richter scale
-
జపాన్లో భారీ భూకంపం
జపాన్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 6.2గా నమోదైంది. జపాన్లోని క్యూషు కేంద్రంగా భూమి కంపించింది. ఈ ఏడాది జనవరిలో కూడా జపాన్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.9గా నమోదైంది. భూకంపం ప్రభావంతో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోయినా, ఆస్తి నష్టం జరిగింది.గత ఏడాది ఆగస్టులోనూ జపాన్లో రెండు భారీ భూకంపాలు సంభవించాయి. 6.9, 7.1 తీవ్రతతో ఏర్పడిన రెండు శక్తిమంతమైన భూకంపాలు నైరుతి దీవులైన క్యూషు, షికోకులను ప్రభావితం చేశాయి. గత ఏడాది జనవరి 1న 7.6 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపంలో 300 మందికి పైగా మృతి చెందిన సంగతి తెలిసిందే. కాగా, భూకంపాల పరంగా జపాన్ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన జోన్లో ఉంది. ఇక్కడి సముద్ర తీరప్రాంతంలో భూకంపం వచ్చే అవకాశం 80 శాతం ఉందని పలు నివేదికలు చెబుతున్నాయి.ఏఎఫ్పీ (Agence France-Presse) తెలిపిన వివరాల ప్రకారం జపాన్ ప్రభుత్వ సంస్థ భవిష్యత్లో మెగా భూకంపం రానున్నదని అంచనా వేసిన సంగతి తెలిసిందే. ఈ భారీ భూకంపం భూమిపై అపరిమిత వినాశనాన్ని కలిగిస్తుందని, మూడు లక్షల మంది మరణానికి కారణమవుతుందని తెలిపింది. ఈ భారీ భూకంపం కారణంగా సునామీ సంభవిస్తుందని, ఇది అనేక నగరాలను సముద్రంలో కలిపేస్తుందని పేర్కొంది. ‘మెగా క్వేక్ అనేది చాలా శక్తివంతమైన భూకంపం. దీని తీవ్రత 8 లేదా అంతకన్నా అధిక తీవ్రతతో ఉంటుంది. ఇది భారీ విధ్వంసానికి కారణంగా నిలుస్తుంది. సునామీని కూడా సృష్టిస్తుందని పేర్కొంది.కాగా, ఇటీవల మయన్మార్ (Myanmar)లో 7.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇది వేలాది మందిని పొట్టన పెట్టుకుంది. వేలాది మంది ప్రస్తుతం ఆస్పత్రులలో జీవన్మరణ సమస్యతో పోరాడుతున్నారు. లెక్క లేనంత మంది గల్లంతయ్యారు. పలు నగరాల్లో, ఎత్తైన భవనాలు, ఇళ్లు, దేవాలయాలు శిథిలమయ్యాయి. మయన్మార్లో సంభవించిన భూకంపం థాయిలాండ్లోనూ వినాశనాన్ని మిగిల్చింది. బ్యాంకాక్లో అత్యవసర పరిస్థితిని విధించాల్సి వచ్చింది. -
Myanmar earthquake: మయన్మార్లో మళ్లీ భూకంపం
మయన్మార్లో మళ్లీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 5.1 తీవ్రత నమోదైంది. దీంతో ఇళ్ల నుంచి ప్రజలు భయంతో బయటికి పరుగులు తీశారు. యునైటెడ్ జియోలాజికల్ సర్వే (యూఎస్జీఎస్) ప్రకారం.. ఆదివాయం మధ్యాహ్నం 12గంటల నుంచి 1గంట మధ్యలో మయన్మార్ను మరోసారి భూకంపం వణికించింది. మయన్మార్లోని మాండలే ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.1గా నమోదైనట్లు తేలింది.మరణాల సంఖ్య పెరుగుతోందిమార్చి 28న మయన్మార్ను భారీగా కుదిపేసిన 7.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఈ దుర్ఘటనలో మరణాల సంఖ్య సుమారు 1600కు పైకి చేరింది. 3,400 మందికి పైగా అదృశ్యమయ్యారు. యూఎస్జీఎస్ ప్రాథమిక సమాచారం మేరకు మయన్మార్లో ఈ భూకంపం వల్ల మరణాల సంఖ్య 10,000 దాటే అవకాశముందని పేర్కొంది. -
Andhra Pradesh: ఏపీలో వణికించిన భూకంపం
సాక్షి, అమరావతి/నెట్వర్క్: తెలుగు రాష్ట్రాల్లో భూమి కంపించింది. బుధవారం ఉదయం 7.27 గంటలకు ఏపీలో పలుచోట్ల స్వల్ప ప్రకంపనలు రావడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. కొన్నిచోట్ల ప్రజలు భయంతో ఇళ్లల్లోంచి బయటకు పరుగులు తీశారు. కొన్నిచోట్ల ఇళ్లలో సామాన్లు, బీరువాలు ఊగడాన్ని స్పష్టంగా గుర్తించారు. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా నుంచి విశాఖపట్నం జిల్లా వరకు స్వల్ప ప్రకంపనలు వచ్చినట్టు గుర్తించారు. ఏపీలో దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 3 పాయింట్లలోపే నమోదైనట్టు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రాష్ట్రంలో పలుచోట్ల రెండు నుంచి మూడు సెకన్లు మాత్రమే భూమి కంపించింది. భూప్రకంపనల కారణంగా తిరువూరు రాజుపేటలోని ఓ గృహంలో గోడలు బీటలు వారాయి. సుందరయ్య కాలనీలోని మోటూరు చింతయ్య ఇంట్లోని సామగ్రి కిందపడిపోయింది. భూకంప కేంద్రం తెలంగాణలోని ములుగు జిలా్లలో ఉండగా.. అక్కడ దాని తీవ్రత 5.3గా నమోదైంది. రాష్ట్రంలో రాజమండ్రి వరకు 230 కిలోమీటర్ల మేర వాయువ్య దిశలో దాని ప్రభావం రిక్టర్ స్కేల్పై 2.9గా ఉందని అధికారులు తెలిపారు. ఏపీ సేఫ్ జోన్లోనే..రాష్ట్రంలో చాలా స్వల్ప స్థాయిలో భూమి కంపించిందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ తెలిపారు. 12 స్థాయిలతో కూడిన భూకంప తీవ్రత జాబితాలో ఇక్కడ వచ్చింది రెండో స్థానమేనని పేర్కొన్నారు. దీన్ని ఫీబుల్ స్థాయి అని పిలుస్తారని, ఈ స్థాయిలో భూకంపం సంభవిస్తే ప్రమాదాలకు అవకాశం ఉండదని స్పష్టం చేశారు. ప్రకంపనలు ఎక్కడెక్కడ వచ్చాయంటే..విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడు, కృష్ణా జిల్లా పెనమలూరు, ఎన్టీఆర్ జిల్లా తిరువూరు, ఏలూరు జిల్లా బుట్టాయగూడెం, కృష్ణాపురం, కొమ్ముగూడెం, దుద్దుకూరు, దాసియ్యపాలెం, వేలేరుపాడు, రుద్రమకోట, కన్నాయిగుట్ట, కుక్కునూరు మండలం సీతారామనగరం, వేలేరు, శ్రీధర్, ఉప్పేరు, కుక్కునూరు, రాజానగరం, మాధవరం, కొయ్యలగూడెం, కన్నాపురం, జంగారెడ్డిగూడెం, చింతలపూడి, కామవరపుకోట, చాట్రాయి మండలం, ఆగిరిపల్లి, పశ్చిమ గోదావరి జిల్లా తణుకు, ప్రకాశం జిల్లా ఒంగోలు, మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు, దర్శి, అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు, ఎటపాక, కూనవరం, వీఆర్పురం మండలాలు, పల్నాడు జిల్లా సత్తెనపల్లి, పిడుగురాళ్ల, క్రోసూరు తదితర ప్రాంతాల్లోనూ భూమి కంపించింది. -
మేడారంలో భూకంపం!
సాక్షి, హైదరాబాద్/ ములుగు/ ఏటూరునాగారం/ సాక్షి నెట్వర్క్: బుధవారం ఉదయం.. సమయం 7.27 గంటలు.. ములుగు జిల్లా మేడారంలోని దట్టమైన అటవీ ప్రాంతం.. ఉన్నట్టుండి ఏదో కలకలం.. ఒక్కసారిగా అంతా ఊగిపోవడం మొదలైంది.. నిమిషాల్లోనే ఇది వందల కిలోమీటర్ల దూరం వ్యాపించింది. ముఖ్యంగా గోదావరి నది పరీవాహక ప్రాంతమంతటా విస్తరించింది. తమ చుట్టూ ఉన్నవన్నీ ఊగిపోతున్నట్టుగా కనిపించడంతో జనం గందరగోళానికి గురయ్యారు.. మేడారం కేంద్రంగా వచ్చిన భూకంపం ప్రభావం ఇది. ఇక్కడ రిక్టర్ స్కేల్పై 5.3 తీవ్రతతో ప్రకంపనలు వచ్చినట్టు జాతీయ భూకంప పరిశోధన కేంద్రం (నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ – ఎన్సీఎస్) ప్రకటించింది. ఇక్కడి దట్టమైన అటవీ ప్రాంతంలో సుమారు 40 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించామని తెలిపింది. ఇంతకుముందు 1969లో భద్రాచలం వద్ద 5.7 తీవ్రతతో భూకంపం రాగా.. 55 ఏళ్ల తర్వాత ఇప్పుడు దాదాపు అదేస్థాయిలో ప్రకంపనలు రావడం గమనార్హం. అయితే భూకంపాలకు వచ్చే అవకాశం తక్కువగా ఉన్న జోన్–2, 3ల పరిధిలో తెలంగాణ ఉందని... ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ‘నేషనల్ జియోఫిజికల్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ)’శాస్త్రవేత్తలు తెలిపారు. కంపించిన సమ్మక్క, సారలమ్మ గద్దెలు భూకంప కేంద్రానికి అత్యంత సమీపంలో ఉన్న మేడారం సమ్మక్క, సారలమ్మ ఆలయం వద్ద ప్రభావం ఎక్కువగా కనిపించింది. సమ్మక్క–సారలమ్మ గద్దెలపై భక్తులు, పూజారులు ఉన్న సమయంలో వచ్చిన ప్రకంపనలతో.. అమ్మవార్ల హుండీలు, పల్లెం, ఇతర సామగ్రి కదలిపోయాయి. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి కూడా. బుధవారం మేడారం వచ్చి సమ్మక్క, సారలమ్మలను దర్శించుకున్న ములుగు కలెక్టర్ దివాకర టీఎస్ మీడియాతో మాట్లాడారు. సెపె్టంబర్ 4న దట్టమైన అటవీ ప్రాంతంలో టోర్నడోలతో వేలాది చెట్లు నేలమట్టం కావడానికి.. ఇప్పుడు వచ్చిన భూకంపానికి ఎలాంటి సంబంధం లేదని, దీనిపై అవాస్తవ ప్రచారాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల్లోనూ ప్రభావం మేడారం కేంద్రంగా వచ్చిన భూకంపం ప్రభావం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కనిపించింది. బుధవారం ఉదయం 7.27 గంటలకు భూకంపం రాగా.. సుమారు రెండు, మూడు నిమిషాల తర్వాత దూర ప్రాంతాల్లోనూ ప్రకంపనలు కనిపించాయి. భూకంప కేంద్రం నుంచి చుట్టూ సుమారు 225 కిలోమీటర్ల దూరం వరకు విస్తరించాయి. ఏపీలో ఎనీ్టఆర్ జిల్లా నుంచి విశాఖపట్నం జిల్లా వరకు స్వల్పంగా రెండు, మూడు సెకన్ల పాటు ప్రకంపనలు వచ్చినట్టు గుర్తించారు. వాటి తీవ్రత రిక్టర్ స్కేల్పై 3 పాయింట్లలోపే నమోదైనట్టు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. తెలంగాణతోపాటు పొరుగు రాష్ట్రాల్లో కలిపి వందకు పైగా ప్రాంతాల్లో ప్రకంపనలు నమోదైనట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్సీఎస్) వెబ్సైట్, భూకంప్ మొబైల్యాప్ ద్వారా వెల్లడైంది. ఇది రెండో పెద్ద భూకంపం... గోదావరి నది పరీవాహక ప్రాంతం వెంబడి రిక్టర్ స్కేల్పై 2 నుంచి 4 తీవ్రత వరకు భూకంపాలు వచ్చినా.. ఇలా 5 పాయింట్లకు పైన తీవ్రత ఉండటం అరుదని నిపుణులు చెబుతున్నారు. 1969 జూలై 5న భద్రాచలం వద్ద 5.7 తీవ్రతతో వచ్చిన భూకంపమే పెద్దది. 1983లో మేడ్చల్లో 4.8, 2021లో పులిచింతలలో 4.6 తీవ్రతతో భూకంపాలు వచ్చాయి. ఇప్పుడు మేడారంలో వచ్చిన భూకంపం గత 55 ఏళ్లలో రెండో పెద్దదిగా రికార్డయింది. రెండు తెలుగు రాష్ట్రాలను కలిపి చూస్తే... ఇది నాలుగో అతిపెద్ద భూకంపమని చెబుతున్నారు. సమ్మక్క, సారలమ్మ మహిమ అనుకున్నాం.. మేడారంలోని సారలమ్మ గద్దె వద్ద ఉదయం పూజలు చేస్తున్నాం. ఉన్నట్టుండి ఒక్కసారిగా అమ్మవార్ల గద్దెలు, గ్రిల్స్ ఊగడం మొదలుపెట్టాయి. రెండు, మూడు సెకన్లు గద్దెలు కదిలాయి. భయాందోళనకు గురయ్యా. ఇది సమ్మక్క, సారలమ్మ తల్లుల మహిమ అనుకున్నా.. తర్వాత భూకంపం అని తెలిసింది. – కాక కిరణ్, సారలమ్మ, పూజారి దేశంలోనే సురక్షిత ప్రాంతం హైదరాబాద్ భూకంపాల విషయంలో దేశంలోనే అత్యంత సురక్షిత ప్రదేశం హైదరాబాద్. తెలంగాణలోని చాలా ప్రాంతాలు దక్కన్ పీఠభూమిపై ఉండటంతో భూకంపాల ప్రమాదం చాలా తక్కువ. సాధారణంగా చూస్తే రెండు తెలుగు రాష్ట్రాలు ఒకింత సేఫ్జోన్లోనే ఉన్నాయి. అయితే గోదావరి నదికి దగ్గరిలోని పరీవాహక ప్రాంతాల్లో తీవ్రత కొంత ఎక్కువగా ఉంటుంది. వేల ఏళ్లుగా నది ప్రవాహం వల్ల భూగర్భంలో ఏర్పడే పగుళ్లు (ఫాల్ట్స్) దీనికి కారణం. 5 పాయింట్లలోపు వచ్చే భూకంపాలతో ప్రమాదమేమీ ఉండదు. భవనాలు ఊగడం, పగుళ్లురావడం వంటివి జరగొచ్చు. ఆరు, ఏడు పాయింట్లు దాటితేనే భవనాలు కూలిపోతాయి. – పూర్ణచంద్రరావు, పూర్వ డైరెక్టర్, నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ ఇక్కడ తరచూ ప్రకంపనలు సాధారణమే.. గోదావరి నది పరీవాహక ప్రాంతంలో తరచూ మనం గమనించలేనంత స్వల్ప స్థాయిలో భూకంపాలు వస్తూనే ఉంటాయి. ఈ జోన్ పరిధిలో రిక్టర్ స్కేల్పై 6 పాయింట్ల వరకు భూకంపాలు వచ్చే వీలుంది. జియోలాజికల్, టెక్టానిక్ యాక్టివిటీని బట్టి తెలంగాణ జోన్–2, జోన్–3ల పరిధిలో ఉంది. హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాలు జోన్–2లోకి వస్తాయి. ఇప్పుడు భూకంపం సంభవించిన ప్రాంతం జోన్–3లో ఉంది. ఏపీలోని ప్రకాశం, ఒంగోలు, అద్దంకి వంటివి కూడా జోన్–3లోనే ఉన్నాయి. – ఎం.శేఖర్, ప్రిన్సిపల్ సైంటిస్ట్, ఎన్జీఆర్ఐ భూమి పొరల్లో సర్దుబాటుతోనే.. భూమి లోపలి పొరల్లో అసమతౌల్యత ఉంటే సర్దుబాటు అయ్యే క్రమంలో భూకంపాలు వస్తాయి. మేడారం భూకంపం అలాంటిదే. నేల పొరల్లో సర్దుబాటు పూర్తయ్యే వరకు కంపనాలు వస్తూ ఉంటాయి. గతంలో సర్వే ఆఫ్ ఇండియా పరిశోధనల్లో హైదరాబాద్ నుంచి భద్రాచలం వరకు లినియమెంట్ ఉన్నట్టు తేలింది. అయితే భారీ వర్షాలు, పెనుగాలులకు భూకంపాలకు సంబంధం లేదు. వాటికి గ్లోబల్ వార్మింగ్ వంటి వాతావరణ మార్పులే కారణం. ఈ ఏడాది ఉత్తరార్ధ గోళంలో భీకర వర్షాలు కురిశాయి. దుబాయ్ వంటి ఎడారి దేశాల్లో వరదలు వచ్చాయి. – చకిలం వేణుగోపాల్, రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్, సర్వే ఆఫ్ ఇండియా -
రెండు రోజుల్లో 155 ప్రకంపనలు
వజిమ: జపాన్లో సోమ, మంగళవారం సంభవించిన వరుస ప్రకంపనలతో ప్రాణ, ఆస్తి నష్టం భారీగా సంభవించింది. రెండు రోజుల్లో మొత్తం 155 ప్రకంపనలు నమోదైనట్లు భూకంప విభాగం తెలిపింది. సోమవారం మధ్యాహ్నం సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.6గా నమోదు కావడంతో అధికారులు సునామీ హెచ్చరికలను జారీ చేశారు. మంగళవారం పశ్చిమ తీరంలోని ఇషికావ ప్రిఫెక్చర్లో భూకంప సంబంధిత ప్రమాద ఘటనల్లో 50 మందికి పైగా చనిపోగా మరో 16 మంది గాయపడ్డారు. పలు భవనాలు, వాహనాలు ధ్వంసం అయ్యాయి. విద్యుత్ వ్య వస్థలు దెబ్బతినడంతో సుమారు 33 వేల నివాసా లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ప్రధాన హైవేలు దెబ్బతిన్నాయి. దీంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. మళ్లీ భూ ప్రకంపనలు సంభవించే ప్రమాదమున్నందున ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు కోరారు. పశ్చిమ తీరంలోని హొన్షు దీవి నుంచి 97 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు షెల్టర్లలోకి తరలిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. జపాన్లో భూకంపం నేపథ్యంలో పొరుగునే ఉన్న రష్యా, దక్షిణ కొరియా, ఉత్తర కొరియాలు కూడా సునామీ హెచ్చరికలను జారీ చేశాయి. -
అండమాన్ నికోబార్ ద్వీపంలో భూకంపం.. ఐదు రోజుల్లో రెండోసారి..
పోర్ట్ బ్లెయిర్: ఉపఖండానికి సమీపంలోని అండమాన్ నికోబార్ ద్వీపంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 5.0 గా నమోదైనట్లు తెలిపింది నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ(NCS). ఈ రోజు తెల్లవారుజామున నికోబార్ ద్వీపాల్లో 5.40 గంటలకు 9.32 లాటిట్యూడ్ 94.03 లాంగిట్యూడ్ వద్ద ఉపరితలానికి 10 కిలోమీటర్ల లోతున భూకంపం సంభవించినట్లు తెలిపింది నేషనల్ సెంటర్ ఫార్ సీస్మాలజీ(NCS). ప్రాణనష్టం గానీ ఆస్తినష్టం గానీ జరిగినట్లు ఎక్కడా సమాచారం లేదు. గడిచిన ఐదు రోజుల్లో అండమాన్ నికోబార్లో భూకంపం సంభవించడం ఇది రెండో సారి కావడం విశేషం. గత నెల చివర్లో కూడా అండమాన్లో భూకంపం సంభవించగా రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 5.9గా నమోదైంది. హిందూ మహా సముద్ర తీరంలో వరుసగా భూకంపాలు సంభవిస్తుండటం ఆందోళనకారమే అంటున్నాయి NCS వర్గాలు. An earthquake of magnitude 5.0 on the Richter Scale hit Nicobar Islands today at around 5:40 am: National Centre for Seismology pic.twitter.com/VOyw7RKfHm — ANI (@ANI) August 2, 2023 ఇది కూడా చదవండి: మణిపూర్ అల్లర్లు: వారంతా ఏమై పోయారు? -
భూమికి నాలుగు పొరలే కాదు.. ఐదో పొర కూడా! దాని ఆకృతి ఎలా ఉందంటే?
అశోక చక్రానికి కనిపించే మూడు సింహాలతో పాటు కనిపించని నాలుగో సింహమూ ఉన్నట్టుగా, భూమికి మనకిప్పటిదాకా తెలియని ఐదో పొర ఉందట! భూగర్భం తాలూకు మిస్టరీలను ఛేదించేందుకు తాజాగా చేపట్టిన ప్రయోగాల్లో ఈ విషయం యాదృచ్ఛికంగా వెలుగుచూసిందని సైంటిస్టులు చెబుతున్నారు. భూమికి నాలుగు పొరలుంటాయని మనకిప్పటిదాకా తెలుసు.. భూమి తాలూకు ఇన్నర్ కోర్ గుండా భూకంప తరంగాలు ఎంత వేగంతో చొచ్చుకుని సాగిపోతున్నాయో తెలుసుకునేందుకు ఆస్ట్రేలియా నేషనల్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు గత దశాబ్దకాలంగా పలు ప్రయోగాలు చేస్తున్నారు. వాటిలో భాగంగా రిక్టర్ స్కేల్పై ఆరుకు పైగా తీవ్రతతో కూడిన 200కు పైగా భూకంపాల తాలూకు గణాంకాలను వారు లోతుగా విశ్లేషిస్తున్నారు. చివరికి ఈ భూకంప తరంగాలు భూమి కేంద్రకం గుండా నేరుగా ప్రయాణిస్తున్నట్టు అంచనాకు వచ్చారు. ఇన్నర్ కోర్ తాలూకు అత్యంత లోతైన భాగాలకు సంబంధించి పలు కొత్త విషయాలు ఈ అధ్యయనం ద్వారా వెలుగుచూశాయి. మరింత సమాచారం కోసం ఆ తరంగాల ప్రయాణ సమయాల్లో మార్పులను పరిశోధకులు తాజాగా మరింత లోతుగా విశ్లేషించారు. ఈ క్రమంలో భూమికి ఇప్పటిదాకా మనకు తెలియని ఐదో పొర ఉందన్న విషయం బయట పడిందని చెబుతున్నారు! ఇది భూమి లోలోతుల్లో ఘనాకృతిలోని లోహపు గోళం మాదిరిగా ఉందని చెప్పారు. ఇన్నర్ కోర్ తాలూకు కేంద్ర స్థానంలో ఇమిడిపోయి ఉన్న ఈ పొరను ప్రస్తుతానికి ‘అత్యంత లోపలి ఇన్నర్ కోర్’గా వ్యవహరిస్తున్నారు. దీనిపై మరిన్ని పరిశోధనలు చేస్తే భూ కేంద్రానికి సంబంధించి మనకెంతో ప్రయోజనకరమైన సమాచారం వెలుగుచూడొచ్చని చెబుతున్నారు. ఈ తాజా అధ్యయన ఫలితాలను జర్నల్ నేచర్ కమ్యూనికేషన్స్లో ప్రచురించారు. 20 ఏళ్ల కిందే సూత్రీకరించినా.. నిజానికి భూమి లోలోతుల్లో ఇలాంటి ఒక లోహపు గోళం ఉందని 20 ఏళ్ల కిందే సైంటిస్టులు అంచనా వేశారు. బహుశా అది ఇన్నర్ కోర్ తాలూకు లోలోతుల్లో దాగుండవచ్చని సూత్రీకరించినట్టు ఏఎన్యూ తాలూకు రీసెర్చ్ స్కూల్ ఆఫ్ ఎర్త్ సైన్సెస్లో పని చేస్తున్న డాక్టర్ థాన్సన్ వివరించారు. ఇప్పుడు దానికి సంబంధించి తిరుగులేని రుజువులు లభించడం తమను ఆశ్చర్యానందాలకు లోను చేస్తోందన్నారు. మనకిప్పటిదాకా తెలిసిన భూమి తాలూకు నాలుగు పొరలు క్రస్ట్, మాంటెల్, ఔటర్ కోర్, ఇన్నర్ కోర్. ఇలా వెలుగు చూసింది భూకంపం సంభవించినప్పుడు దాని తరంగాలు భూ కేంద్రకం గుండా సరిగ్గా భూమి అవతలి వైపు దూసుకెళ్తాయి. అనంతరం వెనుదిరిగి భూకంప కేంద్రం వద్దకు ప్రయాణిస్తాయి. ఈ క్రమంలో అలస్కాలో సంభవించిన ఓ భూకంపాన్ని పరిశోధకుల బృందం అధ్యయనం చేసింది. దాని తాలూకు తరంగాలు దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రం గుండా భూమి అవతలి వైపునకు చొచ్చుకుపోయి తిరిగి అలస్కాలోని భూకంప కేంద్రం వద్దకు చేరుకున్నాయి. ఈ తరంగాల ప్రయాణ మార్గాన్ని లోతుగా పరిశీలించే క్రమంలో ఇన్నర్ కోర్లోని ఐదో లోహపు పొర ఉనికి తొలిసారిగా వెలుగు చూసిందని పరిశోధక బృందం తాజాగా వివరించింది. ‘‘ఈ భూకంప తరంగాల ప్రయాణ ధోరణిని నిశితంగా గమనించాం. అవి దక్షిణ అట్లాంటిక్ మహాసముద్ర అంతర్భాగం నుంచి అలస్కా వైపు తిరిగొచ్చే క్రమంలో ఐదు చోట్ల నిర్దిష్ట ప్రతిస్పందనలు వెలువరిస్తూ ప్రయాణించినట్టు తేలింది. అలా ఐదో పొర ఉనికి బయట పడింది. ఇది వాస్తమేనని పలు ఇతర భూకంపాల తాలూకు తరంగాల ప్రయాణ ధోరణులను పరిశీలించిన మీదట నిర్ధారణ అయింది’ అని చెప్పుకొచ్చింది. ఐదో పొర కూర్పు ఇన్నర్ కోర్ లోతుల్లో ఉన్న ఐదో పొర ఇనుము–నికెల్ లోహ మిశ్రమంతో కూడి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమి ఇన్నర్ కోర్లోని పదార్థాల గుండా భూకంప తరంగాలు ఎలా దూసుకెళ్తాయో, నెమ్మదిస్తాయో వివరంగా తెలుసుకునే అనిసోట్రోఫీ ఆధారంగా ఈ మేరకు నిర్ధారణకు వచ్చినట్టు వారు వివరించారు. ‘ఈ తరంగాలు భూ కేంద్రం సమీపంలోని పలు ప్రాంతాలను భిన్న కోణాల్లో పదేపదే స్పృశించాయి. ఇన్నర్ కోర్ లోపలి ఘనాకృతి బయటి పొరతో పోలిస్తే భిన్నంగా ఉండొచ్చు. భూమి ఆవిర్భావ సమయంలో జరిగిన పరిణామాల వల్ల ఇన్నర్ కోర్లో ఈ ఘనాకృతి రూపుదిద్దుకుని ఉంటుంది’ అని భావిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సూర్యాపేట జిల్లా చింతలపాలెంలో కంపించిన భూమి
సాక్షి, సూర్యాపేట: చింతలపాలెం మండల కేంద్రంలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. చింతలపాలెం వాసుల్ని వరుస భూ ప్రకంపనలు వణికిస్తున్నాయి. ఆదివారం ఉదయం రెండుసార్లు భూమి కంపించింది. ఉదయం 7:40, 8:20 గంటలకు భూ ప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు తెలిపారు. రెండు రోజుల క్రితం కూడా భూమి కంపించింది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 1.8గా నమోదైనట్టు ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్త శ్రీనగేష్ ధ్రువీకరించారు. వరుస భూ ప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. భూమి కంపించడంతో జనం ఇళ్లల్లోనుంచి పరుగులు పెట్టారు. -
మహారాష్ట్రలోని పాల్ఘర్లో భూకంపం
ముంబై: మహారాష్ట్రలోని పాల్ఘర్లో గురువారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 3.7 తీవ్రతతో నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. కాగా భూకంపంతో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరిగిందనే దానిపై నివేదికలు అందలేదని పేర్కొంది. నాసిక్కు 87 కిలోమీటర్ల దూరంలో, భూమికి ఐదు కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది. ఈ నెల 21న అసోం నాగాన్లోనూ భూమి కంపించింది. రిక్టర్ స్కేల్పై 2.8 ప్రకంపనలు వచ్చాయి. తేజ్పూర్కు 18 కిలోమీటర్ల దూరంలో, భూమికి 15 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ పేర్కొంది. -
ఉత్తరాఖండ్లో భూకంపం
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశిలో గురువారం వేకువజామున 6 గంటల 12 నిమిషాలకు భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.0గా నమోదైంది. భారత వాతావరణ శాఖ వివరాల ప్రకారం.. భూకంప కేంద్రం ఉత్తరకాశి నుంచి 10 కిలోమీటర్ల దూరంలోని 30.8 ఉత్తర అక్షాంశం, 78.2 తూర్పు రేఖాంశాల మధ్య కేంద్రీకృతమైంది. కాగా ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. Earthquake of Magnitude:4.0, Occurred on:14-06-2018, 06:12:08 IST, Lat:30.8 N & Long: 78.2 E, Depth: 10 Km, Region:Uttarkashi, Uttarakhand pic.twitter.com/Jrg6NXmrJ2 — IMD-Earthquake (@IMD_Earthquake) June 14, 2018 -
తెహ్రాన్లో స్వల్ప భూకంపం
తెహ్రాన్: ఇరాన్ రాజధాని తెహ్రాన్, పరిసర ప్రాంతాల్లో బుధవారం తెల్లవారుజామున భూమి స్వల్పంగా కంపించింది. రిక్టర్ స్కేలుపై 4.2గా నమోదైంది. అయితే ఎవరూ గాయపడినట్లు సమాచారం లేదు. భూకంపం కేంద్రీకృతమైన ప్రాంతం తెహ్రాన్-అల్బోర్జ్ ప్రావిన్స్లో మలార్డ్ నగరానికి సమీపంలో ఉంది. ఇది 12 కి.మీ. లోతులో సంభవించిందని స్థానిక టీవీ పేర్కొంది. -
భయపెట్టిన భూకంపం
యూనివర్సిటీ క్యాంపస్/యాదమరి: జిల్లాలోని తమిళనాడు సరిహద్దు మండలాల్లో శనివారం అర్ధరాత్రి భూకంపం కలకలం సృష్టించింది. యాదమరి మండలంలోని తమిళనాడు సరిహద్దు గ్రామాల్లో పలుమార్లు భూమి కంపించింది. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురై ఇళ్ల నుంచి పరుగులు తీశారు. రెవెన్యూ సిబ్బంది ఆయా గ్రామాలను సందర్శించి సమాచారం సేకరించారు. ఈ వివరాలను హైదరాబాద్లోని నేషనల్ జియోగ్రాఫికల్ ఇన్స్టిట్యూట్కు సమాచారం అందించారు. చిత్తూరుకు 30 కిమీ దూరంలో అర్ధరాత్రి 01.02 గంటలకు భూ ప్రకంపనలు వచ్చాయని, వీటి తీవ్రత 2.6గా నమోదైనట్లు వారు గుర్తించారు. అయితే ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రమాదమూ లేదని, చిత్తూరు జిల్లా ప్రమాదకర జోన్లో లేదని సేఫ్ జోన్లోనే ఉందని అన్నారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని ఎస్వీయూకు చెందిన ప్రొఫెసర్లు తెలిపారు. మళ్లీ ప్రకంపనలు.. యాదమరి మండలం తాళ్లమడుగులో ఆదివారం రాత్రి 7–8గంటల మధ్య నాలుగు పర్యాయాలు కంపించింది. భూమి కదలడం, పెద్ద శబ్దాలు రావడంతో గ్రామస్తులు భయంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చేశారు. ఇళ్లలోకి వెళ్లేందుకు భయపడుతున్నారు. -
హిమాచల్ ప్రదేశ్లో భూకంపం
సాక్షి, సిమ్లా : హిమాచల్ ప్రదేశ్లోని మండి ప్రాంతంలో శుక్రవారం భూమి స్పల్పంగా కంపించింది. ఉదయం 8:09 గంటల ప్రాంతంలో సంభవించిన ఈ భూకంపంలో ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించినట్లు ఎక్కడా నమోదు కాలేదు. భూకంప తీవ్రత రెక్టర్ స్కేలుపై 4.4 పాయింట్లుగా నమోదైనట్లు భూకంప అధ్యయన కేంద్రం అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా ఈ నెల మొదటివారంలో చంబా ప్రాంతంలో ఇదే తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇలా వరుసగా భూకంపాలు సంభవిస్తుండడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. హిమాచల్ ప్రదేశ్లో 1905లో అత్యంత తీవ్ర స్థాయిలో భూంకపం సంభవించింది. ఈ ఘటనలో సుమారు 20 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. -
ఈశాన్య రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు
ఈటానగర్/అగర్తలా: ఈశాన్య రాష్ట్రాల్లో బుధవారం వేకువజామున భూ భూకంపం సంభవించింది. త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. త్రిపురలో సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.5 గా నమోదైంది. కమల్ పూర్లో పలు ఇళ్లు బీటలు వారాయి. భూకంప భయంతో ఓ వ్యక్తి మృతిచెందాడు. భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. మరోవైపు అరుణాచల్ ప్రదేశ్ లో కురుంగ్ కుమె జిల్లాలో భూ ప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేలుపై తీవ్రత 4.3గా నమోదయిందని అధికారులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
జపాన్లో భూకంపం.. తీవ్రత 5.5గా నమోదు
టోక్యో: జపాన్ తూర్పు తీరంలో శనివారం ఉదయం భూకంప సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.5 గా నమోదైందని భూకంప అధ్యయన కేంద్రం అధికారులు వెల్లడించారు. టోక్యోకు ఈశాన్యంగా 244 కిలోమీటర్ల దూరంలో 11 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ప్రాంతంలో తరచుగా భూ ప్రకంపనలు తలెత్తుతుంటాయి. దట్టమైన గాలులు వీచే అవకాశముందని సమాచారం. గత బుధవారం ఇక్కడి డైగో ప్రాంతంలో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ప్రస్తుత భూకంపం వల్ల తలెత్తిన నష్టం వివరాలు ఇంకా తెలియరాలేదు. -
భారత్-నేపాల్ సరిహద్దుల్లో భూ ప్రకంపనలు
భారత్-నేపాల్ సరిహద్దుల్లో గురువారం రాత్రి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.2గా నమోదయిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తరాఖండ్లోని పలు ప్రాంతాల్లోనూ భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా చంపావత్, నగర్ గర్హ్వాల్, అల్మోరా ప్రాంతాల్లో ఎక్కువగా ప్రకంపనలు వచ్చినట్లు అధికారులు చెప్పారు. భూ ప్రకంపనలు రావడంతో ఆందోళనకు గురైన ఆ ప్రాంతాల ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇప్పటివరకైతే ఎలాంటి ముప్పు వాటిల్లలేదని సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఇండోనేసియాలో మళ్లీ భూప్రకంపనలు
జకర్తా: ఇండోనేసియాలో గురువారం ఉదయం భూకంపం సంభవించింది. లాంబోక్ ప్రాంతంలో భూప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.2గా నమోదైందని అధికారులు తెలిపారు. అయితే ఈ వారంలో ఇండినేషియాలో భూకంపం రావడం ఇది మూడోసారి. నేటి ఉదయం మరోసారి భూప్రకంపనలు రావడంతో ప్రజలు భయంతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. కొన్ని ఇళ్లు ధ్వంసమయ్యాయి. అయితే నష్టం ఏ మేరకు వాటిల్లిందన్న విషయంలో అధికారులకు స్పష్టత రాలేదు. గత వారం రోజుల్లో ఇండోనేసియా ఉత్తర ప్రాంతంలో చాలా చోట్ల భూప్రకంపనలు సంభవించాయి. కాగా సునామీ వచ్చే అవకాశం లేదని ఇదివరకే వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. -
భూప్రకంపనలు చిన్నవే..
ఆందోళన వద్దు కలెక్టర్ జానకి నెల్లూరు(పొగతోట): ఉదయగిరి, వింజ మూరు, వరికుంటపాడు ప్రాంతాల్లో సంభవిస్తున్న భూప్రకంపనలు చిన్నవే అని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని కలెక్టర్ ఎం.జానకి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 2015 అక్టోబర్ నుంచి వస్తున్న భూప్రకంపనలు రిక్టర్ స్కేల్పై తక్కువగా నమోదవుతున్నాయని తెలిపారు. శనివారం వింజమూరు ప్రాంతంలో వచ్చిన భూప్రకంనాలు రిక్టర్ స్కేల్పై 2.5 నమోదు అయిందని తెలిపారు. వరికుంటపాడు, వింజమూరు మండలాల్లో భూకంప గుర్తింపు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. భూకంపనాలు భూగర్భంలో 3 నుంచి 5 కిలోమీటర్ల లోతులో సంభవిస్తున్నాయని శాస్త్రవేత్తలు తెలియజేశారని పేర్కొన్నారు. భూకంపనాలపై శాస్త్రవేత్తలు 24 గంటలు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. -
ఫ్రాన్స్ లో భూకంపం, రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.2
పారిస్: ఫ్రాన్స్ లో గురువారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూప్రకంపనల తీవ్రత 5.2గా నమోదయినట్లు అధికారులు వెల్లడించారు. ఫ్రాన్స్ లోని లా రోచెల్ నగరంలో, సమీప ప్రాంతాల్లో స్వల్ప ప్రకంపనలు సంభవించాయి. 2014 తర్వాత ఫ్రాన్స్ దేశంలో చోటుచేసుకున్న అతిపెద్ద భూకంపం ఇదేనని సెంట్రల్ ఫ్రెంచ్ అధికారులు వెల్లడించారు. ఎంతమేరకు నష్టం వాటిల్లిందన్న వివరాలు ఇంకా తెలియరాలేదు. -
జపాన్లో మరో భారీ భూకంపం, 13 మంది మృతి
రిక్టర్స్కేల్పై 7.2గా తీవ్రత కుమమొటోను మళ్లీ కుదిపేసిన భూకంపం టోక్యో: జపాన్లోని కుమమొటో ప్రాంతాన్ని మరో భూకంపం కుదిపేసింది. రిక్టర్స్కేల్పై 7.2 తీవ్రతతో శనివారం (స్థానిక సమయం) తెల్లవారుజామున 1.25 గంటలకు భూకంపం దక్షిణ జపాన్లోని కుమమొటోలో అలజడి సృష్టించింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 13 మంది మృతిచెందినట్లు అధికారికంగా సమాచారం. మృతుల సంఖ్య ఇంకా ఎక్కువ ఉండొచ్చని తెలుస్తోంది. మరో 760 మంది గాయపడ్డారు. భారీ భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. దాంతో పలువురు శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు అక్కడ ప్రభుత్వ అధికారులు తెలిపారు. మనిమా సమీపంలోని ఓ అపార్ట్ మెంట్ శిథిలాల కింద 11మంది చిక్కుకున్నారని, అయితే వారు ప్రాణాలతో ఉన్నారా లేదా అనేది తెలియటం లేదన్నారు. కాగా మీటరు ఎత్తువరకు సముద్రం ఎగిసిపడి ముందుకు రావచ్చంటూ వాతావరణ సంస్థ సునామీ హెచ్చరికలు జారీచేసి గంట అనంతరం ఉపసంహరించుకుంది. తాము ఇళ్లల్లో చిక్కుపోయామని పలువురు మీడియాకు ఫోన్ చేసి చెప్పారు. భూకంపం తర్వాత అనేక చిన్నపాటి ప్రకంపనలొచ్చాయి. ‘మషికి’ పట్టణంలో భారీ సంఖ్యలో అత్యవసర వాహనాల శబ్దాలు వినిపించాయి. అయితే ఆస్తి, ప్రాణ నష్టంపై మాత్రం వివరాలు తెలియరాలేదు. మషికి పట్టణంలోని టౌన్హాలు బయట రోడ్డుకు భారీ పగులు ఏర్పడింది. పలువురు బిల్డింగుల్లో చిక్కుకుని సాయం కోసం అర్థించారు. తాజా భూకంప కేంద్రం మొన్నటి భూకంప కేంద్రానికి ఆగ్నేయంలో 12 కి.మి దూరంలో ఉన్నట్లు గుర్తించారు. భూమికి 10కిలోమీటర్లలోతులో ఇది ఉంది. గురువారం కుమమొటోలో భూకంప సంభవించి 9 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. -
నెల్లూరులో భూకంపం
జిల్లాలోని వరికుంట పాడు, దుత్తలూరు, ఉదయగిరి మండలాల పరిధిలోని పలు గ్రామాల్లో ఆదివారం మధ్యాహ్నాం 12.15 గంటల సమయంలో భూకంపం సంభవించింది. సుమారు 2 సెకన్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. గత మూడు నెలల్లో భూమి కంపించడం ఇది నాలుగోసారి. ఎప్పుడు మళ్లీ భూమి కంపిస్తుందోనని ప్రజలు ఆందోళనలో ఉన్నారు. రిక్టర్ స్కేలుపై భూకంపతీవ్రత ఎంత నమోదు అయిందనే వివరాలు తెలియాల్సి ఉంది. -
గ్రీకులో భూకంపం, రిక్టర్ స్కేలుపై 6.7గా నమోదు
ఏథెన్స్ : గ్రీకు పశ్చిమ భాగంలో మంగళవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.7గా నమోదైందని గ్రీకు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. లెఫ్కడ ద్వీపంలో భూప్రకంపనలు సంభవించాయి. ప్రాణ, ఆస్తి నష్టం సంభవించిందా లేదా అన్న వివరాలు తెలియాల్సి ఉంది. భూకంప కేంద్రం మధ్యధరాసముద్రంలో ఏర్పడి ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు. -
ఇండోనేషియాలో భూకంపం
జకర్తా: ఇండోనేషియాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.9 గా నమోదైంది. సముద్ర తీరప్రాంతం సోరంగ్ నగరంలో గురువారం రాత్రి స్వల్పంగా భూమి కంపించింది. అయితే, ఈ విషయాన్ని అమెరికా భూవిజ్ఞానశాస్త్ర విభాగం వెల్లడించింది. ఎలాంటి సునామీ హెచ్చరికలు వెలువడలేదని సమాచారం. -
ఇండోనేషియాలో భూకంపం
జకర్తా: ఇండోనేషియాలో మంగళవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 6.0గా నమోదైంది. ఈ మేరకు ఇండోనేషియా వాతావరణ, జియో ఫిజిక్స్ ఎజెన్సీ అధికార ప్రతనిధి మాట్టాడుతూ సునామీ సృష్టించేంత తీవ్రంగా భూకంపం సంభవించకపోయినప్పటికీ ప్రజలను భయాందోళనకు గురిచేసే స్థాయిలో భూమి పలుసార్లు కంపించిందని చెప్పారు. ఉత్తర సులవేసి ప్రావిన్స్లోని సంఘీ ద్వీపానికి 71 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. -
అండమాన్లో భూకంపం: తీవ్రత 5.2 గా నమోదు
న్యూఢిల్లీ: అండమాన్ నికోబార్ దీవుల్లో శుక్రవారం అర్థరాత్రి భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 5.2 గా నమోదు అయిందని భారత వాతావరణ శాఖ శనివారం వెల్లడించింది. అండమాన్కు 38 కిలోమీటర్లు దూరంలో భూకంప కేంద్రం గుర్తించినట్లు తెలిపింది. అయితే ఎక్కడ ఎలాంటి ఆస్తి నష్టం... ప్రాణ నష్టం కానీ సంభవించినట్లు సమాచారం అందలేదని వాతావరణ శాఖ పేర్కొంది. -
ఆదమరచి ఉండగా దెబ్బతీసింది
తాజా భూకంపంపై నేపాల్ ప్రధాని కఠ్మాండు: పెను విధ్వంసం సృష్టించిన ఏప్రిల్ 25 భూకంపం నుంచి కోలుకుంటూ పునర్నిర్మాణ చర్యల్లో తమ ప్రభుత్వం నిమగ్నమై ఉండటంతో.. తాజాగా మంగళవారం సంభవించిన భూకంపాన్ని ఎదుర్కోలేకపోయామని నేపాల్ ప్రధానమంత్రి సుశీల్ కొయిరాలా పేర్కొన్నారు. ‘‘మేం ఆదమరచి ఉండగా దెబ్బతీసింది’’ అని చెప్పారు. రిక్టర్ స్కేలుపై 7.3 తీవ్రతతో నమోదైన తాజా భూకంపం ప్రభావాన్ని పరిశీలించేందుకు ఆయన గురువారం దోలఖా ప్రాంతంలో పర్యటించారు. కాగా, తాజా భూకంపంలో మృతుల సంఖ్య 110కి పెరిగింది. -
ఏపీలో మళ్లీ భూప్రకంపనలు..
వివిధ జిల్లాల్లో స్వల్పంగా కంపించిన భూమి ఇళ్ల నుంచి జనం పరుగులు విజయవాడ బ్యూరో: రాష్ట్రంలో మరోసారి భూప్రకంపనలు కలవరపెట్టాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళవారం భూమి స్వల్పంగా కంపించింది. 20 రోజుల వ్యవధిలోనే రెండు పర్యాయాలు భూప్రకంపనలు రావడంతో ప్రజలు హడలిపోతున్నారు. గత నెల 25న నేపాల్ సమీపంలోని భూకంప కేంద్రం నుంచి వచ్చిన భూప్రకంపనలు ఏపీలోని పలుప్రాంతాలను తాకిన విషయం తెలిసిందే. మంగళవారం మరోసారి నేపాల్లో వచ్చిన భూకంపం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోనూ ప్రభావం చూపింది. రాజధాని ప్రాంతమైన విజయవాడలో మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో పది సెకన్లపాటు భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 5 నుంచి 6 మధ్య ఉంటుందని అర్బన్ తహసీల్దార్ ఆర్.శివరావు ‘సాక్షి’కి చెప్పారు. విజయవాడ గుణదల సిస్మోలాజికల్ ల్యాబ్లో భూకంప లేఖిని నమోదు చేసిన వివరాలను బుధవారం అధికారికంగా వెల్లడిస్తారన్నారు. విజయవాడలో గవర్నర్పేట, బెంజిసర్కిల్, కృష్ణలంక, భవానీపురం ప్రాంతాల్లో భూప్రకంపనలకు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కృష్ణా జిల్లాల్లోని కంచికచర్ల, నందిగామ, జగ్గయ్యపేట ప్రాంతాల్లోను భూప్రకంపనలు వచ్చాయి. గుంటూరు, విశాఖ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లోనూ భూప్రకంపనలు సంభవించినట్టు చెబుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ, రాజమండ్రి, అమలాపురం ప్రాంతాల్లో భూప్రకంపనలకు ప్రజలు కంగారుపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఆకివీడు, భీమవరం, పాలకొల్లు, నర్సాపురం ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించాయి. -
తమిళనాడుకు భూకంప ముప్పు
భూకంపంపై నిపుణుల హెచ్చరిక రిక్టర్స్కేల్పై 6గా అంచనా అప్రమత్తం కావాలన్న నిపుణులు నేపాల్లో సంభవించిన భూకంపం వేలాది మందిని పొట్టనపెట్టుకోగా తమిళనాడుకు సైతం ఈ భూకంప ఉపద్రవం పొంచి ఉందని నిపుణులు చెబుతున్నారు. భూకంపంపై తమిళనాడు కూడా అంత సురిక్షితమైనది కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. భూకంప దశల్లో తమిళనాడు మూడవ దశగా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చెన్నై, సాక్షి ప్రతినిధి:భూకంపాన్ని ఐదు దశలుగా నిపుణులు విభజిం చారు. ఇందులో ఐదవ దశ చాలా తీవ్రంగా ఉంటుందని, ఇందులో తమిళనాడు మూడో దశ పరిధిలో ఉందని అంచనా వేశారు. ఈరకంగా మూడవ దశలో తమిళనాడులో సం భవించే భూకంపం రిక్టర్స్కేల్పై 6వ నంబర్ సూచించే అవకాశం ఉందని అంటున్నారు. రిక్టర్ స్కేల్పై 6వ నంబరు సూచించే స్థాయిలో భూకంపం గనుక సంభవిస్తే చెన్నై, కోవై, మదురై, నాగపట్నం, తంజావూరు, పుదుచ్చేరి తదితర నగరాలపై తీవ్రప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు. చెన్నై నగరాన్ని పరిశీలిస్తే లెక్కకు మించి పురాతన కట్టడాలు ఉండగా అదే తీవ్రతతో భూకం పం సంభవిస్తే అవన్నీ నేలమట్టం కావడం ఖాయమని హెచ్చరిస్తున్నారు. అలాగే చెన్నైలో కొత్తగా నిర్మాణం జరుపుకున్న, జరుపుకుంటున్న ఆకాశహార్మ్యాలు సైతం భూకంపాన్ని తట్టుకునేస్థాయిలో లేవని వారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అన్నా యూనివర్సిటీ మాజీ డీన్ ప్రొఫెసర్ శాంతకుమార్ మీడియాతో మాట్లాడుతూ, చెన్నైలోని కొత్తగా నిర్మించిన అన్ని నిర్మాణాల్లోనూ కార్పార్కింగ్ కోసం భూమి అడుగుభాగంలో స్తంభాలతో ఏర్పాటు చేశారని తెలిపారు. భారీ భవంతులను మోస్తున్న ఈ స్థంభాలు భూకంపాన్ని తట్టుకోగలవా అనే సందేహాలు ఉన్నాయని చెప్పారు. ఇలా నిర్మించే స్థంభాలు కనీసం ఒక అడుగు వైశాల్యంలో ఉండాలని, పది అంతకు మించి అంతస్థులు కట్టినట్లయితే ఒక మీటరు వైశాల్యంలో స్థంభాలు నిర్మించాల్సి ఉందని చెప్పారు. భూకంపాన్ని తట్టుకునేలా స్థంభాలు నిర్మించాలంటే మొత్తం పెట్టుబడిలో 25 శాతం స్థంభాలకే ఖర్చుచేయాలని అన్నారు. చెన్నై నగరంలో రిక్టర్స్కేల్పై ఆరో నంబర్ స్థాయికి భూకంపం సంభవిస్తే నగర సముద్రతీర ప్రాంతాలైన అడయారు పరిసరాల్లో తీవ్ర నష్టం సంభవిస్తుందని చెప్పారు. ఎందుకంటే అక్కడి భూమిలోపలి మట్టి చాలా వదులుగా ఉందని తెలిపారు. సముద్రతీరంలోని అన్ని నిర్మాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం లేకపోలేదని ఆయన అన్నారు. ప్రజా పనుల శాఖ సలహాదారు ఎం రాజీ మాట్లాడుతూ, గత 10 ఏళ్ల కాలాన్ని పరిశీలిస్తే ఏడాదికి రూ.1000 కోట్ల విలువైన నిర్మాణాలు సాగుతున్నాయని అన్నారు. ఈ కొత్త నిర్మాణాలన్నీ భూకంపాన్ని తట్టుకునే పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్నాయని తెలిపారు. దేశస్థాయిలో జరిగిన సర్వేలో తమిళనాడులో కావేరీ, వైగై నదీతీరాల్లో , కన్యాకుమారి సముద్రతీరంలో భూకంపం సంభవించే అవకాశాలు ఉన్నాయని తేలిందని చెప్పారు. దేశం మొత్తం మీద 38 నగరాలు భూకంపాన్ని తట్టుకోలేని ప్రమాద స్థితిలో ఉన్నట్లు తేలిందని నిపుణులు చెప్పారు. భూగోళంలో ఏర్పడుతున్న మార్పులు వల్ల భారత భూభాగం ఈశాన్యదిశగా జరుగుతున్న చెబుతున్నారు. ఈ పరిణామమే ఈశాన్య భారతంలో భూకంపాలకు దారితీస్తున్నదని, 2005లో ఆక్రమిత కశ్మీర్ ప్రాంతంలో ఏర్పడి భూకంపం ధాటికి 80 వేల మంది మృత్యువాత పడిన విషయాన్ని వారు ఉదహరించారు. 2004లో సంభవించిన భూకంపంలో రిక్టర్స్కేలుపై నమోదైన 9.3 తీవ్రత వల్ల 14 దేశాల్లో భూమిలోని పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకున్నాయని వారు చెప్పారు. ఆ తరువాతనే భారతదేశంలో శ్రీనగర్, గువాహుటీలు 5వ దశస్థాయిలో భూకంపానికి గురైనాయని అన్నారు. డిల్లీ నాల్గవ స్థాయిలో, చెన్నై, ముంబయి, కోల్కత్తా మూడోదశ స్థాయిలో ఉన్నట్లు వారు అంచనావేశారు. భూమి అడుగుభాగంలో ఏక్షణమైనా కదలికలు ఏర్పడవచ్చని, భూకంపం చోటుచేసుకోవచ్చని వారు హెచ్చరిస్తున్నారు. 37 మంది ఆచూకీ కోసం ఆందోళన: ఇదిలా ఉండగా, తమిళనాడు నుండి పర్యాటకులుగా నేపాల్ వెళ్లిన 37 మంది ఆచూకీ లభించక ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రం నుండి మొత్తం 387 మంది నేపాల్ వెళ్లగా వీరిలో 158 మంది చెన్నైకి చెందిన వారు. వీరిలో అధికశాతం సురక్షితంగా తమిళనాడుకు చేరుకున్నారు. అయితే మరో 37 మంది ఆచూకీ లేదు. ఫోన్ ద్వారా కూడా వారి సమాచారం అందకపోవడంతో అధికారుల వద్ద బంధువులు బావురుమంటున్నారు. -
నేపాల్లో మళ్లీ భూప్రకంపనలు
ఖాట్మండు: నేపాల్లో పెను భూకంపం మంచు నేలను మట్టి దిబ్బలా మార్చేసిన ఘటన మరవకముందే భూమి మరోసారి కంపించింది. తాజాగా ఆదివారం తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో పలుచోట్ల మళ్లీ భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.6గా నమోదైంది. ఇప్పటికే నేలమట్టమైన ప్రదేశాల్లో శిధిలాలను తొలగించే దిశగా నేపాల్లో సహాయక చర్యలు కొనసాగుతునే ఉన్నాయి. ఈ సహాయక చర్యల్లో 40మంది ఎన్డీఆర్ఎఫ్ బృందం, 50మంది వైద్యులు పాల్గొన్నారు. నేపాల్కు 3 టన్నుల మెడిసిన్స్, సహాయ సామాగ్రిని భారత్ పంపినట్టు అధికారులు తెలిపారు. మరోవైపు భారతీయుల తరలింపు ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ప్రత్యేక విమానంలో ఇప్పటికే 103మంది భారతీయులు ఢిల్లీకి చేరుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు 200మందికి పైగా మృతదేహాలు వెలికితీసినట్టు అధికారులు పేర్కొన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. -
ముందే ఊహించారు!
ఇండియన్, యురేసియన్ టెక్టానిక్ ప్లేట్లు ఒకదానిలోకి ఒకటి చొచ్చుకుపోయే ప్రాంతం(ఫాల్ట్)ను ‘మెయిన్ ఫ్రంటల్ థ్రస్ట్(ఎంఎఫ్టీ)’ ఫాల్ట్గా పిలుస్తారు. అయితే, ఈ ఫాల్ట్ ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 8 తీవ్రతతో భారీ భూకంపం వచ్చే అవకాశముందని సీఎస్ఐఆర్కు చెందిన ‘సెంటర్ ఫర్ మ్యాథమెటికల్ మాడలింగ్ అండ్ కంప్యూటర్ సిమ్యులేషన్’ సంస్థ భూకంప శాస్త్రవేత్త వినోద్ కుమార్ గౌర్ 2013లోనే అంచనా వేశారు. ఎంఎఫ్టీ ఫాల్ట్లో ఒత్తిడి తీవ్రంగా పెరిగిందని, దాని వల్ల 8 తీవ్రతతో భూకంపం వచ్చే అవకాశముందని వెల్లడించారు. కానీ, భూకంపం కచ్చితంగా ఎప్పుడు వస్తుందో తెలియదని, ఈ శతాబ్దాంతంలోగా ఎప్పుడైనా రావొచ్చన్నారు. నేపాల్లో ఉన్న ఎంఎఫ్టీ ఫాల్ట్ ప్రాంతంలో భూకంపాల చరిత్రకు సంబంధించి సింగపూర్కు చెందిన నాన్యాంగ్ టెక్నలాజికల్ వర్సిటీ బృందం కూడా ఇటీవలి అధ్యయనాల్లో పలు ఆధారాలను కనుగొంది. భారీ భూకంపాలు వచ్చినచోట్ల భవిష్యత్తులోనూ అదే స్థాయి భూకంపాలు రావొచ్చని అంచనా వేసింది. -
భారత్లోనూ భారీ విధ్వంసం
* భూకంపం ధాటికి దేశవ్యాప్తంగా 51 మంది మృతి; * 237మందికి పైగా గాయాలు * బిహార్లో 38 మంది, యూపీలో 11 మంది, పశ్చిమబెంగాల్లో ఇద్దరు మృత్యువాత * యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు; స్వయంగా సమీక్షించిన ప్రధాని * నేపాల్కు భారత్ తక్షణ సాయం; ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, సామగ్రితో బయల్దేరిన 4 విమానాలు * నేపాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశం పంపేందుకు ప్రయత్నాలు న్యూఢిల్లీ: పొరుగుదేశం నేపాల్లో దారుణ విధ్వంసం సృష్టించిన తీవ్ర భూకంపం భారత్ను కూడా కుదిపేసింది. ముఖ్యంగా నేపాల్ సరిహద్దు రాష్ట్రమైన బిహార్లో దీని ప్రభావం తీవ్రంగా ఉంది. ఆ రాష్ట్రంలో భూకంపం వల్ల ఇళ్లు, గోడలు కూలిన ఘటనల్లో 23 మంది మరణించగా, 48 మంది గాయాలపాలయ్యారు. ఉత్తర, తూర్పు, ఈశాన్య భారత రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో ఇళ్లు, భవనాలు ధ్వంసమయ్యాయి. దక్షిణాది రాష్ట్రాలు సహా పలు ఇతర రాష్ట్రాల్లో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రిక్టర్ స్కేల్పై 7.9 తీవ్రతతో శనివారం నేపాల్ను దాదాపు నేలమట్టం చేసిన భూకంపం ప్రభావం కఠ్మాండుకు 1,100 కిమీల దూరంలో ఉన్న భారతదేశ రాజధాని ఢిల్లీలోనూ కనిపించింది. మొత్తంమీద భూకంపం ధాటికి భారత్లో 38 మంది చనిపోగా, 100 మందికి పైగా గాయపడ్డారు. ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలను యుద్ధప్రాతిపదికన ప్రారంభించారు. వాటిని ప్రధాని మోదీ స్వయంగా సమీక్షించారు. భారత ప్రధాని నరేంద్రమోదీ నేపాల్ అధ్యక్షుడు రాం బరన్ యాదవ్, ప్రధాని సుశీల్ కొయిరాలకు ఫోన్ చేసి భారత్ తరఫున తక్షణ సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం, భారత్లోని ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి సహాయక చర్యలపై ఆరా తీశారు. ఢిల్లీలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. నేపాల్కు, దేశంలోని భూకంప ప్రభావిత ప్రాంతాలకు తక్షణమే రక్షణ, సహాయ సిబ్బందిని.. పునరావాస సామగ్రిని పంపించాలని ఆదేశించారు. నేపాల్లో చిక్కుకుపోయిన భారతీయ పర్యాటకులను సురక్షితంగా భారత్ తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శనివారం రాత్రి సీ 130 విమానంలో దాదాపు 250 మంది భారతీయులు ఇండియా చేరుకున్నారు. తక్షణం స్పందించిన భారత్ నేపాల్లో జరిగిన భూ విలయంపై భారత్ తక్షణం స్పందించింది. ఒక సీ 130 విమానం సహా నాలుగు విమానాల్లో సహాయ సామగ్రిని, జాతీయ విపత్తు స్పందన దళానికి చెందిన(ఎన్డీఆర్ఎఫ్) రక్షక సిబ్బందిని కఠ్మాండుకు తరలించింది. భారత్లోని నేపాల్ దేశీయుల కోసం విదేశాంగ శాఖ ఒక 24 గంటలపాటు పనిచేసే ఒక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసింది. కేంద్రమంత్రులు రాజ్నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ, జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్, ఎన్డీఆర్ఎఫ్ ఉన్నతాధికారులతో ప్రధాని మోదీ.. భూకంపం సృష్టించిన విధ్వంసం, నేపాల్కు అందిస్తున్న సాయం, భారత్లోని ప్రభావిత రాష్ట్రాల్లో చేపట్టిన సహాయక చర్యలు.. తదితరాలపై సమీక్షించారు. నేపాల్ అభ్యర్థనపై కొన్ని ఇంజినీరింగ్ బృందాలను, వైద్య బృందాలను, మొబైల్ ఆసుపత్రులను పంపిస్తున్నామని విదేశాంగశాఖ కార్యదర్శి జైశంకర్ తెలిపారు. నేపాల్లో చిక్కుకుపోయిన భారతీయులు అక్కడి ఇండియన్ ఎంబసీని సంప్రదించాలని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ట్వీట్ చేశారు. ఖట్మండూ నుంచి భారతీయులను తరలించేందుకు ఎయిర్ ఇండియా, ఇండిగో సంస్థలకు చెందిన విమానాలు సిద్ధంగా ఉన్నాయని కేంద్ర పౌర విమానయాన సహాయమంత్రి మహేశ్ శర్మ తెలిపారు. కఠ్మాండులోని ఏటీసీ(ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్)ని ప్రస్తుతం మూసేశారని, దాన్ని పునఃప్రారంభించగానే కఠ్మాండుకు విమాన సేవలు మొదలవుతాయని చెప్పారు. కఠ్మాండు విమానాశ్రయం మూతపడటంతో కఠ్మాండు వెళ్లాల్సిన అన్ని అంతర్జాతీయ విమానాలను ఢిల్లీకి, కఠ్మాండుకు దగ్గర్లోని విమానాశ్రయాలకు మళ్లిస్తున్నామన్నారు. భారత్ స్పందనపై నేపాల్ కృతజ‘తలు తెలిపింది. నేపాల్నుంచి 55 మంది భారత్కు భారతీయ వైమానిక దళానికి చెందిన సీ 130 జే విమానం శనివారం రాత్రి నేపాల్ నుంచి55 మంది భారతీయులను ఢిల్లీకి చేర్చింది. వారిలో నలుగురు చిన్నారులున్నారు. భారత్ నుంచి జాతీయ విపత్తు స్పందన దళం(ఎన్డీఆర్ఎఫ్) సిబ్బందిని, సహాయ సామాగ్రిని నేపాల్కు పంపించి, అక్కడ చిక్కుకుపోయిన వారిని స్వదేశానికి తీసుకురావడం కోసం ఈ విమానంతో పాటు మరో రెండు ఐఏఎఫ్ విమానాలను(ఐఎల్ 76, సీ 17) ఖట్మాండూ పంపించినట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు. భారత్ నుంచి శనివారం మధ్యాహ్నం కఠ్మాండు వెళ్లిన ఐఎల్ 76లో 153 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, 28 టన్నుల సహాయ సామగ్రిని పంపించగా, సీ17లో 96 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, 15 టన్నుల సహాయ సామగ్రిని పంపించారు. ఈ రెండు విమానాలు కూడా నేపాల్లో చిక్కుకుపోయిన భారతీయులతో ఆదివారం ఉదయం వరకు ఢిల్లీ చేరుకునే అవకాశముంది. ప్రముఖుల ప్రార్థనలు నేపాల్కు అన్ని విధాలుగా సాధ్యమైనంత సాయం అందించేందుకు భారత్ కట్టుబడి ఉందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తెలిపారు. భూకంపం వల్ల సంభవించిన ఆస్తి,ప్రాణ నష్టంపై ఆవేదన వ్యక్తం చేశారు. భూకంపంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. భూకంప బాధితుల కోసం ప్రార్థించానని సోనియా తెలిపారు. ప్రాణ, ఆస్తి నష్టం అత్యంత కనిష్టంగా ఉండాలని భావిస్తున్నానన్నారు. భూకంపం బారిన పడిన నేపాల్, భారత్లకు అవసరమైన సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రకటించారు. సిక్కింలో విరిగిపడ్డ కొండ చరియలు తమిళనాడు, పుదుచ్చేరీ తమిళనాడు, పుదుచ్చేరీల్లో శనివారం స్వల్పంగా భూమి కంపించింది. సరిగ్గా ఉదయం 11.45 గంటల సమయంలో చెన్నై నగరంలోని కోడంబాక్కంలో భూమి కంపించింది. ఇళ్లలోని వస్తువులు కదలడంతో భూకంపంగా గుర్తించి ప్రజలు బైటకు పరుగులు తీశారు. వడపళని, మైలాపూర్, అంబత్తూరు గిండిలో ఎక్కువగా నివాస ప్రాంతాలు కావడంతో అపార్టుమెంట్లలో నివసించే కుటుంబాలు బయటకు పరుగులు పెట్టారు. ఎటువంటి ప్రాణనష్టం, ఆస్తినష్టం జరగలేదు. బిహార్ నిన్నటివరకు వరదలు, తాజాగా భూకంపం బిహార్ను అతలాకుతలం చేశాయి. ఈ నేపాల్ సరిహద్దు రాష్ట్రంలో భూకంపం విధ్వంసానికి తూర్పు చంపారన్ జిల్లాలో ఆరుగురు, సీతామర్హిలో నలుగురు, దర్భంగ జిల్లాలో ఇద్దరు సహా మొత్తం 23 మంది బలయ్యారు. పశ్చిమబెంగాల్ పశ్చిమబెంగాల్లో ముగ్గురు చనిపోగా, 43 మంది పాఠశాల విద్యార్థులు సహా 69 మంది గాయాలపాలయ్యారు. పశ్చిమబెంగాల్కు సంబంధించి డార్జిలింగ్లో ఇద్దరు, జల్పైగురిలో ఒకరు చనిపోయారు చనిపోగా, మాల్దా జిల్లాలో భవనాలు కూలిన 69 మంది గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్ భూకంపం వల్ల ఉత్తరప్రదేశ్లో 12 మంది చనిపోయారు. డజనుమందికి పైగా గాయపడ్డారు. బారాబంకి జిల్లాలో ముగ్గురు, గోరఖ్పూర్లో రెండున్నరేళ్ల చిన్నారి సహా ఇద్దరు, సంత్ కబీర్ నగర్ జిల్లాలో ఒకరు మరణించారు. -
భూవిలయం నేపాల్ నేలమట్టం
నేపాల్లో పెను భూకంపం.. 1,500 మందికిపైగా మృతి రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.9 భారత్ లో 51 మంది మృతి ► వేలాది మందికి గాయాలు.. వందలాది మంది ఆచూకీ గల్లంతు ► మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ► వణికిపోయిన కఠ్మాండు.. ఆస్తి, ప్రాణనష్టం ఇక్కడే ఎక్కువ ► ఎటు చూసినా మట్టి దిబ్బలు.. మొండి గోడలు.. చీలిన దారులు ► రోడ్డు, రవాణా, సమాచార వ్యవస్థలు ఛిన్నాభిన్నం ► దర్హారా టవర్ నేలమట్టం.. శిథిలాల కింద 200 మంది మృతి ► తీవ్రంగా దెబ్బతిన్న ప్రపంచ వారసత్వ సంపద ‘దర్బార్ స్క్వేర్’ ► పలు ఆలయాలు ధ్వంసమైనా చెక్కుచెదరని పశుపతినాథ్ ఆలయం ► ఆంధ్రప్రదేశ్, బిహార్, పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్లోనూ ప్రకంపనలు ► చైనా, భూటాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్లోనూ ప్రభావం నేపాల్ గుండె చెదిరింది! కాళ్ల కింది నేలే కాలరేకపై కన్నీళ్ల చరిత్రను లిఖించింది! హిమాలయ రాజ్యాన్ని మృత్యువులా చుట్టుముట్టి నిలువునా వణికించింది. ప్రకృతి ఒడిలో ఒద్దికగా ఒదిగిన దేశం పంచప్రాణాలను పిండేసింది. పుడమితల్లి ప్రకోపంలో 1,500 మందికి పైగా ప్రాణాలు మట్టి దిబ్బల కింద ముగిసిపోయాయి. నేపాల్లో గత 81 ఏళ్లలో కనీవినీ ఎరుగని ఘోర విపత్తు ఇది!! భూకంప ధాటికి చారిత్రక భవనాలు నామరూపాల్లేకుండా కూలిపోయాయి. జనావాసాలు మొండి గోడల్లా మిగిలిపోయాయి. శిథిలాల కింద నలిగి వేలాది మంది గాయాలపాలయ్యారు. భూకంప కోరలు భారత్కూ విస్తరించాయి. వివిధ రాష్ట్రాల్లో 51 మంది చనిపోయారు. బిహార్లోనే 23 మంది మృత్యువాత పడ్డారు. నేపాల్లో మట్టి దిబ్బల కింద నుంచి అభాగ్యుల ఆర్తనాదాలు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. శనివారం నేపాల్ రాజధాని కఠ్మాండుకు 80 కిలోమీటర్ల దూరంలోని లమ్జంగ్ కేంద్రంగా పెను భూకంపం మిగిల్చిన విషాద ఛాయలివి! కఠ్మాండు: నేపాల్లో పెను భూకంపం మంచు నేలను మట్టి దిబ్బలా మార్చేసింది. ఉదయం సరిగ్గా 11.56 గంటలకు సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.9గా నమోదైంది. 1934లో నేపాల్-బిహార్ సరిహద్దుల్లో 8.4 తీవ్రతతో వచ్చిన భూకంపం తర్వాత మళ్లీ అంతటిస్థాయిలో భూమి కంపించడం ఇదే తొలిసారి. మొదటిసారి భూమి కంపించిన తర్వాత కూడా వెంట వెంటనే వచ్చిన ప్రకంపనలు ప్రజలను బెంబేలెత్తించాయి. 4.5, అంతకన్నా ఎక్కువ తీవ్రతతో 25 సార్లు భూమి కంపించింది. ఉపరితలం నుంచి 15 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. భూకంపం తీవ్రత నేపాల్కే పరిమితం కాలేదు. భారత్లోని బిహార్, పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కేరళ తదితర రాష్ట్రాలతోపాటు ఈశాన్య ప్రాంతాలనూ కుదిపేసింది. చైనా, భూటాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ల్లో కూడా ప్రభావం కనిపించింది. ‘ఈ ఘోర విపత్తులో కనీసం 1,457 మంది చనిపోయి ఉంటారు. వందల మంది ఆచూకీ గల్లంతైంది. బర్పాక్ లర్పాక్ ప్రాంతంలోనే దాదాపు వెయ్యి ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి’ అని నేపాల్ ఆర్థిక మంత్రి రాం శరణ్ మహత్ తెలిపారు. సహాయ కార్యక్రమాలు చురుగ్గా కొనసాగుతున్నాయి. శిథిలాలు తొలగించే కొద్దీ మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. చాలా ఆలయాలు దెబ్బతిన్నా ఆశ్చర్యకరంగా కఠ్మాండులోని ఐదో శతాబ్దం నాటి ప్రఖ్యాత పశుపతినాథ్ దేవాలయం చెక్కుచెదరకుండా నిలిచింది. నగరంలోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేిశారు. ఇప్పటివరకు భక్తపూర్లో 150, సింధులో 250, లలిత్పూర్లో 67, ధడింగ్ జిల్లాలో 37 మంది మృత్యువాత పడ్డట్టు హోంశాఖ వెల్లడించింది. ఓ పర్వతారోహకుడు సహా నలుగురు చైనీయులు కూడా మరణించారు. ఈ ఘోర విపత్తులో ప్రపంచ దేశాలు తమకు ఉదారంగా సాయపడాలని నేపాల్ సమాచార శాఖ మంత్రి మినేంద్ర రిజాల్ కోరారు. కఠ్మాండు.. కకావికలం కఠ్మాండులోని పురాతన భవనాలన్నీ భూకంపం దెబ్బకు నేలమట్టమయ్యాయి. ఎటు చూసినా మొండిగోడలు, శిథిలాలు, పక్కకు ఒరిగిన భవనాలు, నైచ్చిన దారులు కనిపిస్తున్నాయి. రవాణా, విద్యుత్, సమాచార వ్యవస్థలు కుప్పకూలాయి. జనసాంద్రత ఎక్కువున్న ఈ నగరంలోనే ఎక్కువ ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినట్టు తెలుస్తోంది. మొత్తమ్మీద 876 మందికి పైగా చనిపోగా ఒక్క కఠ్మాండులోనే కనీసం 250 మంది చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. ఆర్మీ, పోలీసులు, అత్యవసర సేవల సిబ్బంది సహాయక కార్యక్రమాలు చేపడుతున్నారు. మళ్లీ భూకంపం వస్తుందేమోనన్న భయంతో నగరంలోని వేలాది మంది రాత్రి ఆరుబయటే నిద్రించారు. దెబ్బతిన్న రాయబార కార్యాలయం కఠ్మాండులోని భారత రాయబార కార్యాలయ భవనం కూడా దెబ్బతింది. కాంప్లెక్సులోని ఓ ఇల్లు కూలిపోవడంతో ఎంబసీ ఉద్యోగి మదన్ కూతురు చనిపోయిందని, ఆయన భార్య పరిస్థితి విషమంగా ఉందని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఢిల్లీలో వెల్లడించారు. తమ తరఫున రెండు హెల్ప్లైన్లు(+977 98511 07021, +977 98511 35141) ఏర్పాటు చేసినట్లు ఎంబసీ ప్రతినిధి అభయ్ కుమార్ తెలిపారు. బీర్ ఆసుపత్రిలో మరో భారతీయుడు మరణించారు. భూకంప కేంద్రమైన లమ్జంగ్ జిల్లాలో కూడా పెను విధ్వంసం చోటుచేసుకుంది. ఈ జిల్లాలో 1.8 లక్షల మంది జనాభా ఉంది. జిల్లా కేంద్రమైన బెసిసహర్ లో నష్టం ఎక్కువగా ఉంది. అత్యవసర సేవలు అందించేందుకు భారత్ నుంచి 50 మంది వైద్యుల బృందం కఠ్మాండుకు చేరుకుంది. ప్రమాదం నుంచి బయపడిన రాందేవ్ యోగా క్యాంపు కోసం కఠ్మాండు వచ్చిన బాబా రాందేవ్ భూకంపం నుంచి త్రుటిలో బయటపడినట్లు ఆయన ప్రతినిధి ఎస్కే తిజరావాలా తెలిపారు. ‘‘మా యోగా శిబిరం ఉదయం 5 గంటలకు మొదలైంది. అది ముగిసిన తర్వాత అక్కడ్నుంచి రాందేవ్ వేరే శిబిరానికి బయల్దేరారు. అంతలోనే ఆయన బయటకు వచ్చిన భవనం కూలింది. ఆయన ముందున్న మరో భవనం కూడా అదే సమయంలో కుప్పకూలింది’’ అని ఆయన చెప్పారు. రాందేవ్తో మాట్లాడామని, ఆయన క్షేమంగానే ఉన్నారని మంత్రి సుష్మ స్వరాజ్ తెలిపారు. -
రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.5గా నమోదు
-
కశ్మీర్లో భూకంపం
జమ్మూకశ్మీర్లో శుక్రవారం భూకంపం సంభవించింది. వేకువజామున 3.29 ప్రాంతంలో ఏర్పడిన భూ ప్రకంపనలు రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రతగా నమోదై చుట్టుపక్కల ప్రాంతాలను వణికించింది. అయితే దీనివల్ల ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణనష్టం చోటుచేసుకోలేదు. కాగా ఒక్కసారిగా ప్రకంపనలతో ప్రజలు భయంతోఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు. చాలామంది ఈ ఘటన తర్వాత నిద్రలేకుండా మెలకువతో కూర్చున్నారు. 2005లో రిక్టర్ స్కేలుపై 7.8 తీవ్రతతో వచ్చిన భూకంపం కారణంగా 40 వేల మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సంభవించిన భూకంప కేంద్రం పాకిస్థాన్ ఉందని గుర్తించామని స్థానిక వాతావరణశాఖ తెలిపింది. -
సిటీ సేఫ్
భూకంపాలతో భయం లేదు స్వల్ప భూ ప్రకంపనలు సాధారణమే ఇప్పటి వరకూ ప్రాణ నష్టం లేదు భారీ భవన నిర్మాణాల్లో జాగ్రత్తలు అవసరం ఉప్పల్: నగర ం నిద్రకు ఉపక్రమిస్తున్న వేళ...ఒక్కసారిగా కలకలం.. కాళ్ల కింద భూమి కదిలినట్లు...తాము కూర్చున్న చోటులోనూ కదలిక వచ్చినట్టు భావన. అంతలోనే ఇళ్లలో భద్రపరిచిన వంట పాత్రలు... ఇతర సామగ్రి ఒక్కసారిగా కింద పడటం.. అంతటా అలజడి. ఏదో ఉపద్రవం ముంచుకొస్తుందన్న భయం. కట్టుబట్టలతో వీధుల్లోకి వచ్చిన జనం... అరగంట తరువాత అర్థమైంది.. తమను అలా ‘కదిలించింది’ భూకంపమని. శుక్రవారం రాత్రి 10.36 గంటల సమయంలో రాజేంద్రనగర్, అత్తాపూర్ పరిసరాల్లో నాలుగు సెకన్ల పాటు వచ్చిన భూ ప్రకంపనలతో జనం హడలిపోయారు. కొన్ని ప్రాంతాల ప్రజలకు అర్థరాత్రి వరకూ...మరికొన్ని చోట్ల తెల్లవారుఝాము వరకూ కంటిపై కునుకు లేదు. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 1.8గా నమోదైందని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ (ఎన్జీఆర్ఐ) పేర్కొంది. హైదరాబాద్ పరిసరాల్లో భూమి కంపించటం కొత్తేమీ కాదంది. నిత్యం భూ పలకల్లో కదలికలు సర్వసాధారణమేనని... హైదరాబాద్ అత్యంత సేఫ్ జోన్లో ఉందని శనివారం స్పష్టం చేసింది. నగరంలో శుక్రవారం వచ్చిన భూ కదలికలు చాలా స్వల్పమైనవని చెప్పింది. నిర్మాణాల్లో అప్రమత్తం.. నగరంలో ఇప్పటి వరకు వచ్చిన భూకంపాలన్నీ బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్, ఎల్బీనగర్లలో నమోదైనవే. కొండలు, గుట్టలు ఉన్న ప్రాంతాల్లో భూ లోపలి కదలికలు విస్తృతంగా ఉండే అవకాశం ఉన్న దృష్ట్యా భవన నిర్మాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. భూకంపాలు సంభవించినప్పుడు ప్రాణ నష్టం జరుగకుండా ఉండేలా నిర్మాణాలు డిజైన్ చేసుకోవచ్చని, స్వల్ప ప్రకంపనలు వచ్చినా బహుళ అంతస్తుల నిర్మాణాల్లో కొన్ని సందర్భాల్లో నష్టాలకు అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. నష్టం లేదు: శ్రీనగేష్, ఎన్ జీఆర్ఐ శాస్త్రవేత్త ఇలాంటి స్వల్ప ప్రకంపనల వల్ల ఎలాంటి నష్టం వాటిల్లబోదని జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ డి.శ్రీనగష్ తెలిపారు. ఉప్పల్లోని ఎన్జీఆర్ఐకి దక్షిణ, పశ్చిమ దిశగా 26 కిలో మీటర్ల వ్యాసార్థంలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయన్నారు. -
మెక్సికోను కుదిపేసిన భారీ భూకంపం!
మెక్సికో సిటి: మెక్సికో నగరాన్ని శక్తివంతమైన భూకంపం కుదిపేసింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.2 నమోదైందని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. మెక్సికోలోని నైరుతి ఎల్ డొరాడో ప్రాంతానికి 121 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు అందుబాటులోకి రాలేదు. భూకంప తీవ్రత ప్రభావానికి భవనాలు, రోడ్లు దెబ్బతిన్నాయని మీడియా వెల్లడిస్తోంది. విద్యుత్ అంతరాయం ఏర్పడినట్టు తెలుస్తోంది. -
కాశ్మీర్ లో భూప్రకంపనలు, రిక్టర్ పై 4.9గా నమోదు
శ్రీనగర్: జమ్మూ,కాశ్మీర్ లో మంగళవారం రాత్రి భూమి కంపించింది. భూప్రకంపనలు రిక్టర్ స్కేల్ పై 4.9 గా నమోదైంది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్థినష్టం జరుగలేదని అధికారులు తెలిపారు. జమ్మూ,కాశ్మీర్ లో మంగళవారం రాత్రి 9.06 గంటలకు భూమి కంపించింది. భూకంప తీవ్రత 4.9గా నమోదైంది అని సంబంధిత అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. భూమి కంపించిన సమయంలో ప్రజలందరూ ఒక్కసారిగా భయాందోళనలతో వీధుల్లో పరుగులు తీశారన్నారు. 2005 అక్టోబర్ 8 తేదిన సంభవించిన భూకంప (7.8) ప్రమాదంలో 40 వేలకు పైగా మృత్యువాత పడిన సంగతి తెలిసింది. -
కాశ్మీర్లో భూకంపం
దోడా: జమ్మూ కాశ్మీర్లో శుక్రవారం భూమి కంపించింది. సాయంత్రం ఏడింటి సమయంలో దోడా, కిష్త్వార్ జిల్లాల్లో రిక్టర్ స్కేల్పై 5.2 తీవ్రతతో కూడిన ప్రకంపనలు నమోదయ్యాయి. దాంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. ఇప్పటిదాకా ఆస్తి, ప్రాణనష్టమేమీ నమోదు కాలేదు. భూకంప కేంద్రాన్ని సుక్లాన్ ధర్ ప్రాంతానికి 11 కి.మీ. దూరంలో గుర్తించారు. 2013లో కూడా మే-ఆగ స్టు మధ్య బదెర్వా, దోడా, కిష్త్వార్ ప్రాంతాల్లో 50కి పైగా భూ ప్రకంపనలు నమోదయ్యాయి. -
చైనా, గ్రీస్, టర్కీలలో భూకంపాలు
బీజింగ్:చైనా, గ్రీస్, టర్కీ దేశాల్లోని పలు ప్రాంతాల ప్రజలను శనివారం భూకంపాలు వణికించాయి. నైరుతి చైనాలోని ఇంగ్జియాంగ్ కౌంటీలో ఉదయం రిక్టర్ స్కేలుపై 5.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. పలు పట్టణాల్లో 9,412 ఇళ్లు, రోడ్లు ధ్వంసం కాగా 12 మంది గాయపడ్డారు. ప్రజలు ప్రాణభయంతో వీధుల్లోకి పరుగులు తీశారు. భూకంప కేంద్రం 12 కి.మీ. లోతులో ఏర్పడిందని అధికారులు వెల్లడించారు. అదేవిధంగా శనివారం మధ్యాహ్నం గ్రీస్, టర్కీ తీరాల వద్ద సముద్రంలో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపం వల్ల ఉత్తర గ్రీస్, పశ్చిమ టర్కీలోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. వేలాది మంది ప్రజలు భయకంపితులయ్యారు. టర్కీలోని ఓ దీవితోపాటు వివిధ చోట్ల 266కు పైగా మంది గాయపడ్డారు. థెసాలోనికాకు 210 కి.మీ. దూరంలో సముద్రంలో 10 కి.మీ. లోతులో ఈ భూకంపం ఏర్పడిందని అధికారులు తెలిపారు. -
'కోస్తా జిల్లాల ప్రజలు ఆందోళన పడవద్దు'
హైదరాబాద్ : భూ ప్రకంపనలపై కోస్తా జిల్లాల ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదని సునామీ హెచ్చరికల కేంద్రం శాస్త్రవేత్త శ్రీనివాస్ కుమార్ తెలిపారు. బంగాళాఖాతంలో బుధవారం రాత్రి సంభవించిన భూకంపం సునామీగా మారే అవకాశం లేదని ఆయన గురువారమిక్కడ పేర్కొన్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో నిన్న భూమి స్వల్పంగా కంపించిన విషయం తెలిసిందే. విశాఖ నగరంలో, జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో బుధవారం రాత్రి భూమి కొద్ది సెకెన్ల పాటు తీవ్రంగా కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సుమారు పది సెకెన్ల పాటు తీవ్ర శబ్దంతో భూమి కంపించడంతో ప్రజలు ఇళ్లు, అపార్టమెంట్లలోంచి బయటకు పరుగులు తీశారు. కృష్ణా, విజయనగరం, శ్రీకాకుళం, చిత్తూరు, తూర్పు గోదావరి జిల్లాల్లోనూ భూమి స్వల్పంగా కంపించింది. కృష్ణా జిల్లాలోని విజయవాడ, పరిసర ప్రాంతాల్లో.. విజయనగరం జిల్లాలోని విజయనగరం, పార్వతీపురం, బొబ్బిలి, ఎస్.కోట, నెల్లిమర్ల, గజపతినగరం ప్రాంతాల్లో.. శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకాకుళం పట్టణంతోపాటు జిల్లాలోని తీరప్రాంత మండలాల్లో భూకంప ప్రభావం కనిపించింది. తిరుపతి, రాజమండ్రిల్లోనూ భూమి కంపించింది. భారతీయ వాతావరణ శాఖ భూకంప తీవ్రతను రిక్టర్ స్కేల్పై 6 గా పేర్కొంది. -
రాష్ట్రంలో స్వల్ప భూకంపం
-
రాష్ట్రంలో స్వల్ప భూకంపం
భూకంప తీవ్రతను రిక్టర్ స్కేల్పై 6గా పేర్కొన్న అధికారులు సాక్షి నెట్వర్క్: బంగాళాఖాతంలో బుధవారం రాత్రి సంభవించిన స్వల్ప భూకంప ప్రభావం రాష్ట్రంలోని పలు ప్రాంతాలపై పడింది. విశాఖ నగరంలో, జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో బుధవారం రాత్రి భూమి కొద్ది సెకెన్ల పాటు తీవ్రంగా కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. బుధవారం సుమారు పది సెకెన్ల పాటు తీవ్ర శబ్దంతో భూమి కంపించడంతో ప్రజలు ఇళ్లు, అపార్టమెంట్లలోంచి బయటకు పరుగులు తీశారు. కృష్ణా, విజయనగరం, శ్రీకాకుళం, చిత్తూరు, తూర్పు గోదావరి జిల్లాల్లోనూ భూమి స్వల్పంగా కంపించింది. కృష్ణా జిల్లాలోని విజయవాడ, పరిసర ప్రాంతాల్లో.. విజయనగరం జిల్లాలోని విజయనగరం, పార్వతీపురం, బొబ్బిలి, ఎస్.కోట, నెల్లిమర్ల, గజపతినగరం ప్రాంతాల్లో.. శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకాకుళం పట్టణంతోపాటు జిల్లాలోని తీరప్రాంత మండలాల్లో భూకంప ప్రభావం కనిపించింది. తిరుపతి, రాజమండ్రిల్లోనూ భూమి కంపించింది. భూకంప తీవ్రతకు పలు ఇళ్లలో సామగ్రి కిందపడిపోయింది. అక్కడక్కడా ఇళ్ల గోడలు బీటలు వారాయి. భయాందోళనలకు గురైన ప్రజలు ఇళ్లలోంచి బయటకు వచ్చి చాలాసేపు రోడ్డుపైనే గడిపారు. భారతీయ వాతావరణ శాఖ భూకంప తీవ్రతను రిక్టర్ స్కేల్పై 6 గా పేర్కొంది. దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ.. న్యూఢిల్లీ/తైపీ: బుధవారం రాత్రి సంభవించిన ఓ మోస్తరు భూకంపం దేశంలోని పలు ప్రాంతాల్లోని ప్రజలను భయాందోళలకు గురిచేసింది. రాత్రి 9 గంటల 52 నిమిషాలకు బంగాళాఖాతంలో పారాదీప్కు తూర్పున 60 కి. మీల దూరంలో 10 కి.మీల అడుగున భూకంపం సంభవించిందని భారత వాతావరణ విభాగం డెరైక్టర్ జనరల్ ఎల్ఎస్ రాథోడ్ వెల్లడించారు. ఢిల్లీ, తమిళనాడు, ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో భూకంప ప్రభావం కనిపించింది. చెన్నై, భువనేశ్వర్, కటక్ల్లో భవనాలు కంపించాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. తైవాన్ను కూడా బుధవారం రాత్రి భూకంపం కుదిపేసింది. భూకంపం ప్రభావంతో తైవాన్ రాజధాని తైపీలో భవనాలు ఒక్కసారిగా కంపించాయి. -
చైనాలో భూకంపం; 87 మందికి గాయాలు
చైనాను బుధవారం భారీ భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.1గా నమోదైంది. ఈ ఘటనలో 87 మంది గాయపడగా 45 వేలకుపైగా ఇళ్లు దెబ్బతిన్నాయి. పలుచోట్ల హైవేలు, బ్రిడ్జిలు, రిజర్వాయర్లకు బీటలు వారాయి. చైనాలోని టిబెట్ పరిసర ప్రాంతాల్లో ఈ భూకంపం సంభవించింది. భూకంప కేంద్రానికి సమీపంలోని రింగో పట్టణంలో సుమారు 100 కి.మీ. మేర రోడ్లు దెబ్బతిన్నాయి.