Rakshit Shetty
-
రక్షిత్ శెట్టికి చుక్కెదురు.. భారీ మొత్తంలో డిపాజిట్ కోరిన కోర్టు
కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టికి ఢిల్లీ కోర్టు షాకిచ్చింది. కాపీరైట్ ఉల్లంఘన కేసులో ఆయనకు వ్యతిరేకంగా తీర్పు వెళ్లడించింది. ఈమేరకు రూ. 20 లక్షలు డిపాజిట్ చేయాలని కోరింది. ఈ ఏడాది జనవరిలో విడుదలైన 'బ్యాచిలర్ పార్టీ' సినిమాలో తమ పాటలను అనుమతి లేకుండా రక్షిత్ శెట్టి కాపీ కొట్టారని MRT మ్యూజిక్లో భాగస్వామిగా ఉన్న నవీన్ కుమార్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కన్నడలో మంచి విజయం అందుకున్న ఈ సినిమాను పరంవా స్టూడియోపై రక్షిత్ నిర్మించారు.రక్షిత్ శెట్టి తన 'బ్యాచిలర్ పార్టీ' సినిమాలో న్యాయ ఎల్లిదే, ఒమ్మే నిన్ను చిత్రాల్లోని పాటలను ఉపయోగించారని MRT మ్యూజిక్ సంస్థ ఫిర్యాదు చేసింది. కాపీరైట్ అనుమతులు లేకుండానే ఇలాంటి చర్యలకు పాల్పడిన రక్షిత్ శెట్టి నిర్మాణ సంస్థ పరంవా స్టూడియోపై యశ్వంత్పూర్ పోలీస్ స్టేషన్లో వారు ఫిర్యాదు చేశారు. అయితే, రక్షిత్ శెట్టి ముందస్తు బెయిల్ కోసం ఆయన దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా ఢిల్లీ కోర్టు దానిని తొసిపుచ్చింది. ఆపై రూ.20 లక్షలు డిపాజిట్ చేయాలంటూ రక్షిత్ శెట్టిని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. యూట్యూబ్, సోషల్ మీడియాలో ఆ పాటలను తొలగించాలని సూచించింది. పలు కారణాల వల్ల రక్షిత్ శెట్టి ఢిల్లీ కోర్టుకు హాజరు కాలేదు. -
రక్షిత్ శెట్టి ముందస్తు బెయిల్ పిటీషన్ వాయిదా
కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి ముందస్తు బెయిల్ కోసం కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది జనవరిలో విడుదలైన బ్యాచిలర్ పార్టీ సినిమాలో తమ పాటలను కాపీ కొట్టారని MRT మ్యూజిక్లో భాగస్వామిగా ఉన్న నవీన్ కుమార్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. హిట్ టాక్ తెచ్చుకున్న బ్యాచిలర్ పార్టీలో దిగంత్, అచ్యుత్ కుమార్, యోగేష్ వంటి స్టార్స్ నటించారు. ఈ మూవీని అభిజిత్ మహేష్ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది.రక్షిత్ శెట్టి తన 'బ్యాచిలర్ పార్టీ' సినిమాలో న్యాయ ఎల్లిదే, ఒమ్మే నిన్ను చిత్రాల్లోని పాటలను ఉపయోగించారని MRT మ్యూజిక్ సంస్థ ఫిర్యాదు చేసింది. కాపీరైట్ అనుమతులు లేకుండానే ఇలాంటి చర్యలకు పాల్పడిన రక్షిత్ శెట్టి నిర్మాణ సంస్థ పరంవా స్టూడియోపై యశ్వంత్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే, రక్షిత్ శెట్టి ముందస్తు బెయిల్ కోసం ఆయన దరఖాస్తు చేసుకున్నారు. కానీ, 61వ సెషన్స్ కోర్టులో నేడు విచారణ జరగగా బుధవారానికి వాయిదా వేసింది. విచారణ అనంతరం ముందస్తు బెయిల్ గురించి నిర్ణయం తీసుకుంటామని కోర్టు తెలిపింది. -
సినీ హీరో రక్షిత్ శెట్టిపై కేసు నమోదు
కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టిపై కేసు నమోదైంది. తను హీరోగా నటించి నిర్మించిన 'బ్యాచిలర్ పార్టీ' సినిమా వల్ల ఆయన చిక్కుల్లో పడ్డారు. ఈ ఏడాది జనవరిలో విడుదలైన బ్యాచిలర్ పార్టీ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. ఇందులో దిగంత్, అచ్యుత్ కుమార్, యోగేష్ వంటి స్టార్స్ నటించారు. ఈ మూవీని అభిజిత్ మహేష్ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది.'బ్యాచిలర్ పార్టీ' చిత్రంలో రక్షిత్ శెట్టి హీరోగా నటించడమే కాకుండా నిర్మాతగా కూడా ఉన్నారు. తన నిర్మాణ సంస్థ పరంవా స్టూడియో ద్వారా ఈ మూవీని నిర్మించారు. అయితే, రక్షిత్ శెట్టిపై MRT మ్యూజిక్లో భాగస్వామిగా ఉన్న నవీన్ కుమార్ ఫిర్యాదు చేశారు. రక్షిత్ శెట్టి తన 'బ్యాచిలర్ పార్టీ' సినిమాలో కాపీరైట్ అనుమతులు లేకుండానే తమ పాటలను ఉపయోగించారని ఫిర్యాదుదారు ఆరోపించారు. న్యాయ ఎల్లిదే, ఒమ్మే నిన్ను చిత్రాల్లోని పాటలను ‘బ్యాచిలర్ పార్టీ’లో రక్షిత్ శెట్టి కాపీ కొట్టారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు.ఈ వివాదంపై హీరో రక్షిత్ శెట్టి ఇంకా స్పందించలేదు. సప్త సాగరాలు దాటి సైడ్-ఏ, సైడ్-బి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు ఆయన మరింత దగ్గరయ్యారు. ఇప్పుడు కాపీరైట్ వివాదంలో చిక్కుకున్న రక్షిత్ శెట్టి తన టీమ్తో సదరు మ్యూజిక్ సంస్థతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. -
ఏడు ఎపిసోడ్లుగా ఏకం.. ట్రైలర్ చూశారా?
ప్రకాశ్ రాజ్, రాజ్ బి శెట్టి, షైన్ శెట్టి, మానసి సుధీర్, ప్రకాశ్ తుమినడ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన వెబ్ సిరీస్ ఏకం. ఇందులో ఏడుగురి జీవితాలను ఏడు ఎపిసోడ్లుగా తెరకెక్కించారు. ఈ సిరీస్ కోసం ఏకంగా ఐదుగురు దర్శకులు పని చేశారు. సుమంత్ భట్, స్వరూప్ ఎలమొన్, సనల్ అమన్, శంకర్ గంగాధరన్, వివేక్ వినోద్ దర్శకత్వం వహించారు. వీరిలో సనల్, వివేక్ మినహా మిగతా ముగ్గురూ స్క్రీన్ప్లే అందించారు. ఈ స్క్రీన్ప్లేకు జీఎస్ భాస్కర్ అనే వ్యక్తి కూడా సాయం చేశాడు. ఈ సిరీస్ జూలై 13న ఏకం ద సిరీస్ (https://www.ekamtheseries.com/) వెబ్సైట్లో విడుదల కానుంది.భావోద్వేగాల సమ్మేళనంఈ క్రమంలో తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులో ప్రేమ, భయం, ధైర్యం, బాధ.. ఇలా అన్నిరకాల ఎమోషన్స్ను రంగరించారు. ఎంతో సహజసిద్ధంగా కనిపిస్తున్న ఈ సిరీస్ ఓటీటీలో రిలీజ్ అయ్యుంటే ఎక్కువమంది చూసే ఆస్కారం ఉండేది. కానీ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఈ సిరీస్ను తిరస్కరించడంతో మరో అవకాశం లేక సొంత ప్లాట్ఫామ్లో అందుబాటులోకి తెస్తున్నారు.పట్టించుకోని ఓటీటీలుఈ విషయాన్ని కన్నడ హీరో రక్షిత్ శెట్టి ఇటీవలే సోషల్ మీడియాలో వెల్లడించాడు. '2020 జనవరిలో ఏకం ప్రాజెక్ట్ మొదలుపెట్టాం. కరోనా వల్ల కాస్త ఆలస్యమైంది. 2021 అక్టోబర్లో ఫైనల్ కట్ చూసి ఆశ్చర్యపోయాను. ఈ అద్భుతమైన సిరీస్ను ప్రపంచానికి చూపించాలని ఆరాటపడ్డాను. కానీ ఎంత ఎదురుచూసినా, ప్రయత్నించినా ఒక్క ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా ఏకం తీసుకోవడానికి ముందుకు రాలేదు. అందుకే మా సొంత ప్లాట్ఫామ్లోనే దీన్ని రిలీజ్ చేస్తున్నాం. తప్పకుండా మీరు దాన్ని ఎంజాయ్ చేస్తారు' అని ట్వీట్ చేశాడు. Presenting #EKAM – with love, from us to you! 🤗Join the waitlist now!🔗 https://t.co/PFMuw92M13 @ParamvahStudios @teamjourneyman #SumanthBhat @sandeep_ps5 @AaronMac05 @prakashraaj @RajbShettyOMK @ShineShetty_ @worldofekam @definestudio_ pic.twitter.com/e6DCwAj7tD— Rakshit Shetty (@rakshitshetty) June 17, 2024చదవండి: అమ్మ ఎక్కడ? అని అడుగుతున్నారు.. ఏం చెప్పాలో.. ఏంటో? -
OTTకి బదులుగా రక్షిత్ శెట్టి కొత్త ప్లాన్.. జులైలో 'ఏకం' విడుదల
777 చార్లీ, సప్త సాగరాలు దాటి వంటి చిత్రాలతో కన్నడ స్టార్ హీరో, డైరెక్టర్ రక్షిత్ శెట్టి తెలుగు వారికి బాగా దగ్గరయ్యాడు. తాజాగా ఆయన నిర్మాతగా తెరకెక్కించిన ఏకం వెబ్ సీరిస్ విడుదల కానుంది. ఈ సీరిస్ను విడుదల చేసేందుకు సుమారు 3 ఏళ్ల నుంచి ఆయన ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఏ ఓటీటీ వేదికలు కూడా ఆసక్తి చూపలేదు. దీంతో రక్షిత్ శెట్టి ఒక సొంత ప్లాట్ఫామ్ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు.ఏడు కథలతో ఏకం వెబ్ సీరిస్ను మేకర్స్ నిర్మించారు. జులై 13 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్కు రానుంది. అయితే, ఈ చిత్రాన్ని చూసేందుకు www.ekamtheseries.com వెబ్సైట్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. రూ.149 చెల్లించి ఏకం వెబ్ సిరీస్ను చూడొచ్చు. ఇదే విషయాన్ని రక్షిత్ శెట్టి అధికారికంగా ప్రకటించారు.రక్షిత్ శెట్టి నిర్మించిన ఏకం వెబ్ సిరీస్లో ప్రకాశ్ రాజ్, షైన్ శెట్టి వంటి వారు కీలక పాత్రలలో నటించారు. ఏకం వెబ్ సిరీస్ కన్నడలో మాత్రం అందుబాటులో ఉంది. ఈ సిరీస్ను ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ తీసుకోకపోవడంతోనే ఇలా సొంతంగా ఒక వెబ్సైట్ ద్వారా విడుదల చేస్తున్నట్లు రక్షిత్ శెట్టి తెలిపాడు. చూడాలనే ఆసక్తి ఉన్నవారు జులై 13 నుంచి రూ.149 చెల్లించి ఏకం ప్రపంచంలోకి అడుగుపెట్ట వచ్చు.Presenting #EKAM – with love, from us to you! 🤗Join the waitlist now!🔗 https://t.co/PFMuw92M13 @ParamvahStudios @teamjourneyman #SumanthBhat @sandeep_ps5 @AaronMac05 @prakashraaj @RajbShettyOMK @ShineShetty_ @worldofekam @definestudio_ pic.twitter.com/e6DCwAj7tD— Rakshit Shetty (@rakshitshetty) June 17, 2024 -
చార్లి గుర్తుందా.. ఇన్నేళ్ల తర్వాత అంటూ వీడియో షేర్ చేసిన రక్షిత్
కన్నడ నటుడు రక్షిత్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన ఎమోషనల్ ఎంటర్టైనర్ '777 ఛార్లి'. చిన్న చిత్రంగా 2022లో విడుదలైన ఈ మూవీ దేశవ్యాప్తంగా డాగ్ లవర్స్ను ఆకట్టుకుంది. జాతీయ చలన చిత్ర అవార్డుల్లో ఉత్తమ కన్నడ చిత్రంగా అవార్డు దక్కించుకుంది. ఈ చిత్రానికి రక్షిత్ శెట్టితో పాటు మరో ప్రధాన హీరో ఛార్లీనే.. ఛార్లీ పాత్రలో తెరపై కనిపించేది ఒక శునకమే అయినా.. సినిమా చూస్తున్నంతసేపు చాలామంది దానికి ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు. అందుకోసం చార్లికి ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. కొన్ని సీన్ల కోసం పదుల సంఖ్యలో టేకులు తీసుకోవాల్సి వచ్చిందని చిత్ర రచయిత, దర్శకుడు కిరణ్ రాజ్ గతంలో తెలిపారు. కానీ ఆ డాగ్ మాత్రం చిత్ర యూనిట్ మొత్తాన్ని మెప్పించిందని ఆయన తెలిపారు.తాజాగా డాగ్ చార్లిని మళ్లీ తెరపైకి తీసుకొచ్చాడు రక్షిత్ శెట్టి. లేటు వయసులో 6 అందమైన పిల్లలకు చార్లి జన్మనిచ్చిందని ఆయన తెలిపారు. వాటిని చూసేందుకే తాను మైసూర్ వచ్చానని ఒక వీడియో ద్వారా రక్షిత్ చెప్పారు. చార్లి మొదటిసారి తల్లి అయినట్లు ఆయన తెలిపారు. వాస్తవానికి చార్లి వయసు కూడా చాలా ఎక్కువ. తను ఎప్పుడు పిల్లలకు జన్మనిస్తుందని తామందరం ఎంతగానో ఎదరుచూశామని రక్షిత్ తెలిపారు. ఫైనల్లీ ఇన్నేళ్లకు తామందరిలో చార్లి సంతోషాన్ని నింపిందని ఆయన అన్నారు. చార్లికి ఇక సంతానం కలగదేమోనని అనుకున్నట్లు ఆయన అన్నారు. అయితే, లేటు వయసులో చార్లికి సంతానం కలగడం చాలా సంతోషాన్ని కలిగించిందని రక్షిత్ తెలిపారు. ట్రైనర్ ప్రమోద్ ఇంట్లో మే 09న 6 పిల్లలకు చార్లి జన్మనిచ్చింది. అందులో 5 ఫిమేల్,1 మేల్ పప్పీలు ఉన్నాయి. రక్షిత్ శెట్టి షేర్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. View this post on Instagram A post shared by Rakshit Shetty (@rakshitshetty) -
ఓటీటీలో సడెన్గా మాయమైన హిట్ సినిమా.. కారణం ఇదేనా
కన్నడ హిట్ సినిమా ‘సప్త సాగరాలు దాటి సైడ్- బీ’ ఓటీటీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో తొలగించేసింది. కన్నడ నటులు రక్షిత్ శెట్టి, రుక్మిణీ వసంత్ జంటగా నటించిన ప్రేమకథా చిత్రమిది. గతేడాది నవంబరు 17న థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా ఈ ఏడాది జనవరిలో ఓటీటీలోకి వచ్చింది. ఇప్పటి వరకు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ అందుబాటులో ఉన్న ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ సడెన్గా తొలగించింది. ‘సప్త సాగరాలు దాటి సైడ్- ఏ’కు సీక్వెల్గా రూపొందిన ఈ చిత్రం కన్నడతో పాటుగా టాలీవుడ్లో కూడా మంచి ఆదరణ పొందింది. సప్త సాగరాలు దాటి సైడ్-ఏ, సైడ్-బీ రెండు చిత్రాలు ఇంతవరకు అమెజాన్ ప్రైమ్లోనే స్ట్రీమింగ్ అయ్యాయి. అయితే సప్త సాగరాలు దాటి సైడ్- బీ ఓటీటీలో సడెన్గా మాయమైంది. చాలా ఆలస్యంగా ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమా ఇప్పుడు మళ్లీ అందుబాటులో లేకపోవడంతో సోషల్ మీడియాలో యూజర్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమా ఎందుకు తొలగించారని ప్రశ్నిస్తున్నారు. కానీ ప్రైమ్ వీడియో నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. 'సప్త సాగరాలు దాటి' సీక్వెల్ చిత్రాలకు హీరో రక్షిత్ శెట్టి నిర్మాతగానూ ఉన్నారు. ఈ రెండు చిత్రాల శాటిలైట్ హక్కులను జీ5 నెట్వర్క్ కూడా సొంతం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ కొన్ని బిజినెస్ డీల్స్ వల్ల మొదట అమెజాన్లో స్ట్రీమింగ్ అయినట్లు తెలుస్తోంది. అయితే, సైడ్-బీ చిత్రాన్ని మాత్రం 'జీ5' ఓటీటీలోకి తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నట్టు టాక్. అందుకే సైడ్ -బీ చిత్రం ప్రైమ్ వీడియోలో తొలగించారని సమాచారం. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం సప్త సాగరాలు దాటి సైడ్- ఏ మాత్రమే అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. -
ఓటీటీలోకి కన్నడ హిట్ సినిమా.. అందులోనే స్ట్రీమింగ్
మరో క్రేజీ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైపోయింది. కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి నిర్మించిన ఈ మూవీ.. ఆ భాషలో రిలీజై హిట్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు ఇది ఓటీటీలోకి మూవీ లవర్స్ని నవ్వించబోతుంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఎలాంటి హడావుడి లేకుండా ఇచ్చేశారు. దీంతో ఓటీటీ ప్రేమికులు అలెర్ట్ అయిపోయారు. ఇంతకీ ఏంటా సినిమా? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది? ఓటీటీల హవా పెరిగిన తర్వాత భాషతో సంబంధం లేకుండా సినిమాల్ని తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఇప్పుడు వీళ్ల కోసమా అన్నట్లు కన్నడ హిట్ మూవీ 'బ్యాచిలర్ పార్టీ' ఓటీటీ విడుదలకు రెడీ అయిపోయింది. జనవరి 26న థియేటర్లకి వచ్చిన ఈ చిత్రం.. సోమవారం నుంచి అంటే మార్చి 4 నుంచి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కానుంది.అంటే ఈ రోజు అర్థరాత్రే. అలానే ఓటీటీలో రిలీజ్ విషయాన్ని కూడా కొన్ని గంటల ముందు మాత్రమే చెప్పారు. అంటే సడన్ స్ట్రీమింగ్ అన్నట్లే. (ఇదీ చదవండి: సీక్రెట్గా టాలీవుడ్ లేడీ విలన్ నిశ్చితార్థం.. 14 ఏళ్ల ప్రేమకథ) మరోవైపు ట్రైలర్ చూస్తుంటే ఫుల్ ఆన్ కామెడీ ఎంటర్టైనర్గా ఉంది. భార్య-భర్త మధ్య ఉండే చిన్న సమస్యలతో కామెడీ పుట్టించినట్లు తెలుస్తోంది. అలానే ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి బ్యాంకాక్లో చేసిన సందడి కూడా బాగానే ఉంది. అయితే ఓటీటీ స్ట్రీమింగ్ అనేది కేవలం కన్నడ వరకే ఉంటుందా? తెలుగు డబ్బింగ్ కూడా అందుబాటులోకి తీసుకొస్తారా అనేది తెలియాల్సి ఉంది. 'బ్యాచిలర్ పార్టీ' కథ విషయానికొస్తే.. సంతోష్ (దిగంత్ మైకేల్) సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంటాడు. పెళ్లి కూడా అయ్యింటుంది. కానీ భార్య సంధ్య(సిరి రవికుమార్) వల్ల జీవితంలో సంతోషం అనేదే ఉండదు. పార్టీలు కూడా చేసుకోనివ్వకుండా ఆఫీస్ తర్వాత నేరుగా ఇంటికొచ్చేయాలనే టైప్. అలాంటి సంతోష్ అనుకోకుండా ఫ్రెండ్ బ్యాచిలర్ పార్టీలో తన పాత ఫ్రెండ్ మ్యాడీ (యోగా), పీటీ సర్ (అచ్యుత్ కుమార్)ని కలుస్తాడు. ఆ తర్వాత వీళ్లు ముగ్గురు కలిసి బ్యాంకాక్ వెళ్తారు. చివరకు ఏమైంది? ఈ జర్నీలో ఏం తెలుసుకున్నారు? అనేదే స్టోరీ. (ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ థ్రిల్లర్ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) -
రష్మికతో పెళ్లి ఆగిపోవడంపై మాజీ ప్రియుడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్
నిజమెంత అనేది పక్కనబెడితే కొందరి జీవితాలు వినడానికి ఆసక్తికరంగా ఉంటాయి. అలాంటి వారిలో రష్మిక ఒకరు. ఎందుకంటే సొంతభాష కన్నడలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి హిట్ కొట్టింది. అదే సినిమాలో హీరోగా నటించిన రక్షిత్ శెట్టితో నిశ్చితార్థం కూడా చేసుకుంది. ఏమైందో ఏమో గానీ పెళ్లి జరగలేదు. తాజాగా రష్మిక గురించి మాజీ బాయ్ ఫ్రెండ్ రక్షిత్ శెట్టి మాట్లాడాడు. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. (ఇదీ చదవండి: ‘ఊరు పేరు భైరవకోన’ మూవీ రివ్యూ) ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న రష్మిక.. ఈ మధ్య 'యానిమల్' చిత్రంతో అద్భుతమైన విజయాన్ని దక్కించుకుంది. ఇప్పుడు ఈమె చేతిలో 'పుష్ప 2', 'రెయిన్ బో', 'గర్ల్ ఫ్రెండ్' లాంటి చిత్రాలున్నాయి. సరే సినిమాల సంగతి పక్కనబెడితే ఈమె గురించి మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టి పలు వ్యాఖ్యలు చేశాడు. అప్పట్లో రష్మికతో ఎంగేజ్మెంట్, పెళ్లి ఆగిపోవడం గురించి తాజాగా మరోసారి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రక్షిత్ శెట్టి.. 'తమ పెళ్లి ఆగితే ఏంటి? తామిద్దరం ఇప్పటికే టచ్లోనే ఉన్నాం. రష్మికకు జీవితంలో పెద్ద డ్రీమ్ ఉండేది. ఇప్పుడు దాన్ని సాకారం చేసుకుంది' అని చెప్పుకొచ్చాడు. ఈ మాటల బట్టి చూస్తుంటే.. ప్రేమికులుగా విడిపోయినప్పటికీ ఫ్రెండ్స్గా రష్మిక-రక్షిత్ అప్పుడప్పుడు మాట్లాడుకుంటున్నారనమాట. (ఇదీ చదవండి: ఏడాది కిందట నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన హీరోయిన్) -
సైలెంట్గా ఓటీటీకి వచ్చేసిన ఆ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
కన్నడ స్టార్ రక్షిత్ శెట్టి, రుక్మిణీ వసంత్ జంటగా నటించిన ఫీల్గుడ్ ప్రేమకథా చిత్రం ‘సప్త సాగరాలు దాటి - సైడ్ ఎ’. హేమంత్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీ సూపర్ హిట్ రావడంతో సీక్వెల్గా సప్త సాగరాలు దాటి - సైడ్ బి తెరకెక్కించారు. గతేడాది నవంబర్ 17న రిలీజైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ను సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ చిత్రం ఓటీటీకి వచ్చేసింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇటీవలే ఈ సినిమా ఓటీటీ రిలీజ్పై రక్షిత్ శెట్టి తాజాగా ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏకంగా ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండానే స్ట్రీమింగ్కు వచ్చేసింది. కథేంటంటే..? డబ్బుకి ఆశపడి జైలుకి వెళ్ళిన మను(రక్షిత్ శెట్టి) పదేళ్ల తర్వాత బయటకు రావడంతో స్టోరీ మొదలవుతుంది. తన ప్రేయసి ప్రియ(రుక్మిణి వసంత్)కి అప్పటికే పెళ్ళి అయిపోయి ఉంటుంది. దీంతో ఆమెని మర్చిపోలేక మను సతమతం అవుతుంటాడు. ప్రియని దూరం నుంచి ఫాలో అవుతూ.. ఆమె కొడుకు, భర్తతో.. తన గురించి ఏం చెప్పకుండా స్నేహం చేస్తాడు. అన్ని విధాలా ఆమెకి సహాయం చేస్తాడు. మరి చివరకు ప్రియని మను కలిశాడా? ఈ స్టోరీలో సురభి(చైత్ర జే ఆచార్) ఎవరు? తను జైలుకి వెళ్ళడానికి కారణమైన వాళ్లపై మను పగ తీర్చుకున్నాడా? అనేది స్టోరీ. -
మాస్ హీరో కోసం 'సప్త సాగరాలు' దాటి వచ్చేస్తున్న వైరల్ బ్యూటీ
సినిమా ప్రపంచంలోకి కొత్త హీరోయిన్లు వస్తూనే ఉంటారు... భాష ఏదైనా కానివ్వండి తమ వద్ద టాలెంట్ ఉంటే చాలు ఒక్క సినిమాతోనే పాన్ ఇండియా రేంజ్ఉ చేరుకుంటారు. ఆపై ప్రేక్షకుల అభిమానాన్ని పొందుతారు. అలాంటి స్టార్ల జాబితాలోకి తాజాగా ఓ కన్నడ ముద్దుగుమ్మ చేరింది. ఆమె పేరు రుక్మిణి వసంత్. రక్షిత్ శెట్టి నటించిన 'సప్త సాగరాలు దాటి' సినిమాలో నటించింది. ఆపై తెలుగు వారికి కూడా తెగ నచ్చేసింది ఈ బ్యూటీ. బెంగళూరులో పుట్టి పెరిగిన ఈ ముద్దుగుమ్మకు చిన్నతనం నుంచే సినిమాలపై అభిమానం పెంచుకుంది. దీంతో లండన్ వెళ్లి యాక్టింగ్ కోర్సు పూర్తి చేసి ఇక్కడికి వచ్చింది. కన్నడ నుంచి రెండు సినిమాల్లో నటించినా 'సప్త సాగరాలు దాటి' చిత్రం ద్వారా పాపులర్ అయిపోయింది. ఈ సినిమాకు సీక్వెల్ కూడా రిలీజ్ అయింది. ఈ చిత్రాల ద్వారా అందరినీ ఫిదా చేసింది. నటనతో పాటు తన అందంతోనూ ఈ అమ్మడు అందరినీ కట్టిపడేస్తుంది. "సప్త సాగరాలు దాటి" సినిమా రొమాంటిక్, భావోద్వేగాలను ఆకర్షించింది. యూత్ని ఆకట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ తెలుగులో బాక్సాఫీస్ వద్ద ఆదరణ కరువైంది. ముఖ్యంగా, రుక్మిణి వసంత్ ప్రశంసలు అందుకుంది, చాలామంది ఆమెను ప్రశంసించడమే కాకుండా సాయి పల్లవితో పోల్చారు. (ఇదీ చదవండి: సలార్లో అఖిల్ అక్కినేని.. క్లారిటీ ఇచ్చిన ప్రశాంత్ నీల్ సతీమణి) తాజాగా రుక్మిణి వసంత్ తన మొదటి తెలుగు చిత్రానికి సంతకం చేసినట్లు తెలుస్తోంది. మాస్ మహారాజా రవితేజ తదుపరి చిత్రంలో ఈ బ్యూటీకి ఛాన్స్ దక్కింది. 'జాతి రత్నాలు' ఫేమ్ దర్శకుడు K. V. అనుదీప్ డైరెక్షన్లో రవితేజ ఒక సినిమా తీస్తున్నట్లు వార్తలు వచ్చాయి. త్వరలోనే అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం. జాతిరత్నాలు తరహాలోనే కామెడీ ఎంటర్టైనర్గా రానున్న ఈ సినిమాను స్వప్న సినిమాపై నాగ్ అశ్విన్ నిర్మించనున్నారట. -
నెల రోజుల్లోపే ఓటీటీ వచ్చేస్తోన్న స్టార్ హీరో మూవీ!
కన్నడ స్టార్ రక్షిత్ శెట్టి, రుక్మిణి వసంత జంటగా నటించిన చిత్రం సప్త సాగరాలు దాటి సైడ్-ఏ. ఈ ఏడాది సెప్టెంబర్ 22న ఈ చిత్రం రిలీజ్ కాగా సూపర్ హిట్ టాక్ అందుకుంది. దీంతో వెంటనే 'సప్త సాగరాలు దాటి సైడ్- బి' మూవీని తెరకెక్కించారు మేకర్స్. హేమంత్ ఎం.రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్ 17న థియేటర్లలోకి వచ్చింది. అయితే బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకుల అంచనాలను మెప్పించలేకపోయింది. దీంతో అప్పుడే ఈ మూవీ ఓటీటీ రిలీజ్కు సంబంధించిన క్రేజీ న్యూస్ నెట్టింట తెగ వైరలవుతోంది. (ఇది చదవండి: 'యానిమల్' వైబ్లోనే ఆర్జీవీ.. డైరెక్టర్ గురించి అలాంటి ట్వీట్) ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ తేదీపై క్రేజీ అప్డేట్ వినిపిస్తోంది. ఈ లవ్ స్టోరీ డిసెంబర్ 15న అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. అయితే దీనిపై మేకర్స్ అధికారిక ప్రకటన రాలేదు. ఈనెల 15న స్ట్రీమింగ్ అయితే నెల రోజుల్లోపే ఓటీటీలో చూస్తే ఛాన్స్ దక్కనుంది. (ఇది చదవండి: రోడ్డుపై తాగి వీరంగం సృష్టించిన బాలీవుడ్ స్టార్? వీడియో వైరల్) -
పుష్ప-2తో పోటీ పడనున్న మూవీ.. షూటింగ్లో స్టార్ హీరోకు గాయాలు!
బాలీవుడ్ సూపర్ స్టార్ అజయ్ దేవగణ్ నటిస్తోన్న తాజా చిత్రం సింగం-3. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ ముంబయిలో జరుగుతోంది. ఈ షెడ్యూల్లో ఫైట్ సీన్స్ తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఓ ఫైట్ సీన్ చేస్తుండగా అజయ్ దేవగణ్ గాయపడినట్లు తెలుస్తోంది. పొరపాటున అజయ్ కంటికి గాయమైనట్లు సమాచారం. అయినప్పటికీ అజయ్ దేవగణ్ వెంటనే షూటింగ్ని తిరిగి ప్రారంభించినట్లు తెలుస్తోంది. కాగా.. ఈ చిత్రానికి రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా.. ఇటీవలే సింగం-3 చిత్రంలో అజయ్ దేవగణ్ ఫస్ట్ లుక్ను ఆవిష్కరించారు. ఈ చిత్రంలో కరీనా, దీపికా పదుకొణె, అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, రణవీర్ సింగ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది ఆగస్టు 15న రిలీజ్ కానుంది. అయితే అదే రోజు టాలీవుడ్ హీరో మూవీ పుష్ప-2 కూడా రిలీజ్ కానుంది. దీంతో పుష్ప-2తో బాక్సాఫీస్ వద్ద పోటీ పడనుంది. కాగా.. గతంలో రిలీజైన సింగం, సింగం రిటర్న్స్ బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకున్నాయి. మరోవైవు అజయ్ దేవగన్ బోనీ కపూర్ నిర్మిస్తోన్న మైదాన్లో కనిపించనున్నారు. -
యాంకర్ సుమకు 'సప్తసాగరాలు దాటి' హీరో పంచ్లు.. పరువు పాయే!
ప్రేమకథలకు ఆదరణ ఎప్పుడూ ఉంటుంది. అలా ఓ అద్భుతమైన ప్రేమకథతో వచ్చిన సినిమా సప్తసాగరాలు దాటి. సెప్టెంబర్లో రిలీజైన ఈ మూవీ ఫస్ట్ పార్ట్ రిలీజ్ కాగా తాజాగా రెండో భాగం సప్త సాగరాలు దాటి సైడ్ బిగా విడుదలైంది. ఇందులో హీరో రక్షిత్ శెట్టి, హీరోయిన్లు రుక్మిణి, చైత్ర ప్రధాన పాత్రల్లో నటించారు. సినిమా విడుదలకు ముందు వీరు ముగ్గురూ యాంకర్ సుమకు ఇంటర్వ్యూ ఇచ్చారు. హీరో కౌంటర్లు.. కవరింగ్ చేసే పనిలో సుమ సుమ ఎక్కడుంటే అక్కడ నవ్వుల పండగే.. అందులో ఏమాత్రం డౌట్ లేదు. కానీ సుమ ఈ సినిమా గురించి పూర్తి వివరాలు తెలుసుకోకుండానే ఇంటర్వ్యూ చేసినట్లు తెలుస్తోంది. 'సప్తసాగరాలు దాటి సైడ్ ఎ, సైడ్ బి.. కథలు ముందే రాసుకున్నారా?' అని హీరోను అడగ్గా కథ రాసింది నేను కాదు, హేమంత్ అని క్లారిటీ ఇచ్చాడు రక్షిత్ శెట్టి. 'రెండు భాగాలను కలిపి ఒకే సినిమాగా తీద్దామా? అని ఓరోజు హేమంత్ అడిగాడు. రెండు భాగాలుగా తీస్తే బాగుంటుంది అని చెప్పాను. అలా సైడ్ ఎ, సైడ్ బిగా తీశాం' అని వివరణ ఇచ్చాడు. మరి దీనికి నిర్మాత ఒప్పుకున్నాడా? అని సుమ ప్రశ్నించగా నేనే నిర్మాతను అని పంచ్ ఇచ్చాడు రక్షిత్. నాలుక్కరుచుకున్న సుమ మీరు హీరో, డైరెక్టర్, నిర్మాత, సింగర్ అని వర్ణించుకుంటూ పోవడంతో రక్షిత్ శెట్టి తాను సింగర్ కాదని చెప్పాడు. అటు సినిమా గురించి, ఇటు హీరో రక్షిత్ శెట్టి గురించి పూర్తిగా తెలుసుకోకుండానే ఇంటర్వ్యూ చేసి సుమ నాలుక్కరుచుకుంది. ఈ ఇంటర్వ్యూ చూసిన జనాలు.. 'ఏంటి సుమ.. ఎంతో అనుభవం ఉన్నదానివి, ఇలా చేశావేంటి? ముందే ప్రిపేర్ అవ్వాల్సింది. అనవసరంగా వాళ్ల ముందు పరువు తీసుకున్నావ్' అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆమె అభిమానులు మాత్రం 'తనదసలే బిజీ షెడ్యూల్.. ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు సాధారణమే' అని వెనకేసుకొస్తున్నారు. చదవండి: 21 ఏళ్లకే విడాకులు.. జీవితంపై విరక్తి.. డిప్రెషన్.. చనిపోదామనుకున్నా.. -
'సప్త సాగరాలు దాటి సైడ్-బి' సినిమా రివ్యూ
టైటిల్: సప్త సాగరాలు దాటి సైడ్-బి నటీనటులు: రక్షిత్ శెట్టి, రుక్మిణి వసంత్, చైత్ర జే ఆచార్, అచ్యుత్ కుమార్ తదితరులు నిర్మాత: పరంవహ పిక్చర్స్ (రక్షిత్ శెట్టి) సమర్పణ: పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ డైరెక్టర్: హేమంత్ ఎమ్ రావు సంగీతం: చరణ్ రాజ్ సినిమాటోగ్రఫీ: అద్వైత గురుమూర్తి విడుదల తేదీ: నవంబర్ 17, 2023 ప్రేమ కథలకు సెపరేట్ ఫ్యాన్స్ ఉంటారు. భాషతో సంబంధం లేకుండా ఏ భాష మూవీని అయినా సరే ఆదరిస్తారు. అలా ఈ మధ్య కాలంలో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న సినిమా ' సప్త సాగరలు దాటి'. సెప్టెంబర్ లో 'సైడ్- ఏ' పేరుతో తొలి భాగం రిలీజ్ చేశారు. ఇప్పుడు దాని సీక్వెల్ను 'సప్త సాగరాలు దాటి సైడ్ - బి' పేరుతో థియేటర్స్లో విడుదల చేశారు. మరి ఈ మూవీ ఎలా ఉంది? టాక్ ఏంటనేది? తెలియాలంటే ఈ రివ్యూ చదవాల్సిందే. కథేంటి? డబ్బుకి ఆశపడి జైలుకి వెళ్ళిన మను(రక్షిత్ శెట్టి) పదేళ్ల తర్వాత బయటకు రావడంతో స్టోరీ మొదలవుతుంది. తన ప్రేయసి ప్రియ(రుక్మిణి వసంత్)కి అప్పటికే పెళ్ళి అయిపోయి ఉంటుంది. దీంతో ఆమెని మర్చిపోలేక మను సతమతం అవుతుంటాడు. ప్రియని దూరం నుంచి ఫాలో అవుతూ.. ఆమె కొడుకు, భర్తతో.. తన గురించి ఏం చెప్పకుండా స్నేహం చేస్తాడు. అన్ని విధాలా ఆమెకి సహాయం చేస్తాడు. మరి చివరకు ప్రియని మను కలిశాడా? ఈ స్టోరీలో సురభి(చైత్ర జే ఆచార్) ఎవరు? తను జైలుకి వెళ్ళడానికి కారణమైన వాళ్లపై మను పగ తీర్చుకున్నాడా? అనేది స్టోరీ. ఎలా ఉంది? 'సప్త సాగరాలు దాటి'.. ఈ సినిమా స్లో పాయిజన్ లాంటిది. అర్థం చేసుకుంటే నచ్చేస్తుంది. లేకపోతే ఇదేం బోరింగ్ సినిమారా బాబు అనిపిస్తుంది. ఫస్ట్ పార్ట్.. జైలు బ్యాక్ డ్రాప్ లో సాగే ప్రేమ కథ కాగా.. ఇప్పుడు వచ్చిన రెండో పార్ట్ పూర్తిగా రివేంజ్ డ్రామాతో సాగే ప్రేమ కథ. ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే.. డబ్బుకి ఆశపడి జైలుకి వెళ్ళిన మను, 10 ఏళ్ల తర్వాత బయటకు రావడంతో సినిమా మొదలవుతుంది. తనకు జైల్లో పరిచయమైన ఓ వ్యక్తి మనుకి ఆశ్రయం ఇస్తాడు. అప్పటికే తన లవర్ ప్రియకి వేరే వ్యక్తితో పెళ్లి అయిపోవడంతో మను ఆమెని కలవడానికి కూడా ఇష్టపడడు. కానీ ఆమెని మర్చిపోలేడు. దీంతో దూరం నుంచి ఆమెని గమనిస్తూ, ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు ప్రియ ఏం చేస్తుంది? ఎలా ఉంది? ఇలాంటివన్నీ గమనిస్తూ ఉంటాడు. దాదాపు ఇవే సీన్స్ ఫస్ట్ హాఫ్ అంతా వుంటాయి. అలా ఇంటర్వల్ కార్డ్ పడతుంది. ఇక సెకండ్ హాఫ్ మొదలు కాగానే అసలు స్టోరీ షురూ అవుతుంది. అప్పటివరకు హీరోయిన్ని చూస్తూ ఉన్న హీరో కాస్త ఆమె జీవితాన్ని చక్కబెడ్తాడు. మరి చివరకు మను - ప్రియ ఒక్కటయ్యారా? లేదా అనేది మూవీ చూసి తెలుసుకోవాలి. సెప్టెంబర్ లో రిలీజ్ అయిన సప్త సాగారాలు దాటి ఫస్ట్ పార్ట్.. కథ, మ్యూజిక్ పరంగా మంచి హిట్ అనిపించుకుంది. ఇప్పుడు రిలీజ్ అయిన రెండో పార్ట్ మాత్రం చాలా స్లోగా ఉండి, ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించింది. ఫస్ట్ హాఫ్ లో అసలు కథే ఉండదు. ఇంటర్వల్ తర్వాత కూడా కథ నెమ్మదిగా వెళ్తుంది తప్ప ఎక్కడా ఇంట్రెస్ట్ అనిపించదు. మ్యూజిక్ అయినా బాగుందా అంటే పాటలు, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఓకే అనిపిస్తుంది తప్పితే ఇంప్రెసివ్ గా ఏం లేదు. క్లైమాక్స్ కూడా కాస్త డిసప్పాయింట్ చేస్తుంది. అయితే సినిమాలో చిన్న చిన్న డీటైలింగ్ మాత్రం బాగుంది. తనకి డబ్బులు అవసరమై, ఇంతకుముందు పనిచేసిన ఓనర్ కొడుకు దగ్గరకు మను వెళతాడు. వాళ్ళు ఫస్ట్ తరిమేస్తారు. మళ్ళీ వెళ్తే మనుని కుక్కలా ట్రీట్ చేసి, బిస్కెట్ వేసినట్టు ఖరీదైన వాచ్ పడేస్తారు. దీంతో మనుకి కోపం వచ్చి, తనని కుక్కలా ట్రీట్ చేసిన ఓనర్ కొడుకుని కుక్కతో కరిపిస్తాడు. అలానే తను జైలుకి వెళ్ళడానికి కారణం అయిన ప్రభుని ఓ పాడుబడ్డ గోడౌన్ లో బంధించి, తను జైలులో అనుభవించిన దానిపై ప్రతీకారం తీర్చుకుంటాడు. అలానే ఫస్ట్ పార్ట్లో ఉన్న విలన్ రెండో భాగంలోనూ ఉంటాడు. సినిమా సముద్రం హోరుతో మొదలై అదే సముద్రం హోరుతో ఎండ్ అవుతుంది. ఫస్ట్ పార్ట్ లో ఎక్కువగా సముద్రానికి సింబాలిక్ గా బ్లూ కలర్ చూపిస్తే.. ఇందులో మాత్రం రివెంజ్ కి సింబాలిక్ గా రెడ్ కలర్ ని ఎక్కువగా చూపిస్తారు. ఓవరాల్ గా చెప్పుకుంటే 'సప్త సాగరాలు దాటి సైడ్- బీ'.. ఫస్ట్ పార్ట్ అంత అయితే కనెక్ట్ కాదు. సాగదీత ఎక్కువైంది. ఎవరెలా చేశారు? హీరో రక్షిత్ శెట్టి ఎప్పటిలానే పాత్రలో జీవించాడు. ప్రియగా చేసిన రుక్మిణి వసంత్.. ఇందులో గృహిణిగా కనిపించింది. ఫస్ట్ పార్ట్ తో పోలిస్తే ఇందులో ఆమెకి నటించే స్కోప్ పెద్దగా దొరకలేదు. ఇదే సినిమాలో వేశ్యగా, హీరోకి ప్రియురాలు సురభిగా చేసిన చైత్ర జే ఆచర్ కి మాత్రం కాస్త మంచి సీన్స్ పడ్డాయి. మిగిలిన వాళ్ళు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. టెక్నికల్ విషయాలకొస్తే సినిమాటోగ్రఫీ బాగుంది. మ్యూజిక్ పరవాలేదనిపించింది. ఫస్ట్ హాఫ్లో చాలా బోరింగ్ సీన్స్ ఉన్నాయి. వాటిపై ఎడిటర్ దృష్టి పెట్టుంటే బాగుండేేది. రెండున్నర గంటల సినిమా ఇది. ఓ అరగంట తగ్గించొచ్చు. కథపై ఇంకాస్త దృష్టి పెట్టి మంచి సీన్స్ రాసుకుని ఉంటే బాగుండేది. - చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్ -
రష్మిక ఫేక్ వీడియోపై మాజీ బాయ్ఫ్రెండ్ కామెంట్స్
ప్రస్తుతం సెలబ్రిటీల డీప్ ఫేక్ వీడియోల రచ్చ ఎక్కువైంది. కొన్నిరోజుల ముందు రష్మిక, తాజాగా కరీన్ కపూర్.. దీని బారిన పడ్డారు. అయితే ఈ విషయమై బాధితులు మాత్రమే కాదు చాలామంది హీరోహీరోయిన్లు స్పందిస్తున్నారు. తాజాగా రష్మిక జరిగిన దానిపై ఆమె మాజీ బాయ్ఫ్రెండ్ రక్షిత్ శెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంతకీ రష్మిక గురించి రక్షిత్ ఏమన్నాడు? (ఇదీ చదవండి: హీరో మహేశ్బాబు మంచి మనసు.. నిజంగా శ్రీమంతుడే!) కన్నడలో 'కిరిక్ పార్టీ' సినిమాతో రష్మిక హీరోయిన్గా పరిచయమైంది. ఇదే మూవీలో హీరోగా చేసిన రక్షిత్ శెట్టి.. షూటింగ్ టైంలో ఆమెలో ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత ఇద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారు. కారణమేంటో తెలీదు గానీ పెళ్లి చేసుకోలేదు. ఎవరి కెరీర్ పరంగా వాళ్లు బిజీలో ఉన్నారు. రక్షిత్ కొత్త మూవీ 'సప్త సాగరాలు దాటి సైడ్-బి'.. నవంబరు 17న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో.. రష్మిక ఫేక్ వీడియో ఘటనపై రెస్పాండ్ అయ్యాడు. 'నిజానికి ఇలాంటి వాటిపై ప్రభుత్వాలు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి అవసరముంది. ఎలాంటి సాఫ్ట్వేర్ తయారు చేసినప్పటికీ దానికి ఓ లైసెన్స్ ఉండాలి. అలాంటి రూల్స్ వచ్చినప్పుడే ఇలాంటి వాటిని అడ్డుకునే ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుతం ఇలాంటి సాఫ్ట్వేర్స్ని చాలామంది ఉపయోగిస్తున్నారు. వాటిని అరికట్టకపోతే ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎక్కువవ్వొచ్చు. అయితే రష్మిక కెరీర్ కోసం ఎన్నో డ్రీమ్స్ అనుకున్న అమ్మాయి' అని రక్షిత్ చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: బిగ్బాస్: ఆమెకు ప్రెగ్నెన్సీ టెస్ట్.. టెన్షన్లో ఆ కంటెస్టెంట్) -
స్టార్ హీరో ప్రేమ వ్యవహారం.. మోసం చేసిన క్లోజ్ ఫ్రెండ్!
తెలుగు ప్రేక్షకులకు సినిమా నచ్చితే చాలు నెత్తిన పెట్టేసుకుంటారు. అందులోని నటీనటుల్ని కూడా అభిమానిస్తారు. అలా ఈ మధ్య కాలంలో కన్నడ హీరోలు కూడా మనవాళ్లకు బాగా దగ్గరయ్యారు. వాళ్లలో హీరో రక్షిత్ శెట్టి కూడా ఒకడు. రష్మిక మాజీ బాయ్ ఫ్రెండ్ అని చాలామందికి తెలుసు. కానీ 'చార్లి 777' మూవీతో నటుడిగా తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. ఈ హీరోకి రష్మిక మాత్రమే అంతకుముందు కూడా ఓ బ్రేకప్ స్టోరీ ఉందట. రష్మికతో బ్రేకప్ కన్నడలో రక్షిత్ శెట్టి పేరు తెలియని వాళ్లుండరు. నటుడు-దర్శకుడు-రచయిత-నిర్మాత.. ఇలా మనోడి దగ్గర చాలా టాలెంట్స్ ఉన్నాయి. గతంలో 'కిరిక్ పార్టీ' అనే సినిమాలో రక్షిత్ హీరోగా నటిస్తే, రష్మిక హీరోయిన్గా చేసింది. ఈ మూవీ చేస్తున్నప్పుడు వీళ్లు ప్రేమలో పడ్డారు. నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. కారణం ఏంటే తెలీదు గానీ ఈ జంట విడిపోయింది. అయితే ఇదే కాదు రక్షిత్ కి మరో లవ్స్టోరీ కూడా ఉంది. అక్కడ క్లోజ్ ఫ్రెండే మోసం చేశాడట. (ఇదీ చదవండి: 'KCR' మూవీకి అడ్డంకులు.. 'జబర్దస్త్' కమెడియన్ ఎమోషనల్ వీడియో) రక్షిత్ ఏం చెప్పాడు? 'నా ఇంజినీరింగ్ సెకండియర్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని చూశా. తనకి లవ్ లెటర్ ఇవ్వమని మా ఫ్రెండ్కి రోజూ లవ్ లెటర్స్ రాసి ఇచ్చేవాడిని. అలా రెండేళ్లు గడిచిపోయాయి కానీ అమ్మాయి నుంచి ఎలాంటి రిప్లై రాలేదు. ఆ తర్వాత నాకు తెలిసింది ఏంటంటే నేను ఇచ్చిన లెటర్స్ని నా ఫ్రెండ్, ఆ అమ్మాయికి ఒక్కటి కూడా ఇవ్వలేదు. ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు వాళ్లిద్దరూ భార్యభర్తలు' అని హీరో రక్షిత్ శెట్టి తనకు జరిగిన మోసం గురించి చెప్పుకొచ్చాడు. 'సప్త సాగరాలు దాటి సైడ్-బి' సినిమా ప్రమోషన్స్లో భాగంగా తన కాలేజీ బ్రేకప్ స్టోరీ గురించి చెప్పాడు. అయితే రక్షిత్ జీవితంలోని ఈ రెండు స్టోరీలు చూసిన ఎవరికైనా సరే.. ఈ హీరో ప్రేమ అనేది అస్సలు కలిసి రావడం లేదా అనే సందేహం వస్తోంది. సో అదన్నమాట విషయం. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు) -
‘సప్తసాగరాలుదాటి సైడ్ బి’ మూవీ ప్రెస్ మీట్ (ఫోటోలు)
-
ప్రతి కథకు పలు కోణాలు ఉంటాయి
రక్షిత్ శెట్టి హీరోగా నటించిన కన్నడ చిత్రం ‘సప్తసాగరదాచే ఎల్లో: సైడ్ బి’. హేమంత్ రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్, చైత్ర జె. ఆచార్ హీరోయిన్లుగా నటించారు. ఈ ఏడాది విడుదలైన ‘సప్తసాగరదాచే ఎల్లో: సైడ్ ఏ’ సినిమాకు ఇది సీక్వెల్. ‘సప్తసాగరదాచే ఎల్లో: సైడ్ బి’ సినిమాను తెలుగులో ‘సప్తసాగరాలుదాటి సైడ్ బి’గా టీజీ విశ్వప్రసాద్ , వివేక్ కూచిభొట్ల ఈ నెల 17న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా జరిగిన విలేకర్ల సమావేశానికి ఓ అతిథిగా హాజరైన అవసరాల శ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘ప్రతి కథకు పలు కోణాలు ఉంటాయి. ‘సైడ్ ఏ’లో కనిపించని కోణాలు ఏమైనా ‘సైడ్ బి’లో కనిపిస్తాయా? అని ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాను’’ అన్నారు. ‘‘సప్తసాగరాలు దాటి సైడ్ ఏ’కు లభించిన ప్రేక్షకాదరణ ‘సైడ్ బి’కి కూడా లభిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు మరో అతిథి కేవీ అనుదీప్. రక్షిత్శెట్టి మాట్లాడుతూ– ‘‘అతడే శ్రీమన్నారాయణ’, ‘777 చార్లీ’, ‘సప్త సాగరాలు దాటి సైడ్ ఎ’ చిత్రాలపై తెలుగు ప్రేక్షకులు చూపించిన ప్రేమ, ఆదరణ ‘సప్త సాగరాలు దాటి సైడ్ బి’కి కూడా లభిస్తాయని ఆశిస్తున్నాను’ అన్నారు. ‘‘నా జీవితంలో తారసపడిన కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా ‘సప్త సాగరాలు దాటి..’ సినిమా కథ రాసుకున్నాను’’ అన్నారు హేమంత్ రావు. ‘‘సప్తసాగరాలు దాటి: సైడ్ ఏ’కు లభించినట్లే ‘సైడ్ బి’కీ ప్రేక్షకాదరణ లభిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు వివేక్ కూచిభొట్ల. -
సప్త సాగరాలు దాటి సైడ్-బి టీజర్.. సినిమా రిలీజ్ ఎప్పుడంటే
రక్షిత్ శెట్టి, రుక్మిణీ వసంత్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘సప్త సాగరాలు దాటి’. మొదట కన్నడలో విడుదలైన ఈ సినిమా సెప్టెంబర్ 22న తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తర్వాత తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళం, హిందీలోనూ ఇది అందుబాటులోకి వచ్చింది. మనసుకు హత్తుకునే ప్రేమకథగా ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన మేర కలెక్షన్లు వసూలు చేయలేకపోయినా మంచి కంటెంట్ ఉన్న సినిమాగా గుర్తింపు తెచ్చుకుంది. చేయని నేరాన్ని తన మీద వేసుకుని ఓ యువకుడు జైల్లో పడటం ఆసమయంలో అతను పడే వేదనను ఈ సినిమాలో దర్శకుడు అద్భుతంగా చూపించారు. అదే సమయంలో ఆ యువకుడిని బయటకు తీసుకొచ్చేందుకు అతడి ప్రేయసి పడే కష్టాన్ని కూడా బాగా ఎమోషనల్గా చూపించారు. పార్ట్-1 అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. మొదటి భాగానికి మంచి రెస్పాన్స్ రావడంతో రెండో పార్ట్ రిలీజ్పై మేకర్స్ ప్రకటన ఇచ్చారు. 'సప్త సాగరాలు దాటి - సైడ్ బి' రిలీజ్కు రెడీ అయింది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మూవీటీమ్ రిలీజ్ డేట్తో పాటు టీజర్ను విడుదల చేసింది. నవంబర్ 17న చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురానున్నట్లు తెలిపారు. దీనికి హేమంత్ ఎం రావు దర్శకత్వం వహించగా.. పవిత్ర లోకేశ్, అవినాష్, అచ్యుత్ కుమార్లు కీలక పాత్రల్లో కనిపించారు. -
థియేటర్స్లో ఉండగానే ఓటీటీలోకి వచ్చేసిన బ్లాక్బస్టర్ సినిమా
కంటెంట్ బాగుంటే చాలు ఇతర పరిశ్రమలకు చెందిన సినిమాలనూ ఆదరించడంలో ముందుంటారు తెలుగు ప్రేక్షకులు. అలా ఇప్పటికే ఇతర ఇండస్ట్రీకి చెందిన ఎందరో హీరోలను తెలుగువారు ఆదరిస్తున్నారు. అతడే శ్రీమన్నారాయణ, 777 చార్లి సినిమాలతో కన్నడ హీరో రక్షిత్ ఇప్పటికే తెలుగు ఆడియన్స్కు దగ్గరైన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన నటించిన ‘సప్తసాగరాలు దాటి: సైడ్ ఏ’ సెప్టెంబర్ 22న తెలుగు ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. (ఇదీ చదవండి: (Salaar Release Date: ప్రభాస్ సలార్ విడుదలపై అఫిషీయల్ ప్రకటన వచ్చేసింది) ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా ఈ సినిమాను ఓటీటీలో విడదల చేయడంతో ఫ్యాన్స్ థ్రిల్కు గురౌతున్నారు. కథ నెమ్మదిగా సాగిన ఇదోక అద్భుతమైన ప్రేమ కథ అని మంచి టాక్ వచ్చింది. సప్త సాగరాలు దాటిన ఈ ప్రేమకథ అందరినీ కదిలించిందని ఎందరో పాజిటివ్ రివ్యూస్ కూడా ఇచ్చేశారు. ఈ సినిమాకు ప్రధాన బలం కథతో పాటు అందులోని నటీనటుల భావోద్వేగాలు అని సినీ ప్రేమికులు తెలిపారు. ప్రేమలో పడిన ఓ జంట ప్రయాణమే ఈ చిత్రం. అందమైన కలలు కన్న ఆ జంట ప్రయాణాన్ని విధి ఎలా ప్రభావితం చేసింది? అనేదే కథాంశం. థియేటర్లో చూడలేకపోయిన వారు ఈ వారం సప్త సాగరాలు దాటి చిత్రాన్ని చూసి ఎంజాయ్ చేయండి. కన్నడలో ‘సప్త సాగరదాచె ఎల్లో: సైడ్ ఏ’ కి ఈ చిత్రం అనువాదం. అక్కడ మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. ఇక్కడ కూడా ఈ చిత్రం మంచి టాక్ వచ్చినా.. థియేటర్స్ సమస్య ఎదురైంది. దీంతో వారు వెంటనే ఓటీటీలోకి విడుదల చేసినట్లు సమాచారం. ఇందులో హీరోయిన్ రుక్మిణీ వసంత్ నటన మరో రేంజ్లో ఉంటుందని ఆమెను పలువురు అభినందించారు. ఇంతటి సూపర్ హిట్ కొట్టిన సినిమాను అమెజాన్ ప్రైమ్లో చూసేయండి. ఈ సినిమాను సీక్వెల్ కూడా త్వరలో రాబోతోంది. పార్ట్ వన్ను 'సప్తసాగరాలు దాటి: సైడ్ ఏ'గా రిలీజ్ చేశారు. సీక్వెల్ 'సప్తసాగరాలు దాటి: సైడ్ బీ' అక్టోబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. (ఇదీ చదవండి: 'సప్త సాగరాలు దాటి' సినిమా రివ్యూ) -
రష్మికపై మాజీ లవర్ సంచలన కామెంట్స్ వైరల్
-
రష్మికతో టచ్లో ఉన్నా.. మెసేజ్లు కూడా చేసుకుంటాం: రక్షిత్ శెట్టి
ఎవరికై నా అదృష్టం ఎంత అవసరమో అన్నది హీరోయిన్ రష్మిక మందన్నను చూస్తే తెలుస్తుంది. కొందరికి అందం ప్రతిభా ఉన్నా లక్కు దోబూచులాడుంది. అది లేకపోతే ఎన్ని ఉన్నా పైకి రావడం సాధ్యం కాదు. నటి రష్మిక విషయంలో అదృష్టమే కీలకం అయ్యిందని చెప్పక తప్పదు. 2016 కిరాక్ పార్టీ అనే కన్నడ చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయమైన డ్యూటీ రష్మిక మందన్న. తొలిచిత్రమే మంచి విజయాన్ని సాధించడంతో ఈ కన్నడ బ్యూటీకి వెంటనే టాలీవుడ్ నుంచి పిలుపు వచ్చింది. అలా అక్కడ ఛలో అనే చిత్రంలో కథానాయకిగా నటించింది ఆ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఇక్కడే రష్మిక మందన్న అదృష్టం ఏమిటో అర్థం అయిపోతుంది. ఆ తర్వాత గీత గోవిందం చిత్రం ఈ అమ్మడిని క్రేజీ హీరోయిన్ను చేసేసింది. ఇక ఆ తర్వాత అల్లు అర్జున్తో జతకట్టిన పుష్ప చిత్రం స్టార్ హీరోయిన్ను చేయడంతో పాటు బాలీవుడ్కు తీసుకెళ్లింది. అయితే కోలీవుడ్లో ఈమెకు లక్కు అనే మ్యాజిక్కు పెద్దగా పనిచేయలేదు. అదేవిధంగా బాలీవుడ్లో నటించిన రెండు చిత్రాలు ఆశించిన విజయాలను సాధించలేదు. త్వరలో తెరపైకి రానున్న యానిమల్ చిత్రం రిజల్ట్ కోసమే రష్మిక మందన్న ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉందని చెప్పవచ్చు. ఇక ఈమె వ్యక్తిగత విషయాలు గురించి చెప్పాలంటే చాలా కథలే ఉన్నాయి. కన్నడంలో నటించిన తొలి చిత్రం షూటింగ్ దశలోనే ఆ చిత్ర హీరో రక్షిత్ శెట్టి ప్రేమలో పడింది. వీరిద్దరి ప్రేమ వ్యవహారం పెళ్లి వరకు వెళ్లింది. అయితే ఆ తర్వాత అది ముందుకు సాగలేదు. పెళ్లి పీటలూ ఎక్కలేదు. ఇక గీత గోవిందం చిత్రం తర్వాత ఆ చిత్ర కథానాయకుడు విజయ్ దేవరకొండతో చెట్టాపట్టాల్ అంటూ ప్రచారం బాగానే జరిగుతుంది. వీరిద్దరూ సహజీవనంలో ఉన్నారనే మాటా వినిపిస్తోంది. అయితే అలాంటి వార్తలను రష్మిక ఖండించింది. ఫ్రెండ్స్ మాత్రమే అని స్పష్టం చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో రష్మిక మందన్న మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ తాను నటి రష్మిక మందన్నతో ఇప్పటికీ టచ్లోనే ఉన్నాం అని పేర్కొన్నారు. ఫోన్ ద్వారా మెసేజ్లు చేసుకుంటామని, చిత్రాలు విడుదల సమయంలో ఒకరికొకరు అభినందనలు తెలుపుకుంటామని చెప్పారు. రష్మిక ముందన్న నటిగా చాలా కలలు ఉన్నాయని, దాన్ని కరెక్ట్ గా అర్థం చేసుకొని ఇప్పుడు నేషనల్ క్రష్ అయ్యిందని పేర్కొన్నారు. ఈయన వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. -
'సప్త సాగరాలు దాటి' సినిమా రివ్యూ
టైటిల్: సప్త సాగరాలు దాటి నటీనటులు: రక్షిత్ శెట్టి, రుక్మిణి వసంత్, పవిత్రా లోకేష్, అచ్యుత్ తదితరులు నిర్మాత: రక్షిత్ శెట్టి దర్శకుడు: హేమంత్ ఎమ్.రావు సంగీతం: చరణ్ రాజ్ సినిమాటోగ్రఫీ: అద్వైత్ గురుమూర్తి విడుదల తేదీ: 22 సెప్టెంబరు 2023 మంచి సినిమాకు భాషతో సంబంధం లేదు. ప్రేమకథలకు అంతం లేదు. అలా ఈ మధ్య కాలంలో కన్నడలో రిలీజై సెన్సేషన్ సృష్టించిన మూవీ 'సప్త సాగర ఎల్లోదాచె'. 'చార్లి 777' చిత్రంతో తెలుగు ప్రేక్షకులని ఆకట్టుకున్న రక్షిత్ శెట్టి ఇందులో హీరో. ఇప్పుడు ఈ సినిమాని 'సప్త సాగరాలు దాటి' పేరుతో తెలుగులో రిలీజ్ చేశారు. ఇంతకీ ఎలా ఉంది? టాక్ ఏంటనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం. కథేంటి? మను (రక్షిత్ శెట్టి) కారు డ్రైవర్. శంకర్ గౌడ (అవినాష్) అనే బిజినెస్మ్యాన్ దగ్గర పనిచేస్తుంటాడు. సింగర్ కమ్ స్టూడెంట్ ప్రియ(రుక్మిణి వసంత్)తో ప్రేమలో ఉంటాడు. త్వరలో పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలనేది వీళ్లిద్దరి ప్లాన్. ఓ రోజు శంకర్ గౌడ కొడుకు కారుతో గుద్ది ఒకరిని చంపేస్తాడు. డబ్బు ఆశ, త్వరగా బెయిల్ ఇప్పిస్తానని చెప్పడంతో ఆ నేరాన్ని.. మను తనపై వేసుకుంటాడు. జైలుకి వెళ్తాడు. ఆ తర్వాత పరిస్థితులు మారిపోతాయి. జైలులో మను, బయట ప్రియ ఎలాంటి కష్టాలు అనుభవించారు? చివరకు ఏమైందనేదే 'సప్త సాగరాలు దాటి' మెయిన్ స్టోరీ. ఎలా ఉందంటే? ఓ తప్పటడుగు లేదా ఓ తప్పు నిర్ణయం మను అనే కుర్రాడి జీవితాన్ని తలక్రిందులు చేయడమే 'సప్త సాగరాలు దాటి' సినిమా. ఒక్క ముక్కలో చెప్పాలంటే స్టోరీ లైన్ ఇదే. సాధారణంగా ప్రేమకథా సినిమాలు అనగానే ఎవరో తెలియని వ్యక్తులు చివరకు ఎలా ఒక్కటయ్యారు అనేది చూపిస్తుంటారు. కానీ ఇందులో కాస్త డిఫరెంట్. ఆల్రెడీ ప్రేమలో ఉన్న ఓ అబ్బాయి-అమ్మాయి.. జీవితంలో ఎలాంటి అనుభవాలు ఎదుర్కొన్నారనేది చక్కగా చూపించారు. ఫస్టాఫ్ విషయానికొస్తే.. ఖరీదైన కారులో మను-ప్రియ. కట్ చేస్తే డ్రైవర్గా మను, మధ్య తరగతి అమ్మాయి ప్రియ జీవితం ఎలా ఉంటుందో చూపించారు. మరోవైపు ప్రేమలో ఉన్న మను-ప్రియ.. త్వరలో పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అవడం, కలిసి ఉండేందుకు ఓ ఇల్లు కోసం వెతుకులాట లాంటి సీన్స్తో సరదాగా వెళ్తుంటుంది. అయితే జీవితంలో సెటిల్ కావాలని కలలు కంటున్న మను.. డబ్బుకి ఆశపడి చేయని నేరాన్ని తనపై వేసుకోవడం, జైలుకెళ్లడంతో ఒక్కసారిగా స్టోరీ టర్న్ తీసుకుంటుంది. అయితే తనని ఎలాగైనా బయటకు తీసుకొస్తానని మాటిచ్చిన ఓనర్ హార్ట్ ఎటాక్తో చనిపోవడంతో పరిస్థితులన్నీ తారుమారు అవుతాయి. మరి మను.. జైలు నుంచి బయటకొచ్చాడా? ప్రియని పెళ్లి చేసుకున్నాడా? అనేది తెలియాలంటే థియేటర్లలో ఈ మూవీ చూడాల్సిందే. 'సప్త సాగరాలు దాటి' కొత్త కథేం కాదు. కానీ సినిమాగా చూస్తున్నప్పుడు మనకు అస్సలు ఆ ఫీలింగే రాదు. మరోవైపు హీరోహీరోయిన్ల యాక్టింగ్, సంగీతాన్ని వేరుచేసి చూడలేం. ఎందుకంటే పాటలు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మనల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్లిపోతాయి. ఈ సినిమాలో సముద్రం చాలా ముఖ్యమైన రోల్ ప్లే చేసింది. హీరోయిన్కి సముద్రం అంటే చాలా ఇష్టం. మను-ప్రియ.. ఇద్దరూ సముద్రం పక్కనే ఇల్లు కట్టుకుని సెటిల్ అవ్వాలని అనుకుంటారు. కానీ విధి మరోలా ఉంటుంది. సముద్రంలో తుపాన్లా వీళ్ల జీవితం కూడా అల్లకల్లోలం అయిపోతుంది. ప్రేమంటే హగ్గులు, ముద్దులు లాంటివి ఇప్పుడు తీస్తున్న లవ్స్టోరీల్లో కామన్ పాయింట్. 'సప్త సాగరాలు దాటి' చిత్రంలో మాత్రం అలాంటివేం లేవు. ఓ మంచి పుస్తకం చదువుతున్నట్లో.. ఓ మంచి పాట వింటున్నంత హాయిగా ఉంది. ప్రేమకథా చిత్రం అన్నాను కదా అని మొత్తం లవ్ సీన్సే ఉంటాయని అనుకోవద్దు. ఎందుకంటే ఇందులో జైలు, అందులో ఖైదీల జీవితం ఎలా ఉంటుందనేది చాలా హృద్యంగా ఆవిష్కరించారు. కానీ ఆ సన్నివేశాలనే కొన్నిసార్లు బోర్ కొట్టిస్తాయి కూడా! ఎవరెలా చేశారు? మనుగా నటించిన రక్షిత్ శెట్టి.. ఈ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశాడు. ప్రేమికుడు, ఖైదీ, పరిణితి చెందిన మనిషిగా.. ఇలా డిఫరెంట్ షేడ్స్ని అద్భుతంగా ఎక్స్పోజ్ చేశాడు. ప్రియ పాత్రలో నటించిన రుక్మిణి వసంత్.. కేవలం తన కళ్లు, నవ్వుతో మాయ చేసింది. రక్షిత్ శెట్టితో ఈమె కెమిస్ట్రీ అయితే వేరే లెవల్. నిజంగా ప్రేమికులు అనేంతలా స్క్రీన్పై రెచ్చిపోయారు. ప్రేమ, విరహాం, తపన.. ఇలా డిఫరెంట్ ఎమోషన్స్ని అంతే అద్భుతంగా పండించారు. మిగిలిన పాత్రల్లో నటించిన పవిత్రా లోకేశ్, అచ్యుత్ తదితరులు తమ వంతుగా ఆకట్టుకునే యాక్టింగ్ చేశారు. టెక్నికల్ విషయాలకొస్తే.. 'సప్త సాగరాలు దాటి'లో హీరోహీరోయిన్ అద్భుతమైన ఫెర్పార్మెన్తో అదరగొడితే మరో ముగ్గురు సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లారు. వీళ్లలో ఫస్ట్ చెప్పుకోవాల్సింది మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ రాజ్. ప్రేమకథకు సంగీతమే ప్రాణం. ఈ సినిమాకు ఇతడిచ్చిన పాటలు కావొచ్చు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావొచ్చు మూవీకి ప్రాణం పోశాయి. మొదటి నుంచి చివర వరకు మనల్ని వేరే లోకంలోకి తీసుకెళ్లిపోయాయి. సినిమాటోగ్రాఫర్ అద్వైత గురుమూర్తి.. తన కెమెరాతో ప్రతి ఫ్రేమ్కి రిచ్నెస్ తీసుకొచ్చాడు. దర్శకుడు విజన్ని స్క్రీన్పై అద్భుతంగా వచ్చేలా చేశాడు. చివరగా రచయిత, దర్శకుడు హేమంత్ ఎమ్.రావు గురించి చెప్పుకోవాలి. ఓ సాధారణ ప్రేమకథని అంతే నిజాయితీగా చెప్పాడు. అనవసరమైన సీన్ల జోలికి పోకుండా ఉన్నది ఉన్నట్లు ప్రెజెంట్ చేశాడు. ఇకపోతే ఈ సినిమాకు సీక్వెల్ కూడా రెడీగా ఉంది. అక్టోబరు 20న అది రిలీజ్ కానుంది. -చందు డొంకాన, సాక్షి వెబ్డెస్క్ -
సప్త సాగరాలు
రక్షిత్ శెట్టి హీరోగా నటించి, నిర్మించిన కన్నడ చిత్రం ‘సప్త సాగర దాచే ఎల్లో’. హేమంత్ ఎం. రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటించారు. ఈ నెల 1న కన్నడలో విడుదలైన ఈ చిత్రం హిట్గా నిలిచింది. ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్, రక్షిత్ శెట్టి కలిసి ‘సప్త సాగరాలు దాటి’ అనే పేరుతో ఈ నెల 22న తెలుగులో విడుదల చేయనున్నారు. ‘‘క్లాసిక్ లవ్ స్టోరీగా రూపొందిన చిత్రమిది. కన్నడలో సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం తెలుగులోనూ సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు టీజీ విశ్వప్రసాద్. ఈ చిత్రానికి సహనిర్మాత: వివేక్ కూచిభొట్ల. -
అక్కడ సూపర్ హిట్.. తెలుగులో రిలీజ్ కానున్న మూవీ!
శాండల్వుడ్ స్టార్ హీరో రక్షిత్ శెట్టి, రుక్మిణి వసంత్ జంటగా నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం సప్త సాగరదాచే ఎల్లో. కన్నడలో ఈ చిత్రం సూపర్ హిట్గా నిలిచింది. హేమంత్ రావు దర్శకత్వం వహించిన ఈ మూవీని తెలుగులోనూ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తెలుగులో సప్త సాగరాలు దాటి అనే పేరుతో సెప్టెంబర్ 22న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీ తెలుగు వెర్షన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విడుదల చేస్తోంది. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా వెల్లడించారు మేకర్స్. (ఇది చదవండి: రతిక.. నా కొడుకుని వాడుకుంది, అమర్దీప్ అయితే..:పల్లవి ప్రశాంత్ పేరెంట్స్) కన్నడలో సెప్టెంబర్ 1న విడుదలై సూపర్ హిట్గా నిలిచిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. బాక్సాఫీస్ వద్ద విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సినిమాకు మౌత్ టాక్తో పాటు ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ఇతర భాషల్లోనూ రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు. కొన్ని రోజుల క్రితమే ఓ అభిమాని ట్విట్టర్ ద్వారా సప్త సాగరదాచే ఎల్లోని ఇతర భాషలలో కూడా విడుదల చేయాలని రక్షిత్ శెట్టిని అభ్యర్థించాడు. కాగా.. ఈ చిత్రాన్ని మేకర్స్ రెండు భాగాలు తెరకెక్కించారు. రెండో భాగం అక్టోబర్ 20న విడుదల కానుంది. (ఇది చదవండి: బిగ్బాస్: నాకు న్యాయం కావాలి.. చంటిపిల్లాడిలా ఏడ్చేసిన ప్రిన్స్) The waves of love are coming your way on sep 2️⃣2️⃣ nd 🥰 Unlock the doors of your hearts and let it sink through 😍❤️#SapthaSagaraluDhaati 📻🐚🌊♥️#SSDFromSep22#SSESideA@Rakshitshetty @rukminitweets @hemanthrao11 @vishwaprasadtg @vivekkuchibotla @peoplemediafcy pic.twitter.com/e4T72qJm69 — People Media Factory (@peoplemediafcy) September 15, 2023 -
రష్మికకు వింత పరిస్థితి.. ఒకేరోజు ఆ రెండు సినిమాలు రిలీజ్
యంగ్ హీరో విజయ్ దేవరకొండ కొత్త సినిమా 'ఖుషి' రిలీజ్కి రెడీ అయిపోయింది. కొన్ని గంటల్లో థియేటర్లలోకి రాబోతుంది. 'లైగర్'తో దెబ్బతిన్న విజయ్.. ఈ మూవీపై బోలెడన్ని ఆశలు పెట్టుకున్నాడు. ఇకపోతే రష్మిక మాజీ బాయ్ఫ్రెండ్ మూవీ కూడా ఇదేరోజు థియేటర్లలోకి రాబోతుంది. దీంతో ఇప్పుడు రష్మిక పరిస్థితి ఏంటా అని ఫ్యాన్స్ డిస్కస్ చేస్తున్నారు. ఇంతకీ ఏంటి విషయం? 'కిరిక్ పార్టీ' అనే కన్నడ సినిమాతో రష్మిక హీరోయిన్గా పరిచయమైంది. ఈ మూవీ చేస్తున్నప్పుడే హీరో రక్షిత్ శెట్టితో ప్రేమలో పడింది. నిశ్చాతార్థం చేసుకుని వీళ్లిద్దరూ పెళ్లికి రెడీ అయ్యారు. ఏమైందో ఏమో గానీ కొన్నాళ్లకు ఎంగేజ్మెంట్ బ్రేక్ చేసుకున్నారు. ఆ తర్వాత టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక.. ఇక్కడ స్టార్ హీరోయిన్ అయిపోయింది. (ఇదీ చదవండి: చిరంజీవి పూజగదిలో ఆ ఇద్దరి ఫొటోలు..) తెలుగులో రష్మిక ఎన్ని సినిమాలు చేసినా... వాటిలో 'గీతగోవిందం', 'డియర్ కామ్రేడ్' మాత్రం ప్రత్యేకం. ఎందుకంటే వీటిలో హీరో విజయ్ దేవరకొండతో నెక్స్ట్ లెవల్ కెమిస్ట్రీ వర్కౌట్ చేసింది. అప్పటినుంచి వీళ్లిద్దరూ లవర్స్ అని ఫ్యాన్స్ ఫిక్సయిపోయారు. బయట కూడా వీళ్లిద్దరూ ప్రేమికులు అనేలా కనిపిస్తుంటారు. వీళ్ల రిలేషన్ ఏంటనేది ఇప్పటికీ మిస్టరీనే. అయితే రష్మిక రూమర్ బాయ్ఫ్రెండ్ విజయ్ నటించిన 'ఖుషి' సినిమా సెప్టెంబరు 1న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతుండగా, మరోవైపు రష్మిక మాజీ బాయ్ఫ్రెండ్ రక్షిత్ శెట్టి హీరోగా నటించిన 'సప్త సాగర దాచే ఎల్లో' అనే ప్రేమకథా సినిమా కూడా సెప్టెంబరు 1నే థియేటర్లలోకి రాబోతుంది. రక్షిత్ శెట్టి చిత్రం కేవలం కన్నడ వెర్షన్ మాత్రమే రిలీజ్ కానుంది. మరి ఈ రెండింటిలో రష్మిక.. ఏ మూవీ చూస్తుందో అని నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. (ఇదీ చదవండి: 'జైలర్' విలన్పై లైంగిక వేధింపుల ఆరోపణలు) -
ఇక్కడ 'బేబీ'.. కన్నడలో ఆ చిన్న సినిమా!
Hostel Hudugaru Bekagiddare Movie: ఏ సినిమా ఎప్పుడు ఎందుకు ఎలా హిట్ అవుతుందనేది ఎవరూ చెప్పలేరు. తెలుగులో అలా ఈ మధ్య ఓ మాదిరి అంచనాలతో థియేటర్లలోకి వచ్చి బ్లాక్బస్టర్ టాక్ అందుకున్న మూవీ 'బేబీ'. మూడు నాలుగు చిత్రాలు తీసిన డైరెక్టర్, పెద్దగా అనుభవం లేని హీరోహీరోయిన్స్.. అయితేనేం హిట్ కొట్టారు. ఇలా టాలీవుడ్లో 'బేబీ' హవా నడుస్తుంటే.. కన్నడలో ఓ చిన్న సినిమా సెన్సేషన్ సృష్టిస్తోంది. హాస్టల్ కుర్రాళ్లు కేక కాలేజీ, హాస్టల్ బ్యాక్డ్రాప్ స్టోరీతో అన్ని ఇండస్ట్రీల్లోనూ ఇప్పటికే బోలెడన్ని సినిమాలు వచ్చాయి. కానీ తాజాగా థియేటర్లలోకి వచ్చిన కన్నడ చిత్రం 'హాస్టల్ హుడుగురు బేకాగిద్దరే'. కన్నడ ఇండస్ట్రీకి కాస్త ఊపు తీసుకొచ్చింది. ఎందుకంటే 'కేజీఎఫ్ 2', 'చార్లీ', 'కాంతార' తర్వాత శాండల్వుడ్ పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోయింది. ఆ తర్వాత సరైన హిట్ ఒక్కటంటే ఒక్కటీ ఆ ఇండస్ట్రీకి పడేలేదు. ఇప్పుడు దాన్ని 'హాస్టల్ హుడుగురు బేకాగిద్దరే'.. కొంతలో కొంత కవర్ చేసింది అనుకోవచ్చు. (ఇదీ చదవండి: రోడ్డు పక్కన గొడుగులు అమ్ముతున్న స్టార్ కమెడియన్) స్టార్ హీరోలు సైలెంట్ ఈ ఏడాది కన్నడలో పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలు రాలేదు. జనవరిలో దర్శన్ 'క్రాంతి', మార్చిలో ఉపేంద్ర 'కబ్జ' భారీ అంచనాలతో విడుదలయ్యాయి. కానీ ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో తడబడ్డాయి. ఐపీఎల్, శాసనసభ ఎన్నికల వల్ల శాండల్వుడ్ బాక్సాఫీస్ డల్ అయిపోయింది. స్టార్ హీరోలు ఎవరూ పెద్దగా సినిమాలు చేయలేదు. ఇప్పుడు ఆ అవకాశాన్ని 'హాస్టల్ హుడుగురు బేకాగిద్దరే' కరెక్ట్గా క్యాచ్ చేసి, హిట్ అయింది. కథేంటి? గత శుక్రవారం రిలీజై మంచి వసూళ్లతో దూసుకుపోతున్న ఈ చిత్రంలో అంతగా ఏముందా అంటే.. యూత్ని ఆకట్టుకునే క్రైమ్ కామెడీ. హాస్టల్ రూంలో ఉండే స్టూడెంట్స్లో ఒకడికి షార్ట్ ఫిల్మ్ తీయాలని ఉంటుంది. పరీక్షలు ఉన్నాయని ఫ్రెండ్స్ వద్దంటారు. ఓ రోజు హఠాత్తుగా వార్డెన్ శవం దొరుకుతుంది. తన చావుకి వీళ్లే కారణమని, సదరు వార్డెన్ ఈ ఐదుగురు అబ్బాయిల పేర్లు ఓ నోట్లో రాసి ఉంటాడు. ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడేందుకు ఈ కుర్రాళ్లు, ఓ సీనియర్ని హెల్ప్ అడుగుతారు. ఆ తర్వాత ఏమైందనేదే స్టోరీ. ఇంతకీ 'హాస్టల్ హుడుగురు బేకాగిద్దరే' అంటే ఏంటో చెప్పలేదు కదూ.. దానర్థం 'హాస్టల్ పిల్లలు కోరుకుంటే'. ప్రస్తుతం కన్నడలో మాత్రమే ఉన్న త్వరలో తెలుగులో రిలీజైన ఆశ్చర్య పడాల్సిన పనిలేదు. స్టార్స్ గెస్ట్ అప్పీయరెన్స్ హాస్టల్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన ఈ సినిమాని హీరో రక్షిత్ శెట్టి సమర్పించారు. ఇందులో చిన్న గెస్ట్ రోల్ లో కనిపించాడు. అలానే సీనియర్ హీరోయిన్ దివ్య స్పందన, కాంతార హీరో రిషబ్ శెట్టి కూడా అతిథి పాత్రలో మెరిసి మెప్పించారు. 'కాంతార'కు సంగీతమందించిన అజనీష్ లోక్నాథ్.. ఈ చిన్న సినిమాని తన మ్యూజిక్ తో మరో లెవల్కి తీసుకెళ్లాడు. (ఇదీ చదవండి: కమెడియన్ యాదమ్మ రాజుకి యాక్సిడెంట్!) -
టాప్ హీరోతో ఒకే ప్లేట్లో భోజనం చేసిన ఈ స్నేహితులు ఎవరంటే..
కన్నడ చిత్ర పరిశ్రమలో ప్రాణస్నేహితులు ఎవరంటే టక్కున గుర్తుకొచ్చేది.. ప్రముఖ నటులు విష్ణువర్ధన్, రెబల్ స్టార్ డా. అంబరీష్ మాత్రమే అని చెప్తారు. ఈ దిగ్గజాల తర్వాత సినీ ఇండస్ట్రీలో చాలా మంది సెలబ్రిటీలు క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. కానీ వారి బంధానికి మించి అయితే కాదు అనే టాక్ ఉంది. ఈ క్రమంలో 'కాంతార' ఫేమ్ రిషబ్ శెట్టితో రక్షిత్ శెట్టి స్నేహ బంధం అభిమానులను ఎంతగానో ఆకర్షిస్తుంది . ఒకరు కాంతార సినిమాతో పాన్ ఇండియా స్టార్గా మారితే.. రక్షిత్ శెట్టి 'చార్లీ 777' సినిమాతో బాక్సాఫీస్ బద్దలుకొట్టారు. ఇలా వీరద్దరూ కన్నడ పరిశ్రమలో పాపులర్ యాక్టర్స్ అయిపోయారు. (ఇదీ చదవండి: వైఎస్ రాజశేఖర రెడ్డి వాయిస్తో .. యాత్ర-2 పోస్టర్ వచ్చేసింది) జులై 7న రిషబ్ శెట్టి పుట్టినరోజు, ఈ నేపథ్యంలో.. వారిద్దరూ కలిసి ఒకే ప్లేట్లో భోజనం చేస్తున్న వీడియో రివీల్ అయింది. ఈ బ్యాచ్లో ప్రమోద్ శెట్టి కూడా ఉన్నారు. ఈ వీడియోను కన్నడ నటి శీతల్ శెట్టి తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ఈ వీడియో చాలా అందంగా ఉంది. కానీ ఇదీ పాతదని ఆమె తెలిపింది. ఈ వీడియో వారు సినిమా పరిశ్రమలో కష్టాలు ఎదుర్కొంటున్న నాటిదే అయినా.. వారి మధ్య ఉండే స్నేహం ఎంత బలమైనదో తెలుపుతుంది. కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి కంటే ముందే రక్షిత్ శెట్టి సినీ పరిశ్రమలో ఉన్నారు. అప్పటికే ఆర్థికంగా మంచి స్థానంలో రక్షిత్ ఉన్నారు. మొదట 'తుగ్లక్' సినిమాతో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ సినిమా జర్నీలో వీరు మంచి స్నేహితులుగా మారారు. 'తుగ్లక్' సినిమాతో హీరోగా రక్షిత్ శెట్టి ఎంట్రీ ఇచ్చారు. రిషబ్ కూడా ఒక చిన్న క్యారెక్టర్లో ఎంట్రీ ఇచ్చారు. హీరోగా రక్షిత్ శెట్టి చేసిన తొలి సినిమా ఇదే కావడం అది పరాజయం పాలవడం అతన్ని ఎంతగానో కుంగతీసింది. దానిపైన ఎన్నో ఆశలు పెట్టుకున్న అతడు డిప్రెషన్కు గురైయాడు. (ఇదీ చదవండి: Anna Lezhneva Facts: అన్నా లెజెనెవా ఎవరు? పవన్కు ఎలా పరిచయమయ్యారు?) దీంతో రిషబ్ వద్ద ఉన్న'కిరిక్ పార్టీ' కథను రక్షిత్కు చెప్పడంతో తనకు నచ్చింది. దానికి రిషబ్నే డైరెక్టర్గా తొలిసారి వ్యవహరించాడు. రక్షిత్ హీరోగా నటించడమే కాకుండా ఈ సినిమా కోసం రూ.4 కోట్లు పెట్టాడు. విడుదల తర్వాత ఈ చిత్రం పెద్ద హిట్టయింది. దాని వల్ల వారికి భారీగా డబ్బు వచ్చింది. దాంతో ‘సర్కారి హిరియ ప్రాథమిక శాలే, కాసరగోడు’ సినిమా తీశారు. దానికి మంచి గుర్తింపుతో పాటు జాతీయ అవార్డొచ్చింది. అలా వారిద్దరూ తిరిగి వెనకడుగు వేయలేదు. ప్రస్థుతం భారీ సినిమాల్లో నటించే స్థాయికి ఈ స్నేహితులు చేరుకున్నారు. View this post on Instagram A post shared by Sheetal Shetty (@isheetalshetty) -
అప్పుడు సో కాల్డ్ అంటూ కామెంట్స్.. ఇప్పుడు ఏకంగా రక్షిత్కి క్రెడిట్..
స్టార్ హీరోయిన్ రష్మిక ప్రస్తుతం చేతి నిండ సినిమాలతో బిజీగా ఉంది. తెలుగులో పుష్ప 2తో పాటు హిందీలో పలు ప్రాజెక్ట్స్ చేస్తోంది. కన్నడ నటి అయిన రష్మిక తెలుగులో చక్రం తిప్పుతొంది. ఇక ఇటీవల బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన తాజాగా ఓ ఇంటర్య్వూలో చేసిన కామెంట్స్ హాట్టాపిక్గా నిలిచాయి. గతంలో తనకు నటిగా తొలి అవకాశం ఇచ్చిన ప్రొడక్షన్ హౌజ్ పేరు చేప్పేందుకు ఆసక్తి చూపని ఆమె ఏకంగా తన మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టికి క్రెడిట్ ఇచ్చింది. దీంతో రష్మిక కామెంట్స్ దక్షిణాన చర్చనీయాంశమయ్యాయి. చదవండి: ఐశ్వర్య ఇంట్లో చోరీ.. ఆ డబ్బుతో చెన్నైలో ఇల్లు, లగ్జరీ వస్తువులు కొన్నారు.. ఈ మేరకు తాజా ఇంటర్య్వూలో రష్మిక మాట్లాడుతూ.. ‘‘నేను నటిని అవుతానని ఎప్పుడు అనుకోలేదు. కానీ, చిన్నప్పటి నుంచి నాకు సినిమాలు అంటే చాలా ఇష్టం. అందుకే నటిని కావాలని కొన్ని సినిమా ఆడిషన్స్కు వెళ్లేదాన్ని. నిరాశతో వెనక్కి వచ్చేదాన్ని. నటన అనేది నాకు సెట్ కాదని, అది నాకు రాసి పెట్టి లేదని అనుకునేదాన్ని. అలాంటి సమయంలో ఓ అందాల పోటీలో పాల్గొన్నా. ఈ పోటీలో గెలిచి టైటిల్ సొంతం చేసుకున్నా. దీంతో నా ఫొటో అన్ని పత్రికల్లో వచ్చింది. దానిని చూసి పరంవా స్టూడియోస్ (రక్షిత్ శెట్టికి సంబంధించిన నిర్మాణ సంస్థ) నుంచి కాల్ వచ్చింది. వాళ్లు తెరకెక్కిస్తోన్న ‘కిరిక్ పార్టీ’లో నాకు లీడ్ రోల్ ఆఫర్ చేశామని దర్శక- నిర్మాతలు చెప్పారు. అలా, నటిగా నా తొలి అడుగు పడింది’’ అని రష్మిక చెప్పుకొచ్చింది. చదవండి: రష్యా అధ్యక్షుడు పుతిన్ను విమర్శిస్తూ పాట పాడిన ప్రముఖ సింగర్ కన్నుమూత కాగా కాంతార మూవీ సమయంలో రష్మిక తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఓ ఇంటర్య్వూలో నటిగా తనకు కెరీర్ ఇచ్చిన ప్రొడక్షన్ హౌజ్ చెప్పకుండ సో కాల్డ్ ప్రొడక్షన్ అని వ్యాఖ్యానించింది. దీంతో కన్నడ నాట ఆమె తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంది. శాండల్వుడ్ సినీప్రముఖులు సైతం రష్మికపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె నిర్మాణ సంస్థ పేరు చెప్పడంతో ఎట్టకేలకు రష్మిక దిగొచ్చిందంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే ఆమె ఫ్యాన్స్ మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా కిరిక్ పార్టీ సమయంలో ప్రేమలో పడిని రక్షిత్ శెట్టి-రష్మికలు ఎంగేజ్మెంట్ చేసుకుని విడిపోయిన సంగతి తెలిసిందే. -
నన్ను ఇండస్ట్రీకి పరిచయం చేసింది వారే.. కాంతార హీరోపై రష్మిక షాకింగ్ కామెంట్స్
రష్మిక మందన్నా సౌత్ ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్లోనూ పలు చిత్రాల్లో నటించింది. పుష్ప సినిమా ఒక్కసారిగా నేషనల్ క్రష్గా మారిపోయింది ముద్దుగుమ్మ. ప్రస్తుతం పుష్ప-2 సినిమాతో బిజీగా ఉంది. అయితే గతంలో రిషబ్ శెట్టి కాంతార సినిమాపై కామెంట్స్ చేసి వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. కన్నడలో ఘన విజయం సాధించిన కాంతార చిత్రం విషయంలో రష్మిక మాటలు తీవ్ర వివాదాస్పదం కావడమే ఇందుకు కారణం. ఒక దశలో కన్నడ చిత్ర పరిశ్రమ రష్మికను బ్యాన్ చేసిందనే ప్రచారం కూడా జరిగింది. ఈ విషయంలో రిషబ్ శెట్టి, రష్మిక ఒకరిపై ఒకరు విమర్శలు కూడా చేసుకున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రష్మిక రిషబ్ శెట్టి, రక్షిత్ శెట్టిలపై పాజిటివ్ కామెంట్స్ చేశారు. కిరాక్ పార్టీ అనే చిత్రం ద్వారా తనను ఇండస్ట్రీకి పరిచయం చేసింది వారేనని చెప్పుకొచ్చింది. తాను ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నానంటే వారిద్దరే కారణమని తెలిపింది. అయితే ఆ మూవీలో నటించిన హీరో రక్షిత్తో ప్రేమాయణం నడిపినట్లు టాక్ వినిపించింది. అలాగే తనపై ఇటీవల సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా ఎక్కువగా వస్తున్నాయని తెలిపింది. ఇకపై అలాంటి వాటిని సహించబోనని చెబుతోంది నేషనల్ క్రష్. సడన్గా రిషబ్, రక్షిత్పై పాజిటివ్ కామెంట్స్ చేయడంతో మరోసారి చర్చనీయాంశంగా మారింది. -
రష్మికకు రిషబ్ శెట్టి గట్టి కౌంటర్, ట్వీట్ వైరల్
స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా, కాంతార హీరో రిషబ్ శెట్టి మధ్య కొద్ది రోజులుగా కొల్డ్ వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. గతంలో ఇద్దరు ఒకరిపై ఒకరు పరోక్షంగా కౌంటర్ వేసుకున్న వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. అయితే ఇద్దరి మధ్య ఎలాంటి మన్పర్థలు లేవని, సత్సంబంధాలే ఉన్నాయని రష్మిక ఇటివల చెప్పింది. కానీ, తాజాగా రిషబ్ శెట్టి రష్మికకు ఇన్డైరెక్ట్ కౌంటర్ ఇస్తూ చేసిన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశమైంది. కాగా రష్మిక కన్నడ మూవీ కిరిక్ పార్టీ మూవీతో సినీరంగ ప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. 2016లో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. రిషబ్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీతోనే రష్మిక హీరోయిన్గా పరిచయమైంది. తాజాగా శుక్రవారంతో (డిసెంబర్ 30) ఈ సినిమా విడుదలైన ఆరేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా రిషబ్ శెట్టి ట్వీట్ చేస్తూ.. ‘మా సినిమా విడుదలై ఆరేళ్లు అయినప్పటికీ.. మా కోసం మీరు చేసిన సందడి, థియేటర్లో మీరు వేసిన విజిల్స్ అన్ని మా చెవుల్లో మారుమ్రోగుతూనే ఉన్నాయి. మమ్మల్ని మరోసారి ఆ రోజుల్లోకి తీసుకువెళ్లున్నాయి. ఈ సెలబ్రేషన్స్లో భాగమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు’ అని రాసుకొచ్చాడు. అలాగే తన ట్వీట్కి హీరో రక్షిత్ శెట్టి, నిర్మాణ సంస్థ పేరు, మ్యూజిక్ డైరెక్టర్ లోక్నాథ్ను ట్యాగ్ చేశాడు. అయితే ఇందులో హీరోయిన్గా లీడ్ రోల్ పోషించిన రష్మిక పేరును ప్రస్తావించకపోవడం గమనార్హం. అంతేకాదు ఆమె పేరు కూడా ట్యాగ్ చేయలేదు. దీంతో ఈ ట్వీట్ వైరల్గా మారింది. దీంతో ఇది కాస్తా ఇండస్ట్రీలో హాట్టాపిక్ నిలిచింది. అయితే ‘గతంలో రష్మిక తనకు ఆఫర్ ఇచ్చిన నిర్మాణ సంస్థ, డైరెక్టర్ పేరు చెప్పకుండ సోకాల్డ్ ప్రొడక్షన్ అని చెప్పి అవమానపరించింది.. ఇప్పుడు రిషబ్ శెట్టి మూవీలో భాగమైన రష్మిక పేరు ప్రస్తావించకుండా ఆమెకు గట్టి కౌంటర్ ఇచ్చాడు’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 'ಕಿರಿಕ್ ಪಾರ್ಟಿ' ನೆಡೆದು ಆರು ವರ್ಷಗಳ ನಂತರವೂ ಪಾರ್ಟಿಗೆ ಕಳೆ ತಂದ ನಿಮ್ಮ ಸದ್ದು, ಗದ್ದಲ, ಸಿಳ್ಳೆಗಳು ಇನ್ನೂ ಕಿವಿಯಲ್ಲಿ ಪ್ರತಿಧ್ವನಿಸುತ್ತಿವೆ. ಮತ್ತೆ ಹಿಂತಿರುಗಿ ನೋಡುವಂತೆ ಮಾಡುತ್ತವೆ. ಈ ಸಂಭ್ರಮದ ಭಾಗವಾದ ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೂ ಧನ್ಯವಾದಗಳು. @rakshitshetty @ParamvahStudios @AJANEESHB #KirikParty pic.twitter.com/Rgaq5Lywmq — Rishab Shetty (@shetty_rishab) December 30, 2022 చదవండి: మహేశ్-మహేశ్ మూవీ నుంచి బిగ్ అప్డేట్ బయటపెట్టిన రచయిత సినీ పరిశ్రమలో విషాదం.. నిద్రలోనే కన్నుమూసిన ప్రముఖ నటుడు -
ఆ ఓటీటీలోకి ‘‘777 ఛార్లి’ .. వాళ్లు మాత్రమే చూడొచ్చు!
కన్నడ యాక్టర్ రక్షిత్ శెట్టి హీరోగా నటించిన లెటెస్ట్ చిత్రం ‘ఛార్లి 777’. ఎలాంటి అంచనాలు లేకుండా ఈ ఏడాది జూన్ 10న విడుదలైన ఈ చిత్రం.. భారీ విజయాన్ని అందుకుంది. మనిషికి, పెంపుడు కుక్క మధ్య ఉన్న బాండింగ్ను ఎంతో అద్భుతంగా తెరకెక్కించాడు దర్శకుడు కిరణ్రాజ్. ఈ సినిమాను తెలుగులో సురేష్ ప్రొడక్షన్స్పై హీరో రానా రిలీజ్ చేశారు. టాలీవుడ్లో కూడా మంచి వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం.. ఇప్పుడు ఓటీటీలో అలరించడానికి రెడీ అయింది. సెప్టెంబర్ 30 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ఫ్రైమ్లో ‘777 ఛార్లి’ స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ ట్విటర్ వేదికగా వెల్లడించింది. అయితే ఈ చిత్రం అమెజాన్ ఫ్రైమ్ చందాదారులందరూ చూడడానికి వీలులేదు. కేవలం రెంట్కు మాత్రమే ఈ చిత్రాన్ని ఫ్రైమ్ వీడియోలో చూడొచ్చు. ఫ్రైమ్ వీడియోలో కంటే ముందు మరో ఓటీటీలో కూడా ఈ చిత్రం విడుదలైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ వూట్లో జులై 29 నుంచే ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా సురేశ్ ప్రొడెక్షన్స్ అమెజాన్ ఫ్రైమ్లో విడుదల చేశారు. ‘777 ఛార్లి’ కథ ఏంటంటే.. ధర్మ(రక్షిత్ శెట్టి) కుటుంబ సభ్యులంతా చిన్నతనంలోనే ఓ ప్రమాదంలో మరణిస్తారు. ఒంటరిగా బతుకున్న ధర్మ జీవితంలోకి ఛార్లి అనే శునకం ఎంట్రీ ఇస్తుంది. అనుకొని పరిస్థితుల వల్ల ఓసారి ధర్మ ఇంటినుంచి బయటకు వస్తుంది ఛార్లి. ఆ తర్వాత ఛార్లీకి ఎలాంటి ఇబ్బందులు ఏర్పడ్డాయి? ధర్మను ఎలా ఎసుకుంది? వారి మధ్య అనుబంధం ఎలా సాగింది? అనేదే మిగతా కథ. A teary tale of the most precious bond to ever exist 🐕🫶 777 Charlie available for rent from Sept 30 on the #PrimeVideoStore#777Charlie #777சார்லி #777చార్లీ #777ചാർലി #777चार्लि @rakshitshetty @RanaDaggubati @Kiranraj61 @ParamvahStudios @sangeethaSring pic.twitter.com/JeyJShF1De — Suresh Productions (@SureshProdns) September 24, 2022 -
ఓటీటీకి వచ్చేసిన ‘777 చార్లీ’, స్ట్రీమింగ్ ఎక్కడంటే..
కన్నడ హీరో, నిర్మాత రక్షిత్ నటించిన లేటెస్ట్ మూవీ 777 చార్లీ. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ మూవీ దేశవ్యాప్తంగా సంచలన విజయం అందుకుంది. జూన్ 10న తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదలైంది. కిరణ్రాజ్ కే దర్శకత్వం వహించిన ఈ డిఫరెండ్ సినిమాకి విమర్శకుల ప్రశంసలు సైతం అందాయి. ఇందులో తన నటనతో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు రక్షిత్. చదవండి: విజయ్, రష్మిక డేటింగ్పై ప్రశ్న.. హింట్ ఇచ్చిన అనన్య పాండే ఈ మూవీతో రక్షిత్ నేషనల్ స్టార్గా గుర్తింపు పొందాడు. అంతగా ప్రేక్షకాదరణ పొందిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ వూట్(Voot) ఈ మూవీ స్ట్రీమింగ్ రైట్స్ను భారీ రేటుకు సొంతం చేసుకుంది. నేటి(జూలై 29) అర్ధరాత్రి నుంచి ఈ మూవీ వూట్లో అన్ని దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ అందుబాటులోకి రానుంది. అయితే ఈ సినిమా చూడాలంటే ముందుగా వూట్ సెలక్ట్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. ధీని ధర నెలకు రూ. 99 నుంచి అందుబాటులో ఉంది. చదవండి: మూవీ ఎంట్రీపై మెగా డాటర్ నిహారిక భర్త చైతన్య క్లారిటీ! కాగా వూట్ సెలక్ట్ అనేది వయాకామ్ యెక్క వీడియో ఆన్ డిమాండ్ ప్లాట్ఫాం. దీనిని ఐఓఎస్(ios), ఆండ్రాయిడ్ మొబైల్స్లో లౌన్లోడ్ చేసుకోవచ్చు. కాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్పై ఈ మధ్యే రక్షిత్ ట్వీట్ చేస్తూ.. ‘ఇది కేవలం సినిమాగానే కాకుండా సరికొత్త అనుభూతిని మిగుల్చుతుంది. నాకు ఆ నమ్మకం ఉంది. అందుకే ఎన్నో ఓటీటీ ఆఫర్లు వచ్చినా సరే పట్టించుకోకుండా థియేటర్లలోనే ఈ సినిమాను విడుదల చేశాం. ఇప్పుడు ఓటీటీలో విడుదలై అక్కడ కూడా అందరికీ మంచి అనుభూతిని పంచుతుంది అని ఆశిస్తున్నా' అంటూ రాసుకొచ్చాడు. A dollop more of the deleted scenes from #777Charlie And a pleasant news for all of you have who been waiting to watch the film on OTT, @777CharlieMovie will have its digital premiere on @VootSelect on the 29th of July 😊 pic.twitter.com/HLjTVWymgm — Rakshit Shetty (@rakshitshetty) July 27, 2022 -
777 చార్లీ హీరోను సర్ప్రైజ్ చేసిన రజనీకాంత్
కన్నడ యాక్టర్ రక్షిత్ శెట్టి హీరోగా నటించిన తాజా చిత్రం ‘777 చార్లీ’. సంగీత శ్రింగేరి కథానాయికగా నటించిన ఈ చిత్రానికి కె. కిరణ్రాజ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను తెలుగులో సురేష్ ప్రొడక్షన్స్పై హీరో రానా రిలీజ్ చేశాడు. జూన్ 10న విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అయితే ఈ సినిమా చూసి ఒక్కసారిగా ఏడ్చేశాడు. అంతలా మనసులను కదిలించిందీ చిత్రం. తాజాగా 777 చార్లీ సినిమా వీక్షించాడు సూపర్స్టార్ రజనీకాంత్. అంతేకాదు సినిమా బాగుందంటూ తనకు ఫోన్ చేసి సర్ప్రైజ్ చేశాడట. ఈ విషయాన్ని హీరో రక్షిత్ శెట్టి సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు. 'ఈ రోజు ఎంతో గొప్పగా మొదలైంది. రజనీకాంత్ సర్ ఫోన్ చేశారు. నిన్న రాత్రి 777 చార్లీ చూసి అద్భుతంగా ఉందని ఫీలయ్యారు. సినిమాను అంత క్వాలిటీగా, ఎంతో లోతుగా టచ్ చేసేలా తీయడం, క్లైమాక్స్ తెరకెక్కించిన విధానం, ఆధ్యాత్మిక కోణంలో ముగించడం బాగుందని మెచ్చుకున్నారు. సూపర్ స్టార్ నోటి నుంచి అలాంటి మాటలు వినడం ఎంతో సంతోషంగా అనిపించింది.. థాంక్యూ రజనీకాంత్ సర్' అని ట్వీట్ చేశాడు. …how it concludes on a spiritual note. To hear such words from the superstar himself is beyond wonderful. Thank you so much @rajinikanth sir 🤗🤗🤗 — Rakshit Shetty (@rakshitshetty) June 22, 2022 చదవండి: పక్కా కమర్షియల్ ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా చిరంజీవి! -
మనసును హత్తుకున్న '777 చార్లి'.. వచ్చేది ఈ ఓటీటీలోనే..
కన్నడ యంగ్ హీరో రక్షిత్ శెట్టి తాజాగా నటించిన చిత్రం '777 చార్లి'. పెట్ డాగ్ నేపథ్యంతో వచ్చిన ఈ మూవీ పాన్ ఇండియాగా తెరకెక్కించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా జూన్ 10న విడుదలైంది. కె. కిరణ్ రాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్తో దూసుకుపోతూ భారీ వసూళ్లను రాబడుతోంది. ఒక వ్యక్తికి, చార్లి అనే కుక్కకు మధ్య ఉన్న అనుబంధాన్ని ఈ చిత్రంలో హృద్యంగా చూపించారు. ఇటీవల ఈ సినిమా చూసిన కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై వెక్కి వెక్కి ఏడ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ మూవీ డిజిటల్ రైట్స్కు సంబంధించిన ఆసక్తికర విషయం వైరల్ అవుతోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ను ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ గెలుచుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇంకా డిజిటల్ రిలీజ్ డేట్ ప్రకటించని ఈ మూవీ ఆగస్టు రెండో వారం నుంచి ప్రేక్షకులకు అందుబాటులో ఉంటుందని సమాచారం. కాగా '777 చార్లి' ఇప్పటివరకు రూ. 30 కోట్లకుపైగా కొల్లగొట్టిందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇకపోతే రక్షిత్ శెట్టి కన్నడ సినిమా 'కిరిక్ పార్టీ'తో తెరంగేట్రం చేశాడు. తర్వాత వచ్చి 'అతడే శ్రీమన్నారాయణ' మూవీతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. చదవండి: 13 ఏళ్ల పిల్లల నుంచి అత్యాచార బెదిరింపులు, తట్టుకోలేకపోయాను: నటి ముసలిదానివైపోతున్నావ్.. అంటూ అనసూయపై కామెంట్లు ఇప్పుడు నా అప్పులన్నీ తీర్చేస్తా: కమల్ హాసన్ -
సినిమా చూసి వెక్కి వెక్కి ఏడ్చేసిన సీఎం
బెంగళూరు: భావోద్వేగాలు మనిషికి సహజం. అందులో తెర మీద చూసినప్పుడు మరింత భావోద్వేగానికి లోనవుతుంటారు. అందుకే ఆ ముఖ్యమంత్రి ఆ సినిమాను చూసి వెక్కి వెక్కి ఏడ్చేశారు. ఆయన అంతలా ఎమోషనల్ కావడానికి ఓ ప్రత్యేకమైన కారణం కూడా ఉందండోయ్. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై.. తాజాగా రక్షిత్ శెట్టి లీడ్ రోల్లో నటించిన ‘777 ఛార్లీ’ సినిమా చూశారు. మనిషికి, పెంపుడు కుక్క మధ్య ఉన్న బాండింగ్ను ఎంతో అద్భుతంగా తెరకెక్కించాడు దర్శకుడు కిరణ్రాజ్. అయితే ఈ సినిమా ప్రత్యేక ప్రదర్శన చూసి కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై ఒక్కసారిగా ఏడ్చేశారు. బొమ్మై గతంలో స్నూబీ అనే కుక్కను పెంచారు. ఆయన సీఎం పదవి చేపట్టడం కంటే ముందే ఆ శునకం కన్నుమూసింది. దాని అంత్యక్రియల సమయంలో వెక్కి వెక్కి ఏడ్చారాయన. అంతేకాదు సీఎం అయ్యాక.. ఓ ఇంటర్వ్యూలో స్నూబీ ఫొటోల్ని చూపించగా కన్నీటి పర్యంతం అయ్యారు. Okayyyyy…. I think I like our CM much more now. This is when they lost ‘Sunny’- their 14 year old family dog. #BasavarajBommai pic.twitter.com/4ECmQMdLA6 — Sangita (@Sanginamby) July 29, 2021 కుక్కల మీద గతంలో సినిమాలు వచ్చాయి. కానీ, ఈ సినిమాలో భావోద్వేగాలతో చూపించారు. చార్లీ కేవలం తన కళ్ల ద్వారా భావోద్వేగాలను వ్యక్తపరుస్తుంది. సినిమా బాగుంది, అందరూ తప్పకుండా చూడాల్సిందే. షరతులు లేని ప్రేమ(అన్కండిషనల్ లవ్) గురించి మాట్లాడుతున్నాను. కుక్క ప్రేమ అనేది షరతులు లేని ప్రేమ, చాలా స్వచ్ఛమైనది.. అంటూ కన్నీళ్లు తుడుచుకుంటూ మాట్లాడారాయన. -
స్టార్ ప్రొడ్యూసర్
-
ఆ మూవీ ట్రైలర్ చూడగానే కన్నీళ్లొచ్చాయి : రానా
‘‘మంచి కథలను, చిత్రాలను ప్రేక్షకులకు అందించడంలో నేను యాక్టర్గా లేదా నిర్మాతగా... ఎలా ఉన్నా నాకు ఇష్టమే. ‘చార్లీ 777’ వంటి సినిమాలు అరుదుగా వస్తుంటాయి. ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు నటుడు, నిర్మాత రానా. కన్నడ యాక్టర్ రక్షిత్ శెట్టి హీరోగా నటించిన తాజా చిత్రం ‘చార్లీ 777’. సంగీత శ్రింగేరి ఫీమేల్ లీడ్గా నటించిన ఈ చిత్రానికి కె. కిరణ్రాజ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం జూన్ 10న విడుదల కానుంది. ఈ సినిమాను తెలుగులో సురేష్ ప్రొడక్షన్స్పై హీరో రానా రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా శనివారం జరిగిన ప్రెస్మీట్లో ‘చార్లీ 777’ బిగ్ టికెట్ను రానా లాంచ్ చేశారు. అనంతరం రానా మాట్లాడుతూ – ‘‘చార్లీ 777’ ట్రైలర్ చూడగానే నాకు కన్నీళ్లు వచ్చాయి. ఈ సినిమాను చూసిన ప్రతిసారి ఎమోషన్ రెట్టింపు అవుతూనే ఉంది. రక్షిత్ శెట్టి చాలా కష్టపడ్డారు. ఈ సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులు నవ్వుతారు.. ఏడుస్తారు. ఇలాంటి మంచి సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నందుకు చాలా గర్వంగా, సంతోషంగా ఉంది’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో ధర్మ అనే పాత్ర చేశాను. ధర్మ జీవితంలోకి చార్లీ (పెట్ డాగ్) వచ్చిన తర్వాత అతని జీవితం ఎలా మారిపోయింది? అన్నదే కథ. ఈ సినిమా దర్శకుడు కిరణ్రాజ్ అంకితభావం ఉన్న దర్శకుడు. చార్లీతో సీన్స్ చాలా కష్టంగా ఉండేవి. ఒకరోజు ఒకే షాట్ తీసిన సందర్భాలు ఉన్నాయి. అలాగే కశ్మీర్ ఎపిసోడ్ను మైనస్ 5 డిగ్రీల వాతావరణంలో తీశాం. చాలా కష్టంగా అనిపించింది’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో యానిమల్ వెల్ఫేర్ ఆఫీసర్ దేవికా ఆరాధ్య పాత్రలో నటించాను’’ అన్నారు సంగీత శ్రింగేరి. -
పెళ్లి పీటలెక్కనున్న రష్మిక మాజీ లవర్?
కన్నడ మూవీ కిరిక్ పార్టీతో సినీరంగ ప్రవేశం చేసింది రష్మిక మందన్నా. ఈ సినిమా షూటింగ్ సమయంలో హీరో రక్షిత్ శెట్టితో ప్రేమలో పడింది. దీంతో వీళ్లిద్దరూ ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. తర్వాత ఏమైందో ఏమో కానీ తమ నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత రెండు కన్నడ సినిమాలు చేసిన రష్మిక 2018లో ఛలో సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టింది. గీతాగోవిందం సినిమాతో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. పుష్ప మూవీతో పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం రష్మిక పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఇదిలా ఉంటే తాజాగా రష్మిక మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టి పెళ్లి చేసుకోనున్నట్లు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్గా మారింది. ప్రస్తుతం 'చార్లీ 777' సినిమా ప్రమోషన్స్తో బిజీగా ఉన్న రక్షిత్.. రమ్య అనే అమ్మాయిని పెళ్లాడబోతున్నాడంటూ ఊహాగానాలు ఊపందుకున్నాయి. దీంతో రక్షిత్ స్నేహితుడు, నటుడు రిషబ్ శెట్టి ఈ వార్తలపై స్పందిస్తూ.. మావాడికి సాండల్వుడ్ గోల్డెన్ గర్ల్తో పెళ్లా? అని ఫక్కున నవ్వేశాడు. కొన్ని యూట్యూబ్ ఛానళ్లు ప్రచారం చేస్తున్నట్లుగా రక్షిత్ రమ్యను పెళ్లి చేసుకోవడం లేదని క్లారిటీ ఇచ్చాడు. ఇటీవలే రక్షిత్ సైతం ఈ రూమర్లపై స్పందిస్తూ ఇంతవరకు ఆమెను అసలు కలవలేదని బదులిచ్చాడు. కాకపోతే తాను నటించిన 'ఉలిదవవరు కందంటే' సినిమా బాగుందని ఆమె ఓసారి తనను మెచ్చుకుందన్నాడు. చాలామందిలాగే తనకు కూడా కాలేజీ రోజుల్లో రమ్య అంటే క్రష్ ఉండేదని, అంతకుమించి ఏమీ లేదని చెప్పుకొచ్చాడు. రమ్య తప్పకుండా ఏదో ఒకరోజు తిరిగి సినిమాల్లోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. చదవండి 👉🏾 ఆస్కార్ కొత్త రూల్స్.. ఈ థియేటర్స్లో బొమ్మ పడాల్సిందేనట! మొన్నటిదాకా మహానటిని, ఇప్పుడు కళావతిని -
లైవ్లో ఎక్స్లవ్, బ్రేకప్పై ప్రశ్న, రష్మిక ఏం చెప్పిందంటే..
Rashmika Mandanna About Her Ex Love: రష్మిక మందన్నా.. ప్రస్తుతం వరస సినిమాల సక్సెస్, సోషల్ మీడియా ఫ్యాన్డమ్ను ఎంజాయ్ చేస్తోంది. నటిగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. నెట్టింట సైతం ఫుల్ యాక్టివ్గా ఉంటోంది రష్మిక. ఈ నేపథ్యంలో ఇన్స్టాగ్రామ్లో 30 మిలియన్ల ఫ్యాన్ ఫాలోయింగ్ను సంపాదించుకున్న ఆమె తాజాగా యూట్యూబ్లో సైతం అడుగు పెట్టింది. తాను యూట్యూబ్ ఛానల్ను స్టార్ట్ చేసినట్లు గురువారం ప్రకటించింది. ఈ సందర్భంగా లైవ్ సెషన్ నిర్వహించిన రష్మికకు ఫ్యాన్స్ నుంచి రకరకాల ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ క్రమంలో తనకు నటన అంటే ఎంతో ఇష్టమని చెప్పింది. చదవండి: ఓటీటీలోకి అజిత్ ‘వలిమై’, స్ట్రీమింగ్ ఎక్కడంటే.. అలాగే ట్రావెలింగ్, డ్యాన్స్ అంటే చాలా ఇష్టమని, అవి ఎందుకు అంత ఇష్టమో కూడా వివరించింది. ఈ క్రమంలో ఓ నెటిజన్ తన ఎక్స్ లవ్, ఎంగేజ్మెంట్ బ్రేకప్పై ప్రశ్నించాడు. ‘ప్రతి ఒక్కరికి మీ ఎక్స్ లవ్ గురించి తెలుసుకోవాలని ఉంది. కానీ మీరు తనతో ఎందుకు విడిపోయారో తెలుసుకోవాలనే ఆసక్తి కూడా ఉంది’ అంటూ ఆరా తీశాడు.ఇక అన్ని ప్రశ్నలకు టకటక సమాధానాలు చెప్పిన రష్మిక.. దీనికి మాత్రం ఎలాంటి బదులు ఇవ్వకుండ ఆ ప్రశ్నను దాటేసింది. కాగా రష్మిక కన్నడ నటుడు, తన తొలి చిత్రం ‘కిరిక్ పార్టీ’ మూవీ కోస్టార్ రక్షిత్ శెట్టితో కొంతకాలం ప్రేమలో మునిగి తేలిన సంగతివ తెలిసిందే. చదవండి: గుర్తు పట్టలేనంతగా ‘ఓయ్’ హీరోయిన్ షామిలీ, ఫొటోలు వైరల్ ఈ క్రమంలో 2018లో అతడితో నిశ్చితార్థం కూడా చేసుకున్న రష్మిక తెలుగులో ఆమె నటించిన గీతా గోవిందం మూవీ అనంతరం రక్షిత్తో ఎంగేజ్మెంట్ను బ్రేక్ చేసుకుంది. అప్పట్లో కన్నడ పరిశ్రమలో ఈ వార్త హాట్టాపిక్గా నిలిచింది. ఇదిలా ఉంటే ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ మూవీ ప్రమోషన్ కార్యక్రమాల్లో ప్రేమ, పెళ్లి గురించి మాట్లాడుతూ.. ‘ఎవరి దగ్గర అయితే సెక్యూర్గా ఫీల్ అవుతామో.. కంఫర్ట్గా అన్ని విషయాలు షేర్ చేసుకుంటూ స్నేహంగా ఉంటాం అనిపిస్తుందో అతడే జీవితంకు మంచి లైఫ్ పార్టనర్.. అలాంటి వాడినే భర్తకు ఎంచుకుంటాను’ అంటూ చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే యంగ్ హీరో విజయ్ దేవరకొండ-రష్మికలు డేటింగ్ చేస్తున్నారంటూ కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. -
మాజీ ప్రియుడితో మళ్లీ కలవనున్న రష్మిక?
సినీ పరిశ్రమలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు అంటూ ఉండరని గతంలో అనేక సందర్భాల్లో రుజువైంది. తాజాగా అది మరోసారి ప్రూవ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. టాలీవుడ్లో ప్రస్తుతం రష్మిక మందనకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఛలోతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోలతో వరుస సినిమా ఛాన్స్లు దక్కించుకుంటూ ఫుల్ బిజీ అయ్యింది ఈ కన్నడ ముద్దుగుమ్మ. అయితే కన్నడంలో ‘కిరాక్ పార్టీ’తో చిత్ర పరిశ్రమకు పరిచయం అయిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో తనతో జోడి కట్టిన రక్షిత్ శెట్టిని ప్రేమించి నిశ్చితార్థం కూడా చేసుకుంది. అయితే కొన్ని రోజుల్లో పెళ్లి అనగా ఏం జరిగిందో ఏమో కాని ఇద్దరూ బ్రేకప్ అయ్యారు. (తండ్రిపై రష్మిక ఎమోషనల్ పోస్ట్..) అయితే తాజాగా లీకువీరులు అందిస్తున్న సమాచారం ప్రకారం రష్మిక, రక్షిత్ శెట్టిలు మళ్లీ కలవనున్నారు. ఎందుకంటే కన్నడంలో సూపర్డూపర్ హిట్ సాధించిన కిరాక్ పార్టీ సినిమాకు సీక్వెల్ వస్తోంది. ఈ సినిమాలో రక్షిత్ శెట్టినే హీరో. అయితే హీరోయిన్గా రష్మికను కాకుండా కొత్తవాళ్లని ఎవరినైనా తీసుకోవాలని రక్షిత్ భావిస్తున్నాడట. అయితే నిర్మాతలు మాత్రం రష్మిక అయితేనే బాగుంటుందని హీరోకు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు కిరాక్ పార్టీ సీక్వెల్లో రక్షిత్తో కలిసి నటించేందుకు తనకు ఎలాంటి అభిప్రాయం లేదని రష్మిక తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. అయితే రష్మిక-రక్షిత్లో మరోసారి ఆన్స్క్రీన్పై చూడాలని అక్కడి అభిమానులు తెగ కోరుకుంటున్నారంట. మరి కిరాక్ పార్టీ సీక్వెల్ కోసం ఈ మాజీ ప్రేమికులు కలుస్తారా లేదా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. (పెంగ్విన్ మూవీ రివ్యూ) -
మేమిద్దరం ఎందుకు పెళ్లి చేసుకోలేదంటే: రష్మిక
సినిమా రంగంలోనే కాదు ఇతర రంగాల్లోనూ ప్రేమలు, విడిపోవడాలు సహజంగా జరుగుతూనే ఉంటాయి. అయితే సినిమాగ్లామర్ ప్రపంచం కాబట్టి కాస్త ప్రచారం ఎక్కువ జరుగుతుంది. అలా ఇప్పుడు మాతృభాష కన్నడంలోనే కాదు, తెలుగు, తమిళం, తాజాగా హిందీ భాషల్లోనే పేరు తెచ్చుకున్న నటి రష్మిక మందనా. ఈ అమ్మడు టాలీవుడ్లో గీతగోవిందం చిత్రంతో అనూహ్యంగా క్రేజ్ పొందింది. అలా రాత్రికి రాత్రే స్టార్ హీరోయిన్ అయ్యిందనే చెప్పాలి. ఇక డియర్ కామ్రేడ్ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయినా, ముఖ్యంగా కోలీవుడ్, టాలీవుడ్లో రష్మిక మాత్రం చాలా పాపులర్ అయ్యింది. (చదవండి: రష్మిక కలలు చాలా పెద్దవి) తాజాగా బాలీవుడ్ కాలింగ్ మోగింది. అదే విధంగా తెలుగులో స్టార్ హీరోలతో జతకట్టేస్తోంది. కాగా రష్మిక నిజ జీవితం విషయానికి వస్తే తన సహ నటుడితో లవ్లో పడి ఆ తరువాత పెళ్లి వరకూ వెళ్లి దాన్ని రద్దు చేసుకుంది. ఈ విషయాన్ని ఇటీవల తనే ఒక ఇంటర్వ్యూలో పేర్కొంది. అవును తాను ప్రేమలో పడ్డాను. పెళ్లి నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే తానెందుకు పెళ్లిని రద్దు చేసుకున్నానంటే అని కన్నడ నటుడు, నిర్మాత రక్షిత్ శెట్టితో తనకు నిశ్చితార్థం జరిగిందని, అయితే తనకు కాబోయే భర్త సినిమా రంగానికి చెందిన వాడు కాకూడదని తాను భావించానంది. అయితే రక్షిత్ శెట్టి పరిచయం అవగానే తను చాలా వ్యత్యాసంగా అనిపించాడని చెప్పింది. ఆయనపై పుట్టిన ప్రేమ కారణంగా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నానని చెప్పింది. అయితే సినిమాలో ఇద్దరం పేరు తెచ్చుకోవాలని ఆశ పడడంతో పెళ్లిని రెండేళ్లు వాయిదా వేసుకోవాలని నిర్ణయించుకున్నామని చెప్పింది. అయితే అలా రెండేళ్లు గడిచిన తరువాత కూడా అవకాశాలు అధికం అవ్వడంతో పెళ్లికి సమయాన్ని కేటాయించడం తనకు సాధ్యం కాలేదని చెప్పింది. పెళ్లి చేసుకుంటే నిర్మాతలను ఇబ్బందులకు గురి చేసినట్లవుతోందని భావించానంది. వారికి అలాంటి సమస్యలను తెచ్చిపెట్టరాదనే తాను పెళ్లి నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నట్లు చెప్పింది. కాగా ఇదే విషయంపై ఇటీవల తాను హీరోగా నటించిన పంచాక్షరం చిత్ర ప్రమోషన్ కోసం వచ్చిన నటుడు, రష్మిక మాజీ ప్రియుడు రక్షిత్శెట్టి స్పందిస్తూ కొన్ని విషయాలను మరచిపోవడమే మంచిది అని పేర్కొన్నారు. అయితే ఆయన నటి రష్మిక చెప్పినంత ఈజీగా తన పెళ్లి రద్దు సంఘటనను తీసుకోలేదనే అర్థం ధ్వనించడం విశేషం. అన్నట్టు ప్రియుడితో పెళ్లికి గుడ్భై చెప్పిన రష్మిక నటిగా చాలా బిజీగా ఉంది. అయితే కాస్త విరామాన్ని కల్పించుకుని హ్యాపీ న్యూఇయర్ను రోమ్ నగరంలో ఎంజాయ్ చేయడానికి ఆ దేశానికి పరుగెడుతోంది. మళ్లీ జనవరి 5న తిరిగి వచ్చి షూటింగ్స్లో పాల్గొంటుందట. -
రష్మిక కలలు చాలా పెద్దవి : రక్షిత్
ప్రముఖ నటి రష్మికా మందన్నాతో బ్రేకప్ గురించి కన్నడ నటుడు రక్షిత్ శెట్టి స్పందించారు. తన తాజా చిత్రం అతడే శ్రీమన్నారాయణ ప్రమోషన్లో పాల్గొన్న రక్షిత్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఈ సందర్భంగా రక్షిత్కు తన మాజీ ప్రేయసి రష్మిక గురించి ప్రశ్న ఎదురైంది. దీనిపై ఆయన స్పందిస్తూ ‘ఆమె చాలా పెద్ద కలలు కనింది. ఆమె గతం నాకు తెలుసు కాబట్టి.. ఆ కలలు ఎక్కడి నుంచి వచ్చాయో కూడా తెలుసు. ఆమె కలలు నిజం కావాలని దేవున్ని కోరుకుంటున్నాను’ అని తెలిపారు. కాగా, కిరిక్ పార్టీ చిత్రంలో నటిస్తున్న సమయంలో రష్మిక, రక్షిత్ల మధ్య ప్రేమ చిగురించింది. 2017లో రష్మిక, రక్షిత్ల నిశ్చితార్థం జరగగా.. ఆ మరసుటి ఏడాదే వారిద్దరు విడిపోయారు. ఆ సమయంలో ఆయన అభిమానులు రష్మికను లక్ష్యంగా చేసుకుని కామెంట్లు చేయడంతో రక్షిత్ స్పందించారు. ‘రష్మికా గురించి మీరు ఓ అభిప్రాయాన్ని ఏర్పరుచుకున్నారు. ఎవర్ని నేను తప్పుపట్టను. మనం ఏం చూస్తున్నామో అదే అందరం నమ్ముతుంటాం. కానీ అవి నిజం కాకపోవచ్చు. చాలా సార్లు మనం మరో వైపు ఉన్న కోణాన్ని చూడకుండానే, నిర్ధారణకు వచ్చేస్తుంటాం. నాకు రష్మిక రెండున్నరేళ్లకు పైగా తెలుసు. మీ కంటే ఎక్కువ రష్మిక గురించి నాకే తెలుసు. దయచేసి ఆమెను జడ్జి చేయడం ఆపండి’ అని కోరారు. మరోవైపు హీరో విజయ దేవరకొండతో రష్మిక ప్రేమలో ఉన్నారనే వార్తలు వచ్చినప్పటికీ.. ఆమె వాటిని ఖండించారు. కాగా, రక్షిత్ అతడే శ్రీమన్నారాయణ చిత్రం కన్నడలో డిసెంబర్ 27న, తెలుగులో జనవరి 1న, తమిళ్, మాలయాళంలో జనవరి 3న, హిందీలో జనవరి 16న విడుదల కానుంది. -
నిధి కోసం...
రక్షిత్ శెట్టి, శాన్వి జంటగా నూతన దర్శకుడు సచిన్ తెరకెక్కించిన చిత్రం ‘అతడే శ్రీమన్నారాయణ’. పుష్కర్ ఫిలింస్ పతాకంపై పుష్కర్ మల్లికార్జున్, హెచ్.కె. ప్రకాశ్ నిర్మించారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై నిర్మాత ‘దిల్’ రాజు తెలుగులో జనవరి 1న విడుదల చేస్తున్నారు. హైదరాబాద్లో జరిగిన సమావేశంలో రక్షిత్శెట్టి మాట్లాడుతూ– ‘‘నిధి అన్వేషణ నేపథ్యంలో ఈ చిత్రకథ నడుస్తుంది. మూడేళ్లు కష్టపడి ఎంతో ప్యాషన్తో ఈ సినిమా చేశాం. ఇంజనీరింగ్ చదివే రోజుల్లో వంశీకృష్ణ అనే మిత్రుడి ద్వారా తెలుగుతో పరిచయం ఏర్పడింది. అప్పట్లో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్గార్ల సినిమాలు చూసేవాణ్ణి. తెలుగు ప్రజలకు సినిమా అనేది సంస్కృతిలో ఓ భాగం. ఇక్కడి ప్రేక్షకులు సినిమాని ఎలా ఆదరిస్తారో? ప్రేమిస్తారో తెలిసింది. అందుకే మా సినిమాని తెలుగులోనూ విడుదల చేస్తున్నాం. రామజోగయ్యశాస్త్రిగారు నాలుగు పాటలకు మంచి సాహిత్యం అందించారు’’ అన్నారు. ‘‘ఐదేళ్ల తర్వాత ఈ సినిమాతో తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. రహస్యాలతో కూడిన ఫ్యాంటసీ కథ ఇది. కొంత ఆలస్యమైనా మంచి సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తున్నా’’ అన్నారు శాన్వీ. ‘‘ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి. ఈ సమావేశంలో పంపిణీదారుడు సతీష్, బాలాజీ మనోహర్, ప్రమోద్ శెట్టి, ఇమ్రాన్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. -
అతడే శ్రీమన్నారాయణ ప్రెస్మీట్
-
‘అతడే శ్రీమన్నారాయణ’ ట్రైలర్ లాంచ్
-
శ్రీమన్నారాయణ అందరికీ కనెక్ట్ అవుతాడు
‘‘ప్రాంతీయ భాషా చిత్రాలు దేశవ్యాప్తంగా ఆడుతున్నాయి. అదే ఫ్యూచర్ అవుతుంది అనుకుంటున్నాను. అప్పట్లో ‘రోజా’ దేశవ్యాప్తంగా హిట్ అయింది. తెలుగు నుంచి ‘బాహుబలి’ ప్రభంజనం సృష్టించింది. మా కన్నడం నుంచి ‘కేజీఎఫ్’ వచ్చింది. మా ‘అతడే శ్రీమన్నారాయణ’ కూడా అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను’’ అన్నారు కన్నడ హీరో రక్షిత్ శెట్టి. సచిన్ దర్శకత్వంలో రక్షిత్ శెట్టి, శాన్వీ జంటగా నటించిన కన్నడ చిత్రం ‘అవనే శ్రీమన్నారాయణ’. పుష్కర్ మల్లిఖార్జున, హెచ్.కె. ప్రకాశ్ నిర్మించారు. తెలుగులో ‘అతడే శ్రీమన్నారాయణ’గా విడుదలవుతోన్న ఈ చిత్రం ట్రైలర్ను హీరో నాని రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా రక్షిత్ శెట్టి మాట్లాడుతూ – ‘‘దక్షిణ భారతదేశంలో లేని ఒక ఫిక్షన్లో ప్లేస్లో (ఊహాజనిత ప్రదేశం) జరిగే కథ ఇది. అన్ని ప్రాంతాల వారికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. శ్రీమన్నారాయణ అందరికీ కనెక్ట్ అవుతాడు. 8 కోట్ల బడ్జెట్తో మొదలుపెట్టిన ఈ చిత్రాన్ని సుమారు 30 కోట్లతో నిర్మించాం’’ అన్నారు. ‘‘ఈ సినిమాను 90శాతం సెట్స్లోనే చిత్రీకరించాం. సుమారు 19 సెట్లు నిర్మించాం. ఇందులో లవ్, యాక్షన్, సాహసాలు అన్నీ ఉంటాయి’’ అన్నారు నిర్మాత పుష్కర్. ‘‘మూడేళ్ల పాటు చాలా కష్టపడి ఈ సినిమాను తెరకెక్కించాం’’ అన్నారు సచిన్. ‘‘ఈ సినిమాతో మళ్లీ తెలుగు ప్రేక్షకులను పలకరించడం హ్యాపీ. ఇందులో నాది మంచి పాత్ర’’ అన్నారు ‘లవ్లీ’ ఫేమ్ శాన్వీ. -
రష్మికతో ఎంగేజ్మెంట్ బ్రేక్ : రక్షిత్ స్టేట్మెంట్
తొలి సినిమా ‘ఛలో’, రెండో సినిమా‘గీత గోవిందం’తో తెలుగు ప్రేక్షకుల నుంచి సూపర్ క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ రష్మిక మందన్న.. టాలీవుడ్లోకి రాకముందు ఆమెకు కన్నడలో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువే. టాలీవుడ్లోకి ప్రవేశించి, ఈ ఫాలోయింగ్ను, తన పాపులారిటీని మరింత పెంచేసుకుంది. ఇప్పుడు ఆమె వ్యక్తిగత జీవితం సోషల్ మీడియాలో హాట్ టాఫిక్గా మారింది. కన్నడలో తనకు విశేషమైన ఫాలోయింగ్ తెచ్చిపెట్టిన ‘కిరిక్ పార్టీ’ చిత్రీకరణ సమయంలోనే నిర్మాత, సహ నటుడు రక్షిత్ శెట్టితో ప్రేమలో పడిన రష్మిక.. పెద్దల అంగీకారంలో ఎంగేజ్మెంట్ చేసుకుంది. కానీ ఇప్పుడు ఈ ఎంగేజ్మెంట్ రద్దయింది. కారణాలు ఏమన్నది తెలియదు కానీ, ఈ ఇరువురు విడిపోయారు. వీరి ఎంగేజ్మెంట్ రద్దు కావడానికి కంటే ముందే వీరి పెళ్లి క్యాన్సిల్ అయిందని వార్తలొచ్చాయి. ఆ వార్తలను రక్షిత్ శెట్టి ఖండించాడు. అయితే నిన్న కన్నడ పాపులర్ న్యూస్ పేపర్ అధికారికంగా రష్మిక, రక్షిత్ల ఎంగేజ్మెంట్ బ్రేకప్ అయిందని ప్రకటించడంతో, సోషల్ మీడియాలో రష్మికను ట్రోల్ చేయడం మొదలు పెట్టేశారు. రష్మిక, రక్షిత్ల ఎంగేజ్మెంట్ రద్దు కావడంపై ఆమె తల్లి కూడా తామిప్పుడు బాధలో ఉన్నట్టు చెప్పారు. రష్మికపై సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న ఆగ్రహాన్ని తట్టుకోలేని రక్షిత్ శెట్టి, ఆమెను తప్పుపట్టందంటూ కోరుతూ ఫేస్బుక్లో ఓ పెద్ద పోస్టు పెట్టారు. ‘రష్మికా గురించి మీరు ఓ అభిప్రాయాన్ని ఏర్పరుచుకున్నారు. ఎవర్ని నేను తప్పుపట్టను. మనం ఏం చూస్తున్నామో అదే అందరం నమ్ముతుంటాం. కానీ అవి నిజం కాకపోవచ్చు. చాలా సార్లు మనం మరో వైపు ఉన్న కోణాన్ని చూడకుండానే, నిర్ధారణకు వచ్చేస్తుంటాం. నాకు రష్మిక రెండున్నరేళ్లకు పైగా తెలుసు. మీ కంటే ఎక్కువ రష్మికా గురించి నాకే తెలుసు. దయచేసి ఆమెను జడ్జి చేయడం ఆపండి. దయచేసి ఆమెను శాంతిగా ఉండనీయండి. త్వరలోనే ప్రతీది ఓ ముగింపుకు వస్తుందని నేను ఆశిస్తున్నా. నిజమేమిటో అప్పుడు మీకు తెలుస్తుంది. మీడియా న్యూస్గా వెళ్లకండి. ఎవరూ కూడా నానుంచి, రష్మికా నుంచి సమాచారం పొందిలేరు. వారి అవసరానికి తగ్గట్టు వారు సొంత వార్తలు రాసుకున్నారు. అంచనాలు, ఊహాగానాలు నిజం కావు. కొన్ని రోజులు మాత్రమే ఈ పేజీ లైవ్లో ఉంటుంది. నేను సోషల్ మీడియా నుంచి వైదొలుగుతున్నా. ఒకవేళ నిజంగా అవసరం అనిపించినప్పుడు మళ్లీ సోషల్ మీడియాలోకి వస్తా. నేను కేవలం ఇప్పుడు పనిపైనే దృష్టిసారించనున్నా’ అని పేర్కొంటూ ఓ పెద్ద లెటరు రాసుకొచ్చారు. దీంతో నిన్నమొన్నటివరకూ వీరిద్దరి బ్రేకప్పై ఉన్న కన్ఫ్యూజన్ పోయి ఇద్దరూ విడిపోయారనే విషయంలో క్లారిటీ మాత్రం వచ్చింది. రష్మికను తప్పు పట్టదంటూ రక్షిత్ చేసిన ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
ఛలో హీరోయిన్ ఎంగేజ్మెంట్ రద్దు...!
కన్నడ బ్యూటీ, ఛలో ఫేమ్ రష్మిక మందన్న ఎంగేజ్మెంట్ రద్దు చేసుకున్న వార్త ఒకటి చక్కర్లు కొడుతోంది. నటుడు, దర్శకుడు రక్షిత్ శెట్టితో గతేడాది ఆమె ఎంగేజ్మెంట్ జరిగిన విషయం తెలిసిందే. కిరిక్ పార్టీ షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డ ఈ జంట.. గతేడాది నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. అయితే ప్రస్తుతం ఆఫర్లు వెల్లువెత్తుండటంతో ఆమె నిశ్చితార్థం రద్దు దిశగా ఆలోచన చేస్తోందని, ఈ మేరకు ఓ నిర్ణయం కూడా తీసేసుకుందంటూ ఓ ప్రముఖ పత్రిక కథనం ప్రచురించింది. దీనికితోడు ఈ మధ్య జరిగిన కొన్ని పరిణామాలతో ఇద్దరి మధ్య మనస్పర్థలు కూడా తలెత్తాయన్నది ఆ కథనం పేర్కొంది. గీత గోవిందం పోస్టర్లలో రష్మిక.. విజయ్ దేవరకొండల మధ్య రొమాన్స్పై రక్షిత్ ఫ్యాన్స్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆమెను ట్రోల్ చేశారు. దీనిపై ఆమె స్ట్రాంగ్ కౌంటరే ఇచ్చారు. అయితే అప్పటి నుంచి రక్షిత్-రష్మికల మధ్య మాటలు లేవన్నంట. దీంతో కెరీర్ పీక్స్లో ఉన్న ఈ సమయంలో ఆమె వివాహ ఆలోచనను పూర్తిగా పక్కకు పెట్టినట్లు ఆ కథనం ఉటంకించింది. అయితే ఈ వ్యవహారాన్ని ఆమె సన్నిహితులు తూచ్గా తేల్చేస్తున్నారు. ఆ వార్తలో ఎలాంటి నిజం లేదని, దయచేసి అలాంటి ప్రచారం చేయొద్దని మీడియాను కోరుతున్నారు. రెండు రోజుల క్రితం ఓ ఈవెంట్లో ఇద్దరూ కలిసి హాజరైన విషయాన్ని వాళ్లు ప్రస్తావిస్తున్నారు. మరోవైపు ఈ గాసిప్స్పై రష్మిక, రక్షిత్లు స్పందించాల్సి ఉంది. -
హిందీ కిర్రాక్ పార్టీ
‘టెంపర్, ప్రస్థానం, అర్జున్ రెడ్డి, విక్రమ్ వేదా’ వంటి దక్షిణాది చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించి బాలీవుడ్లో రీమేక్ అవుతున్నాయి. ఇప్పుడీ జాబితాలోకి కన్నడ హిట్ ‘కిర్రిక్ పార్టీ’ చేరింది. ఈ హిందీ రీమేక్కు అభిషేక్ జైన్ దర్శకత్వం వహిస్తారు. ‘సోను కే టిట్టు కీ స్వీటీ’ ఫేమ్ కార్తీక్ ఆర్యన్ హీరోగా నటించనున్నారు. అక్టోబర్లో సెట్స్పైకి వెళ్లనుంది. తొలుత ఈ సినిమాలో హీరోగా సిద్ధార్థ్ మల్హోత్రాను సంప్రదించారట. ఆయన డేట్స్ కుదరక పోవడంతో ఆ చాన్స్ ఆర్యన్ను వరించిందని టాక్. రిషబ్ శెట్టి దర్శకత్వంలో రక్షిత్ శెట్టి, రష్మిక మండన్నా, సంయుక్తా హెగ్డే ముఖ్య తారలుగా నటించిన ‘కిర్రిక్ పార్టీ’ చిత్రం తెలుగులో ‘కిర్రాక్ పార్టీ’ పేరుతో రీమేక్ అయిన విషయం గుర్తుండే ఉంటుంది. -
సదరన్ స్పైస్ 17th June 2018