-
నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రేమ లేఖ!
బాలీవుడ్ స్టార్ హీరో, కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రేమలేఖ వైరల్ అవుతోంది. అవును మీరు విన్నది నిజమే. 'నేను ప్రేమిస్తున్నాను. మీరు నన్ను ప్రేమిస్తూనే ఉంటారని ఆశిస్తున్నాను' అని సల్మాన్ చేతిరాతతో రాసిన లెటర్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో సెంటరాఫ్ ఎట్రాక్షన్గా మారిపోయింది. అసలు ఇంతకీ ఈ లేఖ ఎవరికీ రాశారు? దీని సంగతేంటి?(ఇదీ చదవండి: తెలుగులో ఛాన్సులు అందుకే రావట్లేదు: హీరోయిన్ ఇలియానా)హీరో సల్మాన్ ఖాన్.. దాదాపు మూడు-నాలుగు దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు. అప్పట్లో 'ప్రేమ పావురాలు' లాంటి డబ్బింగ్ మూవీతో తెలుగు ప్రేక్షకుల మనసులు దోచాడు. ఇప్పుడు మాత్రం కేవలం హిందీ చిత్రాలే చేస్తున్నాడు. అయితే గత కొన్నిరోజుల నుంచి సల్మాన్ వార్తల్లో నిలుస్తున్నాడు. సల్మాన్ ఇంటి దగ్గర కాల్పులు జరగడం అనేది షాకింగ్గా అనిపించింది.సరే ఇదంతా పక్కనబెడితే 'మైనే ప్యార్ కియా'(ప్రేమ పావురాలు) సినిమా రిలీజ్ తర్వాత.. తన చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకుల కోసం సల్మాన్ స్వయంగా ఓ లేఖ రాశాడు. ఇప్పుడదే మళ్లీ వైరల్ అవుతోంది. ఇందులో ఏముందంటే.. 'నన్ను అంగీకరించినందుకు, ప్రేమించినందుకు థ్యాంక్స్. ఇక నుంచి ఏ సినిమా చేసినా 'మైనే ప్యార్ కియా'తో పోలుస్తారని తెలుసు. కాబట్టి మంచి సినిమా చేయాలనే నా ప్రయత్నం. నేను నిన్ను ప్రేమిస్తున్నాను-మీరు నన్ను ప్రేమిస్తూనే ఉంటారని ఆశిస్తున్నా. ఎందుకంటే మీరు నన్ను ప్రేమించడం మానేసిన రోజు.. నేను సినిమాలు చేయడం ఆపేస్తాను. అది నా కెరీర్కి ముగింపు అవుతుంది' అని సల్మాన్ రాసుకొచ్చాడు.(ఇదీ చదవండి: This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?) -
సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు.. కస్టడీలో నిందితుడి ఆత్మహత్య
ముంబై: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పులు జరిపిన నిందితుడు పోలీసుల కస్టడీలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీస్ లాకప్లో ఉన్న నిందితుడు అనుజ్ థాపన్.. బుధవారం ఉదయం 11 గంటలకు లాకప్ గదిలో వాష్రూమ్కు వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన అధికారులు వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు ముంబై పోలీసులు తెలిపారు. పంజాబ్కు చెందిన అనూజ్ను ఏప్రిల్ 26న పోలీసులు అరెస్ట్ చేశారు.కాగా గత నెల 14న సల్మాన్ ఇంటి వద్ద కాల్పులు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ముంబైలోని బాంద్రా ప్రాంతంలో బైక్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు గెలాక్సీ అపార్ట్మెంట్ ముందు కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు. ఘటన అనంతరం దుండగులు బైక్పై వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీల్లో రికార్డ్ అయ్యాయి.ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన ముంబై పోలీస్ క్రైం బ్రాంచ్ అధికారులు.. నిందితులు, విక్కీ గుప్తా, సాగర్ పాల్గా గుర్తించారు. వీరితోపాటు నిందితులకు ఆయుధాలు అందించిన అనుజ్ థాపన్, సుభాష్ చందర్లను కూడా కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. వీరిలో ఒకడైన అనూజ్ తపన్ బుధవారం బలవనర్మణానికి పాల్పడ్డాడు.అయితే అనుజ్తోపాటు మరో పదిమంది అదే లాకప్లో ఉన్నారని, నలుగురు నుంచి అయిదుగురు పోలీసులు నిత్యం వీరిని గమనిస్తూ ఉంటారని అధికారులు పేర్కొన్నారు. నిందితుడి ఆత్మహత్యకు దారితీసిన కారణాలపై విచారణ జరుగుతోందనిప్పారులాకప్లో వ్యక్తి మరణిస్తే హత్య కేసుగా పరిగణిస్తారని, పోలీస్ స్టేషన్లోని పోలీసులందరినీ సీఐడీ ప్రశ్నిస్తుందని అని మహారాష్ట్ర మాజీ సీనియర్ పోలీసు అధికారి పీకే జైన్ చెప్పారు. ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడానికి ఉపయోగించే ఏ వస్తువు అందుబాటులో ఉండకుండా పోలీసులు ఎల్లప్పుడూ తనిఖీ చేస్తుంటారని పేర్కొన్నారు. ఖైదీలు తప్పించుకోకుండా, ఆత్మహత్య చేసుకోకుండా ఉండేందుకు పోలీసులు లాకప్ వద్ద నిత్యం గస్తీ కాస్తుంటారని చెప్పారు. ఇదిలా ఉండగా నలుగురు నిందితులు జైలులో ఉన్న గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్తో సంబంధం కలిగి ఉన్నట్లు తెలిసింది. -
నన్ను అంత మాటన్నారు.. ఏడ్చేసిన నటుడు
ఇండస్ట్రీకి ఎంతోమంది వస్తుంటారు, పోతుంటారు. చాలామంది ఇక్కడ నిలదొక్కుకోవాలని ప్రయత్నిస్తుంటారు. కానీ కొందరే సఫలీకృతులవుతారు. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ చెల్లిని పెళ్లాడిన ఆయుష్ శర్మ కూడా నటుడిగా ప్రయత్నించాలనుకున్నాడు. లవ్ యాత్రి అనే సినిమా చేశాడు. దీన్ని సల్మాన్ ఖాన్ నిర్మించాడు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఆయుష్ మీద విమర్శల వర్షం కురిసింది. ఆయుష్కు బదులుగా ఓ కుక్కను పెట్టి సినిమా తీయాల్సిందని తీవ్రంగా ట్రోల్ చేశారు.నానా మాటలు..తాజాగా ఆనాటి పరిస్థితులను గుర్తు చేసుకుంటూ ఎమోషనలయ్యాడు ఆయుష్. 'నా పిల్లలు నన్ను చూసి గర్వపడాలనుకున్నాను. కానీ ఆరోజు నా గురించి చాలా చెత్తగా మాట్లాడారు. ఆ సినిమా రిలీజైన రోజు నానా మాటలన్నారు. నన్ను కుక్కతో పోల్చారు. రేపు పొద్దున నా కుమారుడు పెద్దయ్యాక ఈ వార్త చదివితే నా పరిస్థితి ఏంటి? నా కూతురు.. మా నాన్న ఒక శునకం అని ఉన్న వార్తలు చూస్తే నేనేం కావాలి? వాళ్లు తండ్రి గురించి మంచి విషయాలు తెలుసుకోవాలి..నన్ను శునకంతో పోల్చారునన్ను చూసి గర్వంగా ఫీలవ్వాలి. ఒక మీడియా అయితే ఆయుష్ శర్మ ఒక కుక్క అని రాసేసింది. కానీ వాళ్లకు నేనిప్పుడు థ్యాంక్స్ చెప్తున్నాను. మీరు నన్ను అవమానించడం వల్లే నేనిప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను' అని ఎమోషనలయ్యాడు. కాగా ఆయుష్.. తర్వాత సల్మాన్తో అంతిమ్ అనే సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఇది హిట్గా నిలిచింది. ప్రస్తుతం ఇతడు నటించిన రుస్లాన్ సినిమా ఏప్రిల్ 26న విడుదల కానుంది.చదవండి: అభిషేక్ అగర్వాల్ నుంచి ‘ది ఢిల్లీ ఫైల్స్ ’ .. రిలీజ్ ఎప్పుడంటే? -
స్టార్ హీరో ఇంటికెళ్లిన సీఎం.. !
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ను మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే కలిశారు. కాల్పుల ఘటనపై ఆయనను కలిసి ఆరా తీశారు. సల్మాన్ ఖాన్ ఇంటికెళ్లిన ముఖ్యమంత్రి భద్రతా గురించి అడిగి తెలుసుకున్నారు. ఫైరింగ్ ఘటనపై పోలీసుల తీసుకున్న చర్యలపై సల్మాన్తో మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా.. ఈనెల 14న కాల్పులు జరిపిన వారిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు రోజుల క్రితం ముంబైలోని సల్మాన్ గెలాక్సీ అపార్ట్మెంట్స్ వద్ద ఇద్దరు దుండగులు ఆరు రౌండ్ల కాల్పులు జరిపి ఆపై మోటార్ సైకిల్ ద్వారా పారిపోయిన విషయం తెలిసిందే. ఆ సమయంలో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కాల్పుల ఘటనలో విక్కీ గుప్తా(24), సాగర్ పాల్ (21) నిందితులుగా గుర్తించిన ముంబై పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. గుజరాత్లోని భుజ్లో వారిద్దరిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. అయితే ఈ కాల్పులు జరిపింది తామేనని బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది. #WATCH | Mumbai: Maharashtra CM Eknath Shinde arrived at the residence of actor Salman Khan. pic.twitter.com/ncJUz4n6C9 — ANI (@ANI) April 16, 2024 #WATCH | Mumbai | Maharashtra CM Eknath Shinde met actor Salman Khan at his residence. Inside visuals from the residence. (Source: Eknath Shinde office) pic.twitter.com/lbMmfCOBNm — ANI (@ANI) April 16, 2024 -
సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పులు.. ఇద్దరు అరెస్ట్
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి ముందు ఏప్రిల్ 14న కాల్పులు జరిపిన వారిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు రోజుల క్రితం ముంబైలోని సల్మాన్ గెలాక్సీ అపార్ట్మెంట్స్ వద్ద ఇద్దరు దుండగులు ఆరు రౌండ్ల కాల్పులు జరిపి ఆపై మోటార్ సైకిల్ ద్వారా పారిపోయిన విషయం తెలిసిందే. ఆ సమయంలో కేసు నమోదు చేసిన పోలీసులు దర్వాప్తులో వేగం పెంచారు. సల్మాన్ ఖాన్ ఇంటి ముందు కాల్పులు జరగడంతో దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దీంతో వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యారు. ఈ కాల్పుల ఘటనలో విక్కీ గుప్తా(24), సాగర్ పాల్ (21) నిందితులుగా గుర్తించిన ముంబై పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. గుజరాత్లోని భుజ్లో వారిద్దరిని అరెస్టు చేసినట్లు తాజాగా వెళ్లడించారు. షూటర్లు ఇద్దరూ బీహార్లోని పశ్చిమ చంపారన్కు చెందినవారని పోలీసులు తెలిపారు. గతంలో వారిద్దరిపై చాలా చైన్ స్నాచింగ్ కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. నార్త్ ఇండియాలోని పలు రాష్ట్రాల్లో దొంగతనాలు కూడా చేసినట్లు ఆధారాలు లభ్యమైనట్లు తెలిపారు. దొంగతనాలు చేస్తున్న క్రమంలో హత్యలు కూడా చేసి ఉండవచ్చు అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఏప్రిల్ 14న కాల్పులు జరిగిన తర్వాత సల్మాన్ ఖాన్ సెక్యూరిటీ గార్డు వాంగ్మూలం ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు.. పదికి పైగా టీమ్లుగా విడిపోయి కేసును ఛేదించారు. వారిద్దరిని విచారించిన తర్వాత పూర్తి వివరాలు వెళ్లడిస్తామని వారు తెలిపారు. -
కాల్పులు జరిపింది మేమే అంటూ సల్మాన్ ఖాన్కు వార్నింగ్
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి ముందు ఆదివారం (ఏప్రిల్ 14) ఉదయం కాల్పులు జరిగాయి. ముంబయిలోని గెలాక్సీ అపార్ట్మెంట్స్ వద్ద ఇద్దరు దుండగులు ఆరు రౌండ్ల కాల్పులు జరిపి ఆపై మోటార్ సైకిల్ ద్వారా పారిపోయారు. కాల్పులు జరిగిన ఘటనలో ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై ఆదివారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో వారికి సమాచారం అందినట్లు వెళ్లడించారు. సీసీటీవీ పుటేజీ ద్వారా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇంతలోపు గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పేరుతో ఫేస్బుక్ అకౌంట్ నుంచి ఓ ప్రకటన వచ్చింది. ఇప్పుడు జరిగింది ట్రైలర్ మాత్రమేనని అందులో ఉంది. 'ఈ కాల్పులతో మా బలం ఏంటో నీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నాం. ఇక మా సహనాన్ని పరీక్షించొద్దు. ఇది నీకు ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నాం. ఈసారి మాత్రం తుపాకీ పేలుడు ఇంటి బయటే ఆగిపోదని గుర్తుపెట్టుకో. తప్పకుండా మా టార్గెట్ రీచ్ అవుతాం.' అని అందులో రాసి ఉంది. దీనికి సంబంధించిన ఒక స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సల్మాన్ ఖాన్ ఇంటికి కొద్ది దూరంలో ఉన్న ఒక బైక్ను పోలీసులు తాజాగా స్వాధీనం చేసుకున్నారు. దీనిని కాల్పులు జరిపిన దుండగులు వాడినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. సల్మాన్ ఖాన్కు ఇలాంటి బెదిరింపులు ఇప్పటికే పలుమార్లు వచ్చాయి. గతంలో ఈమెయిల్స్ ద్వారా ఆయనకు వార్నింగ్ ఇచ్చారు. గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్తో గొడవేంటి..? ఈ గ్యాంగ్స్టర్స్ నుంచి సల్మాన్ఖాన్కు బెదిరింపులు రావడం ఇది తొలిసారేం కాదు. ఇప్పటికే చాలాసార్లు వచ్చాయి. 2018లో కృష్ణజింకలను వేటాడిన కేసులో సల్మాన్పై విచారణ జరుగుతున్న సమయంలో వారి నుంచి ఎక్కువగానే వార్నింగ్లు వచ్చాయి. ఆ వన్యప్రాణుల్ని వేటాడటం ద్వారా బిష్ణోయ్ల మనోభావాలను సల్మాన్ఖాన్ దెబ్బతీశారంటూ లారెన్స్ బిష్ణోయ్ వ్యాఖ్యానించాడు. చివరకు ఈ కేసులో సల్మాన్ నిర్దోషిగా విడుదలయ్యారు. కానీ వారు మాత్రం ఆయనపై రివేంజ్ తీర్చుకోవాలని ఉన్నారు. పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో అరెస్టయిన బిష్ణోయ్ ఢిల్లీ జైలులో ఉన్నాడు. दाउद इब्राहीम और छोटा शकील के नाम के हमने दो कुत्ते पाल रखे हैं - अनमोल विश्नोई (लॉरेंस के भाई का पोस्ट)#LawrenceBishnoi #DawoodIbrahim #SalmanKhan #AnmolBishnoi #ChotaShakeel #BJPManifesto pic.twitter.com/oj2sTHRlK8 — Nisha A (Modi's family) (@matribhumi1st) April 14, 2024 -
ఇండస్ట్రీలో కలకలం.. సల్మాన్ ఖాన్ ఇంటిముందు కాల్పులు..!
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటిముందు కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. ఇవాళ తెల్లవారుజామున ఉదయం 5 గంటలకు బాంద్రాలోని సల్మాన్ ఇంటివద్ద కొందరు దుండగులు గాల్లోకి కాల్పులు జరిపినట్లు సమాచారం. ద్విచక్రవాహనపై వచ్చిన అగంతకులు రెండు రౌండ్లు కాల్పులు జరిపి పారిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ముంబై పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. కాల్పులు జరిపిన వ్యక్తిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా.. గతంలో గ్యాంగ్స్టర్ బిష్ణోయ్ నుంచి సల్మాన్కు బెదిరింపు కాల్స్ వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటికే ఆయనకు వై ప్లస్ కేటగిరీ భద్రత కల్పిస్తున్నారు. తాజాగా కాల్పుల నేపథ్యంలో ఆయన ఇంటివద్ద మరింత భద్రతను పెంచారు. కాగా.. గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ టాప్ టెన్ జాబితాలో సల్మాన్ ఖాన్ అగ్రస్థానంలో ఉన్నారని గతేడాది ఎన్ఐఏ హెచ్చరించిన సంగతి తెలిసిందే. #WATCH | Mumbai, Maharashtra: Visuals from outside actor Salman Khan's residence in Bandra where two unidentified men opened fire this morning. Police and forensic team present on the spot. pic.twitter.com/fVXgHzEW0J — ANI (@ANI) April 14, 2024 -
పైసా సంపాదన లేదు.. అయినా సల్మాన్ చెల్లితో పెళ్లి చేశారు!
బాలీవుడ్లోని బడా కోటీశ్వరుల్లో సల్మాన్ ఖాన్ ముందు వరుసలో ఉంటాడు. ఎప్పుడూ సింపుల్గా ఉండటానికి ఇష్టపడే ఇతడికి వేలకోట్ల ఆస్తులున్నాయి. కానీ అతడి చెల్లి అర్పితఖాన్కు పెళ్లి చేసేటప్పుడు మాత్రం బావ సంపాదిస్తున్నాడా? లేదా? అని కూడా చూసుకోలేదు. చెల్లిని గుండెలో పెట్టి చూసుకుంటే చాలనుకున్నాడు. అలా లవ్ బర్డ్స్ అర్పిత ఖాన్, ఆయుశ్ శర్మ పెద్దలను ఒప్పించి 2014లో పెళ్లి చేసుకున్నారు. అప్పటినుంచి ఎంతో అన్యోన్యంగా కలిసి జీవిస్తున్నారు. అమ్మాయిని ఎలా పోషిస్తావు? అయితే అర్పితను పెళ్లాడే సమయానికి ఆయుశ్ ఏ పనీ చేయకుండా ఖాళీగా ఉన్నాడట! ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. 'నేను అర్పితను ప్రేమిస్తున్నానని చెప్పగానే అమ్మానాన్న షాకయ్యారు. నువ్వు ఏ పనీ చేయడం లేదు.. పైసా సంపాదించట్లేదు.. పెళ్లికి మాత్రం సిద్ధమయ్యావు. పైగా ఆమె ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తి. మరి పెళ్లి చేసుకున్నాక ఆ అమ్మాయిని ఎలా పోషిస్తావు? అని అడిగారు. నేనేం పోషించను.. అంతా మీరే చూసుకోవాలని చెప్పాను. అమ్మ తెగ కంగారు ప్రేమలో పడింది నువ్వు, పెళ్లి చేసుకునేది నువ్వు.. కానీ మీ బిల్లులు మాత్రం నేను కట్టాలా? అని నాన్న చిన్నగా కోప్పడ్డాడు. తర్వాత ఆయన రిలాక్స్ అయ్యాడు కానీ అమ్మ మాత్రం తెగ కంగారుపడిపోయింది. ఎందుకంటే నాదేమో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ (కాంగ్రెస్ కీలక నేత పండిత్ సుఖ్ రామ్ మనవడే ఆయుశ్).. తనదేమో సినిమా బ్యాక్గ్రౌండ్. ఎలాగోలా వారిని ఒప్పించి సల్మాన్ ఖాన్ ఇంటికి తీసుకెళ్లి పరిచయం చేశాను. కంగారు పడొద్దని సల్మాన్ భరోసా అప్పుడు నాన్న.. 'మేమంతా హిమాచల్ ప్రదేశ్లోని మండిలో నివసిస్తాం.. ఒకవేళ తప్పని పరిస్థితులు ఎదురైతే నువ్వు అక్కడికి రాగలవా?' అని అర్పితను అడిగాడు.. అందుకు సల్మాన్.. ఆయుశ్ ఎక్కడంటే అర్పిత అక్కడే ఉంటుంది. ఈ విషయంలో మీరేం కంగారుపడకండి అని భరోసా ఇచ్చాడు' అని తెలిపాడు. ఆయుశ్-అర్పిత జంటకు అయత్ అనే కూతురు, అఖిల్ శర్మ అనే కుమారుడు సంతానం. చదవండి: ఎంతగానో ప్రేమిస్తే.. నన్ను మోసం చేశాడు.. ప్రతిరోజూ ఏడుపే! -
Bobby Deol His Wife Photos: యానిమల్ విలన్కు ఇంత అందమైన భార్య ఉందా..! (ఫోటోలు)
-
సల్మాన్ బ్రదర్ ఇంట ఈద్ పార్టీ.. ఏదీ ఓసారి టచ్ చేసి చూడు! (ఫోటోలు)
-
సల్మాన్ ఖాన్ సికందర్
సల్మాన్ ఖాన్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకు ‘సికందర్’ టైటిల్ ఖరారైంది. గురువారం (ఏప్రిల్ 11) ఈద్ సందర్భంగా ‘సికందర్’ టైటిల్ను అధికారికంగా ప్రకటించి, టైటిల్ లోగోను కూడా విడుదల చేశారు మేకర్స్. సాజిద్ నడియాద్వాలా నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఈద్కు రిలీజ్ కానుంది. ‘‘ఈ ఈద్కు ‘బడే మియా చోటే మియా’, ‘మైదాన్’ సినిమాలను థియేటర్స్లో చూడండి. వచ్చే ఈద్కు ‘సికందర్’ వస్తాడు’’ అంటూ సోషల్ మీడియా వేదికగా స్పందించారు సల్మాన్ ఖాన్. -
Kriti Sanon Latest Photos: ఆ హీరోతో సినిమా.. పగటి కలగానే మిగిలిపోయింది
-
నాలుగేళ్ల లవ్కు బ్రేకప్.. సినిమాకు ఒప్పుకోరేమోనని టెన్షన్!
ప్రేమలో ఉన్నంతసేపు ఒకరిని విడిచి మరొకరు ఉండలేమంటారు. బ్రేకప్ అయ్యాక ముఖం చూడటానికి కూడా ఇష్టపడరు. కానీ ఇక్కడ చెప్పుకునే జంట మాత్రం చాలా ప్రొఫెషనల్. సినిమా కోసం పర్సనల్ విషయాలను పక్కనపెట్టి కలిసిపోయారు, కేవలం సెట్స్లోనే! సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ ఒకప్పుడు ప్రేమపక్షులన్న విషయం తెలిసిందే! అయితే సల్మాన్ ఎంతోమందితో ప్రేమాయణం నడిపాడు, కానీ ఏదీ సక్సెస్ కాలేదు. అలాగే కత్రినాతో నడిపిన ప్రేమ వ్యవహారం కూడా మూణ్నాళ్ల ముచ్చటగానే మారింది. కొంతకాలానికే ఇద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు. అసౌకర్యంగా ఉంటుంది అది జరిగిన కొంతకాలానికే డైరెక్టర్ కబీర్ ఖాన్ 'ఏక్ థా టైగర్' సినిమాను పట్టాలెక్కించే పనిలో పడ్డాడు. కానీ ఈ లవ్ బర్డ్స్ బ్రేకప్ వల్ల ఇద్దరూ సినిమాలో నటించేందుకు ఒప్పుకుంటారో, లేదోనని తెగ టెన్షన్ పడ్డాడు. దాని గురించి అతడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'కత్రినా, నాకు ఇంట్లో మనిషిలా అనిపిస్తుంది. సినిమా గురించి చెప్పగానే వెంటనే సంతకం చేసింది. తర్వాత సల్మాన్ ఖాన్ ఇంటికి వెళ్లాం. అసలే బ్రేకప్ అయింది. అలాంటి సమయంలో కలిసి పని చేయాలంటే ఎంతో అసౌకర్యంగా ఉంటుంది. కత్రినా అని తెలిసి కూడా ఆయన ఒప్పుకుంటాడో, లేదోనని టెన్షన్ పడుతూనే తన ఇంటికి వెళ్లాం. హీరోయిన్గా కత్రినాను సెలక్ట్ చేశాం అని చెప్పాను. 5-10 నిమిషాలు మౌనంగా ఉన్న తర్వాత సరే చేసేద్దాం అన్నారు. మా గుండె నుంచి పెద్ద భారం దిగిపోయినట్లనిపించింది' అని చెప్పుకొచ్చాడు. కాగా సల్మాన్- కత్రినా నాలుగేళ్లపాటు డేటింగ్ చేశారు. 2009లో విడిపోయారు. తర్వాత కత్రినా రణ్బీర్ కపూర్తో ప్రేమలో పడింది. కానీ ఈ బంధం కూడా నిలవలేదు. వీళ్లిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నాక విక్కీ కౌశల్ను లవ్ చేసింది. 2021లో వీరు పెళ్లి చేసుకున్నారు. చదవండి: పదేళ్ల క్రితం ఆశపడ్డాడు.. చివరికి అది నెరవేరకుండానే.. -
Salman khan: ఫైటింగ్కి రెడీ అయిన సల్మాన్ ఖాన్!
మేలో యాక్షన్ స్టార్ట్ చేయనున్నారు సల్మాన్ ఖాన్. తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ తెరకెక్కించనున్న సినిమాలో సల్మాన్ ఖాన్ హీరోగా నటించనున్న సంగతి తెలిసిందే. ఈ యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ చిత్రీకరణ మేలో ముంబైలో ప్రారంభం కానుందని బాలీవుడ్ సమాచారం. ముందుగా ఓ యాక్షన్ సీక్వెన్స్ను చిత్రీకరించాలని ప్లాన్ చేస్తున్నారట మురుగదాస్. ఈ సినిమాలోఅదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్లతో పాటు ఓ సామాజిక సందేశం కూడా ఉందని ఇటీవల మురుగదాస్ వెల్లడించిన సంగతి తెలిసిందే. సాజిద్ నడియాద్వాలా నిర్మించనున్న ఈ చిత్రం 2025 రంజాన్ సందర్భంగా విడుదల కానుంది. -
అంబానీకి స్టార్ హీరో ఏం గిఫ్ట్ ఇచ్చాడో తెలుసా?
అంబానీ ఇంట సెలబ్రేషన్స్ అంటే మాటలా.. దేశమంతా ఈ ఫ్యామిలీ వేడుకలను చూసి నోరెళ్లబెడుతోంది. ప్రీవెడ్డింగ్ కోసమే వెయ్యి కోట్లపైనే ఖర్చు చేయడం చూసి జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు. జాతీయ, అంతర్జాతీయ సెలబ్రిటీలంతా గుజరాత్లోని జామ్నగర్లోనే రెండు, మూడు రోజులపాటు సెటిలయ్యారు. బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా పనులన్నీ పక్కనపెట్టి ఈ వేడుకలను ఎంజాయ్ చేశారు. ఆటపాటలతో అలరించారు. స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అంబానీ ఫ్యామిలీకి చాలా క్లోజ్. అనంత్ అంబానీ- సల్మాన్ మధ్య ఎప్పటినుంచో మంచి అనుబంధం ఉంది. అందుకే ప్రీవెడ్డింగ్కు సైతం సల్లూభాయ్ ఓ గిఫ్ట్ పట్టుకెళ్లాడట! అనంత్ కోసం ప్రత్యేకంగా ఓ వాచ్ తయారు చేయించాడట. దాని విలువ కోట్లల్లో ఉంటుందని తెలుస్తోంది. రాధిక మర్చంట్కు డైమండ్ ఇయర్ రింగ్స్ బహుమతిగా ఇచ్చాడట. ఇది చూసిన కొందరు అంబానీకి ఆ గిఫ్ట్స్ ఏం సరిపోతాయని సెటైర్లు వేస్తున్నారు. అయినా అంబానీకి గిఫ్ట్ ఇవ్వాలంటే ఆస్తులు అమ్ముకోవాలని కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా ఇలా బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటే వారి మధ్య స్నేహం మరింత బలంగా మారుతుందని అభిప్రాయపడుతున్నారు. చదవండి: పెళ్లికి రెడీ అయిన కిరణ్ అబ్బవరం! ఆ హీరోయిన్తో ఏడడుగులు? -
బాలీవుడ్ స్టార్ చాలా ఎక్కువ తింటాడు.. శునకంలా..: నటుడు
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, నటుడు విందు దార సింగ్ కాలేజీ నుంచే స్నేహితులు. చదువుకునేరోజుల్లో మొదలైన వీరి స్నేహం ఇప్పటికీ అలాగే కొనసాగుతోంది. తాజాగా అతడు సల్మాన్ గురించి కొన్ని సీక్రెట్స్ బయటపెట్టాడు. విందు మాట్లాడుతూ.. నా శరీరాకృతి చూశాక సల్మాన్ ఎక్కువ ఎక్సర్సైజ్ చేయడం మొదలుపెట్టాడని చెప్తుంటాడు. కానీ చాలా ఎక్కువ సేపు జిమ్లోనే గడుపుతాడు. తిండి విషయంలోనూ ఇంతే.. పందిలా తింటాడు.. కుక్కలా ఎక్సర్సైజ్ చేస్తాడు. చాలా తింటాడు.. అంతే కష్టపడతాడు అతడు చాలా ఎక్కువ తింటాడు. తిన్నదంతా ఎక్కడికి పోతుంది? అని అడిగితే.. ఎక్సర్సైజ్ ద్వారా ఆ తిన్నదంతా కరిగించేస్తానంటాడు. తను చాలా అద్భుతమైన వ్యక్తి. అతడంటే నాకెంతో ఇష్టం. తనది మంచి మనసు. సాయం చేసే గుణం కూడా ఉంది. అతడి తండ్రి, రచయిత సలీమ్ ఖాన్ ప్రతిరోజూ సల్మాన్కు డబ్బులిచ్చేవాడు. డబ్బులు ఉంచుకోడు ఆ డబ్బును ఇంట్లో పనిచేసేవారికి ఇచ్చేవాడు. రూ.50 వేలిచ్చినా, లక్ష రూపాయలిచ్చినా సరే దాన్ని పేదలకు దానం చేసేవాడు. ఇప్పటికీ అతడు అలాంటి దానధర్మాలెన్నో చేస్తాడు. నెలకు దాదాపు రూ.25- 30 లక్షల వరకు దానం చేస్తుంటాడు. ఇప్పటికీ తన పాకెట్మనీ తండ్రి దగ్గరే వసూలు చేస్తాడు. కానీ తన దగ్గర మాత్రం ఉంచుకోడు' అని చెప్పుకొచ్చాడు. చదవండి: శరత్బాబుతో ప్రేమలో పడ్డా.. నేను చెడిపోయినా పర్వాలేదని లొంగిపోయాను -
అంబానీ ప్రీవెడ్డింగ్.. త్రీ ఖాన్స్కు భారీగా పారితోషికం?!
బాలీవుడ్ సెలబ్రిటీలందరినీ ఒక్కచోటకు చేర్చడం.. అది కూడా బస్సెక్కించి మరీ ఈవెంట్కు తీసుకురావడం ఒక్క అంబానీకే సాధ్యమైంది. తారలు సైతం తమ ఇంటి పెళ్లిలాగే భావించి అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్లో తెగ సందడి చేశారు. ఆటపాటలతో అలరించారు. అయితే అందరినీ కట్టిపడేసిన అంశం ఏదైనా ఉందా? అంటే త్రీఖాన్స్ డ్యాన్స్ చేయడమే! స్టేజీపై డ్యాన్స్.. ఎప్పుడూ బిజీగా ఉండే షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్.. అన్నదమ్ముల్లాగా కలిసి డ్యాన్స్ చేయడంతో అభిమానులంతా ఫుల్ ఖుషీ అయ్యారు. ఇందుకోసం డబ్బులు కూడా బాగానే తీసుకుని ఉండొచ్చంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వీరితో కలిసి స్టెప్పేసిన రామ్చరణ్కు కూడా ఎంతో కొంత ఇచ్చే ఉంటారని ఎవరికి వారు అభిప్రాయపడుతున్నారు. కానీ బీటౌన్లో మాత్రం ప్రచారం మరోలా ఉంది. చరణ్తో పాటు ఈ ఖాన్స్ త్రయానికి డబ్బులే ఇవ్వలేదట! సంతోషంతోనే.. 'వారిని ఒకే స్టేజీపైకి తీసుకురావాలని అప్పటికప్పుడు అనుకున్నారు. ఎవరూ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. అంబానీ అంత గ్రాండ్గా ఆతిథ్యం ఇచ్చినప్పుడు అతిథులు డబ్బులు అడగ్గలరా? ఆ హీరోలు సంతోషంతో అలా డ్యాన్స్ చేశారంతే.. కానీ డబ్బులు మాత్రం తీసుకోలేదు' అని జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అంబానీ ఇచ్చిన ఆతిథ్యాన్ని మెచ్చిన హీరోలు ఫ్రీగా డ్యాన్స్ చేశారన్నమాట! అయినా ఇది ప్రీవెడ్డింగ్ కాబట్టి డిమాండ్ చేయలేదేమో.. పెళ్లికి అసలు, వడ్డీ.. అంతా కలిపి అడుగుతారని.. అప్పటిదాకా ఓపిక పట్టండని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. #RamCharan kaha hai tu.. They are treating him like his own. How beautiful 😍. pic.twitter.com/s7hXwrBP6N — अपना Bollywood🎥 (@Apna_Bollywood) March 3, 2024 చదవండి: సడన్గా ఓటీటీలోకి వచ్చేస్తున్న థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? -
సందడి సందడిగా అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ (ఫొటోలు)
-
తెలుగు పాటకు 'త్రీ ఖాన్స్' డ్యాన్స్.. ఫిదా అవుతున్న బాలీవుడ్
జామ్నగర్లో భారత కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ల ప్రీవెడ్డింగ్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఎన్కోర్ హెల్త్కేర్ సీఈఓ వీరేన్ మర్చంట్ కుమార్తె అయిన రాధికతో వివాహం జరగనుండగా ఇప్పటికే ప్రీ వెడ్డింగ్ వేడుకలు ప్రారంభమయ్యయి. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు సినీ తారలు, పలువురు ప్రముఖులతో పాటు దేశ విదేశాల్లోని అతిరథ మహారథులు గుజరాత్లోని జామ్నగర్ చేరుకున్నారు. మార్చి 1 నుంచి ప్రారంభమైన ఈ వేడుకలు నేటితో ముగియనున్నాయి. ఈ వేడుకల్లో బాలీవుడ్ నటులు షారూక్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, రణవీర్ సింగ్, దీపికా పదుకొణే.. అంతర్జాతీయ ప్రముఖులు పాప్ సింగర్ రిహన్నా, అమెరికన్ గాయని, గేయ రచయిత జే బ్రౌన్, వాయిద్యాకారుడు బాసిస్ట్ ఆడమ్ బ్లాక్స్టోన్ సందడి చేశారు. బాలీవుడ్లో త్రీ ఖాన్స్గా గుర్తింపు ఉన్న షారూక్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్లు ఒకే ఫ్రేమ్లో చాలా రోజుల తర్వాత కనిపించడంతో బాలీవుడ్ సినీ అభిమానులు సంతోషిస్తున్నారు. వారి ముగ్గురిని ఒకే స్టేజీపై కలపగల వ్యక్తి అంబానీ మాత్రమే అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. రామ్ చరణ్, జూ ఎన్టీఆర్ నటించిన RRR చిత్రంలోని 'నాటు నాటు' పాటకు త్రీ ఖాన్స్ వేసిన స్టెప్పులకు అతిథులు ఫిదా అయ్యారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తున్నారు. ఇకపోతే అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ల వివాహం ఇదే ఏడాది జులైలో జరగనుంది. View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani) -
సినిమా చూసి సెల్యూట్ కొడతారు
‘‘మన సైనికుల త్యాగాలని గుర్తు చేసుకుంటూ వారి ధైర్య సాహసాలని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చేసిన ప్రయత్నమే ‘ఆపరేషన్ వాలెంటైన్’. మనందరికీ దేశభక్తి ఉంటుంది.. కానీ, మా సినిమా చూశాక అది మరింత పెరుగుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు హీరో వరుణ్ తేజ్. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా నటించిన చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. మానుషీ చిల్లర్, రుహానీ శర్మ, నవదీప్ కీలక పాత్రలు పోషించారు. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రోడక్షన్స్, సందీప్ ముద్దా రినైసన్స్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమా మార్చి 1న తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ సినిమా హిందీ ట్రైలర్ను హీరో సల్మాన్ ఖాన్, తెలుగు ట్రైలర్ను హీరో రామ్చరణ్ రిలీజ్ చేశారు. వరుణ్ తేజ్ మాట్లాడుతూ– ‘‘మన దేశంలో సినిమా పెద్ద వినోద సాధనం. సరదాగా కాలక్షేపం చేయాలంటే అందరూ ముందు సినిమావైపు వెళ్తారు. అందుకే ప్రేక్షకులు ఖర్చు పెట్టే టిక్కెట్ డబ్బులకి న్యాయం చేయాలని ఎప్పుడూ ప్రయత్నిస్తుంటాను. చాలా కొత్తగా, ఎడ్జ్ ఆఫ్ ది సీట్ కూర్చుని గూస్ బంప్స్ మూమెంట్స్ని ఎంజాయ్ చేసే చాలా సన్నివేశాలు ఈ మూవీలో ఉన్నాయి. ఈ సినిమాని చాలా గర్వంగా, గుండెల నిండా దేశభక్తితో చూసి మన సైనికులకు సెల్యూట్ కొడతారు’’ అన్నారు. ‘‘యాక్షన్, ఫన్, ఎమోషన్.. ఇలా అన్ని అంశాలున్న చిత్రమిది’’ అన్నారు శక్తి ప్రతాప్. -
మురుగదాస్ ను పిలిచి సినిమా ఆఫర్ ఇచ్చిన సల్మాన్..?
-
తమ్ముడి రెండో పెళ్లి.. నా మాట ఎప్పుడు విన్నాడని?: సల్మాన్
ప్రేమించుకుంటే పెళ్లి చేసుకోవాలా? ఇదేం ప్రశ్న అనుకునేరు.. చాలామంది ప్రేమలో పడుతున్నారు.. కానీ ఎక్కువకాలం కొనసాగలేక బ్రేకప్ చెప్పుకుంటున్నారు. చివరాఖరకు పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటున్నారు. కొంతమంది మాత్రమే ఆ ప్రేమను పెళ్లితో పవిత్రబంధంగా మార్చుకుంటున్నారు. అయితే బాలీవుడ్ భాయ్జాన్ సల్మాన్ ఖాన్ మాత్రం షాదీ చేసుకునేదే లేదంటున్నాడు. అందుకే 58 ఏళ్ల వయసొచ్చినా సింగిల్గానే ఉంటున్నాడు. అతడి తమ్ముడిది ఇంకో దారి! 56 ఏళ్ల వయసులో ప్రేమ, పెళ్లి ఐటం సాంగ్ హీరోయిన్ మలైకా అరోరాను పెళ్లాడిన ఇతడు కొడుకు పుట్టాక ఆమెతో తెగదెంపులు చేసుకున్నాడు. 56 ఏళ్ల వయసులో మేకప్ ఆర్టిస్ట్ షురా ఖాన్తో ప్రేమలో పడ్డాడు. ఇంకేముంది, ఆలస్యం చేయకుండా గతేడాది చివర్లో నిఖా చేసుకున్నాడు. ఆదివారం నాడు(జనవరి 29న) సల్మాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న హిందీ బిగ్బాస్ 17వ సీజన్ గ్రాండ్ ఫినాలేలో అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న కమెడియన్ భారతీ సింగ్.. పెళ్లికి తననెందుకు పిలవలేదని నిలదీసింది. ఇంకెక్కడ పెళ్లి? ఇందుకు అర్బాజ్.. నెక్స్ట్ పెళ్లికి పిలుస్తానులే అని సరదాగా వ్యాఖ్యానించాడు. 'తమ్ముడి పెళ్లిపై నీ రియాక్షన్ ఏంటి? నువ్వు ఎలాంటి సలహాలిచ్చావు?' అని సల్మాన్ను ప్రశ్నించింది లేడీ కమెడియన్. అందుకు సల్లూభాయ్ స్పందిస్తూ.. 'అతడు నా మాట ఎప్పుడు విన్నాడని? నా మాటలు విని ఉంటే..' అని మధ్యలోనే ఆపేశాడు. దీంతో అర్బాజ్ తన ప్రేమ-పెళ్లి వ్యవహారాల్లో సొంత అన్న మాట కూడా వినడని అర్థమైంది.ఇక పెళ్లెప్పుడు అన్న ప్రశ్నకు సల్మాన్ బదులిస్తూ.. 'ఇంకెక్కడ పెళ్లి.. నా జీవితంలో ఆ ముచ్చట ఉండదు' అని తేల్చేశాడు. ఇకపోతే బిగ్బాస్ 17వ సీజన్లో మునావర్ ఫరూఖి విజేతగా నిలిచాడు. age dekhiye #BB17 main hone walah hai #BhartiSingh comedy with #sohail & #arbaazkhan . AND MILEGA TOP 3 SE TOP 2 of #BB17Finale . . HBD KING MUNAWAR Follow Me 🙏 #BB17Finale #MunawarFaraqui𓃵 #BB17 #MKJW #MunwarKiJanta #MannaraFam pic.twitter.com/hZgYJxSGBs — LiveKhabri❄ (@theLiveKhabri) January 28, 2024 చదవండి: భార్యతో స్టార్ హీరో డ్యాన్స్.. ఆప్యాయంగా ముద్దాడుతూ.. -
జైలు జీవితం నుంచి 'బిగ్ బాస్' విన్నర్గా నిలిచిన కమెడియన్
హిందీ, కన్నడ బిగ్ బాస్ సీజన్స్ రియాల్టీ షోలు ఒకే రోజు ముగిశాయి. కన్నడ బిగ్ బాస్ సీజన్ 10 విజేతగా కార్తీక్ మహేష్ నిలుస్తే.. హిందీ బిగ్ బాస్ సీజన్ 17 ట్రోఫీని స్టాండప్ కమెడియన్ మునావర్ ఫరూఖీ గెలుచుకున్నాడు. రెండో స్థానంలో అభిషేక్ కుమార్, మూడో స్థానంలో మన్నార చోప్రా, నాలుగో స్థానంలో అంకితా లోఖండే నిలిచారు. ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్ ఎపిసోడ్కు ముఖ్య అతిథిగా నటుడు అజయ్ దేవగన్ హాజరయ్యారు. సల్మాన్ ఖాన్ హిందీ బిగ్ బాస్కు హాస్ట్గా ఉన్న విషయం తెలిసిందే. పోటీలో చివరిగా మిగిలిన ఇద్దరు కంటెస్టెంట్స్ అభిషేక్ కుమార్, మునావర్ ఫారూఖీల చేతులు పట్టుకుని స్టేజీపైకి సల్మాన్ వచ్చారు. ఎంతో ఉత్కంఠతకు దారితీసిన ఫైనల్ ఎపిసోడ్లో 'విజేత' మునావర్ ఫరూఖీని సల్మాన్ ప్రకటించడంతో ఒక్కసారిగా ఆయన ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోయారు. విజేతగా నిలిచిన మునావర్ ఫరూఖీకి రూ.50 లక్షల డబ్బుతో పాటు విలాసవంతమైన కారును కూడా పొందాడు. ఆకర్షణీయమైన ట్రోఫీని అందుకున్న మునావర్ ప్రేక్షకుల వైపు చూపిస్తూ తన ఆనందాన్ని పంచుకున్నాడు. ఈ సీజన్ విన్నర్ అతనే అని చాలామంది అభిప్రాయపడ్డారు. అందరూ అనుకుంటున్నట్లే ఆయన విజయం సాధించడంతో అభిమానులు ఫుల్ జోష్లో ఉన్నారు. జైలు జీవితం నుంచి బిగ్ బాస్ విజేతగా పయనం మునావర్ ఒక కార్యక్రమంలో హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీంతో మతపరమైన మనోభావాలను దెబ్బతీశారంటూ గతంలో బీజేపీ ఎంపీ కుమారుడు ఏకలవ్య సింగ్ గౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గుజరాత్కు చెందిన మునావర్ ఫరూఖీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో సుమారు నెల రోజుల పాటు జైలు శిక్ష అనుభవించిన ఆయన చివరకు బెయిల్ మీద విడుదల అయ్యాడు. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ హోస్ట్ చేసిన రియాలిటీ టీవీ షో 'లాక్ అప్' 2022 సీజన్లో మునావర్ ఫరూఖీ విన్నర్గా నిలిచాడు. తాజాగా ఆయన బిగ్బాస్ సీజన్లో కూడా విన్నర్గా గెలవడంతో ఫ్యాన్స్ ఆనందంలో ఉన్నారు. ఈ సీజన్లో కామెడీతో పాటు చమత్కారంతో ప్రేక్షకులను మెప్పించిన మునావర్.. 17 మందిలో విజేతగా నిలిచాడు. ఐదో స్థానంలో హైదరాబాద్ యూట్యూబర్ బిగ్ బాస్ 17వ సీజన్లో హైదరాబాద్ యువకుడు అరుణ్ శ్రీకాంత్ మాశెట్టి ఐదో స్థానంలో నిలిచి మెప్పించాడు. శ్రీకాంత్ యూట్యూబర్గా రానిస్తున్నాడు. సీజన్ ప్రారంభం నుంచే దూకుడుగా ఆడిన ఇతగాడు బాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించాడు. అదిరిపోయే ఆటతీరుతో ఆకట్టుకుని ఫినాలేకు చేరుకున్నాడు. అయితే, పెద్దగా ఫాలోయింగ్ లేకపోవడంతో ఐదో స్థానంతోనే సరిపెట్టుకున్నాడు. The moment #MunawarFaraqui𓃵 became the winner Of #BB17 🎉🔥 even He also Shared His trophy with #AbhishekKumar 😍💞 Dosti ho Toh #MunAbhi jaisa MUNAWAR THE DEFINITE WINNER HBD KING MUNAWAR Follow Me 🙏 #BB17Finale #MunawarFaraqui𓃵 #BB17 #MKJW #MunwarKiJanta pic.twitter.com/wClV3YSt6j — LiveKhabri❄ (@theLiveKhabri) January 28, 2024 -
ఆ హీరో సడన్గా దగ్గరకు వచ్చి వింతగా ప్రవర్తించాడు: భాగ్యశ్రీ
మైనే ప్యార్ కియా(తెలుగులో ప్రేమ పావురాలు) చిత్రంతో వెండితెరపై తన ప్రయాణం మొదలుపెట్టింది భాగ్యశ్రీ. ఒకప్పుడు హీరోయిన్గా రాణించిన ఆమె ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతోంది. ఆ మధ్య ప్రభాస్ రాధేశ్యామ్, బెల్లంకొండ శ్రీనివాస్ హిందీ మూవీ ఛత్రపతిలోనూ కనిపించింది. తాజాగా ఈ నటి ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకుంది. 'నాన్న చాలా స్ట్రిక్ట్గా ఉండేవాడు. అందువల్ల స్కూల్లో చదువుకునే రోజుల్లో మా క్లాస్లో అబ్బాయిలతో మాట్లాడేదాన్నే కాదు. కానీ అనుకోకుండా హిమాలయ దస్సానీతో ప్రేమలో పడ్డాను. మా ప్రేమ విషయం నాన్నకు ఎక్కడ తెలిసిపోతుందో? తను ఎలా స్పందిస్తాడో? అని టెన్షన్ పడేదాన్ని. ఊటీలో షూటింగ్.. ఆ రోజు సినిమాల్లోకి వచ్చేంతవరకు కూడా అది సీక్రెట్గానే ఉంచాను. మైనే ప్యార్ కియా సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు నా విషయం సల్మాన్కు తెలిసింది. ఆ తర్వాత మేము దిల్ దీవానా బిన్ సజ్నాకే సినిమా చేశాం. ఈ మూవీ షూటింగ్ కోసం ఊటీలో నెలరోజులపాటు ఉన్నాం. అప్పుడు సల్మాన్ వచ్చి నా చెవిలో పాట పాడాడు. పదేపదే ఏదో గుసగుసలాడుతున్నట్లుగా దగ్గరకు వచ్చి పాటలు పాడుతూనే ఉన్నాడు. అంతకుముందెన్నడూ అలా ప్రవర్తించలేదు. ఇతడేంటి? నాతో ఫ్లర్ట్ చేస్తున్నాడు? తనకిది సరదాగా ఉందా? అని చిరాకెత్తుకొచ్చింది. హీరోను తిట్టేశా.. తనను పక్కకు తీసుకెళ్లి ఏమైంది నీకు? ఎందుకిలా పిచ్చిగా ప్రవర్తిస్తున్నావు.. బుద్ధిగా నడుచుకో అని చెప్పాను. అప్పుడతడు నీ ప్రేమ విషయం తెలిసిపోయిందిలే, అందుకే ఆటపట్టిస్తున్నా అన్నాడు. నీ ప్రియుడిని సెట్స్కు పిలువు.. ఎవరికీ అనుమానం రాకుండా చూసుకుంటానని భరోసా ఇచ్చాడు. అలా హీరో అండతో దస్సానీని కలుసుకుని మాట్లాడేదాన్ని. అందరూ అతడిని సల్మాన్ ఫ్రెండ్ అనుకున్నారు' అని చెప్పుకొచ్చింది. కాగా భాగ్యశ్రీ.. 1990లో హిమాలయ దస్సానీని పెళ్లాడింది. వీరికి అవంతిక, అభిమన్యు సంతానం. చదవండి: ఆ బుజ్జిని గుర్తుపట్టారా? ఈమె మిడిల్ క్లాస్ మదర్! -
బిగ్ బాస్ చరిత్రలోనే ఇది దారుణమైన టాస్క్.. వీడియో వైరల్
హిందీ బిగ్ బాస్ 17 దాదాపు పూర్తి కావస్తోంది. ప్రస్తుతం 95 రోజుకు ఈ సీజన్ చేరుకుంది. తాజాగా చివరి నామినేషన్ ప్రక్రియ జరిగింది. తెలుగులో మాదిరి కాకుండా వీరిని రెండు గ్రూపులుగా విభజించి ఒక టాస్క్ ఇచ్చి నామినేషన్ చేయమని బిగ్ బాస్ చెప్పాడు. ప్రస్తుతం హౌస్లో ఎనిమిది మంది కంటెస్టెంట్లు ఉన్నారు. వారిని రెండు గ్రూపులుగా విభిజించి టాస్క్లు పెట్టాడు. టాప్-5 లిస్ట్లో ఉంటారని అనుకున్న వారిలో నలుగురిని ఒక టీమ్లో బిగ్ బాస్ ఉంచాడు. ఆ నలుగురిని కూడా రెండు జంటలుగా ఉంచాడు. మున్నావర్, అరుణ్, అభిషేక్, మన్నారా చోప్రా గ్రూపు-Aలో ఉన్నారు. అంకిత, ఇషా,విక్కీ, ఆయేషా ఈ నలుగురు గ్రూప్-Bలో ఉన్నారు. గ్రూప్-ఏ వాళ్లు అందరూ దాదాపు టాప్-5 రీచ్ అయ్యే కంటెస్టెంట్లు.. గ్రూప్ -బీ సభ్యుల్లో ఉన్న విక్కీ, ఆయేషా ఎలిమినేట్ అవడం దాదాపు ఖాయం అయిపోయింది.. దీంతో ఎలాగైనా చివరి వారం ఎలిమినేషన్ తప్పించుకుంటే ఫైనల్ రేసులోకి ఎంట్రీ ఇవ్వచ్చు అని తాజాగా బిగ్ బాస్ పెట్టిన టాస్క్లో విక్కీ, అయేషా చాలా ఎక్స్ట్రీమ్కు వెళ్లారు. దీంతో మన్నారా చోప్రా, అభిషేక్ తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. చివరి వారంలో బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ గేమ్లో భాగంగా అక్కడ ఒక బజర్ను బిగ్ బాస్ ఏర్పాడు చేశాడు. ఆ బజర్ను నొక్కి పట్టుకున్నంత సేపు అక్కడ ఒక లైట్ వెలుగుతుంది. బజర్ నుంచి చెయి తీసేస్తే ఆ లైట్ ఆఫ్ అయిపోతుంది. ఎవరు ఎంత సమయం పాటు బజర్ను నొక్కి పట్టుకుంటారనేది టాస్క్... ఆ సమయంలో ఆపోజిట్ టీమ్ వాళ్లు పలు ఇబ్బందులు క్రియేట్ చేవయవచ్చని బిగ్ బాస్ చెప్తాడు. అక్కడ గెలుస్తే టాప్-5 వెళ్తారు.. లేదంటే నామినేషన్ లిస్ట్లో ఉంటారని బిగ్ బాస్ చెప్తాడు. గేమ్లో భాగంగా మొదట గ్రూప్-ఏ నుంచి మన్నారా చోప్రా, అభిషేక్ జోడీగా టాస్క్ ప్రారంభిస్తారు. వీరిద్దరూ కూడా టాప్ -5 లిస్ట్లో దాదాపు ఖాయం అని చెప్పవచ్చు. వీరిద్దరూ జోడీగా బజర్ను నొక్కి పట్టుకుంటారు. ఆ సమయంలో వారిని ఇబ్బంది పెట్టేందుకు గ్రూప్- బీ నుంచి విక్కీ, అయేషా వస్తారు. వారిద్దరూ టాప్ -5 రేసులో లేరు.. చివరి వారంలో దాదాపు ఎలిమినేట్ అవడం ఖాయం అని వారికి కూడా తెలుసు. దీంతో ఎలాగైనా ఈ టాస్క్ గెలిచి టాప్-5లో చేరిపోవాలని వారిద్దరూ విచక్షణ కోల్పోయి టాస్క్లో ఎక్స్ట్రీమ్కు చేరుకుంటారు. బజర్ మీద చెయి పెట్టి ఉన్న మన్నారా చోప్రా, అభిషేక్ ముఖం మీద ఏకంగా కారం పొడి, కిచెన్లో ఉన్న మసాల పొడులు తీసుకొని వచ్చి పూస్తారు. అంతటితో ఆగకుండా నీటిలో కారం పొడి కలిపి వారి మొఖం మీద కొడుతారు. ఆ సమయంలో వారిద్దరూ అల్లాడిపోయారు. అలా సుమారు 29 నిమిషాల పాటు వారు భరించి బజర్ మీది నుంచి చేతిని తీసేస్తారు. చివరకు వారిద్దరూ మెడికల్ రూమ్కు వెళ్లి చికిత్స పొందారు. కొన్ని గంటల తర్వాత ఆగిపోయిన గేమ్ మళ్లీ ప్రారంభం అవుతుంది. ఆ సమయంలో విక్కీ, అయేషా ఎలా విచక్షణ కోల్పోయి కారం పొడి చల్లారో ఆ వీడియోను టీవీలో బిగ్ బాస్ చూపిస్తాడు. అప్పుడు బిగ్ బాస్ గ్రూప్-A వారికి ఒక ఆఫర్ ఇస్తాడు.. మీరు కూడా ఇలాగే కారం పొడి కొట్టి గేమ్ అడుతారా..? లేదా గ్రూప్ -B వారిని డైరెక్ట్గా నామినేట్ చేస్తారా..? అని అడుగుతాడు.. అప్పుడు గ్రూప్ ఏ వారు తాము ఈ గేమ్ ఆడలేమని చెప్పి గ్రూప్ బీ వారిని డైరెక్ట్గా నామినేట్ చేయమని బిగ్ బాస్ను కోరుతారు. దీంతో అంకిత, ఇషా, విక్కీ, ఆయేషా ఈ వారం నామినేషన్ లిస్ట్లో ఉన్నారు. విచక్షణ కోల్పోయి గేమ్ ఆడిన ఆయేషా, విక్కీ పట్ల నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇలాంటి చర్య జరుగుతుంటే ఆపాల్సింది పోయి గేమ్ను కొనసాగించడం ఏంటి..? అని బిగ్ బాస్ టీమ్ పట్ల కూడా వారు ఫైర్ అవుతున్నారు. ఈ శనివారంలో హౌస్ట్ సల్మాన్ ఖాన్ ఈ అంశంపై ఎలా రియాక్ట్ అవుతాడో చూడాల్సి ఉంది. It was a tough one, uff! Thank you fam for the support and wishes 🙏💖 #MannaraChopra #BB #BB17 #Mannara #BiggBoss #biggBoss17 pic.twitter.com/rEn6PGdJ1B — Mannara Chopra (@memannara) January 17, 2024 #BiggBoss really wanted to show how much torture this Sherni #MannaraChopra went through compared to the boys #AbhishekKumar, #MunawarFaruqui & #ArunMashettey. #BB17 #BiggBoss17 #MunAra #MKJW pic.twitter.com/M6MjmTGOAh — dw🍼🍼 (@doodhwaali) January 17, 2024 View this post on Instagram A post shared by ColorsTV (@colorstv)
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
టీడీపీ నేతలు కలసి రాకపోవడంతో నైరాశ్యం
ఓటమి భయంతో వసంత బూతు పురాణం
సంక్షేమం వైఎస్సార్ సీపీతోనే సాధ్యం
మేనిఫెస్టో అమలు ఘనత వైఎస్ జగన్దే
వైఎస్సార్ సీపీలో కొనసాగుతున్న చేరికలు
మరోసారి సీఎం వైఎస్ జగన్ను ఆశీర్వదించండి
రూ.1000 కోట్లు దాటిన టాటా కంపెనీ లాభం
ఆఖరికి మోదీ కూడా..దిగజారుడు మాటలు ఎందుకు..?
సంక్షేమ పథకాలతో ప్రతి కుటుంబంలో సంతోషం
తప్పక చదవండి
- PK: 'పులుసు కారుతోంది'..!
- ఓటీటీకి వచ్చేసిన పుష్ప విలన్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
- నాడు తిట్లు.. నేడు కౌగిలింతలు!
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- ‘సూపర్ సీఎం’ పాండియన్!
- Lok Sabha Election 2024: ఎన్నికల చరిత్రలో ఏకగ్రీవాలు
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
- మొలకలతో బోలెడన్ని ప్రయోజనాలు, ఈ సైడ్ ఎఫెక్ట్స్తెలుసుకోండి!
Advertisement