SAIL
-
3 డిమాండ్లపైనా మౌనమే
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖ ఉక్కు కార్మికుల పోరాటమంతా.. ప్లాంటు ప్రైవేటీకరణను పూర్తిగా నిలిపి వేయడం.. క్యాపిటివ్ మైన్స్ను కేటాయించడం.. సెయిల్లో విలీనం చేయడం..! మరి విశాఖ ఉక్కుకు ఊరట దక్కాలంటే ఇందులో ఒక్కటైనా నెరవేరాలి కదా? తమ ఆందోళనను ఏమాత్రం పట్టించుకోకుండా కేంద్రం నుంచి రూ.వేల కోట్ల ప్యాకేజీని సాధించినట్లు సీఎం చంద్రబాబు ప్రభుత్వం గొప్పలు ప్రచారం చేసుకోవడంపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. ఆ ప్యాకేజీతో ఒరిగేదేమీ లేదని.. ముడి సరుకు సరఫరాదారుల బకాయిల చెల్లింపు, బ్యాంకు రుణాలు, ఉద్యోగుల పెండింగ్ వేతనాలు, ఇతర బెనిఫిట్స్, స్వచ్ఛంద పదవీ విరమణ పథకం అమలుకే అది చాలదని కార్మిక సంఘాలు పెదవి విరుస్తున్నాయి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రక్రియను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు కేంద్రం ప్రకటన చేయాలని, అప్పటివరకు తమ పోరాటం ఆగదని సంఘాలు స్పష్టం చేస్తున్నాయి.భారీగా బకాయిలు..విశాఖ స్టీలు ప్లాంటు ఇప్పటికే రూ.25 వేల కోట్ల మేర నిధుల లోటు ఎదుర్కొంటోంది. ముడి సరుకు సరఫరా చేసిన వెండర్స్తో పాటు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు, వాటిపై వడ్డీ, ఉద్యోగులకు బకాయిపడ్డ వేతనాలు, వివిధ రకాల బెనిఫిట్స్, వీఆర్ఎస్ అమలు.. ఇలా మొత్తం రూ. 25 వేల కోట్ల మేర స్టీలు ప్లాంటు లోటు బడ్జెట్లో ఉంది. ఉద్యోగులకు సెప్టెంబరు నుంచి పెండింగ్ వేతనాలు, పీఎఫ్ ఇతర బకాయిలు కలిపి రూ.1,600 కోట్ల మేర ఉన్నాయి. ప్రైవేటీకరణలో భాగంగా అమలు చేస్తున్న వీఆర్ఎస్ కోసం రూ.1,000 కోట్ల మేర అవసరం. ముడి సరుకు సరఫరా చేసిన వెండర్స్కు ఏకంగా రూ.7 వేల కోట్ల మేర బకాయిలు పేరుకుపోయాయి. విశాఖ ఉక్కుకు ప్రస్తుతం ఏకైక రైల్వే లైన్ ద్వారా ఆరు ర్యాకులు (దాదాపు వంద టన్నులు) బొగ్గు సరఫరా అవుతుండగా పూర్తి స్థాయిలో ఉత్పత్తి కావాలంటే రోజూ తొమ్మిది ర్యాక్లు అవసరం. నక్కపల్లి ప్రైవేటు స్టీలు ప్లాంటులో కూడా ఉత్పత్తి ప్రారంభమైతే మరో 4–5 ర్యాకులు బొగ్గు అవసరం అవుతుంది. రోజుకు 13–14 ర్యాక్ల బొగ్గును ఒక్క రైల్వే లైను ద్వారా తీర్చడం సాధ్యం కాదు. ప్రైవేట్ సంస్థతో పోటీపడి బొగ్గు సమస్యను పరిష్కరించుకునే అవకాశం విశాఖ స్టీలుకు ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక ప్రస్తుతం ఉన్న 12 వేల మంది ఉద్యోగుల్లో నాలుగు వేల మంది పదవీ విరమణ పొందుతున్నారు. మరో 1,000 మందిని వీఆర్ఎస్ ద్వారా తొలగించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కేవలం 7 వేల మందితో 7 మిలియన్ టన్నుల ప్లాంటులో పూర్తిస్థాయిలో ఉత్పత్తి చేయడం సాధ్యం కాదు. వైఎస్సార్సీపీ ఉక్కు సంకల్పం..విశాఖ స్టీలు ప్లాంట్ను ప్రైవేట్పరం చేయాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ 2021 ఫిబ్రవరి 6వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లేఖ రాశారు. ఈమేరకు అసెంబ్లీలో 2021 మే నెలలో తీర్మానం కూడా చేశారు. పార్లమెంటులో సైతం వైఎస్సార్ సీపీ తన గళాన్ని వినిపించింది. ఇదే విషయాన్ని కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి సైతం తాజాగా స్వయంగా చెప్పారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించవద్దంటూ వైఎస్ జగన్ కేంద్రానికి పలు దఫాలు వినతిపత్రాలు సమర్పించారు. ఆంధ్రా యూనివర్శిటీ మైదానంలో 2022 నవంబరు 12న జరిగిన ప్రధాని మోదీ సభలో కూడా వైఎస్ జగన్ దీన్ని ప్రస్తావించారు. ఎంపీ వి.విజయసాయిరెడ్డి విశాఖలో భారీ పాదయాత్రను కూడా చేపట్టారు. ఇటీవల పార్లమెంటు సమావేశాల్లోనూ వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు విశాఖ స్టీలు ప్లాంటు ఆర్థిక సమస్యలతో పాటు ప్రైవేటీకరణ అంశాలపై కేంద్రాన్ని ప్రశ్నించారు.తాత్కాలిక ఉపశనమం..కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ కేవలం తాత్కాలిక ఉపశమనం మాత్రమే. రుణాలు, పెండింగ్ బకాయిలు కలిపితే సుమారు రూ.25 వేల కోట్ల బకాయిలున్నాయి. స్టీల్ప్లాంట్ను సెయిల్లో విలీనం చేసేలా చర్యలు తీసుకోవాలి. – నీరుకొండ రామచంద్రరావు, చీఫ్ పేట్రన్, స్టీల్ ఐఎన్టీయూసీ సొంత గనులు కేటాయిస్తేనే..ప్యాకేజీ వల్ల తాత్కాలిక ఉపశమనం మాత్రమే. స్టీల్ప్లాంట్కు సొంత గనులు కేటాయిస్తేనే శాశ్వత పరిష్కారం లభిస్తుంది. వీఆర్ఎస్ను ఉపసంహరించుకోవాలి. సొంత గనులు ఇవ్వడంతో పాటు సెయిల్లో విలీనం చేయాలి. – యు.రామస్వామి, ప్రధాన కార్యదర్శి, స్టీల్ సీఐటీయూ అంతా బూటకం..కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీతో సమస్య పరిష్కారం అయిపోతుందని ప్రకటన చేయడం బూటకం. దేశంలో అన్ని స్టీల్ప్లాంట్లకు సొంత గనులు ఉన్నప్పుడు విశాఖ ప్లాంట్కు మాత్రం ఎందుకు ఇవ్వరు? స్టీల్ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో నడవాలంటే సొంత గనులు కేటాయించి ప్రైవేటీకరణ చర్యలు ఉపసంహరించుకోవాలి. – సీహెచ్ నరసింగరావు, సిటూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
విశాఖ స్టీల్ ప్లాంట్ని సెయిల్ విలీనం చేయాలని డిమాండ్
-
విశాఖ స్టీల్ప్లాంట్ను సెయిల్లో విలీనం చేయాల్సిందే
సీతంపేట (విశాఖ): విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణను విరమించుకోవడంతోపాటు ప్లాంట్ను సెయిల్ (స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్)లో విలీనం చేయాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి డిమాండ్ చేసింది. ఈ నెల 29న విశాఖ వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ ఈ మేరకు ప్రకటన చేయాలని కోరుతూ తీర్మానించింది. ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో శనివారం అఖిలపక్ష రాజకీయ పార్టీల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. స్టీల్ప్లాంట్ పరిరక్షణ కోసం 1,380 రోజులుగా కార్మిక సంఘాలు, ప్రజాసంఘాలు పోరాటం చేయడం గొప్ప విషయమన్నారు. స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమాన్ని రాజకీయ కోణంలో చూడరాదని, 5 కోట్ల ఆంధ్రుల సెంటిమెంట్తో ముడిపడి ఉందన్న విషయాన్ని పాలకులు గ్రహించాలన్నారు. టీడీపీ, జనసేనకు చెందిన 18 మంది ఎంపీల మద్దతు ఉపసంహరిస్తే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కుప్పకూలిపోతుందన్నారు. కేంద్రానికి మద్దతు ఉపసంహరిస్తున్నట్టు చంద్రబాబు ప్రకటిస్తే ఆయనకు పాలాభిషేకం చేస్తానన్నారు. కర్ణాటకలో స్టీల్ ప్లాంట్కు కేంద్రం రూ.15వేల కోట్లు సాయం అందించిందని, మరో రూ.15 వేల కోట్లు ఇస్తామని ప్రకటించారని గుర్తు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల జీతాలు, హెచ్ఆర్ఏ తగ్గింపు, వీఆర్ఎస్ సర్వే, ఉద్యోగులు తమంతట తాము మానేసే విధంగా ప్లాంట్ను నిర్వీర్యం చేసేలా వ్యవహరిస్తున్నారన్నారు. 2,200 ఎకరాల స్టీల్ప్లాంట్ భూమి రూ.2 లక్షల కోట్ల విలువ ఉంటుందని, దానిని పల్లీలకు అమ్మేస్తారా అని ప్రశ్నించారు. స్టీల్ప్లాంట్ అప్పుల్లో ఉంది కానీ, నష్టాల్లో లేదని గుర్తించాలన్నారు. గతంలో ఒకే ఏడాది 950 కోట్లు లాభం ఆర్జించిందన్నారు. సొంత గనులు కేటాయించాలనే డిమాండ్ తన చిన్నప్పటినుంచే ఉందని, కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు ఇప్పటికీ నెరవేర్చలేదన్నారు. స్టీల్ప్లాంట్ పరిరక్షణకు చేపట్టే ఉద్యమానికి వైఎస్సార్సీపీ పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు. రాజకీయాలకు అతీతంగా పోరాడాలివైఎస్సార్సీపీ నాయకుడు తిప్పల దేవన్రెడ్డి మాట్లాడుతూ.. రాజకీయాలకు అతీతంగా స్టీల్ప్లాంట్ పరిరక్షణ కోసం పోరాడాలన్నారు. ప్లాంట్ ఉద్యోగుల జీతాల తగ్గింపుతో గాజువాకలో వ్యాపారాలు బాగా తగ్గిపోయాయన్నారు. రూ.200 కోట్ల టర్నోవర్ తగ్గిపోయిందన్నారు. పరిరక్షణ కమిటీ చైర్మన్లు ఆదినారాయణ, అయోధ్యరామ్, మంత్రి రాజశేఖర్ మాట్లాడుతూ.. జనవరి 27 నాటికి ఉక్కు ప్రైవేటీకరణ పోరాట ఉద్యమం ప్రారంభించి నాలుగేళ్లు పూర్తవుతుందన్నారు. విశాఖ వస్తున్న ప్రధాని మోదీ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని విరమిస్తున్నట్టు ప్రకటించాలని, ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని, సెయిల్లో విలీనం చేస్తామని ప్రకటించాలని తీర్మానిస్తున్నట్టు తెలిపారు. దీనికి అన్ని రాజకీయ పార్టీలు, కార్మిక ప్రజా సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు. మోదీ రాక సందర్భంగా బైక్ ర్యాలీలు, నిరాహార దీక్షలు వంటి కార్యక్రమాలతో ఈ నెల 28న ప్రత్యేక ఉద్యమ కార్యాచరణ చేపడుతున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎం.పైడిరాజు, జనసేన పార్టీ నాయకులు మర్రివేముల శ్రీనివాస్, సీపీఎ (ఎంల్) నేత గణేష్ పాండా, ఏఐటీయూసీ నేత కె.శంకరరావు, ఎస్యూసీఐ నేత సీహెచ్ ప్రమీల, ఆప్ నేత శీతల్, బీఎస్పీ నేత శివప్రసాద్, ఆర్పీఐ నేత బొడ్డు కల్యాణరావు, కాంగ్రెస్, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. -
ప్రపంచాన్ని చుట్టిరానున్నఇద్దరు నేవీ ఆఫీసర్లు..!
భారత నావికాదళానికి చెందిన ఇద్దరు మహిళా అధికారులు అపూర్వ సాహస యాత్రకు శ్రీకారం చుట్టారు. ఎనిమిది నెలల్లో సముద్రంపై ప్రపంచాన్ని చుట్టిరావడానికి బుధవారం గోవా నుంచి బయలుదేరారు. వారు మొత్తం 21,600 నాటికల్ మైళ్లు (23,335 కిలోమీటర్లు) ప్రయాణిస్తారు. లెఫ్టినెంట్ కమాండర్లు దిల్నా, రూపా ఈ యాత్రకు పూనుకున్నారు. వారి ప్రయాణాన్ని చీఫ్ ఆఫ్ ద నావల్ స్టాఫ్ అడ్మిరల్ దినేశ్ కె.త్రిపాఠి జెండా ఊపి ప్రారంభించారు. ఇద్దరు మహిళా అధికారులు వచ్చే ఏడాది మే నెలలో గోవాకు తిరిగివస్తారు. భారత నావికాదళానికి చెందిన ఐఎన్ఎస్వీ తరిణి నౌకలో వీరిద్దరూ ప్రయాణం ఆరంభించారు. సముద్రాల పరిరక్షణ కోసం ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా వీరు ఈ యాత్రకు శ్రీకారం చుట్టారు. కేరళలోని కాలికట్లో జన్మించిన దిల్నా 2014లో, పుదుచ్చేరికి చెందిన రూపా 2017లో ఇండియన్ నేవీలో చేరారు. (చదవండి: భేష్ సుకన్య మేడమ్..! నాటి రాజుల పాలన..) -
పీఎన్బీ – సెయిల్ మధ్య ఒప్పందం
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ ఉక్కు కంపెనీ సెయిల్తో ప్రభుత్వరంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా సెయిల్ ఉద్యోగులకు గృహ, కార్ల కొనుగోలుకు రుణాలను పీఎన్బీ అందిస్తుంది. అలాగే విద్యా రుణాలను సైతం తగ్గింపు రేట్లకే, ఆకర్షణీయమైన సదుపాయాలతో అందించనుంది. పీఎన్బీ కస్టమర్లను పెంచుకునేందుకు, సెయిల్ ఉద్యోగుల శ్రేయస్సుకు ఈ భాగస్వామ్యం తోడ్పడుతుందని పీఎన్బీ తెలిపింది. అవగాహన ఒప్పందంపై పీఎన్బీ జనరల్ మేనేజర్ (బిజినెస్ అక్విజిషన్) బిబు ప్రసాద్ మహపాత్ర, సెయిల్ జనరల్ మేనేజర్ (ఫైనాన్స్) లావికా జైన్, సెయిల్ జనరల్ మేనేజర్ (హెచ్ఆర్) విక్రమ్ ఉప్పల్ సంతకాలు చేశారు. -
సెయిల్ ఈ ఏడాది పెట్టుబడి రూ. 6,500 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.6,500 కోట్ల మూలధన వ్యయం చేయనుంది. 2030 నాటికి రూ. లక్ష కోట్ల పెట్టుబడి ప్రణాళికలో భాగంగా ఈ మొత్తాన్ని ఖర్చు చేయనున్నట్టు సెయిల్ సీఎండీ అమరేందు ప్రశాశ్ శుక్రవారమిక్కడ తెలిపారు. ఇండియన్ స్టీల్ అసోసియేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. ‘తొలి దశలో సామర్థ్యాన్ని ప్రస్తుతం ఉన్న 20 మిలియన్ టన్నుల నుంచి 2031 నాటికి 35 మిలియన్ టన్నులకు చేరుస్తాం. తదుపరి దశలో వార్షిక సామర్థ్యాన్ని 50 మిలియన్ టన్నులకు పెంచుతాం. స్టీల్ పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా 0.5% వృద్ధి చెందుతోంది. గతేడాది భారత్ ఏకంగా 13 శాతం వృద్ధి నమోదు చేసింది. వచ్చే పదేళ్లు భారత్లో స్టీల్ రంగం ఏటా సగటు వృద్ధి 8%గా ఉంటుంది’ అని వివరించారు. -
మంచు పడవ..కేవలం శిల్పం కాదు! అలా నీటిలో చక్కర్లు కొట్టేయొచ్చు!
మంచుతో రకరకాల కట్టడాల నమూనాలను, శిల్పాలను రూపొందించడం తెలిసిందే! ఇవాన్ కార్పిత్స్కీ అనే బెలారష్యన్ కళాకారుడు ఏకంగా మంచుపడవనే రూపొందించాడు. ఇది పడవ ఆకారంలో రూపొందించిన కళాఖండం కాదు, నీళ్లల్లో ప్రయాణించగలదు. హిమశిల్పాలంటే విపరీతమైన ఇష్టం ఉన్న ఇవాన్, ఏళ్ల తరబడి కఠోర సాధన చేసి రకరకాల హిమశిల్పాలను రూపొందిస్తుంటాడు. అవి కేవలం శిల్పాల్లాగానే కాదు, అచ్చంగా అసలు వాటిలా పనిచేసేలా రూపొందించడమే ఇవాన్ ప్రత్యేకత! తొలిసారిగా 2020లో అతడు మంచుతో వయోలిన్ తయారు చేసి, వార్తలకెక్కాడు. ఇక అప్పటి నుంచి ప్రతి ఏటా శీతకాలంలో మంచుగడ్డ కట్టే ప్రదేశాలకు వెళ్లి, అక్కడ మంచు శిల్పాలను తయారు చేయడం అలవాటుగా చేసుకున్నాడు. ఈసారి శీతకాలంలో ఈ మంచుపడవను తయారు చేశాడు. బెలారష్యా రాజధాని మిన్స్క్ నగరానికి చేరువలో ఉండే స్న్యాన్స్కో రిజర్వాయర్ ఒడ్డున కూర్చుని ఇవాన్ ఈ పడవను తయారు చేశాడు. తయారీ పూర్తయ్యాక మంచుపడవలో కూర్చుని రిజర్వాయర్ నీటిలో చక్కర్లు కొట్టాడు. (చదవండి: ఆ గుహలోకి వెళ్లడమంటే.. ప్రాణాలపై ఆశ వదిలేసుకోవడమే!) -
Sagubadi: చౌడు సాగుకు చేదోడు కొత్త బ్యాక్టీరియా!
'సాధారణ వరి వంగడాల పంటకు ఉప్పు నీరు తగిలితే ఆకులు పసుపు రంగులోకి మారిపోయి, ఎదుగుదల లోపించి, దిగుబడి తగ్గిపోతుంది. అయితే, కేరళ తీరప్రాంతంలో లోతట్టు మాగాణుల్లో ఉప్పు నీటిలోనూ పొక్కలి వరి వంగడం చక్కగా పెరిగి మంచి దిగుబడినిస్తుంది. ఇందుకు దోహదపడుతున్న మట్టి మర్మమేమిటి? అని అల్లాపుఝలోని సనాతన ధర్మ కాలేజీకి చెందిన పరిశోధకులు అధ్యయనం చేసి ఓ సరికొత్త బ్యాక్టీరియాను కనుగొన్నారు. పొక్కలి రకం వరి సాగయ్యే సేంద్రియ పొలాల్లోని మట్టిలో ఉండే సూడోమోనాస్ తైవానెన్సిస్ (పికె7) వల్లనే ఉప్పు నీటిని ఆ పంట తట్టుకోగలుగుతోందని వారు తేల్చారు.' కుట్టనాడ్ ప్రాంతంలో విస్తారంగా సాగయ్యే యుఎంఎ అనే రకం వరికి ఉప్పునీటి బెడద ఎక్కువైన నేపథ్యంలో ఈ అధ్యయనం జరిగింది. పికె7తో పాటు పంట పెరుగుదలకు దోహదం చేసే రైజోబ్యాక్టీరియా (ఎస్.టి.–పిజిపిఆర్లు) కూడా వాడి యుఎంఎ రకం వరిని ప్రయోగాత్మకంగా సాగు చేసి చూశారు. ఈ బ్యాక్టీరియాలు వాడి సాగు చేస్తే హెక్టారుకు 7,595 కిలోల ధాన్యం దిగుబడి వస్తే.. వాడకుండా సాగు చేస్తే హెక్టారుకు 7,344 కిలోల దిగుబడి మాత్రమే వచ్చింది. అంటే.. పికె7 బ్యాక్టీరియా ఉప్పు వల్ల కలిగే ప్రతికూలతను తట్టుకొని వరి పంట నిలబడే వ్యవస్థను సృష్టిస్తోందని అర్థమవుతోందని పరిశోధకులు నిర్థారణకు వచ్చారు. 2022 డిసెంబర్ – ఏప్రిల్ 2023 మధ్య కాలంలో జరిగిన ఈ అధ్యయన వివరాలతో కూడిన వ్యాసం జర్నల్ ఆఫ్ అగ్రానమీ అండ్ క్రాప్ సైన్స్లో ప్రచురితమైంది. మన చౌడు భూముల్లోనూ వరి, తదితర పంటల సాగుకు ఈ బ్యాక్టీరియా ఉపయోగపడుతుందేమో మన శాస్త్రవేత్తలు పరిశోధించాలి. 'పొక్కలి’ పొలంలో మట్టి సేకరణ 67.3 లక్షల హెక్టార్లలో చౌడు సమస్య.. మన దేశంలో చౌడు బారుతున్న నేలల (సాల్ట్–ఎఫెక్టెడ్ సాయిల్స్) విస్తీర్ణం ఇటీవల కాలంలో వేగంగా పెరుగుతోంది. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసిఎఆర్)కు చెందిన కేంద్రీయ చౌడు నేలల పరిశోధనా సంస్థ (సిఎస్ఎస్ఆర్ఐ) ఇటీవల నిర్వహించిన అధ్యయనం ప్రకారం మన దేశంలో 67 లక్షల 30 వేల హెక్టార్ల సాగు భూమి చౌడుబారింది. 2050 నాటికి ఇది రెట్టింపవుతుందని ఆ సంస్థ హెచ్చరిస్తోంది. భూములు చౌడుబారటం వల్ల మన దేశంలో ఏటా 1.68 కోట్ల టన్నుల పంట దిగుబడిని నష్టపోతున్నాం. ఈ పంట విలువ రూ. 23 వేల కోట్లు (2015 నాటి ధరల ప్రకారం). చౌడు భూముల్లో పంటలు బతకవు. బతికినా పెద్దగా పెరిగి దిగుబడినివ్వవు. వ్యవసాయోత్పత్తిని దెబ్బతీయటమే కాదు సాంఘిక–ఆర్థిక స్థితిగతులను సైతం చౌడు సమస్య అతలాకుతలం చేస్తుంది. మురుగునీటి పారుదల సదుపాయం సమర్థవంతంగా లేకపోవటం, భూముల్లో అతిగా నీరు నిల్వ ఉండిపోవటం ఇందుకు ప్రధాన కారణాలు. రసాయనిక ఎరువులు విచ్చలవిడిగా వాడటం వంటి అస్థిర వ్యవసాయ పద్ధతులు, పంటలకు అందించే భూగర్భ జలాల నాణ్యత నాసికరంగా ఉండటం కూడా తోడవుతున్నాయి. చౌడు సమస్య మన దేశానికే పరిమితం కాదు. ప్రపంచవ్యాప్తంగా 260 కోట్ల చిన్న, సన్నకారు రైతుల జీవనోపాధి దెబ్బతింటోంది. ఏటా వీరికి కలుగుతున్న నష్టం 630 కోట్ల డాలర్లని అంచనా. వంద దేశాల్లో 83.5 కోట్ల హెక్టార్ల భూమి చౌడుబారిన పడింది. ఇందులో మనుషుల పనుల వల్ల చౌడువారిన భూములు 7.6 కోట్ల హెక్టార్లు ఈ నేపధ్యంలో కేరళలో కనుగొన్న కొత్త సూక్ష్మజీవి చౌడు భూముల సాగులో కొత్త శకానికి నాంది పలుకుతుందని ఆశిద్దాం..! 13న బయోచార్ సొసైటీ ఆవిర్భావం! కట్టె పులల్ల నుంచి పర్యావరణ హితమైన బయోచార్ (బొగ్గుపొడి) ఉత్పత్తిని, వాడకాన్ని పెంపొందించే సదుద్దేశంతో భారతీయ బయోచార్ సొసైటీ ఆవిర్భవిస్తోంది. బొగ్గుపొడి సుస్థిర వ్యవసాయానికి దోహదపడుతుంది. దీంతో పాటు నీటి శుద్ధి, పారిశుద్ధ్యం తదితర అనేక రంగాల్లో వినియోగిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా బయోచార్కు కార్బన్ క్రెడిట్స్ చేకూర్చే పరిస్థితులు ఉండటంతో జీవనోపాధులను పెంపొందించడానికి కూడా ఇది దోహదపడనుంది. ఈ నెల 13వ తేదీన సాయంత్రం 5–7 గంటల మధ్య హైదరాబాద్ యూసఫ్గూడలోని ఎన్.ఐ.–ఎం.ఎస్.ఎం.ఇ. కార్యాలయ ఆవరణలో బయోచార్ సొసైటీ ఆవిర్భావ సభ జరగనుంది. ఆర్.కె. మెహతా చైర్మన్గా, డా. నక్కా సాయిభాస్కర్రెడ్డి ప్రెసిడెంట్గా, ఎస్.కె. గు΄్తా కార్యదర్శిగా భారతీయ బయోచార్ సొసైటీ ఆవిర్భవిస్తోంది. వివరాలకు.. 6305 171 362. 1 నుంచి పల్లెసృజన శోధా యాత్ర.. గ్రామీణుల్లో నిగూఢంగా దాగి ఉన్న తరతరాల జ్ఞానాన్ని శోధించడానికి, ప్రకృతితో మమేకమైన వారి జీవన విధానం గురించి తెలుసుకోవడానికి కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి గ్రామం నుంచి గన్నారం గ్రామం వరకు చిన్న శోధాయాత్ర నిర్వహించనున్నట్లు పల్లెసృజన సంస్థ అధ్యక్షులు బ్రిగేడియర్ పోగుల గణేశం తెలిపారు. మార్చి 1 నుంచి 3 వరకు జరిగే ఈ యాత్రలో రూ.500 రుసుము చెల్లించి ఆసక్తిగల వారెవరైనా ముందుగా తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇతర వివరాలకు.. 98660 01678, 99666 46276. నిర్వహణ: – పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ ఇవి చదవండి: Sagubadi: ఎక్కడి నుంచైనా.. మోటర్ ఆన్, ఆఫ్! -
ఎవరీ సోమా మండల్? ఉక్కు పరిశ్రమకే క్వీన్గా..!
పెద్ద బాధ్యతను స్వీకరించినప్పుడు గర్వించదగిన క్షణాలు మాత్రమే ఉండవు. పెద్ద పెద్ద సవాళ్లు కాచుకొని కూర్చుంటాయి. భయపెడతాయి. ఆ సవాళ్లకు భయపడితే అపజయం మాత్రమే మిగులుతుంది. వాటిని ఎదుర్కొనే ధైర్యం ఉంటే విజయం సొంతం అవుతుంది. ఇంజినీరింగ్ చదివే రోజుల నుంచి ఉక్కు పరిశ్రమలోకి అడుగు పెట్టే వరకు, ఉద్యోగ ప్రస్థానంలో రకరకాల సవాళ్లను ఎదుర్కొంది సోమా మండల్. వాటిని అధిగమించి అపురూపమైన విజయాలను సొంతం చేసుకుంది. తాజాగా...ఫోర్బ్స్ ‘వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్–2023’ జాబితాలో చోటు సంపాదించింది. భువనేశ్వర్లోని ఓ బెంగాలీ మధ్యతరగతి కుటుంబంలో పుట్టింది సోమా మండల్. తండ్రి అగ్రికల్చర్ ఎకానమిస్ట్. అప్పట్లో చాలామంది తల్లిదండ్రుల ధోరణి ‘ఆడపిల్లలను ఒక స్థాయి వరకు చదివిస్తే చాలు. పెద్ద చదువు అక్కర్లేదు’ అన్నట్లుగా ఉండేది. సోమా తండ్రిలో మాత్రం అలాంటి భావన లేదు. ‘మా అమ్మాయిని పెద్ద చదువులు చదివిస్తాను’ అనేవాడు.అలాంటి వ్యక్తి కాస్తా సోమా ఇంజనీరింగ్ చేయాలనుకున్నప్పుడు ‘కుదరదు’ అని గట్టిగా చెప్పాడు. ఎందుకంటే ఆరోజుల్లో అమ్మాయిలు ఇంజినీరింగ్ చదవడం అరుదు. తల్లి సహాయంతో నాన్న మనసు మారేలా చేసింది. రూర్కెలాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చేసింది. ఇక కాలేజీ రోజుల విషయానికి వస్తే బ్యాచ్లో రెండు వందల మంది ఉంటే ఇద్దరు మాత్రమే అమ్మాయిలు. పాఠం వింటున్నప్పుడు ఏదైనా సందేహం అడగాలంటే అబ్బాయిలు నవ్వుతారేమోనని భయపడేది. అయితే ఒకానొక సమయంలో మాత్రం...‘అబ్బాయిలు, అమ్మాయిలు ఒకే చదువు చదువుతున్నప్పుడు భయపడటం ఎందుకు?’ అని తనకు తానే ధైర్యం చెప్పుకుంది...ఇక అప్పటి నుంచి ఎప్పుడూ ధైర్యం కోల్పోలేదు. ఆ ధైర్యమే తన భవిష్యత్ విజయాలకు పునాదిగా నిలిచింది. సోమా మెటల్ ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పుడు మహిళా ఉద్యోగులు ఎక్కువగా లేరు. ‘మెటల్ ఇండస్ట్రీ అంటే పురుషుల ప్రపంచం’ అన్నట్లుగా ఉండేది. ఇక మహిళలు ఉన్నత స్థానాల్లోకి రావడం అనేది ఊహకు కూడా అందని విషయం. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఎప్పుడూ భవిష్యత్పై ఆశను కోల్పోలేదు సోమా మండల్. నాల్కో(నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్)లోకి గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీగా అడుగుపెట్టి ఒక్కో మెట్టు ఎక్కుతూ తొలి మహిళా డైరెక్టర్(కమర్షియల్) స్థాయికి చేరింది. 2017లో సెయిల్(స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా)లోకి వచ్చిన తరువాత ఫస్ట్ ఉమెన్ ఫంక్షనల్ డైరెక్టర్, ఫస్ట్ ఉమెన్ చైర్పర్సన్ ఆఫ్ సెయిల్గా ప్రత్యేక గుర్తింపు పొందింది. సెయిల్ చైర్పర్సన్గా బాధ్యతలు స్వీకరించిన కాలంలో ఆ సంస్థ వేల కోట్ల అప్పులతో ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మార్కెటింగ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్లో మార్పులు తీసుకువచ్చింది. మైక్రో–మేనేజ్మెంట్పై దృష్టి సారించింది. సెయిల్ ప్రాడక్ట్స్ను ప్రమోట్ చేయడానికి మార్గాలు అన్వేషించింది. గ్రామీణ ప్రాంతాలలో వర్క్షాప్లు నిర్వహించింది. కొత్త వ్యాపార వ్యూహాలను అనుసరించింది. సోమా కృషి వృథా పోలేదు..అప్పులు తగ్గించుకుంటూ ‘సెయిల్’ను లాభాల దిశగా నడిపించింది. ‘నా కెరీర్లో జెండర్ అనేది ఎప్పుడూ అవరోధం కాలేదు. మహిళ అయినందుకు గర్వపడుతున్నాను. మన దేశంలో వివిధ రంగాలలో మహిళా నాయకుల సంఖ్య పెరుగుతోంది. లీడర్కు అసంతృప్తి ఉండకూడదు. ఆశాభావం ఉండాలి. పరిమిత వనరులు ఉన్నా సరే మంచి ఫలితం సాధించే సామర్థ్యం ఉండాలి’ అంటుంది సోమా మండల్. టైమ్ మేనేజ్మెంట్కు ప్రాధాన్యత ఇచ్చే సోమా మండల్ అటు వృత్తి జీవితాన్ని, ఇటు వ్యక్తిగత జీవితాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లింది. ‘సక్సెస్కు షార్ట్కట్ అనేది లేదు. అంకితభావం, సమర్థత మాత్రమే మనల్ని విజయానికి దగ్గర చేస్తాయి’ అంటుంది సోమా మండల్. (చదవండి: ఆమె నవయుగ సావిత్రి!) -
సెయిల్ లాభం నేలచూపు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022-23) మూడో త్రైమాసికంలో ప్రభుత్వ రంగ మెటల్ దిగ్గజం సెయిల్ నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్-డిసెంబర్ (క్యూ3)లో నికర లాభం 65 శాతం క్షీణించి రూ. 542 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021–22) ఇదే కాలంలో దాదాపు రూ. 1,529 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 25,398 కోట్ల నుంచి రూ. 25,140 కోట్లకు స్వల్పంగా తగ్గింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 23,210 కోట్ల నుంచి రూ. 24,825 కోట్లకు ఎగశాయి. ముడిస్టీల్ ఉత్పత్తి 4.531 మిలియన్ టన్నుల నుంచి 4.708 ఎంటీకి పుంజుకుంది. అమ్మకాలు సైతం 3.84 ఎంటీ నుంచి 4.15 ఎంటీకి బలపడ్డాయి. కంపెనీ వార్షికంగా 21 ఎంటీ స్టీల్ తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. -
సెయిల్ లేదా ఎన్ఎండీసీలో వైజాగ్ స్టీల్ విలీన ప్రతిపాదనలు
న్యూఢిల్లీ: వైజాగ్ స్టీల్ను (ఆర్ఐఎన్ఎల్) సెయిల్, ఎన్ఎండీసీలో విలీనం చేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి పలు ప్రతిపాదనలు వచ్చాయి. కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగన్ సింగ్ కులస్తే ఈ విషయం తెలిపారు. ప్రస్తుతం ఆర్ఐఎన్ఎల్లో 4,875 మంది ఎగ్జిక్యూటివ్లు, 10,005 మంది నాన్–ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులు ఉన్నారని రాజ్యసభకు రాతపూర్వక సమాధానంలో ఆయన వివరించారు. కంపెనీ ఆర్థిక పరిస్థితి అంతగా బాగా లేనందున రిక్రూట్మెంట్ను క్రమబద్ధీకరించినట్లు కులస్తే పేర్కొన్నారు. పబ్లిక్ ఇష్యూ లేదా బాండ్ల జారీ ద్వారా ఆర్ఐఎన్ఎల్ నిధులు సమీకరించే యోచనేదీ లేదని తెలిపారు. -
సెయిల్కు రూ. 329 కోట్ల నష్టం
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ ఉక్కు తయారీ సంస్థ సెయిల్ సెప్టెంబర్ క్వార్టర్కు భారీ నష్టాలను మూటగట్టుకుంది. ఏకంగా రూ.329 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. ఆదాయం రూ.26,642 కోట్లుగా ఉంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో సెయిల్ రూ.4,339 కోట్ల లాభాన్ని ప్రకటించడం గమనార్హం. ఆదాయం కూడా అంతక్రితం ఏడాది ఇదే కాలంలో రూ.27,007 కోట్లు గా ఉంది. ప్రధానంగా వ్యయాలు రూ. 21,289 కోట్ల నుంచి రూ.27,201 కోట్లకు పెరిగాయి. 4.30 మిలియన్ టన్నుల స్టీల్ను కంపెనీ తయారు చేసింది. క్రితం ఏడాది క్యూ2లో 4.28 మిలియన్ టన్నుల స్టీల్ విక్రయించగా, తాజాగా ముగిసిన త్రైమాసికంలో 4.21 మిలియన్ టన్నులుగా ఉంది. -
భద్రావతి స్టీలు ప్లాంటుకు బిడ్లు కరువు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఉక్కు సంస్థ సెయిల్కు చెందిన భద్రావతి స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ ప్రతిపాదనను ప్రభుత్వం ఉప సంహరించింది. తగినంత స్థాయిలో బిడ్డర్ల నుంచి ఆసక్తి వ్యక్తం కాకపోవడమే ఇందుకు కారణం. కర్ణాటకలోని భద్రావతిలో ఉన్న విశ్వేశ్వరాయ ఐరన్ అండ్ స్టీల్ ప్లాంటు (వీఐఎస్పీ)లో సెయిల్కి ఉన్న 100 శాతం వాటాలను విక్రయించేందుకు 2019 జులైలో ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలను (ఈవోఐ) ఆహ్వానించారు. దీనికి స్పందనగా పలు ఈవోఐలు వచ్చాయని, సంస్థ వివరాలను బిడ్డర్లు మదింపు కూడా చేశారని పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం దీపం వెల్లడించింది. అయినప్పటికీ ఈ విషయంలో ముందుకెళ్లేందుకు అవసరమైనంత స్థాయిలో బిడ్డర్లు ఆసక్తి చూపలేదని పేర్కొంది. దీంతో ప్రత్యామ్నాయ మెకానిజం (సాధికారిక మంత్రుల బృందం) ఆమోదం మేరకు ఈవోఐని రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు దీపం వివరించింది. -
ఎంతటి సాహాసయాత్ర! 83 ఏళ్ల వయసులో ఒంటరిగా మహా సముద్రాన్ని...
Japanese Man solo, non-stop trip across the Pacific: భూమి పై గల మహాసముద్రాలన్నిటిలోకి పసిఫిక్ మహాసముద్రం పెద్దది. అలాంటి పసిఫిక్ మహాసముద్రాన్ని 83 ఏళ్ల వృద్ధుడు ఒంటరిగా చుట్టోచ్చేశాడు. ఒంటరిగా సమద్రయానం చేసిన తొలి వృద్ధుడిగా నిలిచాడు. ఇంతకి అతను ఎవరు? ఎలా అంత పెద్ద సాహసయాత్రను చేయగలిగాడో అనే కదా! వివరాల్లోకెళ్తే... జపాన్కి చెందిన 83 ఏళ్ల కెనిచి హోరీ పసిఫిక్ మహాసమ్రుదం మీదుగా ఒంటరిగా సముద్రయానం చేసిన వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. సముద్ర సాహసికుడు. చిన్నతనం నుంచి ఇలాంటి సముద్రయానానికి సంబంధించిన సాహాసయాత్రలు చేయడమంటే అతని అత్యంత ఆసక్తి. అతను 1962లో 23 ఏళ్ల వయసులోనే జపాన్ నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకు ప్రయాణించి, పసిఫిక్ మహాసముద్రం మీదుగా ఒంటరిగా ప్రయాణించిన ప్రపంచలోనే తొలి వ్యక్తిగా పేరుగాంచాడు. అయితే ఆసమయంలో పాస్పోర్ట్ లేకుండా అమెరికాలో ప్రయాణిస్తున్నప్పుడూ చాలా ఒత్తిడికి గురయ్యానని చెప్పుకొచ్చాడు. ఇలా సమద్రయానానికి సంబంధించిన సాహాసయాత్రలను వరుసగా 1974, 1978, 1982, 2008 వరకు చేశాడు. తదనంతరం మళ్లీ ఇప్పుడూ హోరీ మార్చిలో శాన్ ఫ్రాన్సిస్కోలోని యాచ్ హార్బర్ నుంచి తన తొలి సాహాసయాత్రను ప్రారంభించాడు. ఈ సాహసయాత్రను విజయవంతంగా ముగించుకుని శనివారం తెల్లవారుజామున జపాన్లోని కియ్ జలసంధికి చేరుకోవడంతో ముగిసింది. ఈ అరుదైన సాహాసయాత్రతో పసిఫిక్ మహాసముద్రం మీదుగా ఒంటరిగా ప్రయాణించిన తొలి అత్యంత పెద్ద వయస్కుడిగా నిలిచాడు. (చదవండి: భారత యువసైంటిస్ట్ మేధస్సుకు ఐన్స్టీన్ ఫిదా! ప్చ్.. నోబెల్ మాత్రం దక్కలేదు!) -
సెయిల్ డివిడెండ్ రూ. 2.25
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ మెటల్ దిగ్గజం సెయిల్ లిమిటెడ్ గత ఆర్థిక సంవత్సరం(2021–22) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం 28 శాతం క్షీణించి రూ. 2,479 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది(2020–21) ఇదే కాలంలో రూ. 3,450 కోట్లు ఆర్జించింది. ఇందుకు పెరిగిన వ్యయాలు ప్రభావం చూపాయి. వాటాదారులకు షేరుకి రూ. 2.25 చొప్పున తుది డివిడెండును ప్రకటించింది. కాగా.. క్యూ4లో మొత్తం ఆదాయం రూ. 23,533 కోట్ల నుంచి రూ. 31,175 కోట్లకు ఎగసింది. అయితే మొత్తం వ్యయాలు సైతం రూ. 18,829 కోట్ల నుంచి రూ. 28,005 కోట్లకు భారీగా పెరిగాయి. మార్చికల్లా రుణ భారం రూ. 13,400 కోట్లుగా నమోదైనట్లు సెయిల్ వెల్లడించింది. తాజా సమీక్షా కాలంలో 4.6 మిలియన్ టన్నుల స్టీల్ను ఉత్పత్తి చేయగా.. 4.71 ఎంటీ అమ్మకాలను సాధించింది. 2020–21 క్యూ4లో స్టీల్ ఉత్పత్తి 4.56 ఎంటీకాగా.. 3.43 ఎంటీ విక్రయాలు నమోదయ్యాయి. కోకింగ్ కోల్ తదితర ముడివ్యయాల పెరుగుదల ఫలితాలపై ప్రభావం చూపినట్లు కంపెనీ పేర్కొంది. దీంతో వ్యయాల అదుపునకు పలు చర్యలు తీసుకుంటున్నట్లు తెలియజేసింది. ఫలితాల నేపథ్యంలో సెయిల్ షేరు ఎన్ఎస్ఈలో యథాతథంగా రూ. 74 వద్ద ముగిసింది. -
క్యూ2 లో సెయిల్ దూకుడు
న్యూఢిల్లీ: పీఎస్యూ రంగ స్టీల్ దిగ్గజం సెయిల్ లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) రెండో క్వార్టర్లో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 10 రెట్లు ఎగసింది. రూ. 4,339 కోట్లకు చేరింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో దాదాపు రూ. 437 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 17,098 కోట్ల నుంచి రూ. 27,007 కోట్లకు జంప్ చేసింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 16,734 కోట్ల నుంచి రూ. 21,289 కోట్లకు ఎగశాయి. ఈ కాలంలో 4.468 మిలియన్ టన్నుల స్టీల్ను తయారు చేయగా.. 4.280 ఎంటీ స్టీల్ను విక్రయించినట్లు సెయిల్ తెలియజేసింది. సెప్టెంబర్కల్లా స్థూల రుణాలు రూ. 35,350 కోట్ల నుంచి రూ. 22,478 కోట్లకు క్షీణించాయి. వెరసి తొలి అర్ధభాగం(ఏప్రిల్–సెప్టెంబర్)లో రూ. 12,872 కోట్లమేర రుణ భారాన్ని తగ్గించుకుంది. వాటాదారులకు షేరుకి రూ. 4 చొప్పున మధ్యంతర డివిడెండును ప్రకటించింది. ఫలితాల నేపథ్యంలో సెయిల్ షేరు బీఎస్ఈలో యథాతథంగా రూ. 115 వద్ద ముగిసింది. -
మనసున్న బాస్
దేశంలోని చాలా కంపెనీలు ఇప్పుడు ఒడిదుడుకుల్లో ఉన్నాయి. వాటిల్లో చాలా కంపెనీలకు మహిళలే కొత్త బాస్గా వస్తున్నారు. సోమా మండల్నే చూడండి. జనవరి 1 ఆమె భారత ప్రభుత్వసంస్థ సెయిల్ (స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా) చైర్పర్సన్గా బాధ్యతలు చేపట్టారు. ఈ నెల 19కి 67 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సెయిల్ చరిత్రలోనే తొలి మహిళా చైర్మన్ సోమ. మొన్నటి వరకు సెయిల్కు డైరెక్టర్–కమర్షియల్గా ఉన్న సోమ.. చైర్పర్సన్ కాగానే భారత పారిశ్రామిక రంగంలోని దిగ్గజాల కళ్లన్నీ ఆమె ముళ్ల కీరీటం వైపు మళ్లాయి తప్ప, ‘ఐ కెన్’ అని ధీమాగా చెబుతున్నట్లున్న ఆమె చిరునవ్వుకు ఎవ్వరూ పెద్దగా గుర్తింపునివ్వడం లేదు! చైర్పర్సన్గా ఇప్పుడిక ఆమె చాలా చెయ్యాలి. యాభై వేల కోట్ల రూపాయలకు పైగా ఉన్న సెయిల్ అప్పుల్ని తగ్గించాలి. వచ్చే పదేళ్లలోపు ఏడాదికి కనీసం ఐదు కోట్ల టన్నుల ఉక్కు ఉత్పతిస్థాయికి సంస్థ సామర్థ్యాన్ని పెంచాలి. స్టాక్ మార్కెట్లో సెయిల్ సూచీని శిఖరం వైపు మళ్లించాలి. తక్షణం అయితే ఒకటి చేయాలి. ఏళ్లుగా కదలిక లేకుండా ఉన్న వేతనాలను సవరించి, స్థిరీకరించి సిబ్బందిలోని అసంతృప్తిని పోగొట్టాలి. ఇవన్నీ చేయగలరా? ‘చెయ్యగలను’ అని ఆమె అంటున్నారు. ‘ఆమె చెయ్యగలరు’ అని ప్రభుత్వం నమ్ముతోంది. స్టీల్ ధరలు పెరుగుతున్న ప్రస్తుత దశలో చైర్పర్సన్గా వచ్చిన సోమా మండల్ సెయిల్ను లాభాల్లో నడిపిస్తారనే సెయిల్ ఉద్యోగులు, స్టాక్ హోల్డర్లు ఆశిస్తున్నారు. అందుకు కారణం ఉంది. ∙∙ యాభై ఏడేళ్ల సోమ వ్యాపార వ్యూహాల నిపుణురాలు మాత్రమే కాదు. సోషల్ వర్కర్ కూడా కనుక సెయిల్ కింది స్థాయి సిబ్బందికి అన్నివిధాలా భరోసా లభించినట్లే. పైన మన కష్టం గుర్తెరిగే వారున్నారనే భావన కింది స్థాయి ఉద్యోగులు సంస్థ కోసం పాటు పడేలా చేస్తుంది. కంపెనీకి అది వెలకట్టలేని ఆస్తి. 2017 నుంచి సెయిల్లో ఉన్నారు సోమా. ఆ క్రితం వరకు ‘నాల్కో’లో (నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్) చేశారు. రూర్కెలా నిట్లో బీటెక్ చేశాక 1984లో నాల్కోలోనే మేనేజ్మెంట్ ట్రైనీగా చేరారు. సోమా భువనేశ్వర్లో జన్మించారు. ఆమె తండ్రి వ్యవసాయ ఆర్థికవేత్త. తన ముగ్గురు సంతానాన్ని డాక్టర్లను చేయాలని ఆశ. ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు. కొడుకు, ఒక కూతురు డాక్టర్లు అయ్యారు కానీ, సోమ ఇంజినీరింగ్ను ఎంచుకున్నారు. సోమకు ముగ్గురు పిల్లలు. భర్త కూడా ఇంజినీరే. యు.టి.ఐ.లో పని చేసేవారు. 2005లో చనిపోయారు. ‘‘నా ప్లస్ పాయింట్ ఏమిటంటే.. నేను చేసే ప్రతి పనిలోనూ హ్యూమన్ టచ్ ఉంటుంది’’ అన్నారు సోమ.. సెయిల్ చైర్పర్సన్గా బాధ్యతలు తీసుకోగానే. ‘‘నా ప్లస్ పాయింట్ ఏమిటంటే.. నేను చేసే ప్రతి పనిలోనూ హ్యూమన్ టచ్ ఉంటుంది’’ అన్నారు సోమ.. సెయిల్ ఛైర్పర్సన్గా బాధ్యతలు తీసుకోగానే. -
సెయిల్ చైర్మన్గా సోమ మండల్
ముంబై: దేశీయ అతిపెద్ద స్టీల్ తయారీ కంపెనీ సెయిల్ చైర్మన్గా శుక్రవారం సోమ మండల్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ విషయాన్ని కంపెనీ ప్రకటన ద్వారా తెలిపింది. అంతకు ముందు ఆమె ఇదే కంపెనీలో డైరెక్టర్గా పనిచేశారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ–రూర్కెలా నుంచి 1984లో పట్టభద్రురాలైన మండల్ నాల్కో సంస్థలో తన ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించింది. అంచెలంచెలుగా ఎదుగుతూ నాల్కో డైరెక్టర్ స్థాయికి ఎదిగారు. అక్కడి నుంచి 2017లో సెయిల్ కంపెనీలో చేరారు. తాజాగా చైర్మన్ పదవికి ఎన్నికయ్యారు. గురువారం పదవీ విరమణ చేసిన అనిల్ కుమార్ చౌదరీ స్థానంలో మండల్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మండల్ మాట్లాడుతూ ... కంపెనీ లాభాదాయకతకే ప్రాధాన్యత ఇస్తామన్నారు. షేర్ హోల్డర్ల విలువలను మెరుగుపరచడంతో పాటు సంస్థను నిర్మాణాత్మకంగా మరింత బలోపేతం చేస్తామనున్నారు. -
నడిసంద్రంలో బిక్కుబిక్కుమంటూ..
చీరాల టౌన్ : నడిసంద్రం.. ఇంజిన్ పాడైపోయిన బోటు.. కనుచూపు మేరలో మరో బోటు లేదు.. అంతలో పెనుగాలులు, ఎడతెరపి లేని వాన.. దిక్కుతోచని స్థితితో ఆ ఏడుగురు మత్స్యకారులు ప్రాణాలపై ఆశ వదులుకున్నారు. ఆ స్థితిలో వారిని తెరచాపే తీరానికి చేర్చింది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మత్స్యకారులు శుక్రవారం ప్రకాశం జిల్లా చీరాల వాడరేవుకు చేరుకున్నారు. ఈ నెల 7వ తేదీన కాకినాడ ప్రాంతానికి చెందిన మత్స్యకారులు పేర్ల రాంబాబు, మైలిపల్లి సింగరాజు, గుంటి దుర్గ, గరికిన యల్లాజీ, గుంటి పోలయ్య, పేర్ల తాతారావు, కారె సింహాద్రిలు తమ బోటుతో కొత్తపాలెంలోని ఆయిల్ రిగ్ వద్ద లంగరు వేసి వేటాడుతున్నారు. ( మహోగ్ర వేణి ) ఈ నెల 10న వాయుగుండం కారణంగా గాలివాన ఎక్కువవడంతో వెనక్కి వచ్చేందుకు ప్రయత్నించగా ఇంజిన్ పనిచేయలేదు. ఆ సమయంలో బోటుకు ఉన్న తెరచాప సాయంతో ప్రయాణాన్ని మొదలెట్టారు. తిండి గింజలు అయిపోవడంతో రెండ్రోజులు మంచినీళ్లు మాత్రమే తాగారు. ఆ దశలో వారిని నిజాంపట్నం–బాపట్ల తీర ప్రాంతంలోని మత్స్యకారులు గుర్తించి మెరైన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. మెరైన్ పోలీసులు వెంటనే స్పందించి వారిని చీరాల వాడరేవు ఒడ్డుకు చేర్చారు. -
సెయిల్కు రూ.554 కోట్ల లాభం
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగంలోని స్టీల్ కంపెనీ సెయిల్ సెప్టెంబర్ క్వార్టర్కు రూ.553.69 కోట్ల స్టాండలోన్ లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో రూ.539 కోట్ల నష్టంతో పోలిస్తే మంచి పనితీరు చూపించింది. ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలంలో నమోదైన రూ.13,666 కోట్లతో పోలిస్తే 23 శాతం పెరిగి రూ.16,832 కోట్లకు చేరుకుంది. మొత్తం వ్యయాలు సైతం రూ.15,950 కోట్లకు పెరిగాయి. ఎబిట్డా 156 శాతం వృద్ధితో రూ.2,473 కోట్లుగా నమోదైంది. సామర్థ్యం మేరకు నిర్వహణ, రైల్వే అవసరాలైన చక్రాలు, యాక్సిల్స్ను సమకూర్చడం తమ ప్రాధాన్యతలని సెయిల్ చైర్మన్ అనిల్కుమార్ చౌదరి తెలిపారు. కొత్త ఉత్పత్తులతో కస్టమర్లను చేరుకోవడంపై దృష్టి సారిస్తామన్నారు. కంపెనీ నిర్వహణ పనితీరు, లాభాల్లో వేగవంతమైన రికవరీ, విస్తరణ, ఆధునికీకరణ అనుకూలతలను పూర్తిగా సద్వినియోగం చేసుకునేందుకు చేసిన సమష్టి కృషి ఫలితమే ఇదని కంపెనీ పేర్కొంది. -
డబ్బుల్లేవ్.. డివిడెండ్ ఇవ్వలేం..!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఉక్కు సంస్థ సెయిల్ .. గత ఆర్థిక సంవత్సరానికి గాను డివిడెండ్ చెల్లించలేమంటూ కేంద్రానికి స్పష్టం చేసింది. నగదు గానీ, బ్యాంక్ బ్యాలెన్స్ గానీ లేకపోవడమే ఇందుకు కారణమని పేర్కొంది. మిగతా అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే కేంద్రానికి సెయిల్ రూ. 2,171 కోట్లు చెల్లించాల్సి ఉంది. ‘మా దగ్గర నగదు గానీ బ్యాంక్ బ్యాలెన్స్ గానీ లేదు. డివిడెండ్ చెల్లించాలంటే రుణం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే, ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో రుణ సమీకరణ అనేది చాలా కష్టతరం. ఉక్కు పరిశ్రమలకు ఆర్థిక సంస్థలు, బ్యాంకులు మరిన్ని రుణాలివ్వడానికి సుముఖంగా లేవు‘ అని కేంద్రానికి రాసిన వివరణ లేఖలో సెయిల్ పేర్కొంది. ఈ పరిణామాలతో ప్రభుత్వ రంగ సంస్థల నుంచి డివిడెండ్లు, లాభాల్లో వాటాల రూపంలో రూ.1.06 లక్షల కోట్లు సమీకరిం చాలని బడ్జెట్లో నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించడం కేంద్రానికి కష్టతరంగా మారనుంది. 2017–18లో కంపెనీ నష్టాల నేపథ్యంలో డివిడెండ్ చెల్లించే పరిస్థితులు లేవని సంబంధిత వర్గాలు తెలిపాయి. -
రూ. 5 వేల కోట్లతో సెయిల్ ఉక్కు ప్లాంటు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఉక్కు దిగ్గజం సెయిల్ దాదాపు రూ. 5,000 కోట్లతో తలపెట్టిన ఆటోగ్రేడ్ ఉక్కు ప్లాంటు ఏర్పాటు కోసం స్థలాన్ని అన్వేషిస్తోంది. ఆంధ్రప్రదేశ్తో పాటు గుజరాత్, మహారాష్ట్ర వంటి మూడు రాష్ట్రాల్లో అనువైన ప్రాంతాలను పరిశీలిస్తోంది. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి చౌదరి బీరేందర్ సింగ్ ఈ విషయాలు తెలిపారు. ‘ఆర్సెలర్ మిట్టల్తో కలిసి ఏర్పాటు చేసే ప్లాంటు కోసం మూడు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలను పరిశీలిస్తున్నట్లు సెయిల్ వర్గాలు తెలిపాయి. ఒకటి మహారాష్ట్ర, రెండోది గుజరాత్ కాగా మూడోది ఆంధ్రప్రదేశ్‘ అని ఆయన వెల్లడించారు. ముందుగా వార్షికంగా 1.5 మిలియన్ టన్నుల సామర్ధ్యంతో ఈ ప్లాంటును నిర్మిస్తారని.. ఆ తర్వాత 2.5 మిలియన్ టన్నులకు విస్తరిస్తారని ఉక్కు మంత్రిత్వ శాఖ నిర్వహణలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు కార్పొరేట్ స్పోర్ట్స్ పాలసీని ఆవిష్కరించిన సందర్భంగా మంత్రి చెప్పారు. జాయింట్ వెంచర్ విధివిధానాలపై చర్చించేందుకు నెల రోజుల క్రితం ఆర్సెలర్మిట్టల్ చైర్మన్ లక్ష్మినివాస్ మిట్టల్, సెయిల్ అధికారులు సమావేశమైనట్లు ఆయన తెలిపారు. సాంకేతిక ఒప్పందాలకు సంబంధించి చర్చల ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. -
సెయిల్ లాభం రూ.540 కోట్లు
న్యూఢిల్లీ: దేశంలో అతి పెద్ద ఉక్కు కంపెనీ, సెయిల్ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రూ.540 కోట్ల నికర లాభం(స్టాండెలోన్) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.801 కోట్ల నికర నష్టాలు వచ్చాయని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) తెలిపింది. అమ్మకాలు అధికంగా ఉండటం, ధరలు పెరగడంతో ఈ క్యూ1లో భారీ స్థాయిలో నికర లాభం సాధించామని సెయిల్ చైర్మన్ సరస్వతీ ప్రసాద్ తెలిపారు. గత క్యూ1లో రూ.13,073 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ1లో రూ.16,005 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. వ్యయాలు రూ.14,350 కోట్ల నుంచి రూ.14,900 కోట్లకు ఎగిశాయని వివరించారు. ఈ క్యూ1లో విక్రయించదగ్గ ఉక్కు ఉత్పత్తి 13 శాతం పెరిగి 3.61 మిలియన్ టన్నులకు చేరిందని పేర్కొన్నారు. అమ్మకాలు 8 శాతం వృద్ధితో 3.271 మిలియన్ టన్నులకు పెరిగాయని వివరించారు. ఇబిటా 23 శాతం వృద్ధితో రూ.2,685 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. ఒక్కో టన్నుకు ఇబిటా ఈ క్యూ1లో రూ.8,211గా నమోదైందని వివరించారు. కంపెనీ నిర్వహణ పనితీరు రికార్డ్ స్థాయిలో మెరుగుపడిందని సరస్వతీ ప్రసాద్ తెలిపారు. ఇదే జోరు కొనసాగుతుందన్న ధీమాను వ్యక్తం చేశారు. తాము తీసుకున్న పలు కొత్త చర్యలు కంపెనీ పనితీరు, ఆర్థిక స్థితిగతులు మెరుగుపడటానికి కారణమయ్యాయని వివరించారు. మార్కెట్ ముగిసిన తర్వాత ఫలితాలు వెలువడ్డాయి. బీఎస్ఈలో సెయిల్ షేర్ 1 శాతం నష్టంతో రూ.79 వద్ద ముగిసింది. -
మళ్లీ లాభాల్లోకి సెయిల్
న్యూఢిల్లీ: ఉక్కు దిగ్గజం సెయిల్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో లాభాల బాట పట్టింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.771 కోట్ల నికర నష్టాలు రాగా, గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.816 కోట్ల నికర లాభాలు (స్టాండ్అలోన్) వచ్చాయని సెయిల్ తెలిపింది. ఆదాయం బాగా పెరగడంతో ఈ స్థాయిలో లాభాలు వచ్చాయని వివరించింది. మొత్తం ఆదాయం రూ.14,544 కోట్ల నుంచి రూ.17,265 కోట్లకు పెరిగిందని పేర్కొంది. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2016–17లో రూ.2,833 కోట్లుగా ఉన్న నికర నష్టాలు గత ఆర్థిక సంవత్సరంలో రూ.482 కోట్లకు తగ్గాయని సెయిల్ తెలిపింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో సెయిల్ షేర్ 2 శాతం నష్టంతో రూ.76 వద్ద ముగిసింది. -
మళ్లీ లాభాల్లోకి సెయిల్
న్యూఢిల్లీ: వరుసగా 10 త్రైమాసికాలపాటు నష్టాలు ప్రకటించిన ప్రభుత్వ రంగ ఉక్కు దిగ్గజం సెయిల్ మళ్లీ లాభాల్లోకి వచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్తో ముగిసిన మూడో త్రైమాసికంలో రూ. 43.16 కోట్ల నికర లాభం (స్టాండెలోన్) ప్రకటించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో సెయిల్ రూ.795 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. తాజా క్యూ3లో ఆదాయం రూ. 12,688 కోట్ల నుంచి రూ. 15,443 కోట్లకు పెరిగింది. మూడో త్రైమాసికంలో పన్నులకు ముందు లాభాలు రూ.82 కోట్లుగా నమోదైనట్లు సంస్థ చైర్మన్ పి.కె. సింగ్ తెలిపారు. సవాళ్లను సమర్థంగా అధిగమిస్తూ, లాభాల్లోకి మళ్లేందుకు కంపెనీ చేస్తున్న కృషి సత్ఫలితాలనిస్తోందని ఆయన పేర్కొన్నారు. తాజా లాభాలు... సంస్థ టర్న్ఎరౌండ్ అవుతోందనడానికి నిదర్శనమన్నారు. అధిక ఉత్పత్తి, సామర్థ్యాలను మెరుగుపర్చుకోవడం, వ్యయ నియంత్రణ చర్యలు, మార్కెటింగ్పై మరింతగా దృష్టి సారించడం తదితర అంశాలు సెయిల్ మళ్లీ లాభాల్లోకి మళ్లేందుకు దోహదపడ్డాయని సింగ్ చెప్పారు. ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకునే దిశగా వివిధ ప్రాజెక్టుల ఆధునీకరణ పనులు దాదాపు పూర్తయినట్లు తెలిపారు. వ్యాపార వృద్ధి వ్యూహాల్లో భాగంగా దేశ, విదేశాల్లో కొంగొత్త మార్కెట్లపై దృష్టి పెడుతున్నట్లు సింగ్ చెప్పారు. -
తగ్గిన సెయిల్ నష్టాలు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఉక్కు దిగ్గజం సెయిల్ నికర నష్టాలు ఈ ఆర్థిక సంవత్సరం జూలై–సెప్టెంబర్ క్వార్టర్లో తగ్గాయి. గత క్యూ2లో రూ.732 కోట్లుగా ఉన్న నికర నష్టాలు ఈ క్యూ2లో రూ.539 కోట్లకు తగ్గాయని సెయిల్ తెలిపింది. నికర అమ్మకాలు రూ.11,080 కోట్ల నుంచి 21 శాతం వృద్ధితో రూ.13,442 కోట్లకు పెరిగాయని సెయిల్ చైర్మన్ పి.కె. సిన్హా చెప్పారు. అధిక విలువ ఉన్న ఉత్పత్తుల వాటా పెంచుకోవడంపై దృష్టి సారించామని, నిర్వహణ వ్యయాల తగ్గింపుపై కూడా దృష్టి పెట్టామని, పటిష్టమైన ఆర్థిక నిర్వహణ, సమర్థవంతమైన ఉత్పత్తి కార్యకలాపాలు. ఇవన్నీ మంచి ఫలితాలనిస్తున్నాయని వివరించారు. ఈ క్యూ2లో విక్రయం కాగల ఉక్కు ఉత్పత్తి 3.659 మిలియన్ టన్నులకు చేరిందని, తమ కంపెనీ చరిత్రలో ఒక క్వార్టర్లో ఈ స్థాయి ఉత్పత్తి జరగడం ఇదే రికార్డని కంపెనీ వివరించింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో సెయిల్ షేర్ 1.7 శాతం లాభంతో రూ.78 వద్ద ముగిసింది. -
ప్రభుత్వ సంస్థలపై బ్యాంకు బకాయిల బండ!
• రంగంలోకి ఎన్టీపీసీ, సెయిల్, కొచ్చిన్ షిప్యార్డ్ • రుణ భారం ఈక్విటీ రూపంలో బదలాయింపు • సంధానకర్తలుగా కార్యదర్శులు న్యూఢిల్లీ: ఒత్తిడిలో ఉన్న బ్యాంక్ల మొండి బకాయిల సమస్య పరిష్కారానికి కేంద్రం కీలక చొరవకు శ్రీకారం చుట్టింది. ఆయా కార్పొరేట్లు చెల్లించాల్సివున్న రుణాల్లో కొంత మొత్తాన్ని ఈక్విటీగా మార్చి దానిని ప్రభుత్వ రంగ సంస్థలకు (పీఎస్యూ) అప్పగించాలన్నది తాజా నిర్ణయం. ఈ దిశలో ఎన్టీపీసీ, సెయిల్, కొచ్చిన్ షిప్యార్డ్ సంస్థలు తొలి విడతలో ముందుకొచ్చాయి. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో సోమవారం నాడు ఇక్కడ స్టీల్, విద్యుత్, షిప్పింగ్ రంగాల్లో ఒత్తిడిలో ఉన్న బకాయిల భారం గురించి చర్చ జరిగింది. ఎన్టీపీసీ, సెయిల్, కొచ్చిన్షిప్యార్డ్ చీఫ్లు, ప్రభుత్వ కార్యదర్శులతోపాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ అరుంధతీ భట్టాచార్య, ఐసీఐసీఐ బ్యాంక్ సీఈఓ అండ్ చందాకొచర్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీఎండీ రజీవ్ రాషీ తదితర బ్యాంకింగ్ అధికారులు సమావేశానికి హాజరయ్యారు. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి, ఫైనాన్షియల్ సేవల శాఖ అధికారులు, పీఎంఓ ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయిన వారిలో ఉన్నారు. ఈ సమావేశంలో తాజా కీలక నిర్ణయం జరిగింది. ఈ సమావేశంలో జైట్లీ ఏమన్నారంటే.. ♦ మొండిబకాయిల సమస్య పరిష్కారించే దిశలో తాజా నిర్ణయం కీలకమైనది. ♦ తాజా నిర్ణయం అమలులో సంబంధిత రంగాల కార్యదర్శులు.. ఆయా కార్పొరేట్లు -బ్యాంకులకు అనుసంధాన కర్తలుగా వ్యవహరిస్తారు. ♦ రుణాన్ని ఈక్విటీగా మార్చే ప్రక్రియలో బ్యాంకులు కీలకపాత్ర పోషించాల్సి ఉంటుంది. బకాయి పడిన సంస్థలకు సంబంధించి నియంత్రణ, బకాయిలను ఈక్విటీగా మార్చ డం, ఈ దిశలో నిపుణులైన వ్యక్తులతో కమిటీ ఏర్పాటు వంటి అంశాలు బ్యాంకింగ్ పరంగా ముఖ్యమైనవి. ♦ ఈ పక్రియ తక్షణం ప్రారంభమవుతుందని భావిస్తున్నా. కొన్ని ఆస్తులను స్వీకరించడానికి ఎవ్వరూ ముందుకురాని పరిస్థితుల్లో, కొనేవారిని సృష్టించాల్సి ఉంటుంది. టీడీఎస్ కోతలపై వేతన జీవులకు ఎస్ఎంఎస్ ఇదిలాఉండగా, త్రైమాసికంగా సోర్స్ వద్ద పన్ను కోత (టీడీఎస్)కు సంబంధించి ఆయా ఉద్యోగులకు ఎస్ఎంఎస్ అలెర్ట్ అందనుంది. దాదాపు 2.5 కోట్ల మందికి ఆదాయపు పన్ను శాఖ నుంచి తాజా సేవలు అందనున్నాయి. ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో తాజా ఈ సేవలను ప్రారంభించారు. త్వరలో నెలవారీగా కూడా ఈ సేవలను విస్తరించడం జరుగుతుందని అరుణ్జైట్లీ తెలిపారు. -
ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు అనుకూలం
కడప రూరల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తే కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు అన్నీ అనుకూలంగానే ఉన్నాయని టీడీపీ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి సాయిప్రతాప్ అన్నారు. స్థానిక వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్ర విభజన చట్టంలో కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలనే అంశం ఉందన్నారు. ఉక్కు ఫ్యాక్టరీకి ఈ ప్రాంతం అనుకూలంగా లేదని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి వ్యాఖ్యానించడం తగదన్నారు. ఉక్కు ఫ్యాక్టరీకి ఇక్కడ ఉన్న అనుకూల అంశాలను వివరించారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు కేంద్రం దృష్టికి తీసుకు వెళ్తామన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య మాట్లాడుతూ కడప ఉక్కు ఫ్యాక్టరీ అంశంపై స్పందించాలని సాయిప్రతాప్కు వినతిపత్రం సమర్పించినట్లు పేర్కొన్నారు. పార్టీలు, రాజకీయాలకు అతీతంగా అందరూ ఉద్యమించాలని కోరారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు కృష్ణమూర్తి, ఎల్.నాగసుబ్బారెడ్డి, వెంకటశివ, డబ్లు్య రాము, గంగా సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
సెయిల్ నష్టాలు రూ.1,529 కోట్లు
న్యూఢిల్లీ: ధరలు తగ్గి చైనా తదితర దేశాల నుంచి ఉక్కు దిగుమతులు భారీగా పెరిగిపోవడంతో ప్రభుత్వ రంగ దిగ్గజం సెయిల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో భారీగా నష్టాలు చవిచూసింది. స్టాండెలోన్ ప్రాతిపదికన క్యూ3లో ఏకంగా రూ. 1,529 కోట్ల నష్టాలు నమోదు చేసింది. అంతక్రితం డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ రూ. 579 కోట్ల లాభం ఆర్జించింది. ఇక మొత్తం ఆదాయం 19.5 శాతం క్షీణించి రూ. 11,107 కోట్ల నుంచి రూ. 8,939 కోట్లకు తగ్గింది. వ్యయాలు స్వల్పంగా పెరిగి రూ. 10,371 కోట్లుగా నమోదయ్యాయి. క్యూ3లో నికర అమ్మకాలు 24 శాతం తగ్గడంతో నికరంగా రూ. 1,529 కోట్ల నష్టాలు వచ్చాయని సెయిల్ ఒక ప్రకటనలో తెలిపింది. చైనాలో వినియోగం మందగించడం దరిమిలా అంతర్జాతీయంగా ఉక్కు ధరలు 460 డాలర్ల నుంచి 280 డాలర్లకు పడిపోవడం, చౌకగా దిగుమతులు మార్కెట్లను ముంచెత్తడం తెలిసిందే. అంతర్జాతీయంగా ధరల పతనంతో దేశీ ఉక్కు సంస్థలకు ప్రతికూల పరిస్థితులు ఉంటున్నాయని సెయిల్ చైర్మన్ పి.కె. సింగ్ తెలిపారు. అయితే, ప్రభుత్వం ఇటీవల ఇన్ఫ్రా రంగానికి ఊతమిచ్చే చర్యలు ప్రకటించడంతో ఉక్కు వినియోగం పెరగవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. -
సెయిల్ కొత్త చైర్మన్ పీకే సింగ్
న్యూఢిల్లీ: సెయిల్ కొత్త చైర్మన్గా పీకే సింగ్ ఎంపికయ్యారు. దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ సీఈవోగా ఉన్న పీకే సింగ్ను పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలెక్షన్ బోర్డు (పీఈఎస్బీ) స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) చైర్మన్గా ఎంపిక చేసింది. ఈయన దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ సీఈవోగా 2012లో పగ్గాలు చేపట్టారు. పీకే సింగ్ ఐఐటీ-రూర్కీ పూర్వ విద్యార్థి. గతంలో సెయిల్ చైర్మన్గా సీ.ఎస్. వర్మ ఉండేవారు. జూన్ నెలలో ఆయన పదవీ కాలం ముగియడంతో ఆ బాధ్యతలను కొత్త చైర్మన్ నియామకం జరిగేంత వరకు స్టీల్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాకేశ్ సింగ్ పర్యవే క్షించారు. -
ఉక్కు తయారీలో అగ్రస్థానమే లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: ఉక్కు తయారీలో ప్రపంచంలోనే అగ్రస్థానాన్ని చేరుకునేందుకు కేంద్రప్రభుత్వం భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) డెరైక్టర్ ఎస్.ఎస్.మహంతి తెలిపారు. దేశంలో ఇనుము, ఉక్కు రంగాల్లో జరుగుతున్న పరిశోధనలన్నింటినీ సమన్వయపరిచేందుకు, తద్వారా ఈ రంగంలో ఉన్నత స్థానానికి ఎదిగేందుకు స్టీల్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీ మిషన్ ఆఫ్ ఇండియా పేరుతో ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ. వంద కోట్లు, ప్రైవేట్ కంపెనీలు మరో రూ.వంద కోట్లు అందించాయని, ఈ మూలధనంతో సంస్థ పనిచేస్తుందని చెప్పారు. హైదరాబాద్లో గురువారం మిశ్రధాతు నిగమ్ (మిధాని), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెటల్స్లు ఏర్పాటు చేసిన జాతీయ సదస్సుకు మహంతి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోహాల తయారీలో భారత్ ఇతర దేశాలకు ఏమాత్రం తీసిపోదని, అయితే భవిష్యత్ అవసరాల దృష్ట్యా పరిశోధనలను ముమ్మరం చేసేందుకు కొత్త కేంద్రం ఉపకరిస్తుందన్నారు. భారత్ అభివృద్ధి చేస్తున్న యుద్ధ వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్లో ఉపయోగించిన ప్రత్యేకమైన ఉక్కు మొత్తం స్వదేశంలోనే తయారైందని మరే ఇతర దేశం ఇలాంటి ఘనత సాధించలేదని చెప్పారు. సీఆర్జీవో స్టీల్ తయారీకి ఒప్పందం విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లలో ఉపయోగించే సీఆర్జీవో ఉక్కు తయారీని దేశీయంగానే చేపట్టేందుకు మిశ్రధాతు నిగమ్ సెయిల్తో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుందని సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ ఎం.నారాయణరావు తెలిపారు. ఏటా కొన్ని లక్షల టన్నుల సీఆర్జీవో ఉక్కును దిగుమతి చేసుకుంటున్నామని, సొంతంగా తయారు చేసుకుంటే విదేశీ మారకద్రవ్యం ఆదా అవుతుందని చెప్పారు. ఇందుకు తగ్గ వసతులు మిశ్రధాతు నిగమ్లో అందుబాటులోనే ఉన్నాయని అన్నారు. సెయిల్కు చెందిన భద్రావతి స్టీల్స్లో ఈ ప్రత్యేక ఉక్కును తయారు చేసి మిధానీలో దాన్ని మరింత అభివృద్ధి చేయవచ్చునన్నారు. కార్యక్రమంలో ఎన్ఎండీసీ సీఎండీ నరేంద్ర కొఠారీ, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ డిప్యూటీ డెరైక్టర్ వెంకట కృష్ణన్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెటల్స్ డెరైక్టర్ అమోల్ గోఖలే తదితరులు పాల్గొన్నారు. -
సెయిల్ తాత్కాలిక సీఎండీగా స్టీల్ సెక్రటరీ రాకేశ్ సింగ్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని సెయిల్ (స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా) తాత్కాలిక సీఎండీగా స్టీల్ శాఖ కార్యదర్శి రాకేశ్ సింగ్ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకూ సీఎండీగా బాధ్యతలు నిర్వహించిన సీఎస్ వర్మ బుధవారం పదవీ విరమణ నేపథ్యంలో రాకేశ్ సింగ్ ఈ బాధ్యతలను చేపట్టినట్లు సెయిల్ గురువారం బీఎస్ఈకి పంపిన ఒక ఫైలింగ్లో తెలిపింది. సంస్థ సీఎండీగా కొత్త నియామకం జరిగే వరకూ రాకేశ్ సింగ్ ఈ బాధ్యతలను నిర్వహిస్తారని పేర్కొంది. -
అధికారమస్తు
సాక్షి, ఖమ్మం: రాష్ట్ర కేబినెట్లో ఆరునెలల తర్వాత జిల్లాకు ఓ మంత్రి పదవి, మరో సహాయ మంత్రి హోదా దక్కనుంది. సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్కు జిల్లాలో ఒక్క స్థానమే రావడంతో తొలి మంత్రివర్గంలో చోటు లభించలేదు. ఆ తర్వాత మారిన రాజకీయ సమీకరణలతో రెండో విడత మంత్రివర్గ విస్తరణలో జిల్లాకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాధాన్యమిచ్చారు. నామినేటెడ్ రేసులో ఇప్పటికే జిల్లాకు చెందిన పిడమర్తి రవికి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కిన నేపథ్యంలో ఇక అభివృద్ధికి అడుగులు పడతాయని జిల్లా ప్రజలు గంపెడాశతో ఉన్నారు. తొలి కేబినెట్లో జిల్లా నుంచి మంత్రి లేకపోవడంతో ప్రధాన అభివృద్ధి పనులన్నీ ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అనే చందంగా మారాయి. జిల్లాలో అభివృద్ధి, ప్రతిపాదిత పనుల ప్రస్తావనను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంలో జాప్యం జరిగింది. జిల్లా ప్రజల ఆశలసౌధం రాజవ్సాగర్ ( దుమ్ముగూడెం ) ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయి. ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన బడ్జెట్లోనూ ఈ ప్రాజెక్టుకు అత్తెసరు నిధులే కేటాయించారు. ఈ ప్రభుత్వ హయాంలోనైనా ఈ ప్రాజెక్టు పూర్తవుతుందా..? అని జిల్లా వాసులు నిరీక్షిస్తున్నారు. జిల్లా వాసులకు ఉపాధి కల్పతరువు కాబోతుందని ఊరిస్తున్న బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణం ఇప్పటి వరకు కాగితాలకే పరిమితమైంది. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్ ) ప్రతినిధుల బృందం స్టీల్ ఫ్యాక్టరీ సాధ్యాసాధ్యాలపై సర్వే చేసుకొని వెళ్లి నెలలు గడిచినా ఇప్పటి వరకు ఫ్యాక్టరీ నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ మాత్రం రాలేదు. ఇప్పటికే పారిశ్రామిక కారిడార్గా ఉన్న కొత్తగూడెం, పాల్వంచ, మణుగూరు ప్రాంతాలు విద్యుత్ హబ్గా మారబోతున్నాయి. రూ.వేల కోట్లు ఖర్చు చేసి ప్రభుత్వం మణుగూరులో నిర్మించ తలపెట్టిన పవర్ ప్లాంట్ల నిర్మాణానికి ముందుకు వెళ్తున్నా ఇక్కడ నిర్వాసితుల గోడు వినిపించుకోవడం లేదు. నిర్వాసితులు మెరుగైన పరిహారం కోసం ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం మాత్రం వారి సమస్యపై దృష్టి పెట్టలేకపోతోంది. పవర్ప్రాజెక్టు త్వరితగతిన పూర్తయితే స్థానికంగా ఉండే తమకు ఉపాధి దొరుకుతుందని ఈ ప్రాంత యువత వేయికళ్లతో ఎదురుచూస్తోంది. మిషన్ కాకతీయతో చెరువుల పునరుద్ధరణ, రోడ్ల అభివృద్ధి పనులన్నీ జిల్లాకు కేబినెట్లో స్థానం లేకపోవడంతోనే ఇన్నాళ్లు నత్తనడకన కొనసాగుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. జిల్లాలో చేయాల్సిన అభివృద్ధి పనులు, సమస్యలను అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లుతున్నా సర్కారు అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదనే చెప్పవచ్చు. బొగ్గు గనుల దృష్ట్యా మణుగూరులో పవర్ ప్లాంటు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపినా.. బయ్యారం స్టీల్ ప్లాంట్ విషయంలో మాత్రం కేంద్రంపై ఒత్తిడి తేవాల్సి ఉంది. జిల్లాకు మంత్రి పదవి, మరో సహాయ మంత్రి హోదా దక్కుతుండడంతో ఇకనైనా ప్రధానపనులన్నీ వేగవంతం చేస్తారని జిల్లా ప్రజలు ఆశిస్తున్నారు. జిల్లాకు ప్రధాన పదవులు.. ప్రభుత్వం ఏర్పడి ఆర్నెల్లయిన తర్వాత జిల్లాకు ప్రధాన పదవులు దక్కుతున్నాయి. సత్తుపల్లి నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి ఓడిపోయిన ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థి జేఏసీ నేత పిడమర్తి రవికి ఇటీవల ముఖ్యమంత్రి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవి కట్టబెట్టారు. నామినేటెడ్ కేటగిరీలో రాష్ట్రంలో తొలిసారిగా జిల్లాకే ఈ పదవి దక్కింది. కేబినెట్ విస్తరణలో మాజీ మంత్రి, ఇటీవల టీఆర్ఎస్లో చేరిన తుమ్మల నాగేశ్వరరావుకు మంత్రి పదవి, కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావుకు సహాయ మంత్రి హోదా కలిగిన పార్లమెంట్ కార్యదర్శి పదవులు దక్కబోతున్నాయి. తుమ్మలకు రోడ్లు, భవనాలు లేదా హోం శాఖ ఇస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. నామినేటెడ్ కేటగిరీలో రాష్ట్రస్థాయిలో మరికొన్ని పదవులు దక్కే అవకాశం ఉన్నట్లు ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. గతంలో టీఆర్ఎస్ అభ్యర్థులుగా పోటీచేసి ఓడిపోయిన అభ్యర్థులు ఈ పదవులు కోసం ఇప్పటికే పోటీపడుతున్నారు. జిల్లాకు పదవుల యోగం పడుతుండటంతో జిల్లాలోని టీఆర్ఎస్ శ్రేణులు సంవత్సరాంతాన్ని ఘనంగా ముగించేందుకు సన్నద్ధమవుతున్నారు. మిగిలింది నాలుగున్నరేళ్లు.. ఈ ప్రభుత్వ హయాంలో జిల్లాకు మంత్రి పదవి యోగం పట్టేసరికి ఆరునెలలు పూర్తయ్యాయి. ప్రభుత్వం ఏ పనిచేయాలన్నా మిగిలిన నాలుగున్నరేళ్లలోనే అభివృద్ధిని పట్టాలెక్కించాలి. ప్రధానంగా బయ్యారం స్టీల్ ప్లాంట్ నిర్మాణాన్ని టీఆర్ఎస్ తన ఎన్నికల అజెండాలో పెట్టింది. విద్యుత్ అవసరాల దృష్ట్యా పవర్ ప్లాంట్ల నిర్మాణం చేయడం ప్రభుత్వానికి సునాయాసం అయితే, కేంద్రాన్ని ఒప్పించి స్టీల్ ప్లాంట్ సాధించడం రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. స్టీల్ ఫ్యాక్టరీ మంజూరై నిర్మాణం కొంతైనా జరిగితేనే వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి జిల్లాలో టీఆర్ఎస్కు పట్టు ఉంటుందని ఆ పార్టీ భావిస్తోంది. జిల్లా నుంచి మంత్రి, పార్లమెంట్ కార్యదర్శి పదవులు పొందుతున్న వారిపైనే ఈ గురుతర బాధ్యత ఉందని జిల్లా ప్రజానీకం చర్చించుకుంటోంది. -
సెయిల్ డిజిన్వెస్ట్మెంట్ సక్సెస్
ప్రభుత్వ ఖజానాకు రూ. 1,715 కోట్లు న్యూఢిల్లీ: స్టీల్ రంగ దిగ్గజం సెయిల్ వాటా విక్రయానికి ఇన్వెస్టర్ల నుంచి రెట్టింపు స్పందన లభించింది. డిజిన్వెస్ట్మెంట్లో భాగంగా ప్రభుత్వం 20.65 కోట్ల షేర్లను(5% వాటా) అమ్మకానికి పెట్టగా, మొత్తం 42.93 కోట్ల షేర్లకు బిడ్స్ దాఖల య్యాయి. ఆఫర్కు నిర్ణయించిన రూ. 83 ధర ప్రకారం ప్రభుత్వానికి రూ. 1,715 కోట్లు లభిం చనున్నాయి. దీంతో కంపెనీలో ప్రభుత్వ వాటా 75%కు పరిమితం కానుంది. తద్వారా సెబీ లిస్టింగ్ నిబంధనలు అమలు కానున్నాయి. ఆఫర్ ఫర్ సేల్ మార్గంలో నిర్వహించిన ఇష్యూలో భాగంగా రిటైల్ ఇన్వెస్టర్లకు 5% డిస్కౌంట్ ధరకు సెయిల్ షేర్లు జారీకానున్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లకు 2 కోట్ల షేర్లను ఆఫర్ చేయగా, ఈ విభాగం నుంచి ఇష్యూకి 2.66 రెట్లు అధికంగా స్పందన లభించింది. ఇక సాధారణ విభాగంలో 2 రెట్లు అధికంగా బిడ్స్ దాఖల య్యాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో డిజిన్వెస్ట్మెంట్ ద్వారా రూ. 43,425 కోట్లను సమీకరించాలని బడ్జెట్లో ప్రభుత్వం ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఇందుకు వీలుగా ఓఎన్జీసీ, కోల్ ఇండియా, ఎన్హెచ్పీసీ తదితరాలలో సైతం వాటాల విక్రయాన్ని చేపట్టనుంది. కాగా, బీఎస్ఈలో సెయిల్ షేరు 3 శాతం క్షీణించి రూ.83 వద్ద ముగిసింది. -
సెయిల్ డిజిన్వెస్ట్మెంట్ ధర రూ. 83
నేడు వాటాల విక్రయం న్యూఢిల్లీ: సెయిల్ షేర్ల విక్రయ ధరను ప్రభుత్వం రూ. 83గా ఖరారు చేసింది. డిజిన్వెస్ట్మెంట్లో భాగంగా ప్రభుత్వం 5% వాటాకు సమానమైన 20.65 కోట్ల షేర్లను శుక్రవారం అమ్మకానికి పెట్టనుంది. తద్వారా ప్రభుత్వానికి రూ. 1,500-1,700 కోట్ల మధ్య నిధులు లభించనున్నాయి. కాగా, బీఎస్ఈలో గురువారం సెయిల్ షేరు 85.35 వద్ద ముగిసింది. దీంతో పోలిస్తే డిజిన్వెస్ట్మెంట్కు 2.75% డిస్కౌంట్ ధరను ప్రభుత్వం నిర్ణయించింది. ఇష్యూలో భాగంగా రిటైల్ ఇన్వెస్టర్లకు ధరలో 5% డిస్కౌంట్ను ఆఫర్ చేస్తోంది. -
ఉద్యోగాలు
ఎన్టీపీసీ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) కింద పేర్కొన్న ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఎగ్జిక్యూటివ్ ట్రైనీ విభాగాలు: ఎలక్ట్రికల్, మెకానికల్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అర్హతలు: 60 శాతం మార్కులతో ఎమ్మెస్సీ/ఎంటెక్(బయోటెక్నాలజీ) ఉత్తీర్ణత. దరఖాస్తు విధానం: గేట్ 2015 రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చిన తర్వాత ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఎంపిక: గేట్ స్కోరు ఆధారంగా గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్: డిసెంబర్ 20 నుంచి జనవరి 19 వెబ్సైట్: http://www.ntpc.co.in/ సెయిల్ పశ్చిమ బెంగాల్లోని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. స్పెషలిస్ట్స్/మెడికల్ ఆఫీసర్స్ విభాగాలు: ఫిజీషియన్, పిడియాట్రిక్స్, ఆర్థోపెడిక్ సర్జన్, ఆక్యుపేషనల్ హెల్త్ పారా మెడికల్ స్టాఫ్ విభాగాలు: స్టాఫ్ నర్స్(ఫిమేల్) ట్రైనీ, స్టాఫ్ నర్స్(మేల్) ట్రైనీ, ఫార్మాసిస్ట్, ఎక్స్రే టెక్నీషియన్, పబ్లిక్ హెల్త్ ఇన్స్పెక్టర్ అటెండెంట్ కం టెక్నీషియన్(బాయిలర్ ఆపరేషన్) ఆపరేటర్ కం టెక్నీషియన్ (బాయిలర్ ఆపరేషన్) అటెండెంట్ కం టెక్నీషియన్(ట్రైనీ)- డంపర్ ఆపరేటర్ అర్హతలు తదితర పూర్తి వివరాలకోసం నోటిఫికేషన్ చూడొచ్చు. ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఆన్లైన్ రిజిస్ట్రేషన్: అక్టోబర్ 10 నుంచి నవంబర్ 3 వెబ్సైట్: http://www.sail.co.in -
మార్స్ మిషన్లో సెయిల్ ఉక్కు
హైదరాబాద్: అంగారక గ్రహానికి పంపిన మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్)లో తమ భాగస్వామ్యం కూడా ఉందని ఉక్కు దిగ్గజం సెయిల్ పేర్కొంది. అరుణ గ్రహానికి వెళ్లిన పీఎస్ఎల్వీకి సంబంధించి ఇంధనం, ఆక్సిడైజర్ ట్యాంకుల ఫ్యాబ్రికేషన్లో సెయిల్ ఉక్కును ఉపయోగించినట్లు వివరించింది. ఇందుకోసం సేలంలోని స్టీల్ ప్లాంటులో తయారైన ఉక్కును వినియోగించినట్లు సంస్థ చైర్మన్ సీఎస్ వర్మ తెలిపారు. ఇంధన, ఆక్సిడైజర్ల ప్రతిచర్యలను ఎదుర్కొని దీర్ఘకాలం పాటు ఎటువంటి లీకేజీలు లేకుండా ఇది మన్నుతుందని ఆయన వివరించారు. గతంలోనూ పలు పీఎస్ఎల్వీలకు స్టెయిన్లెస్ స్టీల్ను అందించినట్లు ఆయన వివరించారు. -
నెలాఖర్లో సెయిల్ డిజిన్వెస్ట్మెంట్
న్యూఢిల్లీ: ఈ నెల 24-26 మధ్య ప్రభుత్వ రంగ సంస్థ సెయిల్లో డిజిన్వెస్ట్మెంట్ జరిగే అవకాశముందని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. దీనిలో భాగంగా ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) మార్గంలో ప్రభుత్వం 5% వాటాకు సమానమైన 20.65 కోట్ల షేర్లను విక్రయించనున్నట్లు తెలిపారు. బీఎస్ఈలో మంగళవారంనాటి ముగింపు ధర రూ. 77.15 ప్రకారం చూస్తే డిజిన్వెస్ట్మెంట్ ద్వారా ప్రభుత్వానికి రూ. 1,600 కోట్లు లభించే అవకాశముంది. ఇందుకు ఇప్పటికే రోడ్షోలు పూర్తయినట్లు ప్రభుత్వ అధికారి వెల్లడించారు. వెరసి సెయిల్ ద్వారా ప్రభుత్వం డిజిన్వెస్ట్మెంట్ ప్రక్రియకు ఊపునివ్వనున్నట్లు పేర్కొన్నారు. నిజానికి సెయిల్లో 10.82% వాటాను విక్రయించేందుకు 2012 జూలైలోనే కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. దీనిలో భాగంగా 2013 మార్చిలో తొలి దశకింద 5.82% వాటాను అమ్మివేసింది కూడా. లక్ష్యంవైపు చూపు ఈ ఆర్థిక సంవత్సరం(2014-15)లో ఎంపిక చేసిన ప్రభుత్వ రంగ సంస్థల్లో(పీఎస్యూలు) వాటాల విక్రయం ద్వారా రూ. 43,425 కోట్లను సమీకరించాలని బడ్జెట్లో ఆర్థిక శాఖ ప్రతిపాదించింది. దీనిలో 30% వరకూ అంటే రూ. 18,000 కోట్లను ఒక్క ఓఎన్జీసీ ఇష్యూ ద్వారానే సమకరించేందుకు అవకాశముంది. కాగా, డిజిన్వెస్ట్మెంట్లో భాగంగా ప్రభుత్వం సెయిల్, ఓఎన్జీసీలతోపాటు, కోల్ ఇండియా, ఎన్హెచ్పీసీ, పీఎఫ్సీ, ఆర్ఈసీలలో వాటాలను విక్రయించేందుకు నిర్ణయించింది. ప్రభుత్వ సంస్థల్లో డిజిన్వెస్ట్మెంట్కు ఓఎఫ్ఎస్ మార్గాన్ని ఎంచుకుంది. రిటైల్ ఇన్వెస్టర్లకు అధిక అవకాశాలను కల్పించే బాటలో ప్రభుత్వం రిటైల్ కోటాను పెంచడమేకాకుండా ఆఫర్ ధరలో డిస్కౌంట్ను సైతం అందిస్తోంది. సాధారణంగా ఓఎఫ్ఎస్కు ధరను ఒక రోజు ముందు మాత్రమే ప్రకటిస్తోంది. ఇక ఇష్యూ తేదీని రెండు రోజుల ముందు ప్రకటించనుంది. సెబీ ఓకే ఓఎఫ్ఎస్ ద్వారా షేర్ల విక్రయాన్ని చేపట్టేందుకు టాప్-100 కంపెనీలను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ 2013 జనవరిలో అనుమతించింది. ఓఎఫ్ఎస్లో భాగంగా లిస్టెడ్ కంపెనీలు షేర్ల అమ్మకాన్ని వేలం ద్వారా నిర్వహిస్తాయి. మరోవైపు పబ్లిక్కు కనీసం 25% వాటా కల్పించేందుకు వీలుగా ఓఎఫ్ఎస్ను చేప్టేందుకు పీఎస్యూలకు సైతం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. -
75 వేల కోట్లతో తెలంగాణ బడ్జెట్!
* పథకాలకు నిధుల కొరత అడ్డంకి కాదు * రైతులరుణాలు నాలుగైదేళ్లలో బ్యాంకులకు చెల్లిస్తాం * ఓ న్యూస్ చానల్తో ముఖాముఖీలో సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సుమారు రూ.75 వేల కోట్లకు పైగా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తెలిపారు. అందులో ప్రణాళిక వ్యయం రూ.35 వేల కోట్లు, ప్రణాళికేతర వ్యయం రూ.40 వేల కోట్లు ఉంటుందన్నారు. దీనితో పాటే హామీలను నెరవేర్చేందుకు ప్రభుత్వం మరో 35 వేల కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకోవాల్సి ఉంటుందన్నారు. కాగా, బుధవారం రాష్ట్ర కేబినెట్ ఆమోదించిన నిర్ణయాల అమలుకు నిధుల కొరత అడ్డంకి కాబోదని ఆయన స్పష్టం చేశారు. గురువారం ఓ న్యూస్ చానల్ మూడుగంటల పాటు నిర్వహించిన ‘ప్రజలతో ముఖాముఖి’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధరంగాలవారు అడిగిన ప్రశ్నలకు కేసీఆర్ వివరంగా సమాధానాలిచ్చారు. రాష్ట్రంలో అపారమైన భూ, ఖనిజ సంపద, మానవ వనరులున్నాయని చెప్పారు. భూముల క్రమబద్దీకరణ, పన్నుల పాతబకాయిల వసూళ్లు, కొత్త పరిశ్రమలు ఏర్పడితే వచ్చే ఆదాయం తదితర ఆదాయాలను సమన్వయపరిచి అదనంగా సొమ్ము సంపాదిస్తామన్నారు. లక్ష రూపాయలలోపు వ్యవసాయ రుణాల మాఫీకి రూ.19 వేల కోట్ల నిధులు అవసరమన్నారు. వాటిని నాలుగైదేళ్లలో వాయిదాపద్ధతిలో ప్రభుత్వమే వడ్డీతో బ్యాంకులకు చెల్లిస్తుందన్నారు. బయ్యారం,ఇనుముగుట్ట,సిద్దిపేటల్లో ఉక్కుకార్మాగారాలు... ఖమ్మం జిల్లా బయ్యారంలో రూ.30 వేల కోట్లతో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేసేందుకు స్టీల్ ఆథారిటీ ఆఫ్ ఇండియా సంసిద్ధత వ్యక్తం చేసిందన్నారు. అందులో 10 వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. కరీంనగర్ జిల్లా ఇనుముగుట్టలో రూ.10 కోట్లతో మరో ఉక్కు పరిశ్రమ, మెదక్ జిల్లా సిద్దిపేటలో రూ.15 వేల కోట్లతో ఇంకో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఉచిత నిర్బంధవిద్యను అమలు చేయడం తన అతిపెద్ద కల అని కేసీఆర్ పేర్కొన్నారు. వచ్చే ఏడాది నుంచి ప్రతి మండలంలోని ఓ పాఠశాలలో దీనిని అమలు చేస్తామన్నారు.ముస్లింల సామాజిక, ఆర్థిక స్థితి గతులపై అధ్యయన కమిటీ నుంచి మూడు నాలుగు నెలల్లో నివేదిక తెప్పించుకుని, 12 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు. సామాజిక పింఛన్లు స్వాహా చేస్తున్న అనర్హులు స్వచ్ఛందంగా ముందుకు వస్తే చర్యలు తీసుకోబోమన్నారు. ప్రభుత్వ ఏరివేతలో పట్టుబడితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. -
షెవర్లే బీట్, సెయిల్లో మాంచెస్టర్ వేరియంట్లు
న్యూఢిల్లీ: జనరల్ మోటార్స్(జీఎం) కంపెనీ బీట్, సెయిల్ మోడళ్లలో స్పెషల్ ఎడిషన్లను సోమవారం మార్కెట్లోకి విడుదల చేసింది. ప్రముఖ ఇంగ్లిష్ ఫుట్బాల్ క్లబ్ మాంచెస్టర్ యునెటైడ్తో ఒప్పందాన్ని పురస్కరించుకొని షెవర్లే బీట్, సెయిల్ మోడళ్లలో ఈ మాంచెస్టర్ యునెటైడ్ లిమిటెడ్ ఎడిషన్లను అందిస్తున్నామని కంపెనీ పేర్కొంది. మాంచెస్టర్ యునెటైడ్ ఫుట్బాల్ టీమ్ జెర్సీలపై షెవర్లే బ్రాండ్ ఆగమనం సందర్భంగా ఈ లిమిటెడ్ ఎడిషన్లను అందుబాటులోకి తెస్తున్నామని వివరించింది. ఈ స్పెషల్ ఎడిషన్ కార్లు ఫుట్బాల్ ప్రియులను అలరించగలవన్న ఆశాభావాన్ని జీఎం ఇండియా ప్రెసిడెంట్, ఎండీ అర్వింద్ సక్సేనా వ్యక్తం చేశారు. బీట్, సెయిల్ మోడళ్లకు సంబందించి ఎల్ఎస్ వేరియంట్లలో పెట్రోల్, డీజిల్ ఇంజిన్లతో అందించే ఈ స్పెషల్ ఎడిషన్ కార్లు, ప్రస్తుతమున్న ఈ మోడల్ కార్ల ధర కంటే రూ.69,000 అధికమని వివరించారు. ప్రస్తుతం బీట్ ఎల్ఎస్ వేరియంట్లో పెట్రోల్ కారు రూ.4.22 లక్షలకు, డీజిల్ కారు రూ.5.05 లక్షలకు, సెయిల్ ఎల్ఎస్ వేరియంట్లో పెట్రోల్ కారు రూ. 4.72 లక్షలకు, డీజిల్ కారు రూ.5.86 లక్షలకు(అన్నీ ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) విక్రయిస్తోంది. -
సెబీ సంస్కరణల మోత...
బోర్డు సమావేశంలో పలు ప్రతిపాదనలకు ఆమోదం.. పీఎస్యూల్లో 25 శాతం పబ్లిక్ వాటా తప్పనిసరి; మూడేళ్ల గడువు ఐపీఓ, ఓఎఫ్సీ నిబంధనల్లోనూ మార్పులు... ఎసాప్స్ స్కీమ్లకు కొత్త నిబంధనలు... న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్లో ఇటు ఇన్వెస్టర్లు, అటు ప్రమోటర్లకు సంబంధించి కీలక సంస్కరణలకు తెరలేచింది. నియంత్రణ సంస్థ సెబీ... గురువారం జరిగిన బోర్డు సమావేశంలో పలు ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేశారు. ప్రధానంగా మూడేళ్లలోగా స్టాక్ మార్కెట్లో లిస్టయిన అన్ని ప్రభుత్వ రంగ కంపెనీ(పీఎస్యూ)ల్లో కనీసం 25 శాతం పబ్లిక్ వాటా తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల 25 శాతం కంటే తక్కువ పబ్లిక్ వాటా ఉన్న 36 పీఎస్యూల్లో రానున్న మూడేళ్లలో ప్రభుత్వం కచ్చితంగా వాటాను విక్రయించాల్సి ఉంటుంది. వెరసి సుమారు రూ.60 వేల కోట్ల మేర ఖజానాకు జమయ్యే అవకాశం ఉంది. ఇప్పటివరకూ ఉన్న నిబంధనల ప్రకారం పీఎస్యూల్లో కనీసం 10% పబ్లిక్ వాటా తప్పనిసరి కాగా, లిస్టెడ్ నాన్-పీఎస్యూలకైతే ఈ పరిమితి 25%. బోర్డు సమావేశంలో స్టాక్ మార్కెట్లకు సంబంధించి కొన్ని అత్యంత ముఖ్యమైన నిర్ణయాలను తీసుకున్నామని సెబీ చైర్మన్ యూకే సిన్హా చెప్పారు. ప్రమోటర్లు ఎవరనేదానితో సంబంధం లేకుండా అన్ని లిస్టెడ్ కంపెనీలకూ ఒకేవిధమైన నిబంధనలను అమలు చేయడమే ఈ చర్యల ముఖ్య ఉద్దేశమన్నారు. ఐపీఓ నిబంధనలు సరళతరం... ప్రైమరీ మార్కెట్ను మళ్లీ పరుగులు పెట్టించడమే లక్ష్యంగా ప్రారంభ పబ్లిక్ ఆఫర్(ఐపీఓ) నిబంధనలను సెబీ సరళతరం చేసింది. దీనిప్రకారం ఇకనుంచి రూ.4,000 కోట్లకు మించి ఇష్యూ అనంతర మూలధనం(పోస్ట్-ఇష్యూ క్యాపిటల్) ఉండే కంపెనీలు కనీసం 10 శాతం వాటాను ఐపీఓల్లో విక్రయించాల్సి ఉంటుంది. ఇతర కంపెనీల ఐపీఓల్లో మాత్రం 25 శాతం వాటా లేదా రూ.400 కోట్లు వీటిలో దేనివిలువ తక్కువగా ఉంటే ఆమేరకు వాటాను విక్రయించేలా నిబంధనల్లో మార్పులు చేశారు. అయితే, 25 శాతం కంటే తక్కువ వాటా విక్రయించిన కంపెనీలన్నీ మూడేళ్లలోగా ఈ పరిమితిని తప్పనిసరిగా పూర్తి చేయాల్సి ఉంటుంది. మరోపక్క, పబ్లిక్ ఇష్యూల్లో సంస్థాగత ఇన్వెస్టర్లకు సంబంధించి షేర్ల కేటాయింపుల్లో ఇప్పటిదాకా యాంకర్ ఇన్వెస్టర్లకు కేటాయిస్తున్న 30 శాతం వాటాను... ఇకపై 60 శాతానికి పెంచుతూ కూడా సెబీ నిర్ణయం తీసుకుంది. ఫ్రిఫరెన్షియల్ పద్ధతిలో షేర్ల కేటాయింపు తుది ధరను ఇప్పటివరకూ అమల్లో ఉన్న ట్రేడింగ్ పరిమాణం సగటు రేటు ఆధారంగా కాకుండా... ఇష్యూ ముందురోజు ముగింపు రేటు ప్రకారం ఇచ్చేలా నిబంధనలను సెబీ మార్చింది. పబ్లిక్ ఇష్యూ కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఏడాది వ్యవధిలోపు కేటాయించిన బోనస్ షేర్లను సైతం ఇష్యూలో విక్రయించేందుకు లైన్క్లియర్ చేసింది. ఆఫర్ ఫర్ సేల్ మరింత విస్తృతం... లిస్టెడ్ కంపెనీలు ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) విధానంలో విక్రయించే షేర్ల పరిమాణంలో రిటైల్ ఇన్వెస్టర్లకు కచ్చితంగా 10% వాటాను కేటాయించాలన్న నిబంధనను సెబీ ఆమోదించింది. అంతేకాకుండా రిటైలర్లకు షేర్ల విక్రయం ధరలో డిస్కౌంట్ కూడా ఇచ్చేందుకు అనుమతించింది. లిస్టెడ్ కంపెనీలో 10% కంటే అధికంగా వాటా ఉన్న నాన్-ప్రమోటర్ వాటాదారులు ఓఎఫ్ఎస్ రూట్లో తమ షేర్లను విక్రయించుకునేందుకు సెబీ అవకాశం కల్పించింది. 2012 ఫిబ్రవరిలో సెబీ ప్రవేశపెట్టిన ఈ విధానం విజయవంతమైంది. అప్పటినుంచి.. 100కు పైగా కంపెనీలు ఈ రూట్లో రూ.50,000 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. ఇప్పటిదాకా మార్కెట్ విలువపరంగా టాప్-100 కంపెనీలకు మాత్రమే అవకాశం ఉన్న ఓఎఫ్ఎస్ రూట్ను టాప్-200 కంపెనీలన్నింటికీ వర్తించేలా సెబీ అనుమతించింది. ఇతర నిర్ణయాలు ఇవీ... కేవైసీ: స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్లకు సంబంధించిన వివరాల (కేవైసీ)ను ఇతర ఫైనాన్షియల్ రంగ నియంత్రణ సంస్థలతోనూ పంచుకునేందుకు అనుమతి. ఇప్పటివరకూ సెబీ వద్ద రిజిస్టర్ అయిన సంస్థల మధ్యే కేవైసీ వివరాల షేరింగ్ ఉంది. ఫైనాన్షియల్ మార్కెట్లో ఇన్వెస్టర్లందరికీ ఒకేవిధమైన కేవైసీ ప్రక్రియ అమలులో భాగంగా ఈ చర్యలు తీసుకున్నారు. రీసెర్చ్ ఎనలిస్ట్లపైనా నియంత్రణ: రీసెర్చ్ ఎనలిస్ట్ల కార్యకలాపాల్లో మరింత పారదర్శకతను తీసుకొచ్చేందుకుగాను వాళ్లను నియంత్రణ పరిధిలోని తీసుకొస్తూ నిబంధనలను తీసుకొచ్చారు. ముఖ్యంగా ఆయా సంస్థలు తప్పుడు నివేదికలతో ఇన్వెస్టర్లను మోసగించకుండా వాళ్లకు మరింత రక్షణ కల్పించడమే వీటి ప్రధానోద్దేశం. ఇప్పటివరకూ రీసెర్చ్ ఎనలిస్ట్లపై నియంత్రణేదీ లేదు. కొత్త నిబంధనల ప్రకారం వ్యక్తిగత, సంస్థాగత రీసెర్చ్ ఎనలిస్ట్లంతా సెబీ వద్ద నమోదు చేసుకోవాలి. వాళ్లిచ్చే నివేదికలు ఇతరత్రా అంశాలకు సంబంధించిన కొన్ని వివరాలను సెబీకి తెలియజేయాల్సి ఉంటుంది. అయితే, ఇన్వెస్ట్మెంట్ అడ్వయిజర్లు, క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు, పోర్ట్ఫోలియో మేనేజర్లు, ఇన్వెస్ట్మెంట్/వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ మాత్రం ఈ నిబంధనల ప్రకారం రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎసాప్స్ స్కీమ్స్: ఎంప్లాయీస్ స్టాక్ ఆప్షన్స్(ఎసాప్స్) స్కీమ్లకు సంబంధించిన నిబంధనలను సెబీ మరింత సరళతరం చేసింది. కొత్త నిబంధనల ప్రకారం ఎసాప్ ట్రస్ట్లను షేర్హోల్డింగ్ సంస్థల్లో ప్రత్యేక విభాగంగా ఇకపై పరిగణిస్తారు. అంటే ఈ ట్రస్ట్లోని షేర్లను పబ్లిక్కి సంబంధించిన కేటగిరీలో లేదా ప్రమోటర్ గ్రూప్ కేటగిరీ కిందకానీ ఇకపై పరిగణించరు. ఈ నిబంధనల పూర్తికి అయిదేళ్ల గడువు ఇస్తున్నట్లు సెబీ పేర్కొంది. ఎసాప్స్ కింద ఉద్యోగులకు షేర్ల కేటాయింపు జరిపే కంపెనీలు కొన్ని నిబంధనలకు లోబడి తమ సొంత కంపెనీ షేర్లను కొనుగోలు చేసేందుకు సెబీ వీలుకల్పించింది. -
వైఎస్ఆర్ జిల్లాకు సెయిల్ నిపుణుల కమిటీ
కడప : భారత ఉక్కు సంస్థ బృందం శనివారం కడప చేరుకున్నారు. సెయిల్ బృందం సభ్యులు తొమ్మిదిమంది జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమావేశమయ్యారు. జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం అనువైన ప్రాంతాలను సెయిల్ బృందం పరిశీలించనుంది. కాగా రాష్ట్ర విభజనలో భాగంగా వైఎస్ఆర్ జిల్లాలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేపడతామన్న ప్రకటన అందరిలోనూ ఆశలు రేకెత్తిస్తోంది. -
బయ్యారం.. బంగారం
ఖమ్మం: బయ్యారం తెలంగాణ కొంగు బంగారం కానుందా..? తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరబోతోందా..? నిరుద్యోగ యువతకు ఉపాధి దొరకనుందా..? అవుననే చెబుతోంది.. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) నిపుణుల బృందం ఖమ్మం జిల్లా పర్యటన. ఈ బృందం జిల్లాలో పర్యటించి స్టీల్ కర్మాగారం ఎక్కడ నిర్మాణం చేపట్టాలన్న సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేస్తోంది. ఈ మేరకు మంగళవారం 8 మందితో కూడిన సెయిల్ కమిటీ బృందం కలెక్టరేట్లో జేసీ సురేంద్రమోహన్, పరిశ్రమలు, ట్రాన్స్కో, రెవెన్యూ, పీసీబీ తదితర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహిం చింది. ఖనిజ వనరులు నిక్షిప్తమై ఉన్న ప్రాంతానికి సమీపంలో విద్యుత్, నీరు, ఫ్యాక్టరీ నిర్మాణానికి కావాల్సిన భూమి ఎక్కడ అనువుగా ఉందో వాటిపైనే ఆయా అధికారుల నుంచి సమాచారం సేకరించింది. ఈ వనరుల్లో ఎక్కువగా ఏవి ఒకేచోట ఉంటాయో అక్కడే ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టేందుకు ఈ కమిటీలోని వివిధ విభాగాల సాంకేతిక నిపుణులు సమాచారం తీసుకున్నారు. బయ్యారానికే అవకాశం.. సెయిల్ కమిటీ అధ్యయన బృందం ఇటు బయ్యారం, అటు కొత్తగూడెం మండలాల్లో కర్మాగారం నిర్మాణానికి భూమి అన్వేషణ చేస్తున్నా.. బయ్యారంలోనే ఫ్యాక్టరీ నిర్మాణం కానుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొత్తగూడెంలో బొగ్గు, కిన్నెరసాని నీటి వనరులున్నా అక్కడ అంతా అండర్ గ్రౌండ్ బొగ్గు గనులు ఉండడంతో ఇక్కడ ఫ్యాక్టరీ నిర్మాణంపై జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రూ. 30 వేల కోట్లతో భారీఎత్తున ఫ్యాక్టరీ నిర్మా ణం చేపడుతుండడంతో అండర్ గ్రౌండ్ మైన్లు ఉన్న చోట భవిష్యత్లో ఏదైనా ప్రమాదం సంభవిస్తే నిర్మాణ వ్యయమంతా బూడిదలో పోసిన పన్నీరవుతుందని భావిస్తున్నట్లు సమాచారం. కొత్తగూడెం ప్రాంతమంతా అండర్గ్రౌండ్ మైన్లు ఉండడంతో ఇక్కడ భూమి అన్వేషణ చేసినా.. నిర్మాణానికి మాత్రం బయ్యారం ప్రాంతం సేఫ్ జోన్గా జీఎస్ఐ ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. బయ్యారంలో ఓవైపు ముడి ఇనుప ఖనిజం తీసినా.. మరోవైపు సేఫ్ జోన్గా ఫ్యాక్టరీ నిర్మాణానికి అనువైన భూమి ఉండడం, రఘునాథపాలెం పవర్ గ్రిడ్ నుంచి విద్యుత్, పెద్ద చెరువు లేదా మున్నేరు నుంచి నీరు వినియోగించుకునే సౌకర్యం ఉండడంతో ఇక్కడ స్టీల్ ప్లాంట్ నిర్మాణంపైనే సెయిల్ అధికారులు పూర్తిస్థాయి సమాచార సేకరణలో నిమగ్నమయ్యారు. అందుబాటులో వనరులు ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇచ్చిన నివేదిక ప్రకారం.. బయ్యారంలో 25,700 హెక్టార్లు, గార్లలో 18,330 హెక్టార్లు, నేలకొండపల్లిలో 12,660 హెక్టార్లలో ముడి ఇనుప ఖనిజం ఉంది. కారేపల్లి మండలం మాదారంలో 20 కిలోమీటర్ల మేరకు డోలమైట్ విస్తరించి ఉంది. ప్రస్తుతం ఇక్కడినుంచి ఈ ఖనిజం విశాఖలోని స్టీల్ ప్లాంట్కు రవాణా అవుతోంది. అలాగే నల్లగొండ జిల్లాలో సున్నపురాయి (లైమ్ స్టోన్) అందుబాటులో ఉందని.. బయ్యారం నుంచి ఇక్కడి గనులకు 90 కిలోమీటర్ల దూరం ఉన్నట్లు జిల్లా అధికారులు ఇచ్చిన నివేదికలో పొందుపరిచారు. అలాగే బయ్యారం నుంచి ఇటు సికింద్రాబాద్, అటు విజయవాడ వెళ్లేందుకు రైలుమార్గం 11 కిలోమీటర్లలో దూరంలో ఉందని వివరించారు. బొగ్గు గనులు, విద్యుత్, రవాణా సౌకర్యాలు స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి థర్మల్ శక్తి పుష్కలంగా ఉన్నట్లు అధికారులు కమిటీకి వివరించారు. సింగరేణి కాలరీస్ పరిధిలోని ఖమ్మం జిల్లాలోని ఇల్లెందు, కోయగూడెం, కొత్తగూడెం, మణుగూరు, వరంగల్ జిల్లా భూపాలపల్లిలో ఓపెన్కాస్టు, అండర్గ్రౌండ్ మైన్స్ నుంచి బొగ్గు రానుందని చెప్పారు. అలాగే బయ్యారానికి 30 కిలోమీటర్ల దూరంలో రఘునాథపాలెం మండలం బూడిదంపాడు గ్రామంలో ఉన్న ఎన్పీడీసీఎల్ పరిధిలోకి వస్తున్న 220కేవీఏ/400 కేవీ గ్రిడ్ అందుబాటులో ఉంది. ఇక స్టీల్ కర్మాగారానికి సెయిల్ నిబంధనల ప్రకారం 2,500 ఎకరాలు అవసరం. అయితే, బయ్యారం మండలం ధర్మాపురం గ్రామంలో సర్వే నంబర్ 452లో సుమారు 4,000 ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంది. ఇందులో 2 వేల ఎకరాలు అసైన్డ్ భూమి. కొత్తగూడెం మండలం కూనారం గ్రామంలో సర్వే నెంబర్ 13లో సుమారు 4,300 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. ఇక రవాణ సౌకర్యాల విషయానికొస్తే.. రైలు మార్గమైతే వరంగల్ జిల్లా గుండ్రాతిమడుగు స్టేషన్ నుంచి బయ్యారానికి 3 కిలోమీటర్లు, అలాగే వరంగల్ రైల్వే స్టేషన్ (కాజీపేట) బయ్యారానికి 76 కిలోమీటర్ల దూరంలో ఉంది. రోడ్డు మార్గం అయితే ఇల్లెందు నుంచి బయ్యారానికి 23 కిలోమీటర్లు. అలాగే ఖమ్మం బస్టాండ్ కూడా సమీపంలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఇక కొత్తగూడెం మండలం కూనారం చేరుకోవాలంటే కొత్తగూడెం రైల్వే స్టేషన్, బేతంపుడి (భద్రాచలం రోడ్డు), రైల్వే స్టేషన్లు సమీపంలోనే ఉన్నాయి. కొత్తగూడెం నుంచి రోడ్డు మార్గం ద్వారా కూనారం నుంచి 128 కిలోమీటర్ల దూరంలో ఉన్న విజయవాడ రైల్వే స్టేషన్ను కూడా చేరుకోవచ్చునని అధికారులు తమ నివేదికలో పేర్కొన్నారు. ఇన్ని అవకాశాలుండడంతో బయ్యారంలోనే స్టీల్ కర్మాగారం ఏర్పాటునకు అనువైన ప్రదేశంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. -
దాల్మియా సిమెంట్ చేతికి బొకారో జేపీ
న్యూఢిల్లీ: రుణభారం తగ్గించుకునే దిశగా ఇన్ఫ్రా దిగ్గజం జైప్రకాశ్ అసోసియేట్స్.. బొకారో జేపీ సిమెంట్లో తనకున్న మొత్తం 74 శాతం వాటాలను దాల్మియా సిమెంట్కు విక్రయించాలని నిర్ణయించింది. ఈ డీల్ విలువ సుమారు రూ. 690 కోట్లుగా ఉండనుంది. దీని ద్వారా వచ్చే నిధులను జేపీ గ్రూప్ రుణభారాన్ని తగ్గించుకునేందుకు ఉపయోగించుకోనుంది. ఉక్కు దిగ్గజం సెయిల్తో కలిసి జేపీ అసోసియేట్స్ ఏర్పాటు చేసిన రెండు జాయింట్ వెంచర్లలో బొకారో జేపీ సిమెంట్ (బీవోజేసీఎల్) కూడా ఒకటి. ఇందులో జేపీ గ్రూప్కి 74 శాతం, సెయిల్కి 26 శాతం వాటాలు ఉన్నాయి. బీవోజేసీఎల్కి జార్ఖండ్లోని బొకారోలో 2.1 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం (వార్షిక) గల సిమెంటు ప్లాంటు ఉంది. స్విస్ దిగ్గజం హోల్సిమ్ సారథ్యంలోని ఏసీసీ కూడా బీవోజేసీఎల్ కోసం పోటీపడినప్పటికీ.. దాల్మియా మెరుగైన ఆఫర్ ఇవ్వడంతో దాని వైపు మొగ్గు చూపినట్లు జేపీ అసోసియేట్స్ తెలిపింది. ఇందుకు సంబంధించి దాల్మియా సిమెంట్తో ఒప్పందం కుదుర్చుకునేందుకు సోమవారం కంపెనీ బోర్డు ఆమోదముద్ర వేసింది. సెయిల్తో మరో జాయింట్ వెంచర్ అయిన భిలాయ్ ప్లాంటు (2.2 మిలియన్ టన్నుల సామర్థ్యం) విషయంపై మాత్రం నిర్ణయం తీసుకోలేదు. సిమెంటు తయారీ రంగంలో జేపీ సంస్థ దేశంలోనే మూడో అతి పెద్ద కంపెనీ. రియల్ ఎస్టేట్, విద్యుత్ తదితర రంగాల్లో కూడా గ్రూప్ కార్యకలాపాలు ఉన్నాయి. ప్రస్తుతం బీవోజేసీఎల్లో 74 శాతం వాటాల కింద 9.89 కోట్ల షేర్లను జేపీ అసోసియేట్స్ (జేఏఎల్) విక్రయిస్తోంది. రూ. 18.57 విలువ చేసే ఒక్కో షేరును దాదాపు రూ. 69.74 ధరకి విక్రయించనున్నట్లు కంపెనీ తెలిపింది. భాగస్వామ్య సంస్థ సెయిల్తో పాటు ఇతర నియంత్రణ సంస్థల అనుమతులకు లోబడి విక్రయం జరుగుతుందని వివరించింది. భిలాయ్ జాయింట్ వెంచర్ విషయంలో తర్వాత నిర్ణయం తీసుకోనున్నట్లు సంస్థ వర్గాలు పేర్కొన్నాయి. సెయిల్తో ఉన్న రెండు జాయింట్ వెంచర్ సిమెంట్ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా వచ్చిన నిధులను జేపీ గ్రూప్.. రుణ భారాన్ని తగ్గించుకునేందుకు వినియోగించుకోనుంది. జేపీ గ్రూప్ గతేడాది 4.8 మిలియన్ టన్నుల (ఎంటీపీఏ) సామర్థ్యమున్న సిమెంట్ ప్లాంటును ఆదిత్య బిర్లా గ్రూప్నకు చెందిన అల్ట్రాటెక్కి విక్రయించింది. అలాగే, హిమాచల్ ప్రదేశ్లోని రెండు జలవిద్యుత్ ప్రాజెక్టులను విక్రయించే దిశగా అబుధాబి నేషనల్ ఎనర్జీ కంపెనీతో ఇటీవలే ఒప్పందం కుదుర్చుకుంది. ఈ బోర్డ్ మీటింగ్ నేపథ్యంలో జైప్రకాశ్ అసోసియేట్స్ షేర్ ధర ఎన్ఎస్ఈలో సోమవారం 1.34% లాభపడి రూ.49.05 వద్ద ముగిసింది. -
అంతా చట్టాల ఉల్లం‘ఘనులే’
న్యూఢిల్లీ: గనుల తవ్వకాల్లో పర్యావరణ, అటవీ చట్టాలను ఉల్లంఘించిన 70 కంపెనీల్లో సెరుుల్, టాటా స్టీల్, ఎస్సెల్ మైనింగ్ (ఆదిత్య బిర్లా గ్రూప్), ఒడిశా మైనింగ్ వంటి బడా సంస్థలున్నట్లు జస్టిస్ ఎం.బి.షా కమిషన్ తెలియజేసింది. ‘ఒడిశాలో 1994-95 నుంచి అటవీ, పర్యావరణ చట్టాల ఉల్లంఘన భారీ ఎత్తున కొనసాగింది. లీజుదారుల్లో అత్యధికులు ఈ చట్టాలను ఏదో ఒక రూపంలో ఉల్లంఘించారు. రూ.45,453 కోట్ల విలువైన ఇనుప ఖనిజం, రూ.3,089 కోట్ల వూంగనీస్ను అక్రవుంగా తవ్వేశారు. రాష్ట్రంలో ఇనుప ఖనిజం, వూంగనీస్ తవ్వకానికి 192 లీజులు జారీచేయుగా, 94 గనులకు పర్యావరణ అనువుతి (ఈసీ) లేదు. వీటిలో 78 గనుల్లో 1994-95, 2011-12 వుధ్యకాలంలో వేలాది కోట్ల రూపాయుల విలువైన వూంగనీస్, ఇనుప ఖనిజాలను అక్రవుంగా కొల్లగొట్టారు. ఈసీ ఆలస్యంగా జారీఅరుున 96 లీజు కంపెనీలు ఆ వ్యవధిలోనూ తవ్వకాలు కొనసాగించారుు..’ అని కమిషన్ పేర్కొంది. -
భారీ విస్తరణ దిశగా పీఎస్యూలు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థలైన సెయిల్, ఎన్ఎండీసీ, ఆర్ఐఎన్ఎల్లు 2014-15లో భారీ స్థాయిలో ఆధునీకరణ, విస్తరణకు సన్నాహాలు చేస్తున్నాయి. ఇందుకు రూ.14,945 కోట్లు ఖర్చు చేయనున్నాయి. సెయిల్ రూ.9,000 కోట్లు, ఎన్ఎండీసీ రూ.4,345 కోట్లు, ఎన్ఐఎన్ఎల్ రూ.1,600 కోట్లు వెచ్చించనున్నాయి. ఆర్ఐఎన్ఎల్ తన ప్రణాళికలో భాగంగా విస్తరణ కొనసాగుతున్న వైజాగ్ ఫెసిలిటీకి రూ.400 కోట్లు కేటాయించనుంది. అలాగే బ్లాస్ట్ ఫర్నేస్, స్టీల్ మెల్టింగ్ షాప్, సింటర్ ప్లాంట్ల ఆధునీకరణకు రూ.400 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ 3 సంస్థలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆధునీకరణ, విస్తరణకు రూ.15,820 కోట్లు వ్యయం చేయనున్నాయి.