ఈ విషయం గుర్తించకుండా అదే ప్రశ్నాపత్రం విద్యార్థులకు అందించారు. అనంతరం తేరుకున్న అధికారులు సోమవారం నిర్వహించాల్సిన అన్ని తరగతుల పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. అర్ధ వార్షిక పరీక్షల నిర్వహణే ఇంత అధ్వానంగా ఉన్న నేపథ్యంలో మార్చిలో జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షలను ఇంకెంత గొప్పగా నిర్వహిస్తారోనని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యావేత్తలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గత ఐదేళ్లలో ఒక్క దుస్సంఘటన కూడా లేకుండా అన్ని పరీక్షలను ప్రభుత్వం పక్కాగా నిర్వహించింది. పరీక్షకు గంట ముందు ఆన్లైన్లో పేపర్ పంపించి, అక్కడే ప్రింట్ తీసుకుని విద్యార్థులకు అందించేవారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న విద్యాశాఖ.. ఇప్పుడెందుకు తేలిగ్గా తీసుకుందని ప్రశ్నిస్తున్నారు. ఇలా ఉండగా, ఎస్ఏ–1 పరీక్షలు ఈనెల 19వ తేదీతో ముగుస్తాయి. అనంతరం లెక్కల పరీక్షను 20వ తేదీన నిర్వహించనున్నారు. కాగా, ప్రశ్నా పత్రాల లీకేజీ వ్యవహారంపై పాఠశాల విద్యాశాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. మరోపక్క విద్యాశాఖ డైరెక్టర్ దర్యాప్తునకు ఆదేశించారు.ఉపాధ్యాయులకు విషమ పరీక్షప్రశ్నాపత్రాల భద్రతలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాల విద్యాశాఖ తాజాగా జారీ చేసిన మార్గదర్శకాలు ఉపాధ్యాయులకు సంకటంగా మారాయి. పరీక్షకు గంట ముందు స్థానిక పోలీస్ స్టేషన్లో భద్రపరిచిన ప్రశ్నాపత్రాలను ఎంఈవో సమక్షంలో ఉపాధ్యాయులు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. పట్టణ ప్రాంతాల్లోని పాఠశాలలకు ఈ సమయం సరిపోయినా.. గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలలకు ప్రశ్నాపత్రాలు చేరడం కష్టసాధ్యమవుతుంది. చాలా గ్రామాల్లో పాఠశాలలు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ నుంచి దాదాపు 20 నుంచి 30 కి.మీ. దూరంలో ఉన్నాయి. పోలీస్ స్టేషన్లో అన్ని ప్రక్రియలు పూర్తిచేసి సమయానికి చేరడం ఎంతో ఒత్తిడికి గురి కావాల్సి ఉంటుందని ఉపాధ్యాయులు వాపోతున్నారు. -
ఆంధ్రా రియల్ ఎస్టేట్.. టీడీపీ విజన్ డాక్యుమెంట్
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–2 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన అర్హత పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. అయితే, పేపర్–4 పరీక్షలో కొన్ని ప్రశ్నలు తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేవని, కేవలం సమాచారం కోణంలో మాత్రమే ఉన్నాయని కొందరు అభ్యర్థులు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్లో ఉన్న ఆంధ్రా రియల్ ఎస్టేట్ కంపెనీలు, ఆంధ్రా నిర్మాణ రంగ సంస్థలు, 1983 ఎన్నికల సమయంలో ఎన్టీఆర్ చేసిన వాఖ్యలు, తెలుగుదేశం పార్టీ ఎన్నికల నినాదం, విజన్–2020 డాక్యుమెంట్ రూపొందించిన అంతర్జాతీయ సంస్థ, చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో తీసుకున్న నిర్ణయాలు తదితర ప్రశ్నలు రావడం పట్ల అభ్యర్థులు కొంత గందరగోళానికి గురయ్యారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యానికి సంబంధించిన ప్రశ్నల్లో వాస్తవాధారిత ప్రశ్నలు వచ్చాయని మరికొందరు అభ్యర్థులు చెప్పుకొచ్చారు. తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించిన ప్రశ్న వచ్చిన సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆవిష్కరించిన కొత్త విగ్రహానికి సంబంధించినది కాకుండా పాత రూపురేఖల గురించి ఇవ్వడంతో అభ్యర్థులు కొంత ఇబ్బంది పడ్డారు. తెలంగాణ పోరాటయోధుడు వెలిచాల జగపతిరావుకు సంబంధించి రెండు ప్రశ్నలు వచ్చాయి. తెలంగాణ కోసం త్యాగం చేసిన మరికొందరికి సంబంధించిన ప్రశ్నలు కూడా వచ్చాయి. మొత్తంగా పేపర్–4 ప్రశ్నపత్రంలో కొన్ని ప్రశ్నలు మినహాయిస్తే మధ్యస్తంగానే ఉందని అభ్యర్థులు చెబుతున్నారు. పేపర్–3 లో ప్రశ్నలు కష్టతరంగా...: ఎకానమీ అండ్ డెవలప్మెంట్కు సంబంధించిన ప్రశ్నల్లో చాలావరకు కష్టతరంగానే ఉన్నట్టు పరీక్ష రాసిన అభ్యర్థులు చెప్పారు. ప్రశ్నలు చాలా లోతుగా ఉండడంతో వాటికి సమాధానాలు ఎంచుకునేందుకు ఎక్కువ సమయం పట్టిందని, దీంతో చివరి వరకు సమయం చాలక ఆందోళనకు గురైనట్టు వారు అభిప్రాయపడ్డారు. అయితే ప్రశ్నల్లో నాణ్యత పెరిగిందని సబ్జెక్ట్ నిపుణులు చెబుతున్నారు. రెండ్రోజులపాటు నాలుగు సెషన్లలో జరిగిన ఈ పరీక్షలకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా 1,368 కేంద్రాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. 5,51,855 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా తొలిరోజు(ఆదివారం) జరిగిన రెండు పరీక్షలకు కేవలం 2,55,490(46.30%) మంది అభ్యర్థులు మాత్రమే హాజరయ్యారు. సోమవారం ఉద యం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పేపర్–3 (ఎకానమీ అండ్ డెవలప్మెంట్), మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్–4 (తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్) పరీక్షలు జరిగాయి. ఉదయం జరిగిన పేపర్–3 పరీక్షకు 2,51,738 (45.62%) మంది హాజరు కాగా, మధ్యాహ్నం జరిగిన పేపర్–4 పరీక్షకు 2,51,486(45.57%) మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ గణాంకాలు ప్రాథమికంగా మాత్రమే నని, ఓఎంఆర్ షీట్లు పూర్తిస్థాయిలో అందిన తర్వాత హాజరుశాతంపై స్పష్టత వస్తుందని టీజీపీఎస్సీ కార్యదర్శి ఇ.నవీన్నికోలస్ తెలిపారు. -
యూట్యూబ్లో టెన్త్ ప్రశ్నాపత్రాలు
సాక్షి, అమరావతి: పదో తరగతి అర్ధ సంవత్సర పరీక్ష పేపర్లు ఆన్లైన్లో ప్రత్యక్షమైన ఘటన రాష్ట్రంలో కలకలం రేపింది. సోమవారం ఉదయం పరీక్ష ప్రారంభమైన గంటలోపే పాఠశాల విద్యాశాఖ తేరుకుని అన్ని తరగతుల పరీక్షలను రద్దు చేసింది. సీల్డ్ కవర్లో ఎంతో పకడ్బందీ రక్షణలో ఉంచాలి్సన పరీక్ష పత్రాలు రెండు రోజుల క్రితమే యూట్యూబ్లో అప్లోడ్ కావడం.. ఎక్కడ లీకైందో ఇప్పటివరకు తెలుసుకోలేకపోవడం చూస్తుంటే ప్రభుత్వ విద్యపై కూటమి సర్కారు తీరుతెన్నులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. మార్చి–2025లో జరిగే ఎస్సెస్సీ పబ్లిక్ పరీక్షల నిర్వహణ ఇదే తీరున ఉంటే పరిస్థితి ఏంటన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.అర్ధ వార్షిక పరీక్షల్ని సక్రమంగా నిర్వహించేలేని వారు పబ్లిక్ పరీక్షలు ఇంకెలా నిర్వహస్తారోనని విద్యావేత్తలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం ఉదయం లెక్కల పరీక్ష ప్రారంభమైన గంటలోనే మేథ్స్ పేపర్ యూట్యూబ్లో ప్రత్యక్షమైందన్న వార్త రాష్ట్రవ్యాప్తంగా వ్యాపించింది. విషయం తెలియగానే పాఠశాల విద్యాశాఖ సోమవారం ప్రారంభమైన అన్ని పరీక్షలను నిలిపివేయాలని ఆర్జేడీలు, డీఈవోలకు వాట్సాప్ సందేశాలు పంపించి పరీక్షను నిలిపివేశారు. మేథ్స్ పరీక్షను ఈ నెల 20న నిర్వహించాలని ఆదేశించారు. విద్యాశాఖ అధికారుల రక్షణలో ఉండే ప్రశ్నాపత్రాలు ఎలా బయటకు వచ్చాయన్న దానిపై ఆ శాఖ అధికారులు నోరుమెదపడం లేదు. ప్రభుత్వ నిర్లక్ష్యం తేటతెల్లంఈ విద్యా సంవత్సరం పరీక్షలను ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. సీల్డు కవర్లో ఉంచాలి్సన పేపర్లను ఓపెన్గానే అందించినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఫార్మెటివ్, సమ్మెటివ్–1 అసెస్మెంట్ల పరీక్ష పేపర్లు మండల రిసోర్సు సెంటర్ల (ఎంఈవో కార్యాలయం)లో సీల్డు కవర్లో ఉంచి భద్రపరుస్తారు. పరీక్ష జరిగే రోజు ఉదయం సంబంధిత పాఠశాల పరీక్ష ఇన్చార్జి టీచర్ వెళ్లి ఉదయం మధ్యాహ్నంజరిగే పేపర్లను ఎంఈవో నుంచి తీసుకుని తమతమ పాఠశాలకు తెచ్చి మిగతా ఉపాధ్యాయుల సమక్షంలో సీలు తెరవాల్సి ఉంటుంది. ఇంత పక్కాగా ఉండే భద్రతను చేధించి యూట్యూబ్లో పేపర్లు ప్రత్యక్షం కావడం గమనార్హం.వాస్తవానికి ఈ నెల 9వ తేదీ నుంచి 1 నుంచి 10వ తరగతి వరకు ఎస్ఏ–1 పరీక్షలు జరుగుతాయని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఈ నెల 7న మెగా పేరెంట్స్ డే నిర్వహించడం, 14న రెండో శనివారం కావడంతో ఉపాధ్యాయుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో పరీక్షలను ఈ నెల 11వ తేదీ నుంచి ప్రారంభించారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తుపాను ప్రభావం ఉండడంతో అన్నమయ్య, తిరుపతి, నెల్లూరు తదితర జిల్లాల్లోని ప్రభావిత ప్రాంతాల్లో పరీక్షలు నిలిపివేసి, మిగిలిన చోట పూర్తి చేశారు. ఇప్పటివరకు తెలుగు, హిందీ, ఇంగ్లిష్ పేపర్లు పూర్తయ్యాయి.మార్చి–2025 పబ్లిక్ పరీక్షలపై అనుమానాలు?ఎస్ఏ–1 ప్రశ్నపత్రాల లీకేజీ తర్వాత కొన్ని జిల్లాల్లో ప్రశ్నాపత్రాలను స్థానిక పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఇకపై జరిగే పరీక్షలకు అక్కడి నుంచే నేరుగా తీసుకునే ఏర్పాట్లు చేశారు. కాగా, అర్ధ వార్షిక పరీక్ష పేపర్ల లీకేజీతో మార్చి–2025లో జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సర్కారు నిర్లక్ష్యానికి విద్యార్థుల భవిష్యత్ పణంగా పెట్టాలి్సన పరిస్థితి తీసుకొచ్చారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆరు నెలల కూటమి ప్రభుత్వ పాలనలో బడులను రాజకీయ ప్రచారాలు, ప్రయోగాలకు కేంద్రాలు మార్చేశారని.. పరీక్షల నిర్వహణపై దృష్టి పెట్టలేదనే విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. -
Function of the Heart: విశాల హృదయం
క్వశ్చన్ పేపర్లో ‘గుండె బొమ్మ గీసి వివిధ భాగాలను వివరించుము’ అనే ప్రశ్నను చూసిన స్టూడెంట్ మహాశయుడు ఎక్కడికో వెళ్లిపోయాడు. గుండె బొమ్మను కలర్ఫుల్గా గీయడం వరకు ఓకే. అయితే ఆ గుండెలో వివిధ భాగాలలో తాను ప్రేమించిన అమ్మాయిల పేర్లు రాశాడు. ప్రియా, నమిత, హరిత, రూప, పూజలాంటి పేర్లు రాశాడు. మరో అడుగు ముందుకు వేసి ‘ఫంక్షనింగ్ ఆఫ్ హార్ట్’ అనే హెడ్లైన్తో వారిని తాను ఎందుకు ప్రేమిస్తున్నానో రాశాడు. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఈ వీడియో నెటిజనులను నవ్వులలో ముంచెత్తుతుంది. -
3 నుంచి ఎఫ్ఏ 2 పరీక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఈ నెల 3 నుంచి 6 వరకు పాఠశాల విద్యాశాఖ ఫార్మేటివ్ అసెస్మెంట్ (ఎఫ్ఏ)–2 పరీక్షలు నిర్వహించనుంది. అన్ని యాజమాన్యాల ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు నిర్దేశించిన సిలబస్ ప్రకారం పరీక్షలు నిర్వహిస్తారు. ఉమ్మడి ప్రశ్నాపత్రం ఆధారంగా పాత పద్ధతిలోనే పరీక్షలు జరుగుతాయి. ప్రశ్నాపత్రాలను పరీక్ష జరిగే రోజు మండల విద్యాశాఖాధికారులు, ప్రధానోపాధ్యాయులకు పంపిస్తారు. పరీక్షకు గంట ముందు ఆయా పాఠశాలల హెచ్ఎంలకు ప్రశ్నాపత్రాలు పంపాలని ఇప్పటికే ఎంఈవోలకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. 9, 10 తరగతుల విద్యార్థులకు రోజుకు రెండు పరీక్షలు ఉదయం, 6, 7, 8 తరగతుల విద్యార్థులకు మ«ద్యాహ్నం పరీక్షలు ఉంటాయి. ఒకటి నుంచి 5వ తరగతుల విద్యార్థులకు ఉదయం ఒకటి, మధ్యాహ్నం మరొక పరీక్ష నిర్వహిస్తారు. 10వ తేదీలోగా సమాధాన పత్రాలను మూల్యాంకనం చేసి విద్యార్ధులకు అందిస్తారు. అలాగే ఆన్లైన్ పోర్టల్లోనూ మార్కులు నమోదు చేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 10న విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి విద్యార్థుల ప్రగతిని తెలియజేయాలని సూచించింది. కాగా, ఈ నెల 14 నుంచి 24 వరకు పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటించింది. -
గురుకుల పరీక్షలకు 86.54 శాతం హాజరు
సాక్షి, హైదరాబాద్/ సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగాలకు సంబంధించిన అర్హత పరీక్షలు మంగళవారం ప్రారంభమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 9వేల ఉద్యోగాల భర్తీకి ఈనెల 1వ తేదీ నుంచి 23వ తేదీ వరకు పరీక్షల షెడ్యూల్ను తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్ఈఐఆర్బీ) ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మంగళవారం జరిగిన తొలి రోజు పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా టీఆర్ఈఐఆర్బీ అధికారులు పక్కాగా ఏర్పాటు చేశారు. గురుకుల ఉద్యోగాల భర్తీలో ఈసారి కొత్తగా కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ (సీబీఆర్టీ) విధానంలో పరీక్షలు నిర్వహించారు. గురుకుల బోర్డు ద్వారా నిర్వహిస్తున్న మొట్టమొదటి సీబీఆర్టీ పరీక్షలను టీఆర్ఈఐఆర్బీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేయడంతో పరీక్షలు తొలిరోజు సజావుగా సాగాయి. రాష్ట్రవ్యాప్తంగా 104 కేంద్రాల్లో పరీక్షలు ప్రారంభం కాగా మొదటి రోజున మూడు సెషన్లలో సగటున 86.54 శాతం అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. మొదటి రోజున మూడు సెషన్లలో ఆర్ట్ టీచర్ పేపర్–1, క్రాఫ్ట్ టీచర్ పేపర్–1, మ్యూజిక్ టీచర్ పేపర్–1 పరీక్షలు జరిగాయి. ఈ మూడు పరీక్షలకు మొత్తంగా 10,920 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా... కేవలం 9,450 మంది మాత్రమే హాజరయ్యారు. ప్రశ్నపత్రం ఆంగ్లంలో ఇచ్చారని ఆందోళన మంగళవారం ప్రారంభమైన పోటీ పరీక్షల్లో మొదటిరోజు ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ విభాగాలకు పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల ప్రశ్నపత్రం పూర్తిగా ఆంగ్లంలో మాత్రమే ఇచ్చారు. నోటిఫికేషన్లో మాత్రం తెలుగు, ఆంగ్లంలో ప్రశ్నపత్రం ఇస్తామని ప్రకటించారని, ఇప్పుడు ఇలా చేయడమేమిటని పలుచోట్ల అభ్యర్థులు నిరసన వ్యక్తం చేశారు. పైగా సరిపడా కంప్యూటర్లు లేకుండానే ఆఫ్లైన్కు బదులు ఆన్లైన్ విధానంలో పరీక్షలు పెట్టడమేమిటని ప్రశ్నించారు. ఈ విషయాలపై తాము కోర్టుకు వెళ్లనున్నట్లు అభ్యర్థులు పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల కేటాయింపుపై గందరగోళం.. ఆప్షన్ ఇచ్చిన జిల్లా, చుట్టుపక్కల జిల్లాలు కాకుండా 200 నుంచి 300 కిలోమీటర్ల దూరంలో పరీక్ష కేంద్రాలు కేటాయించడం పట్ల అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో మహిళా, గర్భిణి, బాలింత అభ్యర్థులు పరీక్షలను రాయలేని పరిస్థితి నెలకొంది. ఇతర అభ్యర్థులు సైతం వేల రూపాయలు చార్జీలకోసం వెచ్చించాల్సిన పరిస్థితి నెలకొంది. కొందరు అభ్యర్థులు డిగ్రీ లెక్చరర్, జూనియర్ లెక్చరర్, పీజీటీ, టీజీటీ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. వీటికి పేపర్–1, పేపర్–2, పేపర్–3 రాయాల్సి ఉంటుంది. ఈ పరీక్షలకు సైతం ఒక్కో పరీక్షను ఒక్కో జిల్లాలో వందల కిలోమీటర్ల దూరం వెళ్లి రాయాల్సిన విధంగా కేంద్రాలు ఇచ్చారు. -
NEET 2023: కెమిస్ట్రీ కఠినం.. ఫిజిక్స్ గందరగోళం.. ఇదేమీ ప్రశ్నాపత్రం!
సాక్షి, హైదరాబాద్: ఈసారి నీట్ పరీక్ష మధ్యస్థం నుంచి కఠినంగా ఉందని నిపుణులు విశ్లేషించారు. బాగా చదివినవారికి మధ్యస్థంగా, మామూలుగా వారికి కఠినంగా ఉంటుందని చెబుతున్నారు. ఎంబీబీఎస్, బీడీఎస్ వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి ఆదివారం నిర్వహించిన ‘నీట్’పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రంలో ఈసారి దరఖాస్తు చేసుకున్న వారిలో 95 శాతం మందికి పైగా పరీక్షకు హాజరైనట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) తెలిపింది. గత నాలుగేళ్లతో పోలిస్తే.. ఈసారి నీట్ కాస్త కఠినంగానే ఉందని పరీక్ష అనంతరం విద్యార్థులు, నిపుణులు చెప్పారు. కరోనా కారణంగా గతేడాది వరకు సులువుగా ఉన్న పేపర్, ఈసారి కొంత కఠినం చేశారని చెబుతున్నారు. దీంతో ఈసారి కటాఫ్ మార్క్ తగ్గే అవకాశం ఉందంటున్నారు. 2020లో జనరల్ కేటగిరీలో కటాఫ్ మార్క్ 147 ఉండగా, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీల్లో 113 గా ఉంది. ఇక 2021లో జనరల్ కేటగిరీలో కటాఫ్ మార్క్ 138 కాగా, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీల్లో కట్ ఆఫ్ మార్క్ 108గా ఉంది. గతేడాది (2022)జనరల్ కటాఫ్మార్క్ 117కాగా, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీల్లో 93గా ఉంది. ఈ ఏడాది అది కాస్తా జనరల్ కేటగిరీలో 110, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీల్లో 85 ఉండే అవకాశముందని అంచనా. ఫిజిక్స్లో ఒక ప్రశ్నకు.. గతేడాదితో పోలిస్తే ఈసారి నీట్ పేపర్ కఠినంగా ఉంది. నాలుగేళ్లలో 2020, 21లో పేపర్లు సులువుగా వచ్చాయి. అయితే అంతకుముందుతో పోలిస్తే గతేడాది కఠినంగా ఉంది. దీంతో కటాఫ్ మార్కు తగ్గింది. ఈ ఏడాది ఇంకా టఫ్గా ఉంది. ప్రశ్నలు సుదీర్ఘంగా ఉన్నాయి. కెమిస్ట్రీ పేపర్ కఠినంగా ఉంది. సహజంగా విద్యార్థులు కెమిస్ట్రీలో ప్రాబ్లమ్స్పై దృష్టిపెట్టి, థియరీ పార్ట్ను నిర్లక్ష్యం చేస్తారు. కానీ ఈసారి ఎక్కడో మూలల నుంచి థియరీ ప్రశ్నలు ఎక్కువగా ఇచ్చారు. దీంతో పేపర్ కఠినంగా మారింది. ఇక ఫిజిక్స్ గతేడాదితో పోల్చితే సులువుగానే ఉంది. నాలుగైదు ప్రశ్నలు తికమకగా ఇచ్చారు. ఒక ప్రశ్నకు ఇచ్చిన నాలుగు ఆప్షన్లు ఏవీ కరెక్ట్గా లేవు. బాటనీ ప్రశ్నలు సులువుగా ఉన్నా, సుదీర్ఘంగా ఉన్నాయి. చదవడానికి ఎక్కువ సమయం తీసుకున్నాయి. స్టేట్మెంట్ టైప్ ప్రశ్నలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు విశ్లేషించారు. 430 మార్కులు వచ్చినా రాష్ట్రంలో కన్వీనర్ సీటు.. తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో సీట్లు పెరిగాయి కాబట్టి తక్కువ మార్కులు వచ్చినా సీటు పొందే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు జనరల్ కేటగిరీలో గతేడాది 450 మార్కులు వచ్చినవారికి కన్వీనర్ కోటాలో సీటు వచ్చింది. ఈ ఏడాది 430 మార్కులు వచ్చిన వారికి కూడా కన్వీనర్ కోటాలో సీటు వచ్చే అవకాశముంది. గతేడాది 700కు పైగా మార్కులు వచ్చినవారు ఎక్కువగా ఉన్నారు. ఈ ఏడాది అంత మార్కులు వచ్చే వారి సంఖ్య తగ్గుతుంది. ఫిజిక్స్లో ఒక ప్రశ్నకు సమాధానం లేదు ఈసారి నీట్ పేపర్ కఠినంగా ఉంది. కెమిస్ట్రీ చాలా కఠినంగా వచ్చింది. ఫిజిక్స్లో నాలుగైదు ప్రశ్నలు గందరగోళంగా ఉన్నాయి. వాటిని హడావుడిగా పెడితే తప్పవుతాయి. ఫిజిక్స్లో ఒక ప్రశ్నకు ఇచ్చిన నాలుగు ఆప్షన్లు కూడా సరిగా లేవు. కాబట్టి దానికి బోనస్ మార్కులు ఇవ్వాలి. 180 ప్రశ్నల్లో 179 మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. – శంకర్రావు, డీన్, శ్రీచైతన్య జూనియర్ కాలేజీ, కూకట్పల్లి పేపర్ మధ్యస్థంగా ఉంది నీట్ పరీక్ష బాగానే రాశాను. పేపర్ మధ్యస్థంగా ఉంది. కెమిస్ట్రీ ఫర్వాలేదు. నాకు కెమిస్ట్రీలో 160, ఫిజిక్స్లో 166 వచ్చే అవకాశముందని నేను రాసిన ఆన్సర్లను బట్టి అంచనా వేశా. బాటనీలో కూడా మార్కులు బాగానే వస్తాయనుకుంటున్నా. – ఆర్ని గోయల్, విద్యార్థి, హైదరాబాద్ ఫిజిక్స్, బాటనీ సులువుగా.. నీట్ పరీక్ష బాగానే రాశాను. కెమిస్ట్రీలో రెండు ప్రశ్నలు తప్పుగా రాసినట్లు అనిపించింది. కెమిస్ట్రీ మధ్యస్థంగా ఉంది. ఫిజిక్స్, బాటనీ పేపర్లు సులువుగా వచ్చాయి. – లహరి, విద్యార్థిని, హైదరాబాద్ -
అది కాంతార మ్యానియా.. గవర్నమెంట్ ఎగ్జామ్లో మూవీపై ప్రశ్న
ఈ ఏడాది వచ్చిన చిన్న చిత్రాల్లో కన్నడ మూవీ ‘కాంతర’ సృష్టించిన సన్సేషన్ అంతా ఇంత కాదు. కన్నడ నటుడు, డైరెక్టర్ రిషబ్ శెట్టి స్వీయదర్శకత్వంలో నటించిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందింది. కేజీఎఫ్ను బీట్ చేసేలా కలెక్షన్ల సునామీ సృష్టించింది. కేవలం 16 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 400కోట్లని రాబట్టి ఈ ఏడాది అత్యధిక వసూళ్లు చేసిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఇక ఈ సినిమాలో రిషబ్ శెట్టి పెర్ఫామెన్స్కి ప్రేక్షకుల నుంచి స్టార్ హీరోల వరకు ఫిదా అయ్యారు. ముఖ్యంగా సినిమా క్లైమాక్స్లో రిషబ్ ట్రాన్స్ఫార్మేషన్ అందరికి గూస్బంప్స్ తెప్పించింది. దేశవ్యాప్తంగా ఈ మూవీ హవా కొనసాగింది. కన్నడ నుంచి బాలీవుడ్ వరకు కాంతార విపరీతమైన క్రేజ్ను సంపాదించుకుంది. తాజాగా కాంతార మ్యానియా విద్యారంగంలోనూ వ్యాపించింది. ఈ చిత్రం కర్ణాటక గ్రామ ప్రాంతాల్లో నిర్వహించే భూతకోల ఆధారంగా తెరకెక్కిన సంగతి తెలిసిందే. దీంతో కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ఎగ్జామ్ పేపరల్లో కాంతార మూవీపై ప్రశ్న అడిగారు. ఇందుకు క్వశ్చన్ పేపర్ నెట్టింట వైరల్గా మారింది. ‘ఇటీవల విడుదలైన కాంతార సినిమా దేని ఆధారంగా తెరకెక్కింది’ అంటూ జల్లికట్టు, భూతకోల, యక్షగాన, దమ్మామి అని ఆప్షన్లు ఇచ్చారు. అందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, హీరోయిన్ సప్తమి గౌడ్ ఆ ఫోటోని తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. చదవండి: సినీ పరిశ్రమలో విషాదం.. నటుడు హరనాథ్ కూతురు హఠాన్మరణం ఆసక్తిగా శ్రీజ భర్త కల్యాణ్ దేవ్ లేటెస్ట్ పోస్ట్.. ‘దీని అంతర్యం ఏంటీ?’ -
గ్రూప్–1.. కటాఫ్ ఉండదు: టీఎస్పీఎస్సీ
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశ్నపత్రంపై అభ్యర్థుల్లో ఇంకా గందరగోళం వీడలేదు. రాసిన ప్రశ్నలకు సరైన జవాబులపై అంచనాకు రాలేని పరిస్థితి నెలకొంది. ప్రాథమిక కీ విడుదలైతే తప్ప స్పష్టత వచ్చే అవకాశం లేదని అభ్యర్థులు పేర్కొంటున్నారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఏర్పాటైన తర్వాత తొలిసారిగా గ్రూప్–1 ఉద్యోగాల భర్తీ చేపట్టింది. ఇందులో భాగంగా 503 కొలువుల కోసం ఆదివారం ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించింది. 2,86,051 మంది దీనికి హాజరయ్యారు. అభ్యర్థులుగానీ, కోచింగ్ సెంటర్లుగానీ పరీక్ష ముగిసిన తర్వాత నిపుణులు, మేధావులను సంప్రదించి సరైన సమాధానాలపై, తమకు వచ్చే మార్కులపై అంచనాకు రావడం జరుగుతుంది. కానీ ఆదివారం నాటి గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశ్నపత్రంపై ఇప్పటికీ అభ్యర్థుల్లో గందరగోళమే కనిపిస్తోంది. ఒకే ప్రశ్నకు ఒకటి కంటే ఎక్కువ జవాబులు ఉండటమే దీనికి కారణమని.. కొన్ని ప్రశ్నలకు ఇచ్చిన ఆప్షన్లలో రెండు, మూడు సరైన సమాధానాలు ఉన్నాయని అభ్యర్థులు చెబుతు న్నారు. ఇక ఒకే ప్రశ్నలో నాలుగు ప్రశ్నలు అడు గుతూ వాటిని జతపర్చాలని సూచించారని అంటున్నారు. విభిన్న రకాలుగా ప్రశ్నలు ఇవ్వడంతో సరైన సమాధానాలను గుర్తించడంలో ఇబ్బందిపడే పరిస్థితి ఏర్పడిందని పేర్కొంటున్నారు. పరీక్ష జరిగి రెండు రోజులు అవుతున్నా కనీసం కోచింగ్ సెంటర్లు కూడా నమూనా ‘కీ’ని విడుదల చేయకపోవడం గమనార్హం. కటాఫ్ మార్కులేమీ ఉండవు! గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్షలో ప్రత్యేకంగా కటాఫ్ మార్కులంటూ ఏమీ ఉండవని టీఎస్పీఎస్సీ స్పష్టం చేసింది. నోటిఫికేషన్లోనే ఈ అంశాన్ని ప్రత్యేకంగా తెలిపిన కమిషన్.. సోమవారం మరోమారు ప్రకటన విడుదల చేసింది. ప్రిలిమ్స్లో ఎక్కువ మార్కులు వచ్చినవారిని.. మల్టీజోన్ల వారీగా 1ః50 నిష్పత్తిలో మెయిన్స్కు ఎంపిక చేయనున్నారు. అంటే ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున ఎంపిక చేస్తారు. మొత్తం 503 పోస్టులు ఉన్న నేపథ్యంలో.. ఎక్కువ మార్కులు వచ్చిన సుమారు 25,150 మందికి మెయిన్స్ పరీక్షలు రాసే అవకాశం కల్పిస్తారు. ప్రశ్నపత్రం కోడింగ్లో కొత్త విధానంతో.. గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశ్నపత్రం కోడింగ్లో టీఎస్పీఎస్సీ కొత్త పద్ధతిని తీసుకొచ్చింది. ఇదివరకు కమిషన్ నిర్వహించిన పరీక్షల ప్రశ్న పత్రాన్ని ఏ, బీ, సీ, డీ నాలుగు కోడ్లలో తయారు చేసింది. ఈసారి కాపీయింగ్కు ఆస్కా రం లేకుండా ఆరు డిజిట్ల కోడ్తో ప్రశ్నపత్రాన్ని తీసుకొచ్చింది. విభిన్న రూపాల్లో ప్రశ్నపత్రం తయారైంది. దీనితో ఏ కోడ్కు చెందిన ప్రశ్న పత్రానికి నమూనా కీని తయారు చేయాలనే దానిపై కోచింగ్ సెంటర్లు, నిపుణులు సైతం తికమక పడ్డారు. చివరికి ప్రశ్నపత్రం కోడ్కు బదులుగా.. పరీక్షలో వచ్చిన ప్రశ్నలు కొన్నింటికి జవాబులను నిర్ధారిస్తూ సామాజిక మాధ్యమాల్లో అంచనాలను పోస్టు చేశారు. పూర్తి స్థాయిలో అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేదు. దీనితో టీఎస్పీఎస్సీ కీ వచ్చేదాకా అంచనాకు వచ్చే పరి స్థితి లేదని అభ్యర్థులు అంటున్నారు. కమిషన్ కీ విడుదల చేసేందుకు పదిరోజుల సమయం పడు తుందని అంచనా వేస్తున్నారు. ముందుగా అభ్య ర్థుల ఓఎంఆర్ జవాబు పత్రాలను కమిషన్ వెబ్ సైట్లో అందుబాటులోకి తెచ్చిన తర్వాతే ‘కీ’ని విడుదల చేస్తామని టీఎస్పీఎస్సీ స్పష్టం చేసింది. -
ప్రశ్నలు మధ్యస్థం... జవాబులు కఠినం!
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశ్నపత్రం మధ్యస్థంగా ఉందని అభ్యర్థులు, నిపుణులు పేర్కొన్నారు. ప్రశ్నపత్రాన్ని కొందరు యూపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్ష స్థాయితో పోల్చగా మరికొందరు అంతకుమించి కఠినంగా ఉందని చెప్పుకొచ్చారు. యూపీఎస్సీ పరీక్షలో 100 ప్రశ్నలకు 120 నిమిషాల సమయం ఇస్తుండగా... గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్షలో 150 ప్రశ్నలకు 150 నిమిషాల సమయమే ఇవ్వడంతో ప్రశ్న చదివి జవాబు రాయడం క్లిష్టంగా మారిందని ఎక్కువ మంది అభ్యర్థులు చెప్పారు. జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ ప్రశ్నలకు జవాబుల ఎంపికకు ఎక్కు వ సమయం పట్టిందన్నారు. నాలుగు జవాబుల్లో ఏ ఏ మూడు సరైనవి అంటూ ఇచ్చిన ప్రశ్నలు తికమకపెట్టేలా ఉన్నాయన్నారు. ఇక రీజనింగ్ విభాగం నుంచి 10 శాతం లోపే ప్రశ్నలు ఉండాల్సి ఉన్నా 15 శాతానికిపైగా ప్రశ్నలు వచ్చాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. కరెంట్ అఫైర్స్లో వచ్చి న ప్రశ్నలు లోతైన అంశాలతో అడగటంతో అభ్యర్థులు కంగుతిన్నారు. ఒకట్రెండు ప్రశ్నలు ఆంగ్లం, తెలుగులో వేర్వేరు అర్థాలు వచ్చేలా ఉన్నట్లు చెప్పారు. 50 శాతం పైబడి మార్కులతో కటాఫ్...! ప్రిలిమినరీ పరీక్ష ‘కీ’ వెలువడే వరకు సమాధానాలను అంచనా వేయడం కష్టంగా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. జవాబుల సరళిని విశ్లేషిస్తే కనీసం 50% పైబడి మార్కులతో కటాఫ్ ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. పురుషుల కేటగిరీలో 85 మార్కులు, మహిళల కేటగిరీలో 80 మార్కులకు అటుఇటుగా కటాఫ్ ఉండే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. -
ఇంటర్లో ఇక 100% సిలబస్
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ మొదటి, ద్వితీయ పరీక్షల్లో ఇక నుంచి వందశాతం సిలబస్తో ప్రశ్నప త్రాలు ఉంటాయి. ఈ విద్యా సంవత్సరం నుంచే దీన్ని అమలులోకి తేబోతున్నారు. ఈ మేరకు ఇంటర్ బోర్డు ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ కాలేజీలకు ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు అనుగుణంగానే విద్యార్థులు సిద్ధమవ్వాలని, కాలేజీ నిర్వాహకులు కూడా 100 శాతం సిలబస్ను సకాలంలో పూర్తి చేయాలని స్పష్టం చేసింది. కోవిడ్ ముందు వరకూ ఇదే విధానం కొనసాగింది. కోవిడ్ విజృంభణతో 2021లో 70 శాతం సిలబస్నే అమలు చేశారు. అయితే విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకుండానే అందరినీ పాస్ చేశారు. 2021–22లో కూడా చాలాకాలం ఆన్లైన్ క్లాసులు నడిచాయి. ఈ సదుపాయం అన్ని ప్రాంతాలు వినియోగించుకోలేదన్న ఆందోళన సర్వత్రా విన్పించడంతో 70 శాతం సిలబస్నే అమలు చేశారు. తొలుత ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ఉండవని చెప్పినప్పటికీ ఆ తర్వాత నిర్వహించారు. ఈ పరీక్షల్లో 49 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. 70 శాతం సిలబస్ కూడా సరిగా జరగలేదని విద్యార్థులు ఆందోళనలకు దిగారు. కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారు. దీంతో దిగివచ్చిన ప్రభుత్వం అందరినీ కనీస మార్కులతో పాస్ చేసింది. 2022లో మేలో జరిగిన పరీక్షల్లో 70 శాతం సిలబస్తోనే పరీక్ష నిర్వహించారు. ఈ విద్యా సంవత్సరం సకాలంలో మొదలవ్వడంతో వందశాతం సిలబస్ ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. అయితే మొదటి సంవత్సరం ప్రవేశాలు సెప్టెంబర్ వరకూ జరిగాయి. బోర్డు నిర్దేశించిన సిలబస్ కూడా పూర్తవ్వలేదని విద్యార్థులు అంటున్నారు. కాకపోతే 100 శాతం సిలబస్ ఉంటుందని ముందే చెప్పడంతో సిద్ధమవ్వడానికి కొంత వ్యవధి లభించిందని సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈసారి మోడల్ పేపర్ల తయారీపై బోర్డు దృష్టి పెట్టినట్టు లేదు. కోవిడ్కు ముందు ఇదే సిలబస్తో నమూనా ప్రశ్నపత్రాలు రూపొందించారు. వాటినే బోర్డు వెబ్సైట్లో అందుబాటులో ఉంచాలని భావిస్తున్నారు. -
తెలంగాణ కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షల్లో తప్పులు
-
ఈసారి పొలిటికల్ సైన్స్ ప్రశ్నపత్రంలో తప్పులు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ పరీక్షల్లో తప్పిదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే సంస్కృతం, హిందీ పేపర్లలో తప్పులురాగా.. గురువారం పొలిటికల్ సైన్స్, ఉర్దూ మీడియం మ్యాథ్స్ ప్రశ్నపత్రాల్లో పొరపాట్లతో విద్యార్థులు తీవ్ర గందరగోళానికి లోనయ్యారు. ఇంటర్ బోర్డు నిర్లక్ష్య వైఖరితో పరీక్షల విధానం ప్రహసనంగా మారిపోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రశ్నే మారిపోయింది రాష్ట్రవ్యాప్తంగా గురువారం ఇంటర్ ద్వితీయ సంవత్సరం సబ్జెక్టులకు సంబంధించిన పరీక్షలు జరి గాయి. సాధారణంగా విద్యార్థులు ఏ మీడియంలో పరీక్ష రాస్తే ఆ భాషలో ముద్రించిన ప్రశ్నపత్రాలను ఇస్తారు. ఇందులో భాష మారుతుందే తప్ప ప్రశ్నల్లో మార్పు ఉండదు. గురువారం ఇంగ్లిష్ మీడి యం పొలిటికల్ సైన్స్ పేపర్లో ఒక ప్రశ్న ఉంటే.. తెలుగు మీడియం పేపర్లో వేరే ప్రశ్న ఇచ్చారు. ప్రశ్నపత్రం సెక్షన్ ‘బి’లో ఐదు మార్కులకు 8వ ప్రశ్నగా "Point out the main provisi ons of the Independence of India Act 1947' అని ప్రశ్న ఇచ్చారు. ‘భారత స్వాతంత్య్ర చట్టం–1947లోని ముఖ్యాంశాలు రాయండి’అని దానికి అర్థం. కానీ తెలుగులో ఇచ్చిన పొలిటికల్ సైన్స్ పేపర్లో ‘భారత స్వాతంత్య పోరాటంలో హోమ్రూల్ ఉద్యమాన్ని వర్ణించండి’అనే ప్రశ్న ఇచ్చారు. ఇలా వేర్వేరుగా రావడంతో.. ఏ ప్రశ్నను బోర్డు పరిగణనలోకి తీసుకుంటుంది, దేనికి మార్కులు వేస్తుందని విద్యార్థులు అయోమయంలో పడ్డారు. కొందరు ఈ ప్రశ్నకు సమాధానం రాయకుండా వదిలేశారు. మరికొందరు సమాధానం రాసినా మార్కులు రావేమోనని భయపడటం పరీక్ష కేంద్రాల వద్ద కన్పించింది. ఉర్దూలోనూ ఇదే తంతు గణితం పేపర్ను కొందరు విద్యార్థులు ఉర్దూ మీడియంలో రాశారు. అందులో ఇచ్చిన ఓ ప్రశ్న అర్థం లేకుండా ఉండటంతో విద్యార్థుల్లో అయోమయం నెలకొంది. ఒక లెక్కలో" FARJI'’అని ఇచ్చారు. అదేంటో ఎవరికీ అర్థం కాలేదు. విద్యార్థులు ఇదేమిటని ప్రశ్నించడంతో.. ఇన్విజిలేటర్లు, పరీక్ష కేంద్రం సిబ్బంది అప్పటికప్పుడు ఆ పదం అర్థమేంటో తెలుసుకునేందుకు హైరానా పడ్డారు. ఉర్దూ భాషా నిపుణులను సంప్రదించగా.. ఆ పదం " ZARBI' అని, లెక్కలో హెచ్చింపు అని అర్థమని చెప్పారు. ఇది పరీక్ష కేంద్రంలో విద్యార్థులకు చేరేసరికి సమయం వృధా అయింది. వరుస తప్పిదాలు.. ఎందుకిలా? ఇంటర్బోర్డు నిపుణుల చేత అత్యంత గోప్యంగా పరీక్ష పత్రాలను తయారు చేయిస్తుంది. మొత్తం 12 సెట్లు రూపొందిస్తారు. అందులోంచి మూడింటిని ఎంపిక చేసి.. పరీక్ష కేంద్రాలకు పంపుతారు. పరీక్షకు సరిగ్గా అరగంట ముందు ఈ మూడు సెట్లలో ఒక సెట్ను ఖరారు చేస్తారు. అయితే ఈ సంవత్సరం ప్రశ్నపత్రాల రూపకల్పన సమయంలో కొందరు అనుకూలమైన వ్యక్తులకు బాధ్యత అప్పజెప్పారని, వారికి అనుభవం లేకపోవడమే తప్పిదాలకు కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో కొందరు అధికారులు కుమ్మక్కైనట్టు విమర్శలొస్తున్నాయి. ప్రశ్నపత్రాల రూపకల్పన సమయంలోనే కార్పొరేట్ కాలేజీలతో మిలాఖత్ అయ్యారా? అన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. హిందీ ట్రాన్స్లేటర్లు ఉన్నప్పటికీ వారికి అవకాశం ఇవ్వకపోవడం వెనుక కొందరు పైరవీకారుల పాత్ర ఉందనే విమర్శలున్నాయి. ఏదేమైనా పరీక్షల విభాగంపై సమగ్ర విచారణ జరపాలనే డిమాండ్ కూడా విన్పిస్తోంది. వేర్వేరుగా మూల్యాంకనం పొలిటికల్ సైన్స్ పేపర్లో తెలుగు, ఆంగ్ల భాషల్లో వేర్వేరుగా ప్రశ్నలు ఇవ్వడాన్ని గుర్తిం చాం. దీన్ని దృష్టిలో ఉంచుకుని వేర్వేరుగా మూల్యాంకనం చేపడతాం. రెండు భాషల్లోనూ రెండు ప్రశ్నలకు మార్కులు వేస్తాం. – సయ్యద్ ఒమర్ జలీల్, బోర్డు కార్యదర్శి ఇలాగైతే విద్యార్థుల్లో కంగారే.. లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నప్పుడు ఇలాంటి తప్పిదాలు రాకుండా చూడాలి. పరీక్ష హాల్లో విద్యార్థులు ఇలాంటి గందరగోళానికి లోనైతే.. సక్రమంగా పరీక్ష రాసే అవకాశం ఉండదు. ఆ రోజు పరీక్షపై ప్రభావం చూపుతుంది. – పరశురాములు, జూనియర్ లెక్చరర్ -
సంస్కృతం బదులు.. హిందీ ప్రశ్నపత్రం
స్టేషన్ఘన్పూర్: ఇంటర్ సెకండియర్ పరీక్షల్లో సిబ్బంది సంస్కృతం బదులు.. హిందీ ప్రశ్నపత్రం ఇచ్చిన ఘటన జనగామ జిల్లా నమిలిగొండ శివా రు మోడల్ స్కూల్లో చోటుచేసుకుంది. మహబూబాబాద్కు చెందిన హర్షి త శనివారం సంస్కృతం పేపర్ రాసేందుకు నమిలిగొండ శివారు మోడల్ స్కూల్లోని పరీక్ష కేంద్రానికి హాజరైంది. ఆమెకు ఇన్విజిలేటర్ సంస్కృతం పేపర్కు బదులు హిందీ ప్రశ్నపత్రం ఇచ్చారు. అది తన సబ్జెక్ట్ కాదని తెలిసినా.. ఏం చేయాలో తోచక సదరు విద్యార్థిని పరీక్ష ముగిసే వరకు కూర్చుండిపోయింది. బయటకు వచ్చాక తండ్రికి విషయం చెప్పగా.. ఆయన సిబ్బందికి, సెంటర్ ఇన్చార్జి శ్రీకాంత్ డీఐవో శ్రీనివాస్కు ఫిర్యాదు చేశారు. దీంతో బోర్డు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
‘నవోదయ’ ప్రశ్నపత్రంలో తప్పులు
కోడూరు: జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతిలో ప్రవేశాల కోసం ఏప్రిల్ 30న నిర్వహించిన పరీక్షలో తప్పులు దొర్లాయి. తెలుగు మాధ్యమం ప్రశ్నపత్రంలో నాలుగు మ్యాథ్స్ ప్రశ్నల్లో అనువాద, అన్వయ లోపాల కారణంగా విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతుందని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాలుగు మ్యాథ్స్ ప్రశ్నల్లో తెలుగు అనువాదం సరిగ్గా లేకపోవడంతో విద్యార్థులు తెలిసిన ప్రశ్నలే అయినప్పటికీ జవాబు గుర్తించేందుకు తికమకపడ్డారు. ప్రశ్నపత్రం ‘హెచ్’ కోడ్లో 48వ ప్రశ్న ‘రెండు అంకెల సహజసిద్ధమైన అంకెలు ఏవి?’ అని ఉంది. అయితే ఈ ప్రశ్నకు ‘రెండు అంకెల సహజసిద్ధమైన అంకెలు ఎన్ని’ అని ఉంటే విద్యార్థులు సరైన సమాధానం గుర్తించేవారు. 47వ ప్రశ్న ‘ఒక అంకె నుంచి తీసివేయబడిన అంకె ఇవ్వబడింది. జవాబుగా ఇచ్చిన అంకె భాగింపదగినది’ అని తప్పుగా ఇచ్చారు. అయితే.. ‘ఒక సంఖ్యలోని అంకెల మొత్తం నుంచి అంకె తీసివేయబడుతుంది. జవాబుగా ఇచ్చిన అంకె భాగింపదగినది’ అని ఉండాలని నిపుణులు చెబుతున్నారు. 44వ ప్రశ్న.. ‘నాలుగు అంకెల చిన్న సంఖ్య ఏ గుణకం వల్ల వస్తుంది’ అని ఉంది. ఇది ‘నాలుగు అంకెల చిన్న సంఖ్య ఏ ప్రధానాంకాల గుణకం వల్ల వస్తుంది’ అని ఉండాలి. 42వ ప్రశ్న అనువాదం తప్పుగా ఉండడం వల్ల ఆ ప్రశ్న విద్యార్థులకు అర్థం కాలేదు. నవోదయ పరీక్షలో సీటు సాధించడానికి ప్రతి మార్కు ఎంతో విలువైనది కావడంతో విద్యార్థులు ఈ నాలుగు ప్రశ్నల వల్ల తాము సీటు కోల్పోయే పరిస్థితి ఉంటుందేమోనని ఆందోళన చెందుతున్నారు. దీనిపై కృష్ణా జిల్లా కోడూరు ఎంఈవో టి.వి.ఎం.రామదాసు, గణితం ఉపాధ్యాయులు రేపల్లె జయపద్ర, కో–ఆర్డినేటర్ మన్నె ప్రేమ్చంద్ మాట్లాడుతూ విద్యార్థులకు న్యాయం జరిగేలా తప్పులు ఉన్న 4 ప్రశ్నలకు మార్కులు ఇవ్వాలని నవోదయ విద్యాలయ సమితిని కోరారు. -
విద్యార్థుల వాట్సాప్ గ్రూపుల్లో ప్రశ్నాపత్రాలు.. వీసీ సీరియస్
సాక్షి, శాతవాహనయూనివర్సిటీ(కరీంనగర్): శాతవాహనయూనివర్సిటీ డిగ్రీ పరీక్షల 6వ సెమిస్టర్ ప్రశ్నాపత్రం ఓ ప్రయివేటు కళాశాలకు చెందిన విద్యార్థుల వాట్సాప్గ్రూపులో చక్కర్లు కొట్టడం సంచలనంగా మారింది. ఈ విషయాన్ని వీసీ మల్లేశ్ సీరియస్గా తీసుకున్నారు. డిగ్రీ మూడు, ఐదో సెమిస్టర్ పరీక్షలకు కోవిడ్ కారణంగా సెల్ఫ్సెంటర్లు ఏర్పాటుచేశారు. దీని కారణంగా కొన్ని ప్రయివేటు కళాశాలల్లో విచ్చలవిడిగా మాస్ కాపీయింగ్ జరిగిందని గుర్తించిన వీసీ 12వ తేదీ నుంచి జరుగుతున్న 4, 6వ సెమిస్టర్లకు జంబ్లింగ్ విధానం అమలు చేస్తున్నారు. ప్రత్యేక బృందాలు తనిఖీ చేస్తుండగా.. మాస్కాపీయింగ్కు పాల్పడుతున్న విద్యార్థులను పట్టుకొని కేసు నమోదుచేస్తున్నారు. ఈ క్రమంలో విద్యార్థుల సెల్ఫోన్లలో ప్రశ్నాపత్రం ప్రత్యక్షం కావడాన్ని వీసీ సీరియస్గా తీసుకున్నారు. కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. రెండు, మూడు రోజుల్లో నివేదిక ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై శాతవాహన వీసీ మల్లేశ్ నలుగురితో కూడిన ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై త్వరగా నివేదిక ఇవ్వాలని ఆదే శించారు. గురువారం కమిటీ తన పనిని ప్రారంభించగా.. శనివారం దీనిపై ప్రత్యేకసమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహా రంలో కొన్ని ప్రముఖ కళాశాలలకు చెందిన వారి హ స్తం ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎప్పటి నుంచి లీకవుతున్నాయి.. ఎస్సారార్ కళాశాల కేంద్రంలో పరీక్ష రాస్తున్న నగరానికి చెందిన ఓ ప్రయివేటు డిగ్రీ కళాశాల విద్యార్థులకు సంబంధించిన వాట్సాప్ గ్రూపుల్లో ప్రశ్నాపత్రం రావడం, అప్పుడే వర్సిటీ అధికారులకు సమాచారం చేరడంతో విషయం బయటకు పొక్కింది. కానీ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారం కొన్ని రోజుల నుంచే జరుగుతోందని చర్చ జరుగుతోంది. కొంతమంది విద్యార్థులు పేపర్ లీక్ విషయం కొత్తేమి కాదని బాహాటంగానే మాట్లాడుకుంటున్నారు. బుధవారం పలువురు విద్యార్థుల సెల్ఫోన్లలో ప్రత్యక్షమైన ప్రశ్నాపత్రం వర్సిటీవ్యాప్తంగా వెళ్లి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీస్ నిఘా శాతవాహనలో ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై పోలీసులు నిఘా పెట్టినట్లు తెలిసింది. వర్సిటీ వేసిన ప్రత్యేక కమిటీతో నిజం తేలిన తర్వాత బాధ్యులపై చర్యలకు యూనివర్సిటీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేస్తారని చర్చజరుగుతోంది. ప్రశ్నాపత్రాలు లీక్ చేసి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వీసీ వర్సిటీలో గురువారం జరిగిన ఒక సమావేశంలో పేర్కొన్నారు. విచారణ పూర్తయ్యేవరకు సీజ్చేసిన తొమ్మిదిసెల్ఫోన్లు ఇవ్వమని వీసీ స్పష్టం చేశారు. -
కామన్ పేపర్.. ఎక్కువ చాయిస్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని డిగ్రీ, పీజీ ఫైనల్ సెమిస్టర్ విద్యార్థులకు కామన్ పేపర్తో ఎక్కువ చాయిస్ ఉండేలా ప్రశ్నలతో పరీక్ష ప్రశ్న పత్రాలు రూపొందించే అంశాల పై ఉన్నత విద్యా మండలి కసరత్తు ప్రారంభించింది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఇటీవల పరీక్షలు, విద్యా కార్యక్రమాలపై జారీ చేసిన మార్గదర్శకాల అమలుకు చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి పలు యూనివర్సిటీల రిజిస్ట్రార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. యూజీసీ మార్గదర్శకాల జారీ కంటే ముందుగానే డిటెన్షన్ విధానాన్ని ఎత్తివేసి, మార్కులతో సంబంధం లేకుండా ప్రథమ, ద్వితీయ సంవత్సరాల విద్యార్థులందరినీ ప్రమోట్ చేయాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో లాక్డౌన్ నేపథ్యంలో పరీక్షల నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. ఇందుకు యూనివర్సిటీలు కూడా సిద్ధం కావాలని పేర్కొంది. యూనివర్సిటీ స్థాయిలోనూ పరీక్షల విభాగం నియంత్రణాధికారులు, యూనివర్సిటీ కాలేజీల ప్రిన్సిపాళ్లు, హెచ్వోడీలతో చర్చించి నివేదికలు సిద్ధం చేసుకోవాలని పాపిరెడ్డి ఆదేశించారు. నాలుగు రోజుల్లో మరోసారి సమావేశం కావాలని, అందులో తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. ఆ సమావేశంలో తాము తీసుకునే నిర్ణయాలపై ప్రభుత్వ ఆమోదానికి ఫైలు పంపించాలని నిర్ణయించారు. చదవండి: వేరే ప్రాంతాలకు వెళ్లేవారికి ఈ–పాస్లు త్వరలోనే నిర్ణయం.. వీలైతే జూన్ 20 నుంచి లేకపోతే జూలై 1 నుంచి ఫైనల్ సెమిస్టర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని తాజా సమావేశంలో నిర్ణయించారు. మిగతా సెమిస్టర్ల వారికి జూలై 15 నుంచి నిర్వహించాలన్న అభిప్రాయానికి వచ్చారు. అయితే వారికి పరీక్షలు నిర్వహించాలా.. యూజీసీ చెప్పినట్లు కిందటి సెమిస్టర్ మార్కుల ఆధారంగా మార్కులు ఇవ్వాలా.. అన్న దానిపై త్వరలో నిర్వహించే సమావేశంలో నిర్ణ యం తీసుకోనున్నారు. పరీక్ష సమయాన్ని 3 గంటలు నుంచి 2 గంటలకు కుది ంచాలనే యోచనలో ఉంది. కామన్ పేపరు విధానం అవలంబించాలని, ఎక్కువ ఆప్షన్లు ఉండేలా ప్రశ్నల సరళి ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. మొత్తంగా 10 నుంచి 14 వరకు ప్రశ్నలు ఇచ్చి అందులో సగం (5 నుంచి 7 ప్రశ్నలకు) ప్రశ్నలకు జవాబు రాయాలనే విధానం అమలుపై యోచిస్తున్నారు. వీలైతే ఆబ్జెక్టివ్లోనూ పరీక్షలు నిర్వహించుకోవచ్చని యూజీసీ చెప్పినా, రాష్ట్రంలో విద్యార్థులకు డిస్క్రిప్టివ్ విధానం అలవాటు ఉండటంతో ఇబ్బంది పడతారనే ఆలోచనతో దాని అమలు అవసరం లేదన్న భావనకు వచ్చారు. చదవండి: వడివడిగా ‘కొండపోచమ్మ’ చెంతకు -
మారిన ప్రశ్నపత్రం
నెల్లూరు(టౌన్): ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులు నష్టపోతున్నారు. ఈనెల 5వ తేదీన జరిగిన ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలో ఓ విద్యార్థినికి కొత్త సిలబస్కు సంబంధించిన ప్రశ్నపత్రం బదులు పాత సిలబస్ ప్రశ్నపత్రం ఇచ్చారు. ఆ విద్యార్థిని పరీక్ష రాసి బయటకు వచ్చి తోటి విద్యార్థులతో మాట్లాడుతుండగా అసలు విషయం బయటకు వచ్చింది. ఈ సమయంలో ప్రశ్నపత్రం మారిపోయిందని తెలుసుకుని ఆందోళన చెందింది. ఈనెల 5వ తేదీన సీనియర్ ఇంటర్ విద్యార్థులకు జనరల్కు సంబంధించి తెలుగు, సంస్కృతం, హిందీ, ఒకేషనల్ విద్యార్థులకు జనరల్ ఫౌండేషన్ కోర్సు (జీఎఫ్సీ) పరీక్ష జరిగింది. అదేరోజు నెల్లూరులోని స్టోన్హౌస్పేటలో ఉన్న ఓ జూనియర్ కళాశాలలో విద్యార్థులు ఒకేషనల్ కోర్సుకు సంబంధించి పరీక్ష రాశారు. ఓ విద్యార్థినికి కొత్త సిలబస్కు సంబంధించిన ప్రశ్నపత్రం ఇవ్వాల్సి ఉంది. అయితే అక్కడున్న పరీక్షల నిర్వహణ సిబ్బంది హడావుడిగా ప్రశ్నపత్రాలను అందజేశారు. విద్యార్థిని పరీక్ష రాస్తున్న సమయంలో కొత్త సిలబస్కు చెందిన ప్రశ్నపత్రమా లేక పాత సిలబస్కు చెందినదా అని గ్రహించలేక పోయింది. తీరా పరీక్ష రాసి బయటకు వచ్చిన తర్వాత అది పాత సిలబస్కు సంబంధించిన ప్రశ్నపత్రం అని తెలుసుకుని అవాక్కైంది. వెంటనే పరీక్షా కేంద్రంలో ఉన్న అధికారులకు చెప్పడంతో వారు కొత్త సిలబస్ ప్రశ్నపత్రం ఇచ్చి గంట సమయం ఇచ్చి పరీక్ష రాయించారు. విచారిస్తా కొత్త ప్రశ్నపత్రం బదులు పాత ప్రశ్నపత్రం ఇచ్చిన విషయం నా దృష్టికి రాలేదు. ఈ విషయాన్ని చీప్ సూపరింటెండెంట్ను అడిగి తెలుసుకుంటాను. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. – శ్రీనివాసులు, ఆర్ఐఓ -
గాంధీ ఎలా ఆత్మహత్య చేసుకున్నారు?
అహ్మదాబాద్: అదేంటి మహాత్మా గాంధీ ఆత్మహత్య చేసుకోవడమేంటి అనుకుంటున్నారా? గాంధీని గాడ్సే చంపారన్న విషయం అందరికీ తెలిసిందే కానీ, గుజరాత్లోని ఓ పాఠశాల ప్రశ్నపత్రంలో మాత్రం గాంధీ ఎలా ఆత్మహత్య చేసుకున్నారు? అనే ప్రశ్నను అడిగారు. ఈ ప్రశ్నను చూసి ఆశ్చర్యపోయిన విద్యాశాఖాధికారులు దీనిపై విచారణ జరపాలని ఆదేశించారు. ‘సుఫలాం శాల వికాస్ సంకుల్ పేరిట గుజరాత్లోని గాంధీనగర్లో నిర్వహిస్తున్న పాఠశాలలో 9వ తరగతి ఇంటర్నల్ పరీక్షలో ఈ ప్రశ్న అడిగారు’అని ఓ అధికారి తెలిపారు. కాగా, 12వ తరగతి విద్యార్థులకు ‘మీ ప్రాంతంలో మద్యం అమ్మకాలు పెంచడానికి ఏం చేయాలో తెలుపుతూ పోలీస్ ఉన్నతాధికారికి లేఖ రాయండి’అనే మరో విచిత్రమైన ప్రశ్న ఎదురైంది. దీనిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని గాంధీనగర్ జిల్లా విద్యాధికారి భరత్ వధేర్ వెల్లడించారు. -
గవర్నర్ ఒక కీలుబొమ్మ.. అవునా?
పట్నా: బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్షలో ఓ వింత ఈ ప్రశ్న చూసి అభ్యర్థులు కంగుతిన్నారు. ‘భారతదేశంలో, మరీ ముఖ్యంగా బిహార్ రాష్ట్రంలో గవర్నర్ కీలుబొమ్మేనా..?’ అన్న ప్రశ్న అభ్యర్థులను ఆశ్చర్యానికి గురిచేసింది. బిహార్లో ఆదివారం బీపీఎస్సీ మెయిన్స్ పరీక్ష జరగ్గా సెకండ్ పేపర్లో ఈ ప్రశ్న అడిగారు. ఏం సమాధానం రాయాలో తెలీక విద్యార్థులు తల గోక్కున్నారు. ఈ ప్రశ్నపత్రం సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. దీనిపై అక్కడి ఆర్జేడీ (రాష్ట్రీయ జనతాదళ్) తీవ్రంగా స్పందించింది. గవర్నర్ పదవిని అపహాస్యం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్జేడీ ఎమ్మెల్యే భాయ్ వీరేంద్ర మాట్లాడుతూ.. ఆ ప్రశ్నను తయారు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇవేకాకుండా మరిన్ని ప్రశ్నలు కూడా విమర్శలకు తావిచ్చాయి. ‘భారతదేశంలో పెద్ద సంఖ్యలో ఉన్న రాజకీయ పార్టీలపై మీ అభిప్రాయం తెలపండి? అలాగే వాటివల్ల లాభనష్టాలను పేర్కొండంటూ మరో ప్రశ్న కనిపిస్తుంది. దీంతో పాటు ‘భారత్లో న్యాయస్థానాల క్రియాశీలత’ గురించి ప్రశ్నించారు. ఈ ప్రశ్నాపత్రం సోషల్ మీడియాలో వైరల్ అవటంతో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కృష్ణనందన్ ప్రసాద్వర్మ స్పందించారు. ప్రశ్నపత్రం రూపొందించడంలో తప్పిదం జరిగిందని వివరించారు. -
అనువాదం..అయోమయం
ఏపీపీఎస్సీ తీరు మారనంటోంది. చిన్నపోస్టులకూ కఠినమైన ప్రశ్నలు సంధిస్తోంది. ఇది చాలదన్నట్టూ ఇంగ్లిషు, తెలుగు అనువాదంలో గందరగోళం సృష్టిస్తోంది. ఏది తప్పో.. ఏది కరెక్టో తెలియక తలలుపట్టుకునేలా చేస్తోంది. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోంది. దీన్ని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. సాక్షి, తిరుపతి అన్నమయ్యసర్కిల్ : రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 430 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ల పోస్టుల నియామకానికి ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) నోటిఫికేషన్ జారీచేసింది. ఆయా పోస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 60వేల మందికిపైగా దరఖాస్తు చేసుకున్నారు. జిల్లా నుంచి దాదాపు 6,400 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరికోసం జిల్లాలో తిరుపతి కేంద్రంగా 11 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఆదివారం జరిగిన పరీక్షకు 58.09శాతం మంది అభ్యర్థులు మాత్రమే హాజరయ్యారు. గందరగోళంగా ప్రశ్నాపత్రం ఆదివారం జరిగిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ల పరీక్ష ప్రశ్నాపత్రం గందరగోళంగా ఉందని అభ్యర్థులు విమర్శించారు. ప్రధానంగా తెలుగు, ఇంగ్లిష్ అనువాదంలో తప్పులు దొర్లాయని ఆరోపించారు. ప్రశ్నలు రెండు భాషల్లోనూ ఒకే విధంగా ఉన్నా, నాలుగు ఆప్షన్లలో ఇచ్చిన జవాబుల్లో పూర్తిగా సంబంధం లేని విధంగా ఉండడంతో అభ్యర్థులు గందరగోళానికి గురయ్యారు. ఇదిలా ఉంటే మ్యాథ్స్ ప్రశ్నలు కఠినంగా ఉన్నాయని, సైన్స్, కరెంట్ అఫైర్స్కు సంబంధించిన ప్రశ్నలు సివిల్స్ పరీక్షను తలపించాయని అభ్యర్థులు వాపోయారు. ప్రశ్నల సరళి గతం కంటే భిన్నంగా తికమక కలిగించేలా ఉన్నాయని ఆరోపించారు. ఇంటర్ విద్యార్హతతో నిర్వహించే ఈ పరీక్షను కఠినమైన ప్రశ్నలతో ఇవ్వడం దారుణమని అభ్యర్థులు, వివిధ విద్యార్థి సంఘాలు, మేధావులు విమర్శించారు. మితిమీరుతున్న విమర్శలు ఏపీపీఎస్సీ నిర్వహిస్తున్న ప్రతి పరీక్ష వివాదాస్పదంగా మారిందని మేధావులు చెబుతున్నారు. ఆదివారం జరిగిన పరీక్షే కాకుండా గతంలో జరిగిన గ్రూప్–1, 2, 3తో పాటు డిపార్టమెంటల్ పరీక్షల్లో కూడా ప్రశ్న పత్రాల విషయంలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఏపీపీఎస్సీ తీరులో ఎటువంటి మార్పు రాలేదు. రాష్ట్రంలో కొత్తగా కొలువైన ప్రభుత్వం ఈ విషయంపై దృష్టి సారించి నిరుద్యోగులకు న్యాయం జరిగేలా ఏపీపీఎస్సీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మ్యాథ్స్ కఠినం మ్యాథ్స్ కఠినంగా అనిపించింది. జనరల్ సైన్స్ సులువుగా ఉన్నా కరెంట్ అఫైర్స్పై అధిక ప్రశ్నలు వచ్చాయి. మొత్తానికి ఈ ప్రశ్న పత్రం ఇంటర్ స్థాయిలో లేదు. కొంత కఠినంగా ఉంది. ప్రశ్నలు తారుమారుగా ఇవ్వడంతో సమయం వృథా అయ్యింది. – లేఖశ్రీ, అభ్యర్థిని, తిరుపతి అనువాదంలో అయోమయం తెలుగు, ఇంగ్లిష్ ప్రశ్నల విషయంలో అనువాదం సరిగ్గా లేదు. అభ్యర్థులు అయోమయానికి గురయ్యారు. గణితంలో ఇచ్చిన ప్రశ్నలు గ్రూప్–1 స్థాయిని తలపించింది. సైన్స్, కరెంట్ అఫైర్స్ కొంత సులువుగా ఉన్నాయి. – అభిలాష్, అభ్యర్థి, తిరుపతి ఆప్షన్స్లో గందరగోళం తెలుగు, ఇంగ్లిష్లో ప్రశ్నలు ఒకే విధంగా ఉన్నప్పటికీ ఆప్షన్స్లో ఇచ్చిన జవాబుల్లో గందరగోళం నెలకొంది. తెలుగులో ఒకలా, ఇంగ్లిష్లో మరోలా జవాబులున్నాయి. ఏది సరి, ఏది తప్పు అని గుర్తించడంలో కొంత గందరగోళం నెలకొంది. – నాగమణి, అభ్యర్థిని, అనంతపురం ప్రశ్నల సరళి విభిన్నం గత మోడల్ పేపర్ కంటే ప్రస్తుత పరీక్షలో ప్రశ్నల సరళి విభిన్నంగా ఉంది. చాలా ప్రశ్నలు తప్పుగా ఇచ్చారు. ఎక్కువ భాగం సైన్స్, కరెంట్ అఫైర్స్లో సంధించారు. ప్రశ్న పత్రం విభిన్నంగా ఉండడంతో అర్థం చేసుకోవడానికే సమయం సరిపోయింది. – జనార్థన్, అభ్యర్థి, తిరుపతి కొత్త ప్రభుత్వంపై ఆశలు ఏపీపీఎస్సీని ప్రక్షాళన చేసే దిశగా నూతన ప్రభుత్వం వ్యవహరిస్తుందని భావిస్తున్నాం. నిరుద్యోగులు సైతం నూతన ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నారు. ఏపీపీఎస్సీ క్యాలెండర్ను రూపొందించి ప్రతి ఏటా ప్రతి శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుని నిరుద్యోగులకు అండగా ఉంటుందని ఆశిస్తున్నాం. – డి.సుబ్రమణ్యంరెడ్డి, రిటైర్డ్ ప్రొఫెసర్, ఎస్వీయూ -
వరంగల్లో ఇంటర్ ప్రశ్నాపత్రాల గల్లంతు
-
అవాక్కవకుండా ఆన్సర్ చెప్పండి.!
సాక్షి, బెంగుళూరు: క్వశ్చన్ పేపర్ కొత్తగా ట్రై చేద్దామనుకున్నాడో టీచర్..! కానీ అది కాస్తా బెడిసి కొట్టింది. దీంతో అయ్యగారి ఉద్యోగమే ఊడింది. రాజరాజేశ్వరి నగర్లోని మౌంట్ కార్మెల్ ఇంగ్లీష్ హైస్కూల్లో తయారు చేసిన 8వ తరగతి ప్రశ్నాపత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వినటానికి తమాషాగా అనిపించినా, అసలే ఎన్నికల సమయం కావటంతో విమర్శలకు దారితీసింది. ఇంతలా తిప్పలు పెట్టిన ప్రశ్న ఏంటంటే... రైతు మిత్రులు ఎవరు? అన్న ప్రశ్నకు ...సమాధానంగా ఇచ్చిన ఆప్షన్లు చూస్తే అవాక్కవ్వాల్సిందే. ఎ. కుమారస్వామి బి. వానపాములు సి. యడ్యూర్పప్ప... ఆప్షన్లను చూసి ఒక్కసారిగా బిత్తరపోయిన విద్యార్థులు ఆ తర్వాత తేరుకొని తడుముకోకుండా సమాధానాన్ని ఎంచుకున్నారు. బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్పను, రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారస్వామిని కాదని విద్యార్థులు... రైతు మిత్రులుగా వానపాములకే ఓటేశారు. ఈ ప్రశ్నాపత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో స్కూల్ యాజమాన్యం సదరు ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకుంది. నిర్లక్ష్యంగా ప్రశ్నాపత్రాన్ని తయారు చేసిన టీచర్ను విధుల నుంచి తొలగించింది. అంతేకాకుండా తాము ఏ పార్టీకి మద్దతు ఇవ్వలేదని సంజాయిషీ ఇచ్చుకుంది. -
గ్రూప్–4 ప్రశ్నపత్రంలో గందరగోళం
సాక్షి, హైదరాబాద్: గ్రూప్– 4 పరీక్ష గందరగోళంగా జరిగింది. దీంతో ఆదివారం పరీక్ష రాసిన అభ్యర్థులు తీవ్ర అయోమయానికి గురయ్యారు. పేపర్–1 సెట్ బీలోని ప్రశ్నలు సెట్–ఏలో కనిపించాయి. ప్రశ్నపత్రంలో తలెత్తిన తప్పుల వల్ల పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులు తీవ్ర గందరగోళానికి లోనయ్యారు. పేపర్– 1 పరీక్షలో ఏ సిరీస్ ప్రశ్నపత్రంలో విద్యార్థులకు కొన్ని పేజీలు మిస్సయ్యాయి. మరోవైపు బీ సిరీస్ నుంచి వచ్చిన ప్రశ్నలు కూడా కొన్ని రిపీట్ అయ్యాయని విద్యార్థులు ఆరోపించారు. ఏ సిరీస్ ప్రశ్నప్రత్రంలో బీ సిరీస్కు చెందిన 16, 17, 18, 19, 20, 21, 45, 46, 63, 64, 65, 73, 74, 75, 90, 91, 92, 93, 100, 101, 119, 120, 121, 122, 123, 124 తదితర ప్రశ్నలు ఒక సిరీస్కు బదులు మరో సిరీస్లో వచ్చాయి. ఏ సిరీస్, బీ సిరీస్ రెండూ ఒకే ప్రశ్నపత్రంలో ఉన్నందున పరీక్ష సరిగా రాయలేకపోయామని అభ్యర్థులు ఆరోపించారు. అయితే టీఎస్ పీఎస్సీ మాత్రం కొన్ని పొరపాట్లు దొర్లినందున అందుబాటులో ఉన్న మరో పేపర్ ఇచ్చి పరీక్ష రాయించామని తెలిపింది. ఇదిలా ఉండగా హైదరాబాద్ ఈసీఐఎల్లోని శ్రీచైతన్య కళాశాలలో గ్రూప్– 4 పరీక్షలు రాస్తున్న 6 అభ్యర్థులకు ఏ–1 సిరీస్ ప్రశ్నపత్రంలో బీ సిరీస్ ప్రశ్నలు వచ్చాయి. దీంతో విషయాన్ని ఇన్విజిలేటర్లకు చెప్పగా వారు టీఎస్పీఎస్సీ దృష్టికి తీసుకెళ్లారు. ఒక దశలో అభ్యర్థులు టీఎస్పీఎస్సీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేయటంతో అధికారులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పోలీస్ బందోబస్తు మధ్య పరీక్షలు పూర్తయినప్పటికీ తమకు న్యాయం చేయాలని వారు టీఎస్పీఎస్సీని కోరారు. 65 శాతం హాజరు..: గ్రూప్–4 పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 4.80 లక్షల మందికిగాను 3.12 లక్షల (65 శాతం) మంది హాజరైనట్లు టీఎస్పీఎస్సీ వెల్లడించింది. 1,046 కేంద్రాల్లో జరిగిన పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని టీఎస్పీఎస్సీ కార్యదర్శి వాణీప్రసాద్ తెలిపారు. అందులో అత్యధికంగా నల్లగొండ జిల్లా లో 75 శాతం మంది, ఆ తర్వాత వరంగల్, మహ బూబ్నగర్ జిల్లాల్లో 74 శాతం చొప్పున హాజరయ్యారని వెల్లడించారు. ఇక, ఆసిఫాబాద్ జిల్లాలో కేవలం 12 శాతం మాత్రమే హాజరైనట్లు ఆమె వివరించారు. జీహెచ్ఎంసీ పరిధిలో బిల్ కలెక్టర్లు, టీఎస్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్లో వివిధ పోస్టులు, అలాగే టీఎస్ఆర్టీసీలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు ఈ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. -
నీట్ 2018 : మద్రాస్ హైకోర్టు సంచలన ఆదేశాలు
చెన్నై : వైద్య విద్య ప్రవేశ పరీక్ష నీట్లో ఉత్తీర్ణత కాకపోవడంతో పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో మద్రాస్ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. తమిళ భాషలో పరీక్ష రాసిన విద్యార్థులకు గ్రేస్ మార్కుల కింద 196 మార్కులు జత చేయాలంటూ మధురై బెంచ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్సీ)ను ఆదేశించింది. ఈ మేరకు నీట్ 2018 ర్యాంకు లిస్టును రెండు వారాల్లోగా పునః పరిశీలించాలని పేర్కొంది. నీట్ పరీక్షా ప్రశ్నాపత్రంలోని తమిళ భాష అనువాదంలో తప్పులు దొర్లాయంటూ సీపీఐ(ఎమ్) నేత టీకే రంగరాజన్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. 49 ప్రశ్నలు తప్పుగా అనువాదం చేసినందు వల్ల గందరగోళానికి గురైన విద్యార్థులు మార్కులు కోల్పోయారని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన మధురై బెంచ్ సీబీఎస్సీ తీరును తప్పు పట్టింది. నీట్ పరీక్షకు సంబంధించిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణ పెండింగ్లో ఉండగానే ర్యాంకు లిస్టు ఎలా విడుదల చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేసింది. నిరంకుశంగా వ్యవహరించారు.. తమిళ భాష అనువాదంలో తప్పులు దొర్లలేదని సీబీఎస్సీ ఏ ప్రాతిపదికన చెబుతుందో వివరించాలని కోర్టు ఆదేశించింది. మెజారిటీ ప్రజలు సమర్థించినంత మాత్రాన తప్పులు ఒప్పులై పోవు కదా అంటూ బెంచ్ వ్యాఖ్యానించింది. పిల్ విచారణ కొనసాగుతుండగానే ర్యాంకు లిస్టు విడుదల చేయడం ద్వారా సీబీఎస్సీ నిరంకుశంగా వ్యవహరించిందని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అనువాద తప్పిదాల వల్ల విద్యార్థులు మార్కులు కోల్పోయారన్న వాదనను సీబీఎస్సీ తేలికగా తీసుకోవడం బాధ్యత రాహిత్యమేనని మండిపడింది. సైన్సు విభాగంలో ఆంగ్ల పదాలతో సరిపోయే తమిళ పదాలను రూపొందించడానికి ఎటువంటి ప్రమాణాలు పాటించిందో వివరణ ఇస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని సీబీఎస్సీని ఆదేశించింది. కాగా మద్రాస్ హైకోర్టు ఆదేశాలతో సుమారు 24 వేల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. -
పది ప్రశ్నపత్రం లీక్
నార్నూర్(ఆసిఫాబాద్): పదో తరగతి పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికే ఇంగ్లిషు పేపర్–2 ప్రశ్నపత్రం లీక్ కావడం, వాట్సాప్లో వైరల్గా మారడం ఉమ్మడి ఆది లాబాద్ జిల్లాలో సోమవారం కలకలం సృష్టించింది. విద్యార్థుల తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేసింది. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం తాడిహత్నూర్ గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రంలో ప్రశ్నపత్రం లీక్ వ్యవహారం చోటు చేసుకుంది. ఈ నెల 15న ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి 12.15 గంటల వరకు నిర్వహిస్తు న్న విషయం తెలిసిందే. సోమవారం ఉదయం ఇంగ్లిషు పేపర్–2 పరీక్ష ప్రారంభమైన గంటకు అంటే 10.30 గంటలకు వాట్సాప్లో ప్రశ్నపత్రం బయటకు వచ్చింది. వాట్సాప్లో ప్రశ్నపత్రం హల్చల్ చేయడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. పరీక్ష కేంద్రంలో తీసిన ప్రశ్నపత్రం ఫొటో, విద్యార్థులు గోడ దూకి నకలు చిట్టీలు అందిస్తున్న ఫొటోలనూ పెట్టడంతో వైరల్ అయ్యాయి. ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లగా.. ప్రశ్నపత్రం లీక్ కాలేదని, నిబంధనల ప్రకారం కఠినంగా వ్యవహరిస్తున్నామని తొలుత బుకాయించారు. అంతా సవ్యంగానే జరుగుతున్నాయని సర్ది చెప్పా రు. లీకైన ప్రశ్నపత్రం కింద విద్యార్థి హాల్టికెట్ నంబ రు ఉండడం, ఇన్విజిలేటర్గా విధులు నిర్వర్తి స్తున్న ఉపాధ్యాయురాలు కృష్ణవేణి చీర ఫొటోలో కని పిస్తుండడంతో నిజమేనని నిర్ధారణ జరిగింది. ఈ విషయం కలెక్టర్ దివ్యదేవరాజన్ దృష్టికి వెళ్లింది. వెంటనే పరీక్ష కేంద్రాన్ని పరిశీలించి వివరాలు తెలియజేయాలని ఆమె ఉట్నూర్ ఆర్డీవో జగదీశ్వర్రెడ్డి, డీఈవో జనార్దన్రావులను ఆదేశించారు. ప్రశ్నపత్రం లీక్ వ్యవహారాన్ని కలెక్టర్ తీవ్రంగా పరిగణించడంతో అధికారులు హుటాహుటిన పరీక్ష కేంద్రానికి చేరుకుని విచారణ జరిపారు. రూం నంబర్ 1లో.. పరీక్ష కేంద్రంలోని రూంనంబర్ ఒకటిలో ప్రశ్నపత్రం లీకైనట్లు అధికారులు ధ్రువీకరించారు. అనంతరం పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ భరత్చౌహాన్ స్థానిక పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీఐ హానోక్ ఆధ్వర్యంలో పదో తరగతి ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంపై పాఠశాలలో విచారణ జరిపారు. వాట్సాప్లో పేపరు లీక్ వ్యవహారంపై దృష్టి సారించారు. సెల్ఫోన్లో ఫొటో తీసి వాట్సాప్లో పంపినట్లు విచారణలో తేలిం ది. సెల్ఫోన్కు అనుమతి లేదని, పరీక్ష కేంద్రానికి సెల్ఫోన్ తీసుకెళ్లడంపై కఠినంగా వ్యవహరిస్తామని అధికా రులు తెలిపారు. ఇన్విజిలేటర్ కృష్ణవేణి, చీఫ్ సూపరింటెండెంట్(సీఎస్) భరత్ చౌహాన్, డిపార్టుమెంటల్ ఆఫీసర్(డీవో) జగన్మోహన్, సిట్టింగ్ స్క్వాడ్ జాడే నాగోరావులపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. కాగా, ఇన్విజిలేటర్ కృష్ణవేణి నార్నూర్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. మండలంలోని రెండు పరీక్ష కేంద్రాల్లో జోరుగా మాస్కాపీయింగ్ జరుగుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారని స్థానికులు ఆరోపిస్తున్నారు. రూం నంబర్–1లో బ్లాక్ బోర్డుపై రెండో వరుసలో ఉన్న విద్యార్థి హాల్టికెట్ నంబర్ బాధ్యులపై చర్యలు తీసుకుంటాం తాడిహత్నూర్ పరీక్ష కేంద్రం నంబర్ 1040లో పదో తరగతి ఇంగ్లిష్ పేపర్–2 ప్రశ్నపత్రం సెల్ఫోన్ ద్వారా ఫొటో తీసి వాట్సాప్ ద్వారా బయటకు పంపించి లీక్ చేసినట్లు విచారణలో తేలింది. పరీక్ష కేంద్రంలో సెల్ఫోన్కు అనుమతి లేదు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఇన్విజిలేటర్ కృష్ణవేణి, సీఎస్ భరత్ చౌహాన్, డీవో జగన్మోహన్, సిట్టింగ్ స్క్వాడ్ జాడే నాగోరావులపై శాఖా పరంగా చర్యలు తీసుకుంటాం. పేపర్ లీకైనా.. బయట నుంచి జవాబులు విద్యార్థులకు అందలేదు కాబట్టి పరీక్షలు యథాతథంగా కొనసాగుతాయి. పరీక్ష కేంద్రాల వద్ద భారీ బందోబస్తుతోపాటు ఎలాంటి పొరపాట్లు జరగకుండా చర్యలు తీసుకుంటాం. – జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్రావు, ఆదిలాబాద్ కలెక్టర్కు నివేదిక అందిస్తా.. పదో తరగతి ఇంగ్లిషు పేపర్–2 లీకైన మాట వాస్తవమే. పరీక్ష కేంద్రంలో సెల్ఫోన్ అనుమతి లేదు. రూమ్ నంబర్ ఒకటిలో ఫొటో తీసినట్లు తేలింది. విచారణ అనంతరం నివేదికను జిల్లా కలెక్టర్కు అందజేస్తా. – ఆర్డీవో జగదీశ్వర్రెడ్డి, ఉట్నూర్ లీక్ కాలేదు.. మాల్ప్రాక్టీస్: కలెక్టర్ నార్నూర్ మండలం తడిహత్నూర్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్ష పత్రం లీక్ కాలేదని, మాల్ప్రాక్టీస్ మాత్రమే జరిగిందని కలెక్టర్ దివ్య అన్నారు. సోమవారం సా యంత్రం ఐటీడీఏ క్యాంపు కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. సోమవారం జరిగిన ఇంగ్లిష్ పేపర్–2 లీక్ అయ్యిందన్న ప్రచారం అవాస్తమని చెప్పారు. పరీక్ష ప్రారంభమైన కొద్ది సేపటికి మాల్ప్రాక్టీస్ జరిగినట్లు గుర్తించామని అన్నారు. ఉట్నూర్ ఆర్డీవోతో విచారణ జరి పించి చీఫ్ సూపరింటెం డెంట్ భరత్ చౌహన్, డిపార్ట్మెంటల్ అధికారి జగన్మోహన్, కస్టోడియన్ అధికారి నాగోరావ్, ఇన్వి జిలెటర్ కృష్ణవేణిలను పరీక్షల నిర్వహణ విధుల నుంచి తొలగించడంతోపాటు సస్పెండ్ చేశామని చెప్పారు. పోలీసు కేసు నమోదు చేశామని, పరీక్ష కేం ద్రాల్లో మాల్ ప్రాక్టీస్, కాపీయింగ్ తదితర చర్యలను సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గత 15న జరిగిన పరీక్షలో భాగంగా చీఫ్ సూపరింటెండెంట్గా నిర్వహించిన ఉట్నూర్ బాలికల ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జాదవ్ సుమన్, డిపార్ట్మెంటల్ అధికారి ఇంద్రవెల్లి ఆశ్రమ పాఠశాల స్కూల్ అసిస్టెంట్ యాసిన్ షరీఫ్, ఇన్విజిలేటర్లు ఉట్నూర్ ఎస్సీకాలనీ ప్రాథమిక పాఠశాల ప్రధా నోపాధ్యాయురాలు రాథోడ్ చంద్రకళ, ఉట్నూర్ ప్రాథమికోన్నత పాఠశాల స్కూల్ అసిస్టెంట్ జె.రమేశ్ కుమార్లను పరీక్ష నిర్వహణ విధుల నుంచి తొలగించడంతోపాటు సస్పెండ్ చేశామని వివరించారు. వీరిపై శాఖా పరమైన చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో డీఈవో జనార్దన్రావు, అడిషినల్ ఎస్పీ మెహన్, ఆర్డీవో జగదీశ్వర్రెడ్డి పాల్గొన్నారు. -
బీకాం విద్యార్థుల ప్రశ్నపత్రం తారుమారు
డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ యూనివర్సిటీ పరీక్షల విభాగం డొల్లతనం మరోసారి బయటపడింది. బీకాం ప్రథమ సంవత్సరం రెగ్యులర్ విద్యార్థులకు అందజేయాల్సిన పేపర్ తారుమారు (ఒక ప్రశ్నపత్రం బదులు మరోప్రశ్నపత్రం ఇవ్వడం) అయిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సప్లిమెంటరీ విద్యార్థులకు ఇవ్వాల్సిన ప్రశ్నపత్రం రెగ్యులర్ విద్యార్థులకు ఇవ్వడంతో వారంతా తీవ్ర గందరగోళంలో ఉన్నారు. తమకు యూనివర్సిటీ ఉన్నతాధికారులు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. శ్రీకాకుళం: బీఆర్ఏయూ పరిధిలో గతనెల 24 నుంచి ఈ నెల నాలుగో తేదీ వరకు ఐదో సెమిస్టర్, ఈ నెల 8 నుంచి 16వ తేదీ వరకు మొదటి, మూడో సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఇందులో బీకాం ఫస్టియర్ చదువుతున్న విద్యార్థులకు మొదటి సెమిస్టర్ పరీక్షల్లో భాగంగా ఈనెల 13వ తేదీన ఫండమెంటల్ అకౌంటింగ్ పరీక్ష జరిగింది. అయితే వీరికి ఇచ్చిన ప్రశ్నపత్రం తారుమారైంది. 2016–17 బ్యాచ్కు చెందిన రెగ్యులర్ విద్యార్థులకు ఇవ్వాల్సిన ప్రశ్నాపత్రం ఇవ్వకుండా.. సప్లిమెంటరీ (2015–16) విద్యార్థులకు ఇవ్వాల్సిన ప్రశ్నాపత్రాన్ని అందజేశారు. తమ ప్రశ్నాపత్రమే ఆనుకుని వారంతా పరీక్ష రాసేశారు. జిల్లాలో శ్రీకాకుళం నగరంతోపాటు చాలా ప్రాంతాల్లోని కేంద్రాల్లో ప్రశ్నపత్రం తారుమారైనట్లు విద్యార్థులు ఆలస్యంగా గుర్తించారు. స్కోరింగ్ సబ్జెక్ట్ అకౌంటింగే! వాస్తవానికి బీకాం విద్యార్థులకు ఫండమెంటల్/ఫైనాన్షియల్ అకౌంటింగ్ పేపర్ను స్కోరింగ్ సబ్జెట్గా అంతా భావిస్తారు. సెమిస్టర్ విధానంలో జరుగుతున్న పరీక్షలకు గత ఐదు మాసాలగా సన్నద్ధమయ్యారు. అయితే పరీక్షలకొచ్చేసరికి తమది కాని ప్రశ్నపత్రాన్ని అందజేసి తమకు నిండా ముంచారని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫస్టియర్ బీకాం విద్యార్థులు సుమారు నాలుగు వేల మంది ఉండగా ఇందులో సగానికిపైగా విద్యార్థులు తారుమారు ప్రశ్నపత్రం కారణంగా నష్టపోయినట్లు తెలిసింది. తమకు జరిగిన నష్టాన్ని తెలుసుకుని లబోదిబోమంటున్నారు. యూనివర్సిటీ అధికారులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. న్యాయం చేయని పక్షంలో విద్యార్థి సంఘాలతో మమేకమై యూనివర్సిటీ వద్ద ధర్నాకు దిగుతామని చెబుతున్నారు. ఇలాంటి తరుణంలో యూనివర్సిటీ ఉన్నతాధికారులు కల్పించుకుని ఏ మేరకు నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాలి. మాదృష్టికి రాలేదు పేపర్లు మారిన విషయం ఇప్పటి వరకూ మా దృష్టికి రాలేదు. రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షల ప్రశ్నపత్రాలు వేర్వేరుగా పరీక్షా కేంద్రాలకు పంపిస్తాం. వీటి పంపిణీలో పొరపాటు జరిగితే వెంటనే చీఫ్ సూపరింటెండెంట్, ఇన్విజిలేటర్లు మాదృష్టికి తీసుకురావాలి. లేదంటే అది వారి తప్పిదమవుతుంది. మా దృష్టికి వస్తేనే ఎలా న్యాయం చేయాలనేదానిపై ఆలోచన చేస్తాం. – తమ్మినేని కామరాజు, బీఆర్ ఏయూ పరీక్షల విభాగం డీన్ -
సోషల్ మీడియాలో ప్రశ్నపత్రం!
► ఇంటర్ ప్రథమ సంవత్సర ఇంగ్లిష్ పేపర్ లీక్? ► ప్రభుత్వం ఎంపిక చేసింది సెట్–1 ► వాట్సాప్లో లీకైంది సెట్–3 ► ఈ ఏడాదికి సంబంధించిన పేపరే కాదన్న ఆర్ఐఓ కడప ఎడ్యుకేషన్: ప్రభుత్వం వైఫల్యమో లేక అధికారుల నిర్లక్ష్యమో తెలియదు కానీ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా సోషల్ మీడియాలో (వాట్సాప్) ప్రశ్నాపత్రం లీక్ కావడం వంటి ఘటనలు విద్యార్థుల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసున్నాయి. ఇంత జరగుతున్నా అధికారులు ఇలాంటి సంఘటనలు అరికట్టడంలో విఫలమయ్యారనే చెప్పాలి. తాజాగా శుక్రవారం కూడా కడప నగరంలోని ఓ కార్పొరేట్ కళాశాలకు చెందిన విద్యార్థుల మొబైల్ నుంచి ప్రశ్నపత్రం లీకైంది. సంబంధిత విషయం సోషియల్ మీడియాలో హల్చల్ చేసింది. దీంతో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పరీక్ష ప్రారంభమైన మొదటి రోజే రాయచోటి సెంటర్ నుంచి వాట్సప్లో కొశ్చన్ పేపర్ లీకైంది. ఇది జరిగిన రెండు రోజులకే మళ్లీ కడపలో పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికే ప్రథమ సంవత్సరం ఇంగ్లిష్ పేపర్–1కు సంబంధించి సెటర్–3 ప్రశ్నపత్రం వాట్సాప్లో లీకైందని వందంతులు కదం తొక్కాయి. ప్రభుత్వం మాత్రం ఇంటర్ ఇంగ్లిష్ పరీక్షకు సంబంధించి శుక్రవారం సెట్–1 ఎంపిక చేసినప్పటికి వాట్సాప్లో మాత్రం సెట్–3 లీక్ కావడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ ఏడాది ప్రశ్నపత్రామే కాదు వాట్సాప్లో శుక్రవారం వచ్చిన ప్రశ్నపత్రం ఈ ఏడాదికి సంబంధించింది కాదు. ఎందుకంటే ఇంటర్కు శుక్రవారం జరిగిన మొదటి సంవత్సర ఇంగ్లిష్ పేపర్ను రాష్ట్ర అధికారులు సెట్–1ను ఎంపిక చేశారు. కానీ వాట్సాప్లో వచ్చింది సెట్–3 . ఇది కేవలం ఆకతాయిలు చేసిన పని తప్ప మరొకటి కాదు. సెట్–3కి సంబంధించిన ప్రశ్నాపత్రం పోలీస్స్టేషన్లలో భద్రంగా ఉంది. కనుక ఆ పేపర్ లీక్ ఆయ్యే దానికి చాన్సే లేదు, వాట్సాప్లో వచ్చిన పేపర్ గతేడాదికి సంబంధించిన పేపర్ తప్ప మరొకటి కాదు. ఇదంతా విద్యార్థులను తప్పుదారి పట్టించేందుకు ఆకతాయిలు చేసిన పని. ఇలాంటి వదంతులను విద్యార్థులు ఎవరూ నమ్మాల్సిన పనిలేదు. – రవి, ఇంటర్ ప్రాంతీయ పర్యవేక్షణాధికారి. -
విద్యార్థుల చేతుల్లో ప్రశ్నాపత్రం
-పరీక్షకు ఒకరోజు ముందుగానే గణితం సమ్మెటీవ్-2 లీక్ – సోషల్ మీడియాలో హల్చల్ – చర్యలు తీసుకుంటామన్న డిప్యూటీ ఈఓ కొలిమిగుండ్ల/నంద్యాల విద్య: విద్యార్థుల ప్రతిభను గుర్తించేందుకు సమ్మెటీవ్ పరీక్షలు నిర్వహిస్తుంటారు. అయితే, పరీక్షకు ఒక రోజు ముందే తొమ్మిది, పదోతరగతి గణితం అర్ధసంవత్సర (సమ్మెటీవ్–2) ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయి. సోషల్మీడియాలో అవి హల్చల్ చేస్తున్నాయి. సాధారణంగా సంక్రాంతి సెలవులకు ముందే పరీక్షలు పూర్తి చేసి..పాఠశాలలకు సెలవులు ప్రకటించడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి మాత్రం ప్రభుత్వం ఈనెల 7,8,9 తేదీల్లో తెలుగు, హిందీ, ఇంగ్లిషు పరీక్షలు నిర్వహించి..మిగిలిన పరీక్షలను సెలవులు తరువాత నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా సోమవారం నుంచి సమ్మెటీవ్–2 పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే, ఒకరోజు ముందుగానే నంద్యాల, కొలిమిగుండ్ల ప్రాంతాల్లో టెన్త్ గణితం ప్రశ్నాపత్రాలు ఆదివారమే విద్యార్థుల దరి చేరాయి. ఇంకే ముందే ఎంచక్కా వారు అందులోని ప్రశ్నలకు జవాబులు సిద్ధం చేసుకున్నారు. మార్చిలో జరగనున్న పబ్లిక్ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేసేందుకు సమ్మెటీవ్–2 పరీక్షలు కీలకం.అంతటి ప్రాధాన్యమున్న ఈ పరీక్షల ప్రశ్నాపత్రాలు ఏ పాఠశాల నుంచి లీక్ అయ్యిందో తెలియాల్సి ఉంది. ప్రశ్నాపత్రాలు లీక్ ఘటనలు కష్టపడి చదువుకునే విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతాయని విద్యావంతులు, పిల్లల తల్లితండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రశ్నాప్రతాల లీకేజీపై విద్యాశాఖ ఉన్నతాధికారులు విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. దీనిపై డిప్యూటీ డీఈఓ సుమతిని వివరణ కోరగా పేపర్ లీక్ సమాచారం తనకు అంద లేదని, ఏదైనా జరిగి ఉంటే బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. -
బీటెక్ ప్రశ్నాపత్రం లైవ్లీగా ఉంటుందని..!
కాకినాడ: బీటెక్ కంప్యూటర్ సైన్స్ పరీక్షా పత్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సభ్యుల పేర్లు రావడం పొరపాటే అని జేఎన్టీయూ డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్ సుబ్బారావు ఒప్పుకున్నారు. ఇంత వరకు యూనివర్సిటీ పరిధిలో ఇలాంటి ఘటన జరగలేదని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ విషయంపై సబ్జెక్టు నిపుణులను వివరణ కోరగా.. పేపర్ లైవ్లీగా ఉంటుందని ఇలాంటి ప్రశ్నలు ఇచ్చినట్లు తెలిపారని సుబ్బారావు వెల్లడించారు. బీటెక్ కంప్యూటర్ సైన్స్ విభాగం విద్యార్థులకు సోమవారం నిర్వహించిన 'మేనేజేరియల్ ఎకనామిక్స్ అండ్ ఫైనాన్సియల్ ఎనాలిసిస్'(ఎమ్ఈఎఫ్ఏ) పరీక్షలో లోకేష్ బ్యాంక్, హెరిటేజ్ లిమిటెడ్, బ్రాహ్మణి లిమిటెడ్ అంటూ చంద్రబాబు కుటుంబ సభ్యుల పేర్లను అధికారులు ప్రశ్నపత్రంలో పేర్కొన్న విషయం తెలిసిందే. దీనిపై తీవ్ర విమర్శలు వ్యక్తమౌతున్న నేపథ్యంలో సుబ్బారావు పొరపాటు జరిగిందని తెలిపారు. -
ఇంజనీరింగ్ ప్రశ్నపత్రంలో 'వింత'
-
ఇంజనీరింగ్ ప్రశ్నాపత్రంలో 'వింత'
కాకినాడ: కాకినాడలోని జవహార్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం(జేఎన్టీయూ-కే) ఇంజనీరింగ్ విద్యార్థులకు వింత పరీక్ష ఎదురైంది. కంప్యూటర్ సైన్స్ విభాగంలో సెకండియర్ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్ రాస్తున్న విద్యార్థులు.. ప్రశ్నాపత్రంలో కనిపించిన అధికారుల 'చంద్రబాబు భజన'ను చూసి బిత్తరపోయారు. ఎక్కడా లేని లోకేష్ బ్యాంక్ ప్రశ్నాపత్రంలో కనిపించడంతో ముక్కున వేలేసుకున్నారు. సోమవారం జరిగిన మేనేజేరియల్ ఎకనామిక్స్ అండ్ ఫైనాన్సియల్ ఎనాలిసిస్(ఎమ్ఈఎఫ్ఏ) పరీక్ష ప్రశ్నాపత్రంలో జర్నల్ ఎంట్రీ రికార్డింగ్ విధానానికి సంబంధించి అడిగిన ఓ ప్రశ్నలో లోకేష్ బ్యాంక్, హెరిటేజ్ లిమిటెడ్, బ్రాహ్మణి లిమిటెడ్ అంటూ ప్రశ్నపత్రం తయారుచేసిన వారు చంద్రబాబు కుటుంబ పల్లవి అందుకున్నారు. దీంతో విద్యార్థులు ఒకింత గందరగోళానికి గురయ్యారు. అధికారులకు చంద్రబాబు కుటుంబమంటే ఎంత అనురాగమున్నా కీలకమైన ఇంజనీరింగ్ ఎగ్జామ్ ప్రశ్నపత్రంలో అది కనబడటం విమర్శలకు తావిస్తోంది. ఈ విషయంపై జేఎన్టీయూ వీసీ సంబంధిత విభాగం నుంచి వివరణ కోరినట్లు తెలుస్తోంది. అలాగే ప్రశ్నపత్రంలో అలాంటి ప్రశ్నలు ఉంచడం వెనుక ప్రత్యేకంగా ఎలాంటి ఉద్దేశం లేదని వివరణ ఇచ్చారు. ఇప్పటికే జేఎన్టీయూ-కేలో ఉన్నత స్థానాల్లో ఉన్న ప్రొఫెసర్లు 'తెలుగుదేశం' కుటుంబానికి చెందిన వారుగా విమర్శలు వస్తున్న నేపథ్యంలో తాజా ఘటన దానిని బలపరుస్తోంది. -
సమాధాన పత్రంతో ఇంటర్ విద్యార్థి జంప్
నరసరావుపేట : జూనియర్ ఇంటర్ పరీక్షకు హాజరై సమాధానపత్రం ఇవ్వకుండా వెళ్లిపోయిన విద్యార్థిపై విద్యాశాఖాధికారులు సోమవారం పోలీసులకు ఫిర్యాదుచేశారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఈ ఘటన జరిగింది. సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం స్థానిక ప్రైవేటు కళాశాలకు చెందిన మేళా నరేంద్ర అనే జూనియర్ ఇంటర్ విద్యార్థి ఎస్కేఆర్బీఆర్ జూనియర్ కళాశాలలో కెమిస్ట్రీ పరీక్షకు హాజరయ్యాడు. అయితే సమాధాన పత్రం ఇన్విజిలేటర్కు ఇవ్వకుండానే పరారయ్యాడని వివరించారు. -
ఎస్ఐ రాతపరీక్షకు సెట్ జి ప్రశ్నాపత్రం ఎంపిక
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం జరుతున్న సబ్ఇన్స్పెక్టర్ రాతపరీక్షకు సెట్ జి ప్రశ్నపత్రాన్ని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఎంపికచేసిందని అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 321 పరీక్ష కేంద్రాల్లో సబ్ఇన్స్పెక్టర్ రాత పరీక్ష జరుగనుంది. 568 ఎస్ఐ పోస్టులకుగాను రెండు లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ సివిల్ పరీక్ష, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ కమ్యూనికేషన్ పరీక్ష నిర్వహిస్తారు. ఎస్ఐ పరీక్షల్లో తొలిసారిగా బయోమెట్రిక్ విధానం అమలుచేస్తున్నారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష రాయడానికి అనుమతించేదిలేదని అధికారులు తెలిపారు. పరీక్షల కోసం హాజరయ్యే విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు అర్టీసీ అధికారులు తెలిపారు. -
వాట్సప్లో లీకైన పదోతరగతి ప్రశ్నపత్రం!
వాట్సప్ లో పదో తరగతి ప్రశ్నపత్రం చక్కర్లు కొడుతుందనే సమాచారంతో అప్రమత్తమైన విద్యాశాఖ అధికారులు పరీక్ష నిర్వాహణను కట్టుదిట్టం చేశారు. మహబూబ్నగర్ జిల్లా కొత్తకోటలో గురువారం పదో తరగతి హిందీ పరీక్ష జరుగుతుండగా.. పరీక్ష ప్రారంభమైన అర్ధ గంటలోనే ప్రశ్నపత్రం లీక్ అయిందని.. వాట్సప్లో చక్కర్లు కొడుతుందని వదంతులు మొదలయ్యాయి. దీంతో అప్రమత్తమైన విద్యాధికారులు పరీక్ష కేంద్రాల్లో భద్రతను పెంచడంతో.. పాటు నిర్వాహణను కట్టుదిట్టం చేశారు. అనంతరం జిల్లా విద్యాధికారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తే.. అలాంటిదేమి లేదని కొట్టిపారేశారు. -
ముగ్గురు విద్యార్థులకు ఒకటే ప్రశ్నపత్రం..!
బొబ్బిలి: వరుసగా ముగ్గురు విద్యార్థులు..వారిలో ఒకరి వద్దే ప్రశ్నపత్రం.. దానినే మిగిలిన విద్యార్థులు పంచుకోవడం..ఇదీ ప్రభుత్వ ఐటీఐలో బుధవారం కనిపించిన దృశ్యం.. సాంకేతిక విద్యాశాఖ పరీక్షల నిర్వహణకు తగినన్ని నిధులు కేటాయించకపోవడంతో పరీక్షకు హాజరైన ప్రతి విద్యార్థికీ ప్రశ్నపత్రం అందని పరిస్థితి ఏర్పడింది. బొబ్బిలి ప్రభుత్వ ఐటీఐలో రెండో సంవ త్సరం విద్యార్థులకు బుధవారం నుంచి ప్రాక్టికల్స్ ప్రారంభమయ్యాయి.. ఈ ప్రాక్టికల్స్కు సంబంధించిన ప్రశ్నపత్రాన్ని ఆన్లైన్లో ఆ శాఖ ప్రతిరోజూ పంపుతుంది. బుధవారం ఆన్లైన్ కష్టాల వల్ల మధ్యాహ్నం 12 గంటల వరకు ఆన్లైన్లో ప్రశ్నపత్రం రాలేదు. ఆ తరువాత వచ్చాక సరిపడినన్ని జిరాక్స్లు తీయకపోవడంతో ఉన్నవే విద్యార్థులకు సర్దారు. దాంతో ఒక పేపరును ముగ్గురు విద్యార్థులు పంచుకోవాల్సి వచ్చింది. అలాగే ఈ పరీక్షల్లో కూడా మాస్ కాపీయింగ్కు విద్యార్థులు సిద్ధమయ్యారు. ఒకరు రాసుకున్న తరువాత మరొకరికి ఇచ్చే విధంగా విద్యార్థులు ప్లాన్లు వేసుకున్నారు.. ప్రశ్నపత్రాలు చేతిలో ఉన్నా జవాబు పత్రాలపై పెన్ను కదలకుండా చూచిరాతకు సిద్ధమయ్యారు. అలాగే పరీక్షా కేంద్రంలో కూడా విద్యార్థులను నేలపైనే అత్యంత సమీపంగా కూర్చోబెట్టి నిర్వాహకులు కూడా విద్యార్థులకు సహకరించారు. ఆఖరి నిమిషంలో పరీక్షకు ప్రైవేటు విద్యార్థులు బొబ్బిలి శ్రీనివాస ప్రైవేటు ఐటీఐ విద్యార్థులు ఆఖరి నిమిషంలో ప్రభుత్వం ఐటీఐలో ప్రాక్టికల్స్ చేయడానికి వచ్చారు. రాతపూర్వకంగా ఆదేశాలను ఆ శాఖ ఇవ్వకపోగా మౌళిక ఆదేశాలను జారీ చేసి వారికి ప్రాక్టికల్స్ జరపాలని సూచించారు. బుధవారం దాదాపు 250 మంది వరకూ అన్ని ట్రేడుల విద్యార్థులకు ప్రాక్టికల్స్ నిర్వహించారు. వీటి పర్యవేక్షణకు విశాఖ ఎన్ఎస్టీఎల్ ప్రిన్సిపాల్ బి అప్పారావు, గ్రోత్సెంటరు ఏఈ గోపీనాయుడు, విశాఖ స్టీల్ప్లాంటు సీనియర్ ఏజీఎం శ్రీనివాసరావు, స్వామి పాలిటెక్నిక్ కళాశాల లెక్చరర్ దివ్య, స్థానిక ప్రిన్సిపాల్ ప్రకాశంలు పర్యవేక్షించారు. -
క్వశ్చన్ పేపర్ అలా లీకైంది..
వేసవి తీవ్రత అప్పుడే పెరుగుతోంది. అసలే విశాఖపట్నం, సముద్రపు గాలికి ఉక్కపోత విపరీతంగా ఉంది. మధ్యాహ్నం వేళ బయట ఎండ ప్రచండంగా ఉంది. ఇళ్లల్లోని పెద్దలందరూ శుభ్రంగా భోజనాలు ముగించుకుని, కునుకుతీసే వేళ. పిల్లలందరూ ఆటపాటల్లో మునిగిపోయే వేళ. అలాంటి మండువేసవి మధ్యాహ్నం పూట ఆ కుర్రాళ్లందరూ పుస్తకాలతో కుస్తీపడుతున్నారు. మెట్రిక్యులేషన్ పరీక్షలు మొదలై అప్పటికి రెండు రోజులైంది. అదో కలిగిన వారి ఇల్లు. ఆ ఇంటివారి అబ్బాయి కూడా మెట్రిక్ పరీక్షలు రాస్తున్నాడు. అతడి క్లాస్మేట్స్ అంతా వాళ్ల ఇంట్లో చేరి కంబైన్డ్ స్టడీస్ సాగిస్తున్నారు. పది మందికి పైనే ఉంటారు వాళ్లు. ఒక్కొక్కళ్లదీ ఒక్కో నేపథ్యం. ఈ పరీక్షలు గట్టెక్కితే చాలు, కలిగిన పిల్లలైతే కాలేజీ మెట్లెక్కుతారు. అంత స్తోమతలేని వాళ్లు అక్కడితో చదువుకు మంగళం పాడేసి, ఏ గుమస్తాగిరీతోనో బతుకుబండిని లాగడం మొదలెడతారు. ఏం చేయాలన్నా ఈ పరీక్షలు గట్టెక్కాలి కదా! కర్మకాలి పరీక్ష తప్పితే ఇంట్లో పెద్దలచేత తిట్లు, శాపనార్థాలు తప్పవు. ఇంకొందరికైతే బడితపూజ జరిగే అవకాశాలూ లేకపోలేదు. ఏడాదంతా ఎప్పటి పాఠాలను అప్పుడే చదువుకునే బుద్ధిమంతులైన కుర్రాళ్లు కాస్త భరోసాగానే ఉన్నారు. ఏడాదంతా బలాదూరుగా కాలక్షేపం తిరుగుళ్లన్నీ తిరిగి, పరీక్షల ముందు పుస్తకాల బూజు దులిపిన వాళ్లకే మర్నాడు రాబోయే ప్రశ్నపత్రాన్ని తలచుకుంటే దడతో ముచ్చెమటలు పట్టేస్తున్నాయి. మర్నాడే ఇంగ్లిష్ పరీక్ష. తేలిగ్గా మార్కులు కొట్టేసే అవకాశాలు చాలా తక్కువ. కుర్రాళ్లందరూ ఎవరి పద్ధతిలో వాళ్లు చదువుకుంటున్నారు. కొందరు మనసులోనే మననం చేసుకుంటున్నారు. మరికొందరు వినీ వినిపించనట్లు గొణుగుతూ చదువుకుంటున్నారు. కాస్త గొంతున్న కుర్రాళ్లు బిగ్గరగానే పాఠాలు వల్లె వేస్తున్నారు. మధ్య మధ్య కాస్త విరామం ఇచ్చి, మర్నాడు రాబోయే ప్రశ్నపత్రం ఎలా ఉంటుందనే దానిపై ఊహాగానాలు సాగిస్తున్నారు. ముఖ్యమైనవనుకున్న ప్రశ్నలకు సమాధానాలను శక్తి మేరకు బట్టీ పడుతున్నారు. అలాంటి సమయంలో చేతిలోని గొడుగు మడిచి చంకన పెట్టుకుని, చెమటలు తుడుచుకుంటూ ఆ ఇంటికి వచ్చాడతను. కాస్త విచిత్రమైన వేషధారణ. మోకాళ్లు దాటిన పంచె, కాస్త మాసిన లాల్చీ, భుజంపై నీరుకావి గావంచా, తలకు పాగా, చెవులకు సింహతలాటాలు.. ఆ ముసలతని అవతారం చూడగానే చెప్పేయవచ్చు ఒరియా మనిషని.. గుమ్మంలోకి నెమ్మదిగా అడుగుపెట్టాడు. ‘పెద్దాయన ఉన్నారా..?’ వసారాలో చదువుకుంటున్న పిల్లలను అడిగాడు. ‘నిద్రపోతున్నారు.. లేపమంటారా..?’ అన్నాడు ఆ ఇంటివారి అబ్బాయి. ‘వద్దు.. లేపొద్దు.. పెద్దాయన లేచే వరకు ఇక్కడే కూచుంటాలే..’ అంటూ వసారాలోనే ఉన్న కుర్చీలో కూలబడ్డాడు. శ్రద్ధగా చదువుకుంటున్న కుర్రాళ్లను ముచ్చటగా చూశాడు. ‘ఏరా పిల్లలూ..! పరీక్షలా..?’ ప్రశ్నించాడతడు. ‘ఔను తాతగారూ.. రెండ్రోజులుగా జరుగుతున్నాయి!’ ముక్తకంఠంతో బదులిచ్చారు కుర్రాళ్లంతా. ‘పరీక్షలు కష్టంగా ఉంటున్నాయా..?’ అడిగాడతను. ‘మెట్రిక్ పరీక్షలు కదా తాతగారూ..! కష్టంగానే ఉంటున్నాయి’ చెప్పారు వాళ్లు. ‘రేపేం పరీక్షరా పిల్లలూ..’ ఆరా తీశాడతను. ‘ఇంగ్లీషు తాతగారూ..!’ కాస్త దిగులుగా బదులిచ్చారు కుర్రాళ్లు. ‘రేపటి పరీక్షలో వచ్చే ప్రశ్నలన్నీ ఇప్పుడే మీకు తెలిసిపోతే ఏం చేస్తార్రా..?’ నవ్వుతూ అడిగాడతను. ‘అంతకంటే పండగ ఉంటుందా మాకు.. అయితే, అవి తెలిసే అవకాశమే లేదుగా..’ అన్నారు వాళ్లు. ‘నేనా ప్రశ్నలన్నీ చెప్పేయనా..?’ కవ్వింపుగా అన్నాడతను. ముసలతను ఏదో తమాషాకి అంటున్నాడనుకున్నారు ఆ కుర్రాళ్లు.. ‘అలాగైతే ఇప్పుడే చెప్పండి.. వాటి సమాధానాలన్నీ రాత్రిలోగా బట్టీ పట్టేస్తాం’ అంటూ వాళ్లలో కొందరు ముసలతని చుట్టూ మూగారు. ‘నాకు మీ ఇంగ్లిష్ తెలీదు.. అయినా చెబుతాను.. రాసుకోండి’ అన్నాడతను. ఏం చెబుతాడోననే కుతూహలంతో పిల్లలందరూ కాగితాలు, కలాలు తీసుకుని రాతకు సిద్ధమయ్యారు. కూడబలుక్కుంటూ ఒక్కొక్క ప్రశ్నే చెప్పాడతను. ఏ ప్రశ్న ఎన్ని మార్కులకో కూడా చెప్పాడు. అరగంట గడిచే సరికి మొత్తం ప్రశ్నపత్రం తయారైంది. ఇదేదో నమూనా ప్రశ్నపత్రం అనుకున్నారు ఆ కుర్రాళ్లు. అయితే, ఎందుకైనా మంచిదనుకొని ఆ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు బట్టీ పట్టారు. కాసేపటికి ఆ ఇంటి పెద్దాయన నిద్రలేచాడు. ఇంటికొచ్చిన ఒరియా పెద్దమనిషిని పలకరించాడు. ఇద్దరూ కాసేపు పిచ్చాపాటీ మాట్లాడుకున్నారు. చీకటిపడే వేళకు ఒరియా పెద్దమనిషి తిరుగుముఖం పట్టాడు. మర్నాడు పరీక్ష జరిగింది. ఆశ్చర్యకరంగా ముందురోజు మధ్యాహ్నం ఆ ఒరియా పెద్దమనిషి చెప్పిన ప్రశ్నలే వచ్చాయి.. ప్రశ్నలేనా..! ఇంటికొచ్చి ముందురోజు కాగితాల్లో రాసుకున్నవి చూసుకుంటే, మొత్తానికి ప్రశ్నపత్రమే యథాతథంగా ఉంది. కుర్రాళ్లందరూ సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోయారు. తమ అదృష్టానికి పొంగిపోయారు. ఆ కుర్రాళ్లకు ప్రశ్నపత్రాన్ని ముందురోజే చెప్పేసిన ఒరియా పెద్దమనిషి గంజాం జిల్లాలోని ధారాకోట్ సంస్థానంలో ఆస్థాన జ్యోతిషుడు. అతడి అసలు పేరేమిటో ఎవరికీ తెలియదు గానీ, అందరూ అతణ్ణి ‘సర్వజనా (అన్నీ తెలిసిన) పండితుడు’ అంటారు. అతడు కర్ణపిశాచి సాధకుడని ప్రతీతి. అతడి ద్వారా ముందురోజే ప్రశ్నపత్రం తెలుసుకొని పరీక్ష రాసిన కుర్రాళ్లలో ఒకరు కాలక్రమంలో ప్రొఫెసర్గా ఎదిగారు. - పన్యాల జగన్నాథదాసు -
ఉర్ధూ అభ్యర్ఠులకు షాక్ ఇచ్చిన పరీక్ష
-
ఆర్ఆర్సీ గ్రూప్-డి నమూనా ప్రశ్నపత్రం
ప్రశ్నల సంఖ్య: 100 గరిష్ఠ మార్కులు: 100 సమయం: 90 నిమిషాలు గమనిక: సమాధానం తప్పుగా గుర్తించిన ప్రతి ప్రశ్నకు 1/3 మార్కుల కోత విధిస్తారు. 1. {బిటన్ ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేసిన ఇనుము ఉక్కు కర్మాగారం ఏది? 1) భిలాయ్ 2) రూర్కెలా 3) దుర్గాపూర్ 4) బొకారో 2. శ్వేత విప్లవం వేటి ఉత్పత్తికి సంబంధించింది? 1) నూనె గింజలు 2) చేపలు 3) వ్యవసాయ ఉత్పత్తులు 4) పాలు 3. కన్హా జాతీయ పార్కు ఏ రాష్ట్ట్రంలో ఉంది? 1) జార్ఖండ్ 2) ఉత్తరప్రదేశ్ 3) మధ్యప్రదేశ్ 4) ఛత్తీస్గఢ్ 4. మన్నార్ సింధుశాఖ ఏ ప్రాంతాల మధ్య విస్తరించి ఉంది? 1) బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ 2) ఇండియా, శ్రీలంక 3) బంగ్లాదేశ్, అండమాన్ నికోబార్ దీవులు 4) ఇండియా, మాల్దీవులు 5. {పపంచవ్యాప్తంగా పగలు, రాత్రి సమానంగా ఉండే రోజు ఏది? 1) మార్చి 21 2) జూన్ 21 3) డిసెంబర్ 22 4) జూలై 4 6. బేరింగ్ జలసంధి ఏ రెండు ఖండాల మధ్య ఉంది? 1) ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా 2) ఉత్తర అమెరికా, ఆసియా 3) ఆఫ్రికా, ఐరోపా 4) ఆఫ్రికా, ఆసియా 7. ఏ ఓడరేవును ‘క్వీన్ ఆఫ్ అరేబియా’ అని పిలుస్తారు? 1) కాండ్ల 2) మార్మగోవా 3) ముంబై 4) కొచ్చిన్ 8. ఏ వాతావరణ పొరలో జెట్ విమానాలు ప్రయాణిస్తాయి? 1) ట్రోపో ఆవరణం 2) ఎక్సో ఆవరణం 3) స్ట్రాటో ఆవరణం 4) థర్మో ఆవరణం 9. రూర్ ఆఫ్ ఇండియా అని దేశంలోని ఏ ప్రాంతాన్ని పిలుస్తారు? 1) విదర్భ పీఠభూమి 2) మాల్వా పీఠభూమి 3) షిల్లాంగ్ పీఠభూమి 4) ఛోటానాగపూర్ పీఠభూమి 10. కిందివాటిలో అటవీ పరిశోధనా సంస్థ ఉన్న ప్రాంతం? 1) ఢిల్లీ 2) భోపాల్ 3) హైదరాబాద్ 4) డెహ్రాడూన్ 11. సాత్పురా, వింధ్య పర్వతాల మధ్య ప్రవహించే నది? 1) గోదావరి 2) గండక్ 3) తపతి 4) నర్మద 12. భారతదేశంలో అతి ప్రాచీనమైన చమురుశుద్ధి కర్మాగారం ఎక్కడ ఉంది? 1) హాల్దియా 2) దిగ్భాయ్ 3) బరౌనీ 4) కొచ్చిన్ 13. మోప్లాలు అంటే ఎవరు? 1) మధ్యప్రదేశ్లోని గిరిజనులు 2) అసోంలోని గిరిజనులు 3) కేరళలోని ముస్లింలు 4) పశ్చిమబెంగాల్లోని గిరిజనులు 14. 1952 జాతీయ అటవీ విధానం ప్రకారం భారత దేశ మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో సుమారుగా ఎంతశాతం అడవులు విస్తరించి ఉండాలి? 1) 33 2) 23 3) 20 4) 21 15. ఇంగ్లండ్లోని లండన్లో ఉదయం 5.30 గంటల సమయం అయితే భారత దేశంలోని అలహాబాద్లో ఎంత సమయం అవుతుంది? 1) సాయంత్రం 5.30 గంటలు 2) ఉదయం 11.00 గంటలు 3) రాత్రి 11.00 గంటలు 4) ఉదయం 10.00 గంటలు 16. కిందివాటిలో అత్యంత ప్రకాశవంతమైన గ్రహం ఏది? 1) శని 2) బుధుడు 3) శుక్రుడు 4) భూమి 17. ఒక వ్యాపారి రెండు కుర్చీలను ఒక్కొక్కటి రూ. 600లకు అమ్మడం వల్ల మొదటి దానిపై 20 శాతం లాభం, రెండోదానిపై 20 శాతం నష్టం వచ్చింది. మొత్తం మీద అతడికి ఎంతశాతం లాభం/ నష్టం వస్తుంది? 1) 4% లాభం 2) 4% నష్టం 3) 6% నష్టం 4) లాభం లేదు, నష్టం లేదు 18. 64 ק 4 – 2 ׳ 8 – 4 = ? 1) – 4 2) 8 3) 252 4) 5.33 19. అ, ఆల సరాసరి బరువు 50 కి.గ్రా. ఆ, ఇ ల సరాసరి బరువు 70 కి.గ్రా. ఇ, అల సరాసరి బరువు 60 కి.గ్రా. అయితే అ బరువు ఎంత? 1) 100 కి.గ్రా. 2) 80 కి.గ్రా. 3) 60 కి.గ్రా. 4) 40 కి.గ్రా. 20. 40 లీటర్ల మిశ్రమంలో పాలు, నీళ్లు 4 : 1 నిష్పత్తిలో ఉన్నాయి. ఈ మిశ్రమానికి ఎన్ని లీటర్ల నీటిని కలిపితే పాలు, నీటి నిష్పత్తి 2 : 1 అవుతుంది? 1) 4 లీ. 2) 6 లీ. 3) 8 లీ. 4) 12 లీ. 21. ఒక పండ్ల వ్యాపారి 60 ఆపిల్ పండ్లను రూ. 600కు కొన్నాడు. అందులో 20 శాతం పండ్లు పాడయ్యాయి. మంచిగా ఉన్న పండ్లను ఒక్కొక్కటి రూ. 15 చొప్పున, చెడిపోయిన పండ్లను ఒక్కొక్కటి రూ.5 చొప్పున అమ్మితే అతడికి ఎంత శాతం లాభం వస్తుంది? 1) 10% 2) 20% 3) 30% 4) 36% 22. బారువడ్డీ ప్రకారం సంవత్సరానికి 12 శాతం వడ్డీరేటు చొప్పున రూ. 600 అసలు ఎన్నేళ్లలో రూ. 960ల మొత్తం అవుతుంది? 1) 5 2) 4 3) 3 4) 2 23. 250 మీ., 350 మీ. పొడవున్న రెండు రైళ్లు వరుసగా 85 కి.మీ./గంట, 95 కి.మీ./ గంట వేగాలతో వ్యతిరేక దిశలో ప్రయాణిస్తున్నాయి. అవి ఒకదాన్ని మరొకటి ఎంత సమయంలో దాటుతాయి? 1) 6.66 సె. 2) 12 సె. 3) 15 సె. 4) ఏదీకాదు 24. అ ఒక వ్యాపారాన్ని రూ. 12,000ల పెట్టుబడితో ప్రారంభించాడు. 4 నెలల తర్వాత రూ. 20,000ల పెట్టుబడితో ఆ ఆ వ్యాపారంలో చేరాడు. సంవత్సరం చివరన వారికి రూ. 38,000 లాభం వస్తే, అందులో అ వాటా ఎంత? 1) రూ. 12,000 2) రూ. 18,000 3) రూ. 20,000 4) రూ. 24,000 25. 20 మంది వ్యక్తులు రోజుకు 8 గంటల చొప్పున పనిచేస్తే 60 పనులను 18 రోజుల్లో పూర్తి చేయగలుగుతారు. 16 మంది వ్యక్తులు రోజుకు 12 గంటల చొప్పున పనిచేస్తే 60 పనులను ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? 1) 15 రోజులు 2) 7 1/2 రోజులు 3) 9 రోజులు 4) 12 రోజులు 27. ఒక యంత్రం ప్రస్తుత విలువ రూ. 40,000. ఆ యంత్రం ఏటా దాని విలువలో 10 శాతం కోల్పోతే, రెండు సంవత్సరాల తర్వాత దాని విలువ ఎంత ఉంటుంది? 1) రూ. 32,000 2) రూ. 32,400 3) రూ. 34,000 4) ఏదీకాదు 28. 20 గాజు గ్లాసులు ఉన్న ఒక పెట్టె కింద పడటం వల్ల కొన్ని గ్లాసులు పగిలాయి. మరికొన్ని మంచిగా ఉన్నాయి. పగిలిన గ్లాసులు, పగలని గ్లాసుల నిష్పత్తి కిందివాటిలో ఏది కాకపోవచ్చు? 1) 1 : 2 2) 1 : 4 3) 3 : 7 4) 4 : 5 29. రెండు సంఖ్యల క.సా.గు. 200. వాటి గ.సా.భా. 5. వాటిలో ఒక సంఖ్య 25 అయితే రెండో సంఖ్య ఏది? 1) 25 2) 35 3) 40 4) 45 31. రూ. 25,000లకు సంవత్సరానికి 20 శాతం వడ్డీరేటు చొప్పున రెండేళ్లకు ఎంత చక్రవడ్డీ అవుతుంది? 1) రూ. 11,000 2) రూ. 12,000 3) రూ. 16,000 4) రూ. 36,000 32. ఒక వ్యక్తి 25 మీ/సె. వేగంతో ప్రయాణిస్తూ, 4 గంటల్లో గమ్యం చేరుకున్నాడు. అతడు ప్రయాణించిన దూరం ఎంత? 1) 100 కి.మీ. 2) 360 కి.మీ. 3) 520 కి.మీ. 4) చెప్పలేం 33. ఒక తరగతిలోని 30 మంది విద్యార్థుల సరాసరి వయసు 15 సంవత్సరాలు. టీచర్ వయసును కూడా కలిపితే సరాసరి ఒక సంవత్సరం పెరుగుతుంది. అయితే టీచర్ వయసు ఎంత? 1) 30 ఏళ్లు 2) 36 ఏళ్లు 3) 45 ఏళ్లు 4) 46 ఏళ్లు 34. 4, 6, 10, 18, 34, 66, ? 1) 102 2) 124 3) 130 4) 132 35. అ ఒక పనిలో మూడో వంతును ఆరు రోజుల్లో పూర్తి చేస్తే మిగిలిన పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలుగుతాడు? 1) 6 2) 12 3) 18 4) 24 36. అ, ఆలు ఇద్దరూ కలిసి వరుసగా రూ. 22,000, రూ. 34,000ల పెట్టుబడులతో వ్యాపారాన్ని ప్రారంభించారు. సంవత్సరం చివరన రూ.11,200 లాభం వస్తే అందులో ’అ’ వాటా ఎంత? 1) రూ.4400 2) రూ. 6800 3) రూ. 7200 4) రూ. 7600 37. Pride fruit of India అని దేన్ని పిలుస్తారు? 1) చింత 2) మామిడి 3) టమాటా 4) ఉసిరి 38. మానవ మెదడులో ఉష్ణోగ్రతను నియంత్రించే భాగం ఏది? 1) మెడుల్లా 2) సెరిబెల్లం 3) హైపోథాలమస్ 4) పైవన్నీ 39. బియ్యాన్ని ఎక్కువగా పాలిష్ చేస్తే కోల్పోయే విటమిన్ ఏది? 1) ఆ1 2) ఆ12 3) ఉ 4) అ 40. కిందివాటిలో మూత్రపిండాలు సరిగా పనిచేయకుంటే చేసే ప్రక్రియ (చికిత్స)ఏది? 1) డయాలసిస్ 2) అటోప్సి 3) బయాప్సీ 4) కీమోథెరపీ 41. క్యాన్సర్ గురించి చేసే అధ్యయనాన్ని ఏమంటారు? 1) ఆర్నిథాలజీ 2) పాథాలజీ 3) జీరంటాలజీ 4) ఆంకాలజీ 42. చేపల్లో లభించే విటమిన్లేవి? 1) A, K 2) A, E -3) A, D 4) K, E 43. కిందివాటిలో రక్తానికి సంబంధించని వ్యాధి? 1) లుకేమియా 2) క్షయ 3) మలేరియా 4) డయాబెటిస్ 44. తాజ్మహల్ బీటలు వారడానికి కారణమైన వాయువు ఏది? 1) CO2 2) CFC 3) SO2 4) CO 45. కిందివాటిలో చర్మ వ్యాధి కానిది? 1) ఎక్జిమా 2) సోరియాసిస్ 3) క్షయ 4) ఎఖిని 46. పొడి విత్తనాల్లో సాధారణంగా ఉండాల్సిన నీటి శాతం? 1) 10% 2) 13% 3) 9% 4) 1% 47. ఐఇఖఐఅఖీ ఏ రాష్ట్రంలో ఉంది? 1) తెలంగాణ 2) కర్ణాటక 3) తమిళనాడు 4) బీహార్ 48. 2014 మ్యాన్ బుకర్ ప్రైజ్ ఏ దేశ రచయితకు లభించింది? 1) ఇంగ్లండ్ 2) న్యూజిలాండ్ 3) భారత్ 4) ఆస్ట్రేలియా 49. {పధానమంత్రి జన్ధన్ యోజన కార్యక్ర మాన్ని 2014లో ఏ తేదీన ప్రారంభిం చారు? 1) ఆగస్ట్ - 15 2) అక్టోబర్ - 2 3) ఆగస్ట్ - 28 4) సెప్టెంబర్ - 24 50. ఆస్కార్ అవార్డు పొందిన తొలి భారతీయ వ్యక్తి? 1) ఎ.ఆర్. రెహ్మాన్ 2) గుల్జార్ 3) భాను అథయా 4) సత్యజిత్ రే 51. అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతిని ఎప్పటి నుంచి ప్రదానం చేస్తున్నారు? 1) 1901 2) 1959 3) 1969 4) 1949 52. 2014 యూత్ ఒలింపిక్ క్రీడలను ఏ నగ రంలో నిర్వహించారు? 1) ఇంచియాన్ 2) బీజింగ్ 3) హనోయ్ 4) నాన్జింగ్ 53. అమెజాన్ సంస్థ సహ వ్యవస్థాపకుడెవరు? 1) మార్క జుకర్బర్ 2) బిల్గేట్స్ 3) లారీ ఎలిసన్ 4) జెఫ్ బెజోస్ 54. కిందివాటిలో ఏ క్రీడలో ఆటగాళ్ల సంఖ్య 11? 1) వాలీబాల్ 2) బాస్కెట్ బాల్ 3) ఫుట్బాల్ 4) ఏదీకాదు 55. {పపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటివో)ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 1) 1945 2) 1985 3) 2001 4) 1995 56. జాతీయ గీతాన్ని తొలిసారిగా 1911లో ఏ నగరంలో నిర్వహించిన జాతీయ కాంగ్రెస్ వార్షిక సమావేశంలో ఆలపించారు? 1) లాహోర్ 2) కలకత్తా 3) సూరత్ 4) నాగ్పూర్ 57. కిందివాటిలో అణు జలాంతర్గామి ఏది? 1) ఐఎన్ఎస్ చక్ర 2) ఐఎన్ఎస్ విరాట్ 3) ఐఎన్ఎస్ విక్రాంత్ 4) ఐఎన్ఎస్ సింధు రక్షక్ 58. ఎం.చిన్నస్వామి స్టేడియం ఏ నగరంలో ఉంది? 1) చెన్నై 2) బెంగళూరు 3) కాన్పూర్ 4) కోల్కతా 59. గుజరాత్ రాష్ట్రంలోని అణు విద్యుత్ కేంద్రం ఏది? 1) కైగా 2) రావత్ భట్టా 3) కాక్రపార్ 4) నరోరా 60. ‘గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ’ పుస్తక రచయిత ఎవరు? 1) మహాత్మాగాంధీ 2) జవహర్ లాల్ నెహ్రూ 3) దాదాబాయ్ నౌరోజీ 4) ఎస్. రాధాకృష్ణన్ 61. జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ (ఎన్ఐ ఆర్డీ) ఏ నగరంలో ఉంది? 1) న్యూఢిల్లీ 2) లక్నో 3) హైదరాబాద్ 4) పుణే 62. {పాజెక్ట్ టైగర్ కార్యక్రమాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 1) 1963 2) 1973 3) 1983 4) ఏదీకాదు 63. {పపంచ ఓజోన్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? 1) సెప్టెంబర్ - 8 2) సెప్టెంబర్ - 16 3) అక్టోబర్ - 8 4) అక్టోబర్ - 16 64. {పస్తుత జాతీయ భద్రతా సలహాదారు ఎవరు? 1) అజిత్ దోవల్ 2) శివశంకర్ మీనన్ 3) రాజీవ్ త్రివేది 4) ఎ.పి. సింగ్ 65. గాజు పలక మందాన్ని, తీగ వ్యాసాన్ని కనుగొనేందుకు ఉపయోగించే పరికరం? 1) స్పెరా మీటర్ 2) వెర్నియర్ కాలిపర్స 3) స్క్రూగేజీ 4) స్కేలు 66. కాంతి ఉద్దీపన తీవ్రతకు S.I ప్రమాణం? 1) ఆంపియర్ 2) కెల్విన్ 3) ఓమ్ 4) కాండెలా 67. కిందివాటిలో సదిశ రాశి కానిది? 1) ఉష్ణోగ్రత 2) స్థానభ్రంశం 3) వేగం 4) బలం 68. న్యూటన్ మూడో గమన సూత్రంపై ఆధారపడి కదిలే వాహనం? 1) విమానం 2) హెలికాప్టర్ 3) జెట్ విమానం 4) రైలు 69. రోడ్డు రోలర్ ఏ స్థితిలో ఉంటుంది? 1) స్థిర నిశ్చలస్థితి 2) అస్థిర నిశ్చల స్థితి 3) తటస్థ నిశ్చల స్థితి 4) ఏదీకాదు 70. విమానాల్లో ఎత్తు కొలవడానికి ఉపయో గించే పరికరం? 1) బారో మీటర్ 2) ఆల్టీమీటర్ 3) హైగ్రోమీటర్ 4) హైడ్రోమీటర్ 71. థర్మామీటర్లో ఉపయోగించే లోహం? 1) పాదరసం 2) కాపర్ 3) బ్రోమిన్ 4) ఐరన్ 72. అనుధైర్ఘ్య తరంగాలకు ఉదాహరణ? 1) నీటి తరంగాలు 2) కాంతి తరంగాలు 3) ధ్వని తరంగాలు 4) తీగలో ఏర్పడే తరంగాలు 73. కిందివాటిలో వాయు వాయిద్యానికి ఉదాహరణ? 1) సితార్ 2) బుల్ - బుల్ 3) వీణ 4) క్లారినెట్ 74. మోటార్ వాహనాల హెడ్లైట్స్లో ఉపయో గించే దర్పణం? 1) కుంభాకార 2) పుటాకార 3) సమతల 4) వాలు 75. రసాయనాల రాజు అని దేన్నంటారు? 1) HCL 2) H2SO4 3) H3PO4 4)HNO3 76. ఎలుకలను చంపేందుకు ఉపయోగించే మందులో వాడేది? 1) ఎర్ర భాస్వరం 2) సల్ఫర్ 3) తెల్ల భాస్వరం 4) క్లోరిన్ 77. CCL3NO2ని ఏమంటారు? 1) క్లోరోఫామ్ 2) టియర్ గ్యాస్ 3) పాస్జీన్ 4) బ్లీచింగ్ పౌడర్ 78. క్షార గుణం ఉన్న మానవ శరీర ద్రవం? 1) జఠర రసం 2) మూత్రం 3) లాలాజలం 4) రక్తం 79. కిందివాటిలో అత్యంత శ్రేష్టమైన బొగ్గు? 1) ఆంథ్రసైట్ 2) బిట్యూమినస్ 3) లిగ్నైట్ 4) పీట్ 80. కిందివాటిలో మిశ్రమ ఎరువు? 1) DAP 2) MAP 3) KCl 4) నైట్రోఫాస్క్ 81. కిందివాటిలో ఉత్పతనం చెందే పదార్థం? 1) కర్పూరం 2) అయోడిన్ 3) NH4Cl 4) పైవన్నీ 82. ఢిల్లీలో కుతుబ్మినార్కు సమీపంలో ఉన్న ఉక్కు స్తంభాన్ని నిర్మించింది ఎవరు? 1) ఢిల్లీ సుల్తానులు 2) మొగల్ రాజులు 3) గుప్తులు 4) అశోకుడు 83. {పజలు ‘బలి’ అనే పన్నును మొదటిసారిగా ఏ కాలంలో చెల్లించారు? 1) హరప్పా నాగరికత 2) ఆర్య నాగరికత 3) క్రీ.పూ. 6వ శతాబ్దంలో 4) మౌర్యుల కాలంలో 84. పంటలు బాగా పండటానికి సౌకర్యాలు కల్పించి, ఎక్కువ దిగుబడి ద్వారా రాబడి పెంచడానికి ప్రయత్నాలు చేసినవారు? 1) మహ్మద్బిన్ తుగ్లక్ 2) అల్లావుద్దీన్ ఖిల్జీ 3) అక్బర్ 4) శివాజీ 85. ప్లాసీ యుద్ధం జరిగిన సంవత్సరం? 1) 1757 2) 1761 3) 1765 4) 1752 86. ‘ఖిలాఫత్ దినం’గా పాటించిన రోజు? 1) 1919 అక్టోబరు 17 2) 1919 అక్టోబరు 2 3) 1919 నవంబరు 21 4) 1919 నవంబరు 14 87. {పజలకు జీవించే హక్కును కల్పించిన రాజ్యాంగ అధికరణ? 1) 14వ అధికరణ 2) 16వ అధికరణ 3) 21వ అధికరణ 4) 32వ అధికరణ 88. UNICEF పూర్తి రూపం? 1) యునెటైడ్ నేషన్స ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెంట్రల్ ఎడ్యుకేషన్ ఫోరమ్ 2) యునెటైడ్ నేషన్స ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స ఆన్ ఎడ్యుకేషన్ అండ్ ఫెడరేషన్ 3) యునెటైడ్ నేషన్స ఇన్స్టిట్యూట్ అండ్ కౌన్సిల్ ఆన్ ఫోరమ్ ఫర్ ఎడ్యుకేషన్ 4) యునెటైడ్ నేషన్స ఇంటర్నేషనల్ చిల్డ్రన్స ఎమర్జెన్సీ ఫండ్ 89. కేంద్ర - రాష్ట్రాల మధ్య అధికార విభజనను రాజ్యాంగంలోని ఎన్నో షెడ్యూల్ తెలియజేస్తోంది? 1) 7 2) 8 3) 9 4) 10 90. 163వ రాజ్యాంగ అధికరణం ఎవరి గురించి తెలియజేస్తుంది? 1) గవర్నర్ 2) ముఖ్యమంత్రి 3) అడ్వకేట్ జనరల్ 4) రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ 91. కేంద్రంలో రాజ్యసభ ఏ సంవత్సరంలో ఏర్పడింది? 1) 1947 2) 1948 3) 1950 4) 1951 92. కిందివారిలో గ్రామసభలో సభ్యులెవరు? 1) 18 ఏళ్లు నిండిన గ్రామంలోని {పతి వ్యక్తి 2) ఓటర్ జాబితాలో ఉన్నవారు 3) పంచాయతీ వార్డు సభ్యులు, గ్రామ కార్యదర్శి, అధ్యక్షుడు (సర్పంచ్) 4) పైవారందరూ 93. జిల్లా కలెక్టర్కు జీతభత్యాలను ఎవరు చెల్లిస్తారు? 1) రాష్ట్ర ప్రభుత్వం 2) కేంద్ర ప్రభుత్వం 3) గవర్నర్ 4) రాష్ట్రపతి 94. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ‘విటో అధికారం’ ఉన్న దేశం? 1) జర్మనీ 2) ఫ్రాన్స 3) జపాన్ 4) ఏదీకాదు 95. కిందివాటిలో కేంద్రం వసూలు చేసే ప్రత్యక్ష పన్ను? 1) కస్టమ్స్ ట్యాక్స్ 2) ఎక్సైజ్ ట్యాక్స్ 3) కార్పొరేషన్ ట్యాక్స్ 4) సేల్స్ ట్యాక్స్ 96. ఆర్థిక సంఘం ప్రస్తుత చైర్మన్? 1) రంగరాజన్ 2) విజయ్ కేల్కర్ 3) రఘురామ్ రాజన్ 4) వేణుగోపాల్ రెడ్డి 97. జాతీయ పనికి ఆహార పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 1) 2001 2) 2002 3) 2004 4) 2005 98. 2011 జనాభా లెక్కల ప్రకారం గత దశాబ్దంలో (2001-11) జనాభా వృద్ధిరేటు ఎంత? 1) 17.7% 2) 16.8% 3) 16.54% 4) 17.46% 99. {Oపెవేట్ బ్యాంక్ల స్థాపనకు అనుమతులిచ్చే అధికారం ఎవరికి ఉంది? 1) రాష్ట్రపతి 2) కేంద్ర ప్రభుత్వం 3) రిజర్వ బ్యాంక్ ఆఫ్ ఇండియా 4) ఆర్థిక సంఘం చైర్మన్ 100. ‘మనీ లాండరింగ్’ అంటే? 1) {పభుత్వ అనుమతి లేకుండా డబ్బును ఇతర దేశాల్లో దాచుకోవడం 2) నల్లధనాన్ని అక్రమ పద్ధతుల్లో తెల్లధనంగా మార్చుకోవడం 3) అక్రమంగా సంపాదించిన ధనాన్ని ప్రభుత్వానికి పన్నులు చెల్లించడం ద్వారా చెలామణిలోకి తేవడం 4) చట్ట వ్యతిరేకంగా డబ్బును అప్పులకు ఇవ్వడం సమాధానాలు 1) 3; 2) 4; 3) 3; 4) 2; 5) 1; 6) 2; 7) 4; 8) 3; 9) 4; 10) 4; 11) 4; 12) 2; 13) 3; 14) 1; 15) 2; 16) 3; 17) 2; 18) 1; 19) 4; 20) 3; 21) 3; 22) 1; 23) 2; 24) 2; 25) 1; 26) 3; 27) 2; 28) 4; 29) 3; 30) 3; 31) 1; 32) 2; 33) 4; 34) 3; 35) 2; 36) 1; 37) 2; 38) 3; 39) 1; 40) 1; 41) 4; 42) 3; 43) 2; 44) 3; 45) 3; 46) 2; 47) 1; 48) 4; 49) 3; 50) 3; 51) 3; 52) 4; 53) 4; 54) 3; 55) 4; 56) 2; 57) 1; 58) 2; 59) 3; 60) 2; 61) 3; 62) 2; 63) 2; 64) 1; 65) 3; 66) 4; 67) 1; 68) 3; 69) 3; 70) 2; 71) 1; 72) 3; 73) 4; 74) 2; 75) 2; 76) 3; 77) 2; 78) 4; 79) 1; 80) 4; 81) 4; 82) 3; 83) 2; 84) 1; 85) 1; 86) 1; 87) 3; 88) 4; 89) 1; 90) 2; 91) 4; 92) 2; 93) 1; 94) 2; 95) 3; 96) 4; 97) 3; 98) 1; 99) 3; 100) 1. -
పీజీ ఎంట్రెన్స్ స్కాం నిందితులకు రిమాండ్
విజయవాడ : విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పీజీ ఎంట్రన్స్ కుంభకోణంలో మరో పదకొండు మంది నిందితులను సీఐడీ అధికారులు మంగళవారం మూడవ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ జయకుమార్ ఎదుట హాజరుపరిచారు. అనంతరం వారిని ఈ నెల 21వరకు రిమాండ్కు తరలించారు. వారిలో 7వ ర్యాంకర్ పాముబయటి భరత్ కుమార్, 14వ ర్యాంకర్ చిగురుపాటి రామరావు, 15వ ర్యాంకర్ చిలకల సాయి ప్రణీత్, 26 వ ర్యాంకర్ కోవెలకారు రమణ ఉన్నారు. ఈ కుంభకోణంలో యూనివర్శిటి సిబ్బందిపై సైతం ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చివరకు పరీక్ష రద్దు అయ్యేదాకా వెళ్లింది. మొత్తంమీద ఈ కుంభకోణానికి సంబంధించి 20 మంది నిందితులను సిఐడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
లోదుస్తుల్లో దాచి తెచ్చారు!
ప్రశ్నపత్రం చేజిక్కించుకుని తీసుకువచ్చింది షాలిమార్ ఔట్సోర్సింగ్ ఏజెన్సీ ఉద్యోగి నాటి కొమెడ్ లీక్ సూత్రధారికి డ్రైవరే నేడు కీలక నిందితుడు పీజీ మెడిసిన్ ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రం లీకులో కీలక ఆధారాలు సాక్షి, హైదరాబాద్: విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం నిర్వహించిన పీజీ మెడిసిన్ ఎంట్రన్స్ టెస్ట్ (పీజీఎంఈటీ-2014) ప్రశ్నపత్రం లీక్ కేసు దర్యాప్తులో రాష్ట్ర నేర పరిశోధన విభాగం (సీఐడీ) పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. ఈ పరీక్ష పేపర్ను ఓ ఔట్సోర్సింగ్ ఏజెన్సీకి చెందిన ఉద్యోగి లోదుస్తుల్లో పెట్టుకుని ప్రింటింగ్ ప్రెస్ నుంచి బయటకు తెచ్చినట్లు వెల్లడైంది. ఈ కీలక సూత్రధారులతో పాటు మొత్తం పది మందికి పైగా నిందితుల్ని అదుపులోకి తీసుకున్న సీఐడీ పోలీసులు సోమవారం విజయవాడలోని న్యాయస్థానంలో హాజరుపరచనున్నారు. దాదాపు రెండుమూడేళ్ల కిందట కర్ణాటక రాష్ట్రం నిర్వహించిన కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ‘కొమెడ్ కే’ ప్రశ్నపత్రం లీక్ అయింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఓ వ్యక్తి డ్రైవరే ప్రస్తుతం జరిగిన పీజీఎంఈటీ-2014 ప్రశ్నపత్రం లీకేజీలో సూత్రధారిగా వ్యవహరించాడు. అప్పట్లో ఆ సూత్రధారికి డ్రైవర్గా వ్యవహరించడంతో ప్రశ్నపత్రం ఎక్కడ నుంచి, ఎలా లీక్ చేయవచ్చనే అంశాలపై ఇతడికి మంచి అవగాహన కలిగింది. ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం పీజీఎంఈటీ-2014 ప్రశ్నపత్రాల ముద్రణ బాధ్యతల్ని కర్ణాటకలోని మణిపాల్లో ఉన్న ప్రభుత్వ ముద్రణాలయానికి అప్పగించింది. ఇదే ప్రెస్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్ష పత్రాలు సైతం ముద్రితమౌతాయి. పీజీఎంఈటీ ప్రశ్నపత్రాలు సైతం ఇక్కడే ముద్రితమౌతాయని తెలుసుకున్న సదరు డ్రైవర్ లీకేజ్ కోసం అనేక మార్గాలను అన్వేషించాడు. ఈ ప్రెస్కు క్లీనింగ్, స్వీపింగ్ వంటి పనులను మణిపాల్కే చెందిన షాలిమార్ ఔట్సోర్సింగ్ ఏజెన్సీ ‘షాలిమార్’ సంస్థ నిర్వహిస్తోంది. ఇందులో పని చేసే ఓ వ్యక్తిని ట్రాప్ చేసిన సదరు డ్రైవర్ భారీ మొత్తం ఆశచూపి తనకు పీజీఎంఈటీ ప్రశ్నపత్రం కావాలంటూ ఎర వేశాడు. ఇందుకు సదరు ఉద్యోగి అంగీకరించాడు. సీసీ కెమెరాలు లేకపోవడంతో...: మణిపాల్లోని సదరు ప్రింటింగ్ ప్రెస్లో ప్రశ్నపత్రాల ముద్రణకు ఇప్పటికీ చేతితో తిప్పే ఫ్రాంక్లిన్ మిషన్ను వాడుతున్నారు. ఇందులో పక్కాగా ప్రింట్ అయిన ప్రశ్నపత్రాలు ఓ పక్క, కొన్ని ప్రింటింగ్ తప్పులతో ముద్రితమైన ప్రశ్నపత్రాలు మరోపక్క పడేస్తారు. పక్కాగా ప్రింట్ అయిన ప్రశ్నపత్రాలు పడే వైపు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసిన ప్రింటింగ్ ప్రెస్ యాజమాన్యం మరోపక్క వాటిని ఏర్పాటు చేయలేదు. దీన్ని అనుకూలంగా మార్చుకున్న సదరు నాలుగో తరగతి కార్మికుడు ఓ ప్రశ్నపత్రాన్ని చేజిక్కించుకున్నాడు. దీన్ని సెక్యూరిటీ తనిఖీల్లోనూ బయటపడకుండా ఉండేందుకు లోదుస్తుల్లో పెట్టుకుని బయటకు తీసుకువచ్చి, డ్రైవర్కు ఇచ్చాడు. దాదాపు 10 నుంచి 20 తప్పులతో కూడిన ప్రశ్నపత్రాన్ని ఇలా చేజిక్కించుకున్న డ్రైవర్ దాన్ని మంగుళూరుకు చెందిన ఓ వ్యక్తికి అందించాడు. అతడు ఆ ప్రశ్నపత్రాన్ని జిరాక్సు ప్రతులుగా మార్చి హైదరాబాద్లో కన్సల్టెన్సీ నిర్వహిస్తున్న మునీశ్వర్రెడ్డితో పాటు మరికొందరికీ అప్పగించాడు. వైద్యుడి పర్యవేక్షణలో క్లాసులు... మునీశ్వర్రెడ్డికి చెందిన ఏజెన్సీతో పాటు మరికొందరూ మాస్ కాపీయింగ్ ద్వారా పరీక్ష రాయడానికి అంగీకరించిన వైద్య విద్యార్థులతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. హైదరాబాద్కు చెందిన ఓ వైద్యుడి పర్యవేక్షణలో ప్రతి ప్రశ్నకు జవాబులు తయారు చేయించి ‘అభ్యర్థులకు’ నగరంతో పాటు బెంగళూరు, గోవా, ముంబైల్లో ప్రత్యేక ‘శిక్షణా తరగతులు’ నిర్వహించారు. ఈ విషయాలు వెలుగులోకి రావడంతో సీఐడీ అధికారులు గతంలో కొమెడ్ కే ప్రశ్నపత్రం లీకేజ్ కేసులో సూత్రధారిగా ఉన్న వ్యక్తితో పాటు మరికొందరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. నేరంలో పాత్ర ఉందని తేలడంతో పది మందికి పైగా నిందితుల్ని ఆదివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. వీరిలో స్కామ్లో సూత్ర, పాత్రధారులతో పాటు ర్యాంకర్లు ఉన్నారు. వీరిని సోమవారం విజయవాడలోని న్యాయస్థానంలో హాజరుపరచనున్నారు. -
పంచాయతీ’ పరీక్షలకు సర్వం సిద్ధం
పంచాయతీ’ పరీక్షలకు సర్వం సిద్ధం అనంతపురం కలెక్టరేట్ : జిల్లాలో ఈ నెల 23న నిర్వహించనున్న పంచాయతీ కార్యదర్శి పరీక్షలకు జిల్లాలో సర్వం సిద్ధం చేశారు. హైదరాబాద్ నుంచి బుధవారం ప్రత్యేక వాహనంలో ప్రశ్నాపత్రాలు జిల్లాకు చేరాయి. జెడ్పీఏఓ అనూరాధ, డీపీఓ రమణ, కలెక్టరేట్ సూపరింటెండెంట్ వరదరాజు సమక్షంలో పశ్న్రపత్రాలను స్ట్రాంగ్ రూంలో భద్రపరిచి సీల్ వేశారు. 202 పంచాయతీ సెక్రటరీ పోస్టులకు జిల్లా వ్యాప్తంగా 46,780 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. రాప్తాడు, శింగనమల మినహా అనంతపురం, ఉరవకొండ, గుంతకల్లు, తాడిపత్రి, ధర్మవరం, కళ్యాణదుర్గం, రాయదుర్గం, హిందూపురం, మడకశిర, కదిరి, పెనుకొండ, పుట్టపర్తిలలో మొత్తం 144 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. 300 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2 నుంచి 4.30 గంటల వరకు పేపర్-2 పరీక్షలు నిర్వహిస్తున్నారు. పరీక్షల నిర్వహణకు 144 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, రెవెన్యూ, పోలీస్ అధికారులతో కలిపి 24 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 13 మంది అబ్జర్వర్లు, దాదాపు 2 వేల మంది ఇన్విజిలేటర్లను నియమించారు. -
ప్రశ్న పత్రాలు రాక.. అభ్యర్థుల్లో కాక!
విశాఖపట్నం, న్యూస్లైన్ : స్థలం : విశాఖ అక్కయ్యపాలెంలో జ్ఞాన నికేతన్ స్కూలు సమయం : ఉదయం 9 గంటలు సందర్భం : వీఆర్వో పరీక్ష జరగనున్న తరుణం వీఆర్వో పరీక్ష నిర్వహణకు రంగం సిద్ధమైంది... తొమ్మిదయ్యేసరికి అభ్యర్థుల రాక మొదలైంది. ఒకొరొకరుగా, వడివడిగా పరీక్షార్థుల రాక మొదలైంది. తొమ్మిదిన్నర అయ్యేసరికల్లా అభ్యర్థులకు లోపలికి అనుమతించే కార్యక్రమం మొదలైంది. 9.50 కల్లా పరీక్ష కేంద్రంలో ఉన్న 21 కేంద్రాల్లో అభ్యర్థులకు ప్రశ్న పత్రాలు ఇవ్వవచ్చనడానికి సూచికగా గంట గణగణమని మోగింది. పరీక్ష నిర్వాహకులు ఏపీపీఎస్సీ పంపిన క్వశ్చన్ పేపర్ బండిల్ను పలువురు అధికారుల సమక్షంలో ఓపెన్ చేశారు. షాక్! : ప్రశ్న పత్రాలు చాలా తక్కువగా ఉన్నాయి. మళ్లీ లెక్కించారు.. చాలా జాగ్రత్తగా లెక్కించారు.. అవును ప్రశ్న పత్రాలు తక్కువగానే ఉన్నాయి! 500 మంది అభ్యర్థులు ఉండగా 184 ప్రశ్న పత్రాలు మాత్రమే ఉన్నాయి. ఏం చేయాలి? ఏం చేయాలి? అధికారుల్లో టెన్షన్! విషయం మెరుపు వేగంతో ఉన్నతాధికారులకు చేరింది. కలెక్టర్.. జారుుంట్ కలెక్టర్.. డీఆర్వో.. ఏపీపీఎస్సీ సభ్యుడు.. అబ్జర్వర్లు.. పోలీస్ ఉన్నతాధికారులు..అందరికీ విషయం చేరింది. హుటాహుటిన పరీక్ష కేంద్రానికి అధికారులందరూ చేరారు. పరీక్ష బండిల్ను చూసి వారు కూడా నిర్ఘాంతపోయూరు. ఏం చేయాలో తేలక అంతా తలలు పట్టుకున్నారు. 10:10 గంటలు.. అభ్యర్థుల్లో టెన్షన్. ప్రశ్న పత్రాలు ఇంకా ఇవ్వడం లేదేమిటని అంతా అడగడం మొదలెట్టారు. వస్తున్నాయని ఇన్విజిలేటర్లు నచ్చజెప్పడం మొదలెట్టారు. పదిన్నర అయింది. 10.40 కూడా అయింది. అభ్యర్థుల్లో వేడి పుట్టింది. ప్రశ్న పత్రాలు ఎందుకు ఇవ్వడం లేదన్న ప్రశ్నల వర్షం మొదలైంది. వారిని నచ్చజెబుతూనే, ఇతర కేంద్రాల నుంచి ప్రశ్న పత్రాలు తరలించే పనిలో నిమగ్నమయ్యారు. 11 గంటల కల్లా అభ్యర్థులు మీడియా దృష్టికి సమస్యను తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. మరో అరగంటకు వివిధ పరీక్ష కేంద్రాలలో మిగిలిన ప్రశ్న పత్రాలు తెచ్చి అభ్యర్థులకు అందజేశారు. మధ్యాహ్నం ఒంటి గంటన్నర వరకు పరీక్ష నిర్వహించారు. ఇదేనా న్యాయం? ‘సార్.. కోటవురట్ల మండలం కైలాసపట్నం నుంచి చంటి పిల్లాడ్ని ఎత్తుకుని పరీక్షకు రావడం ఐదు నిమిషాలు ఆలస్యమైంది. నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచి రాత్రింబవళ్లు చదివాను. ఐదు నిమిషాలు ఆలస్యంగా రావడం నా తప్పే. మానవతా హృదయంతో ఆలోచించి పరీక్ష హాల్లోకి పంపండి’ అంటూ రాజేశ్వరి అనే యువతి లబోదిబోమంది..చివరకు కన్నీరు పెట్టింది. అయినా అధికారులు స్పందించలేదు. మా రూల్స్ మేరకే మేము వ్యవహరిస్తాం. అని చెప్పడంతో ఆ అభ్యర్థిని చంటి పిల్లాడిని ఎత్తుకుని వెనుదిరిగింది. తప్పేమీ జరగలేదు తప్పేమీ జరగలేదు. క్వశ్చన్ పేపర్లు కొంత షార్ట్ వచ్చాయి. కొన్ని కేంద్రాల్లో ఎక్కువ క్వశ్చన్ పేపర్లు వెళ్లారుు. అక్కడి నుంచి తెప్పించాం. - పెద్దయ్య, ఏపీపీఎస్సీ సభ్యుడు