revenue records
-
NAKSHA Pilot Project: పట్టణాల్లో ప్రాపర్టీ కార్డ్!
సాక్షి, హైదరాబాద్: పట్టణాల్లో రెవెన్యూ రికార్డులను పక్కాగా నిర్వహించేందుకు.. ఇళ్లు, స్థలాల వివాదాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘నక్ష’ కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. మున్సిపాలిటీల్లో విస్తృత స్థాయిలో సర్వే చేసి.. ఇళ్లు, భవనాలు, ఇతర నిర్మాణాల వివరాలన్నీ తేల్చేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇంటి యజమాని పేరు, ఆస్తి పన్ను వివరాలు, ఆస్తి విస్తీర్ణం, సర్వే నంబర్, అనుమతి తీసుకున్న నంబర్, ప్లాన్, నల్లా కనెక్షన్.. ఇలా సమస్త వివరాలతో ప్రాపర్టీ కార్డుల జారీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. పట్టణాలు, నగరాల్లోని అణువణువు ఇకపై డిజిటల్ రూపంలో నిక్షిప్తం కానుంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మాడరై్నజేషన్ ప్రోగ్రాం (డీఐఎల్ఆర్ఎంపీ)లో భాగంగా ‘నేషనల్ జియో స్పేషియల్ నాలెడ్జ్ బేస్డ్ ల్యాండ్ సర్వే ఆఫ్ అర్బన్ హ్యాబిటేషన్స్ (నక్ష)’ కార్యక్రమాన్ని చేపట్టింది. మంగళవారం దేశవ్యాప్తంగా రెండు లక్షల వరకు జనాభా ఉన్న 152 మున్సిపాలిటీల్లో పైలట్ ప్రాజెక్టు ప్రారంభం కానుంది. ఈ పట్టణాల్లో ఏడాదిపాటు పైలట్ ప్రాజెక్టును అమలు చేసిన తర్వాత వచ్చే ఫలితాల ఆధారంగా మార్పు, చేర్పులు చేస్తారు. అనంతరం మొదటి దశ కింద దేశవ్యాప్తంగా 1,000 మున్సిపాలిటీల్లో, ఆ తర్వాత దేశంలోని 4,912 పట్టణాలు, నగరాల్లో ‘నక్ష’ను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆధార్ మాదిరిగా ప్రాపర్టీ కార్డ్.. పట్టణాలు, నగరాల్లోని భూముల సర్వే నంబర్లు, ఇళ్లను ‘నక్ష’ కార్యక్రమం ద్వారా అనుసంధానం చేస్తారు. ప్రస్తుతం పౌరులందరికీ ఆధార్ ఇస్తున్నట్టుగానే.. ప్రతీ గృహ యజమానికి ప్రాపర్టీ కార్డును విశిష్ట గుర్తింపు సంఖ్యతో ఇవ్వనున్నట్టు పురపాలక శాఖ ఉన్నతాధికారి ఒకరు వివరించారు. ఈ కార్డుపై ‘క్యూఆర్’ కోడ్ ఉంటుందని, దానిని స్కాన్ చేస్తే పూర్తి వివరాలు లభిస్తాయని తెలిపారు. ఇంటి యజమాని పేరు, ఆస్తి పన్ను వివరాలు, ఆస్తి విస్తీర్ణం, సర్వే నంబర్, అనుమతి తీసుకున్న నంబర్, ప్లాన్, నల్లా కనెక్షన్ ఇలా సమస్త సమాచారం అందులో ఉంటుందని వెల్లడించారు. లైడార్ సర్వే మాదిరిగా ఇది ఉంటుందని, పైలట్ ప్రాజెక్టు కింద రాష్ట్రంలో ఎంపిక చేసిన మున్సిపాలిటీల్లో ఏడాదిపాటు పూర్తి స్థాయిలో ఈ సర్వే నిర్వహిస్తారని తెలిపారు. ఈ మున్సిపాలిటీల్లోని ప్రతి ఇంటిని త్రీడ్రీ కెమెరాలతో మ్యాపింగ్ చేస్తారని, ఇందుకోసం మూడు రకాల కెమెరాలను ఉపయోగిస్తారని వెల్లడించారు. ఈ సర్వే పూర్తయితే.. ఆస్తిపన్ను మదింపు పారదర్శకంగా జరుగుతుందని, స్థానిక సంస్థల ఆదాయాన్ని పెంచుకోవడానికి వీలవుతుందని వివరించారు. ఆయా ప్రాంతాల్లో పరిస్థితిని బట్టి అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పన, డ్రైనేజీ, తాగునీటి సరఫరా, ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు, భవిష్యత్తులో జీఐఎస్ మాస్టర్ ప్లాన్ల రూపకల్పన సులభతరం అవుతుందని స్పష్టం చేస్తున్నారు. పట్టణాల్లోని రెవెన్యూ సర్వే నంబర్లు ఎన్ని సబ్ డివిజన్లుగా మారాయన్న వివరాలను కూడా నమోదు చేయనున్నట్టు తెలిపారు. అర్బన్ ల్యాండ్ రికార్డులు నాలుగు రాష్ట్రాల్లోనే.. దేశంలో తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, గోవా రాష్ట్రాల్లో మాత్రమే పట్టణ భూముల రికార్డులను పక్కాగా నిర్వహిస్తున్నారని, ఇతర రాష్ట్రాల్లో వాటి నిర్వహణ సరిగా లేదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ క్రమంలోనే ‘నక్ష’ ప్రాజెక్టును చేపట్టినట్టు చెబుతోంది. రెవెన్యూ, మున్సిపాలిటీలు, సర్వే ఆఫ్ ఇండియా, ఎంపీ స్టేట్ ఎల్రక్టానిక్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్, నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ), సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్లు సంయుక్తంగా ఈ పైలట్ ప్రాజెక్టును అమలు చేయనున్నాయి. పట్టణాలు, నగరాలు వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఈ సర్వే కీలకమని కేంద్రం తెలిపింది. భూముల విలువలు వేగంగా పెరుగుతున్నందున వివాదాలకు చెక్ పెట్టేలా ఇది ఉంటుందని, న్యాయపరమైన అంశాల్లోనూ ఉపయోగపడుతుందని వెల్లడించింది. అదే సమయంలో ఈ సర్వే డిజిటైజేషన్తో ప్రణాళికాబద్ధంగా పట్టణాల అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు వీలుంటుందని పేర్కొంది. ఆయా ఆస్తుల యజమానులు రుణాలు తీసుకోవడానికి ఈ సర్వే అనంతరం జారీ చేసే ప్రాపర్టీ కార్డు ఉపయోగపడుతుందని స్పష్టం చేసింది. 3 పద్ధతుల్లో ఏరియల్ సర్వే.. రాష్ట్రంలో ఎంపిక చేసిన మున్సిపాలిటీలివే.. జడ్చర్ల, హుస్నాబాద్, కొడంగల్, వర్ధన్నపేట, యాదగిరిగుట్ట, మహబూబాబాద్, వేములవాడ, మిర్యాలగూడ, జగిత్యాల, మణుగూరు మున్సిపాలిటీలను ‘నక్ష’ పైలట్ ప్రాజెక్టు కోసం రాష్ట్రం నుంచి ఎంపిక చేశారు. రాష్ట్రంలోని మొత్తం 155 పట్టణాలు, 29 పట్టణాభివృద్ధి సంస్థల్లో కూడా భవిష్యత్తులో ఈ సర్వే నిర్వహించేందుకు అవసరమైన నిధులు దాదాపు రూ.700 కోట్లు కావాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరనుందని తెలిసింది. -
ఇది... భూ హక్కుకు భరోసా!
ప్రజల భూమి హక్కును కాపాడటం ప్రభుత్వాల రాజ్యాంగ బాధ్యత. ప్రస్తుతం చాలా ఉన్న సివిల్ కేసులకు, క్రిమినల్ కేసులకు కారణం భూమిపై యజమానికి వున్న హక్కును లేక టైటిల్ ను గుర్తించే చట్టబద్ధమైన వ్యవస్థ లేకపోవటం. వారసత్వం, కొనుగోలు, బదిలీ, కేటాయింపు ద్వారా భూమిపై యాజమాన్య హక్కు మార్పిడి జరుగుతుంది. రిజిస్ట్రేషన్ వ్యవస్థ భూమికి సంబంధించిన ఈ బదలాయింపు లావాదేవీలను రిజిస్టర్ చేస్తుంది. అంతేకాని లావాదేవీల ద్వారా పొందిన హక్కును రిజిస్టర్ చేయదు. అందువలన రిజిస్ట్రేషన్ విధానం భూమిపై సంపూర్ణ హక్కుకు రుజువు కాదు. అందుకే ఒకరు భూమిని కొని రిజిస్టర్ చేయించుకుంటే అదే భూమిని మరొకరు రిజిస్టర్ చేయించుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో ‘డబుల్ రిజిస్ట్రేషన్’ అనే సమస్య ఎక్కువగా వింటున్నాం. ‘లాండ్ టైటిలింగ్ చట్టం –2022’ ఈ సమస్యకు పరిష్కారం. పట్టాదారు పాస్ బుక్, టైటిల్ డీడ్, 1బీ ఆడంగల్, మరే ఇతర రెవెన్యూ రికార్డులు కూడా భూమిపై యజమానికి ఉన్న యాజమాన్య హక్కును నిరూపించే పత్రాలు కావు (పి. కిశోర్ కుమార్ వర్సెస్ విట్టల్ కె పట్కర్, 2023). రెవెన్యూ రికార్డుల్లో వివరాలు పొందుపరచే ‘మ్యుటేషన్’ కేవలం భూమిశిస్తు కట్టటానికి ఉపయోగపడే పత్రం. ఈ మ్యుటేషన్ వలన భూమిపై హక్కులు కల్పించబడవు, ధ్రువీకరించ బడవు (సవర్ణి వర్సెస్ ఇందర్ కౌర్, 1996). ఆంధ్ర ప్రదేశ్ (భూమి హక్కులు మరియు పట్టాదార్ పాస్ పుస్తకాలు) చట్టం, 1971 చట్ట బద్ధంగా భూములకు సంబంధించిన హక్కుల రికార్డులను తయారు చేయడానికీ, ఆ రికార్డులను నిర్వహించడానికీ ఉద్దేశించిందే కాని యజమానికి భూమిపైన ఉన్న హక్కులను ధ్రువీకరించదు (సీతారామ్ పాటిల్ వర్సెస్ రాంచంద్ర నాగో పాటిల్, (1977). పట్టాదారు పాస్ బుక్ కూడా యాజమాన్య హక్కును నిర్ధారించదు (గౌసియా బేగమ్ వర్సెస్ బసిరెడ్డి రుక్మిణమ్మ, 2013). ఈ దేశంలో ఏ రెవెన్యూ రికార్డు కూడా భూమిపైన యజమానికి వున్న హక్కును లేదా టైటిల్ను సంపూర్ణంగా నిర్ణయించదు, నిర్ధారించదు. భూమిపైన యజమానులకు ఉన్న హక్కులను లేక టైటిల్ కాపాడే విధంగా, భూ యజమానికి ఉన్న హక్కును ధ్రువీకరించి, హక్కు భద్రతకు హామీని ఇచ్చే విధంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ‘లాండ్ టైటిలింగ్ చట్టం’ చేసింది. ఇది విప్లవాత్మకమైనది. భారత దేశంలో భూ యజమాని హక్కు(టైటిల్)ను చట్టబద్ధంగా గుర్తించిన మొట్ట మొదటి చట్టం ఇది. ఈ చట్టం లాండ్ టైటిలింగ్ అథారిటీనీ, స్థిరాస్తిపై హక్కునూ రిజిస్టర్ చేసే వ్యవస్థనూ ఏర్పాటు చేసి, టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారిని నియమిస్తుంది. ఈ చట్టం ప్రకారం నోటిఫై చేసిన ప్రాంతంలో ఉన్న భూమి వివరాలకు సంబంధించిన రికార్డును సిద్ధం చేసి, స్థిరాస్తి గుర్తింపు సంఖ్య కేటాయించి, దాని సరిహద్దులతో రికార్డ్లో నమోదు చేసుకోవాలి. ఈ రికార్డులు మూడు రకాలు. 1. రికార్డు ఆఫ్ టైటిల్ 2. రికార్డు ఆఫ్ చార్జ్ 3. వివాదాలలో వున్న భూమి రికార్డు. ప్రారంభంలో తాత్కాలిక టైటిల్ రికార్డును సిద్ధంచేసి, నోటిఫై చేసి, భూ హక్కు దారులకు ఆ రికార్డు పైన వున్న అభ్యంతరాలను స్వీకరించి, ఆ అభ్యంత రాలను నివృత్తి చేస్తారు. ఏ అభ్యంతరం లేని భూముల టైటిల్ను రికార్డు ఆఫ్ టైటిల్లో నమోదు చేస్తారు. ఈ రికార్డులో నమోదు చేసిన రెండు సంవత్సరాల తరువాత ఆ భూమిపై ఉన్న హక్కు యజమాని సంపూర్ణ హక్కుగా గుర్తించబడుతుంది. భూమికి సంబంధించి సివిల్ కోర్ట్లో లేక రెవెన్యూ కోర్ట్లో అయినా కేసు వుంటే, దాని తీర్పు ప్రకారం రెండు సంవత్సరాల తరువాత కూడా హక్కును నమోదు చేస్తారు. ఇప్పటి వరకు అమలులో ఉన్న అన్ని రెవెన్యూ రికార్డుల స్థానంలో ఒకే ఒక్క రికార్డు ‘రికార్డు ఆఫ్ టైటిల్’ అమలులోకి వస్తుంది. ఈ రికార్డు భూ యజమానికి వున్న హక్కును సంపూర్ణ హక్కుగా ఈ చట్టం గుర్తిస్తుంది. భారత దేశంలో భూ యజమాని హక్కును (టైటిల్) చట్టబద్ధంగా గుర్తించిన మొట్టమొదటి చట్టం ఇది. చట్టంలోని సెక్షన్ 38... భూమి టైటిల్ హక్కుకు సంబంధించిన వివాదాలను సివిల్ కోర్ట్ పరిధి నుండి మినహాయించి, రెవెన్యూ కోర్ట్కు బదలాయించడం పట్ల అభ్యంతరం వ్యక్తమవుతున్నది. ఈ సెక్షన్ రాజ్యాంగ బద్ధతను గూర్చిన వివాదం ఆంధ్ర ప్రదేశ్ ఉన్నత న్యాయ స్థాన పరిధిలో వుంది. సివిల్ కోర్ట్ అధికారాలను కొనసాగిస్తూ మధ్యంతర వుత్తర్వులు వెలువరించింది హైకోర్ట్. మరో వివాదాస్పద అంశం సెక్షన్ 14 ప్రకారం టైటిల్ రిజిస్టర్లో నమోదు కాబడిన లేక నమోదుకాని భూములకు సంంబంధించి అభ్యంతరాలు వున్నట్లయితే, సంబంధిత వ్యక్తులు టైటిల్ రిజిస్ట్రేషన్ అప్పీలేట్ అధికారికి అర్జీ పెట్టుకోవాలి. రెవెన్యూ అధికారి అప్పీలేట్ అధికారిగా వుంటాడు కాబట్టి ఈ చట్టం దుర్వినియోగం అవుతుంది అనేది ఒక వాదన. సివిల్ కోర్ట్లో భూవివాద పరిష్కారం ఆలస్యం అవుతుంది అని ఈ విధానాన్ని ఈ చట్టంలో అమలు చేశారు. రెవెన్యూ న్యాయస్థానాలు ఈ చట్టంలో కొత్తగా ఏర్పాటు చేసినవి కావు. అనేక ఏళ్లుగా అమలులో వున్న ఈ రెవెన్యూ కోర్టులను ఎప్పుడు ప్రజలు, న్యాయవాదులు వ్యతిరేకించలేదు. అమలుచేసే అధికారులు అధికారాన్ని దుర్వినియోగం చేస్తారనే అభియోగంతో చట్టాన్ని కొట్టి వేయటం న్యాయ శాస్త్ర ప్రాథమిక సూత్రానికి వ్యతిరేకం. భూమిని కొనుగోలు చేసినప్పుడు ఆ కొనుగోలు లావాదేవీలను రిజిస్టర్ చేయించినట్లే, సంబంధిత అధికారి దగ్గర హక్కును లేక టైటిల్ ను కూడా రిజిస్టర్ చేయించుకోవాలి. ఈ విధానం భూ యజమానికి వున్న భూమిపై వున్న హక్కుకు రక్షణ, భద్రత. కొనిన స్థలం చుట్టూ కంచ వేయించు, గోడ కట్టు అని మన శ్రేయోభిలాషులు చేసే హెచ్చ రికలు ఇక అవసరం లేదు. స్థిరాస్తిని టైటిల్ రికార్డులో నమోదు చేసిన తరువాత, హక్కును కాపాడే బాధ్యత ప్రభుత్వానిదే. ఈ దేశంలో భూమి కొని దానిని టైటిల్ రిజిస్టర్లో నమోదు చేసుకొని విదేశాలకు వెళ్ళి ఎన్ని సంవత్సరాల తరువాత తిరిగి భారతదేశానికి వచ్చినా,వారి భూమి అన్యాక్రాంతం కాదు. ముఖ్యంగా ఈ చట్టం ’సెకండ్ రిజిస్ట్రేషన్’ సమస్యకు పరిష్కారం. దీనికి కారణం భూమి కొనిన యజమాని హక్కుకు ఈ చట్టం ప్రభుత్వాన్నే కాపలాదారునిగా చేస్తుంది. ప్రభుత్వం భూమిని పరిరక్షించటంలో విఫలమైనా, టైటిల్కి సంబంధించి సమస్య వచ్చినా భూమి యజమానికి ప్రభుత్వం బీమా చెల్లిస్తుంది. రెవెన్యూ రికార్డు లేకుండా చాలా కాలంగా భూమిని పండించుకుంటున్న బలహీన వర్గాలకు పంపిణీ చేసిన భూమిని కూడా వెంటనే రికార్డు ఆఫ్ టైటిల్లో నమోదు చేయాలి. వారి హక్కుకు భద్రత మరియు బీమా కల్పించాలి. ఈ చట్టం అమలు వలన బలహీన వర్గాల ప్రజలకు వారి అనుభవంలో వున్న భూమికి, వారికి బదలాయించే భూమి హక్కుకు భద్రత కల్పించ వలసిన బాధ్యత ప్రభుత్వంపై వుంటుంది. ఆ విధంగా పేద, బలహీన వర్గాల వారికి కూడా ఈ చట్టం వలన మేలు జరుగుతుంది.డా‘‘ నేలటూరి జేసు రత్న కుమార్ వ్యాసకర్త పూర్వ సహాయ సంచలకులు,ఏపీ జ్యుడీషియల్ అకాడెమీ ‘ 98857 20777 -
‘పట్టా’లు తప్పారు!
హుస్నాబాద్ రూరల్: తాతలు, తండ్రులు కట్టిన ఇళ్లు 12...చనిపోయిన వారి సమాధులు 18... ఒక వ్యవసాయ బావి, మిషన్ భగీరథ ద్వారా మంచినీరు సరఫరా చేసే పైప్లైన్. ఇవన్నీ కాకుండా 1984 నుంచి ఆ భూముల్లో కబ్జాలోనే ఉంటూ సాగు కూడా చేసుకుంటున్నారు. అయితే రెవెన్యూ అధికారులకు ఇవేమీ కనిపించలేదు. మోక (పొజిషన్) విచారణ జరపలేదు. కబ్జాలో ఎవరు ఉన్నారో తెలుసుకోలేదు. ధరణిలో కబ్జా కాలమ్ తొలగించడంతో పాత పట్దాదారుల పేర్లు రెవెన్యూ రికార్డుల్లో ఉన్నాయి. దీనిని పసిగట్టిన కొందరు స్థానిక రెవెన్యూ అధికారులను మచ్చిక చేసుకొని, సాదాబైనామాలు సృష్టించి 2021లో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పోతారం(ఎస్) గ్రామంలో సర్వే నంబర్ 250లో 2.00 ఎకరాలు, 263లో 1.30 ఎకరాల వ్యవసాయ భూమిని కొంతమంది పట్టా చేయించుకున్నారు. మోక మీద రాజయ్య కుటుంబ సభ్యులే ఉన్న విషయమూ రెవెన్యూ అధికారులు పరిగణనలోకి తీసుకోలేదు. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. దీంతో బోగస్ సాదాబైనామాలు సృష్టించి నలుగురు పేరున పట్టా చేయించుకున్నారని బాధితులు ఆరోపిస్తూ ఆర్డీఓ, తహసీల్దార్కు బాధితులు ఫిర్యాదు చేశారు. మోక చూడకుండానే పట్టా మార్పిడి.. భూ రికార్డుల మార్పు సమయంలో రెవెన్యూ అధికారులు మోక(పొజిషన్) విచారణ జరిపాక పట్టా చేయాలి. కానీ అవేమీ పట్టించుకోలేదు. ఒకరు మోక మీద ఉంటే మరొకరి పేరున పట్టా చేశారు. దీనివల్ల 250లో సర్వే నంబర్లో రక్బా తక్కువ వస్తుంది. మోక మీద ఇళ్లు నిర్మించుకొని ఉంటున్న దళిత కుటుంబాలకు పట్టాలు లేవు, కొత్తగా పట్టాదార్ పాసు పుస్తకాలు పొందినవారికి మోక మీద భూమి లేదు. మా తాత ఇల్లు కట్టిన భూమి మాది కాదంటున్నారు యాబై ఏళ్ల క్రితమే మా తాత ఇల్లు కట్టాడు. అయితే ఇప్పుడు ఆ భూమి మాది కాదని ఎవరో అమ్మారని రియల్ ఎస్టేట్ వ్యాపారులు మా దగ్గరకు వచ్చి ఇబ్బంది పెడుతున్నారు. సర్వేనంబర్ 250లో రెండు ఎకరాలు, 263 సర్వేనంబరులో 1.30 ఎకరాల్లో మా తాత కాలేష్ రాజయ్యనే పహాణీలో, కబ్జాలో ఉన్నారు. ఇప్పుడు మా వారికి పట్టా మారిన సంగతి తెలియదు. మేమంతా మా అయ్యలు చూపించిన భూములనే దున్నుకొని బతుకుతున్నాం. ఇప్పుడు ఈ భూములు మావి కావంటే ఎలా? మోక విచారణ జరిపించి అక్రమంగా పట్టా చేయించుకున్న వారి పాస్పుస్తకాలు రద్దు చేసి మాకు న్యాయం చేయాలి. – కాలేష్ రాజేశ్, పోతారం(ఎస్) మా తాతల సమాధులను పట్టా చేశారు 1980లోనే 250 సర్వే నంబరులో మా తాతల సమాధులు కట్టాం. ఒకటి కాదు రెండు కాదు 18 సమాధులు ఉన్నాయి. వ్యవసాయ బావి, మా ఇళ్లకు కరెంట్ మీటర్లు ఉన్నాయి. మిషన్ భగీరథ నుంచి తాగునీరు కూడా ఇస్తున్నారు. ఇప్పుడు ఎవరో వచ్చి ఈ భూములు కావాలంటే ఎలా? 50 ఏళ్ల నుంచి ఈ భూమిని నమ్ముకొని బతికినోళ్లం...ఇప్పుడు భూమి లేదంటే ఎక్కడకు పోవాలి. మా పాత రికార్డులను పరిశీలించి మోక విచారణ జరిపి మా భూములకు పట్టాలు ఇవ్వాలి. – కాలేష్ శివకుమార్, పోతారం(ఎస్) విచారణ జరిపిస్తాం పోతారం(ఎస్) దళిత కాలనీ పేదల భూముల విషయమై మోక విచారణ జరిపిస్తాం. అదే సర్వే నంబర్లో పేదల ఇళ్లు ఉంటే పట్టాదారుల పాసు పుస్తకాలు రద్దు చేసి పేదలకు న్యాయం చేయాలని కలెక్టర్కు నివేదిస్తాం. – రవీందర్రెడ్డి, తహసీల్దార్,హుస్నాబాద్ -
4 వేల గ్రామాల్లో భూముల రీసర్వే పూర్తి
సాక్షి, అమరావతి: భూముల రీసర్వేలో రాష్ట్ర ప్రభుత్వం మరో మైలు రాయిని అధిగమించింది. రాష్ట్రవ్యాప్తంగా నాలుగు వేల గ్రామాల్లో అన్ని దశల సర్వే పూర్తయింది. ఈ గ్రామాల్లో సర్వే పూర్తయినట్లు నెంబర్ 13 నోటిఫికేషన్లు కూడా జారీచేయడంతో అక్కడ కొత్త రెవెన్యూ రికార్డులు అందుబాటులోకి వచ్చాయి. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇప్పటివరకు దేశంలోని ఏ గ్రామంలోనూ పూర్తిస్థాయి రీ సర్వే జరగలేదు. ఇప్పటికీ అన్ని రాష్ట్రాల్లోని గ్రామాలు, పట్టణాల్లో బ్రిటీష్ వాళ్లు రూపొందించిన రెవెన్యూ రికార్డులే ఉన్నాయి. తొలిసారిగా మన రాష్ట్రంలోనే నాలుగు వేల గ్రామాల్లో రీసర్వే పూర్తవడంతో అక్కడ డిజిటల్ రెవెన్యూ రికార్డులు అందుబాటులోకి వచ్చాయి. ఈ కొత్త రికార్డుల ఆధారంగానే ఇకపై భూముల వ్యవహారాలు జరగనున్నాయి. రీసర్వేలో భాగంగా ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజ్లు (గ్రామాల ఫొటోలు) తయారుచేయడానికి విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లు వినియోగిస్తున్న తొలి రాష్ట్రం కూడా మనదే. 2020 డిసెంబర్లో ప్రాజెక్టు ప్రారంభం పూర్వపు కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూరక్ష పథకాన్ని 2020 డిసెంబర్ 21న ప్రారంభించారు. ఆ తర్వాత కరోనా రావడంతో కొంత ఆలస్యమైనా ఆ తర్వాత శరవేగంగా ఈ కార్యక్రమం జరుగుతోంది. విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లు, కంటిన్యూయస్లీ ఆపరేటింగ్ రిఫరెన్స్ స్టేషన్లు, రోవర్ల వంటి అత్యాధునిక సర్వే టెక్నాలజీలను ఉపయోగించి దాదాపు వందేళ్ల తర్వాత సమగ్ర రీ సర్వేను చేపట్టారు. సర్వే తర్వాత రైతులకు భూ హక్కు పత్రాలివ్వడం.. ఆ భూములకు భద్రత నిర్ధారించడం, భూ రక్ష సర్వే రాళ్లు నాటడం ద్వారా సరిహద్దు భద్రతను ప్రభుత్వం కల్పిస్తోంది. భూరక్ష సర్వే రాళ్ల ఖర్చు మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. రీ సర్వే వల్ల ప్రయోజనాలు.. ► సర్వే తర్వాత భూముల రికార్డులను 10 సెంటీమీటర్ల కచ్చితత్వంతో కొలిచి తయారుచేస్తారు. ► భూ యజమానులకు భూ కమత పటం, గ్రామ పటం, భూ హక్కు పత్రం వంటి రికార్డులను జీపీఎస్ కో–ఆర్డినేట్లు, ఐడీ నెంబర్, క్యూఆర్ కోడ్తో ఇస్తారు. ► గ్రామంలోని స్థలాలు, అర్బన్ ప్రాంతాల్లోని భూములను కూడా మొదటిసారి సర్వేచేసి యజమానులకు యాజమాన్య ధ్రువీకరణ పత్రాలు కూడా జారీచేస్తున్నారు. ► భూమి రికార్డులు ట్యాంపరింగ్కి అవకాశం ఉండదు. భూ యజమానికి తెలియకుండా భూమి రికార్డులో ఏ మార్పులు జరిగే అవకాశం ఉండదు. డబుల్ రిజిస్ట్రేషన్లకు ఆస్కారం ఉండదు. ► గ్రామ సచివాలయాలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుగా పనిచేస్తాయి. ఎప్పటికప్పుడు భూమి రికార్డులు అప్డేట్ అవుతాయి. ► రిజిస్ట్రేషన్కు ముందే మ్యుటేషన్, పట్టా సబ్ డివిజన్ జరుగుతుంది. ► రీ సర్వేకు హాజరుకాలేని వారికి వాట్సాప్ వీడియో కాల్, జూమ్ ఇతర వీడియో ఇంటరాక్టివ్ టెక్నాలజీల ద్వారా రీసర్వే బృందాలు వారి స్టేట్మెంట్లను రికార్డ్ చేస్తున్నాయి. భూ సంబంధిత సేవలన్నీ ఏకీకృతమయ్యాయి రీ సర్వే విజయవంతంగా జరుగుతోంది. భూమికి సంబంధించిన అన్ని సేవలు ఏకీకృతమై ఒకే డెస్క్ వ్యవస్థలోకి వస్తున్నాయి. గ్రామ సచివాలయంలో సమీకృత సర్వే, రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ సేవలను దేశంలోనే మొదటిసారి అందిస్తున్నాం. మన రీ సర్వే ప్రాజెక్టు అనేక రాష్ట్రాలకు రోల్ మోడల్గా నిలుస్తోంది. ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ మన అధికారులతో ఇతర రాష్ట్రాల్లో రీసర్వే శిక్షణలు ఏర్పాటుచేస్తోంది. – సిద్ధార్థ జైన్, కమిషనర్, సర్వే, సెటిల్మెంట్ శాఖ -
22(ఎ) జాబితా నుంచి.. ఆ భూముల్ని తొలగించవచ్చు
సాక్షి, అమరావతి: పేదలకు 1954వ సంవత్సరానికి ముందు ఇచ్చిన (అసైన్డ్) భూములను నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించవచ్చని జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ఈ మేరకు స్పష్టతనిస్తూ భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ), ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ తాజాగా సర్క్యులర్ జారీచేశారు. కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ తమ జిల్లాలో ఉన్న పరిస్థితిని వివరిస్తూ దీనిపై స్పష్టత ఇవ్వాలని సీసీఎల్ఏని కోరారు. కర్నూలు జిల్లాలో 5,382.78 ఎకరాల ప్రభుత్వ భూమిని 1954 జూన్ 18 నాటికి 2,755 మంది నిరుపేదలకు వ్యవసాయం చేసుకోవడానికి ఇచ్చారని, ఈ భూములను నిషేధిత ఆస్తుల జాబితా 22 (ఎ) 1 నుంచి తొలగించడంపై పలు ప్రతిపాదనలు వచ్చాయని తెలిపారు. ఆ భూముల్ని 22 (ఎ) జాబితా నుంచి తొలగించవచ్చా? లేదా? అనే దానిపై తగు సూచనలు ఇవ్వాలని కోరారు. దీనిపై సీసీఎల్ఏ స్పష్టతనిస్తూ 22 (ఎ) కేసులను త్వరితగతిన పరిష్కరించడం కోసం 2022 సెప్టెంబర్ ఒకటో తేదీన జిల్లా కలెక్టర్లకు అన్ని అంశాలపైనా తగిన వివరణలు, సూచనలతో ఒక సర్క్యులర్ ఇచ్చినట్లు తెలిపారు. మరోసారి దీనిపై స్పష్టతనిస్తూ.. 1954 జూన్ 18కి ముందు పేదలకు (డిప్రెస్డ్ క్లాసెస్) షరతులతోగానీ, షరతులు లేకుండా గానీ ఇచ్చిన భూములను 22 (ఎ) జాబితా నుంచి తొలగించవచ్చని స్పష్టంచేశారు. ఆ భూములకు సంబంధించిన పట్టాలు అందుబాటులో ఉన్నా, లేకపోయినా రెవెన్యూ రికార్డుల ఆధారంగా సుమోటోగా నిషేధిత జాబితా నుంచి తొలగించాలని ఆదేశించారు. అసైన్డ్ భూముల వ్యవహారంపై తరచూ ప్రశ్నలు వస్తుండడంతో ప్రభుత్వం ఇప్పుడు మళ్లీ ఈ సర్క్యులర్ ఇచ్చింది. స్వాతంత్య్రానికి ముందు పేదలకిచ్చిన భూములను 22(ఎ) జాబితా నుంచి తీసివేయాలని గతంలోనే ప్రభుత్వం స్పష్టంచేసినా జిల్లా కలెక్టర్లు, జేసీలు రకరకాల కారణాలు, వివాదాల భయంతో వాటి జోలికి వెళ్లడంలేదు. నిబంధనల ప్రకారం చేయాల్సిన వాటిని కూడా చేయకుండా నాన్చుతున్నారు. అందులో భాగంగానే తమ వద్దకు వచ్చే ఇలాంటి పిటిషన్లపై తాము నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నా సీసీఎల్ఏకి పంపుతున్నారు. ఈ నేపథ్యంలో.. రెవెన్యూ వ్యవస్థకి సంబంధించి అనేక అంశాలపై జిల్లా కలెక్టర్లకు అధికారాలు ఉన్నాయని సీసీఎల్ఏ తరచూ స్పష్టంచేస్తూనే ఉన్నారు. ఇలాంటి అంశాలపై తామిచ్చిన మార్గదర్శకాల ప్రకారం కలెక్టర్లే నిర్ణయం తీసుకోవాలని చెబుతున్నారు. అందులో భాగంగానే 1954 ముందు పేదలకిచ్చిన భూములను 22 (ఎ) నుంచి నిరభ్యంతరంగా తొలగించవచ్చని తాజా సర్క్యులర్ ఇచ్చారు. -
క్యూఆర్ కోడ్లో భూమి
సాక్షి, అమరావతి: బ్రిటీష్ కాలం నాటి రెవెన్యూ రికార్డులను ప్రక్షాళన చేసి వివాదాలకు శాశ్వతంగా తెరదించే లక్ష్యంతో వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు– భూరక్ష పథకం ద్వారా భూముల రీ సర్వే కార్యక్రమాన్ని శరవేగంగా చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం పట్టాదారు పాస్ పుస్తకాల్లో క్యూఆర్ కోడ్ ముద్రించనుంది. దీన్ని స్కాన్ చేయడం ద్వారా భూ కమతం, విస్తీర్ణం, ఎలాంటి భూమి, మ్యాప్ తదితర వివరాలన్నీ తెలుసుకోవచ్చు. రీ సర్వేలో ఆక్షాంశాలు, రేఖాంశాలతో (జియో కో–ఆర్డినేట్స్) భూమి హద్దులను నిర్ధారిస్తున్నారు. భూమికి నలువైపులా వీటిని సూచించడం ద్వారా విస్తీర్ణాన్ని కచ్చితంగా తెలుసుకోవచ్చు. వీటి ఆధారంగా రైతుల పట్టాదార్ పాస్ పుస్తకంలో క్యూఆర్ కోడ్ ముద్రిస్తారు. ప్రస్తుతం ఒక సర్వే నంబర్కి ఒక ఎఫ్ఎంబీ ఉండగా, నలుగురైదుగురు భూ యజమానులుంటే ఉమ్మడిగా ఒక మ్యాప్ కేటాయిస్తున్నారు. రీ సర్వే తర్వాత ప్రతి భూమిని (సెంటు భూమి విడిగా ఉన్నా సరే) సర్వే చేసి ప్రత్యేకంగా రాళ్లు పాతుతారు. దానికి ల్యాండ్ పార్సిల్ మ్యాప్ ఇస్తారు. ఆ సర్వే నంబర్లో ఎంత మంది ఉంటే అందరి మ్యాప్లు విడివిడిగా పొందుపరుస్తారు. ప్రతి భూ యజమానికి తమ భూములపై ఎవరూ సవాల్ చేయడానికి వీలు లేని శాశ్వత హక్కులు లభిస్తాయి. 70 బేస్ స్టేషన్లతో కార్స్ నెట్వర్క్ జీపీఎస్ కార్స్ నెట్వర్క్ (కంటిన్యుస్లీ ఆపరేటింగ్ రిఫరెన్స్ స్టేషన్ నెట్వర్క్) ద్వారా భూములను కొలుస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 70 బేస్ స్టేషన్లు శాటిలైట్ రేడియో సిగ్నళ్లను స్వీకరించి కచ్చితమైన అక్షాంశ, రేఖాంశాలను సెంట్రల్ కంట్రోల్ స్టేషన్కు పంపుతాయి. కార్స్, డ్రోన్, రోవర్ సహాయంతో భూములను కచ్చితంగా కొలుస్తారు. తద్వారా ప్రతి స్థిరాస్తి కొల తలు, హద్దులు, విస్తీర్ణం, భూ కమత పటం ల్యాండ్ రిజిస్టర్లో డిజిటల్ రూపంలో నమోదవుతాయి. వీటితో మ్యాప్లో క్యూఆర్ కోడ్ రూపంలో పొందుపరుస్తారు. నకిలీలు, ట్యాంపరింగ్కు తెర ప్రతి భూమికి (ల్యాండ్ పార్సిల్) ఒక విశిష్ట సంఖ్య కేటాయించి భూమి వివరాలతోపాటు భూ యజమాని ఆధార్, మొబైల్ నంబర్, మెయిల్ ఐడీ సేకరించి భూ రికార్డులో భద్రపరుస్తారు. భూ యజమానికి తెలియకుండా రికార్డుల్లో ఎలాంటి మార్పులు చేయడానికి అవకాశం ఉండదు. డూప్లికేట్ రికార్డులు, ట్యాంపరింగ్కు అవకాశం ఉండదు. ఆయా భూముల క్రయ విక్రయాలు జరిగిన వెంటనే రికార్డుల్లో ఆటోమేటిక్గా మారిపోతాయి. తద్వారా భూ సమాచారాన్ని ఎవరైనా, ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా తెలుసుకోవచ్చు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం కంప్యూటర్ ఆధారిత భూ సమాచార వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది. దీనిద్వారా ఎవరైనా తమ భూమిని మ్యాప్తో సహా చూసుకోవడానికి వీలుంటుంది. సర్వేతో ఇవీ ప్రయోజనాలు.. ► ప్రతి ఆస్థికి యజమాని గుర్తింపు ► రికార్డుల్లో పదిలంగా ఆస్తి హక్కులు ► ఆ ఆస్తిని మరొకరు ఇతరులకు విక్రయించే అవకాశం ఉండదు ► పకడ్బందీగా హద్దులు, కొలతలు ► క్షేత్రస్థాయిలో భూమి ఏ ఆకారంలో ఉందో రికార్డుల్లో అలాగే ఉంటుంది ► ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా ఆస్తి వివరాలు తెలుసుకోవచ్చు ► హద్దు రాళ్లు తొలగించినా, గట్టు తెగ్గొట్టినా మీ ఆస్తి డిజిటల్ రికార్డుల్లో భద్రంగా ఉంటుంది. ► భూమికి సంబంధించిన సమగ్ర సమాచారం, సంపూర్ణ హక్కుతో ఉంటుంది. సంపూర్ణ హక్కులు, రక్షణే లక్ష్యం స్వతంత్ర భారత చరిత్రలో ఏ రాష్ట్రం చేయని విధంగా భూముల రీ సర్వే నిర్వహిస్తున్నాం. రీ సర్వేతో అస్తవ్యస్థంగా ఉన్న రికార్డుల ప్రక్షాళన జరుగుతుంది. వాస్తవంగా ఉన్న భూముల విస్తీర్ణం ప్రకారం డిజిటల్ రికార్డులు తయారవుతాయి. దళారీ వ్యవస్థకు ఆస్కారం ఉండదు. ప్రస్తుతం సర్వే నెంబర్ల వారీగా హద్దు రాళ్లు లేకపోవడంతో సరిహద్దు వివాదాలు తలెత్తుతున్నాయి. రీ సర్వేలో ప్రతి సర్వే నెంబరును ఉచితంగా సర్వే చేస్తున్నాం. వైఎస్సార్ జగనన్న హద్దురాళ్లు ఏర్పాటు చేస్తాం. ప్రతి భూమిపై సంబంధిత యజమానికి సంపూర్ణ హక్కు, రక్షణ కల్పించడమే రీ సర్వే ఉద్దేశం. – సిద్ధార్థ జైన్, కమిషనర్, సర్వే సెటిల్మెంట్, భూ రికార్డుల శాఖ -
ఆదాయార్జనలో దక్షిణ మధ్య రైల్వే ఆల్ టైమ్ రికార్డు..!
రైల్వే మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టిన వినూత్న విధానాలు, జోన్లో నిత్యావసర వస్తువుల సరఫరా సజావుగా సాగేందుకు కేంద్రీకృత విధానాలను కఠినతరం చేయడం ఫలితంగా దక్షిణ మధ్య రైల్వే పార్సిల్ రంగంలో మునుపెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఆదాయాన్ని ఆర్జించింది. 2020-21 సంవత్సరంలో పార్సిల్లో వార్షిక ఆదాయం మొత్తం రూ.108.3 కోట్లు కాగా.. కరోనా మహమ్మారి తెచ్చిన సవాళ్లను అధిగమిస్తూ పార్సిల్స్లో 4.78 లక్షల టన్నుల సరుకు రవాణా వల్ల రూ.200 కోట్ల ఆదాయాన్ని సౌత్ సెంట్రల్ రైల్వేస్ సాధించింది. భారతీయ రైల్వేలో పార్శిల్ స్థలం కోసం అడ్వాన్స్ బుకింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేయడం, షెడ్యూల్ ప్రకారం రైళ్లను నడపడం స్నేహపూర్వక విధానాలతో ఇది సాధ్యమైంది. కొత్త పార్శిళ్లను కొనుగోలు చేయడం, రోడ్డు పార్సిల్స్ను రైలు రవాణాకు మళ్లించడం వంటివి పార్సిల్ రంగంలో వృద్ధికి ఊతంగా మారాయి. వ్యవసాయ ఉత్పత్తులను రవాణా చేయడంలో, దేశ రాజధానికి పాలను రవాణా చేయడంలో ఈ సేవలు కీలక పాత్ర పోషిస్తాయి. 473 కిసాన్ ప్రత్యేక రైళ్లు 1.57 లక్షల టన్నుల వ్యవసాయ ఉత్పత్తులను దేశంలోని వివిధ ప్రాంతాలకు రవాణా చేసి రూ.72.67 కోట్ల ఆదాయాన్నిఆర్జించింది. పాల సరఫరా ద్వారా రూ.34.03 కోట్లు, నాన్ లీజు ట్రాఫిక్ ద్వారా రూ.73.62 కోట్లు, స్పేస్ లీజింగ్ ద్వారా రూ.20.08 కోట్లు ఆర్జించినట్లు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ సంజీవ్ కిశోర్ తెలిపారు. కరోనా కారణంగా దక్షిణ మధ్య రైల్వే అనేక సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ.. వాటిని ఇప్పుడిప్పుడే అధిగమిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సరుకు రవాణాలో మరో అద్భుతమైన మైలురాయిని అధిగమించింది. ఇది 2021-22 లో 112.51 మిలియన్ టన్నుల సరుకును రవాణా చేసి రికార్డు స్థాయిలో రూ.10,000 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. అన్ని రకాల సరకుల లోడిరగ్ అధిక స్థాయిలో జరగడంతో అన్ని రంగాల్లోనూ సరకు రవాణాలో వృద్ధి సాధించింది. గత ఆర్థిక సంవత్సరం 2020-21తో పోలిస్తే సరుకు రవాణా ఆదాయంలో 17.7 శాతం పెరుగుదల, 17.3 శాతం అధిక లోడ్ సాధించింది. 53.78 మెట్రిక్ టన్నుల బొగ్గు, 7.980 మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు, 5.925 మెట్రిక్ టన్నుల ఎరువులు, 4.13 మెట్రిక్ టన్నుల ముడిసరుకుతో కూడిన సరుకును సౌత్ సెంట్రల్ రైల్వేస్ రవాణా చేసింది. (చదవండి: మీ ఆధార్ కార్డులో ఫోటో మార్చుకోండి ఇలా..!) -
అసలైన సాగుదారులకు దన్నుగా..
సాక్షి, అమరావతి: భూ యజమాని హక్కులకు భంగం వాటిల్లకుండా వాస్తవ సాగుదారులకు మరింత మేలు జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ సిద్ధంచేసింది. గడిచిన ఖరీఫ్ సీజన్లో ఈ–క్రాప్ నమోదు పగడ్బందీగా చేపట్టారు. రైతుభరోసా యూనిఫైడ్ డిజిటల్ ప్లాట్ఫామ్ (ఆర్బీయూడీపీ) ద్వారా తొలిసారిగా సర్వే నెంబర్ల వారీగా సాగు వివరాలను నమోదు చేశారు. కానీ, చాలాచోట్ల వాస్తవ సాగుదారుల స్థానంలో భూ యజమానుల పేర్లు నమోదైనట్లుగా గుర్తించారు. దీంతో ప్రస్తుత రబీ సీజన్లో సాగుచేసే ప్రతీ అసలైన రైతు వివరాలు ఈ–క్రాప్లో నమోదుకు చర్యలు చేపట్టారు. నిజానికి.. ఈ–క్రాప్ విధానం అమలులోకి వచ్చాక ఖరీఫ్–2020 సీజన్లో 124.92 లక్షల ఎకరాల్లో 49.72 లక్షల మంది రైతులు సాగుచేస్తున్నట్లుగా నమోదు కాగా.. రబీ 2020–21లో 34.65 లక్షల మంది రైతులు 86.77లక్షల ఎకరాలు సాగుచేస్తున్నట్లుగా నమోదయ్యాయి. అలాగే, ఖరీఫ్–2021లో 45.02 లక్షల మంది రైతులు సాగుచేస్తున్న 102.23 లక్షల ఎకరాలు నమోదు చేశారు. వీరిలో కౌలురైతులు 2.92 లక్షల మంది ఉన్నారు. కానీ, వాస్తవంగా రాష్ట్రంలో 16.56 లక్షల మంది కౌలుదారులున్నారు. వారిలో 60–70 శాతానికి పైగా సెంటు భూమి కూడా లేనివారే. సాగువేళ వీరిలో ప్రభుత్వ ప్రయోజనాలందుకుంటున్న వారు 10–20 శాతం లోపే ఉంటున్నారు. ఈ పరిస్థితికి చెక్ పెడుతూ ప్రతీ వాస్తవసాగుదారుడు లబ్ధిపొందేలా ప్రభుత్వం ప్రస్తుత రబీ సీజన్లో ఈ–క్రాప్ నమోదులో మార్పులు తీసుకొచ్చింది. వీటిపై వాస్తవ సాగుదారులు–భూ యజమానులకు అర్ధమయ్యే రీతిలో ఆర్బీకే స్థాయిలో విస్తృత ప్రచారం నిర్వహిస్తోంది. సాగుదారుల గుర్తింపు ఇలా.. ► విత్తిన వారంలోపు ఆర్బీకేల్లో ఆధార్, బ్యాంకు ఖాతా, ఫోన్ నెంబర్లతో సహా క్రాప్ కల్టివేషన్ రైట్ కార్డు (సీసీఆర్సీ) నకళ్లను అందజేయాలి. ► ఒకవేళ సీసీఆర్సీ లేకున్నా, భూ యజమాని అంగీకరించకపోయినా సరే తాము ఏ సర్వే నెంబర్, ఎంత విస్తీర్ణంలో ఏఏ పంటల సాగుచేస్తున్నామో ఆ వివరాలను ఆర్బీకేలో తెలియజేసి ఈకేవైసీ (వేలిముద్రలు) చేయించుకుంటే రెండు వారాల్లోపు ఆర్బీకే సిబ్బంది పొలానికి వెళ్లి చుట్టుపక్కల రైతులను విచారించి వాస్తవ సాగుదారుడెవరో గుర్తిస్తారు. ► ఇలా నమోదైన వివరాలను సామాజిక తనిఖీలో భాగంగా ఆర్బీకేల్లో వారం రోజులపాటు ప్రదర్శిస్తారు. తప్పులుంటే సవరిస్తారు. ► అభ్యంతరాలొస్తే మరోసారి క్షేత్రస్థాయి పరిశీలన చేసి వాస్తవ సాగుదారులను గుర్తిస్తారు. సీసీఆర్సీ అంటే.. సీసీఆర్సీ పత్రం అంటే భూ యజమానికి, సాగుదారునికి మధ్య అవగాహనా ఒప్పంద పత్రం. వలంటీర్/వీఆర్ఓ వద్ద ఉండే దరఖాస్తులో వివరాలు నింపి భూ యజమాని లేదా వారి ప్రతినిధి, సాగుదారు–గ్రామ వీఆర్వోలు సంతకం చేస్తే సరిపోతుంది. పంట కాలంలో ఎప్పుడైనా ఈ పత్రాన్ని పొందవచ్చు. దరఖాస్తు చేసుకున్న 3 రోజుల్లోనే ఈ పత్రం జారీచేస్తారు. దీని కాలపరిమితి జారీచేసిన తేదీ నుంచి కేవలం 11 నెలలు మాత్రమే. ఈ కార్డుపొందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల రైతులు వైఎస్సార్ రైతుభరోసా కింద రూ.13,500 పెట్టుబడి సాయం పొందేందుకు అర్హులు. ఈ–క్రాప్తో ప్రయోజనాలు.. ► దీని ఆధారంగా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పంట రుణం పొందవచ్చు. ► రూ.లక్షలోపు పంట రుణం ఏడాదిలోపు చెల్లిస్తే సున్నా వడ్డీ పంట రుణాల పథకం కింద 4 శాతం వడ్డీ రాయితీ పొందవచ్చు. ► ఉచిత పంటల బీమా సౌకర్యం వర్తిస్తుంది. ► వైపరీత్యాల్లో పంట నష్టానికి పెట్టుబడి రాయితీ పొందొచ్చు. ► అలాగే, పంటలను ఆర్బీకేల ద్వారా కనీస మద్దతు ధరలకు అమ్ముకోవచ్చు. భూ యజమానులకు పూర్తి రక్షణ ఈ–క్రాప్లో వాస్తవ సాగుదారుల వివరాలు నమోదు ద్వారా భూ యజమానుల హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లదు. ఈ వివరాలేవీ రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయరు. కోర్టులో సాక్షులుగా కూడా చెల్లవు. ఈ–క్రాప్ ఆధారంగా పొందిన పంట రుణం కట్టకపోయినా, ఎగ్గొట్టినా భూ యజమాని/భూమిపై ఎలాంటి న్యాయపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉండదు. కేవలం బకాయి వసూలు సందర్భంగా ఫలసాయంపై మాత్రమే బ్యాంకులకు హక్కు ఉంటుంది. -
AP: ఊర్లున్నాయి.. ప్రజలు లేరు!
సాక్షి, అమరావతి బ్యూరో/కారంపూడి: పాడి–పంట.. పక్షుల కిలకిలారావాలు.. రచ్చబండలు.. అమ్మలక్కల ముచ్చట్లు.. ఇవీ పల్లెలకు ప్రతిరూపాలు. కానీ, ఊరు ఉండి ఆ ఊర్లో ఇవేమీ లేకపోతే..? అచ్చం ఇలాంటివే రెండు ఊర్లు గుంటూరు జిల్లా కారంపూడి మండలంలో ఉన్నాయి. ఒకటి సింగరుట్ల అయితే రెండోది వీరలక్ష్మీపురం. ఇక్కడ జనావాసాలు అంతరించినా అనేక శతాబ్దాలుగా ఆ గ్రామాల పేర్లు మాత్రం సజీవంగా ఉంటూ వస్తున్నాయి. ఈ విశేషమేంటో.. స్థానికంగా ప్రచారంలో ఉన్న చరిత్ర ఏమిటంటే.. రూపం చెడినా ఆనవాళ్లున్నాయి పల్నాటి యుద్ధం (క్రీ.శ 1182) అనంతరం వీరలక్ష్మీపురం అగ్రహారం కనుమరుగు కాగా, ఉగ్రనారసింహుని ఆగ్రహానికి గురై సింగరుట్ల భౌతిక రూపం లేకుండాపోయిందనే గాథ స్థానికంగా ప్రచారంలో ఉంది. సింగరుట్లలో ఉన్న లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రం గతకాల వైభవానికి ప్రతీకగా కన్పిస్తోంది. ఆ గ్రామ పుట్టుక నుంచి కాలగర్భంలో కలసిపోయే వరకు అంతా స్వామి మహిమతోనే జరిగినట్లు స్వామివారి స్థల పురాణం చెబుతోంది. ఆ గ్రామ ఉనికి నిజమని తెలిపేందుకు అక్కడికి సమీపంలోనే అదే పేరుతో సింగరుట్ల తండా ఒకటి ఉంది. అలాగే, వీరలక్ష్మీపురం గ్రామం కాలగర్భంలో కలిసిపోయినా దానికి పడమరగా లక్ష్మీపురం పేరుతో కొత్త గ్రామం ఉంది. సింగరగూడెమే సింగరుట్లగా.. కారంపూడికి సమీపంలోని నల్లమల అడవిలో నరసింహస్వామి స్వయంభూగా వెలిశాడు. ఆహార సేకరణ నిమిత్తం వేటకు వచ్చిన చెంచులు స్వామివారిని గుర్తించకుండా అపరాధం చేశారని, వారిపై తేనేటీగలు దాడిచేసి ఆ ప్రాంతం నుంచి వెళ్లగొట్టిన విషయాన్ని చెంచులు వారి నాయకుడు సింగరకు తెలపగా, సింగర ఆ ప్రాంతాన్ని పరిశీలించి కొండరాతిపై ఉగ్రనారసింహుని రూపాన్ని చూశాడని, ఇక అప్పటినుంచి ఆయన్ను కొలుస్తూ అక్కడే గూడేన్ని ఏర్పాటుచేసుకున్నాడని.. ఆదే సింగరగూడెమని కాలక్రమంలో సింగరుట్లగా నామాంతరం చెందినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత కాలంలో కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు స్వామివారికి 7,700 ఎకరాల భూమిని ఈనాంగా సమర్పించి, పూజించాడని చారిత్రక ఆధారం ఉంది. తర్వాత కాలంలో సింగరుట్ల అగ్రహారికులు స్వామివారి మాన్యాలను ఆక్రమించుకుని చివరకు స్వామికి నిత్య ధూప దీప నైవేద్యాలు లేకుండా చేయడంతో ఉగ్రనారసింహుడు ఆగ్రహించి సింగరుట్ల గ్రామ రూపరేఖలు లేకుండా చేశాడనే పురాణ గాథ ఉంది. వీరలక్ష్మీపురం.. రికార్డుల్లో పదిలం ఇక పల్నాటి చరిత్ర కాలంలో వీరలక్ష్మీపురం అగ్రహారంగా వర్థిల్లింది. ఇది 581.14 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నట్లు రెవెన్యూ రికార్డులు చెబుతున్నాయి. ఊరు కాలగమనంలో కలిసిపోయినా గ్రామం సరిహద్దులు మాత్రం చెక్కుచెదరలేదు. ఇక్కడున్న భూములు సేద్యం చేస్తున్న క్రమంలో అనేక దేవతా విగ్రహాలు బయటపడ్డాయి. వాటిలో వేంకటేశ్వరస్వామి, ఆంజనేయస్వామి, పోలేరమ్మ విగ్రహాలున్నాయి. ఇక్కడ లభ్యమైన విగ్రహాన్నే అగ్రహారం పొలాల్లో వేపకంపల్లి, ఒప్పిచర్ల గ్రామస్తులు ప్రతిష్ఠించారు. వీరలక్ష్మీపురంలో వీరాంజనేయస్వామి దేవాలయం నేటికీ అలనాటి చరిత్రకు సాక్షిగా కన్పిస్తోంది. పల్నాటి చరిత్ర కాలంలో పేర్కొన్న 194 గ్రామాల్లో వీరలక్ష్మీపురం అగ్రహారం కూడా ఒకటి. సింగరుట్లలోని నరసింహస్వామి ఆలయం -
లేని భూమిని అమ్మేశారు.. అసలు భూమిని కొట్టేశారు
కోడుమూరు: అగ్రి గోల్డ్ భూముల వ్యవహారంలో టీడీపీ నాయకులు భారీగా అక్రమాలకు పాల్పడ్డారు. నకిలీ పట్టాదార్ పాస్ పుస్తకాలతో ఆ సంస్థకు కొంత భూమిని అమ్మారు. అమ్మిన భూమికి కూడా తిరిగి తమ కుటుంబ సభ్యుల పేరిట నకిలీ పత్రాలు సృష్టించారు. ఈ తంతు వెనుక మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ప్రధాన అనుచరుడు దామోదర్ నాయుడు, ఆయన కుటుంబ సభ్యులు కీలక పాత్ర పోషించారు. సీఐడీ అధికారుల విచారణలో ఈ విషయం వెలుగు చూసింది. కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం రామకృష్ణాపురం గ్రామంలో సర్వే నంబర్ 113లో ఉన్న 8.24 ఎకరాల భూమిని దామోదర్ నాయుడు సోదరులు వెంకటయ్య, నారాయణ గతంలో అగ్రి గోల్డ్ సంస్థకు విక్రయించారు. ఇది సాగులో ఉన్న భూమి కావడంతో రెవెన్యూ అధికారులతో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకుని దామోదర్ నాయుడు భార్య వరలక్ష్మి, వెంకటయ్య భార్య రంగమ్మకు తిరిగి బదలాయించుకున్నారు. అలాగే సర్వే నంబర్ 146/1 రెవెన్యూ రికార్డుల్లో లేకున్నా.. నకిలీ పట్టాదార్ పాస్ పుస్తకం సృష్టించి 6.95 ఎకరాల భూమిని దామోదర్ నాయుడు అగ్రి గోల్డ్ సంస్థకు విక్రయించారు. 149బీ, 80/1, 40/2, 40, 33/7, 25/9, 84ఏ సర్వే నంబర్లలో దామోదర్ నాయుడు సమీప బంధువులు రామాంజనేయులు, శ్రీనివాసులు, నారాయణ, నాగేశ్వరరావు, లక్ష్మమ్మ, పుల్లయ్య, పార్వతమ్మలకు భూములు లేకపోయినా నకిలీ పట్టాదార్ పాస్ పుస్తకాల ద్వారా 21.4 ఎకరాలను అగ్రి గోల్డ్ సంస్థకు అమ్మారు. బయటపడుతున్న అక్రమాలు అగ్రి గోల్డ్ కొనుగోలు చేసిన భూముల్లో భారీ ఎత్తున అక్రమాలు బయటపడుతున్నాయి. రెవెన్యూ రికార్డులు తారుమారు కావడంతో వాటి మూలాలను వెలికి తీసేందుకు సీఐడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కోడుమూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రికార్డుల్ని పరిశీలించి అవకతవకలను గుర్తించారు. 40/2 సర్వే నంబర్లో రెవెన్యూ రికార్డుల ప్రకారం పూర్తి విస్తీర్ణం 2.72 ఎకరాలుండగా.. 10.61 ఎకరాలున్నట్టు రిజిస్ట్రేషన్ చేయించారు. ఇలా రెవెన్యూ రికార్డుల్లో లేని సర్వే నంబర్లను సృష్టించి నకిలీ పట్టాదార్ పాస్ పుస్తకాలతో రిజిస్ట్రేషన్ చేయించి భూములు అమ్మినట్టు సీఐడీ అధికారుల విచారణలో బయటపడింది. వారం పది రోజుల్లో పూర్తి నివేదికను సీఐడీ అధికారులు ప్రభుత్వానికి సమర్పించనున్నట్టు సమాచారం. రికార్డులు తారుమారు రెవెన్యూ అధికారులతో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకుని దామోదర్ నాయుడు కుటుంబ సభ్యులు రికార్డులను తారుమారు చేశారు. ప్రస్తుతం కృష్ణగిరి గ్రామ సర్పంచ్ వరలక్ష్మి (దామోదర్ నాయుడు భార్య) పేరిట సర్వే నంబర్ 113లో గల 4.12 ఎకరాల భూమిని గతంలోనే దామోదర్ నాయుడు అగ్రి గోల్డ్కు విక్రయించారు. అలాగే సర్వే నంబర్ 95లో రామాంజనేయులు, శ్రీనివాసులు, నారాయణ, వెంకటలక్ష్మికి ఉన్న 4.57 ఎకరాల భూమిని అగ్రి గోల్డ్కు అమ్మారు. అదే భూమిని వారి కుటుంబ సభ్యులు హరిబాబు, జయరాముడు, వెంకటయ్య పేర్ల మీద బదలాయించుకున్నారు. సర్వే నంబర్లు 123/1ఏ, 123/2ఏ, 123/3ఏ, 141/1, 121/2సీ, 121/1బీ, 113, 93, 92/ఏ2, 76, 68/ఏ, 64/2, 64/ఏ, 54/2, 48/5, 5/4,5,7, 144/1,2, 145/ఏ, 2సీ, 133/2, 3, 149/బీ1, 146/1బీ, 95లలో ఉన్న 126.56 ఎకరాల భూమిని గతంలో అగ్రి గోల్డ్కు అమ్మారు. మా దృష్టికి రాలేదు అగ్రి గోల్డ్ సంస్థ కొనుగోలు చేసిన భూములకు సంబంధించి రెవెన్యూ రికార్డులు తారుమారైనట్టు మా దృష్టికి రాలేదు. ఏడాది క్రితమే నేను కృష్ణగిరి తహసీల్దార్గా బాధ్యతలు తీసుకున్నాను. రికార్డుల మార్పులు, చేర్పులపై సీఐడీ అధికారులు పరిశీలన చేస్తున్నారు. – రామచంద్రారావు, తహసీల్దార్, కృష్ణగిరి -
పట్టాదారు పేరు తహసీల్దార్ ఆఫీసు.. తండ్రి పేరు కొందుర్గు
కొందుర్గు: సాధారణంగా వ్యవసాయ భూములకు పట్టాదార్లుగా రైతులు ఉంటారు. వారి పేర్లపై ఎంత భూమి ఉంది, ఖాతా నంబరు, తండ్రి పేరు వంటి వివరాలను రికార్డుల్లో పొందుపరుస్తారు. కానీ రంగారెడ్డి జిల్లా జిల్లేడ్చౌదరిగూడ మండలం పెద్దఎల్కిచర్ల గ్రామంలో రెవెన్యూ రికార్డులు విచిత్రంగా ఉన్నాయి. ధరణి పోర్టల్లో పెద్దఎల్కిచర్ల లోని సర్వేనంబర్ 32/ఉ2లో 1–14 ఎకరాల భూమి తహసీల్దార్ ఆఫీసు పేరుపైన ఉంది. పట్టాదారు పేరు నమోదు చేయాల్సిన స్థానంలో తహసీల్దార్ ఆఫీసు అని ఉంది. తండ్రిపేరు స్థానంలో కొందుర్గు అని నమోదు చేశారు. ఇక ఈ భూమికి ఫ్యాన్సీ ఖాతా నంబర్ 2222 ఇచ్చారు. దీంతో అధికారుల పనితీరుపై స్థానికులు విమర్శలు గుప్పిస్తున్నారు. -
15.74 ఎకరాలను నొక్కేసేందుకు కుట్ర
వెంకటాచలం: ఆన్లైన్లో రెవెన్యూ రికార్డులు తారుమారు చేసి ప్రభుత్వ భూమిని పట్టా భూమిగా మార్చిన కేసులో నలుగురు వ్యక్తులను శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. నెల్లూరు రూరల్ డీఎస్పీ హరినాథ్రెడ్డి వివరాలు వెల్లడించారు. ప్రకాశం జిల్లాకు చెందిన బొడ్డు గీత కొన్నినెలల క్రితం పొదలకూరు తహసీల్దార్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసింది. ప్రస్తుతం గుడ్లూరు కార్యాలయంలో పనిచేస్తుంది. పొదలకూరులో పనిచేసే సమయంలో మండలంలోని అయ్యవారిపాళెం గ్రామానికి చెందిన పెంచలభాస్కర్తో గీతకు పరిచయం అయ్యింది. అతని చిన్నాన్న నలగర్ల కోటేశ్వరరావుకు ఓ వ్యక్తి కుంకుమపూడిలో ప్రభుత్వ పోరంబోకు 1.16 ఎకరాలు విక్రయించాడు. దీనిని పట్టా భూమిగా మార్చాలని కోటేశ్వరరావు పెంచల్భాస్కర్ను కోరాడు. దీంతో అతను గీతను సంప్రదించాడు. గీత రూ.2 లక్షలిస్తే పట్టా భూమిగా మార్పిస్తానని చెప్పి ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకోసం కంప్యూటర్ ఆపరేటర్లు సైదాపురానికి చెందిన రాజేష్, కర్నూలుకు చెందిన ప్రవీణ్కుమార్రెడ్డి సాయం కోరింది. గుడ్లూరు డిప్యూటీ తహసీల్దార్ అనారోగ్యం కారణంగా సెలవుపై ఉండడంతో అతని డిజిటల్ సిగ్నేచర్ కీ గీత వద్దనే ఉంది. రాజేష్, ప్రవీణ్ సాయంతో గత నెల 30వ తేదీన వెంకటాచలం తహసీల్దార్ యూజర్ ఐడీ, పాస్వర్డ్ను ఉపయోగించి వెబ్ల్యాండ్ వెబ్సైట్ ఓపెన్ చేసింది. ఆ తర్వాత గుడ్లూరు డీటీ సిగ్నేచర్ కీతో కాకుటూరు, కుంకుమపూడి పరిధిలోని 15.74 ఎకరాల ప్రభుత్వ భూములను పట్టా భూమిగా మార్చి బొడ్డు బుజ్జమ్మ, బొడ్డు మస్తానయ్య, బిక్కి మనెమ్మ, నలగర్ల కోటేశ్వరరావు పేర్లమీదమార్చి వేసింది. విషయం అధికారులకు తెలియడంతో విచారణ చేయగా.. వినుకొండ తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న గొల్ల రామబ్రహ్మం బయోమెట్రిక్ అథెంటికేషన్ చేయగా, గీత డిజిటల్ సిగ్నేచర్ చేసి కుట్రపూరితంగా రికార్డులు తారుమారు చేసినట్లు గుర్తించారు. బొడ్డు గీత, పెంచలభాస్కర్, నలగర్ల కోటేశ్వరరావును అరెస్టు చేయగా, గొల్ల రామబ్రహ్మం వెంకటాచలం పోలీస్స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. -
ప్రభుత్వ లెక్కల ప్రకారం 27 ఏళ్లు; అందుకే మళ్లీ పెళ్లి చేసుకుంటున్నా
లక్నో: ఉత్తరప్రదేశ్లోని అజమ్ఘఢ్ జిల్లాకు చెందిన ఖలీలాబాద్ గ్రామవాసి మృతక్లాల్ బిహారి. చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో తల్లి మరొకరిని పెళ్లి చేసుకుని, కొడుకును తీసుకుని ముబారక్ పూర్కి వెళ్లింది. చదువు అబ్బకపోవడంతో బిహారి బనారస్ చీరలు నేయడం నేర్చుకున్నాడు. 22 ఏళ్ల వయసులో తండ్రికి ఊరిలో ఉన్నకొద్ది పాటి స్థలంలో మగ్గాలు పెట్టాలనుకున్నాడు. అందుకు ఆయనకు బ్యాంక్ లోన్ అవసరమైంది. గ్రామంలో ఉంటున్నట్టుగా గుర్తింపు పత్రం కోసం జిల్లా హెడ్ క్వార్టర్స్లోని రెవెన్యూ కార్యాలయానికి వెళ్లాడు. అక్కడే లాల్ బిహారికి ఆశ్చర్యకర విషయం తెలిసింది. రెవెన్యూ రికార్డులో అప్పటికే లాల్ బిహారీ మరణించినట్లుగా ఉంది.దీనిప్రకారం ప్రభుత్వ రికార్డుల్లో ఆయన చనిపోయాడు. తాను బతికే ఉన్నానని నిరూపించుకునేందుకు బిహారి 18 ఏళ్ల పాటు న్యాయ పోరాటం చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం 64 ఏళ్ల వయసున్న లాల్ బిహారీ ప్రభుత్వ లెక్కల ప్రకారం తన వయస్సు 27 ఏళ్లని అందుకే నా భార్య కర్మీదేవిని మరోసారి పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిపాడు. ఆయన మాట్లాడుతూ.. '' 2022లో తమ పెళ్లి జరగనుందని.. 56 ఏళ్ల నా భార్య మెడలో మళ్లీ తాళి కట్టనున్నాను. ప్రభుత్వ రికార్డుల ప్రకారం 1994లో మళ్లీ పుట్టిన నాకు ఇప్పుడు 27 ఏళ్లు. నేను బతికే ఉన్నానని దేశంలో మరింత మందికి తెలియజెప్పేందుకే వివాహం చేసుకుంటున్నా. ఊరిలో ఉన్న వ్యవసాయ భూమిని దక్కించుకునేందుకు దగ్గరి బంధువొకరు చేసిన పని అది.నా ఆస్తిని దక్కించుకునేందుకు మా దగ్గరి బంధువు ప్రభుత్వ అధికారికి 300 రూపాయల లంచం ఇచ్చి నేను జూలై 30, 1976లో మరణించినట్టుగా రాయించాడు. విచిత్రమేమిటంటే ఆ అధికారి ఒకప్పుడు నా మిత్రుడే. లంచానికి ఆశపడి ఎదుటివారికి లాభం చేకూర్చేందుకు అలా చేశాడని తెలిసింది’’ అని చెప్పుకొచ్చాడు. కాగా బిహారి తన 18 ఏళ్ల పోరాటంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. మొదట్లో ఆయన కేసు విని కొంతమంది లాయర్లు నవ్వితే, మరికొందరు సానుభూతి తెలిపారు. స్థానికులు బిహారీని దెయ్యంగా పిలిచేవారు. చిన్నపిల్లలు ఆయనను చూసి పారిపోయేవారు. అనేక అవమానాలు ఎదుర్కొన్నప్పటికీ బిహారీకి ఆయన భార్య కర్మీదేవి మాత్రం తోడుగా నిలిచింది. ఆమె సహకారంతోనే బిహారి ఒక పథకం ఆలోచించాడు. తాను బతికే ఉన్నానని అధికారులకు తెలియజేసేందుకు ప్రభుత్వ అధికారికి లంచం ఇచ్చిన తన బంధువు కొడుకును కిడ్నాప్ చేశాడు. ఎలాగైనా తన పేరు మీద కేసు రిజిస్టర్ కావాలనుకున్నాడు. ఎన్నికల్లో పోటీ చేయడం, భార్యకు వితంతు పెన్షన్ రాబట్టడం కోసం ప్రభుత్వ రికార్డుల్లోకి ఎక్కించడం, ‘ముఝే జిందా కరో’ (నన్ను బతికించండి) అనే ప్లకార్డుతో అసెంబ్లీలోకి దూసుకెళ్లడం... ప్రభుత్వ అధికారికి లంచం ఇవ్వజూపుతూ పట్టుబడటం, తన శవ ఊరేగింపు తనే జరుపుకోవడం వంటి అనేక ప్రయత్నాలు చేశాడు. ఆ విధంగా స్థానిక వార్తల్లోకి ఎక్కాడు. ఆయన చేసిన పోరాటాల ఫలితంగా చివరకు జూన్ 30, 1994లో జిల్లా యంత్రాంగం లాల్ బిహారీ బతికున్నట్టుగా గుర్తించింది. లాల్ బిహారీ పోరాటాన్ని పత్రికల ద్వారా తెలుసుకున్న బాలీవుడ్ నటుడు, దర్శకుడు సతీశ్ కౌశిక్ ఆయన జీవితాన్ని తెరకెక్కించాడు. ‘కాగజ్’గా ఇటీవల ఓటీటీలో విడుదలైన ఈ సినిమాలో ప్రధాన పాత్రను ప్రముఖ నటుడు పంకజ్ త్రిపాఠి పోషించారు. ఇందులో ఆయన భార్య కర్మీదేవిగా మోనాల్ గజ్జర్ నటించారు. ఈ సినిమాకు ప్రముఖ హీరో సల్మాన్ఖాన్ నిర్మాతగా వ్యవహరించడం విశేషం. -
జనంలేక పాడుబడ్డ ఊరు: రోజూ వచ్చి వెళ్తున్న వృద్ధుడు
చిత్తూరు: పాపాఘ్ని నది సమీపంలో ఉండే ఊరు ఒకప్పుడు జనాలతో, పంటలతో కళకళలాడేది. ఆ ఊరి పేరు పుట్టాపర్తి. చిత్తూరు జిల్లా పెద్దతిప్పసముద్రం మండలంలో ఉంది. కొన్నేళ్ల నుంచి నదిలో నీరులేక, బోరు బావుల్లో నీరు రాక.. పంటలు పండక ఊరు ఖాళీ అయిపోయింది. ఇక్కడ జీవించిన వారు సమీప గ్రామాలకు, బెంగళూరుకు పనుల కోసం వలస వెళ్లిపోయారు. దీంతో ఇళ్లన్నీ శిథిలమైపోయాయి. జనం లేకపోయినా ఊరి పేరు మాత్రమే రెవెన్యూ రికార్డుల్లో మిగిలిపోయింది. అయితే బక్కోళ్ల కిట్టన్న అనే 70 ఏళ్ల వృద్ధుడు మాత్రం ప్రతిరోజు ఊరికి వచ్చి వెళుతూ ఉంటాడు. పగలంతా తన వ్యవసాయ భూమిలో ఉన్న షెడ్డులో కాలక్షేపం చేసి సాయంత్రం తాను నివసిస్తున్న టి.సదుం గ్రామానికి చేరుకుంటున్నాడు. ఎందుకు వెళ్తావు ఆ ఊరికి అని అడిగితే.. చిన్న నాటి జ్ఞాపకాలు నెమరు వేసుకోవడానికి అని కిట్టన్న బదులిస్తాడు. ఊరి పేరు ఎలా వచ్చిందంటే.. టి.సదుంలో ఒకప్పుడు కలరా వ్యాధి ప్రబలడంతో ప్రజలంతా భయాందోళనకు గురయ్యారు. ఈ మహమ్మారి నుంచి తప్పించుకోవడానికి కొంతమంది పాపాఘ్ని నది ఒడ్డున ఉన్న ప్రాంతంలో నివసించడానికి వెళ్లారు. ఆ ఖాళీ స్థలంలో గుడిసెలు, రాతి సుద్ద మిద్దెలు కట్టుకోవడంతో అదో ఊరిగా మారింది. అక్కడ నాగుల పుట్టలు, చెదలు పుట్టలు అధికంగా ఉండటంతో ఆ ఊరికి పుట్టాపర్తిగా నామకరణం చేశారు. శివరాత్రి ఉత్సవాలు ప్రత్యేకత.. పాపాఘ్ని నది ఒడ్డున శ్రీ పార్వతీ సమేత సంగమేశ్వర స్వామి ఆలయం ఉంది. ఇక్కడ ఏటా శివరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి వారి ఉత్సవ ప్రతిమలను పుట్టాపర్తికి తీసుకెళ్లడం.. అనంతరం టి.సదుం గ్రామానికి తీసుకెళ్లడం ఆనవాయితీగా ఉండేది. కానీ ఇప్పుడు పుట్టాపర్తిలో ఎవరూ లేకపోవడంతో ఉత్సవ ప్రతిమలను నేరుగా టి.సదుంకు తీసుకెళ్లిపోతున్నారు. పాపాఘ్ని నదిలో నీళ్లు పుష్కలంగా ఉన్నపుడు కపిల్ (ఎద్దులతో తిప్పే యంత్రం) ద్వారా నీళ్లు తోడి పంటలు సాగు చేసేవారమని, పచ్చటి పొలాలతో ఊరు కళకళలాడేదని కిట్టన్న చెప్పాడు. ఏడేళ్ల వయసు వరకు ఇక్కడే.. నాకు ఏడేళ్ల వయసు వచ్చే వరకూ ఊళ్లోనే ఉన్నా. పాపాఘ్ని నది దాటి టి.సదుంలో ఉన్న పాఠశాలకు వెళ్లేవాడిని. ఒకసారి నదిలో నీటి ప్రవాహం అధికం కావడంతో ఇంటికి రాలేక పోయాను. ఇప్పుడు టి.సదుంలోనే ఉంటున్నాను. – బోడెన్నగారి ఆదెన్న నీరు తగ్గే వరకూ అక్కడే.. పాపాఘ్ని నదిలోకి నీరు వస్తే మూడు రోజుల వరకూ ప్రవాహం తగ్గేది కాదు. పని మీద బయటకు వెళ్తే అక్కడే ఉండేవాళ్లం. ఊళ్లో పండుగలు, పబ్బాలు గొప్పగా చేసుకునేవాళ్లం. పగలంతా గత అనుభవాలు గుర్తుచేసుకుంటూ ఇక్కడే కాలక్షేపం చేసి రాత్రికి టి.సదుం చేరుకుంటాను. – బక్కోళ్ల కిట్టన్న చదవండి: నా కులంపై దుష్ప్రచారం చేస్తున్నారు: పుష్ప శ్రీవాణి -
జీఎస్టీ... రికార్డు వసూళ్లు
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను వసూళ్ల రికార్డులు కొనసాగుతున్నాయి. మార్చిలో వసూళ్లు రూ.1.23 లక్షలుగా నమోదయినట్లు ఆర్థిక మంత్రిత్వశాఖ గురువారం ప్రకటించింది. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఈ స్థాయి వసూళ్లు ఇదే తొలిసారికాగా, 2020 ఇదే నెలతో పోల్చితే 27 శాతం అధికం. 2020 మార్చిలో జీఎస్టీ ద్వారా వచ్చిన ఆదాయం రూ.97,590 కోట్లు. ఎకానమీ వేగంగా పురోగమిస్తోందనడానికి జీఎస్టీ గణాంకాలు సంకేతమని ఆర్థికశాఖ తెలిపింది. నకిలీ బిల్లింగ్ నిరోధం, జీఎస్టీ, ఆదాయపు పన్ను, కస్టమ్స్ ఐటీ వ్యవస్థలుసహా సూక్ష్మ స్థాయిలో డేటా విశ్లేషణ, పటిష్టమైన పన్ను యంత్రాంగం కూడా జీఎస్టీ వసూళ్లు క్రమంగా పురోగమించడానికి కారణమని ఆర్థికశాఖ వివరించింది. ముఖ్యాంశాలు చూస్తే... ► మార్చి నెలలో జీఎస్టీ స్థూల వసూళ్లు రూ.1,23,902 కోట్లుగా నమోదయ్యాయి. వీటిలో సెంట్రల్ జీఎస్టీ రూ.22,973 కోట్లు. స్టేట్ జీఎస్టీ రూ.29,329 కోట్లు. ఏకీకృత జీఎస్టీ రూ. 62,842 కోట్లు (వస్తు దిగుమతులపై రూ.31,097 కోట్ల వసూళ్లు కలిపి), సెస్ రూ.8,757 కోట్లు (వస్తు దిగుమతులపై రూ. 935 కోట్ల వసూళ్లు కలిపి). ► వార్షికంగా 2020 మార్చితో పోల్చితే తాజా సమీక్షా నెలలో వస్తు దిగుమతల నుంచి ఆదాయం 70 శాతం పెరిగింది. దేశీయ లావాదేవీల నుంచి రెవెన్యూ 17 శాతం పెరిగింది. ► కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు 2020 మార్చి చివరి వారం నుంచి దేశవ్యాప్త లాక్డౌన్ను కేంద్రం విధించిన విషయం తెలిసిందే. దీంతో ఆ తర్వాతి నెల ఏప్రిల్కు సంబంధించిన జీఎస్టీ వసూళ్లు రూ.32,172 కోట్లకు పడిపోయాయి. లాక్డౌన్ నియంత్రణలను క్రమంగా సడలిస్తూ రావడంతో వ్యాపార కార్యకలాపాలు ఊపందుకున్నాయి. ఇదే జీఎస్టీ వసూళ్ల రూపంలో కనిపిస్తోంది. ► పెద్ద రాష్ట్రాలు జీఎస్టీ వసూళ్లలో 6–15 శాతం మధ్య వృద్ధిని చూపించాయి. వరుసగా జీఎస్టీ ఆదాయాలు వృద్ధిని చూపిస్తుండడం ఆర్థిక వ్యవస్థ సామర్థ్యంపై విశ్వాసాన్ని కలిగిస్తుంది. అలాగే, వ్యాపార కార్యకలాపాలు పూర్తిగా తిరిగి మొదలయ్యాయని, వస్తు, సేవలకు డిమాండ్ అధికంగా ఉండడాన్ని తెలియజేస్తోంది. పారిశ్రామిక రంగం తిరిగి సాధారణ స్థితికి వస్తోందని కూడా జీఎస్టీ ఆదాయంలో వృద్ధి తెలియజేస్తోంది. ద్రవ్యలోటు కట్టడికి దోహదం 2020–21లో ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం(ద్రవ్యలోటు) రూ.18.5 లక్షల కోట్లు ఉంటుం దని (జీడీపీలో 9.5%) 2021 ఫిబ్రవరి 1 న ప్రవేశపెట్టిన బడ్జెట్ సవరించిన గణాంకాలు పేర్కొన్నాయి. మార్చిలో రికార్డు స్థాయి జీఎస్టీ వసూళ్ల నేపథ్యంలో.. ద్రవ్యలోటు నిర్దేశిత స్థాయిలోనే ఉండొచ్చు. ప్రభుత్వ ఆదాయాలకు సంబంధించి తగిన నగదు సమతౌల్యతతో 2021–22 ప్రారంభం అవుతున్నట్లు తాజా పరిస్థితి సూచిస్తోంది. – అదితి నాయర్, ఇక్రా ప్రిన్సిపల్ ఎకనమిస్ట్ -
పేరుంది.. కానీ ఊరే లేదు
సాక్షి, మెదక్/తూప్రాన్: అక్కడ ఊరు లేదు.. జనం లేరు. కానీ.. రెవెన్యూ రికార్డుల్లో ఆ గ్రామాల పేర్లు నిక్షిప్తమై ఉన్నాయి. అంతేకాదు.. ఇప్పటికీ వందల ఎకరాల భూమికి సంబంధించి లావాదేవీలు వాటి పేరిటే కొనసాగుతున్నాయి. ఆనవాళ్లు మాత్రమే మిగిలినప్పటికీ.. ఆ భూములకు మంచి డిమాండ్ ఉంది. ఇంతకీ అక్కడి జనం ఏమైనట్లు అనేది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. తూప్రాన్ మండలంలో రికార్డులకే పరిమితమైన రెవెన్యూ గ్రామాలు హుస్సేన్పూర్, మజీద్పల్లిపై ప్రత్యేక కథనం.. తూప్రాన్ మండలంలో 22 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఇందులో హుస్సేన్పూర్, మజీద్పల్లి పేర్లు రెవెన్యూ రికార్డుల్లో మాత్రమే ఉన్నాయి. జనంలేని ఈ రెండు పల్లెలు 1953 నుంచి రెవెన్యూ గ్రామాలుగా కొనసాగుతున్నాయి. గతంలో అల్లాపూర్ పంచాయతీ పరిధిలో హుస్సేన్పూర్ ఉండేది. ప్రస్తుతం అల్లాపూర్ తూప్రాన్ మున్సిపాలిటీ విలీనమైంది. మజీద్పల్లి(ఎన్కే) గ్రామం మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డి గ్రామ పంచాయతీ పరిధిలోకి రాగా.. రెవెన్యూ గ్రామంగా తూప్రాన్ మండల పరిధిలోకి వస్తోంది. హుస్సేన్పూర్ శివారులో హనుమాన్ విగ్రహం, రోలు ఆ గ్రామానికి ఆనవాలుగా నిలుస్తుండగా.. మజీద్పల్లి (ఎన్కే)కి సంబంధించి ఎలాంటి గుర్తులు లేవు. నిజాం కాలంలో ఈ గ్రామాల్లో జనావాసాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడి ప్రజలు ఎక్కడికెళ్లారు.. ఏ కారణంతో ఊళ్లు ఖాళీ అయ్యాయి.. అని ఎవరూ చెప్పలేకపోతున్నారు. కనిపించని ఊళ్లలో ‘రియల్’ జోరు.. ప్రస్తుతం కనపడని.. జనం లేని హుస్సేన్పూర్, మజీద్పల్లి (ఎన్కే) ఊళ్లలో సాగు భూమి మాత్రమే ఉంది. గతంలో కొందరు రైతులు పత్తి, వరి, మొక్కజొన్న పంటలు పండించేవారు. ప్రస్తుతం ఈ భూములకు మంచి డిమాండ్ పలుకుతోంది. ఈ నేపథ్యంలో భూమిని ప్లాట్లుగా చేసి.. క్రయవిక్రయాలు జరుపుతుండడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతోంది. హుస్సేన్పూర్లో ఎకరాకు రూ.కోటికి పైగా.. మజీద్పల్లి (ఎన్కే)లో ఎకరాకు రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు పలుకుతుండడం విశేషం. మజీద్పల్లి(ఎన్కే) గ్రామంలో 60 ఎకరాల భూమిని టీఎస్ఐసీసీకి కేటాయించగా.. మిగతా భూముల్లో రైతులు సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. గతంలో ఉండేవారట గతంలో హుస్సేన్పూర్లో జనాభా ఉండేదని పెద్దలు చెప్పారు. వ్యవసాయమే ఆధారంగా జీవించినట్లు మా తాత చెప్పేవారు. ఇక్కడ ప్రస్తుతం ఏ ఒక్కరూ లేకపోవడం అంతుపట్టడం లేదు. ఈ గ్రామ శివారులో హనుమాన్ విగ్రహం, నంది విగ్రహం ఉండేది. నంది విగ్రహాన్ని ఎవరో తీసుకెళ్లారు. ప్రస్తుతం ఎలాంటి ఆనవాళ్లు లేవు. – జిన్న భగవాన్రెడ్డి, మున్సిపల్ 7వ వార్డు కౌన్సిలర్, అల్లాపూర్ ఈ గ్రామాల్లో ప్రజలెవరూ లేరు.. తూప్రాన్ మండలంలోని హుస్సేన్పూర్, మజీద్పల్లి(ఎన్కే) గ్రామాలు రెవెన్యూ రికార్డుల్లో దశాబ్దాలుగా ఉన్నాయి. ఈ గ్రామాలు ఇప్పడు కనిపించడం లేదు.. జనాలు కూడా లేరు. నిజాం కాలంలో ప్రజలు నివసించేవారట. ఈ భూములకు మార్కెట్లో డిమాండ్ ఉండడంతో వెంచర్లుగా చేసి విక్రయిస్తున్నారు. కొందరు వ్యవసాయం చేసుకుంటున్నారు. – శ్రీదేవి, తహసీల్దార్, తూప్రాన్ -
కటకటాల్లోకి కల్లాడ వీఆర్ఏ..
నందిగాం(శ్రీకాకుళం జిల్లా): రెవెన్యూ రికార్డుల తారుమారు కేసులో కల్లాడ పంచాయతీ వీఆర్ఏని అరెస్టు చేశామని ఎస్సై ఎస్.బాలరాజు బుధవారం తెలిపారు. తప్పుడు రికార్డులు సృష్టించి సుమారు 30 ఎకరాల లేని భూమి ఉన్నట్లుగా చేసి అమాయకులకు అమ్మజూపి వారి నుంచి లక్షలాది రూపాయలు దోచుకున్న తెలుగుదేశం పార్టీ నాయకుడు మదన్గౌడ్కు వీఆర్ఏ కొత్తపల్లి ఢిల్లేశ్వరరావు సహకరించినట్టు తేలింది. కంప్యూటర్ పరిజ్ఞానంతో రెవెన్యూ కార్యాలయంలో తిష్ట వేసిన ఢిల్లేశ్వరరావు రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి మదన్గౌడ్కు సహాయం చేశాడని, అందుకు ప్రతిఫలంగా రూ.1.25 లక్షలు పుచ్చకున్నాడని పక్కా ఆ«ధారాలు సేకరించడంతో అరెస్టు చేసి జైలుకు పంపించామని ఎస్సై పేర్కొన్నారు. నందిగాం తహసీల్దారు కార్యాలయంలో అవుట్సోర్సింగ్లో పద్ధతిలో కంప్యూటర్ ఆపరేటర్ పని చేసేవారు. అయితే కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న వీఆర్ఏ ఢిల్లేశ్వరరావును గతంలో అధికారులు నియామకం చేశారు. ఇదే అదునుగా ప్రతి చిన్న పనికీ లంచం తీసుకోవడానికి అలవాటు పడిన ఆయన టీడీపీ నాయకులకు పూర్తి సహాయసహకారాలు అందిస్తుండేవాడని తెలిసింది. రెవెన్యూ రికార్డుల వ్యవహారంలో ప్రతి చిన్న పనికి తహసీల్దారు డిజిటల్ సంతకం అవసరం కావడంతో దానికి సంబంధించిన ‘కీ’ని అప్పుడప్పుడూ ఢిల్లేశ్వరరావు వినియోగించేవాడు. అయితే ఇదే అదునుగా భావించిన మదన్గౌడ్ ఢిల్లేశ్వరరావు ద్వారా మండలంలోని పలుచోట్ల రెవెన్యూ రికార్డులను తారుమారు చేసేందుకు రూ.1.25 లక్షలు ముట్టజెప్పాడు. అయితే భూముల కోనుగోలు చేసిన హైదారాబాద్కు చెందిన వ్యక్తికి అనుమానం రావడంతో కార్యాలయానికి వెళ్లి ఆరా తీయడంతో రికార్డుల తారుమారు వ్యవహారం జూలైలో బయటకు వచ్చింది. అంతేకాక బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన నందిగాం పోలీసులు గతంలో ప్రధాన నిందితుడు మదన్గౌడ్ను అరెస్టు చేశారు. రికార్డుల తారుమారులో తహసీల్దారు కార్యాలయ సిబ్బంది పాత్రపై అనుమానం ఉన్న పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టగా వీఆర్ఏ ఢిల్లేశ్వరరావుపై అనుమానం వచ్చి ఆరా తీయగా నిజాలు బయటకు వచ్చాయి. దీంతో మదన్గౌడ్ నుంచి పుచ్చుకున్న రూ.1.25 లక్షల్లో పోలీసులు రూ.లక్ష రికవరీ చేయడంతో పాటు ఢిల్లేశ్వరరావును అరెస్టు చేసి నరసన్నపేట సబ్జైల్కు పంపించారు. రెవెన్యూ రికార్డుల తారుమారు వ్యవహారంలో మరింత లోతుగా దర్యాప్తు చేస్తే మరిన్ని నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉందని పలువురు అంటున్నారు. -
విజయనగరంలో సమగ్ర భూ సర్వే..!
మరికొద్ది నెలల్లో రైతుల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుంది. భూముల వివరాలు ఆన్లైన్ కానున్నాయి. ప్రభుత్వ పథకాలు, రాయితీలు అర్హులైన రైతులకు అందనున్నాయి. సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న భూ సమగ్ర సర్వే నిర్ణయం రైతుల్లో ఆనందం నింపుతోంది. సాక్షి, మెరకముడిదాం: దశాబ్దాల కాలంగా రైతులను వెంటాడు తున్న భూ సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం అడగులేస్తోంది. భూముల సమగ్ర సర్వేకు సన్నద్ధమవుతోంది. 2021 జనవరి నెల నుంచి ఈ ప్రక్రియను ప్రారంభించేందు కు ఏర్పాట్లు చేస్తోంది. రైతుల భూములకు చెందిన రికార్డుల సమస్యలను గుర్తించిన సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి భూ సమగ్రసర్వే చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న 12లక్షల60వేల377ఎకరాల 20 సెంట్ల భూమిని అధికారులు సర్వే చేయనున్నారు. దీనివల్ల భూముల వివరాలు పక్కాగా నమోదవుతాయని, ఎలాంటి వివాదాలకు తావుండదని, వివాదాల్లో ఉన్న భూములకు పరిష్కారం దొరుకుతుందని రైతులు అభిప్రాయపడుతున్నారు. సమస్యలకు చెక్... గతంలో పట్టాదారు పాస్ పుస్తకం ఒకరిపేరు మీద ఉంటే రెవెన్యూ రికార్డుల్లో ఇంకొకరి పేరుతో ఆ భూమి ఉండేది. ఫలితంగా సంక్షేమపథకాలు సంబంధిత రైతులకు అందడంలేదు. మరోవైపు తల్లిదండ్రులు మృతిచెందితే... వారిపేరు మీద ఉన్న భూములు వారసుల పేరుకు మార్చేందుకు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షణలు చేయాల్సి వస్తోంది. ఈ సమస్యలన్నింటికీ సమగ్ర సర్వే ఒక్కటే మార్గమని సీఎం భావిస్తున్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం– కంటిన్యూస్ ఆపరేటింగ్ రిఫరింగ్ స్టేషన్ నెట్వర్క్ సాయంతో సమగ్ర భూసర్వేకు సన్నద్ధమవుతున్నారు. గ్రామాల్లో రైతులకు ఉన్న భూములను గుర్తించి ఆధార్ కార్డుల ఆధారంగా వారి వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తారు. చిన్నచిన్న కమతాల నుంచి భూస్వాముల వరకూ ప్రతీది నమోదు చేస్తారు. జనవరి నుంచి ఈ పునఃసర్వే జరగనుంది. తొలుత మెట్ట ప్రాంతాలను తీసుకోగా, అనంతరం పల్లపు భూములను కొలతలు వేసి ప్యూరిఫికేషన్ చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు సర్వేయర్లతో పాటు ఇతర అధికారులకు శిక్షణ ఇస్తోంది. క్షేత్రస్థాయి నుంచి సర్వే... ముందుగా తహసీల్దార్ కార్యాలయాల్లోని రికార్డులను రెవెన్యూ అధికారులు పరిశీలిస్తారు. అక్కడి నుంచి రికార్డులు గ్రామస్థాయిలోకి వెళ్తా యి. రైతులకు ఉన్న వాస్తవ భూమిని పరిశీలించి సరి చేస్తారు. చిన్నచిన్న సమస్యలు ఉన్నచోట వెంటనే పరిష్కరిస్తారు. పెద్ద, పెద్ద సమస్యలను తహసీల్దార్ సమక్షంలో పరిష్కరిస్తారు. క్షేత్రస్థాయి నుంచి ఈ కార్యక్రమం జరగనుంది. కోర్టులో కేసులు ఉన్నవాటి వివరాలను ప్రస్తుతానికి పెండింగ్లో ఉంచుతారు. మిగిలిన భూము ల వివరాలు మొత్తం ఆన్లైన్ కానున్నాయి. వీటితో పాటు ఇంటిపట్టాల వివరాలు, పొజిషిన్ సర్టిఫికెట్లు, ప్రభుత్వం ఇవ్వనున్న ఇళ్ల స్థలాలు పట్టాలు కూడా ఆన్లైన్ కానున్నాయి. సమగ్ర సర్వే నిర్వహిస్తాం.. భూ సమగ్ర సర్వేకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే సర్వేయర్లకు, అధికారులకు శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. 2021 జనవరి నుంచి ఈ సర్వే ప్రారంభం కానుంది. ఏళ్ల తరబడి ఉన్న భూ సమస్యలకు పరిష్కారం లభించనుంది. సమగ్ర సర్వే వల్ల భూముల వివరాలు క్రమబద్ధీకరణ జరుగుతుంది. దీనికి రైతులు పూర్తిస్థాయిలో సహకరించాలి. – పీవీఎన్ కుమార్, జిల్లా సర్వే అసిస్టెంట్ డైరెక్టర్, విజయనగరం -
కమతంపై పోలీసు పెత్తనం
అది 20వ శతాబ్దం... 1941 జూన్ 17, సూర్యాపేట – జనగామ రోడ్డు. మాసిన షేర్వానీ, చిరిగిన అడ్డ పంచ నడుముకు చుట్టి ఓ బక్కపలచని ఫకీరు నడుచుకుంటూ వెళ్తున్నాడు. కండలు తిరిగిన గూండా ఒకడు కొడవలితో ఫకీరు మెడ మీద వేటు వేశాడు. ఇంకోడు కత్తితో పొడిచాడు. చనిపోయిన ఆ ఫకీరు షేక్ బందగి అయితే... చంపిన వారు విస్నూర్ దేశముఖ్ గూండాలు. షేక్ బందగికి వారసత్వంగా వచ్చిన పట్టా భూమిని విస్నూరు దేశముఖ్ బంటు దౌర్జన్యంగా మలుపు కున్నాడు. బందగీ అడ్డం తిరుగుతాడు. తగాదా తుదకు కోర్టుకెక్కింది. కార్వాయి నడిచి నడిచి బందగి వైపే ఫైసలా అయింది. బక్క రైతుకు భూమి దక్కటాన్ని జీర్ణించుకోలేని దేశముఖ్ బందగీని హత్య చేయించాడు. పారిన ఫకీరు నెత్తురు తెలంగాణ సాయుధ పోరాటానికి , ఇక్కడి భూ పోరాటాలకు జీవధార అయింది. 21వ శతాబ్దం.. 60 ఏళ్ల కల సాకారమైంది. తెలంగాణ జననేత కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. ప్రజలు అడగకుండానే కమ్యూనిస్టులను మించిన ఎజెండాను రూపొందించి అమలు చేశారు. 70 ఏళ్లుగా లొసుగులతో సాగిన భూ రికార్డులను ప్రక్షాళన చేశారు. ఎవరి హద్దులు వాళ్లకు చూపించి బీద, బిక్కీ, బడుగు, బక్క రైతుల భూములకు ఎవరికి వారివి పక్కాగా పట్టా చేసి ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.55 కోట్ల వ్యవసాయ భూమి ఉండగా వివాదరహితంగా ఉన్న 2.38 కోట్ల ఎకరాల భూమికి పక్కాగా పాసుబుక్కులు తయారు చేసి ఇచ్చారు. మిషన్ కాకతీయ పథకం కింద చెరువులను పునరుద్ధరణ చేశారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, కాళేశ్వరం, సీతారామ సాగర్ ఒక్కొక్క ప్రాజెక్టును పూర్తి చేసుకుంటూ కృష్ణా, గోదావరి జలాలను కాలువలకు మళ్లించి చెరువులను నింపారు. ఆర్థికంగా చితికిపోయిన అన్నదాతలకు చేయూతనిచ్చి సాగును గాడిలో పెట్టేందుకు ‘రైతుబంధు’ పథకాన్ని అమలు చేశారు. దీంతో చిగురించిన చెట్టు మీదికి పిట్టలు వచ్చి వాలినట్లుగా వలసపోయిన జనాలు తిరిగి సొంతూళ్లకు చేరుకున్నారు. కొత్త ఆశలతో సాగుకు సిద్ధమయ్యారు. కమతం మీదికి సాగుకు వచ్చిన సన్న, చిన్నకారు రైతులకు అక్కడక్కడ మళ్లీ బందగీ అనుభవాలే ఎదురవుతున్నాయి. బడా పెట్టుబడిదారుల వైపు నిలబడిన పోలీసులు, లేని సమస్యలను ఉత్పన్నం చేసి నాలుగు రాళ్లు వెనకేసుకోవడానికి మొగ్గు చూపిస్తున్నారు. వందలాది ఎకరాలను కొనుగోలు చేసి భూముల చుట్టూ పెన్సింగ్ వేసి ఏక ఖండిక కమతాలుగా మార్చుకున్న పెట్టుబడిదారులు మధ్యలో ఉన్న వలస కూలీలకు చెందిన ఎకరం, అర ఎకరం భూములను అక్రమంగా కలిపేసుకున్నారు. సొంత భూములలో సాగు చేసుకునేందుకు తిరిగి వచ్చిన వలస కూలీలు లబోదిబోమంటూ రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగి పట్టా దారి హక్కు పుస్తకాలు సంపాదించుకుని వస్తే పోలీసులు లాఠీలు పట్టుకొని గెట్టుకు అడ్డంగా, కబ్జాదారులకు అండగ నిలబడుతున్నారు. కబ్జా మీద ఎవరు ఉంటే వారిదే భూమి అనే చట్టవిరుద్ధ నిబంధనలను అమలు చేస్తున్నారు. పట్టాదారుల మీద ఆక్రమణ కేసులు బనాయిస్తున్నారు. హైదరాబాద్ సమీపంలో ఉన్న మహబూబ్ నగర్, మెదక్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలతో పాటుగా కరీంనగర్, వరంగల్ జిల్లాలో ఈ సమస్యలు విపరీతంగా ఉత్పన్నమవుతున్నాయి. బాధితుల అభ్యర్థన మేరకు నా నియోజకవర్గం పరిధిలోకి వచ్చే ఓ పోలీస్ ఇన్స్పెక్టర్ను సంప్రదిస్తే ‘రెవెన్యూ రికార్డులతో నాకు ఎలాంటి సంబంధం లేదు. ప్రస్తుతానికి భూమి ఎవరి అధీనములో ఉందో వారే హక్కుదారులు. భూమి మీదికి వెళ్ళినవారు ఆక్రమణదారులు. అటువంటి వారిపై అక్రమ కేసులు పెడతాం’ అన్నారు. డీజీపీ ఆదేశాలమేరకే నడుచుకుంటున్నామని మరో సమాధానం చెప్పాడు. ఆయన చెప్పిన సమాధానంతో అవాక్కయ్యాను. పట్టా రైతుకు అన్యాయం జరుగొద్దనే ఆకాంక్షతో ముఖ్యమంత్రి కేసీఆర్ రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు తమ తీరు మార్చుకోకపోతే గతంలోలాగే మళ్లీ ప్రజల్లో అశాంతి రగిలే అవకాశం ఉంది. సోలిపేట రామలింగారెడ్డి వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్, అంచనాలు పద్దుల కమిటీ చైర్మన్, మొబైల్ 9440380141 -
రీసర్వేతో భూవివాదాలకు చరమగీతం
సాక్షి, అమరావతి: భూవివాదాలకు ఏమాత్రం ఆస్కారంలేని విధంగా రెవెన్యూ సంస్కరణల అమలు దిశగా సర్కారు చర్యలు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా పూర్తిస్థాయిలో భూ రికార్డుల ప్రక్షాళన (స్వచ్ఛీకరణ)కు శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ప్రతి రెవెన్యూ గ్రామానికి ముగ్గురితో బృందాలను నియమించింది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత దోషరహిత రికార్డుల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర రీసర్వేని చేపట్టనుంది. 120 ఏళ్ల క్రితం బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో దేశవ్యాప్తంగా భూములను సర్వే చేసి రీసర్వే రిజిష్టర్ (ఆర్ఎస్ఆర్) తయారు చేశారు. నేటికీ ఇదే ప్రామాణికంగా ఉంది. ప్రతి 30 ఏళ్లకు రీసర్వే చేయాల్సి ఉన్నప్పటికీ గత పాలకులు పట్టించుకోలేదు. లెక్కలేనన్ని మార్పులు చేర్పులు తరాలు మారడం, కుటుంబాలు విడిపోవడం తదితర కారణాలతో భూములు చేతులు మారడంవల్ల గత 120 ఏళ్లలో భూముల పరంగా చెప్పలేనన్ని మార్పులు జరిగాయి. ప్రభుత్వ భూములకు దరఖాస్తు పట్టాలు (డీకేటీలు) ఇవ్వడంవల్ల సబ్డివిజన్లు/ సర్వేనంబర్లు పెరిగిపోయాయి. భూమి హద్దుల విషయంలోనూ వివాదాలు పెరిగాయి. చాలాచోట్ల ప్రభుత్వ భూములు ఆక్రమణలపాలయ్యాయి. వాస్తవంగా ఉన్న భూమికీ, రెవెన్యూ రికార్డుల్లో ఉన్న దానికీ మధ్య లక్షల ఎకరాల తేడా ఏర్పడింది. భూరికార్డులు సక్రమంగా లేనందున సివిల్ కేసుల్లో భూ వివాదాలకు సంబంధించినవే 60 శాతంపైగా ఉన్నాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు. రికార్డుల స్వచ్ఛీకరణ, భూముల రీసర్వే, శాశ్వత భూ హక్కుల కల్పనే ఇలాంటి సమస్యలకు ఏకైక పరిష్కార మార్గమని నిపుణులు చెప్పడంతో జగన్ సర్కారు ఈ చర్యలకు సాహసోపోత నిర్ణయాలు తీసుకుంది. జగ్గయ్యపేటలో బేస్ స్టేషన్, రీసర్వే 18న ప్రారంభం రాష్ట్ర వ్యాప్తంగా భూములను సమగ్ర రీసర్వే చేయాలని నిర్ణయించిన జగన్ సర్కారు కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలో పైలట్ ప్రాజెక్టుకు ఈనెల 18న (మంగళవారం) శ్రీకారం చుట్టనుంది. ఆరోజు ఉదయం 11 గంటలకు జగ్గయ్యపేటలో బేస్ స్టేషన్ను ప్రారంభించి తక్కెళ్లపాడులో రీసర్వే పైలట్ ప్రాజెక్టును ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రారంభిస్తారు. తదుపరి మండలంలోని 25 గ్రామాల్లోగల 66,761 ఎకరాల భూముల్లో రీసర్వే పూర్తి చేస్తారు. ఇక్కడ వచ్చే అనుభవాలతో అవసరమైన మార్పులతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం త్వరితగతిన ప్రక్రియను చేపట్టనుంది. రైతులపై నయాపైసా భారం లేదు: ఉప ముఖ్యమంత్రి బోస్ ప్రస్తుతం ఎవరైనా రైతు తన భూమిని సర్వే చేయించుకోవాలంటే మీసేవలో రుసుం చెల్లించాలి. అయితే భూముల సమగ్ర రీసర్వే ప్రాజెక్టుకు రూ.2000 కోట్ల వ్యయం అవుతున్నా రైతులపై నయాపైసా కూడా భారం మోపకుండా మొత్తం ప్రభుత్వమే భరించాలని సీఎం జగన్ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు. అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా దేశాల్లో వినియోగించిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో సమగ్ర రీ సర్వేకు వినియోగిస్తున్నట్టు బోస్ ‘సాక్షి’కి తెలిపారు. 2022 మార్చి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా సర్వే పూర్తి చేసి పటిష్టమైన నూతన రెవెన్యూ రికార్డులు రూపొందిస్తామన్నారు. -
ఇక ఆటోమ్యుటేషన్
సాక్షి, అమరావతి: భూయాజమాన్య హక్కుల మార్పిడి (మ్యుటేషన్) విషయంలో అవినీతిరహిత, పారదర్శక, సులభతర, సత్వర సేవల దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. రిజిస్ట్రేషన్ దస్తావేజుల తయారీలో అవినీతి, దళారుల ప్రమేయం లేకుండా ఎవరి దస్తావేజులు వారే రాసుకునే పబ్లిక్ డేటా ఎంట్రీ (పీడీఈ) విధానాన్ని ఇటీవల అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం తాజాగా ఆటోమ్యుటేషన్ ప్రక్రియకు మంగళవారం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆటోమ్యుటేషన్ సేవల పోస్టర్ను మంగళవారం సచివాలయంలో విడుదల చేశారు. ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రస్తుతం భూములను కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నవారు రెవెన్యూ రికార్డుల్లో వారి పేర్ల నమోదు (మ్యుటేషన్) కోసం మీసేవ కేంద్రాలకు వెళ్లి.. నిర్ధిష్ట రుసుం చెల్లించి.. పత్రాలన్నీ స్కాన్ చేసి సమర్పించాల్సి వస్తోంది. తర్వాత మళ్లీ తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరగడమే కాకుండా.. అక్కడి సిబ్బందికి ఎంతో కొంత సమర్పించుకోవాల్సి వస్తోంది. ఎటువంటి ఫీజు చెల్లించకుండానే.. ఇకపై రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే ఆ భూములను కొనుగోలుదారుల పేరుతో తాత్కాలికంగా నమోదు చేసేలా రిజిస్ట్రేషన్ అధికారులకు వీలు కల్పిస్తూ ‘ఆంధ్రప్రదేశ్ భూమి హక్కులు, పట్టాదార్ పాస్బుక్ చట్టం – 1971’ను ప్రభుత్వం సవరించింది. ఇక నుంచి భూములు రిజిస్ట్రేషన్ చేసుకున్నవారు ఆన్లైన్లోనూ, రెవెన్యూ రికార్డుల్లోనూ వారి పేర్ల నమోదు (మ్యుటేషన్) కోసం ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన పనిలేదు. దరఖాస్తు కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు. అధికారులే రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే మీభూమి పోర్టల్ (ఆర్ఓఆర్, 1బి, అడంగల్)లో తాత్కాలిక ప్రాతిపదికన నమోదు చేస్తారు. తదుపరి ఆ లావాదేవీపై అభ్యంతరాల స్వీకరణకు రెవెన్యూ అధికారులు 15 రోజులు గడువు ఇస్తారు. తర్వాత తహసీల్దార్ కార్యాలయ అధికారులు చట్టబద్ధమైన ప్రక్రియను పూర్తి చేసి నెల రోజుల్లో శాశ్వత మ్యుటేషన్ ప్రక్రియ పూర్తి చేస్తారు. ఈ భూమార్పిడి వివరాలను meebhoomi. ap. gov. in లో చూసుకునే సదుపాయాన్ని కల్పించారు. ప్రయోగాత్మకంగా మొదట కృష్ణా జిల్లా కంకిపాడులో.. ఆటోమ్యుటేషన్ను మొదట కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలో ప్రభుత్వం ప్రయోగాత్మకంగా అమలు చేసింది. ఇప్పుడు దీన్ని రాష్ట్రమంతా అమల్లోకి తెచ్చింది. నూతన విధానం ప్రకారం.. భూబదలాయింపు ప్రక్రియ ప్రతి దశలో పట్టాదారు మొబైల్కు సంక్షిప్త సమాచారం వస్తుంది. రిజిస్ట్రేషన్ జరిగిన 30 రోజుల్లో తహసీల్దార్ ధ్రువీకరించి రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేస్తారు. తర్వాత ఎలక్ట్రానిక్ పట్టాదారు పాస్ పుస్తకాన్ని మీభూమి వెబ్సైట్ నుంచి ప్రజలు నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. – శ్రీధర్, రాష్ట్ర భూపరిపాలన సంయుక్త కమిషనర్ -
అక్కడ కుక్కలు, గుర్రాల పేరుతో భూములు!
పణజి: బిహార్లో రెవెన్యూ రికార్డులు సరిగా లేదని గోవా గవర్నర్ సత్యపాల్ మాలిక్ వాఖ్యానించారు. మంగళవారం 70వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని గోవా విశ్వవిద్యాలయం మైదాన ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. జమీందారీ నిర్మూలన చట్టం అమలు బిహార్లో సమర్థవంతంగా జరగలేదని పేర్కొన్నారు. మాలిక్ 2017-18 మధ్య కాలంలో బిహార్ గవర్నర్గా సేవలందించారు. బిహార్లో కుక్కలు, గుర్రాలు, కర్రల పేరుతో కూడా సొంత భూములు ఉన్నాయని తెలిపారు. జమీందారీ నిర్మూలన చట్టం ఉత్తరప్రదేశ్లో మాత్రమే సమర్థవంతంగా అమలులో ఉందని పేర్కొన్నారు. తాను బిహార్ గవర్నర్గా పనిచేసిన కాలంలో.. రెవెన్యూ రికార్డులు సరిగా లేవని, అక్కడ కుక్కలు, గుర్రాలు, కర్రల పేరిట భూమి నమోదు చేయడాన్ని చూసి షాక్కు లోనయ్యానని చెప్పారు. జమీందారీ చట్టంలోని లోపాల వల్లే.. ఇప్పుడు అక్కడ కొంతమంది భూస్వాముల పేరిట 4,000-5,000 వరకు భిగా భూములు ఉన్నాయని వెల్లడించారు. జమీందారీ నిర్మూలన చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేసిన యూపీ మాజీ ముఖ్యమంత్రి చౌదరి చరణ్ సింగ్ను ఈ సందర్భంగా మాలిక్ కొనియాడారు. బిహార్ నుంచి జమ్మూకశ్మీర్కు గవర్నర్గా వెళ్లిన సత్యపాల్ మాలిక్.. ఇటీవల ఆర్టికల్ 370 రద్దు తరువాత ఈ నెలలో (నవంబర్) గోవాకు బదిలీ అయ్యారు. -
నువ్వెప్పుడో చచ్చావ్..పో..పో!
ఆమెను బతికుండగానే చంపేశారు. రెవెన్యూ రికార్డుల్లోనూ ఆమె ఇప్పటికే మృతి చెందినట్లు చూపిస్తున్నారు. చనిపోయావనే సాకుతో రెండేళ్లుగా ఆమెకు రేషన్ కూడా ఇవ్వడం లేదు. తాను బతికే ఉన్నానని, న్యాయం చేయాలని కాళ్లరిగేలా అధికారులు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. సాక్షి, చిత్తూరు (గుర్రంకొండ): స్థానిక ఇందిరమ్మ కాలనీలో కె. పురుషోత్తం(33), కె. లక్ష్మీదేవి(23) దంపతులు నివాసముంటున్నారు. వీరికి కుమారుడు ఉన్నాడు. పశుపోషణపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. రెండేళ్ల క్రితం గ్రామంలో నిర్వహించిన పల్స్సర్వేలో లక్ష్మీదేవి పేరు తొలగించారు. దీంతో రేషన్ దుకాణంలో ఆమెకు రేషన్ను నిలిపివేశారు. దీంతో బాధితురాలు లబోదిబోమంటూ తహసీల్దార్ కార్యాలయానికి పరుగులు తీసింది. తమ రికార్డుల్లో మృతి చెందినట్లు నమోదై ఉందని రెవెన్యూ అధికారులు చెప్పడంతో హతాశురాలైంది. తాను బతికే ఉన్నానని, తమ కుటుంబానికి రేషన్ ఇచ్చి ఆదుకోవాలంటూ బాధితురాలు రెండేళ్ల క్రితం అర్జీ ఇచ్చింది. నాటి నుంచి ఇప్పటివరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఎన్నోసార్లు అర్జీలు ఇచ్చినా ఆమె గోడు అరణ్యరోదనే అయ్యింది. రికార్డుల్లో తప్పిదాన్ని సరిచేయకపోవడంతో రేషన్ అందక ఆమెకు జీవనానికి శాపమైంది. అంతేకాదు; ప్రభుత్వ పథకాల లబ్ధి కూడా ఆమెకు అందని పరిస్థితి. ఉన్నతాధికారులైనా స్పందించి న్యాయం చేయాలని బాధితురాలు కోరుతోంది. -
మాట వినకపోతే.. శాల్తీ గల్లంతే..!
సాక్షి, ఒంగోలు : మేం చెప్పినట్లు చేయాల్సిందే.. మాట వినకపోతే శాల్తీ గల్లంతే.. రెవెన్యూ రికార్డులు మా పేర్ల మీద మార్చండి.. లేదంటే మీ అంతు చూస్తాం.. అంటూ మండల మెజిస్ట్రేట్పై కబ్జాదారులు బెదిరింపులకు దిగారు.. ఈ విధంగా బెదిరింపులకు పాల్పడింది అధికార పార్టీ నేతలో, వారి అనుయాయులో కాదు.. గత ఐదేళ్లలో ప్రభుత్వ భూములను ఆక్రమించి బ్యాంకుల్లో కోట్ల రూపాయల లోన్లు తీసుకుని అధికారిక దందా నడిపిన టీడీపీ నేతలు. అధికారం కోల్పోయినా వీరి తీరు మాత్రం మారలేదనడానికి లింగసముద్రం మండలంలో జరిగిన సంఘటనే ప్రత్యక్ష ఉదాహరణ. రెవెన్యూ రికార్డుల స్వచ్ఛీకరణలో భాగంగా ప్రకాశం జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ భూ వివాదాలు అధికంగా ఉన్న లింగసముద్రం మండలాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకుని 40 రెవెన్యూ బృందాలతో సర్వే మొదలు పెట్టారు. సర్వేలో టీడీపీ నేతల కబ్జా పర్వం బయటపడుతుండటంతో రికార్డులు మార్చాలంటూ తహసీల్దార్పై బెదిరింపులకు దిగారు. వారి హెచ్చరికలతో భయాందోళనకు గురైన తహసీల్దార్ తనను బదిలీ చేయాలంటూ ఆర్డీఓ, కలెక్టర్కు విన్నవించారు. కబ్జాదారులు తనను చంపుతానంటూ బెదిరిస్తున్నారంటూ బహిరంగ సమావేశంలోనే తహసీల్దార్ వాపోయారంటే టీడీపీ నేతలు ఏ స్థాయిలో బెదిరింపులకు పాల్పడ్డారో అర్థం చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే... టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదేళ్లలో టీడీపీ నేతలు ప్రకాశం జిల్లా, లింగసముద్రం మండలంలో పలు గ్రామాల్లో ప్రభుత్వ భూములను ఆక్రమించి అప్పట్లో ఉన్న రెవెన్యూ అధికారుల ద్వారా ఆన్లైన్ చేయించేశారు. అంతటితో ఆగకుండా ఆ భూములను బ్యాంకుల్లో తనఖా పెట్టి కోట్ల రూపాయలు లోన్లు పొందారు. పెదపవని గ్రామంలో టీడీపీ నేతగా వ్యవహరిస్తున్న ఓ మాజీ వీఆర్ఓ ఒక్కడే 17 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని ఆక్రమించారనేది బహిరంగ రహస్యమే. ఐదేళ్లలో సుమారు వెయ్యి ఎకరాల ప్రభుత్వ భూములను బ్యాంకుల్లో తనఖా పెట్టారంటే టీడీపీ నేతలు ఏస్థాయి దందాకు పాల్పడ్డారో అర్థమౌతుంది. ముఖ్యంగా మండలంలోని పెదపవని, తిమ్మారెడ్డిపాలెం, మొగిలిచర్ల, లింగసముద్రం, మాలకొండరాయునిపాలెం గ్రామాల్లో వాగు, కుంట, కాలువ, గయాలు, ఏడబ్ల్యూ, పశువుల మేత పోరంబోకులు, శ్మశానాలను సైతం వదలకుండా కబ్జా చేసేశారు. అప్పట్లో ఈ వ్యవహారం బయటపడినప్పటికీ కొందరిపై మాత్రమే చర్యలు తీసుకుని వదిలేశారు. ప్రభుత్వ భూములను భారీగా ఆక్రమించిన టీడీపీ నేతల జోలికి మాత్రం వెళ్లని పరిస్థితి. దీంతో ఇప్పటికీ ప్రభుత్వ భూములన్నీ కబ్జాదారుల చేతుల్లోనే ఉండిపోయాయి. రెవెన్యూ రికార్డుల స్వచ్ఛీకరణ సర్వేలో భాగంగా కలెక్టర్ పోల భాస్కర్ భూ వివాదాలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలు ఎక్కువగా ఉన్న లింగసముద్రం మండలాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకుని సర్వే మొదలు పెట్టారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి 40 రెవెన్యూ బృందాలను మండలంలో మోహరింపజేయడంతోపాటు కలెక్టర్ స్వయంగా అక్కడకు వెళ్లి సర్వేను పర్యవేక్షిస్తున్నారు. కబ్జా భాగోతాలు బయటకు రావడంతో తహసీల్దార్పై బెదిరింపుల పర్వం: రెవెన్యూ బృందాల పరిశీలనలో గత ఐదేళ్లలో టీడీపీ నేతలు చేసిన భూ ఆక్రమణలు ఒక్కొక్కటిగా బయటపడుతుండటంతో కబ్జాదారుల్లో గుబులు మొదలైంది. జిల్లా కలెక్టర పర్యవేక్షణలో సర్వే జరుగుతుండటంతో ఇక తమను కాపాడేవారు లేరని భావించిన టీడీపీ నేతలు కొందరు రెవెన్యూ రికార్డులు మార్చి తమ పేర్లు చేర్చాలంటూ తహసీల్దార్ రాఘవస్వామిపై బెదిరింపులకు దిగారు. చెప్పినట్లు వినకపోతే శాల్తీ గల్లంతేనంటూ హెచ్చరించారు. దీంతో భయాందోళనకు గురైన తహసీల్దార్ తనకు కబ్జా దారుల నుంచి ప్రాణహాని ఉందని, తనను బదిలీ చేయాలంటూ కందుకూరు ఆర్డీవో ఓబులేసు, కలెక్టర్ పోల భాస్కర్ల వద్ద తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తనను బెదిరించిన వారి పేర్లు చెప్పేందుకు కూడా ఆయన బయపడుతున్న పరిస్థితి. కనీసం పోలీసులకు ఫిర్యాదు కూడా చేయలేదంటే టీడీపీ నేతలు తహసీల్దార్ను ఏస్థాయిలో బెదిరించారో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు సీరియస్గా తీసుకుని భూ ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకుని జిల్లాలో మరో ఘటన జరగకుండా అక్రమార్కులకు హెచ్చరిక పంపాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు డిమాండ్ చేస్తున్నారు. -
రెవెన్యూ రికార్డులు మాయం!
సాక్షి, కేశంపేట: తహసీల్దార్ కార్యాలయంలో ఎంతో భద్రంగా ఉండాల్సిన రెవెన్యూ రికార్డులు మాయమయ్యాయి. భూములకు సంబంధించిన ఫైళ్లు కనిపించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల అవినీతి కార్యకలాపాలతో వార్తల్లోకెక్కిన కేశంపేట తహసీల్దార్ కార్యాలయంలో ప్రస్తుతం కీలకమైన రికార్డులకు రెక్కలు రావడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఉద్దేశపూర్వకంగా ఫైళ్లను ఎక్కడికైనా తరలించారా? లేక నామరూపాలు లేకుండా చేశారా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అదే జరిగితే దీని వెనుక ఉన్నదెవరు.. నడిపిస్తున్నవారెవరు? పైగా రికార్డులను మాయం చేయాల్సిన అవసరం ఏముంది? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దీనికితోడు అధికారులు సైతం నోరు మెదపకపోవడం మరిన్ని సందేహాలను రేకెత్తిస్తోంది. మా రికార్డులు ఇవ్వండి మహాప్రభో అంటూ కార్యాలయం చుట్టూ అన్నదాతలు నిత్యం తిరుగుతున్నా అధికారుల్లో స్పందన లేదు. మూడేళ్ల రికార్డులు ఎక్కడ.. భూమి కొనుగోలు చేస్తే ఆ భూమికి సంబంధించి పట్టా మార్పిడి చేయాల్సి ఉంటుంది. సదరు భూమి రైతుకు ఎలా దక్కిందో తెలిపే పహాణీలు అవసరం. అదేవిధంగా వారసత్వంగా వచ్చిన భూమిని విరాసత్ చేసుకున్న వాటికి సంబంధించిన ఫైళ్లు రెవెన్యూ కార్యాలయాల్లో ఉంటాయి. రిజిస్ట్రేషన్ చేసుకున్న భూములను మ్యూటేషన్ చేసుకోవాలంటే ఆ భూమికి చెందిన పత్రాలు రెవెన్యూ కార్యాలయంలో లభ్యమవుతాయి. ఈ కీలకమైన రికార్డులను తహసీల్దార్ కార్యాలయంలో అధికారులు భద్రపరుస్తారు. అయితే అవి కేశంపేట తహసీల్దార్ కార్యాలయంలో కనిపించడం లేదు. 2016 తర్వాత జరిగిన భూ లావాదేవీలకు సంబంధించి విరాసత్, భూ పట్టా మార్పిడి మ్యూటేషన్ తదితర రికార్డుల జాడ తెలియడం లేదు. భూ పత్రాల నకళ్ల కోసం రైతులు కార్యాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. మీరే వెతుక్కోండి.. కేశంపేట మండల పరిధిలోని పాపిరెడ్డిగూడ గ్రామానికి చెందిన ఓ రైతు తనకు 2016లో ఇచ్చిన ప్రొసీడింగ్ జిరాక్స్ కావాలని అధికారులకు రెండు నెలల క్రితం వినతిపత్రం అందజేశాడు. ఇంతవరకు అధికారుల నుంచి జిరాక్స్ కాపీ అందకపోవడంతో వారిని నిలదీశాడు. మూడేళ్ల కాలానికి సంబంధించి రికార్డులు ఈ కార్యాలయంలో అందుబాటులో లేవని అధికారులు సమాధానమిచ్చారు. ‘నీకు ఓపిక ఉంటే.. ఆఫీస్లో నువ్వే వెతుక్కో’ అంటూ ఉచిత సలహా ఇచ్చారు. కాగా, ఈ విషయమై ఇన్చార్జి తహసీల్దార్ ఆంజనేయులు మాట్లాడుతూ.. 2016 సంవత్సరం నుంచి ఫైళ్లు కార్యాలయంలోనే ఉన్నాయి. ఎవరికైనా భూ రికార్డుల నకలు కావాలంటే వారికి అందిస్తాం’ అని చెప్పారు. విసుగు చెందిన రైతులు.. నిలదీస్తే ఫైళ్లు లేవని బాధ్యతారహితంగా అధికారులు పేర్కొంటుండటం గమనార్హం. ఇంటి దొంగలపై అనుమానాలు.. తమ తప్పులు ఎక్కడ వెలుగులోకి వస్తాయోనన్న భయంతో రెవెన్యూ అధికారులే రికార్డులు దాచిపెట్టారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల అవినీతి సొమ్ముతో ఏసీబీకి తహసీల్దార్ లావణ్య పట్టుబడిన తర్వాతే రికార్డులు మాయమవటం అందుకు బలాన్ని చేకూరుస్తోంది. ఆమెకు సహకరించిన ఉద్యోగులే ఈ పని చేసి ఉంటారా అనే చర్చజరుగుతోంది. పైగా 2016లో లావణ్య ఇక్కడ పోస్టింగ్ పొందారు. అంటే తహసీల్దార్గా బాధ్యతలు తీసుకున్నాక జరిగిన లావాదేవీలకు సంబంధించిన రికార్డులు మాత్రమే కార్యాలయంలో లేకపోవడంతో ఇంటి దొంగలపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. రైతుల నుంచి డబ్బులు దండుకుని నిబంధనలకు విరుద్ధంగా ఫైళ్లు కదిలించారన్న ఆరోపణలు ఆమెపై పెద్దఎత్తున వచ్చాయి. ఈ క్రమంలోనే తహసీల్దార్ కార్యాలయంలోని కొన్ని కీలక ఫైళ్లను ఏసీబీ అధికారులు విస్తృతంగా పరిశీలించారు. మళ్లీ ఏసీబీ నుంచి ఎటువంటి ముప్పయినా రావొచ్చన్న భయంతో రెవెన్యూ సిబ్బందే రికార్డులను తరలించి ఉంటారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
ఊళ్లకు ఊళ్లు మాయం !
సాక్షి, హైదరాబాద్ : మనుషులు అదృశ్యం కావడం.. వస్తువులు కనిపించకుండా పోవడం గురించి విన్నాం. అయితే ఇక్కడ ఏకంగా ఊళ్లకు ఊళ్లే మాయమయ్యాయి. అదెలా అని ఆశ్చర్య పోతున్నారా?.. మన రెవెన్యూ అధికారుల నిర్వాకంతో ఇది సాధ్యమైంది. జనాభా లెక్కల సేకరణతో అసలు విషయం వెలుగుచూసింది. 2021 జనగణనకు కేంద్రం రంగం సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో 2011 సెన్సెస్ను పరిగణనలోకి తీసుకున్న అధికారులు ఆ జాబితా ఆధారంగా గ్రామాల వారీగా జనాభా వివరాల సేకరణకు కసరత్తు ప్రారంభించారు. ఇందులో కొన్ని గ్రామాలు కనిపించకుండా పోవడంతో కేంద్ర జనగణన శాఖ అవాక్కయ్యింది. ఏకంగా ఊళ్లు మాయం కావడాన్ని సీరియస్గా పరిగణించింది. 2011 జనాభా లెక్కల అనంతరం ఏర్పడిన 23 జిల్లాలు కలుపుకొని.. మొత్తం 14 జిల్లాల పరిధిలో 460 గ్రామాలు, 2 మున్సిపాలిటీల పేర్లు గల్లంతయ్యాయి. ఈ విషయాన్ని గుర్తించిన కేంద్ర జనగణనశాఖ జాయింట్ డైరెక్టర్ హెలెన్ ప్రేమకుమారి.. సదరు గ్రామాలను డీనోటిఫై చేశారా?.. అలాగే కొత్తగా జాబితాలో 38 పంచాయతీలు చేర్చిన వైనాన్ని ప్రశ్నిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వానికి లేఖాస్త్రం సంధించడం గమనార్హం. ఒకవేళ కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో చేరిస్తే.. ఆ వివరాలు పంపాలని కోరారు. రెవెన్యూ లెక్క తప్పింది ! జిల్లాల పునర్విభజన అంశంతో కొన్ని పల్లెల వివరాలు రెవెన్యూ రికార్డుల నుంచి మాయమయ్యాయి. భౌతికంగా ఆ పల్లెలు యథాస్థానంలో ఉన్నా రికార్డుల నుంచి కనిపించకుండాపోవడం కలకలం సృష్టించడమే కాదు, అధికారుల నిర్లక్ష్యాన్ని తేటతెల్లం చేస్తోంది. 2016లో కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కొత్తగా 23 జిల్లాలను ఏర్పాటు చేస్తూ జీఓ 221 నుంచి 250లను జారీ చేసింది. జీఓల్లో గ్రామాలకు గ్రామాలే గల్లంతయ్యాయి. జిల్లా కేంద్రాలుగా ఏర్పడ్డ 2 మున్సిపాలిటీల పేర్లు కూడా కనిపించకుండా పోయా యి. పోనీ, ఈ విషయాన్ని రెవెన్యూ అధికారులు గుర్తించారా! అంటే అదీ లేదు. 2021 జనాభా లెక్కల సేకరణకు కేంద్రం సిద్ధమవుతున్న తరుణంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆయా జిల్లాల్లోని గ్రామాల జాబితాను పరిశీలిస్తున్న క్రమంలో 58 మండలాల పరిధిలోని 460 గ్రామాలతోపాటు వనపర్తి, గద్వాల మున్సిపాలిటీల సమాచారం కూడా గల్లంతుకావడంతో జనగణన అధికారులు నివ్వెరపోయారు. ఈ విషయాన్ని గత మార్చిలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ ద్వారా తెలియజేసింది. ఈ గ్రామాలున్నాయా? రద్దు చేశా రా? కొత్తగా 38 గ్రామాలను ఏర్పాటు చేశా రు కదా.. వాటికి సంబంధించి ఉత్తర్వు కాపీలను పంపమని సూచించింది. భారత్–2021 జనాభా లెక్కలకు సంబంధించి ఈ ఏడాది చివరి నాటికి గ్రామాల హద్దులను ప్రకటించాల్సి ఉన్నందున తక్షణమే వివరాలను నివేదించాలని కోరింది. కేంద్రం లేఖతో తేరుకున్న రెవెన్యూ శాఖ.. గ్రామాల గల్లంతుపై దృష్టి సారించింది. గత జూన్లో సీఎస్ జిల్లా కలెక్టర్లతో ప్రత్యేకంగా ఈ అంశంపై చర్చించారు. కేంద్రం పంపిన జాబితాలో గల్లంతైనట్లు గుర్తించిన గ్రామాలపై మండలాలవారీగా నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. అయితే, రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 589 తహసీల్దార్లలో కేవలం 167 మంది, 142 మున్సిపాలిటీల్లో 30 మంది మాత్రమే స్పందించారు. -
విసిగిపోయాను..అందుకే ఇలా..
సాక్షి, మహబూబాబాద్ : వారసత్వంగా తనకు వచ్చిన భూమిని వేరే వారికి ధారాదత్తం చేశారనే ఆవేదనతో ఓ సీనియర్ జర్నలిస్టు వినూత్న నిరసన చేపట్టారు. తనకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ తన సొంత భూమిలో భుజాల వరకు మట్టిలో ఉంటూ 72 గంటల పాటు నిరసనకు దిగారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన మారెడ్డి నాగేందర్ రెడ్డి గత 22 ఏళ్లుగా జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో తనకు చెందిన భూమిని కొంతమంది అవినీతి అధికారులు ఏకపక్షంగా రికార్డులు ట్యాంపరింగ్ చేశారని ఆరోపిస్తూ మంగళవారం శాంతియుత దీక్షకు దిగారు. ఈ సందర్భంగా డోర్నకల్ మండలం పెరుమాళ్ల సంకీస గ్రామంలో తమ తాతల నుంచి సంక్రమించిన భూమిని.. తమ ప్రమేయం లేకుండా అధికారులు ఇతరులకు ధారాధత్తం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ...‘ మా నాన్న మారెడ్డి అప్పిరెడ్డి చనిపోయిన తరువాత రెవిన్యూ రికార్డులను పరిశీలిస్తే....2012-13లో అక్రమంగా ఆర్వోఆర్ చేసినట్లు గుర్తించాను. ఏడాదిన్నర నుంచి పోరాటం చేస్తున్నాను. రెవెన్యూ అధికారుల ధన దాహనికి నాతో పాటు వందలాది మంది రైతులు దగా పడ్డారు. రెవెన్యూ రికార్డుల ట్యాంపరింగ్ ను ఆధారాలతో సహా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాను. ఎవరికి వారు ఉచిత సలహాలు ఇచ్చారు తప్ప రికార్డులను మార్చిన అవినీతి అధికారులపై చర్యలు తీసుకోలేదు. అవినీతి అధికారుల వలన రెండు సంవత్సరాల నుంచి రైతుబంధు పథకం ద్వారా లబ్ధిపొందలేకపోయాను. వారు మాత్రం కోట్ల రూపాయలు సంపాదించారు అని వాపోయారు. విసిగిపోయాను అందుకే ఇలా.. ‘నాకు జరిగిన అన్యాయంపై గళం విప్పాను. అయినా చర్యలు శూన్యం. నా 22 సంవత్సరాల మీడియా జీవితంలో ఎందరికో అండగా ఉన్నాను. అవినీతి అధికారుల భరతం పట్టాను. రెవెన్యూ, పోలీసు, రవాణాశాఖ, పంచాయతీరాజ్, విద్యాశాఖలో అధికారులను సస్పెండ్ చేయించాను. అయినా నాకు జరిగిన అన్యాయంపై చర్యలు లేవు. కలెక్టర్ ను కలిశాను. ఆర్డివో కోర్టులో అప్పీల్ చేసుకోమన్నారు. తప్పు రెవెన్యూ వాళ్లది అయితే... నేను ఎందుకు అప్పీల్కు వెళ్లాలి. ఎవరిని అడిగి రికార్డులను మార్చారు అంటే సమాధానం లేదు. ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు రికార్డులను మార్చవచ్చా. ఎకరానికి రూ. 5 నుంచి 10 వేలు తీసుకుని రికార్డులను ఇష్టానుసారంగా మార్చారు. అవినీతికి పాల్పడిన వీఆర్వో రాంబాబు, ఆర్.ఐ లక్ష్మణ్, తహశీల్దారు విజయ్ కుమార్ మీద పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాను. అయినా చర్యలు శూన్యం. వ్యవస్థ మీద విసిగిపోయాను. అందుకే ఇలా శాంతియుత దీక్షకు దిగాను ’ అని మారెడ్డి నాగేందర్రెడ్డి తన గోడు వెళ్లబోసుకున్నారు. రాజకీయాలకు అతీతంగా అందరూ తనకు అండగా నిలవాలని కోరారు. -
త్వరలోనే రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రెవెన్యూ రికార్డులేవి సరిగా లేవు.. వాటి ప్రక్షాళనతో పాటు భూముల రీ-సర్వే కూడా చేపడతామని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు. గురువారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రెవెన్యూ రికార్డుల వ్యవస్థ జీవచ్ఛవం అయిందన్నారు. దానిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. భూముల రీ-సర్వేకు అధికారులను సమాయత్తం చేస్తున్నామన్నారు. రీ-సర్వే చేసే క్రమంలో ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. రీ-సర్వేకు ఎంత ఖర్చయిన ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. పైలెట్ ప్రాజెక్ట్గా రీ-సర్వేను కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నుంచి మొదలు పెడతామని సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు. ‘వ్యవసాయ సాగుదారుల హక్కు చట్టం’ వల్ల భూ యజమానులకు కానీ, కౌలుదార్లకు కానీ ఎలాంటి ఇబ్బందులు కలగవన్నారు సుభాష్ చంద్రబోస్. ఇది యజమానులకు, కౌలుదారులకు మేలు చేకూర్చే చట్టమని తెలిపారు. త్వరలోనే వ్యవసాయ శాఖ సమన్వయంతో ఈ చట్టంపై అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నారు. దేశంలోనే తొలిసారిగా ఏపీలో ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’ తెచ్చామన్నారు. దీన్ని పటిష్టంగా అమలు చేస్తామని తెలిపారు. ఉగాది నాటికి ఇళ్ల స్థలాలు వచ్చే ఉగాది నాటికి 25 లక్షల మందికి నివాస స్థలాలివ్వడం తమ ప్రభుత్వ లక్ష్యమని సుభాష్ చంద్రబోస్ తెలిపారు. పేదల ఇళ్ల కోసం ఎంత స్థలం కావాలో వివరాలు సేకరిస్తున్నామన్నారు. ఇళ్ల స్థలాలకు అవసరమైన భూమని సేకరిస్తాం.. అవసరమైతే కొనుగోలు చేస్తామని ఆయన తెలిపారు. -
శాశ్వత భూహక్కులు
ఎక్కడా ఎవరూ సవాల్ చేయడానికి వీలులేని విధంగా నిజమైన యజమానులకు శాశ్వత భూ హక్కులు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక, సాహసోపేత నిర్ణయం తీసుకుంది. భూమి హక్కుల రిజిస్టర్లో ఎవరి పేరు ఉంటుందో వారికి ఆ భూమిపై ఎవరూ ప్రశ్నించడానికి వీలులేని రీతిలో శాశ్వత హక్కులు లభిస్తాయి. ఇందుకోసం రెవెన్యూ శాఖ పకడ్బందీగా భూమి హక్కుల (ల్యాండ్ టైటిల్) రిజిస్టర్ నిర్వహిస్తుంది. క్రయ విక్రయ లావాదేవీలు జరిగితే ల్యాండ్ టైటిల్ రిజిస్టార్ నిరంతరం (రియల్ టైమ్) హక్కుల పుస్తకంలో మార్పులు చేస్తారు. ఈ రిజిస్టర్లో పేరుండి ప్రభుత్వ తప్పిదంవల్ల ఎవరికైనా నష్టం జరిగితే బాధితునికి ప్రభుత్వమే నష్టపరిహారం చెల్లిస్తుంది. దేశంలో ఎక్కడాలేని విధంగా రైతులకు శాశ్వత భూ హక్కులు కల్పించడమే లక్ష్యంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కారు కొత్త చట్టానికి అంకురార్పణ చేస్తోంది. సాక్షి, అమరావతి: భూ యజమానులకు ఊహాజనిత హక్కుల స్థానే శాశ్వత హక్కుల కల్పన దిశగా సర్కారు పకడ్బందీ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైట్లింగ్ (శాశ్వత భూ హక్కుల) యాక్టు– 2019 బిల్లు సిద్ధం చేసింది. సోమవారం అసెంబ్లీలో దీనిని ప్రవేశపెట్టి ఆమోదించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుత చట్టం ప్రకారం భూ యజమానులకు శాశ్వత హక్కులు లేవు. ఎవరి భూమినైనా తమదేనంటూ ఎవరైనా కోర్టులో వేసి వివాదం చేయవచ్చు. తనదికాని భూమిని వేరొకరికి అమ్మినా రిజిస్ట్రేషన్ చేస్తున్న సంఘటనలు కోకొల్లలు. అందుకే ప్రస్తుతం అమల్లో ఉన్న భూ హక్కులు ఊహాజనితమైనవే. వీటికి చట్టబద్ధతలేదు. ఒక వ్యక్తికి చెందిన భూమి తనదేనంటూ మరొకరు కోర్టులో సవాల్ చేస్తే అది తన భూమేనని భూ యజమాని నిరూపించుకోవాలేగానీ ప్రభుత్వం కలుగజేసుకోదు. ఈ పరిస్థితి వల్లే కోర్టుల్లో ఉన్న సివిల్ వివాదాల్లో 60 శాతం భూ వివాదాలకు సంబంధించినవే ఉన్నాయి. కొత్త చట్టం అమల్లోకి వస్తే ఇలా ఉండదు. ప్రతి గ్రామంలో ప్రతి సర్వే నంబరులో ఎంత భూమి ఎవరెవరి పేరుతో ఉందో రికార్డులు పక్కాగా నిర్వహిస్తారు. ఈ రికార్డును ఎవరూ సవాల్ చేయడానికి వీలుండదు. ఒకవేళ ప్రభుత్వ రికార్డులను నమ్ముకుని ఎవరైనా భూమిని కొనుగోలు చేసి నష్టపోతే బాధితునికి సర్కారు నష్ట పరిహారం చెల్లిస్తుంది. ఇంత పటిష్టమైన శాశ్వత భూ హక్కులు ప్రస్తుతం దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేవని రెవెన్యూ ఉన్నతాధికారులు చెబుతున్నారు. వివాద రహితం చేయడానికే.. భూ వివాదాలతో కోర్టుల చుట్టూ తిరగాల్సి రావడం వల్ల రైతులు ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా విలువైన కాలాన్ని వృథా చేసుకుంటున్నారు. ఈ వివాదాలు గొడవలకు, హత్యలకు కూడా దారితీస్తున్నాయి. ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర చేసినప్పుడు అనేక సమస్యలపై పెద్ద సంఖ్యలో ప్రజలు వినతి పత్రాలు ఇచ్చారు. ఇందులో 60 శాతంపైగా భూవివాదాలకు సంబంధించినవే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ సమస్యల పరిష్కారానికి ఏమి చేయాలనే అంశంపై ఆయన విపక్ష నేతగా ఉన్నప్పుడే రెవెన్యూ, న్యాయరంగాల నిపుణులతో చర్చించారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత మరింత సమగ్రంగా చర్చించి శాశ్వత పరిష్కారం కోసం ల్యాండ్ టైట్లింగ్ యాక్టు తేవాలని నిర్ణయించారు. రియల్టైమ్ మ్యుటేషన్ భూములను ఎవరు కొన్నా, అమ్మినా తక్షణమే రియల్ టైమ్లో రెవెన్యూ రికార్డుల్లో మ్యుటేషన్ చేస్తారు. రెవెన్యూ, రిజిస్ట్రేషన్, ల్యాండ్ సర్వే, సెటిల్మెంట్ విభాగాలన్నీ సమన్వయంతో ల్యాండ్ అథారిటీ కింద పనిచేస్తాయి. దీంతో ఎక్కడ ఎలాంటి లావాదేవీ జరిగినా భూ శాశ్వత హక్కుల రిజిష్టర్లో నమోదవుతుంది. ఇందులో ఉన్న భూములను యజమాని నుంచి ఎవరు కొన్నా నష్టపోవడానికి ఆస్కారం ఉండదు. ఈ రిజిష్టర్లోని రికార్డులు అన్నీ కచ్చితమైనవని ప్రభుత్వమే వాదిస్తుంది. ఎవరైనా వీటి ఆధారంగా భూములు కొని నష్టపోతే ప్రభుత్వమే నష్టపరిహారం చెల్లిస్తుంది. ఇందుకు బాధ్యుల నుంచి సొమ్ము వసూలు చేయాలని కూడా చట్టంలో ఉంది. దీనివల్ల ఎవరూ రెవెన్యూ రికార్డుల్లో తప్పులు చేయడానికి సాహసించరనే ఉద్దేశంతోనే ఇలాంటి కఠిన నిబంధన పెట్టారు. అమలు ఇలా.. కొత్త చట్టం వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో రెవెన్యూ రికార్డులను సవరిస్తారు. ఇందుకోసం ప్రతి గ్రామంలో సర్వే నంబర్ల వారీగా భూములకు సంబంధించి భూ యాజమాన్య రికార్డు (1బి రిజిష్టర్), రీ సర్వే రిజిష్టర్ (ఆర్ఎస్ఆర్), భూ అనుభవ రిజిష్టర్ (అడంగల్) వివరాలను బహిరంగంగా ప్రకటిస్తారు. దీనిపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయడానికి నెల రోజులు సమయం ఇస్తారు. ముఖ్య కార్యదర్శి హోదాకు తగ్గని అధికారి నేతృత్వంలో రాష్ట్ర స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ అథారిటీ ఏర్పాటు చేస్తారు. ఈ అధికారి కింద ల్యాండ్ టైట్లింగ్ అధికారులను నియమిస్తారు. భూమి హక్కులను రిజిష్టర్ చేసే బాధ్యత ల్యాండ్ టైట్లింగ్ అధికారిదే. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత నెల రోజుల్లో ఫిర్యాదులు రాని భూముల వివరాలను జిల్లా, మండలం, గ్రామం, సర్వే నంబర్ల వారీగా రిజిస్టర్ చేస్తారు. సర్వే నంబర్ల వారీగా ఎవరెవరికి ఎంత భూమి ఉందో నిర్ధారణ అవుతుంది. ఇది తాత్కాలిక టైట్లింగ్ రిజిష్టర్గా ఉంటుంది. ఈ జాబితాతో తుది నోటిఫికేషన్ జారీ చేసి అభ్యంతరాలు కోరతారు. రెండేళ్లలో ఏమీ అభ్యంతరాలు లేకపోతే ఆయా భూముల యజమానులను శాశ్వత హక్కుదారులుగా గుర్తించి రిజిష్టర్ నమోదు చేస్తారు. వీరికి ఆ భూములపై శాశ్వత హక్కులు కల్పిస్తారు. వీటిపై తర్వాత ఎవరికీ ఎక్కడా సవాల్ చేయడానికి హక్కు ఉండదు. ప్రతి మనిషికీ ఆధార్ కార్డు ఉన్నట్లే.. ప్రతి స్థలానికీ ఒక భూధార్ నంబర్ను కేటాయిస్తారు. అభ్యంతరాలు వచ్చిన భూములకు వివాద రిజిష్టర్.. ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేసిన సందర్భంగా రెండేళ్లలో అభ్యంతరాలు వచ్చిన భూములన్నింటినీ సర్వే నంబర్ల వారీగా అనుభవదారుల పేర్లు రాసి వివాద రిజిష్టర్లో నమోదు చేస్తారు. వివాద రిజిష్టర్లోని భూమిపై హక్కులు తమవేనని భావించే వారు జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్ నేతృత్వంలోని ట్రిబ్యునల్లో కేసు వేయాలి. ట్రిబ్యునల్ తీర్పుపై ఎవరూ సవాల్ చేయకపోతే ఆ భూములన్నీ శాశ్వత టైట్లింగ్ రిజిష్టర్లో నమోదు చేస్తారు. ఒకవేళ ఎవరైనా సవాల్ చేయాలంటే నెల రోజుల్లోగా న్యాయమూర్తి నేతృత్వంలోని స్టేట్ లెవల్ అప్పిలేట్ ట్రిబ్యునల్కు అప్పీల్కు వెళ్లవచ్చు. భూములకు సంబంధించి ఎలాంటి వివాదాలున్నా ఈ రెండు ట్రిబ్యునళ్లకే వెళ్లాలి. కోర్టుకు వెళ్లడానికి వీలులేదు. ఎవరైనా కోర్టుకు వెళ్లినా ఆ కేసులను కోర్టులు ట్రిబ్యునళ్లకే పంపుతాయి. కోర్టులకు ప్రత్యామ్నాయ, సమాంతర (ప్యారలల్) అధికారాలు ఉండవు. రాష్ట్ర స్థాయి ట్రిబ్యునల్ తీర్పుపై ఎవరికైనా అభ్యంతరాలుంటే హైకోర్టులో సవాల్ చేయవచ్చు. హైకోర్టులో భూ వివాదాలను విచారించడానికి ప్రత్యేకంగా ఒక బెంచి ఉంటుంది. దీనినే వివాద పరిష్కార మార్గం (గ్రీవెన్స్ రెడ్రెసల్ ఛానల్) అంటారు. జిల్లా, రాష్ట్ర స్థాయి ట్రిబ్యునళ్లకు జ్యుడీషియల్ హోదా ఉంటుంది. -
అనగనగా ఒక దత్తాపురం
సాక్షి, సంజామల(కర్నూలు) : ఒకప్పుడు అక్కడ ఊరుండేది. ఎన్నెన్నో ఊసులు ఉండేవి. జన జీవనంతో ఊరు సందడిగా ఉండేది. కాలక్రమేణ ఒక్కరొకరూ ఊరు వదిలి వెళ్లారు. దీంతో గ్రామం ఖాళీ అయింది. అప్పటి ప్రజలు నివాసమున్న ఇళ్ల శిథిలాలను కొందరు కూల్చేసి ఆ ప్రదేశాన్ని ఇప్పుడు సాగుకు అనుకూలంగా మలుచుకున్నారు. అప్పటి ప్రజలు మంచి నీటి కోసం వాడుకున్న ఊటబావి, శిథిలమయిన గుడి..ఇక్కడ ఊరు ఉండేది అనేందుకు సాక్ష్యాలుగా నిలిచాయి. గ్రామం కనుమరుగై వందేళ్లవుతున్నా రెవెన్యూ రికార్డుల్లో మాత్రం ఊరి పేరు నేటికీ అలాగే ఉంది. ఆ ఊరి పేరే దత్తాపురం. పేరుసోముల, రామభద్రునిపల్లె గ్రామాలకు మధ్యలో ఉండేది. ఇక్కడ ఎక్కువగా బ్రాహ్మణులు నివసించేవారు. గ్రామంలో 120 కుటుంబాలు గతంలో ఉండేవి. మొత్తం 1,198 ఎకరాల విస్తీర్ణంలో భూమి ఉంది. ఇందులో 723 ఎకరాలు సాగుభూమి ఉంది. నివాస గృహాలు 15 ఎకరాల విస్తీర్ణంలో ఉండేవి. గ్రామం కనుమరుగు కావడంతో భూములన్నీ పేరుసోముల, రామిరెడ్డిపల్లె, రామభద్రునిపల్లె గ్రామాలకు చెందిన రైతులు ఇక్కడ భూములను సాగు చేసుకుంటున్నారు. శిథిలమైన నివాస గృహాలను పేరుసోముల గ్రామానికి చెందిన కొందరు తొలగించి సాగు చేస్తున్నారు. నాకు ఊహ రాకముందే ఊరు ఖాళీ అయ్యింది నాకు 71 సంవత్సరాల వయస్సు ఉంది. నాకు ఊహ రాకముందే ఆ ఊరు ఖాళీ అయింది. మా నాన్నగారు ఉన్నప్పుడు అక్కడ ప్రజలు నివసిస్తుండే వారు. దత్తాపురం వారు ఊరు వదలి వెళ్లడంతో మా ఊరోళ్లు వారి భూములను కొని సాగు చేసుకుంటున్నారు. – గొల్ల రాముడు, రైతు, పేరుసోముల -
మాయా భవంతి!
సాక్షి, గుంటూరు: అదో మాయా భవంతి.. లీజుకు తీసుకున్న స్థలాన్ని రెన్యువల్ చేసుకోకపోవడం ఒక అంశమైతే పక్కనే ఉన్న జాగాను సైతం ఆక్రమించి అధికారం అండతో పార్టీ కార్యాలయాన్ని నిర్మించుకోవడం మరో కోణం. కార్పొరేషన్ రికార్డుల్లో మాత్రం అసలు అక్కడ ఓ భవనం ఉన్న దాఖలాలే లేవు. చెప్పాలంటే అసలు కార్పొరేషన్ స్థలాన్నే ఆక్రమించి భవన నిర్మాణాన్ని చేపట్టారు. గుంటూరులోని టీడీపీ రాష్ట్ర కార్యాలయం నిర్మాణం వెనుక నిర్వాకాలు ఇవీ. ఇలాంటి భవనం నుంచే టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇక తన కార్యకలాపాలన్నీ కొనసాగిస్తానంటూ ప్రకటించడం గమనార్హం. పన్నుతో సరిపుచ్చాలంటూ పైరవీలు... చిరు వ్యాపారులు చిన్న రేకుల షెడ్డు వేస్తేనే పొక్లెయిన్లతో వెళ్లి కూల్చివేసే టౌన్ ప్లానింగ్, రెవెన్యూ అధికారులు నగరం నడిబొడ్డున అనుమతులు లేకుండా నిర్మించిన టీడీపీ రాష్ట్ర కార్యాలయ భవనం గురించి పట్టించుకోకపోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది. కోట్ల రూపాయల విలువ చేసే స్థలం కబ్జాకు గురైనా, అక్రమ నిర్మాణాలు చేపట్టినా, అద్దె, పన్ను రూపంలో కార్పొరేషన్ ఖజానాకు భారీ గండిపడుతున్నా గుంటూరు నగరపాలక సంస్థకు కనీసం చీమకుట్టినట్లయినా లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అక్రమ కట్టడాలపై తాజాగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిన నేపథ్యంలో అనుమతులు లేని టీడీపీ రాష్ట్ర కార్యాలయ భవనానికి పన్ను విధించి సరిపుచ్చాలంటూ ఆ పార్టీ నేతలు ఒత్తిళ్లు తెస్తున్నారు. అక్రమ కట్టడాన్ని సక్రమంగా మార్చుకునేందుకు రెవెన్యూ విభాగంలో తమకు అనుకూలంగా వ్యవహరించే ఓ అధికారి ద్వారా టీడీపీ నేతలు పైరవీలు నిర్వహిస్తున్నారు. సదరు అధికారి టీడీపీకి చెందిన ఓ సీనియర్ మాజీ ఎమ్మెల్యేకు బంధువు కావడం గమనార్హం. లీజుకు తీసుకుని... పక్కనే ఆక్రమించి గుంటూరు అరండల్పేట 12/3 టీఎస్ నంబరు 826లోని వెయ్యి గజాల కార్పొరేషన్ స్థలాన్ని టీడీపీ కార్యాలయ నిర్మాణం కోసం 1999 జూలై 1వతేదీన 30 ఏళ్ల లీజుపై తీసుకున్నారు. ఏటా రూ.25 వేల చొప్పున నగరపాలక సంస్థకు అద్దె చెల్లించడంతోపాటు మూడేళ్లకోసారి లీజు రెన్యూవల్, 33 శాతం అద్దె పెంచేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే టీడీపీ నేతలు ఆ పక్కనే ఉన్న 1,637 చదరపు గజాల కార్పొరేషన్ స్థలాన్ని సైతం ఆక్రమించి తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మూడంతస్తుల భారీ భవనాన్ని నిర్మించి టీడీపీ జిల్లా కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారు. 2014లో టీడీపీ తిరిగి అధికారంలోకి రాగానే అందులో ఏకంగా పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. మొత్తం స్థలానికి ప్రహరీని నిర్మించారు. ఇంత జరుగుతున్నా ఈ అక్రమ కట్టడానికి నగరపాలక సంస్థ నోటీసులు ఇచ్చిన దాఖలాలు లేవు. 20 ఏళ్లుగా సదరు భవనానికి అనుమతులు లేకుండా, రూపాయి కూడా పన్ను చెల్లించకుండా పార్టీ కార్యాలయాన్ని నిర్వహిస్తుండటం గమనార్హం. ఖజానాకు భారీగా గండి టీడీపీ కార్యాలయ భవనం కోసం వెయ్యి గజాలు మాత్రమే కార్పొరేషన్ నుంచి లీజుకు తీసుకున్నారు. అది కూడా మూడేళ్లుగా రెన్యువల్ చేసుకోకపోవడం గమనార్హం. మరోవైపు ఆ పక్కనే సుమారు రూ.30 కోట్ల విలువ చేసే కార్పొరేషన్కే చెందిన 1,637 గజాల స్థలాన్ని కూడా ఆక్రమించి టీడీపీ రాష్ట్ర కార్యాలయాన్ని నిర్మించారు. ఈ భవనానికి 20 ఏళ్లుగా రూపాయి కూడా పన్ను కట్టని పరిస్థితి నెలకొంది. కార్పొరేషన్ అధికారులు ఇప్పటికైనా మేలుకొనివిలువైన స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని నగర ప్రజలు కోరుతున్నారు. టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి అనుమతులు లేవు గుంటూరు అరండల్పేట 12/3లో ఉన్న టీడీపీ రాష్ట్ర కార్యాలయ భవనానికి అనుమతులు లేవు. సుమారు 15 ఏళ్ల క్రితం ఈ భవనాన్ని నిర్మించారు. ఇప్పటివరకు ఈ భవనానికి పన్ను వేయలేదు. అనుమతులు లేకపోవడం వల్లే పన్ను విధించలేదు. రికార్డులు పరిశీలించి టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి నోటీసులు జారీచేస్తాం. – చక్రపాణి, గుంటూరు సిటీ ప్లానర్ -
ఇక రైతు సమగ్ర సర్వే
సాక్షి, హైదరాబాద్: రైతుల సమగ్ర సర్వే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కలెక్టర్లకు తాజాగా ఆదేశాలు జారీచేసింది. రైతుల సమగ్ర సమాచార సేకరణ జరిపిన తర్వాత.. వాటి ఆధారంగా భవిష్యత్తులో వివిధ పథకాలను రూపొం దించాలనేది ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం తెలిపింది. ముఖ్యంగా పంటకాలనీల ఏర్పాటు, వ్యవసాయ యాంత్రీకరణ, సూక్ష్మసేద్యం, కనీస మద్దతు ధర కల్పించడం, ఆన్లైన్లో చెల్లింపులు, ఆహార శుద్ధిపరిశ్రమల ఏర్పాటు, డీబీటీ పద్ధతిలో సబ్సిడీ చెల్లింపు, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాల అమలుకు ఈ సమగ్ర సమాచారాన్ని ఉపయోగించుకోవాలని సర్కారు భావిస్తుంది. వచ్చే నెల 15వ తేదీ నాటికి రైతుల సమగ్ర వివరాలను సేకరించాలని మండల స్థాయిలో ఉన్న వ్యవసాయ విస్తరణాధికారుల (ఏఈవో)ను ఆదేశించింది. ఈ మేరకు కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని రైతుల సమాచార సేకరణ జరపాలని వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారధి ఉత్తర్వులు జారీచేశారు. ఈ మేరకు ఆయన కలెక్టర్లకు లేఖ రాశారు. వేసవి కాలంలో ఉదయం 8నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4నుంచి 6 గంటల వరకు ప్రతీ రైతు వద్దకు వెళ్లి సమాచారాన్ని సేకరించాలని, సేకరించిన సమాచారాన్ని మధ్యాహ్న సమయంలో అప్లోడ్ చేయాలని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఏ, బీ పార్టుల ప్రకారం సమాచారాన్ని సేకరించాలని ఆయన ఆదేశించారు. పార్ట్–ఏలో సేకరించాల్సిన అంశాలు రెవెన్యూ రికార్డుల ప్రకారం రైతు పేరు, పట్టాదారు పాసు పుస్తకం నెంబరు, సర్వే నెంబర్ వివరాలు ఆధార్ కార్డులో ఉన్నట్లుగానే రైతు పేరును నమోదు చేయాలి. రైతు తండ్రి లేదా భర్త పేరు కూడా ఉండాలి. రెవెన్యూ రికార్డుల ప్రకారం ఆధార్ కార్డు నెంబర్. దాని జిరాక్స్ కాపీ కూడా జత చేయాలి. ఆ జిరాక్సు కాపీపై రైతు సంతకం లేదా వేలి ముద్ర తీసుకోవాలి. ఆధార్కార్డులో ఉన్న పుట్టినతేదీ నమోదు చేయాలి. ఒకవేళ పుట్టిన తేదీ కాకుండా పుట్టిన సంవత్సరం మాత్రమే ఉంటే ఏ రైతుకైనా జులై ఒకటినే వారి పుట్టిన తేదీగా పేర్కొనాలి. రైతు మొబైల్ నెంబర్ నమోదు చేయాలి. రైతుబంధు పథకానికి ఇచ్చిన నెంబర్ను తీసుకోవాలి. బ్యాంకు ఖాతా నెంబర్, బ్యాంకు పేరు, బ్రాంచి పేరు, ఐఎఫ్ఎస్సీ కోడ్ రైతుబీమా కోసం సేకరించిన వివరాల ప్రకారం సామాజిక హోదా రెవెన్యూ రికార్డుల ప్రకారం సర్వే నెంబర్ల వారీగా రైతుకు ఉన్న భూమి వివరాలు రైతుబీమా సందర్భంగా తీసుకున్న ఎల్ఐసీ ఐడీ నెంబరు పార్ట్–బీలో సేకరించాల్సిన అంశాలు రైతు చదువు వివరాలు. నిరక్షరాస్యుడా, పదో తరగతి పాస్ లేదా ఫెయిల్, ఇంటర్, డిగ్రీ, ఆపై వరకు చదివాడా వివరాలు తనకున్న భూమి సాగుకు యోగ్యమైనదేనా కాదా? వ్యవసాయ భూమికి సాగునీటి వసతి ఉందా? ఉంటే ఎలాంటి వసతి కలిగి ఉన్నాడు. ఎంత భూమి సర్వే నెంబర్ల వారీగా చాలా స్పష్టంగా వివరంగా సమాచారం ఉండాలి. సాగునీటి ఏర్పాట్లు ప్రత్యేకంగా చేసుకున్నాడా? సూక్ష్మసేద్యం ఏర్పాటు చేసుకున్నాడా? నేల స్వభావం, భూసార కార్డులు ఉన్నాయా? ఎలాంటి పంటలు పండిస్తున్నాడు. కూరగాయలు, పూలు, సుగంధ ద్రవ్యాలు, ఔషధ మొక్కలు వంటి వాటిని గతేడాది ఏమైనా వేశారా? 2018–19 వ్యవసాయ సీజన్లో వేసిన పంటల వివరాలు రాబోయే ఖరీఫ్లో ఎలాంటి పంటలు వేయడానికి రైతు సన్నద్ధమయ్యాడన్న వివరాలు. ఎందుకంటే వచ్చే ఖరీఫ్కు అవసరమైన ఎరువులు, విత్తనాలు రైతుకు సరఫరా చేయడానికి అవసరమైన ప్రణాళిక ఏర్పాటు చేయడానికి ఈ వివరాలు సేకరించాలని సూచించారు. వ్యవసాయ యంత్రాలేమైనా ఉన్నాయా? వరి కోత యంత్రాలు, స్ప్రేయర్లు, ట్రాక్టర్లు ఉన్నాయా? పంట రుణం తీసుకున్నాడా లేదా? పంటలకు బీమా ప్రీమియం చెల్లించారా లేదా? 2018–19లో పండించిన పంటను ఎలా అమ్ముకున్నారు? దళారులకు అమ్ముకున్నారా? ప్రభుత్వ సంస్థలకు అమ్ముకున్నారా? ఆహారశుద్ధి పరిశ్రమలు పెడితే బాగుంటుందా? బాగుంటే ఎలాంటిది పెట్టాలని రైతులు భావిస్తున్నారో తెలుసుకోవాలి. రైతు ఉత్పత్తి సంఘాల్లో సభ్యులుగా ఉన్నారా లేదా? స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్నారా లేదా? రైతుకు మొబైల్ నెంబర్ ఉందా లేదా? ఒకవేళ రైతుకు స్మార్ట్ఫోన్ ఉంటే అందులో తప్పనిసరిగా కిసాన్ సువిధ, పంటల యాజమాన్య యాప్లను ఏఈవోలు డౌన్లోడ్ చేయాలని ప్రత్యేకంగా సూచించారు. కిసాన్ పోర్టల్ నుంచి రైతులకు ఎస్ఎంఎస్లు వస్తున్నాయా లేదా? పశు సంపద ఏ మేరకు ఉంది? వాటి వివరాలు. సేంద్రీయ వ్యవసాయంపై రైతు ఆసక్తిగా ఉన్నారా? అవగాహన ఉందా లేదా? -
‘మా భూమి’ ఏమైపోయిందో!
సాక్షి, హైదరాబాద్: సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వు మండల కేంద్రానికి చెందిన ఓ రైతు కుటుంబానికి పదెకరాల భూమి ఉంది. ఆ భూమి ముగ్గురు కుటుంబ సభ్యుల పేరు మీద నమోదయింది. భూరికార్డుల ప్రక్షాళనకు ముందు ఆ ముగ్గురి పేర్ల మీద పాస్పుస్తకాలున్నాయి. పహాణీలో పేర్లున్నాయి. మాభూమి వెబ్సైట్లో సర్వేనంబర్ను చూసుకుంటే వారి పేర్ల మీదనే ఆ భూమి పదిలంగా ఉండేది... కానీ, ఇప్పుడు ఆ భూమికి పాస్పుస్తకాల్లేవు. ఎవరో ఫిర్యాదు చేశారని రెవెన్యూ యంత్రాంగం పాస్పుస్తకాలు నిలిపివేసింది. వారి భూములను పార్ట్–బీలో చేర్చి పక్కన పెట్టింది. కనీసం ఆన్లైన్లో చూసుకుందామన్నా ఇప్పుడు మా భూమి వెబ్సైట్ లేదు. భూరికార్డులూ అందుబాటులో లేవు. ఇప్పుడు ఆ భూమి ఎవరి పేరు మీద ఉందో కూడా తెలియని పరిస్థితి. ఆ రైతు కుటుంబంలో ఎడతెగని ఆందోళన.. ఈ ఆందోళన ఆ ఒక్క రైతు కుటుంబానిదే కాదు.. కారణమేదైనా భూరికార్డుల ప్రక్షాళన తర్వాత తమ భూములకు పాస్పుస్తకాలు రాని లక్షలాది మంది రైతులది. అన్నీ సరిగానే ఉన్నా సాంకేతిక కారణాలతో పాస్పుస్తకాలు రాని వారు, పుస్తకాల్లో అచ్చు తప్పులు పడి మళ్లీ ప్రభుత్వానికి తమ పుస్తకాలను సరెండర్ చేసినవారు, ఎవరో, ఏదో ఫిర్యాదు చేశారని, సరైన ఆధారాలు, డాక్యుమెంట్లు లేకుండానే పార్ట్–బీలో చేర్చిన భూములకు చెందిన రైతులంతా ఇప్పుడు ఇదే ఆందోళనతో కొట్టుమిట్టాడుతుండడం గమనార్హం. ధరణీ.. కానరాదేమీ! భూరికార్డుల ప్రక్షాళనలో భాగంగా రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 57లక్షలకు పైగా ఖాతాల్లో 2కోట్లకు పైగా ఎకరాల భూమికి సంబంధించిన రికార్డులను సరిచేశారు. 49లక్షలకు పైగా ఖాతాలకు పాస్పుస్తకాలను ముద్రించారు. ఆధార్ నంబర్లు, ఫొటోలు లేవనే కారణంతో 7లక్షలకు పైగా ఖాతాలకు పుస్తకాలను అసలు ముద్రించనే లేదు. ముద్రించిన వాటిలో ప్రభుత్వ లెక్కల ప్రకారమే 7లక్షలకు పైగా పుస్తకాలను పంపిణీ చేయలేదు. కొన్ని కాలమ్లు రాలేదని, తప్పులు వచ్చాయంటూ నిలిపివేసిన వీటిలో దాదాపు నాలుగు లక్షల పుస్తకాలను మళ్లీ పంపిణీకి జిల్లాలకు పంపారు. అంటే, మొత్తంమీద 10లక్షలకు పైగా ఖాతాలకు పాస్పుస్తకాలు లేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు, ఈ ఖాతాల్లో ఉన్న భూములపై ఎవరికి హక్కులున్నాయో కూడా తెలియని పరిస్థితి. అసలు ఆ భూములు తమ పేరు మీద వస్తాయా రావా... పాస్పుస్తకాలు ఇస్తారో లేదోననే ఆందోళన రైతాంగంలో నెలకొంది. ధరణి పేరు మీద పైలట్గా ప్రారంభమయిన 21 మండలాల్లోనూ రికార్డులు సరిగా లేకపోవడంతో రాష్ట్రమంతటా ఇదే పరిస్థితి నెలకొంది. ఇక పార్ట్–బీ పేరుతో వివాదాలున్నాయని పక్కన పెట్టిన భూములను ఇంతవరకు పరిష్కరించలేదు. ఇలా మరో 3లక్షలకు పైగా ఖాతాల్లో రైతులు అసలు తమ భూమి తమకు దక్కుతుందో లేదోననే ఆందోళనలో ఉన్నారు. పాస్ పుస్తకాలు ఇచ్చిన రైతులు కూడా తమ భూమి ఆన్లైన్లో ఎవరి పేరు మీద ఉందోననే గాభరాకు గురవుతున్నారు. కేవలం పాస్పుస్తకమే తమకు ఆధారంగా ఉందని, ఆన్లైన్ రికార్డుల్లో కూడా తమ పేర్లు చేర్చాలని వారు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో భూరికార్డుల ప్రక్షాళన వివరాలను ఆన్లైన్లో ఉంచాలని, భూమి ఎవరి పేరు మీద ఉన్నదనే ప్రస్తుత స్థితిని తెలియజేస్తూ రికార్డులు నమోదు చేయాలని, అవసరమైతే మార్పులు, చేర్పులు చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఏడాది నుంచి రికార్డుల్లేవు.. వాస్తవానికి, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు రెవెన్యూ రికార్డులు అందుబాటులో ఉండేవి కావు. రైతుల దగ్గర ఉండే పాస్పుస్తకాలు తప్ప భూమికి సంబంధించిన ఏ రికార్డు కావాలన్నా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరగాల్సిందే. ఆమ్యామ్యాలు సమర్పించుకోవాల్సిందే. అయితే, ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ హయాంలో నిజామాబాద్ జిల్లాలో ‘భూభారతి’పేరుతో పైలట్ ప్రాజెక్టు ప్రారంభించి రెవెన్యూ రికార్డులను కంప్యూటరీకరించే ప్రయత్నం జరిగినా అది పూర్తి కాలేదు. కానీ, భూపరిపాలన ప్రధాన కమిషనర్గా రేమండ్ పీటర్ బాధ్యతలు చేపట్టాక 2016లో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని భూముల వివరాలను పబ్లిక్ డొమైన్లో ఉంచారు. ఫలానా సర్వే నంబర్లో ఉన్న భూమి ఏ రైతు పేరు మీద ఉందో చూపించే విధంగా ‘మా భూమి’వెబ్సైట్లో పొందుపరిచారు. కానీ, భూరికార్డుల ప్రక్షాళన ప్రారంభమయిన 2017, సెస్టెంబర్ 15 నుంచి ఈ వెబ్సైట్ను నిలిపివేశారు. ప్రత్యేక సాఫ్ట్వేర్తో భూరికార్డుల ప్రక్షాళన వివరాలను నమోదు చేసిన అధికారులు, ఆ తర్వాత ధరణి పేరుతో కొత్త వెబ్సైట్ ప్రారంభించారు. -
భూమి పట్టా కాదేమోనని రైతు ఆత్మహత్య
మేడిపల్లి (వేములవాడ): భూమి తన పేరు మీద పట్టా కాదేమోననే బెంగతో బుధవారం ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం వల్లంపల్లికి చెందిన ఎస్.మల్లేశం(45)కు వల్లంపల్లి శివారులో 325 సర్వే నంబర్లో 3.38 ఎకరాల భూమి ఉంది. అది ఆన్లైన్లో నమోదు కాకపోవడంతో 2015లో ఇక్కడ పనిచేసిన వీఆర్వోను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఆయన తన భూమిని పట్టా చేయకుండా మోసం చేశాడని, ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోలేదని వాపోయేవాడు. తన భూమి ఇతరుల పేరిట అవుతుందేమోనని మనస్తాపానికి గురై.. బుధవారం పొలం వద్ద చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మల్లేశం పేరిట భూమి ఉంది: కలెక్టర్ జగిత్యాల అగ్రికల్చర్: రెవెన్యూ రికార్డులు సరిగ్గా లేకనే మల్లేశం ఆత్మహత్య చేసుకున్నట్లు వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని జగిత్యాల కలెక్టర్ శరత్ చెప్పారు. మల్లేశంకు 7.16 ఎకరాలు, ఆయన పెద్ద కొడుకు మధు పేరిట 2.8 ఎకరాలు, చిన్న కొడుకు గణేశ్ పేరిట 2.10 ఎకరాలు భూమి ఉందన్నారు. భూముల వివరాలు ఆన్లైన్లో నమోదయ్యాయని.. పాసుపుస్తకాలు వచ్చాయని తెలిపారు. రైతుబంధు పథకం కింద మల్లేశంకు రూ.29,600, మధుకు రూ.8,850, గణేష్కు రూ.9,050 సంబంధించిన చెక్కులు సైతం వచ్చాయని వివరించారు. మల్లేశం మృతిపై పోలీసులు విచారణ చేపడుతున్నారని తెలిపారు. -
భూమి లెక్కలు పెద్ద చిక్కులు
సాక్షి, అమరావతి: చిత్తూరు జిల్లా పీలేరులో రహదారి పక్కనే ఒక సర్వే నంబరులో ఆరు ఎకరాల భూమి ఉంది. ముగ్గురి పేర్లతో ఈ భూమి ఉంది. నారాయణ స్వామి తనకు నాలుగు ఎకరాలు ఉందని చెబుతున్నారు. కృష్ణారెడ్డి తనకు రెండు ఎకరాలు, రమేష్ బాబు తనకు రెండు ఎకరాలు ఉందని చెబుతున్నారు. ఈమేరకు పట్టాదారు పాసుపుస్తకాలు కూడా ఉన్నాయి. ఉన్న భూమి ఆరు ఎకరాలైతే ముగ్గురి పేర్లతో కలిపి ఎనిమిది ఎకరాలుగా నమోదు అయింది. దీంతో అధికారులు వారి పేర్లతో భూమిని వెబ్ల్యాండ్లో నమోదు చేయకుండా పక్కన పెట్టేశారు. దీంతో తాజా అడంగల్లో అధికారులు ఈ భూమి విస్తీర్ణం రాశారేగానీ ఎవరిపేరుతో ఎంత ఉందో నమోదు చేయకుండా ఖాళీలు పెట్టారు. ఇలాంటి భూ సమస్యలు ఈ ఊరు ఆ ఊరులో అనిలేదు. రాష్ట్రంలోని దాదాపు ప్రతి పల్లెలో భూ రికార్డుల్లో తేడాలతో లక్షల మంది ఇబ్బంది పడుతున్నారు. సమస్యను పరిష్కరించాల్సిన రెవెన్యూ అధికారులు చేతులెత్తేయడంతో వివాదాలు పెరిగి ఘర్షణలకు దారి తీస్తున్నాయి. కొన్ని చోట్ల హత్యలకు కూడా దారితీసిందంటే ఈ భూ లెక్కల తేడాల తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతుంది. రైతుల వద్ద ఉన్న పట్టాదారు పాసు పుస్తకాలు, భూ యాజమాన్య హక్కు పత్రాలు (టైటిల్డీడ్)లో మాత్రమే తప్పులు ఉంటే ఎలాగోలా సరిదిద్దవచ్చు. పకడ్బందీగా వివరాలు నిక్షిప్తం చేయాల్సిన రెవెన్యూ శాఖ రికార్డులు కూడా తప్పుల తడకలుగా, అస్తవ్యస్తంగా తయారయ్యాయి. దీంతో ఈ సమస్య అటు అధికారులకు, ఇటు భూ యజమానులకు చిక్కులు తెచ్చిపెడుతోంది. ఈ లెక్కల చిక్కులు విడదీయలేనంత స్థాయిలో ముడిపడ్డాయి. గత దశాబ్దన్నర కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా భూముల విలువ భారీగా పెరిగిన నేపథ్యంలో ఈ తేడాలు వివాదాలకు, ఘర్షణలకు దారితీస్తున్నాయి. భూయాజమాన్య హక్కు ఎవరిదనే విషయంలో ఏర్పడిన వివాదమే కొన్ని నెలల కిందట చిత్తూరు జిల్లాలో ఓ హత్యకు దారితీసింది. భూ వివాదాలకు సంబంధించి రాష్ట్రంలోని రెవెన్యూ కోర్టుల్లో 34 వేల కేసులు ఉండగా మెజిస్ట్రేట్ కోర్టులు, జిల్లా కోర్టులు, హైకోర్టులో వేలాది కేసులు నడుస్తున్నాయి. భూ వివాదాలు పల్లెల్లో శాంతి భద్రతలకు కూడా ముప్పుగా పరిణమించాయని పోలీసు అధికారులు ప్రభుత్వానికి నివేదించారంటే సమస్య తీవ్రత అర్థం అవుతుంది. 33.54 లక్షల ఎకరాల తేడా రాష్ట్రంలో సర్వే నంబర్ల వారీగా చూస్తే ఆర్ఎస్ఆర్ (రీసర్వే సెటిల్మెంట్ రిజిష్టర్), అడంగల్ (భూమి హక్కుదారుల పట్టిక) మధ్య 33.54 లక్షల ఎకరాల విస్తీర్ణం మేరకు భూ వ్యత్యాసం ఉంది. మొత్తం భూ విస్తీర్ణంతో పోల్చితే ఇది 10 శాతం కావడం గమనార్హం. ఆర్ఎస్ఆర్లో ఉన్న సర్వే నంబర్ల కంటే అడంగళ్లలో ఉన్న చాలా సర్వే నంబర్లు ఎక్కువగా ఉంటాయి. అడంగల్లోని నంబర్లను అన్నింటిని పరిగణలోకి తీసుకుంటే ఈ వ్యత్యాసం ఇంకా పెరుగుతుంది. దశాబ్దాలుగా రైతుల అనుభవంలో ఉన్న లక్షలాది ఎకరాల భూములు నేటికీ అడంగల్లో ఎక్కలేదు. వీటినీ పరిగణనలోకి తీసుకుంటే తేడా 40 లక్షల ఎకరాలు దాటవచ్చని అధికారులే అంగీకరిస్తున్నారు. ఆర్ఎస్ఆర్లో మొత్తం 41,81,147 సర్వే నంబర్లు ఉండగా అడంగల్లో 46,91,642 సర్వే నంబర్లు ఉన్నాయి. అనగా ఆర్ఎస్ఆర్లో కంటే అడంగల్లో 5.10 లక్షల సర్వే నంబర్లు అధికంగా (12 శాతం తేడా) ఉన్నాయి. ఎందుకిలా? – వంశపారంపర్యంగా వచ్చిన భూముల విషయంలో కొందరు భాగ పరిష్కారం సమయంలో వాస్తవ భూ విస్తీర్ణం కంటే ఎక్కువగా తమ పేర్లతో నమోదు చేసుకున్నారు. – భూములు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకునే సమయంలో కూడా చాలామంది వాస్తవం కంటే ఎక్కువ విస్తీర్ణాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. – పొరుగున ఉన్న సర్కారు భూమిని ఆక్రమించుకుని కొందరు ఇలా రాయించుకోగా మరికొందరు పొరుగువారి భూమిని కూడా ఆక్రమించుకుని రికార్డుల్లో ఎక్కించుకున్నారు. ఆర్ఎస్ఆర్ ఆంటే రీసర్వే సెటిల్మెంట్ రిజిష్టర్ను ఆర్ఎస్ఆర్ అంటారు. ఇది దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం భూమిని సర్వే చేసిన సందర్భంగా తయారు చేసిన రికార్డు. బ్రిటీష్ హయాంలో జరిగిన ఈ రీసర్వే సెటిల్మెంట్ రిజిస్టర్నే చాలా వరకూ రెవెన్యూ శాఖ ప్రామాణికంగా తీసుకుంటుంది. అయితే ఇందులో కూడా కొన్ని తప్పులు ఉన్నాయి. చాలా గ్రామాల్లో ఆర్ఎస్ఆర్ కాపీలనే లేకుండా చేశారు. కొన్నిచోట్ల మాన్యువల్గా మార్పు చేర్పులు చేశారు. అందువల్ల ఆర్ఎస్ఆర్ ప్రకారం సమస్యను పరిష్కరించాలన్నా వీలు కావడంలేదు. సమస్య పరిష్కారం ఎలా? ఈ సమస్య శాశ్వత పరిష్కారానికి గతంలో లాగా మళ్లీ భూములన్నింటి రీసర్వే చేయడం ఉత్తమం. ఇది భారీ డబ్బు ఖర్చుతో కూడుకున్న ప్రక్రియ కావడంతో ప్రభుత్వం ఇందుకు సిద్ధంగాలేదు. అందువల్ల సర్వేనెంబర్ల వారీగా భూ అనుభవదారులతో రెవెన్యూ అధికారులు సమావేశమై చర్చించి వాస్తవ భూ విస్తీర్ణం మేరకు అనుభవదారులందరూ వాటాలు పంచుకునేలా ఒప్పించి ఆ మేరకు రికార్డుల్లో మార్చాలి. అయితే ప్రభుత్వం స్పందించడంలేదు. భూమి శుద్ధి ఏదీ? మొత్తం భూ రికార్డులను శుద్ధి (భూ రికార్డుల ప్రక్షాళన/ మ్యుటేషన్) చేస్తామని చంద్రబాబు సర్కారు ప్రకటించి రెండేళ్లు గడిచినా ఇప్పటికీ ఆ దిశగా ప్రయత్నమే లేదు. ఇలాంటివి సరిచేయకుండా పట్టాదారు పాసుపుస్తకాలను రద్దుచేసి (విలువ లేకుండా చేసి) తమకు అన్యాయం చేసిందని రైతులు వాపోతున్నారు. దీనివల్ల తమకు బ్యాంకు రుణాలు అందడంలేదని, భూమి అమ్ముకోవాలన్నా వీలుకావడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం ఉన్నతాధికారుల వద్ద ప్రస్తావించగా భూ రికార్డుల్లో తేడా ఉన్న విషయం వాస్తవమేనని దీనిని సరి చేయడం పెద్ద కసరత్తుతో కూడుకున్నదని వివరించారు. విశాఖపట్నం జిల్లా అనకాపల్లికి చెందిన అప్పల నరసింహానికి నాలుగు ఎకరాల పొలం ఉంది. ఈ మేరకు ఆయనకు పట్టాదారు పాసుపుస్తకం కూడా ఉంది. ఆయన తన పేరును అడంగల్లో నమోదు చేయాలని దరఖాస్తు చేసుకోగా అధికారులు తిరస్కరించారు. వాస్తవంగా ఆయనకు పొలం ఉన్న సర్వే నంబరులో 20 ఎకరాలు ఉంది. ఇందులో అప్పల నరసింహంతోపాటు నలుగురు భాగస్వాములు ఉన్నారు. ఆ నలుగురి పట్టాదారు పాసుపుస్తకాల ప్రకారం ఈ సర్వే నంబరులోని భూమి విస్తీర్ణం 23 ఎకరాలు కాగా వాస్తవంగా ఉన్న భూమి 20 ఎకరాలు మాత్రమే. అందువల్లే ఎవరి పేరునూ అధికారులు వెబ్ల్యాండ్లో నమోదు చేయలేదు. ఎవరికెంత భూమి అన్నది మీరే తేల్చుకోండని రెవెన్యూ అధికారులు చేతులు దులుపుకున్నారు. -
‘పట్టా’ పరేషాన్
మణుగూరు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న రైతు పెట్టుబడి పథకం ఫలాలు పట్టాదారులకు మాత్రమే అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. పట్టా ఉన్న రైతులకే పెట్టుబడి నగదును అందించేలా ప్రణాళిక రూపొందించడంతో కాస్తుదారులైన రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. గ్రామసభల ద్వారా రైతుల అభిప్రాయాలు సేకరించేటప్పుడు, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉపసంఘం చర్చల సమయంలో కేవలం పట్టాదారులనే లెక్కలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా గల పట్టాదారు రైతులు (1బీలో నమోదైన పట్టాదారు మాత్రమే) ‘ఏ’ కేటగిరి కింద సుమారు 71.75 లక్షల మంది ఉన్నట్లు రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన తర్వాత ప్రభుత్వం అంచనాకు వచ్చింది. పట్టాదారు రైతుల వివరాలు, సాగు విస్తీర్ణం తదితర వివరాలు నమోదు చేస్తుండటంతో ఈ పథకం కొంతమంది రైతులకే పరిమితమయ్యేలా కనిపిస్తోంది. దీంతో జిల్లా వ్యాప్తంగా గల 23 మండలాల్లో కాస్తుదారుల్లో కొనసాగుతున్న రైతులకు, కౌలుదారులకు, రెవెన్యూ, భూదాన సమితి, దేవాదాయ భూములు సాగు చేసే రైతులకు ఎలాంటి సహాయం అందే అవకాశాలు లేవు. జిల్లాలో 50 శాతం భూములకే పట్టాలు.. జిల్లా వ్యాప్తంగా 3, 25, 182 ఎకరాల భూమి సాగులో ఉండగా 1,04, 616 మంది రైతులు వ్యవసాయం చేస్తున్నారు. సాగు భూమి(1/70 చట్టం పరిధిలో)లో 50 శాతం భూములకే పట్టాలు ఉన్నట్లు భూ ప్రక్షాళనలో అధికారులు గుర్తించారు. పలు రకాల ప్రభుత్వ (వ్యవసాయ) భూముల్లో సన్న, చిన్నకారు రైతులే ఎక్కువగా పంటలు సాగు చేస్తుండటం గమనార్హం. ప్రభుత్వ సాయం పట్టాదారులకే దక్కితే ఆర్థిక ఇబ్బందులు ఉండి, సరైన భూ హక్కులు లేని నిరుపేద రైతులకు అన్యాయం జరిగే అవకాశం ఉంది. వారసత్వం, పసుపు కుంకుమ, విక్రయాలకు సంబంధించిన అంశాల ప్రక్షాళన విషయంలో లక్షల్లో డబ్బులు చేతులు మారుతున్నాయి. కానీ పలు రకాల ప్రభుత్వ భూములు సాగు చేసే బీద రైతులకు మాత్రం రెవెన్యూ రికార్డుల్లో స్థానం దక్కడం లేదు. దీంతో ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక పథకాలకు దూరం అవుతుండగా, తాజాగా రైతు పెట్టుబడి సహాయానికి కూడా అర్హత లేకపోవడంతో సన్న, చిన్నకారు రైతులు తలలు పట్టుకుంటున్నారు. ఏజెన్సీలో రైతుల భవిష్యత్ ప్రశ్నార్థకం... రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలను జిల్లాలోని ఏజెన్సీ ప్రాంత రైతులు పొందలేకపోతున్నారు. సుమారు 70, 80 సంవత్సరాలుగా (తరతరాలుగా) ఏజెన్సీ ప్రాంతంలో నివాసం ఉంటూ జీవనాధారం కోసం నిరుపేద రైతులు ప్రభుత్వ భూములు(రెవెన్యూ, దేవాదాయ, భూదాన సమితి, అటవీ భూములు) సాగు చేసుకుంటున్నారు. కాగా ప్రభుత్వం సంక్షేమ ఫలాలు అందించే క్రమంలో మైదాన ప్రాంతాలకు సంబంధించిన అంశాలనే పరిగణనలోకి తీసుకోవడంతో ఏజెన్సీ ప్రాంతంలో పొలాలు సాగు చేస్తున్న గిరిజనేతర రైతులకు తరుచూ అన్యాయం జరుగుతోంది. జిల్లాలో 23 మండలాల్లో (జిల్లా మొత్తం) గల భూములకు 1/70 చట్టం అమల్లో ఉండటం గమనార్హం. ప్రభుత్వం పకడ్భందీగా చేపట్టిన భూ ప్రక్షాళనలో కూడా గిరిజనేతర రైతులకు పేర్లు మార్చే అవకాశాలు లేవు. దీంతో ఏజెన్సీ ప్రాంతంలో అత్యధిక శాతం భూముల్లో సాగుచేసే సన్న, చిన్నకారు గిరిజనేతర రైతులకు ప్రభుత్వ సహాయం అందటం లేదు. సాగు చేస్తున్న భూములకు పూర్తిస్థాయిలో హక్కులు లేక, కనీసం ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహం కూడా పొందే అవకాశం లేకపోవడంతో బీద రైతులు ఆవేదన చెందుతున్నారు. -
తవ్వినకొద్దీ తప్పులు!
సాక్షి, హైదరాబాద్: భూ రికార్డుల ప్రక్షాళన సందర్భంగా తవ్వినకొద్దీ రెవెన్యూ రికార్డుల్లో తప్పులు, అవకతవకలు బయటపడుతున్నాయి. ప్రక్షాళన కార్యక్రమం జరిగేకొద్దీ తప్పుల శాతం పెరిగిపోతుండడంతో అధికారులు తలపట్టుకుంటున్నారు. దీంతో ఇది రాష్ట్ర ప్రభుత్వానికి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతుందా అని రెవెన్యూ వర్గాలే సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటివరకు 20 రోజులపాటు జరిగిన ప్రక్షాళన కార్యక్రమంలో ఏకంగా 27.5 శాతం తప్పులున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మరింతగా పెరుగుతూనే.. వాస్తవానికి భూరికార్డుల్లో 5 నుంచి 10% వరకే తప్పులు ఉంటాయని.. వాటిని గుర్తించి సరిచేయడం ద్వారా ఇబ్బంది లేకుండా రైతులకు ఆర్థిక సాయం పథకాన్ని అమలు చేయవచ్చని ప్రభుత్వం భావించిం ది. కానీ సరిచేయాల్సిన రికార్డుల సంఖ్య భారీగా పెరుగుతుండటం ఆందోళనకరంగా మారింది. సర్వే మొదలైన మూడు, నాలుగు రోజుల గణాంకాల వరకు 84% రికార్డులు సక్రమంగా ఉన్నట్లు గుర్తించారు. పది రోజుల తర్వాత ఇది 78 శాతానికి తగ్గగా.. మంగళవారం నాటి లెక్కలు చూస్తే 72.5 % రికార్డులే సక్రమంగా ఉన్నాయని రెవెన్యూ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యా ప్తంగా 14,04,597 సర్వే నంబర్ల రికార్డులను పరిశీలించగా.. అందులో 10,17,907 సర్వే నంబర్ల రికార్డులే సక్రమంగా ఉన్నాయని, 3,86,690 నంబర్ల రికార్డులను సవ రించాల్సిందేనని వెల్లడైనట్లుగా తెలిపాయి. పట్టాదారుల పేర్ల తప్పులే లక్షన్నర! భూరికార్డుల్లో కీలకమైన పట్టాదారుల పేర్లలో తప్పులున్నట్లు గుర్తించారు. భూమి ఒకరిదైతే రికార్డుల్లో మరొకరి పేరు ఉండడం, పట్టాదారులు చనిపోయి ఏళ్లు గడుస్తు న్నా రికార్డులు ఫౌతి చేయకపోవడం, పేర్లలో క్లరికల్ తప్పిదాలు వంటి సమస్యలున్నాయి. మొత్తం తప్పుల్లో లక్షన్నర వరకు ఇవి ఉన్నాయని గణాంకాలు చెబుతున్నాయి. పట్టాదారుల పేర్లలో క్లరికల్ తప్పిదాలను సరిచేయడం సులువే అయినా.. రికార్డుల్లో పట్టాదారుల పేర్లు మార్చడంలో, వారసుల పేరిట రికార్డులు మార్చడంలో ఇబ్బందులు ఎదురవుతాయని రెవెన్యూ వర్గాలు అంచనా వేస్తున్నాయి. భూవినియోగ మార్పిడి సమస్య కూడా మరో ముఖ్యమైన సమస్య నాలా భూములు. వ్యవసాయ భూములుగా రికార్డుల్లో ఉండి వ్యవసాయేతర కార్యకలాపాలకు వినియోగిస్తున్న భూములు పెద్ద ఎత్తున ఉన్నాయని అధికారులు గుర్తించారు. ఇప్పటివరకు 26,414 సర్వే నంబర్లలోని భూములు ఈ విధంగా వినియోగంలో ఉన్నట్లు తేలింది. ఇప్పుడు వీటన్నింటినీ నాలా కన్వర్షన్ చేయడం తలనొప్పిగానే మారనుంది. ఇంకా ప్రక్షాళనలో 10 శాతం కూడా పూర్తికాకుండానే పరిస్థితి ఇలా ఉంటే.. చివరి వరకు ఎలాంటి సమస్యలు వస్తాయో.. సవరించాల్సిన రికార్డుల శాతం ఏ మేరకు పెరుగుతుందోనని రెవెన్యూ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. భూరికార్డుల ప్రక్షాళనలో ముఖ్య గణాంకాలివే.. పరిశీలించిన సర్వే నంబర్లు - 14,04,597 సక్రమంగా ఉన్నవి - 10,17,907 సవరించాల్సినవి - 3,86,690 పట్టాదారులు సరిపోలనివి - 21,959 ఫౌతి చేయాల్సినవి - 56,202 క్లరికల్ తప్పిదాలున్నవి - 71,453 రికార్డుల కన్నా ఎక్కువ, తక్కువ భూములున్నవి - 36,399 నాలా భూములున్నవి - 26,414 -
భూరికార్డుల ప్రక్షాళనపై విపక్షాల విషం: కర్నె
సాక్షి, హైదరాబాద్: ఎనభై ఏళ్ల కిందటి రెవెన్యూ రికార్డులను సరిదిద్దేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే విపక్షాలు విషం గక్కుతున్నాయని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మండిపడ్డారు. భూరికార్డుల ప్రక్షాళన ప్రారంభమై పది రోజులే అవుతుందని, ఇంతలోనే అనేక అక్రమాలు బయటపడ్డాయన్నారు. టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రికార్డుల్లో భూములు లేకున్నా 9వేల ఎకరాలకు సంబంధించి బ్యాంకుల నుంచి అక్రమంగా రుణాలు తీసుకున్నట్లు బయటపడిందన్నారు. కాంగ్రెస్ హయాంలో తెలంగాణ పూర్తిగా నిర్వీర్యమయ్యిందని ఆరోపించారు. 42 ఏళ్ల కాంగ్రెస్ పాలన అక్రమాలకు కోదండరాం వత్తాసు పలకడం దుర్మార్గమని.. ఆయన కాంగ్రెస్ అనుబంధ నాయకుడిగా మారారని విమర్శించారు. రికార్డుల ప్రక్షాళనకు ఇంకా 80 రోజుల గడువుందని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ భూదందాలు ఇంకెన్ని బయట పడుతాయో చూడాలన్నారు. న్యాయమైన రైతులకే ఎకరాకు రూ.8వేల పెట్టుబడి దక్కాలన్నదే ప్రభుత్వ విధానమన్నారు. ఇకనైనా విపక్షాలు గుడ్డిగా వ్యతిరేకించడం మానితే మంచిదని కర్నె హితవు పలికారు. -
రైతు అ‘సమగ్ర’ సర్వే
రెవెన్యూ రికార్డులకు.. సర్వే వివరాలకు భారీ తేడా సాక్షి, హైదరాబాద్: ‘‘గ్రామాల్లో వ్యవసాయశాఖ అధికారులు నిర్వహించిన సర్వే వివరాలు రెవెన్యూ రికార్డులతో సరిపోలడం లేదు. ఓ గ్రామంలో 300 మంది రైతులున్నారని శాఖ తేలిస్తే, 1,100 మంది ఉన్నట్లు రెవెన్యూ రికార్డుల్లో ఉంది. మరి ప్రభుత్వ పెట్టుబడి ఎవరికివ్వాలి? చివరికి ఆ మొత్తం నిజమైన రైతులకు చేరకుండా పక్కదారి పడితే పెద్ద కుంభకోణంగా మారి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఏ భూమి ఎవరిదో స్పష్టతకు రావాలి. ఇందుకు రెవెన్యూ స్పెషల్ డ్రైవ్ చేయాలి. గ్రామం యూనిట్గా సర్వే జరగాలి. ఎంత భూమి ఉంది? ఎవరి పేరిట మీద ఉందనే విషయంలో స్పష్టతకు రావాలి.’’ ఇటీవలి సమీక్షలో రైతు సమగ్ర సర్వేపై సీఎం కేసీఆర్ పెదవి విరుపిది. ఆ సర్వేను ఆయన విశ్వసించడం లేదనేం దుకు ఈ వ్యాఖ్యలే నిదర్శనం. వ్యవసాయ విస్తరణాధికారుల (ఏఈవో)తో నిర్వహించిన ఈ సర్వేపై తొలి నుంచీ ఆరోపణలున్నాయి. సమగ్రంగా జరగలేదని, పలుచోట్ల రైతుల ఇళ్లకు వెళ్లకుండానే రాసేశారని వచ్చిన విమర్శలు సీఎం దాకా వెళ్లాయి. దీంతో వచ్చే ఏడాది నుంచి రైతులకు పెట్టుబడి పథకం అమలుకు ఈ సర్వేను ఆధారం గా తీసుకోకపోవచ్చని తెలుస్తోంది. రెవెన్యూ స్పెషల్ డ్రైవ్ జరిపి, సర్వే వివరాల ను ఆ సమాచారంతో సరిచూసుకొని ముందుకు పోతుందంటున్నారు. 30 లక్షల ఎకరాలు తగ్గాయి..! సాగుభూమి, రైతుల సంఖ్యలో వ్యవసాయశాఖ లెక్కలకు, సర్వేలో బాగా తేడా లుండటంతో దాని సాధికారతపై సీఎంకు అనుమానం తలెత్తింది. రాష్ట్రంలో రైతుల వద్ద ఉన్న భూమి వ్యవసాయశాఖ లెక్కల ప్రకారం 1.54 కోట్ల ఎకరాలు కాగా సర్వేలో 1.24 కోట్లే తేలింది. రైతుల సంఖ్య కూడా శాఖ వద్ద 55.53లక్షలుంటే çసర్వేలో 45.55లక్షలే తేలారు. ఉద్యాన పంటల విస్తీర్ణమూ 8లక్షలకు బదులు 3.59 లక్షలుగా తేలింది. కొత్త ఏఈవోలకు సమగ్ర శిక్షణ ఇవ్వకుండా సర్వే భారమంతా వారిపై వేసి అధికారులు చేతులు దులుపుకోవడమే దీనికి కారణమంటున్నారు. సకాలంలో ట్యాబ్లు ఇవ్వక పోవడంతో సర్వే వివరాలు రాయడానికే సమయం సరిపోయింది. దాంతో చాలాచోట్ల మొక్కుబడి సమాచారంతో సరిపుచ్చారన్న వాదనలున్నాయి. వివరాలను మళ్లీ సరిచూసి ట్యాబ్లో నిక్షిప్తం చేయాలని శాఖ ఆదేశించింది. -
అస్తవ్యస్తం
గందరగోళంగా రెవెన్యూ రికార్డులు ♦ మూటల్లో మూలుగుతున్న సేత్వార్లు ♦ దస్త్రాల ప్రక్షాళనకు మోక్షమెప్పుడో? ♦ 30శాతం భూముల రికార్డులు మాయం ♦ 26 మండలాలకు 12 మంది సర్వేయర్లు ♦ రికార్డులు లేకుండా ‘రెవెన్యూ ఎర్రర్ ఫ్రీ’! రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక సర్వే నిర్వహించి భూ దస్త్రాలను ప్రక్షాళన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. సర్వే సెటిల్మెంట్ తర్వాత భూముల క్రయ విక్రయాలు పారదర్శకంగా సాగేలా ప్రణాళిక సిద్ధం చేస్తోంది. సర్వే పూర్తయిన తర్వాత పట్టాదారు పాసుపుస్తకాలు, పహాణీ పత్రాలు మరింత సరళంగా ఉండేలా చూడాలని యోచిస్తోంది. జిల్లాలో ఇప్పటికే ‘రెవెన్యూ సమస్యలు లేని గ్రామాలు’ అంటూ రెవెన్యూ రికార్డులను సరిదిద్దే ప్రక్రియ కొనసాగుతోంది. రెవెన్యూ రికార్డులకు ‘బైబిల్’గా చెప్పుకునే సేత్వార్, ఖాస్రా రికార్డులు నిర్వహణ లోపంతో మూటలకు పరిమితమయ్యాయి. సాక్షి, సంగారెడ్డి : నిజాం పాలనా కాలం 1932లో సర్వే సెటిల్మెంట్ అనంతరం సర్వే నంబరు, విస్తీర్ణం, యజమాని, భూమి, పంట రకం, కొలతలు, హద్దులు తదితర వివరాలతో కూడిన టిప్పన్ల సమాహారంగా ‘సేత్వార్’ను రూపొందించారు. ఆ తర్వాత తిరిగి 1954–55 మధ్య కాలంలో భూ యజమాన్య హక్కులకు సంబంధించి శాశ్వత రికార్డుగా పేర్కొం టూ ‘ఖాస్రా పహాణీ’ రూపొందించారు. సేత్వార్, ఖాస్రా పహాణీల నిర్వహణలో నిర్లక్ష్యంతోప్రస్తుతం 30శాతం భూముల వివరాలకు సంబంధించి శాస్త్రీయమైన ఆధారాలు, లెక్కలు లేకుండా పోయాయి. సేత్వార్లను కంప్యూటరీకరించేందుకు 2005–2007లో చేసిన ప్రయోగం.. విఫలమై రికార్డులు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. జిల్లాలో శ్రేయ, రాశి అనే ప్రైవేటు ఏజెన్సీలకు సేత్వార్లను జిరాక్సు తీసే బాధ్యత అప్పగించగా.. సిబ్బంది నిర్లక్ష్యంతో దశాబ్దాల చరిత్ర కలగిన సేత్వార్ కాపీలు చిరిగి పొడిలా తయారయ్యాయి.దీంతో కాగితాలను మూటల్లో కట్టి సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ కార్యాలయంలో నేలపైనే పెట్టారు. సుమారు 30శాతం భూములకు సంబంధించి సేత్వార్ రికార్డులు లేకపోవడాన్ని అక్రమార్కులు ఆసరాగా తీసుకుంటున్న దాఖలాలు కూడా ఉన్నాయి. సేత్వార్ కోసం ఎవరైనా దరఖాస్తు చేసుకున్నా తమ వద్ద సేత్వార్ లభ్యం కాలేదంటూ సర్వే ల్యాండ్ రికార్డు కార్యాలయం సమాధానం ఇస్తోంది. పీడిస్తున్న సర్వేయర్ల కొరత ప్రస్తుతం జిల్లాలో 26 మండలాలకు 12 మంది సర్వేయర్లు మాత్రమే పనిచేస్తున్నారు. మరో ఐదు చోట్ల ఐదుగురు లైసెన్స్డ్ సర్వేయర్లకు అవసరాన్ని బట్టి బాధ్యతలు అప్పగిస్తున్నారు. సర్వే అండ్ ల్యాండ్ రికార్డుల అసిస్టెంట్ డైరెక్టర్ హైదరాబాద్తో పాటు సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలకు ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. భూముల సర్వే కోసం యజమానులు దరఖాస్తు చేసుకున్నా సర్వేయర్ల కొరత కారణంగా నెలల తరబడి పెండింగ్లో ఉంటున్నాయి. దీంతో వేలాది రూపాయలు ఖర్చు చేసి లైసెన్స్డ్ లేదా ప్రైవేటు సర్వేయర్లతో కొలతలు వేయించుకోవాల్సిన పరిస్థితి. మరోవైపు సర్వేయర్లు లేక భూ వివాదాలు ఏళ్ల తరబడి కొలిక్కి రావడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా సర్వే సెటిల్మెంట్ నిర్వహించి భూ దస్త్రాలను ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో సర్వే అండ్ ల్యాండ్ రికార్డుల విభాగాన్ని పటిష్టం చేస్తేనే సాధ్యమవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దస్త్రాల ప్రక్షాళనకు సంబంధించి మార్గదర్శకాలు అందాల్సి ఉందని రెవెన్యూ ఉన్నతాధికారులు వెల్లడించారు. తప్పుల తడకగా రికార్డులు జిల్లాలో రెవెన్యూ సమస్యలు లేని గ్రామాల పేరిట రెవెన్యూ యంత్రాంగం రికార్డుల్లో ఉన్న తప్పులను సరిదిద్దుతోంది. ఇప్పటికే వంద గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి, రెవెన్యూ సమస్యలు లేని గ్రామాలుగా ప్రకటించారు. మరో రెండు వందల గ్రామాలను త్వరలో ప్రకటించేలా సన్నాహాలు చేస్తున్నారు. రైతుల వద్ద ఉండే పట్టాదారు పాసుపుస్తకాలు, ప్రభుత్వం వద్ద ఉండే రెవెన్యూ రికార్డుల్లో వివరాలు ఒకే రకంగా ఉండేలా చూడటం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. ఏళ్ల తరబడి భూ రికార్డుల ప్రక్షాళన శాస్త్రీయంగా జరగకపోవడంతో భూ సంబంధ సమస్యలు పెరిగిపోతున్నాయి. గ్రామ కంఠాల ఆక్రమణ, చెరువులు, కుంటల హద్దులు చెరిపివేయడం, ప్రభుత్వ, అటవీ భూముల ఆక్రమణ, అసైన్డ్ భూముల అక్రమాలు, నకిలీ పట్టాదారు పాసుపుస్తకాలు.. ఇలా సవాలక్ష కారణాలతో రెవెన్యూ రికార్డుల నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. దీంతో క్షేత్ర స్థాయిలో భూ యజమానుల వద్ద ఉన్న రికార్డులకు, ప్రభుత్వ రికార్డుల్లోని వివరాలకు పొంతన లేకుండా పోయింది. మరోవైపు భూ కొలతలకు సంబంధించి డీ అండ్ ఓ, మరాఠ్వాడ విధానాలను అనుసరించడంతో రెవెన్యూ రికార్డులు మరింత సంక్లిష్టంగా తయారయ్యాయి. భూముల విస్తీర్ణం (హెక్టార్లలో) అటవీ భూమి 23,358 సాగులో ఉన్నది 2,34,575 దీర్ఘకాలంగా పడావుగా ఉన్న భూమి 30,416 బీడు, వ్యవసాయ యోగ్యం కానిది 19,512 పచ్చిక బయళ్లు 11,860 వివిధ రకాల వృక్షాలతో కూడినవి 1,490 సాగు యోగ్యమే కానీ నిరుపయోగం 7,340 ఏడాదిగా పడావుగా ఉన్న భూమి 67,847. -
కలెక్టరేట్కు చేరిన రెవెన్యూ రికార్డులు
► 57 మండలాల నుంచి భూరికార్డుల సేకరించిన అధికారులు ► రికార్డు రూంలో భద్రపరిచే పనిలో రెవెన్యూ సిబ్బంది ► భూకుంభకోణాల నేపథ్యంలోనే రికార్డులు స్వాధీనం సాక్షి, అమరావతి బ్యూరో: భూ కుంభకోణాలు, రికార్డుల తారుమారు నేపథ్యంలో జిల్లాలోని రెవెన్యూ ఉన్నతాధికారులు జిల్లాలో రెవెన్యూ రికార్డులు భద్ర పరిచే పనిలోపడ్డారు. ఇందులో భాగంగా 57 మండలాలల్లో భూములకు సంబంధించిన రికార్డులను గుంటూరులోని కలెక్టర్ కార్యాలయానికి గురువారం తీసుకువచ్చి స్వాధీనం చేయాలని కలెక్టర్ కోనశశిధర్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఆగమేఘాల మీద రెవెన్యూ సిబ్బంది ముఖ్యమైన రికార్డులతో గురువారం కలెక్టరేట్కు చేరుకొన్నారు. కలెక్టరేట్లో రికార్డులు తీసుకొనే బాధ్యతలను వివిధ సెక్షన్ల సూపరింటెండెంట్లకు అప్పగించారు. వాటిని రికార్డు గదిలో భద్రపరిచే పనిలో నిమగ్నమయ్యారు. ఇందులో ప్రధానంగా ఆర్.ఎ.ఎస్.ఆర్, వన్ రిజిస్ట్రర్, 1(బి), 10 (1) రిజిస్ట్రర్లు, అడంగళ్లు, అసైన్మెంట్ రిజిస్ట్రర్తో పాటు ఇతర రికార్డులు ఉన్నాయి. వీటిని ఇప్పటికే రెవెన్యూ అధికారులు కంప్యూటీకరణ చేసి ఉన్నారు. విశాఖ భూకుంభకోణం నేపథ్యంలో.. విశాఖపట్నంలో రూ.వేల కోట్ల భూముల కుంభకోణం వెలుగు చూసిన నేపథ్యంలో జిల్లాలో రెవెన్యూ అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా పలు మండల కార్యాలయాల్లో రికార్డులు తారుమారు అయినట్లు, పలు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో రికార్డులు సమీకరించారు. అయినప్పటికీ అక్కడ ప్రభుత్వ భూములు, చెరువు, శ్మశనాలు, వంటి భూములు రెవెన్యూ అధికారుల అండదండలతో దర్జాగా కబ్జా చేస్తున్న నేపథ్యంలో ఈ పనికి పూనుకున్నట్లు తెలుస్తోంది. జిల్లాలోని గురజాల, బాపట్ల, వినుకొండ, ప్రాంతాల్లో అవినీతి ఆరోపణలు రావటంతో ఇప్పటికే కొందరు రెవెన్యూ అధికారులపై వేటు పడింది. రేపల్లె నియోజకవర్గంలో భారీ భూకుంభకోణం వెలుగు చూసిన నేపథ్యంలో రికార్డుల సేకరణ రెవెన్యూ అధికారుల్లో ఆందోళన రేపింది. -
తహసీల్దార్లకు రిజిస్ట్రేషన్ల వివరాలు
- సబ్రిజిస్ట్రార్ నుంచి నేరుగా భూముల క్రయ, విక్రయాల సమాచారం సాక్షి, హైదరాబాద్: రెవెన్యూ రికార్డుల్లో భూమి హక్కులను బదిలీ (మ్యుటేషన్) ప్రక్రియను మరింత సరళతరం చేయనున్నారు. ఇకపై రాష్ట్రంలోని ఏ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో భూముల రిజిస్ట్రేషన్లు జరిగినా... ఆ డాక్యుమెంట్ కాపీలతో సహా సమగ్ర సమాచారం ఎప్పటికప్పుడు సంబంధిత మండల రెవెన్యూ కార్యాలయానికి చేరేలా ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రిజిస్ట్రేషన్, రెవె న్యూ శాఖల మధ్య సమన్వయం కొరవడడంతో రికార్డుల్లో పేర్లు మార్చే మ్యుటేషన్ ప్రక్రియ సక్రమంగా జరగడం లేదనే అభిప్రాయముంది. భూముల క్రయవిక్రయాలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు రెవెన్యూ శాఖకు పంపుతున్నామని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు చెబుతుండగా... రిజిస్ట్రేషన్ అధికారులిచ్చిన సమాచారం (అమ్మినవ్యక్తి పేరు, విస్తీర్ణం, భూమిస్థితి తదితర వివరాలు) రెవెన్యూశాఖ వెబ్ల్యాండ్లో ఉన్న సమాచారంతో సరిపోలకపోవడం వల్లనే మ్యుటేషన్లు చేయలేకపోతున్నామని రెవెన్యూ అధికారులు అంటున్నారు. దీంతో భూముల రిజిస్ట్రేషన్లు పూర్తయినా మ్యుటేషన్లు జరగక సామాన్య ప్రజానీకం ఇబ్బందులు పడుతున్నారు. అసలు మ్యుటేషన్ల విషయంగా రెవెన్యూ యంత్రాంగంపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) రేమండ్పీటర్ ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మ్యుటేషన్ కోసం 8 లక్షలకు పైగా దరఖాస్తులు తహసీల్దార్ కార్యాలయాల్లో పెండింగ్లో ఉన్నట్లు సీసీఎల్ఏ దృష్టికి వచ్చింది. ఆయన చొరవ ఫలితంగా పెండింగ్లో ఉన్న మ్యుటేషన్ దరఖాస్తుల సంఖ్య మూడు నెలల్లోనే 40 వేలకు తగ్గినట్లు తెలిసింది. జూన్ 2 నుంచి జరిగిన రిజిస్ట్రేషన్లపై ఆరా.. మ్యుటేషన్ పెండింగ్ దరఖాస్తులను క్లియర్ చేయడంతో పాటు దరఖాస్తు చేసుకోని రిజిస్ట్రేషన్లపై కూడా సీసీఎల్ఏ దృష్టి సారించారు. తెలంగాణ ఏర్పడిన (జూన్ 2, 2014) నాటి నుంచి ఆయా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరిగిన రిజిస్ట్రేషన్ల వివరాలను డాక్యుమెంట్లతో సహా తహసీల్దార్లకు అందజేయాలని ఇటీవల రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులను సీసీఎల్ఏ కోరారు. రాష్ట్రంలో వ్యవసాయ భూములకు సంబంధించి రెవెన్యూశాఖ వద్ద వెబ్ల్యాండ్లో స్పష్టమైన సమాచారం ఉన్నందున, సదరు సమాచారాన్ని తనిఖీ చేశాకే భూముల రిజిస్ట్రేషన్లు జరిగేలా చూడాలని... వెబ్ల్యాండ్లో లేని సర్వే నంబర్లలో రిజిస్ట్రేషన్లను తిరస్కరించాలని సూచించారు. సరైన సర్వే నంబర్లతో రిజిస్ట్రేషన్కు వచ్చిన వారి వివరాలను వెబ్ల్యాండ్లోకి అప్లోడ్ చేయడంతో పాటు వెబ్ల్యాండ్లో అప్డేట్ అయిన సమాచారాన్ని రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల వెనుక ముద్రించేలా చర్యలు చేపట్టాలని కోరారు. దీని ద్వారా అక్రమ రిజిస్ట్రేషన్లను అరికట్టేందుకు వీలవుతుందని ఇరు శాఖల అధికారులు అభిప్రాయపడుతున్నారు. నెలాఖరులోగా 22ఏ నోటిఫికేషన్ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నెలాఖరులోగా 22ఏ (నిషేధిత భూముల) నోటిఫికేషన్ జారీ చేయాలని భూ పరిపాలన ప్రధాన కమిషనర్ నిర్ణయించారు. సెక్షన్ 22ఏ లో రెవెన్యూ శాఖ పొందుపరిచిన వివిధ ప్రభుత్వ శాఖల భూములను ఎక్కడా రిజిస్ట్రేషన్ చేయకుండా నియంత్రించేందుకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు సిద్ధమయ్యారు. ఈ మేరకు సెక్షన్ 22ఏలో చేర్చేందుకు ఆయా ప్రభుత్వ శాఖల వద్ద ఉన్న భూముల వివరాలను అందజేయాలని దేవాదాయశాఖ కమిషనర్, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి, వక్ఫ్బోర్డ్ సీఈవోలకు సీసీఎల్ఏ లేఖలు రాశారు. విక్రయించేందుకుగానీ, రిజిస్ట్రేషన్ చేసేందుకుగానీ వీలులేని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు, ప్రభుత్వ పోరంబోకు భూములు, సెక్షన్-43 కింద రిజిస్టరైన దేవాదాయశాఖ భూములు, సెక్షన్-37 ప్రకారం రిజిస్టరైన వక్ఫ్ భూములు, పట్టణ భూగరిష్ట పరిమితి (యూఎల్సీ) చట్టం ప్రకారం ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూములు, రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం స్వాధీనం చేసుకున్న భూములు, అవినీతి నిరోధక శాఖ అటాచ్ చేసిన భూములు, పన్నులు చెల్లించని ఆస్తుల వివరాలు, గ్రీన్పార్కుల కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇచ్చిన ఖాళీస్థలాల వివరాలు సెక్షన్ 22ఏలో ఉంటాయి. -
భూదాన్ లెక్క తేలుద్దాం
- గణాంకాలతో రెవెన్యూ తికమక - మూడు వేల ఎకరాల మేర వ్యత్యాసం - భూముల చిట్టాపై మరోసారి - యంత్రాంగం కసరత్తు సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: భూదాన్ లెక్క తప్పింది. రెవెన్యూ రికార్డులు, భూదాన్ బోర్డు గణాంకాలకు భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. లెక్క తప్పిన ఈ భూములను కొలిక్కి తెచ్చేందుకు అధికార యంత్రాంగం కుస్తీ పడుతోంది. భూదాన్ యజ్ఞ బోర్డు నివేదించిన దాంట్లో దాదాపు 3వేల ఎకరాల మేర తేడా కనిపిస్తోంది. దీన్ని సరిచేసేందుకు క్షేత్రస్థాయిలో మరోసారి సర్వే చేయాలని అధికారులు నిర్ణయించారు. పేదలకు జీవనోపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఆచార్య వినోబాభావే పిలుపు మేరకు చాలామంది దాతలు భూదానం చేశారు. ఈ భూముల్లో అధికశాతం పరాధీనమైనట్లు, ల్యాండ్ మాఫియా గుప్పిట్లోకి వెళ్లిపోయినట్లు ఆరోపణలు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం భూదాన్ బోర్డును రద్దు చేసి రికార్డులను స్వాధీనం చేసుకుంది. ఈ క్రమంలోనే భూదానం చిట్టా తీయాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదే శించింది. దీంతో రికార్డుల ఆధారంగా భూముల చిట్టాను రూపొందించింది. అయితే, దీంట్లో రెవెన్యూ రికార్డులకు, భూదాన్ బోర్డు సమర్పించిన అంకెలకు పొంతన కుదరడంలేదు. భూదాన్ బోర్డు లెక్కల ప్రకారం 13,693 ఎకరాలుండగా, రెవెన్యూ రికార్డుల్లో మాత్రం 11,020 ఎకరాలే నమోదైంది. ఇందులో క్షేత్రస్థాయిలో కేవలం 10,717 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు సర్వేలో తేలింది. ఈ నేపథ్యంలో తేడా వచ్చిన 2,976 ఎకరాల లెక్క తీసేందుకు రెవెన్యూ యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఇటీవల జరిగిన తహసీల్దార్ల సమావేశంలోనూ ఈ అంశంపై విస్తృత చర్చ జరిపిన జాయింట్ కలె క్టర్ రజత్కుమార్ సైనీ భూదాన్ భూములపై సమగ్ర నివేదికను సమర్పించాలని ఆదేశించారు. అయితే, భూదాన్ బోర్డు ఇచ్చిన కాకిలెక్కలను విశ్వసించడం కన్నా, క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉన్న రికార్డుల ఆధారంగా సమర్పించిన నివేదికను పరిగణనలోకి తీసుకోవాలని అంటున్నారు. సర్వే నంబర్లలో ఉన్న విస్తీర్ణం కంటే ఎక్కువ మొత్తాన్ని దానం చేసినట్లు రికార్డుల్లో పేర్కొనడం కూడా విస్తీర్ణంలో వ్యత్యాసం కనిపించడానికి దారితీసింద ని చెబుతున్నారు. దీనికి ఉదాహరణగా 721 ఎకరాలను చూపుతున్నారు. వీటికి సంబంధించిన సర్వే నంబర్లు ప్రస్తావించకుండా భూమి ఉందని భూదాన్బోర్డు వాదించడం విడ్డూరంగా ఉందని అంటున్నారు. చేతులు మారిన భూమి భూమిలేని పేదలకు 6,625 ఎకరాలను అసైన్డ్ చేయగా, దీంట్లో ప్రస్తుతం 4,395 ఎకరాలు మాత్రమే వారి ఆధీనంలో ఉందని, మిగతా భూమి పరాధీనమైందని రెవెన్యూ యంత్రాంగం లెక్క తేల్చింది. సదుద్దేశంతో భూ వితరణ చేసిన దాతల లక్ష్యాన్ని నీరుగార్చేలా భూదాన్బోర్డే భూములను కొల్లగొట్టిందని విచారణలో తేల్చింది. ఈ మేరకు రాష్ట్ర సర్కారుకు ప్రాథమిక నివేదిక సమర్పించింది. సమగ్ర నివేదికను ఈ నెలాఖరులోగా తయారు చేసి పంపేందుకు కసరత్తు చేస్తోంది. -
గిరిజనులకు భరోసా
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి : దగా పడ్డ దళిత గిరిజనులకు సాక్షి అక్షర గొడుగు పట్టింది. అన్యాయాన్ని ఎత్తిచూపి.. వారికి అండగా నిలబడింది. వరుస కథనాలతో అక్షర సమరం చేసింది. ఎట్టకేలకు భూ సీలింగ్ చట్టం కింద భూములు పొందిన దళిత గిరిజనులకు పట్టాలిచ్చేందుకు రెవెన్యూ అధికారులు అంగీకరించారు. పెద్దల గుప్పిట్లో ఉన్న భూమిని విడిపించి..అర్హులకు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆదివారం మెదక్ ఆర్డీఓ మెంచు నగేష్, ఫారెస్ట్, రెవెన్యూ అధికారులతో కలిసి తిమ్మాయిపల్లి భూములను సందర్శించారు. వాస్తవ పరిస్థితిని అంచనావేశారు. రెవెన్యూ అధికారికి ‘సాక్షి’ అందించిన కీలక పత్రాలతో గిరిజనులు భూ యజమానులు కాబోతున్నారు.. వరుస కథనాలతో వెన్నులో వణుకు: అన్నల కోటలో.. అన్యులెవరు ప్రవేశించని అనంతసాగర్ భూముల డొంకను ‘సాక్షి’ కదిలించింది. సీలింగ్ యాక్ట్లో భాగంగా ప్రభుత్వం నుంచి పట్టాలు పొంది సాగు చేసుకుంటున్న గిరిజనుల భూములను కొంతమంది దొరలు లాక్కునే ప్రయత్నాన్ని సాక్షి అడ్డుకుంది. 63మంది గిరిజనుల జీవితాలకు భరోసా ఇచ్చే క్రమంలో మార్చి 11న ‘‘భూ మాయ’’ శీర్షికన తొలిసారి పరిశోధనాత్మక కథనాన్ని ప్రచురించింది. ‘‘ఆరాచకం’’ పేరుతో మరో కథనాన్ని ప్రచురించడంతో అధికార గణాల్లో చలనం ప్రారంభమైంది. ఇదే విషయాన్ని మార్చి 19న ‘‘ఏం చేస్తుండ్రు’’ మరో కథనాన్ని ప్రచురించింది. తదనుగుణంగా అధికారులు విచారణ ప్రారంభించినప్పటికీ ఆశించిన స్థాయిలో విచారణ సాగకపోవడంతో జూన్లో ‘మళ్లీ వచ్చాడు భూచోడు’ శీర్షికన టాబ్లాయిడ్లో... ‘భూదందా గుట్టురట్టు’ అనే శీర్షికతో మెయిన్లో కథనాలు ప్రచురించింది. అనంతరం జూలై 25న మరోసారి ‘భూచోళ్లకు అండ’ శీర్షికతో అలసత్వాన్ని ఎండగట్టింది. అనంతరం తిమ్మాయిపల్లి భూముల్లో విస్తృత పరిశోధన చేసి అనేక ప్రాంతాలు తిరిగి దగాపడ్డ అడవి బిడ్డల దీనగాధను అర్థం చేసుకుని వారిదగ్గరున్న కీలక పత్రాలను సంపాదించి బాధితుల తరపున మెదక్ ఆర్డీఓకు అందజేసింది. దీంతో అధికారుల్లో చలనం వచ్చింది. అనంతరం ఇతర మీడియా, అధికారులు ఎవరికి వారే స్పందించారు. ఇందుకనుగుణంగా ఆదివారం మెదక్ ఆర్డీఓ రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులతో కలిసి తిమ్మాయిపల్లి వెళ్లి పూర్తిస్థాయి విచారణ గావించారు. గిరిజనులకు న్యాయం చేస్తాం గిరిజనుల వద్ద ఉన్న ప్రొిసీడింగ్లను, వాటి ప్రతులను రెవెన్యూ రికార్డులతో సరి చూసుకుంటాం. అవి రికార్డులకనుగుణంగా సరిపోతే గిరిజనులకు ఢోకాలేదు. వారికి భూమిపై హక్కులు కల్పిస్తాం. ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు అవసరం లేదు. - మెంచు నగేష్, ఆర్డీఓ ‘సాక్షి’కి సలాం రెక్కలు ముక్కలు చేసుకొని దుక్కులు దున్నుకొని బతుకీడుస్తున్న మా భూములపై పెద్దల కన్ను పడింది. మా అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్నారు. మా మీద దౌర్జన్యం చేసి, మా భూములు మాకు కాకుండా చేశారు. భూ ఆక్రమణకు సిద్ధమయ్యారు. ఎవరికి చెప్పుకున్నా... మా వేదన అరణ్య రోదనే అయింది. ఆ సమయంలో ‘సాక్షి’ మాకు అండగా నిలిచింది. ‘సాక్షి’ పత్రికలో వచ్చిన కథనాల వల్లే పెద్ద దొరలు వెనక్కు తగ్గారు. అధికారులు ముందుకు వచ్చారు. మా భూములు మాకిప్పించేందుకు చర్యలు ప్రారంభించారు. మేము మా భూములు పొంది, మా భార్యాబిడ్డలకు ఇంత బువ్వపెట్టే పరిస్థితి వస్తే... అది ‘సాక్షి’ పుణ్యమే. ‘సాక్షి’కి చేతులెత్తి దండం పెడుతున్నాం. - ఎరుకల సిద్దిరాంలు/సడిమళ్ల కుమార్, బాధిత రైతులు -
‘గార్లకుంట’ గజ గజ
రెండెకరాల్లో రియల్టర్ల పాగా ప్లాట్లు చేస్తూ విక్రయూలు స్థలం విలువ రూ. 3 కోట్లపైనే నిద్ర నటిస్తున్న అధికార యంత్రాంగం నేరుగా కుంటను ఆక్రమించేందుకు నామోషీ కాబోలు! మొదట దాని పక్క స్థలాన్ని కొంటారు. తీరిగ్గా కుంటను కలుపుకుంటారు. తర్వాత ప్లాట్లు చేసి విక్రరుుస్తూ అమాయకులను బుక్ చేస్తారు. ఆమ్యామ్యాలతో అధికారులను కట్టడి చేస్తారు. ఎక్కడికక్కడ ఇలా పక్కాగా రియల్టర్లు కబ్జా పర్వాన్ని కొనసాగిస్తున్నారు. వీరి డబ్బు యూవకు గార్లకుంట ‘చిన్న’బోతోంది. జనగామ : పట్టణ శివారు ఏసిరెడ్డి నగర్ సమీపంలో గార్లకుంట ఉంది. 177 సర్వే నంబర్లోని ఈ కుంట విస్తీర్ణం 11.22 ఎకరాలని రెవెన్యూ రికార్డులు స్పష్టంచేస్తున్నారుు. ప్రస్తుతం ఇంత స్థలంలో కుంట లేదు. రెండు నుంచి మూడెకరాల స్థలం ఆక్రమణకు గురైనట్లు తెలుస్తోంది. ఈ ఆక్రమిత శిఖం భూముల విలువ సుమారు రూ. 3 కోట్లపైమాటే. ఆక్రమణలు, ఆపై ప్లాట్ల విక్రయూలతో నిబంధనలకు తూట్లు పొడుస్తున్నా.. రెవెన్యూ, మున్సిపాలిటీ అధికారులు అడ్డుకునే సాహసం చేయట్లేదు. కారణం.. కాసులు ముట్టడమేనని ఆరోపణలు విన్పిస్తున్నారుు. హద్దులు చెరిగిన గార్లకుంట రియల్టర్ల ధనదాహం ధాటికి గార్లకుంట హద్దులు చెరిగిపోయాయి. ఇటీవల రెవెన్యూ అధికారులు హద్దుల కోసం ఓ వైపు కాల్వ తవ్వించగా కబ్జాదారులు కాస్త వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఎఫ్టీఎల్(ఫీట్ ట్యాంకు లెవల్) నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడ ప్లాట్లు చేసి విక్రయిస్తున్నారు. ఎఫ్టీఎల్ ప్రకారం.. కుంట సరిహద్దుకు 100 మీటర్ల దూరంలోని పట్టా భూముల్లోనైనా నిర్మాణాలకు అనుమతి ఉండదు. ఈ భూమిలోని రైతులు సాగు చేసుకోవడానికి మాత్రమే అనుమతి ఉంటుంది. కుంటలోకి నీరొచ్చే సమయంలో 100 మీటర్ల పరిధిలో ముంపునకు గురయ్యే అవకాశం ఉండడంతో ఈ నిబంధన పెట్టారు. రియల్టర్లు దీన్నేమాత్రం ఖాతరు చేయట్లేదు. ఇప్పట్లో కుంటలు నిండే పరిస్థితి లేకపోవడాన్ని అదునుగా తీసుకుని కబ్జాకు పూనుకుంటున్నారు. కుంటల సమీపంలోని పట్టా భూములు కొని ప్లాట్లు చేస్తున్నారు. క్రమంగా కుంట స్థలాన్నీ ఆక్రమిస్తున్నారు. రెవెన్యూ అధికారుల అండదండలతో అంతా ‘సవ్యంగా’ సాగుతోంది. కానీ ప్లాట్లు కొన్న వాళ్లు చుక్కలు చూస్తున్నారు. నిర్మాణాలు.. తదితర అనుమతుల కోసం మళ్లీ భారీ మొత్తంలో ఖర్చు చేయూల్సి వస్తోంది. కబ్జా స్థలాన్ని కాపాడలేరా? కుంట సమీపంలో ప్లాట్లకు గజానికి రూ. 4 వేల ధర చెబుతున్నారు. ఎకరాకు 4800 గజాలు తేలుతాయి. రెండెకరాలకు లెక్కేసినా ఎటు లేదన్నా కబ్జా స్థలం విలువ రూ. 3 కోట్లుపైనే ఉంటుందని రియల్ ఎస్టేట్ వర్గాలే చెబుతున్నారుు. ఇంత విలువైన స్థలాన్ని కాపాడేందుకు అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ‘కుంట భూమి కొంత ఆక్రమణకు గురైనట్లు గుర్తించాం. దీన్ని ఆక్రమించిన వారి కోసం ఆరా తీస్తున్నాం. ఎఫ్టీఎల్ నిబంధనలు బేఖాతరు చేస్తూ చుట్టుపక్కల వారు ప్లాట్లు చేసినట్లు మా దృష్టికి వచ్చింది. ఉన్నతాధికారులకు నివేదిస్తాం’ అని రెవెన్యూ అధికారులు వివరణ ఇచ్చారు. -
అందుబాటులో...అరుదైన రికార్డులు..
కాకతీయ యూనివర్సిటీలో రాజ్యాభిలేఖ ప్రాంతీయ నిలయం 1930 నుంచి 1975 వరకు రెవెన్యూ రికార్డులు భద్రం ‘ఈస్ట్ ఇండియా’ పుస్తకాలు మొదలు ‘హైదరాబాద్ రాష్ర్ట చరిత్ర’ వరకు లభ్యం కేయూ క్యాంపస్ : మొగల్ చక్రవర్తుల చరిత్ర, ఏపీ గెజిట్కు సంబంధించిన రెవెన్యూ రికార్డులు, వివిధ జిల్లాల కైఫియత్తులు, మీర్ నిజాం అలీఖాన్ అండ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన పుస్తకాలు... వీటి పేర్లు వింటుంటే చదవాలనే ఆసక్తి కలిగినా ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయిలే అనే నిరాశ కూడా అలుముకుంటుంది. అయితే, మన జిల్లా వాసులకు ఆ నిరాశ అవసరం లేదు. ఏమంటే కాకతీయ యూనివర్సిటీ ఆవరణలో ఉన్న రాజ్యాభిలేఖ ప్రాంతీయ నిలయం ఆ వెసులుబాటును కల్పిస్తోంది. వరంగల్, ఖమ్మం జిల్లాలకు సంబంధించిన సుమారు 75 ఏళ్లకు పైగా రెవెన్యూ రికార్డులు, చరిత్ర పుస్తకాలు ఇక్కడ భద్రంగా ఉన్నాయి. ఔత్సాహికులు ఎలాంటి ఖర్చు లేకుండా వాటిని చదువుకునే అవకాశం ఉండగా, ఏమైనా ప్రతులు కావాలంటే స్వల్ఫ ఫీజు చెల్లించి జిరాక్స్ కూడా తీసుకోవచ్చు. చరిత్రకు సంబంధించి అద్భుతమైన పుస్తకాలు, రికార్డులు ఉన్న ఈ నిలయం విశేషాలపై ప్రత్యేక కథనం. హైదరాబాద్లో స్టేట్ ఆర్క్యూస్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిస్ట్యూట్ ఉంది. పరిశోధకులకు ఉపయోగపడే ఎన్నో లక్షల పుస్తకాలు, వేల రికార్డులు అక్కడ అందుబాటులో ఉన్నాయి. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లోని స్టేట్ ఆర్క్యూస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తర్వాత విశాఖపట్నం, గుంటూరు, రాజమం డ్రి, తిరుపతి, అనంతపురంలో అనుబంధంగా రాజ్యాభిలేఖ ప్రాంతీయ నిలయాలు ఏర్పాటుచేశారు. అలాగే, మన ప్రాంతంలో కూడా ఆ శాఖ ఉన్నతాధికారులు 1992లో కాకతీయ యూనివర్సిటీ ఆవరణలో ప్రాంతీయ నిల యం ఏర్పాటుచేశారు. దీంట్లో వరంగల్, ఖమ్మం జిల్లాలకు సంబంధించిన అనేక పాత రికార్డులను తెప్పించి భద్రపరిచారు. ఏమేం ఉన్నాయి... కాకతీయ యూనివర్సిటీ ఆవరణలోని రాజ్యాభిలేఖ ప్రాంతీయ నిలయంలో విధ చరిత్ర పుస్తకాలతో పాటు గత 75 ఏళ్లకు సంబంధించిన రికార్డులు, ముఖ్యమైన ఫైళ్లు భద్రపరిచారు. మొగలు చక్రవర్తుల చరిత్ర మొదలుకుని ఎందరో రాజుల, రాజ్యాల చరిత్ర పుస్తకాలు ఉన్నాయి. చరిత్ర పరిశోధకులకు ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయని చెప్పాలి. ఇంకా 1930 నుంచి 1975 సంవత్సరం వరకు ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోని రెవెన్యూ, ఇనాం, ఆలయాల భూముల రికార్డులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఏపీ గెజిట్కు సంబంధించిన పలు రికార్డులు, వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన 50ఏళ్ల ఫైళ్లు ఉంచారు. అంతేకాకుండా ద్రాక్షారామం శాసనాలు, ది ఫ్రీడమ్ స్టేట్ ఇన్ హైదరాబాద్-ఆంధ్రప్రదేశ్, హిస్టరీ ఆఫ్ ది ఫ్రీడమ్ మూవ్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్, పర్మాన్స్ అండ్ సానాదస్, డక్కన్ సుల్తాన్స్, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, విశాఖపట్నం కైఫీయుత్తులు, ఆంధ్రోద్యమ చరిత్ర, పీవీ.రంగారావు రచించిన ప్రసగ చంద్రిక, 1780-1798కు సంబంధించిన మీర్ నిజాం అలీఖాన్ అండ్ ఈస్ట్ ఇండియా కంపెనీ పుస్తకాలు అందులో ఉన్నాయి. ఇతిహాస్ జర్నల్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆర్య్కూస్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ల పుస్తకాలను ఇక్కడ భద్రపరిచారు. కేయూ రికార్డులు సైతం..1992లో ఏర్పాటు కాకతీయ యూనివర్సిటీ ఏర్పాటు కోసం తొ లుత(పీజీ సెంటర్ పేర ఏర్పాటుకోసం) అప్ప ట్లో 1967నుంచే భూసేకరణ యత్నాలు చేశా రు. ఈ ప్రయత్నాలకు సంబంధించి సర్వే నం బర్లతో కూడిన పాత రికార్డులు కూడా రాజ్యాభిలేఖ ప్రాంతీయ నిలయంలో ఉన్నాయి. వా టి మ్యాప్లను కూడా భద్రపరిచారు. రికార్డులు పాడు కాకుండా.. కేయూలోని రాజ్యాభిలేఖ ప్రాంతీయ నిలయానికి తీసుకొచ్చే రికార్డులు, పుస్తకాలు చెదలు పట్టకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. దీని కోసం బీరువా మాదిరిగా ఫెమినేషర్ చాంబర్ ఉంటుంది. దీని అడుగు భాగంలో ఓ కెమికల్ కప్ ఉంచుతారు. ఆ తర్వాత ఆ బీరువాలో పుస్తకాలను రెండు వారాల పాటు భద్రపరుస్తారు. ఈ మేరకు కెమికల్ ప్రభా వం పుస్తకాలపై పడి వాటికి చెదలు పట్టకుండా ఉంటుంది. ఆ తర్వాత పుస్తకాలు, రికార్డులను తీసి భద్రపరుస్తారు. అసౌకర్యాల నడుమ.. కాకతీయ యూనివర్సిటీలోని రాజ్యాభిలేఖ ప్రాంతీయ నిలయంలో అనేక సమస్యలు రాజ్యమేలుతున్నాయి. క్యాంపస్లోని ఎన్ఎస్ఎస్ కార్యాలయం వెనుక భాగంలో ఉన్న ఈ కేంద్రానికి వెళ్లేందుకు సరైన దారి కూడా లేదు. అంతేకాకుండా ఈ నిలయానికి సంబంధించి పెద్దగా ప్రచారం చేయకపోవడంతో... అరుదై న రికార్డులు పరిశీలించే అవకాశం ఉందని ఇ ప్పటికీ చాలా మంది పరిశోధకులకు తెలియదు. ఈ నిలయం ఇప్పటికే పుస్తకాలు, రికార్డులు, ఫైళ్లతో నిండిపోగా, వరంగల్, ఖమ్మం జి ల్లాల నుంచి ఇంకా పాత రికార్డులు తీసుకురావడం లేదు. ఈ విషయమై అనువైన భవనం కేటాయించాలని స్టేట్ ఆర్య్కూస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అధికారులు.. కేయూ అధికారులను కోరినా పట్టించుకోవడం లేదు. అంతేకాకుండా ఈ నిలయానికి కనీసం అటెండర్ లేకపో గా.. ఉన్న ఒకే అధికారి కార్యాలయం తలుపులు తెరవడం మొదలు అన్ని పనులు చేసుకోవాల్సి వస్తోంది. ఇప్పటికైనా ఇటు కేయూ అధికారులు.. అటు జిల్లా ధికారులు స్పందించి రా జ్యాభిలేఖ ప్రాంతీయ నిలయానికి మంచి భవ నం కేటాయించడంతో పాటు పరిశోధకులకు ఉపయోగపడేలా తీర్చిదిద్దాల్సిన అవసరముంది. సమాచారం సర్టిఫైడ్ కాపీలు ఇస్తాం ఇనాం, దేవాలయాలు, లావణీ పట్టా భూములే కాకుండా ప్రభుత్వ కార్యాలయాల భూములకు సంబంధించి పాత రికార్డులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. వాటి సమాచారం కావాలంటే స్వల్ఫ ఫీజు తీసుకుని సర్టిఫైడ్ కాపీలు ఇస్తాం. ఇంకా హిస్టరీ పరిశోధకులకు ఉపయోగపడే ఎన్నో పుస్తకాలు నిలయంలో ఉన్నాయి. యూనివర్సిటీ అధికారులు మంచి భవనం కేటాయిస్తే రాజ్యాభిలేఖ నిలయం ఏర్పాటుచేసిన ఉద్దేశం నెరవేరుతుంది. ప్రస్తుతం స్థలాభావం కారణంగా ఇంకా చాలా పాత రికార్డులను ప్రభుత్వ కార్యాలయాల నుంచి తీసుకోలేకపోతున్నాం. మహ్మద్ తెహర్ అలీ, ఆర్చివిస్టు -
గల్లంతుల రికార్డు
ఎల్.ఎన్.పేట, న్యూస్లైన్: గ్రామాల్లో భూ లావాదేవీలు అత్యధికంగా జరుగుతుంటాయి. వివాదాలూ ఆ స్థాయిలోనే ఉంటాయి. వీటి పరిష్కారానికి అతి కీలకమైనవి రెవెన్యూ రికార్డులే. అవి ఉంటే తప్ప ఏ చిన్న వివాదాన్ని పరిష్కరించలేని పరిస్థితి. అయితే ఎల్.ఎన్.పేట మండలంలో ముఖ్యమైన చాలా రెవెన్యూ రికార్డుల జాడ కనిపించడం లేదు. మండలంలో రెవెన్యూ వ్యవస్థ గాడి తప్పడం తో ఈ విషయం ఎవరూ పట్టించుకోవడం లేదు. జిల్లా అధికారులు సైతం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. రైతుల భూమి హక్కులను నిర్ధారించే రికార్డులు చాలా కాలంగా కనిపించడం లేదు. రెవెన్యూ విభాగం విధుల్లో రికార్డుల నిర్వహణ ప్రధానమైనదే. రికార్డులే కనిపించని పరిస్థితుల్లో ఈ విభాగం పనితీరుపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఉన్నాయా?..అమ్మేశారా? భూమి రికార్డుల్లో 1బి రికార్డులు కీలకమైనవి. ఇప్పుడు అవే లేవు. గతంలో ఇక్కడ పనిచేసి పదవీ విరమణ పొందిన, బదిలీపై వెళ్లిన వీఆర్వోలు, సీనియర్ సహాయకులు, ఆర్ఐలు నకిలీ భూ పట్టాదారులతో కుమ్మక్కై వారికి రికార్డులను అమ్మేయడమో, మాయం చేయడమో చేసి ఉంటారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాధారణంగా బదిలీ అయిన, పదవీ విరమణ చేసిన వారిని సంబంధిత రికార్డులన్నీ అప్పగించిన తర్వాతే రిలీవ్ చేయాలి, జీతాలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు క్లియర్ చేయాలి. ఈ నిబంధనను అధికారులు పట్టించుకోకపోవడం వల్లే ఇప్పుడు ఆ రికార్డులు ఎక్కడున్నాయో తెలియని పరిస్థితి ఏర్పడింది. 15 రెవెన్యూ గ్రామాలకు 1బి..ల్లేవు మండలంలో 47 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. వీటిలో 15 గ్రామాలకు చెందిన 1బి రికార్డులు లేవు. భూముల కొనుగోళ్లు, వారసత్వ హక్కుల వివరాలను 1బి రికార్డులో నమోదు చేస్తారు. రైతు ఫొటోతో సహా అన్ని వివరాలు ఇందులో ఉంటాయి. మండలంలోని కొత్తపేట, ముంగెన్నపాడు, చొర్లంగి, కవిటి, బొరమాంబాపురం, యంబరాం, బొడ్డవలస, ఫాక్సుదొరపేట, నరెంద్రపురం, పాలవలస, బొత్తాడసింగి, జాడుపేట, గార్లపాడు తదితర రెవెన్యూ గ్రామాలకు చెందిన 1బి రికార్డులు పూర్తిగా లేవని అధికారులే చెబుతున్నారు. అన్నీ దిద్దుబాట్లే ఇదిలా ఉండగా కంప్యూటర్ అడంగల్ పుస్తకం నిండా దిద్దుబాట్లే ఉన్నాయి. రైతుల పేర్ల కొట్టివేతలు, దిద్దుబాట్లు, తప్పుడు నమోదులు కనిపిస్తున్నాయి. రికార్డులు ఇంత దారుణంగా ఉంటే భూములకు గ్యారెంటీ ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఎవరికి వారు నచ్చిన విధంగా రికార్డులు మార్పించుకుంటున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. కొత్త రికార్డుల తయారీ రికార్డులు కనిపించని పరిస్థితుల్లో కొత్త రికార్డులు తయారు చేయాలని వీఆర్వోలను రెవెన్యూ అధికారులు ఆదేశించారు. 1బి రికార్డులు లేనందున ఇటీవలి వస్తున్న నమోదులను కొత్త 1బిల్లో చేర్పిస్తున్నామని తహశీల్దార్ రమణమూర్తి చెప్పారు. కొత్త ఫసలీలో కంప్యూటర్ అడంగల్ పుస్తకాల్లో తప్పులు, దిద్దుబాట్లు లేకుండా సరిచేస్తామని చెప్పారు. -
భూముల గుట్టు ‘రెవెన్యూ’కెరుక!
కామారెడ్డి, న్యూస్లైన్: భూముల ధరలు పెరుగుతున్న కొద్దీ వివాదాలూ ముదురుతున్నాయి. మూడు జిల్లాల కూడలి అయిన కామారెడ్డి పట్టణం విస్తరిస్తుండడంతో శివారు గ్రామాల్లో భూముల ధరలు పెరిగి రియల్ వ్యాపారం జోరుగా సాగింది. ముఖ్యంగా పట్టణానికి సమీపంలోని టేక్రియాల్, ఇల్చిపూర్, అడ్లూర్, రామేశ్వర్పల్లి, సరంపల్లి, దేవునిపల్లి, లింగాపూర్, నర్సన్నపల్లి, క్యాసంపల్లి తదితర గ్రామాల పరిధిలో భూముల క్రయవిక్రయాలు పెద్ద ఎత్తున జరిగాయి. అయితే అడ్డగోలు సంపాదనకు అలవా టు పడ్డ ‘కొందరు’ రెవెన్యూ ఉద్యోగులు డబ్బు ఆశకు రికార్డుల్లో లిటిగేషన్లు సృష్టించడం మూలంగానే భూముల గొడవలు పెరుగుతున్నాయని ఆరోపణలున్నాయి. ఇదే సమయంలో దళారుల మధ్యవర్తిత్వంతో రిజిస్ట్రేషన్ శాఖలోని అధికారులు, సిబ్బంది అక్రమాలకు సహకరిస్తున్నారని తెలుస్తోంది. భూముల రికార్డులను తెలిపే పహాణీల్లో ఎన్నో సర్దుబాట్లు, దిద్దుబాట్లు చోటుచేసుకోవడం, అసలు పట్టేదారులు మాయం అయి, దళారుల పేర్లు చేరడం మూలంగా ఒకే భూమి ఇద్దరు, ముగ్గురు..నలుగురికి రిజిస్ట్రేషన్లు అయిపోతున్నాయి. అలాగే కొన్ని చోట్ల అసలు పట్టాదారులు ఎప్పుడో అమ్ముకోగా, రికార్డుల్లో కొనుగోలు చేసిన వారి పేర్లు చేర్చకపోవడం మూలంగా దళారులు దాన్ని గమనించి సదరు రైతులకు ఆశ చూపి తిరిగి అవే భూములను అమ్మిపిస్తున్నారు. దీంతో ఏనాడో భూమిని కొనుగోలు చేసిన వారు, ఈమధ్యే కొనుగోలు చేసినవారు భూమి తమదంటే తమదంటూ కయ్యానికి దిగుతున్నారు. వారి వద్ద ఉన్న రిజిస్ట్రేషన్ డాక్యుమెం ట్లను చూపుతున్నారు. ఒకే భూమిని ఇద్దరికీ అమ్మారంటూ కొనుగోలు చేసిన వారంతా తమకు అమ్మిన వ్యక్తుల కోసం వెతుకులాడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. చివరకు సెటిల్మెంట్లు చేసే ముఠాలు రంగప్రవేశం చేస్తున్నాయి. ఈ వ్యవహారంలో పైసా పైసా కూడబెట్టి భూములు కొనుగోలు చేసినవారు రోడ్డున పడుతున్నారు. దళారులు మాత్రం దర్జాగా తిరుగుతున్నారు. గడచిన పదేళ్లుగా కామారెడ్డి పట్టణ శివార్లలో భూముల క్రయవిక్రయాలు పెద్ద ఎత్తున జరిగాయి. ఈ సందర్భంలోనే రికార్డులను తారుమారు చేసి పట్టాదారులను కాదని దళారులు అమ్ముకున్న భూ ములు ఎన్నో ఉన్నాయి. ఒకే భూమిని ఇద్దరు, ముగ్గురికి అంటగట్టడంతో భూమి నాదంటే నాదంటూ కొనుగోలు చేసినవారు తన్నుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. ‘కొందరు’ వీఆర్వోలు, రెవెన్యూ అధికారులు రికార్డులను తారుమారు చేయడం, దాని ఆధారంగా రిజిస్ట్రేషన్లు చేసిపెట్టడంలో రిజిస్ట్రేషన్ శాఖలో పనిచేసే అధికారులు, సిబ్బంది సహకరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. దీంతో భూములు కొనుగోలు చేసిన వారు ఇబ్బందులు పడాల్సి వస్తోందని పలువురు పేర్కొంటున్నారు. మచ్చుకు కొన్ని సంఘటనలు.. కామారెడ్డి మండలం ఇల్చిపూర్ గ్రామ పరిధిలోకి వచ్చే జాతీయ రహదారి, పాత జాతీయ రహదారి వెంట గుంటకు రూ. 3 లక్షల వరకు ధర పలుకుతోంది. ఇక్కడి సర్వేనంబరు 134 కు సంబంధించిన భూమిలో ఎన్నో అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. ఈ సర్వేనంబరులో టేక్రియాల గ్రామానికి చెందిన ఓ రైతు తనకు సంబంధించిన భూమిని చాలా రోజుల క్రితమే విక్రయించాడు. అయితే రికార్డుల్లో పేరు అలాగే కొనసాగడంతో గమనించిన దళారులు రంగప్రవేశం చేసి సదరు రైతు కుటుంబ సభ్యులకు ఆశ లు కల్పించారు. ఆ భూమిని మరొకరికి అమ్మిం చారు. ఆ భూమిని తామేనాడో కొనుగోలు చేశామని ఒకరు, కాదు తామే కొనుగోలు చేశామని మరొకరు గొడవకు దిగారు. ఇదే సర్వే నం బరులో మరో రైతు తన పేరిట ఉన్న భూమితో పాటు తన పాలివారి పేరిట ఉన్న భూమిని కూడా అమ్ముకున్నాడు. దీంతో అక్కడ గొడవలు జరుగుతున్నాయి. పట్టాదారునికి కేవలం 22 గుంటల భూమి ఉంటే 33 గుంటలు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాడని సమాచారం. ఇదంతా దళారులు, రెవెన్యూ ఉద్యోగులు, రిజిస్ట్రేషన్ సిబ్బం ది అంతా కలిసి పన్నిన కుట్రలో భాగంగానే జరిగినట్టు తెలుస్తోంది. ఇదే సర్వేనంబరులో క రీంనగర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి పదేళ్ల క్రితం భూమిని కొనుగోలు చేశాడు. బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లిన ఆయన భూమి విలువ పెరిగిందని సంతోషించాడు. దుబాయ్లో ఉం డగానే భూమిని అమ్మమని కుటుంబ సభ్యుల కు తెలపడంతో వారు భూమిని విక్రయించారు. అయితే ఆ భూమి తమదంటూ వేరే ఓ ముఠా రంగంలోకి దిగడంతో ఆ కుటుంబ సభ్యులు ఖంగుతిన్నారు. దీంతో దుబాయ్లో ఉన్న సద రు వ్యక్తి ఇంటికి వచ్చి తెలిసిన వారి ద్వారా ఆ భూమికి సంబంధించిన సమస్యను పరిష్కరించుకున్నాడు. ఈ వ్యవహారంలో రూ. 10 లక్షలకు పైగా నష్టపోయాడు. ఇలాంటి సంఘటనలు నిత్యం ఎన్నో వెలుగుచూస్తున్నాయి. భూముల ధరలు పెరగడమే... రియల్ ఎస్టేట్ వ్యాపారులు వ్యూహాత్మకంగా కామారెడ్డి ప్రాంతంలో భూముల ధరలు పెం చారు. భూముల ధరలు పెరిగినకొద్దీ అక్రమా లు పెరిగాయి. దీంతో వివాదాలు, గొడవలు చివరకు కోర్టు కేసులు, సెటిల్మెంట్లు.. ఇలా భూమి చుట్టూ తిరుగుతున్నాయి. తరువాత రియల్ భూం ఢమాల్మంది. దీంతో కొనుగో లు చేసినవారు అమ్ముకునే ప్రయత్నాలు చేయడంతో అసలు వివాదాలు వెలుగు చూస్తున్నా యి.ఘర్షణలు జరుగుతున్నాయి. దళారులతో రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల ఉద్యోగులు చేతులు కలపడం మూలంగానే వివాదాలు తలెత్తుతున్నాయని స్పష్టమవుతోంది. అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.