Sarfraz Ahmed
-
మా జట్టుకు గట్టి పోటీ తప్పదు.. సెమీస్ చేరే జట్లు ఇవే: పాక్ మాజీ కెప్టెన్
చాంపియన్స్ ట్రోఫీ-2025 గ్రూప్ దశలో తమ జట్టుకు గట్టిపోటీ తప్పదంటున్నాడు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్(Sarfaraz Ahmed). టీమిండియా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ల జట్ల రూపంలో కఠిన సవాలు ఎదురుకానుందని పేర్కొన్నాడు. అయితే, సొంతగడ్డపై జరిగే ఈ టోర్నీలో పాకిస్తాన్(Pakistan) తప్పకుండా సెమీ ఫైనల్కు మాత్రం చేరుతుందని సర్ఫరాజ్ అహ్మద్ ధీమా వ్యక్తం చేశాడు.కాగా 2017లో చివరగా జరిగిన చాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy) టోర్నమెంట్లో పాక్ టైటిల్ గెలిచిన విషయం తెలిసిందే. నాడు సర్ఫరాజ్ అహ్మద్ కెప్టెన్సీలో లండన్ వేదికగా జరిగిన ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి టీమిండియాపై గెలుపొంది ట్రోఫీని ముద్దాడింది. ఎనిమిదేళ్ల అనంతరంఇక ఇప్పుడు.. దాదాపు ఎనిమిదేళ్ల అనంతరం ఈ మెగా టోర్నీ మరోసారి జరుగనుండగా డిఫెండింగ్ చాంపియన్ హోదాలో పాకిస్తాన్ ఆతిథ్య హక్కులు దక్కించుకుంది.ఇక ఈ ఐసీసీ ఈవెంట్కు పాకిస్తాన్తో పాటు వన్డే వరల్డ్కప్-2023 ప్రదర్శన ఆధారంగా ఆస్ట్రేలియా, భారత్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్ అర్హత సాధించాయి.ఈ క్రమంలో ఈ ఎనిమిది జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-‘ఎ’లో భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్.. గ్రూప్-‘బి’లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్ , ఇంగ్లండ్ను చేర్చారు. ఇక పాక్ వేదికగా ఫిబ్రవరి 19 నుంచి ఈ టోర్నీ మొదలుకానుండగా.. టీమిండియా మాత్రం తమ మ్యాచ్లన్నీ దుబాయ్లో ఆడనుంది.సెమీ ఫైనల్స్లో ఆ నాలుగేఈ నేపథ్యంలో సర్ఫరాజ్ అహ్మద్ చాంపియన్స్ ట్రోఫీ-2025లో సెమీస్ చేరే జట్లపై తన అంచనా తెలియజేశాడు. ‘‘పాకిస్తాన్ ఉన్న గ్రూపులో జట్ల నుంచి గట్టి పోటీ తప్పదు. అయితే, నా అభిప్రాయం ప్రకారం... ఈసారి పాకిస్తాన్, ఇండియా, అఫ్గనిస్తాన్, ఆస్ట్రేలియా బలమైన జట్లుగా కనిపిస్తున్నాయి. సెమీ ఫైనల్స్ ఈ నాలుగే చేరతాయి’’ అని సర్ఫరాజ్ అహ్మద్ పేర్కొన్నాడు.ఇక తమ జట్టు గురించి మాట్లాడుతూ.. ‘‘పాకిస్తాన్ టీమ్ పటిష్టంగా ఉంది. సొంతగడ్డపై టోర్నీ ఆడనుండటం అతిపెద్ద సానుకూలాంశం. సొంత మైదానాల్లో ఎలా ఆడాలన్న అంశంపై ప్రతి ఒక్క ఆటగాడికి అవగాహన ఉంది. 2017లో ట్రోఫీ గెలిచిన జట్టుతో పోలిస్తే.. ప్రస్తుత జట్టు మరింత స్ట్రాంగ్గా కనిపిస్తోంది.ప్రధాన బలం వారేబాబర్ ఆజం రూపంలో జట్టులో వరల్డ్క్లాస్ ప్లేయర్ ఉన్నాడు. ఫఖర్ జమాన్ ఆనాడు కొత్తగా జట్టులోకి వచ్చాడు. ఇప్పుడు అనుభవం కలిగిన ఆటగాడిగాబరిలోకి దిగబోతున్నాడు. వీళ్దిద్దరు పాకిస్తాన్ జట్టుకు ప్రధాన బలం’’ అని సర్ఫరాజ్ అహ్మద్ చెప్పుకొచ్చాడు.కాగా 2017లో చివరగా ఐసీసీ టైటిల్ గెలిచిన పాకిస్తాన్ ఇప్పటివరకు మళ్లీ మెగా ఈవెంట్లలో గెలుపు రుచిచూడలేదు. 2023 వన్డే వరల్డ్కప్, టీ20 ప్రపంచకప్-2024లో కనీసం సెమీస్ చేరకుండానే ఇంటిబాట పట్టింది. ఇప్పుడు స్వదేశంలోనైనా.. గత చేదు అనుభవాలను మరిపించేలా సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. ఇక ఇటీవల వన్డే సిరీస్లలో వరుస విజయాలతో జోరు మీదున్న పాక్ జట్టుకు సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో పరాభవం ఎదురైంది.మహ్మద్ రిజ్వాన్ పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై వన్డే సిరీస్ విజయం సాధించిన పాక్.. సౌతాఫ్రికాలో 3-0తో క్లీన్స్వీప్ చేసి ప్రపంచంలో ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. అయితే, తాజాగా స్వదేశంలో సౌతాఫ్రికా- న్యూజిలాండ్తో జరిగిన ట్రై సిరీస్లో ఫైనల్ చేరుకున్న రిజ్వాన్ బృందం కివీస్ చేతిలో ఓటమిపాలైంది.చదవండి: డబ్బులేదు.. మూడేళ్లపాటు మ్యాగీ మాత్రమే.. మరో ఆణిముత్యం.. అతడే ఓ చరిత్ర: నీతా అంబానీ -
ఒకే ఇన్నింగ్స్లో 6 క్యాచ్లు.. మహ్మద్ రిజ్వాన్ అరుదైన రికార్డు
అడిలైడ్ ఓవల్లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో పాకిస్తాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ వికెట్ల వెనక అద్బుతం చేశాడు. ఈ మ్యాచ్లో రిజ్వాన్ ఏకంగా 6 క్యాచ్లను అందుకున్నాడు. తద్వారా ఓ అరుదైన ఫీట్ను రిజ్వాన్ తన పేరిట లిఖించుకున్నాడు.వన్డేల్లో ఒకే ఇన్నింగ్స్లో అత్యధిక క్యాచ్లు అందుకున్న పాకిస్తాన్ వికెట్కీపర్గా సర్ఫరాజ్ ఆహ్మద్ రికార్డును సమం చేశాడు. మార్చి 2015లో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డేలో సర్ఫరాజ్ కూడా ఆరు క్యాచ్లను అందుకున్నాడు. అయితే ఈ మ్యాచ్లో సర్ఫరాజ్ రికార్డును బ్రేక్ చేసే ఛాన్స్ రిజ్వాన్కు లభించింది. కానీ జంపా ఇచ్చిన ఇచ్చిన ఈజీ క్యాచ్ను రిజ్వాన్ జారవిడచడంతో ఆహ్మద్ను అధిగమించలేకపోయాడు. లేదంటే 7 క్యాచ్లతో సర్ఫరాజ్ ఆల్టైమ్ రికార్డు బ్రేక్ అయివుండేది.నిప్పులు చెరిగిన రవూఫ్కాగా ఈ మ్యాచ్లో పాక్ స్పీడ్స్టర్ హారిస్ రౌఫ్ నిప్పులు చేరిగాడు. రౌఫ్ 5 వికెట్ల హాల్తో చెలరేగాడు. ఆసీస్ బ్యాటర్లకు వారి సొంతగడ్డపైనే రౌఫ్ చుక్కలు చూపించాడు. అతడి పేస్ బౌలింగ్ ధాటికి కంగారులు బెంబేలెత్తిపోయారు. 8 ఓవర్లు బౌలింగ్ చేసిన హారిస్ కేవలం 29 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 35 ఓవర్లలో కేవలం 163 పరుగులకే కుప్పకూలింది. రౌఫ్తో పాటు షాహీన్ షా అఫ్రిది మూడు వికెట్ల పడగొట్టి ఆసీస్ పతనాన్ని శాసించాడు. ఆసీస్ బ్యాటర్లలో స్టీవ్ స్మిత్(35) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు.చదవండి: IND vs SA: 'అతడికి ఇది డూ ఆర్ డై సిరీస్.. లేదంటే ఇక మర్చిపోవాల్సిందే' -
చరిత్ర సృష్టించిన మహ్మద్ రిజ్వాన్..
పాకిస్తాన్ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్లో అత్యంత వేగంగా 2000 పరుగులు మైలు రాయిని అందుకున్న పాకిస్తానీ వికెట్ కీపర్గా రిజ్వాన్ రికార్డులకెక్కాడు.రావల్పిండి క్రికెట్ స్టేడియంలో ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్టులో రిజ్వాన్ ఈ రికార్డును సాధించాడు. రిజ్వాన్ కేవలం 57 ఇన్నింగ్స్లలో ఈ మైలురాయిని అందుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు స్టార్ వికెట్ కీపర్ సర్ఫరాజ్ అహ్మద్(59 ఇన్నింగ్స్లు) పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో సర్ఫరాజ్ ఆల్టైమ్ రికార్డును రిజ్వాన్ బ్రేక్ చేశాడు. ఓవరాల్గా ఇప్పటివరకు 39 టెస్టు ఇన్నింగ్స్లు ఆడిన రిజ్వాన్.. 41.85 సగటుతో 2009 పరుగులు చేశాడు. ఇక మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్లో రిజ్వాన్ కేవలం 25 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.అదేవిధంగా రావల్పిండి టెస్టులో పాకిస్తాన్ పట్టు బిగించింది. సెకెండ్ ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ కేవలం 24 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇంగ్లండ్ ఇంకా 53 పరుగుల వెనకంజలో ఉంది.చదవండి: IPL 2025: 'ధోని వారసుడు అతడే.. వేలంలోకి వస్తే రికార్డులు బద్దలవ్వాల్సిందే' -
సర్ఫరాజ్ ఖాన్ తండ్రికి ఆనంద్ మహీంద్ర స్పెషల్ గిఫ్ట్
పారిశ్రామికవేత్త, ఎంఅండ్ఎం అధినేత ఆనంద్ మహీంద్ర మరోసారి తన గొప్ప మనుసు చాటుకున్నారు. క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ తండ్రిని ఉద్దేశించి ఉద్వేగభరితమైన ట్వీట్ చేశారు. క్రికెటర్ సర్ఫరాజ్లో విశ్వాసాన్ని నింపింనందుకు అతని తల్లిదండ్రులను అభినందనల్లో ముంచెత్తారు. అనుకున్నది సాధించేంతవరకు నమ్మకాన్ని కోల్పోకూడదనే స్పూర్తి నిచ్చారు అంటూ వారిని ప్రశంసించారు. ఈ సందర్బంగా నౌషాద్ మాటలు, సర్ఫరాజ్ బ్యాటింగ్ వీడియోను షేర్ చేశారు. ఒక బహుమతిని కూడా ప్రకటించారు. విశ్వాసాన్ని కోల్పోవద్దు....కఠోర శ్రమ, ధైర్యం, సహనం..ఇంతకంటే గొప్ప లక్షణాలు ఏముంటాయి ఒక తండ్రి పిల్లల్లో స్ఫూర్తి నింపేందుకు. అందుకే స్పూర్తిదాయకమైన తండ్రి నౌషద్ ఖాన్కు థార్ బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నా. ఇది తనకు గౌరవం ఈ బహుమతిని ఆయన స్వీకరిస్తానని విశ్వసిస్తున్నా.. అంటూ ట్వీట్ చేశారు. “Himmat nahin chodna, bas!” Hard work. Courage. Patience. What better qualities than those for a father to inspire in a child? For being an inspirational parent, it would be my privilege & honour if Naushad Khan would accept the gift of a Thar. pic.twitter.com/fnWkoJD6Dp — anand mahindra (@anandmahindra) February 16, 2024 జెర్సీ నంబర్ 97తో బరిలోకి సర్ఫరాజ్ ఖాన్ అరంగేట్రంలోనే ఇంగ్లండ్తో గురువారం రాజ్కోట్లోని నిరంజన్ షా స్టేడియంలో జరిగిన మూడో మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేసి తానేంటో నిరూపించుకున్నాడు. కాగా దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారించిన తర్వాత అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు సర్ఫరాజ్ ఖాన్. భారత వెటరన్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే అతడికి అరంగేట్రం క్యాప్ అందించిన సందర్భంలో సర్ఫరాజ్ ఖాన్ తండ్రి నౌషాద్ ఖాన్, సర్ఫరాజ్ భార్య భావోద్వేగానికి లోనయ్యారు. దీనికి సంబంధించినవ వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. జెర్సీ నంబర్ 97 సర్ఫరాజ్ తండ్రి నౌషాద్ కూడా క్రికెటర్. తన కలను నెరవేర్చుకునే ఆశయంలో భాగంగా కుమారుడికి శిక్షణ ఇచ్చాడు. ఇక 97 విషయానికి వస్తే మూడో టెస్టుకు ముందు మాట్లాడుతూ జెర్సీ నంబర్ 97 విశేషాలుతెలిపాడు. తండ్రి పేరులోని నౌ అంటే తొమ్మిది, షాద్ నుంచి 7 తీసుకున్నట్లు తెలిపాడు. అంతేకాదు ఇటీవల అండర్-19 ప్రపంచకప్లో ఆడిన సర్ఫరాజ్ సోదరుడు ముషీర్ ఖాన్ జెర్సీ నంబర్ కూడా 97 కావడం విశేషమే మరి. -
ఇంకా నయం లుంగీ, బనియన్తో రాలేదు?
లండన్ : క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన మెగా టోర్నీ ప్రపంచ కప్ 2019 గురువారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే టోర్నీ ఆరంభానికి ముందు ఆతిథ్య ఇంగ్లండ్ బుధవారం ప్రారంభ వేడుకలను ఘనంగా నిర్వహించింది. ఈ క్రమంలో వన్డే వరల్డ్కప్ పది జట్ల కెప్టెన్లు బకింగ్హామ్ ప్యాలెస్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో క్వీన్ ఎలిజబెత్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ జట్టు కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ వస్త్రధారణ సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. మిగతా కెప్టెన్లంతా ఫార్మల్ డ్రెస్సుల్లో రాగా సర్ఫరాజ్ మాత్రం సంప్రదాయ దుస్తులు ధరించాడు. కుర్తా, పైజామాలతో పాటు టీమ్ బ్లేజర్ వేసుకుని అందరిలోనూ ప్రత్యేకంగా నిలిచాడు. ఈ నేపథ్యంలో..‘ అన్ని జట్ల కెప్టెన్లు టై, జాకెట్ ధరించి ఎంతో హుందాగా వచ్చారు. కానీ పాకిస్తానీ మాత్రం అందరికీ భిన్నంగా దర్శనమిచ్చాడు. ఇంకా నయం లుంగీ, బనియన్, టోపీ పెట్టుకుని రాలేదు. ఒకవేళ అలా గనుక వచ్చి ఉంటే!!’ అంటూ పాకిస్తానీ రచయిత తమ టీమ్ కెప్టెన్ను అవమానించే రీతిలో కామెంట్ చేశాడు. ఈ క్రమంలో సర్ఫరాజ్కు పాకిస్తాన్తో పాటు భారత జట్టు అభిమానులు అండగా నిలిచారు. ఎక్కడికి వెళ్లినా మూలాలు మరచిపోలేదని పాక్ అభిమానులు అభినందించగా... మరికొంత మంది మాత్రం సర్ఫరాజ్కు ఎక్కడ ఎలా ఉండాలో తెలియదు అంటూ ట్రోల్ చేశారు. దీంతో.. రంగంలోకి దిగిన టీమిండియా ఫ్యాన్స్.. ‘సర్ఫరాజ్ను విమర్శించడంలో అర్థంలేదు. నిజానికి కోహ్లి కూడా సంప్రదాయ దుస్తులు ధరించాల్సింది. అయినా ఆటగాడి ప్రతిభను చూడాలి అతడి వస్త్రధారణను కాదు. ఒకవేళ రాణీగారు భారత్ వచ్చినపుడు చీర కట్టుకుంటారా. ప్రధాని మోదీని కలిసినపుడు విదేశీ నేతలు మనలా తయారవుతారా? బ్రిటన్ రాజును కలిసినపుడు గాంధీజీ ధోతి కట్టుకున్న విషయం మరచిపోయారా? సర్ఫరాజ్ చేసిన దాంట్లో తప్పేమీలేదు. అనవసరంగా అతడి మీద పడి ఏడవకండి’ అంటూ పాక్ కెప్టెన్కు అండగా నిలిచారు. Captains of #Cricket playing nations competing 4 the #CricketWorldCup had a photoshoot with the Queen. Guess who came dressed in his pyjamas? None other than the #Pakistan captain (back row, left). Take a look at him in the other pic. How does one country produce ...? #CricketWC pic.twitter.com/hXxbxrfzlj — Tarek Fatah (@TarekFatah) May 30, 2019 కాగా ప్రపంచ కప్ తొలి పోరులో ఆతిథ్య ఇంగ్లండ్ 104 పరుగులతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ముందుగా బ్యాటింగ్లో చెలరేగి భారీ స్కోరు సాధించిన ఇంగ్లండ్... ఆ తర్వాత పదునైన బౌలింగ్, మెరుపు ఫీల్డింగ్లతో దక్షిణాఫ్రికాను మట్టికరిపించింది. ఈసారి ఫేవరెట్ కాదు కాబట్టి మాపై ఒత్తిడి లేదంటూ బరిలోకి దిగిన సఫారీలు అన్ని రంగాల్లో విఫలమైన భారీ ఓటమిని తమ ఖాతాలో వేసుకుంది. ఇక ఆల్రౌండ్ ప్రదర్శన కనబర్చిన బెన్ స్టోక్స్, భీకరమైన బంతులతో ప్రత్యర్థి పని పట్టిన పేసర్ జోఫ్రా ఆర్చర్ తొలి మ్యాచ్లో ఇంగ్లండ్ హీరోలుగా నిలిచారు. -
భారత్-పాక్ మ్యాచ్ జరగాల్సిందే : పాక్ కెప్టెన్
ఇస్లామాబాద్ : పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో భారత్-పాక్ ప్రపంచకప్ మ్యాచ్పై నీలినీడలు కమ్ముకున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ షెడ్యూల్ ప్రకారం జరగాల్సిందేనని పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ అభిప్రాయపడ్డాడు. క్రీడలను ఎప్పుడూ రాజకీయాలతో ముడిపెట్టవద్దని, ఈ మ్యాచ్ కోసం ఇరు దేశాలకు చెందిన కోట్ల మంది అభిమానులు ఎదురు చూస్తున్నారని చెప్పుకొచ్చాడు. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో భారత్-పాక్ మ్యాచ్ను రద్దు చేయమనడం తీవ్ర నిరాశను కల్గించిందని వ్యాఖ్యానించాడు. తానేప్పుడు పాకిస్తాన్ రాజకీయాలతో మిళితమై క్రీడలను చూడలేదని, క్రీడలను ఎప్పుడూ క్రీడల్లానే చూడాలని పేర్కొన్నాడు. ఇక పుల్వామా ఉగ్రదాడిలో 44 మంది జవాన్లు వీరమరణం పొందగా.. ఇంతటీ దారుణానికి ఒడిగట్టిన పాకిస్తాన్తో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవద్దని యావత్ భారత్ డిమాండ్ చేస్తోంది. ఇందులో భాగంగానే పాక్తో మ్యాచ్ ఆడాల్సిన అవసరం లేదని అభిమానులు, మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు. ఇక క్రికెట్ దిగ్గజాలు సచిన్, గవాస్కర్లు మాత్రం పాక్తో మ్యాచ్ను రద్దు చేసుకుంటే అది వారికి మేలు చేస్తుందని, పాక్తో మ్యాచ్ ఆడి గెలవాలని సూచిస్తున్నారు. బీసీసీఐ మాత్రం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ప్రకారం నడుచుకుంటామని స్పష్టం చేసింది. -
సర్ఫరాజ్కే నాయకత్వ పగ్గాలు
కరాచీ: పాకిస్తాన్ జట్టుకు తొలి సారి చాంపియన్స్ ట్రోఫీని అందించిన సర్ఫరాజ్ అహ్మద్ నాయకత్వంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) నమ్మకముంచింది. ఈ ఏడాది జరిగే వన్డే ప్రపంచ కప్లో పాల్గొనే పాక్ జట్టుకు సర్ఫరాజ్ కెప్టెన్గా వ్యవహరిస్తాడని పీసీబీ చైర్మన్ ఇషాన్ మణి మంగళవారం ప్రకటించారు. 2017లో ఇంగ్లండ్ గడ్డపైనే పాక్ చాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. ఇటీవల దక్షిణాఫ్రికాతో మ్యాచ్ సందర్భంగా వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేసి నాలుగు మ్యాచ్ల సస్పెన్షన్కు గురైన సర్ఫరాజ్ స్వదేశం తిరిగొచ్చాడు. అతని స్థానంలో షోయబ్ మాలిక్ కెప్టెన్గా వ్యవహరించాడు. వరల్డ్ కప్కు కూడా మాలిక్కే అవకాశం దక్కుతుందని వార్తలొచ్చాయి. అయితే తాజా ప్రకటనతో దానికి ముగింపు లభించింది. సర్ఫరాజ్ కెప్టెన్సీపై తమకు ఎలాంటి సందేహాలు లేవని... ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్తో పాటు ప్రపంచ కప్కు కూడా అతని నాయకత్వంలో జట్టు బరిలోకి దిగుతుందని పీసీబీ చైర్మన్ స్పష్టం చేశారు. (అవన్నీ గాలి మాటలే: సర్ఫరాజ్) -
అవన్నీ గాలి మాటలే: సర్ఫరాజ్
సెంచూరియన్: దక్షిణాఫ్రికా ఆల్రౌండర్ ఆండిల్ పెహ్లువాకియాపై వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేయడంతో పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ సర్పరాజ్ అహ్మద్పై నాలుగు మ్యాచ్ల నిషేధం పడిన సంగతి తెలిసిందే. సఫారీలతో రెండో వన్డే సందర్భంగా పెహ్లువాకియాపై అనుచిత వ్యాఖ్యలు చేసి సర్ఫరాజ్ నిషేధానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే పాక్ వెటరన్ క్రికెటర్ షోయమ్ మాలిక్కు ఆ జట్టు పగ్గాలను అప్పుచెబుతూ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే మాలిక్తో సర్ఫరాజ్కు సఖ్యత లేదనే వార్తలు హల్ చేశాయి. వీరి మధ్య ఎప్పట్నుంచో విభేదాలు నెలకొన్నాయనే ఊహాగానాలు వినిపించాయి. ప్రధానంగా సర్ఫరాజ్ సారథ్యంలో మాలిక్ ఆడటానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదనేది ఆ వార్తల సారాంశం. కాగా, దీన్ని తాజాగా సర్ఫరాజ్ ఖండించాడు. తమ మధ్య ఎటువంటి విభేదాలు లేవంటూ చెప్పుకొచ్చాడు. అవన్నీ గాలి మాటలుగా పేర్కొన్న సర్పరాజ్.. తమ జట్టంతా కలిసి కట్టుగానే ఉందంటూ స్పష్టం చేశాడు. ‘ ప్రస్తుతం మా జట్టులో ఎటువంటి విభేదాలు లేవు. అందులో ఎటువంటి వాస్తవం లేదు. నా నాయకత్వంలో మాలిక్ ఆడటానికి అయిష్టంగా ఉన్నాడనే వార్తలు సత్యదూరం. మేమంతా ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం’ అని సర్పరాజ్ తెలిపాడు. ఇక తమ జట్టు వరుస వైఫల్యాలపై స్పందించిన సర్పరాజ్.. త్వరలోనే గాడిలో పడతామనే ఆశాభావం వ్యక్తం చేశాడు. -
వారేమీ స్కూల్ పిల్లలు కాదు: పీసీబీ ఫైర్
ఇస్లామాబాద్: దక్షిణాఫ్రికా క్రికెటర్ ఆండిల్ పెహ్లువాకియాపై జాతి వివక్ష వ్యాఖ్యలు చేసిన పాకిస్తాన్ క్రికెటర్ సర్పరాజ్ అహ్మద్పై నాలుగు వన్డేల నిషేధం వేయడాన్ని ఆ దేశ క్రికెట్ బోర్డు(పీసీబీ) తీవ్రంగా తప్పుబట్టింది. ఈ ఘటన తర్వాత సర్ఫరాజ్ బహిరంగంగా క్షమాపణలు చెప్పినప్పటికీ అతనిపై నాలుగు వన్డేల నిషేధం వేస్తూ అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) నిర్ణయం తీసుకోవడాన్ని ఆక్షేపించింది. ఇది అనాలోచిత చర్యగా పీసీబీ చీఫ్ ఇషాన్ మణి ఆరోపించారు. ఇషాన్ మణి మాట్లాడుతూ.. ‘ ఆ వివాదాస్పద వ్యాఖ్యలపై సర్ఫరాజ్ బహిరంగ క్షమాపణలు కోరాడు. ఇందుకు అంతా అంగీకరించారు. దక్షిణాఫ్రికా బోర్డుతో పాక్కి సత్సంబంధాలు ఉన్నాయి. దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టుకు దీనిని సీరియస్గా తీసుకోలేదు. ఐసీసీ మధ్యలోకి వచ్చి సర్ఫరాజ్ అహ్మద్పై చర్యలు తీసుకుంది. ఇక్కడ పెహ్లువాకియా వివరణ కూడా ఐసీసీ తీసుకోలేదు. ఈ క్రమంలో జాతి వివక్షల కింద సర్ఫరాజ్పై సస్పెన్షన్ వేయాల్సిన అవసరం ఏంటి?. వారేమీ స్కూల్ పిల్లలు కాదు’ అని ఇషాన్ మణి మండిపడ్డారు. -
తప్పుదొరికిందని అక్తర్ రెచ్చిపోయాడు : పాక్ కెప్టెన్
కరాచీ : దక్షిణాఫ్రికా క్రికెటర్పై వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేసిన పాకిస్తాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ నాలుగు వన్డేల నిషేధానికి గురైన విషయం తెలిసిందే. తన వ్యాఖ్యల పట్ల దక్షిణాఫ్రికా ఆల్రౌండర్ పెహ్లువాకియాకు సర్ఫరాజ్ క్షమాపణలు చెప్పినప్పటికి నిబంధనల మేరకు ఐసీసీ చర్యలు తీసుకుంది. అయితే ఈ తరహా వ్యాఖ్యలతో సర్ఫరాజ్పై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ సైతం ఈ వ్యవహారంపై ఘాటుగా స్పందించాడు. ‘ఓ పాకిస్తానీయుడిగా ఈ తరహా వ్యాఖ్యలను సమర్ధించను. తన వ్యాఖ్యల పట్ల సర్ఫరాజ్ బహిరంగంగా క్షమాపణలు చెప్పాల్సిందే’ అని ఘాటుగా ట్వీట్ చేశాడు. అయితే పాక్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఒత్తిడో లేక ఎమో కానీ వెంటనే మళ్లీ తన వ్యాఖ్యల పట్ల యూటర్న్ తీసుకున్నాడు. సర్ఫరాజ్ వంటి ఆటగాడు పాక్కు ఎంతో అవసరమని, అతను సాధారణ శిక్షతో భయపడతాడని ఆశిస్తున్నానని ట్వీట్ చేశాడు. ఐసీసీ చర్యల అనంతరం ఈ నాలుగు మ్యాచ్ల సస్పెన్షన్ సమయం త్వరగా ముగుస్తుందని పేర్కొన్నాడు. అయితే అక్తర్ మాటలు విమర్శల్లా లేవని, వ్యక్తిగతంగా దాడి చేసినట్లు ఉందని సర్ఫరాజ్ అభిప్రాయపడ్డాడు. సస్పెన్షన్తో దక్షిణాఫ్రికా పర్యటన నుంచి అర్ధాంతరంగా పాకిస్తాన్కు వచ్చిన సర్ఫరాజ్ మీడియాతో మాట్లాడాడు. అక్తర్ వ్యక్తిగతంగా దాడి చేశాడు. అతని మాటలు విమర్శల్లా లేవు. ఇప్పటికే నేను నా తప్పును అంగీకరించాను. ఇలాంటి పరిస్థితుల్లో నాకు అండగా నిలిచిన పాక్ క్రికెట్ బోర్డ్(పీసీబీ)కు ధన్యవాదాలు. భవిష్యత్తులో ఆటపరంగా.. వ్యక్తిత్వంగా మరింత మెరగవుతాను. ఈ సమయంలో నాకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.’ అని సర్ఫరాజ్ చెప్పుకొచ్చాడు. దక్షిణాఫ్రికాతో రెండో వన్డే సందర్భంగా క్రీజ్లో పాతుకుపోయిన ఆల్రౌండర్ ఫెలుక్వాయోను ఉద్దేశించి సర్ఫరాజ్.. ‘ఒరే నల్లోడా... మీ అమ్మ ఇవాళ ఎక్కడ కూర్చుంది. ఈ రోజు నీ కోసం ఆమెను ఏం ప్రార్ధించమన్నావు’ అని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఇవి స్టంప్స్ మైక్లో రికార్డవ్వడంతో రచ్చ రచ్చైంది. -
పాక్ కెప్టెన్పై వేటు
దుబాయ్: దక్షిణాఫ్రికా ఆల్రౌండర్ ఆండిల్ పెహ్లువాకియాపై వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేసిన పాకిస్తాన్ క్రికెట్ జట్టు సారథి సర్ఫరాజ్ అహ్మద్పై వేటు పడింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) నిబంధనావళిని అతిక్రమించిన సర్ఫరాజ్పై నాలుగు మ్యాచ్ల నిషేధాన్ని విధించింది. దీంతో దక్షిణాఫ్రికాతో జరగబోయే చివరి రెండు వన్డేలు, రెండు టీ20లకు దూరమవనున్నాడు. దీంతో పాక్ సీనియర్ ఆటగాడు షోయాబ్ మాలిక్ తాత్కాలిక సారథిగా వ్యహరించనున్నాడు. ఆటగాళ్లను వ్యక్తిగతంగా గానీ, కుటుంబం సభ్యులపై గానీ, వర్ణ, జాతి వివక్షలు, అంపైర్లపై అసహనాన్ని ప్రదర్శిచడం ఐసీసీ ప్రవర్తనా నియమావళిని అతిక్రమించడమేనని పేర్కొంది. (‘మేం క్షమించాం.. ఇక ఐసీసీ ఇష్టం’) అసలేం జరిగిందంటే..? డర్బన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డే మ్యాచ్లో క్రీడా సూర్తిని మరిచి పాక్ సారథి సర్ఫరాజ్ అహ్మద్ వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేశాడు. దక్షిణాఫ్రికా ఆల్రౌండర్ ఆండిల్ పెహ్లువాకియా నలుపు రంగును ఉద్దేశించి వివాదస్పద వ్యాఖ్యలు చేయడం పట్ల మాజీ క్రికెటర్లు, అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘ ఏ నల్లోడా.. మీ అమ్మ ఎక్కడ కూర్చుంది. నీకు ఏం కావాలని ఆమెను ప్రార్థించమన్నావ్?’ అంటూ ఒళ్లు మరిచి మాట్లాడటం స్టంప్స్ మైక్లో రికార్డయ్యాయి. (పాక్ క్రికెటర్ జాతి వివక్ష వ్యాఖ్యలు!) దీనిపై దక్షిణాఫ్రికా జట్టు అధికారికంగా ఫిర్యాదు చేయకపోయినా... ఐసీసీ స్వతంత్ర విచారణ చేపట్టింది. సరదాగా స్లెడ్జింగ్ కాకుండా ఇవి వర్ణ వివక్ష వ్యాఖ్యలు కావడంతో దోషిగా తేలితే సర్ఫరాజ్కు పెద్ద శిక్షే పడవచ్చు. మరోవైపు మ్యాచ్ తర్వాతి రోజు సర్ఫరాజ్ దీనిపై క్షమాపణలు కోరాడు. ‘మ్యాచ్లో అసహనాన్ని ప్రదర్శిస్తూ నేను చేసిన వ్యాఖ్యలతో ఎవరైనా బాధపడితే మన్నించండి. ఎవరినీ కావాలని ఆ మాటలు అనలేదు. మరెవరినీ బాధపెట్టే ఉద్దేశం నాకు లేదు. ప్రపంచవ్యాప్తంగా సహచర క్రికెటర్లను నేను ఎప్పుడైనా గౌరవిస్తాను’ అని సర్ఫరాజ్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. -
‘మేం క్షమించాం.. ఇక ఐసీసీ ఇష్టం’
డర్భన్ : మైదానంలో జాతి వివక్ష వ్యాఖ్యలతో పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. గత మంగళవారం దక్షిణాఫ్రికాతో రెండో వన్డే సందర్భంగా సర్ఫరాజ్ ఒళ్లు మరిచి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ప్రత్యర్థి బ్యాట్స్మన్ ఫెలుక్వాయో నలుపు రంగును ఉద్దేశించి అతను చేసిన వ్యాఖ్యల పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో అతనిపై ఐసీసీ కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమైంది. అయితే దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ మాత్రం సర్ఫరాజ్ను క్షమిస్తున్నామని ప్రకటించాడు. ‘అతను తన వ్యాఖ్యలపట్ల విచారం వ్యక్తం చేస్తూ క్షమాపణలు కోరాడు. దీంతో అతన్ని మేం మన్నిస్తున్నాం. ఇక ఈ వివాదాన్ని ఎలా పరిష్కరిస్తుందో ఐసీసీ ఇష్టం.’ అని క్రిక్ఇన్ఫోతో అన్నాడు. క్రీజ్లో పాతుకుపోయి సఫారీ జట్టును ఫెలుక్వాయో విజయం దిశగా తీసుకెళుతుండగా అసహనంతో పాక్ కెప్టెన్ వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేశాడు. ‘ఒరే నల్లోడా... మీ అమ్మ ఇవాళ ఎక్కడ కూర్చుంది. ఈ రోజు నీ కోసం ఆమెతో ఏం మంత్రం చదివించుకొని వచ్చావు’ అని ఉర్దూలో అన్న మాటలు స్టంప్ మైక్లో స్పష్టంగా రికార్డయ్యాయి. అనంతరం సర్ఫరాజ్ తన వ్యాఖ్యలపట్ల విచారం వ్యక్తం చేస్తూ క్షమాపణలు కోరాడు. ‘మ్యాచ్లో అసహనాన్ని ప్రదర్శిస్తూ నేను చేసిన వ్యాఖ్యలతో ఎవరైనా బాధపడితే మన్నించండి. ఎవరినీ కావాలని ఆ మాటలు అనలేదు. మరెవరినీ బాధపెట్టే ఉద్దేశం నాకు లేదు. ప్రపంచవ్యాప్తంగా సహచర క్రికెటర్లను నేను ఎప్పుడైనా గౌరవిస్తాను’ అని సర్ఫరాజ్ ట్వీట్ చేశాడు. -
సర్ఫరాజ్ వర్ణ వివక్ష వ్యాఖ్యలు
డర్బన్: పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ మైదానంలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. దక్షిణాఫ్రికాతో మంగళవారం జరిగిన రెండో వన్డే సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రత్యర్థి బ్యాట్స్మన్ ఫెలుక్వాయో నలుపు రంగును ఉద్దేశించి అతను ఈ మాటలు అన్నాడు. క్రీజ్లో పాతుకుపోయి సఫారీ జట్టును ఫెలుక్వాయో విజయం దిశగా తీసుకెళుతుండగా అసహనంతో పాక్ కెప్టెన్ ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు. ‘ఒరే నల్లోడా... మీ అమ్మ ఇవాళ ఎక్కడుంది. ఈ రోజు నీ కోసం ఆమెతో ఏం మంత్రం చదివించుకొని వచ్చావు’ అని ఉర్దూలో అన్న మాటలు స్టంప్ మైక్లో రికార్డయ్యాయి. దీనిపై దక్షిణాఫ్రికా జట్టు అధికారికంగా ఫిర్యాదు చేయకపోయినా... ఐసీసీ స్వతంత్ర విచారణ చేపట్టింది. సరదాగా స్లెడ్జింగ్ కాకుండా ఇవి వర్ణ వివక్ష వ్యాఖ్యలు కావడంతో దోషిగా తేలితే సర్ఫరాజ్కు పెద్ద శిక్షే పడవచ్చు. మరోవైపు మ్యాచ్ తర్వాతి రోజు బుధవారం సర్ఫరాజ్ దీనిపై క్షమాపణలు కోరాడు. ‘మ్యాచ్లో అసహనాన్ని ప్రదర్శిస్తూ నేను చేసిన వ్యాఖ్యలతో ఎవరైనా బాధపడితే మన్నించండి. ఎవరినీ కావాలని ఆ మాటలు అనలేదు. మరెవరినీ బాధపెట్టే ఉద్దేశం నాకు లేదు. ప్రపంచవ్యాప్తంగా సహచర క్రికెటర్లను నేను ఎప్పుడైనా గౌరవిస్తాను’ అని సర్ఫరాజ్ ట్వీట్ చేశాడు. -
ఒళ్లు మరిచి కామెంట్ చేసిన పాక్ కెప్టెన్
-
పాక్ క్రికెటర్ జాతి వివక్ష వ్యాఖ్యలు!
డర్బన్ : పాకిస్తాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ మైదానంలో క్రీడాస్పూర్తి మరిచి జాతి వివక్ష వ్యాఖ్యలు చేశాడు. అంతర్జాతీయ క్రికెటర్నని, ఓ జట్టు కెప్టెన్ అనే సోయి లేకుండా దక్షిణాఫ్రికా ఆల్రౌండర్ ఆండిల్ పెహ్లువాకియా పట్ల అత్యంత దురుసుగా ప్రవర్తించి వివాదంలో చిక్కుకున్నాడు. ఐదు వన్డేల సిరీస్లో భాగంగా మంగళవారం జరిగిన రెండో వన్డేలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ పెహ్లువాకియా దాటికి 203 పరుగులకే కుప్పకూలింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన సఫారి జట్టు మళ్లీ పెహ్లువాకియా(69 నాటౌట్)నే ఆదుకొని విజయాన్నందించాడు. అయితే సఫారీ ఇన్నింగ్స్ 37 ఓవర్లో పెహ్లువాకియా బ్యాటింగ్తో తీవ్ర అసహనానికి గురైన సర్ఫరాజ్ అహ్మద్ నోటికి పనిచెబుతూ స్లెడ్జింగ్కు పాల్పడ్డాడు. పెహ్లువికియా బ్యాటింగ్ చేస్తుండగా వికెట్ల వెనుక ఉర్దూలో అత్యంత జుగుప్సాకరంగా కామెంట్ చేశాడు. ‘ ఏ నల్లోడా.. మీ అమ్మ ఎక్కడ కూర్చుంది. నీకు ఏం కావాలని ఆమెను ప్రార్థించమన్నావ్?’ అంటూ ఒళ్లు మరిచి మాట్లాడాడు. ఈ మాటలు స్టంప్స్ మైక్లో స్పష్టంగా రికార్డవ్వడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. ఈ తరహా వ్యాఖ్యల పట్ల క్రీడా అభిమానులు మండిపడుతున్నారు. సర్ఫరాజ్పై ఐసీసీ కూడా కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇక ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా 5 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. Sarfaraz Ahmed to Andile Phehlukwayo: "abbay kaale teri Ami kahan bethi hoyi hain aaj, kya parhwa kay aya hai aaj" "black man wheres your mother sat? What have you asked your mother to pray for you today?"#SAvPAK pic.twitter.com/vw6yuE73OE — Saj Sadiq (@Saj_PakPassion) January 22, 2019 -
బౌలర్పై అరిచిన పాక్ కెప్టెన్
అబుదాబి: న్యూజిలాండ్తో ఇక్కడ జరుగుతున్న తొలి టెస్టులో పాకిస్తాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ సహనం కోల్పోయాడు. సహచర బౌలర్పైనే అరిచి తన ఆవేశాన్ని ప్రదర్శించాడు. ఫీల్డింగ్ సెట్ చేసినట్లు బౌలింగ్ వేయని స్పిన్నర్ బిలాల్ అసిఫ్కు క్లాస్ తీసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్లో భాగంగా టెయిలెండర్ ట్రెంట్ బౌల్ట్ క్రీజ్లో ఉన్నప్పుడు బిలాల్ బౌలింగ్ వేస్తున్నాడు. అయితే బిలాల్ కోరినట్లు ఫీల్డింగ్ సెట్ చేశాడు సర్ఫరాజ్. కాగా, బిలాల్ బ్యాట్స్మన్కు దొరికేటట్లు ఒక లెంగ్త్ బాల్ సంధించాడు. ఆ బంతికి ముందుకొచ్చీ మరీ ఫోర్ బాదాడు బౌల్ట్. దాంతో చిర్రెత్తిన సర్పరాజ్.. ‘నువ్వు ఏమి చెప్పావ్.. ఎలా బౌలింగ్ వేశావ్’ అంటూ బిలాల్ చీవాట్లు పెట్టాడు. దాంతో చిన్నబోవడం బిలాల్ వంతైంది. అది కివీస్ తొలి ఇన్నింగ్స్ 66 ఓవర్లో చోటు చేసుకోగా, ఆ మరుసటి ఓవర్లో అజాజ్ పటేల్ చివరి వికెట్గా వికెట్గా ఔటయ్యాడు.ఫలితంగా న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్లో 153 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ తన తొలి ఇన్నింగ్స్లో 227 పరుగులకు ఆలౌట్ కాగా, న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్లో 249 పరుగులు చేసింది. దాంతో పాకిస్తాన్కు 176 పరుగుల సాధారణ లక్ష్యాన్ని నిర్దేశించింది. Watch “sarfarazsofunnuy_edit_0_edit_0” on #Vimeo https://t.co/RQBDi6qN6p — Sports Freak (@SPOVDO) 19 November 2018 -
హేయ్ సర్ఫరాజ్.. ఏందా బ్యాటింగ్!!
అబుదాబి: 57 పరుగులకే సగం వికెట్లు పోయి ఆ జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన సారథి ఎంతో ఆచితూచి ఆడాల్సివుంటుంది. వికెట్లకు అడ్డుగోడలా నిల్చొని జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ను అందించాలి. కానీ పాకిస్తాన్ సారథి, వికెట్ కీపర్ సర్ఫరాజ్ అహ్మద్ జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ను అందించాడు. కానీ వికెట్ల ముందు ‘అడ్డుగోడ’లా నిలబడలేదు. యూఏఈ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్లో సర్ఫరాజ్ బ్యాటింగ్ తెగువను చూసి అందరూ ముక్కున వేళేసుకుంటున్నారు. ప్రస్తుతం పాక్ కెప్టెన్ బ్యాటింగ్ స్టాన్స్కు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక అభిమానులతో సహా మాజీ దిగ్గజ క్రికెటర్లు కూడా సర్ఫరాజ్ తీసుకున్న బ్యాటింగ్ స్టాన్స్పై కామెంట్స్ చేశారు. కొందరు అభిమానులు సర్ఫరాజ్ ఏంటా బ్యాటింగ్ అంటూ ఫన్నీగా స్పందించగా, మరికొందరు నీ ఆలోచనకు, బ్యాటింగ్ తెగింపుకు జోహార్ అంటూ ట్వీట్ చేశారు. రెండో టెస్టులో ఒక దశలో పాకిస్తాన్ స్కోరు 57/1. మరికొద్ది సేపటికే ఆసీస్ స్పిన్నర్ నాథన్ లయన్ (4/78) దెబ్బకు 57/5. ఈ దశలో బ్యాటింగ్కు వచ్చిన పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ ఆసీస్ స్పిన్నర్ లయన్ ఎదుర్కోవడానికి పక్కా ప్రణాళికతో వచ్చాడు. ఆసీస్ బౌలర్లను తికమక పెట్టడానికి స్టాన్స్ మార్చుకొని బ్యాటింగ్ చేశాడు. మూడు స్టంప్స్ను వదిలేసి ఎక్కడో దూరంగా నిలబడి బ్యాటింగ్ చేసిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఆరంగేట్రం ఆటగాడు ఫఖర్ జమాన్(94; 8 ఫోర్లు, సిక్స్)తో కలిసి సర్ఫరాజ్ (94; 7 ఫోర్లు)ల పోరాటంతో కోలుకుంది. దీంతో పాక్ తొలి ఇన్నింగ్స్లో 282 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ చేసింది. ఆరు పరుగల దూరంలో సెంచరీ చేజార్చుకున్నా హీరోగా మిగిలాడు. ఇక ఈ టెస్టులో పాక్ అదరగొడుతోంది. పాక్ బౌలర్ మహ్మద్ అబ్బాస్(5/33) ధాటికి ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 145 పరుగులకే ఆలౌటైంది. -
మా కెప్టెన్కు బుర్ర కూడా లేదు..!
దుబాయ్: ఆసియా కప్ మొదలవడానికి కొద్ది రోజుల ముందే భారత-పాకిస్తాన్ జట్ల గురించి చర్చ మొదలైంది. ఈ ఆసియాకప్లో ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరాటం తప్పదని అంతా భావించారు. కానీ ఈ పోరాటంలో భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ను రెండుసార్లు చిత్తుగా ఓడించింది. ఇలా టీమిండియా చేతిలో పాక్ ఓడిపోవడం ఆ దేశ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. జట్టు పేలవ ప్రదర్శనపై మండిపడుతున్నారు.ముఖ్యంగా కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన తప్పుడు నిర్ణయాలతో జట్టు ఓటమికి కారణమయ్యాడని దుమ్మెత్తిపోస్తున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవాలనే కెప్టెన్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ‘ఆసియా కప్లో ఎలాంటి ఫలితం వచ్చినప్పటికీ.. సర్ఫరాజ్ ఇంటికి వెళ్లే సమయం ఆసన్నమైంది. అతనికి ఎలాంటి ప్రతిభ లేదు. ఫామ్ కూడా లేదు. అసలు అతనికి బుర్రే లేదు. అతను క్రికెట్కు సరిపోడు' అని ఒక అభిమాని విమర్శించగా, ‘సర్ఫరాజ్ ఓవర్రేటెడ్ ప్లేయర్. పాక్ జట్టుకు గతంలో ఎంపిక కూడా కాలేదు’ అని మరొకరు విమర్శించారు. ‘అత్యంత సోమరి కెప్టెన్లలో సర్ఫరాజ్ ఒకరు. అతని కెప్టెన్సీని ఇక మేం అంగీకరించం’ మరొక అభిమాని మండిపడగా, ‘భారత్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇది అత్యంత అవమానకర ఓటమి. ఫైనల్స్లో సర్ఫరాజ్ను చూడాలనుకోవడం లేదు’ అని మరో పాక్ అభిమాని అసహనం వ్యక్తం చేశారు. -
ఆసియాకప్: భారత్ లక్ష్యం 238
దుబాయ్: ఆసియాకప్లో భాగంగా భారత్తో జరుగుతున్న మ్యాచ్లో పాకిస్తాన్ 238 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. పాక్ బ్యాట్స్మెన్ షోయబ్ మాలిక్ (78), సర్ఫరాజ్ అహ్మద్ (44), ఫకార్ జమాన్ (31), అసీఫ్ అలి(30)లు రాణించడంతో ఆ జట్టు గౌరవ ప్రదమైన స్కోర్ చేయగలిగింది. అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన పాక్ను భారత స్పిన్నర్లు చహల్, కుల్దీప్లు ఆదిలోనే దెబ్బకొట్టారు. 55 పరుగులకే ఇమామ్ ఉల్ హక్(10), ఫకార్ జమాన్(31)లను పెవిలియన్కు చేర్చారు. ఆ వెంటనే బాబర్ ఆజమ్(9) సమన్వయలోపంతో రనౌట్గా పెవిలియన్ చేరాడు. దీంతో 58 పరుగులకే పాక్ మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టల్లో పడింది. ఆదుకున్న మాలిక్- సర్ఫరాజ్.. ఈ తరుణంలో క్రీజులోకి వచ్చిన మాలిక్, సర్ఫరాజ్లు ఆచితూచి ఆడుతూ పాక్ ఇన్నింగ్స్ చక్కదిద్దారు. ఈ క్రమంలో 64 బంతుల్లో 3 ఫోర్లు 1 సిక్స్ సాయంతో మాలిక్ హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ ఇద్దరు భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జంటను కుల్దీప్ చక్కటి బంతితో సర్ఫరాజ్ (44)ను ఔట్ చేసి విడగొట్టాడు. దీంతో మూడో వికెట్కు నమోదైన 107 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. మరికొద్ది సేపటికే పాక్ షోయబ్ మాలిక్, అసిఫ్ అలీల వికెట్లు కోల్పోయింది. అసిఫ్ అలీ(30)ని క్లీన్ బౌల్డ్ చేసిన చహల్కు ఇది వన్డేల్లో 50వ వికెట్ కావడం విశేషం. చివరి ఓవర్లో బుమ్రా షాదాబ్(10)ను ఔట్ చేయడంతో పాక్ నిర్ణీత 50 ఓవర్లకు 7 వికెట్లు నష్టపోయి 237 పరుగులు చేసింది. భారత్ బౌలర్లలో చహల్, కుల్దీప్, బుమ్రా రెండేసి వికెట్లు పడగొట్టారు. -
టీమిండియాపై గెలవాలంటే..
దుబాయ్: ఆసియాకప్లో టీమిండియాపై గెలవాలంటే తమ జట్టు అన్ని అంశాల్లోనూ మెరుగవ్వాల్సి ఉందని పాకిస్తాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ స్పష్టం చేశాడు. ఆసియాకప్ టోర్నీలో హాంకాంగ్పై 8 వికెట్ల తేడాతో భారీ విజయం తర్వాత తమ ఆటలో కొన్ని లోపాలు గమనించానని పేర్కొన్నాడు. వాటిని భారత్తో మెరుగు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నాడు. ‘హాంకాంగ్ మ్యాచ్లో మేమింకా మెరుగవ్వాల్సిన అంశాలను పరిశీలించా. టోర్నీలో అందరికన్నా ముందంజలో నిలవాలంటే మేం తొమ్మిది లేదా పది వికెట్ల తేడాతో గెలవాల్సి ఉంది. మేం కొత్త బంతితో ఇంకా బాగా బౌలింగ్ చేయాల్సి ఉంది. కావాల్సినంత స్వింగ్ను మేం రాబట్టుకోలేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. తర్వాత సాధన శిబిరంలో మేం దీనిపై పనిచేస్తాం. హాంకాంగ్పై మంచి విజయమే సాధించాం. కానీ భారత్పై గెలవాలంటే మాత్రం మేం మూడు విభాగాల్లోనూ అత్యుత్తమంగా ఉండాలి. కోహ్లి లేకపోయినా భారత్ జట్టు అత్యుత్తమంగానే ఉంది. కోహ్లి లేడనే విషయాన్ని పక్కకు పెట్టే బరిలోకి దిగుతాం. భారత్ను ఓడించాలంటే సమష్టి ప్రదర్శన తప్పదు’ అని సర్ఫరాజ్ అహ్మద్ అన్నాడు. భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య బుధవారం మ్యాచ్ జరుగనుంది. -
సర్ఫరాజ్ అహ్మద్ ధోనిని అనుకరించాడు.. కానీ
-
ధోనిని అనుకరించాడు.. కానీ
బులవాయో: జింబాబ్వేతో జరిగిన ఐదు వన్డేల సిరీస్ను పాకిస్తాన్ క్లీన్స్వీప్ చేసింది. ఆదివారం జరిగిన చివరి వన్డేలో పాక్ 131 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఈ సిరీస్ను పాక్ 5-0 తేడాతో గెలుచుకుంది. అయితే చివరి వన్డేలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. చివరి ఓవర్లలో పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్.. టీమిండియా మాజీ కెప్టెన్ ధోనిని అనుకరించేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. వివరాల్లోకి వెళితే.. జింబాబ్వే బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కీపింగ్ చేస్తున్న సర్ఫరాజ్ 48వ ఓవర్లో బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే గ్లోవ్స్ వదిలేసి బంతిని అందుకున్నాడు. ఫఖర్ జమాన్ను కీపింగ్ చేయాల్సిందిగా కోరాడు. అనంతరం ఓవర్ వేశాడు. అయితే తన మొదటి ఓవర్ అద్భుతంగా వేశాడు. కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అయితే ఇన్నింగ్స్ చివరి ఓవర్ కూడా సర్ఫరాజ్ వేశాడు. అయితే ఈ ఓవర్లో జింబాబ్వే బ్యాట్స్మన్ పీటర్ మూర్ మిడ్ వికెట్ మీదుగా భారీ సిక్స్ను సాధించాడు. తన కెరీర్లో సర్ఫరాజ్ తొలిసారిగా రెండు ఓవర్లు వేసి 15 పరుగులు ఇచ్చాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 4 వికెట్ల నష్టానికి 364 పరుగులు చేయగా.. జింబాబ్వే 4 వికెట్ల నష్టానికి 233 పరుగులు మాత్రమే చేసింది. అయితే ఈ మ్యాచ్లో పాక్ కెప్టెన్.. టీమిండియా మాజీ కెప్టెన్ ధోనిని ప్రయత్నించి విఫలమయ్యాడని పలువురు అభిమానులు పేర్కొంటున్నారు. 2009లో జోహానెస్బర్గ్లో వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో ధోని విజయవంతంగా బౌలింగ్ చేసి ఒక వికెట్ కూడా తీశాడు. ధోనిలా బౌలింగ్ చేశాడు కానీ.. వికెట్ తీయలేదని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. -
క్రీడా స్ఫూర్తిని మరిచిన మ్యాక్స్వెల్
హరారే: రెండు రోజుల క్రితం ఆసీస్తో జరిగిన టీ 20 ముక్కోణపు సిరీస్ ఫైనల్లో పాకిస్తాన్ విజయం సాధించి విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ ఆరు వికెట్ల తేడాతో గెలిచి ముక్కోణపు సిరీస్ను కైవసం చేసుకుంది. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత ఆసీస్ ఆటగాడు మ్యాక్స్వెల్ క్రీడా స్ఫూర్తిని మరిచాడు. పాకిస్తాన్ క్రికెటర్లతో కరాచలనం చేసే క్రమంలో మ్యాక్స్వెల్ అతిగా ప్రవర్తించాడు. అంపైర్లకు షేక్ హ్యాండ్ ఇచ్చిన మ్యాక్స్ వెల్.. అదే సమయంలో పాకిస్తాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్తో కరాచలనం చేయడానికి ఆసక్తికనబరచలేదు. సర్ఫరాజ్ షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ముందుకు వచ్చినా మ్యాక్సీ పట్టించుకోకుండా నడుచుకుంటూ వెళ్లిపోయాడు. ఈ మ్యాచ్ జరుగుతున్న క్రమంలో వీరిద్దరి మధ్య పదే పదే మాటల యుద్ధం జరగడమే మ్యాక్సీ అలా ప్రవర్తించడానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. మరొకవైపు ఆసీస్ ఓడి పోవడాన్ని కూడా మ్యాక్స్వెల్ జీర్ణించుకోలేకపోయినట్లున్నాడు. అయితే ప్రత్యర్థి ఆటగాళ్లతో మ్యాక్సీ వ్యవహరించిన తీరు విమర్శలకు దారి తీసింది. దీనిపై మ్యాక్సీ తాజాగా వివరణ ఇస్తూ.. అది కావాలని చేసింది కాదని సర్దిచెప్పుకునే యత్నం చేశాడు. కేవలం పొరపాటులో భాగంగానే అలా జరిగిందన్నాడు. ఆ తర్వాత సర్పరాజ్ను హోటల్ కలిసి అభినందించినట్లు పేర్కొన్నాడు. -
షేక్ హ్యాండ్ ఇవ్వకుండా వెళ్ళిపోయాడు..!
-
ధోనిని కలిసింది ఒక్కసారే.. కానీ
కరాచీ: తనకు భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనినే స్ఫూర్తి అంటున్నాడు పాకిస్తాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్. పాకిస్తాన్ జట్టు.. జింబాబ్వే పర్యటనకు బయల్దేరే క్రమంలో గురువారం మీడియాతో సర్ఫరాజ్ మాట్లాడుతూ.. ఎంఎస్ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని తెలిపాడు. ఎంఎస్ను కలిసింది ఒక్కసారే అయినా.. అతని నాయకత్వ లక్షణాలు, ఆటతీరు తనని ఆకట్టుకున్నాయని పాక్ కెప్టెన్ వెల్లడించాడు. గత ఏడాది పాక్ కెప్టెన్గా బాధ్యతలు స్వీకరించిన సర్ఫరాజ్ అహ్మద్ తన నాయకత్వ పటిమతో జట్టుకి అద్వితీయమైన విజయాల్ని అందించాడు. దీంతో.. మూడు ఫార్మాట్లలోనూ అతడికి కెప్టెన్సీ బాధ్యతలను పీసీబీ కట్టబెట్టింది. ‘ ఎంఎస్ ధోని తన కెరీర్లో మూడు ఫార్మాట్లలోనూ కెప్టెన్గా పనిచేశాడు. నాయకుడిగా అతనే నాకు స్ఫూర్తి. భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య 2017, జూన్ 4న జరిగిన మ్యాచ్లో భాగంగా ధోనిని తొలిసారి కలిశాను. ఒక కెప్టెన్గా, ఆటగాడిగా అతని నుంచి నేను చాలా నేర్చుకున్నా. అతనే నాకు స్ఫూర్తి’ అని సర్ఫరాజ్ అహ్మద్ పేర్కొన్నాడు. గత ఏడాది ఇంగ్లండ్ వేదికగా జరిగిన చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత జట్టుని పాకిస్తాన్ ఓడించి తొలిసారి టైటిల్ను గెలిచిన విషయం తెలిసిందే. -
కోహ్లి నీ కళ్లకు కనిపించటం లేదా?
సాక్షి, స్పోర్ట్స్ : టీమిండియా మాజీ ఆటగాడు, క్రికెట్ వ్యాఖ్యత సంజయ్ మంజ్రేకర్ పై టీమిండియా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కెప్టెన్ ఆఫ్ ది ఇయర్-2017 గానూ పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్కు ఆయన ఓటు వేయటంతో అసలు వ్యవహారం మొదలైంది. ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో 2017 సంవత్సరానికి గానూ ఉత్తమ కెప్టెన్ అవార్డులకు నామినీలను ప్రకటించింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, సౌతాఫ్రికా, పాకిస్థాన్, అఫ్ఘనిస్థాన్ కెప్టెన్లు స్టీవ్ స్మిత్, సర్ఫరాజ్ అహ్మద్, అస్గర్ స్టానిక్జై, టీమిండియా మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్, ఇంగ్లాండ్ మహిళా జట్టు కెప్టెన్ హీథర్ నైట్ పేర్లను ప్రతిపాదించింది. దీనిపై స్పందించిన మంజ్రేకర్ తాను మాత్రం సర్ఫరాజ్ అహ్మద్కే ఓటేస్తానని చెప్పాడు. మంజ్రేకర్ అభిప్రాయం ఏంటంటే... ‘‘కష్టకాలంలో సర్ఫరాజ్ కెప్టెన్సీ పాకిస్థాన్కు ఎంతో తోడ్పాటు అందించింది. ముఖ్యంగా విదేశీ గడ్డపై తడబడే పాక్ జట్టును కెప్టెన్గా విజయతీరాలకు చేర్చాడు. ఐసీసీ ఛాంపియన్స్ టోర్నీని తన దేశానికి అందించటం.. ఎక్కువ మ్యాచ్లను గెలిపించిన ట్రాక్ రికార్డు ఉంది.(మొత్తం 13 వన్డే మ్యాచ్..11 గెలుపు, 2-ఓటమి.. టీ20మ్యాచ్లు 10.. 8-గెలుపు, 2-ఓటమి). మిగతా వారికంటే సర్ఫరాజ్ కష్టం ఎక్కువ కనిపిస్తోంది. అందుకే అండర్ డాగ్ జట్టయిన పాక్ సారథికే నా ఓటు’’ అని తెలిపాడు. అంతే... కోహ్లిని కూడా కాదని, దాయాది జట్టు కెప్టెన్ కు ఓటేయటంపై మంజ్రేకర్ పై మండిపడుతున్నారు. ‘ఆటగాడిగా, విశ్లేషకుడిగా ఫేలయిన నువ్వు ఇప్పుడు దేశభక్తుడిగా కూడా విఫలమయ్యావ్’ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు కోహ్లి, సర్ఫరాజ్ ఓవరాల్ ప్రదర్శనలను పోలుస్తూ కోహ్లి గ్రేట్.. మంజ్రేకర్ వేస్ట్ అంటూ సందేశాలు పెడుతున్నారు. మరోవైపు మంజ్రేకర్ అభిప్రాయంపై పాక్లోనూ వ్యతిరకత వ్యక్తమవుతోంది. పాక్ను అండర్ డాగ్ గా పొల్చటంపై కొందరు అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మూడు ఐసీసీ టోర్నమెంట్లను జేజిక్కిచ్చుకున్న పాక్ను మంజ్రేకర్ తక్కువ చేసి మాట్లాడాల్సింది కాదని అంటున్నారు. ఏది ఏమైనా మంజ్రేకర్ తన అభిప్రాయాన్ని సూటిగా చెప్పటంలో తప్పేం లేదన్న కామెంట్లే ఎక్కువగా వినిపిస్తున్నాయి. -
ఓటర్ల సవరణకు పరిశీలకులు
సాక్షిప్రతినిధి, కరీంనగర్ : ఎన్నికల సంఘం ఓటర్ల సవరణకు ఆదేశాలు జారీ చేసింది. బూత్స్థాయిల వారీగా ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు, నమోదు అవకాశం కల్పించింది. ఈ ఓటర్ల జాబితా తదితర ప్రక్రియను పరిశీలించేందుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఐఏఎస్ అధికారి ఎం.జగదీశ్వర్ను నియమించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లోని 13 నియోజకవర్గాల్లో ఓటర్ల నమోదు, సవరణ కోసం క్యాంపెయిన్లు నిర్వహించనున్నారు. బూత్స్థాయిలో ఈనెల 4, 11 తేదీల్లో బూత్స్థాయి అధికారి (బీఎల్వో) ప్రతి పోలింగ్ కేంద్రంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ఓటర్ల మార్పులు, చేర్పులకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరిస్తారు. అర్హులైన ఓటర్లందరూ ఈనెల 14 వరకు తమ దరఖాస్తులు సమర్పిస్తే పరిశీలించి, అంతిమ ఓటర్ల జాబితా 24న ప్రచురిస్తారు. అధికారులతో ప్రధాన ఎన్నికల అధికారి వీడియో కాన్ఫరెన్స్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అనూప్సింగ్ శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. అన్ని జిల్లాలకు ఎలక్ట్రోరల్ ఆబ్జర్వర్లను నియమించినట్లు పేర్కొన్న ఆయన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియకు పరిశీలకులుగా ఐఏఎస్ అధికారి, మహిళా, శిశు, వికలాంగులశాఖ కార్యదర్శి ఎం.జగదీశ్వర్ను ప్రభుత్వం నియమించినట్లు తెలిపారు. ఎలక్ట్రోరల్ ఆబ్జర్వర్లు జిల్లాలకు వచ్చినప్పుడు గుర్తింపు పొందిన పొలిటికల్ పార్టీల ప్రతినిధులు, ఓటరు నమోదు అధికారులు, సంబంధిత అధికారులతో సమావేశం ఏర్పాటు చేయాలని అన్నారు. రికార్డులు అన్ని సిద్ధంగా ఉండాలని సూచించారు. ఎలక్ట్రోరల్ ఆబ్జర్వర్లకు లైజన్ ఆఫీసర్ను నియమించుకుని అట్టి వివరాలను సమర్పించాలని తెలిపారు. వీడియో కాన్పరెన్స్లో జాయింట్ కలెక్టర్ బద్రి శ్రీనివాస్, డీఆర్వో అయేషామస్రత్ ఖానమ్, జిల్లా పరిషత్ సీఈవో పద్మావతి, కరీంనగర్, హుజూరాబాద్ ఆర్డీవోలు బి.రాజాగౌడ్, చెన్నయ్య, ఆసెంబ్లీ నియోజక వర్గ సహాయ ఓటరు నమోదు అధికారి, తహసీల్దార్లు, కలెక్టరేట్ ఎన్నికల విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఓటర్ల నమోదుకు ప్రత్యేక క్యాంపెన్ తేదీలు : కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ హుజూరాబాద్, చొప్పదండి, మానకొండూర్ నియోజకవర్గాల పరిధిలో ఓటర్ల జాబితా సవరణలో నమోదు మార్పులు చేర్పులు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు తొలగింపు ప్రక్రియకు దరఖాస్తు చేసుకునేందుకు ఫిబ్రవరి 14వరకు అవకాశముందని, ఓటర్ల నమోదుకు ప్రత్యేక క్యాంపైన్ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. అంతిమ ఓటర్ల జాబితా మార్చి 24న ప్రచురించనున్నట్లు పేర్కొన్నారు. -
'మేము క్షుద్రపూజల వల్ల ఓడిపోలేదు'
అబుదాబి:ఇటీవల యూఏఈ వేదికగా పాకిస్తాన్ తో జరిగిన టెస్టు సిరీస్ ను గెలవడానికి క్షుద్రపూజలే కారణమని శ్రీలంక కెప్టెన్ చండీమాల్ వ్యాఖ్యలపై పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ మండిపడ్డాడ్డు. తమ పేలవమైన బ్యాటింగ్ కారణంగానే లంకేయులతో జరిగిన టెస్టు సిరీస్ ను ఓడిపోయామని, అంతేతప్పా ఇక్కడ క్షుద్రపూజలకు అవకాశమే లేదంటూ విమర్శించాడు. ఒకవేళ లంకేయులు క్షుద్రపూజల కారణంగా టెస్టు సిరీస్ ను గెలిస్తే, ఆ తరువాత జరిగిన వన్డే, టీ 20 సిరీస్ ను ఎందుకు ఓడిపోయారంటూ చండీమాల్ కు ప్రశ్నలు కురిపించాడు. 'మేము క్షుద్రపూజల వల్ల టెస్టు సిరీస్ ను ఓడిపోలేదు. మా ఓటమికి మేము సరిగా ఆడకపోవడమే. ఎవరో మంత్రగాళ్ల వల్ల మాపై లంక టెస్టు సిరీస్ ను గెలిస్తే.. మరి వన్డే, టీ 20 సిరీస్ లో వారు ఎందుకు చిత్తుగా ఓడిపోయారు' అని సర్ఫరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ తరహా విధానాలకు క్రికెట్ కు ముడిపెట్టడం సరికాదని పాకిస్తాన్ మాజీ ఆటగాడు మొహ్మద్ యూసఫ్ విమర్శించాడు. ఇలా అయితే ఇక క్రికెట్ మ్యాచ్ ల్లో విజయాల్ని క్షుద్రపూజలే నిర్ణయిస్తామో అంటూ చురకలంటించాడు. క్షుద్రపూజలతో టెస్ట్ సిరీస్ గెలిచాం! -
పాక్ కెప్టెన్ ను కలిసిన మ్యాచ్ ఫిక్సర్!
కరాచీ:ఇటీవల కాలంలో పాకిస్తాన్ క్రికెట్ లో మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతాలు తరచు వెలుగుచూస్తున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ మ్యాచ్ ల దగ్గర్నుంచీ, దేశీయ లీగ్ ల వరకూ పాక్ లో ఏదొక చోటు బుకీలు క్రికెటర్లకు గాలం వేయడం పరిపాటిగా మారిపోయింది. తాజాగా పాక్ క్రికెట్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ ను ఒక బుకీ సంప్రదించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యూఏఈలో శ్రీలంకతో వన్డే సిరీస్ లో భాగంగా దుబాయ్ లోని ఒక హోటల్ ల్లో సర్పరాజ్ ను బుకీ కలిసిన విషయాన్ని పీసీబీ వర్గాలు ధృవీకరించాయి. అయితే సదరు బుకీ చేసిన ఆఫర్ ను సర్ఫరాజ్ తిరస్కరించడమే కాకుండా అక్కడ ఉన్న అవినీతి నిరోధక అధికారులు వెంటనే సమాచారం అందించినట్లు పీసీబీ సీనియర్ అధికారి తెలిపారు. 'సర్ఫరాజ్ ను బుకీ సంప్రదించాడు. ఈ విషయాన్ని వెంటనే తెలియజేయడంతో అవినీతి నిరోధక అధికారులు అప్రమత్తమయ్యారు. గేమ్ ను ఫిక్సింగ్ బారిన పడకుండా చేయాలంటే సర్ఫరాజ్ ను ఉదాహరణగా తీసుకుని పాక్ క్రికెటర్లు ముందుకు సాగాలి. ఒక ఆటగాడిగా, కెప్టెన్ గా సర్ఫరాజ్ గౌరవప్రదంగా వ్యవహరించాడు' అని పీసీబీ అధికారి పేర్కొన్నారు. కొన్ని రోజుల క్రితం ఫిక్సింగ్ ఆరోపణలు కారణంగా షర్జిల్ ఖాన్, ఖలిద్ లలిఫ్ లను పై పీసీబీ నిషేధం విధించింది. పాకిస్తాన్ సూపర్ లీగ్ లో వారు ఫిక్సింగ్ కు పాల్పడి క్రికెట్ కు దూరమయ్యారు. -
సర్ఫరాజ్ అహ్మద్కు మరో ప్రమోషన్!
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీని దేశానికి అందించిన పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ ప్రమోషన్ దక్కింది. పాక్ జట్టు టెస్టు సారథ్య బాధ్యతలు కూడా అతనికి అప్పగిస్తున్నట్టు ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఇటీవల సీనియర్ క్రికెటర్ మిస్బావుల్ హక్ రిటైరవ్వడం.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీని అనూహ్యరీతిలో పాక్ గెలుపొందిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. చాంపియన్స్ ట్రోఫీ మొదటి మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి భారత్ చేతిలో చిత్తయిన పాకిస్థాన్ అనూహ్యంగా పుంజుకొని ఫైనల్కు చేరుకుంది. ఫైనల్లో బలమైన భారత జట్టును 124 పరుగుల భారీ తేడాతో ఓడించింది. ఈ విజయాల క్రెడిట్ సర్ఫరాజ్ సారథ్యానికే దక్కింది. అతని నాయకత్వంలో పాక్ జట్టు సమష్టిగా ఆడుతూ వరుసగా విజయాల బాట పట్టింది. సర్ఫరాజ్ ఇంతవరకు టెస్టులకు నాయకత్వం వహించలేదు. అయినా, అతని నాయకత్వంలో వన్డేలు, టీ-20లలో పాక్ వరుసగా విజయాలు సాధించడంతో అతనికే టెస్టు పగ్గాలు దక్కాయి. సర్ఫరాజ్ సారథ్యంలో పాక్ జట్టు ఏడు వన్డేల్లో విజయం సాధించింది. టీ-20లలో అతని కెప్టెన్సీలో ఆడిన ఎనిమిది మ్యాచ్లలో ఏడింటిలో గెలుపొందింది. -
పాక్ కెప్టెన్ కు అరుదైన గౌరవం
దుబాయ్: చాంపియన్స్ ట్రోఫీ టైటిల్ ను సాధించిన పాకిస్తాన్ క్రికెట్ కెప్టెన్ సర్పరాజ్ అహ్మద్ కు అరుదైన గౌరవం లభించింది. చాంపియన్స్ ట్రోఫీ ఐసీసీ జట్టుకు సర్పరాజ్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. ఐసీసీ నిర్వహించే ఒక మేజర్ టోర్నీ తర్వాత ఆటగాళ్లను ఇలా గౌరవించడం ఆనవాయితీ. ఈ మేరకు సోమవారం 12 మందితో కూడిన చాంపియన్స్ ట్రోఫీ జట్టును ఐసీసీ ప్రకటించింది. చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఆడిన ఇరు జట్లలో ఏడుగురికి చోటు దక్కడం ఇక్కడ విశేషం. ఇందులో భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లితో పాటు శిఖర్ ధావన్ , భువనేశ్వర్ కుమార్ కూడా చోటు కల్పించారు. ఓపెనర్లుగా పాకిస్తాన్ ఆటగాడు ఫకార్ జమాన్-శిఖర్ ధావన్ లను ఎంపిక చేయగా, బంగ్లాదేశ్ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్ కు టాపార్డర్ లో చోటు దక్కింది. మరొకవైపు న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కు 12వ ఆటగాడికి చోటు కల్పించారు. చాంపియన్స్ ట్రోఫీ ఐసీసీ జట్టు ఇదే (బ్యాటింగ్ ఆర్డర్ ప్రకారం) శిఖర్ ధావన్(భారత్) ఫకార్ జమాన్(పాకిస్తాన్) తమీమ్ ఇక్బాల్(బంగ్లాదేశ్) విరాట్ కోహ్లి(భారత్) జో రూట్(ఇంగ్లండ్) బెన్ స్టోక్స్(ఇంగ్లండ్) సర్ఫరాజ్ అహ్మద్(పాకిస్తాన్) అదిల్ రషిద్(ఇంగ్లండ్) జునైద్ ఖాన్(పాకిస్తాన్) భువనేశ్వర్ కుమార్(భారత్) హసన్ అలీ(పాకిస్తాన్) కేన్ విలియమ్సన్(న్యూజిలాండ్) -
‘ఇప్పటికైనా మా దేశానికి వచ్చి ఆడండి’
లండన్: ‘ఈ రోజు పాకిస్థాన్ చరిత్రలో చాలా సంవత్సరాలపాటు గుర్తుండిపోతుంది’ అంటూ పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ హర్షాన్ని వ్యక్తం చేశాడు. చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి భారత్పై విజయం సాధించి ట్రోఫీ కైవసం చేసుకున్న అనంతరం అతను మీడియాతో మాట్లాడాడు. ఇకనైనా పాకిస్థాన్లో క్రికెట్ ఆడేందుకు ఇతర దేశాలు ముందుకురావాలని అతను విజ్ఞప్తి చేశాడు. 2009లో లాహోర్లో శ్రీలంక జట్టుపై ఉగ్రవాద దాడి అనంతరం ఓ పెద్ద క్రికెట్ జట్టు కూడా పాకిస్థాన్లో ఆడేందుకు ముందుకు రాని సంగతి తెలిసిందే. ‘మా ఆటగాళ్లు గొప్ప విజయాన్ని సాధించారు. ఈ క్రెడిట్ అంతా వారిదే. ఈ అద్భుత విజయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకుంటారు. చరిత్రలో ఎన్నో ఏళ్లు ఇది నిలిచిపోతుంది. గొప్ప ప్రేరణ ఇచ్చేవిధంగా మా ఆటగాళ్లు ఆడారు. ఎనిమిదో ర్యాంకు జట్టుగా అడుగుపెట్టి మేం టోర్నమెంటును కైవసం చేసుకున్నాం. ఇప్పటికైనే అన్నిదేశాలు ముందుకొచ్చి పాకిస్థాన్లో క్రికెట్ ఆడుతాయని ఆశిస్తున్నాం’ అని సర్ఫరాజ్ పేర్కొన్నాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)తో తాము గణనీయంగా లబ్ధి పొందినట్టు చెప్పాడు. కొంతకాలంగా పాక్ క్రికెట్ అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నదని చెప్పాడు. ‘కొన్నేళ్లుగా స్వదేశీ మ్యాచులు మేం దుబాయ్లో ఆడుతూ వస్తున్నాం. అందువల్ల మిగతా జట్లకు ఉన్నట్టు మాకు స్వదేశీ అనుకూలత ఎప్పుడూ లభించలేదు. ఈ విజయం వల్లనైనా మిగతా జట్లు పాక్ వచ్చి క్రికెట్ ఆడుతాయని ఆశిస్తున్నాం’ అని సర్ఫరాజ్ చెప్పాడు. -
పాక్ కెప్టెన్ కొడుకుతో ధోని.. ఫొటో వైరల్
సాధారణంగా క్రీడలంటేనే సరిహద్దులు లేనివి.. హద్దులకు మించినవి. పోటీ మైదానానికే వదిలేయాలి తప్ప వ్యక్తిగతంగా మోసుకురావొద్దు.. అభిప్రాయ బేధాలు ఉంటే వ్యవస్థకు అపాధించాలే తప్ప వ్యక్తులపై రుద్దొద్దు. సరిగ్గా అదే అంశాన్ని రూఢీ చేసేలా ఇప్పుడు ఓ ఛాయా చిత్రం ఆన్లైన్లో తెగ హల్ చల్ చేస్తోంది. భారత క్రికెట్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అత్యంత అరుదైన ఫొటోను నెట్లో పంచుకున్నారు. పాకిస్థాన్ క్రికెట్ కెప్టెన్ సర్ఫ్రాజ్ అహ్మద్ కుమారుడు అబ్దుల్లాను ఎత్తుకొని ముద్దుచేస్తున్నదే ఆ ఫొటో. ఆదివారం దాయాది పాక్, భారత్కు మధ్య ఉత్కంఠ భరిత స్థాయిలో చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ కెన్నింగ్టన్ ఓవల్లో జరగనున్న విషయం తెలిసిందే. సాధారణంగా పాక్, ఇండియా మ్యాచ్ అంటేనే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆట ముగిసినా వారంపాటు దాని ప్రభావం ఇరు దేశాల్లో ఉంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా ధోనీ పోస్ట్ చేసిన ఈ ఫొటో ఇప్పుడు భారత, పాకిస్థాన్ క్రికెట్ అభిమానులను కట్టిపడేస్తోంది. ఇరు దేశాల అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇరు దేశాల మధ్య సుహృద్భావ సంబంధాలు ఇలాగే ఉంటే బావుంటుందంటూ వారు కోరుతున్నారు. చాంపియన్స్ ట్రోఫీలో ఇప్పటికే ఓసారి పాక్ను ఓడించిన భారత్ ఫైనల్లో కూడా విజయ దుందుభి మోగిస్తామనే ధీమాతో ఉంది. -
కోహ్లిని త్వరగా అవుట్ చేస్తే...
కోహ్లి అత్యుత్తమ ఆటగాడు. అందులో సందేహం లేదు. కెప్టెన్గా, బ్యాట్స్మన్గా భారత జట్టుకు అతను కీలక ఆటగాడు. అతని కోసం మా వద్ద ప్రత్యేక ప్రణాళికలు ఉన్నాయి. ప్రస్తుతం టీమిండియా బ్యాటింగ్ లైనప్ కూడా పటిష్టంగా ఉంది. మేం అన్ని విధాలా సన్నద్ధమై వచ్చాం. కోహ్లిని త్వరగా అవుట్ చేస్తే మిగతా బ్యాట్స్మెన్పై తప్పకుండా ఒత్తిడి పెరుగుతుంది. భారత్, పాక్ మ్యాచ్ అంటేనే ఉద్వేగాలు తారాస్థాయిలో ఉంటాయని మాకు తెలుసు. గెలిపించిన వారు రాత్రికి రాత్రే హీరో అవుతారు. ఇతర విషయాలను పట్టించుకోకుండా కేవలం ఆటపైనే దృష్టి సారించాలని మా ఆటగాళ్లకు చెప్పాను. కానీ మైదానంలో రెండు జట్ల ఆటగాళ్లు స్నేహభావంతోనే ఆడతారు. ప్రస్తుతం ఒత్తిడి భారత్పైనే ఉంది. చాంపియన్స్ ట్రోఫీలో మాకే మెరుగైన రికార్డు ఉంది. దాన్ని కొనసాగిస్తాం. – సర్ఫరాజ్ అహ్మద్, పాక్ కెప్టెన్ -
ఒత్తిడి భారత్పైనే.. మైండ్గేమ్ ప్రారంభించిన పాక్!
బర్మింగ్హామ్: ఇంగ్లండ్లో జరుగుతున్న చాంపియన్స్ ట్రోఫీ ఫేవరెట్లుగా బరిలోకి దిగుతున్న భారత క్రికెట్ జట్టుపైనే తీవ్ర ఒత్తిడి నెలకొని ఉందని, తమ జట్టుపై ఎలాంటి ఒత్తిడి లేదని పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ శనివారం పేర్కొన్నాడు. ఆదివారం దాయాదులు భారత్-పాకిస్థాన్ మధ్య ఉత్కంఠభరితమైన పోరు జరగనున్న నేపథ్యంలో సర్ఫరాజ్ అహ్మద్ మెండ్గేమ్కు తెరతీశాడు. 'భారత జట్టు మాకన్నా మెరుగ్గా ఉందన్న విషయం నిజమే. కానీ ఇప్పుడు ఆట చాలా మారిపోయింది. మ్యాచ్ జరిగే రోజున ఎవరు బాగా ఆడితే వారు గెలుస్తారు. అంతేకాదు ట్రోఫీ ఫేవరెట్లుగా బరిలోకి దిగుతుండటంతో భారత్పైనే సహజంగా ఒత్తిడి ఉంది' అని చెప్పాడు. చాంపియన్స్ ట్రోఫీలో భారత్పై పాకిస్థాన్కు 2-1తో ఆధిక్యాన్ని కొనసాగిస్తోంది. కానీ వన్డే వరల్డ్ కప్లోనూ, టీ-20 వరల్డ్ కప్లోనూ పాక్పై భారత్ ఆధిపత్యం. ఇప్పటివరకు వరల్డ్ కప్లో భారత్-పాకిస్థాన్లు 11సార్లు తలపడగా.. 10-0తేడాతో టీమిండియా తిరుగులేని ఆధిక్యాన్ని కలిగి ఉంది. అంతేకాకుండా భారత్ జట్టు ఇటీవల వరుసగా పది టెస్టు విజయాలను సాధించింది. అంతేకాకుండా చాంపియన్స్ ట్రోఫీ డిఫెండింగ్ చాంపియన్ కూడా టీమిండియానే. కాబట్టి దాయాదితో పోరులో భారత్పై ఎంతకొంత ఒత్తిడి ఉంటుంది. అటు బలహీనంగా ఉన్న పాక్ జట్టుపైనా తీవ్ర ఒత్తిడి నెలకొని ఉంది. కానీ ఒత్తిడి అంతా భారత్పైనే ఉందని, కాబట్టి తాము స్వేచ్ఛగా ఆడుతామని సర్ఫరాజ్ అహ్మద్ అంటున్నాడు. భారత్తో మ్యాచ్ను పురస్కరించుకొని అతను జట్టు కోచ్ మిక్ ఆర్థర్తో కలిసి మీడియాతో మాట్లాడాడు. -
పాక్ వన్డే కెప్టెన్ అవుట్
న్యూఢిల్లీ: అనిశ్చితికి మారుపేరైన పాకిస్థాన్ క్రికెట్లో కెప్టెన్ మారాడు. ఆస్ట్రేలియాతో సిరీస్లో కెప్టెన్గా, బ్యాట్స్మన్గా విఫలంకావడంతో పాక్ వన్డే జట్టు కెప్టెన్ అజర్ అలీ కెప్టెన్సీ నుంచి వైదొలగాలని నిర్ణయించాడు. జట్టుకు సారథ్యం వహించడం వల్ల బ్యాటింగ్పై ప్రభావం చూపుతోందని, ఈ ఒత్తిడి వల్లే బ్యాట్స్మన్గా రాణించలేకపోతున్నాననే కారణంతో అలీ కెప్టెన్ పదవిని వదులుకున్నాడు. అలీ వారసుడిగా సర్ఫరాజ్ అహ్మద్ బాధ్యతలు చేపట్టనున్నాడు. పాక్ వన్డే, టి-20 జట్లకు సర్ఫరాజ్ సారథ్యం వహించనున్నాడు. అతను ఇంతకుముందు ఓ వన్డే, 4 టి-20లకు పాక్ జట్టుకు నాయకత్వం వహించాడు. మూడు ఫార్మాట్లకు ఒకరినే కెప్టెన్గా నియమించాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు భావిస్తోంది. టెస్టు కెప్టెన్ పదవి నుంచి మిస్బావుల్ హక్ను కూడా తప్పించాలనే ప్రతిపాదన వచ్చింది. అయితే పీసీబీ ఆదేశాలను ధిక్కరిస్తూ, టెస్టు కెప్టెన్సీ నుంచి వైదొలగనని ఇటీవల మిస్బా ఎదురు తిరిగాడు. ఈ నేపథ్యంలో మిస్బాపై కూడా పీసీబీ వేటు వేస్తుందా లేక అతన్నే కెప్టెన్గా కొనసాగిస్తుందా అన్నది వేచిచూడాలి. నిర్ణయం తీసుకునేందుకు తనకు కొంత సమయం ఇవ్వాలని మిస్బా పీసీబీని కోరాడు. టెస్టు, వన్డే ఫార్మాట్లలో పాక్ దారుణంగా విఫలమైంది. మిస్బా నాయకత్వంలోని పాక్ టెస్టు పరాజయాలు ఎదుర్కొంది. -
లార్డ్స్లో మూడో వికెట్ కీపర్గా..
లార్డ్స్: పాకిస్తాన్ వికెట్ కీపర్ సర్ఫరాజ్ అహ్మద్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. చారిత్మాత్మక లార్డ్స్ మైదానంలో సెంచరీ నమోదు చేసిన మూడో వికెట్ కీపర్గా సర్ఫరాజ్ నిలిచాడు. ఐదు వన్డేల సిరీస్లో భాగంగా ఇంగ్లండ్తో జరిగిన రెండో వన్డేలో సర్పరాజ్ ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్లో సర్పరాజ్(105) శతకం సాధించాడు. తద్వారా అంతకుముందు వన్డేల్లో ఈ మైదానంలో సెంచరీలు చేసిన వికెట్ కీపర్లు జాస్ బట్లర్, సంగక్కరాల సరసన సర్ఫారాజ్ నిలిచాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 251 పరుగులు చేసింది. అనంతరం తరువాత బ్యాటింగ్ చేసిస ఇంగ్లండ్ నాలుగు వికెట్లు తేడాతో విజయం సాధించింది. దీంతో వన్డే సిరీస్లో 2-0 ఆధిక్యంలో నిలిచింది. -
పాకిస్తాన్ టి-20 టీమ్కు కొత్త కెప్టెన్
కరాచీ: పాకిస్తాన్ టి-20 క్రికెట్ జట్టు కెప్టెన్గా వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మన్ సర్ఫ్రాజ్ అహ్మద్ను నియమించారు. పాక్ వన్డే జట్టు వైస్ కెప్టెన్గా ఉన్న సర్ఫ్రాజ్కు పొట్టి ఫార్మాట్లో షాహిద్ అఫ్రీది స్థానంలో జట్టు పగ్గాలు అప్పగించారు. మంగళవారం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఈ మేరకు ప్రకటించింది. టి-20 ప్రపంచ కప్లో వైఫల్యం అనంతరం పాక్ టి-20 కెప్టెన్గా అఫ్రీది వైదొలిగిన సంగతి తెలిసిందే. కెప్టెన్సీ మార్పు గురించి సర్ఫ్రాజ్తో మాట్లాడానని, కెప్టెన్గా బాధ్యతలు చేపట్టాలని సూచించినట్టు పీసీబీ చైర్మన్ షహర్యర్ ఖాన్ చెప్పాడు. కొత్త బాధ్యతల్లో రాణించాలంటూ అతనికి శుభాకాంక్షలు తెలిపాడు. ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్లో 28 ఏళ్ల సర్ఫ్రాజ్ 21 టెస్టులు, 58 వన్డేలు, 21 టి-20 మ్యాచ్లు ఆడాడు. -
'ధోనీలా ఫినిషింగ్ టచ్ ఇవ్వాలని ఉంది'
కోల్కతా: 'ధోనీని నేను బాగా ఫాలో అవుతాను. వికెట్ కీపింగ్, బ్యాటింగ్తో ఆయన తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఆయన నుంచి ఎన్నో నేర్చుకునేందుకు నేను ప్రయత్నిస్తుంటా. భారత్కు ఆయన ఎంతోమంచి క్రికెటర్. నాకు మార్గదర్శకుడు లాంటివారు. ఆయనలా నేను మ్యాచులను ఫినిష్ చేయాలనుకుంటున్నాను' ఇవి పాకిస్థాన్ వికెట్ కీపర్ బ్యాట్స్మన్ సర్ఫాజ్ అహ్మద్ మీడియాతో అన్న మాటలు. తన ఆటతీరుతో, ఒత్తిడిలోనూ మైదానంలో నింపాదిగా ఉండే వ్యవహార సరళితో ఇటీవలికాలంలో సర్ఫాజ్ పెద్ద ఎత్తున ప్రశంసలందుకున్నాడు. ఇప్పటికీ తన ఆటతీరును మెరుగుపరుచుకోవాలని భావిస్తున్నట్టు చెప్తున్న ఈ కుడిచేతివాటం బ్యాట్స్మన్ తాజాగా తన ఐడల్ భారత క్రికెట్ జట్టు కెప్టెన్ ధోనీని ప్రశంసల్లో ముంచెత్తాడు. ధోనీ అడుగుజాడల్లో నడుస్తూ తాను మరింతగా రాణించాలనుకుంటున్నట్టు ఆదివారం కోల్కతా మీడియాతో చెప్పాడు. పాకిస్థాన్ బ్యాటింగ్ లైనప్లో తన స్థానం గురించి మాట్లాడుతూ జట్టు అవసరాల మేరకు ఏ స్థానంలోనైనా ఆడేందుకు సిద్ధమని, లోయర్ ఆర్డరైనా టాప్ ఆర్డరైనా ఎక్కడైనా తాను ఆడగలనని చెప్పాడు. బంగ్లాదేశ్లో జరిగిన ఆసియా కప్లో పాక్ జట్టు అనుకున్న స్థాయిలో రాణించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు.