Serum Institute Of India
-
'నా భార్యకు నన్ను చూస్తూ ఉండటం ఇష్టం'
ప్రస్తుతం దేశం మొత్తం మీద పనిగంటలపై చర్చ జరుగుతోంది. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి వారానికి 70 గంటలు పనిచేయాలని చెబితే.. వారానికి 90 గంటలు పనిచేయాలని ఎల్ అండ్ టీ చైర్మన్ సుబ్రమణ్యన్ అన్నారు. ఈ వ్యాఖ్యపై పలువురు పారిశ్రామిక వేత్తలు స్పందించారు. ఇప్పుడు ఈ జాబితాలోకి సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ 'అదార్ పూనావల్లా' (Adar Poonawalla) కూడా చేరారు.ఎన్ని గంటలు పనిచేశామన్నది కాదు, ఎంత క్వాలిటీ వర్క్ చేశామన్నది ముఖ్యం. 10 గంటలు పని చేస్తే ప్రపంచాన్నే మార్చేయొచ్చన్న ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) మాటలతో.. అదార్ పూనావల్లా ఏకీభవించారు. నా భార్య కూడా నేను అద్భుతంగా ఉన్నాను అని అనుకుంటుంది. ఆమె ఆదివారాలు నన్ను చూస్తూ ఉండటానికి ఇష్టపడుతుందని ఆయన ట్వీట్ చేశారు.ఢిల్లీలో ఏర్పాటు చేసిన వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2025 సదస్సులో, పని గంటల పొడిగింపుపై ఆనంద్ మహీంద్రా మాట్లాడుతూ తన అసమ్మతిని వ్యక్తం చేశారు. నారాయణ మూర్తి.. ఇతర కార్పొరేట్ నాయకుల పట్ల నాకు చాలా గౌరవం ఉంది. అయితే నా ఉద్దేశ్యం ఏమిటంటే, మనం పని గంటలపై కాకుండా.. పని నాణ్యతపై దృష్టి పెట్టాలి. కాబట్టి 70 గంటలు & 90 గంటలు కాదు. నాణ్యమైన పని 10 గంటలు చేస్తే చాలు. ప్రపంచాన్నే మార్చేయొచ్చని ఆయన అన్నారు.ఇదీ చదవండి: 'సరిగ్గా 10 గంటలు.. ప్రపంచాన్ని మార్చేయొచ్చు': ఆనంద్ మహీంద్రాఇంట్లో కూర్చుని.. భార్యను ఎంత సేపు చూస్తారు. ఆఫీసుకు వెళ్లి పని మొదలుపెట్టండని చెప్పిన ఎస్ఎన్ సుబ్రమణ్యన్ (Subrahmanyan) వ్యాఖ్యలపై ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ.. ‘నా భార్య ఎంతో మంచిది, ఆమెను తదేకంగా చూడటం నాకు చాలా ఇష్టం’ అని అన్నారు. ఎల్ అండ్ టీ చైర్మన్ వ్యాఖ్యలపై కేవలం పారిశ్రామిక దిగ్గజాలు మాత్రమే కాకుండా సినీ ప్రముఖులు, క్రీడా ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు.Yes @anandmahindra, even my wife @NPoonawalla thinks i am wonderful, she loves staring at me on Sundays. Quality of work over quantity always. #worklifebalance pic.twitter.com/5Lr1IjOB6r— Adar Poonawalla (@adarpoonawalla) January 12, 2025 -
రూ.750 కోట్ల ఇంట్లో నివాసం.. బిలియనీర్తో వివాహం: ఎవరో గుర్తుపట్టారా? (ఫోటోలు)
-
ఇల్లు ఇంద్రభవనం.. కుబేరుడిలాంటి భర్త: ఎవరీ ఫ్యాషన్ ఐకాన్?
సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) సీఈఓ అదర్ పూనావాలా భార్య 'నటాషా పూనావాలా' (Natasha Poonawalla) గురించి బహుశా అందరికీ తెలిసే ఉంటుంది. ఈమె వ్యాపార రంగంలో కీలక పాత్ర పోషించడం మాత్రమే కాకుండా.. అనేక సామాజిక, దాతృత్వ కార్యక్రమాలు చేసే ముఖ్యమైన వ్యక్తులలో ఒకరుగా ప్రసిద్ధి పొందారు.నటాషా పూనావాలా.. సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేస్తూ.. వివిధ స్వచ్ఛంద కార్యక్రమాలపై దృష్టి సారిస్తూనే, విల్లో పూనావల్లా ఫౌండేషన్కు అధ్యక్షత వహిస్తున్నారు.పూణేలో జననం1981 నవంబర్ 26న మహారాష్ట్రలోని పూణేలో జన్మించిన నటాషా.. పాఠశాల విద్యను పూణేలోని సెయింట్ మేరీస్ స్కూల్లో, అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీని సావిత్రిబాయి ఫూలే పూణే విశ్వవిద్యాలయంలో పూర్తి చేసింది. తర్వాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి మాస్టర్స్ డిగ్రీని పొందింది.750 కోట్ల భవనంనటాషా 2006లో అదర్ పూనావాలాను వివాహం చేసుకుంది. ఈ జంటకు సైరస్, డారియస్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరు సుమారు 750 కోట్ల విలువైన విలాసవంతమైన భవనం లింకన్ హౌస్లో నివాసం ఉంటున్నారు. ఈ భవనం యూరోపియన్ స్టైల్లో ఉంది. దీనిని అదర్ పూనావాలా తండ్రి 2015లో కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇది సుమారు 247 ఎకరాలలో ఉన్నట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: రూ. 10వేల అప్పుతో రూ.32000 కోట్ల సామ్రాజ్యం: ఎవరీ 'రవి మోదీ'?నటాషా వ్యాపారం.. దాతృత్వం రెండింటిలోనూ కీలక వ్యక్తిగా స్థిరపడింది. ఆమె నాయకత్వంలో, SII ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద వ్యాక్సిన్ తయారీదారులలో ఒకటిగా మారింది. ఇక ఫౌండేషన్ ద్వారా సామాజిక కార్యక్రమాలు చేపడుతూ.. నిరుపేద వర్గాల కోసం విద్య, ఆరోగ్య సంరక్షణ మొదలైనవాటిని అందిస్తోంది. నటాషా భర్త నికర విలువ రూ. 1 లక్ష కోట్ల కంటే ఎక్కువ. -
సినిమాల్లోకి ‘సీరమ్’!
న్యూఢిల్లీ: కోవిడ్ వ్యాక్సిన్తో చిరపరిచితమైన వ్యాక్సిన్ల తయారీ దిగ్గజం సీరమ్ ఇన్స్టిట్యూట్ సినిమాల నిర్మాణంలోకి ప్రవేశిస్తోంది. కంపెనీ సీఈవో అదార్ పూనావాలా ఏర్పాటు చేసిన సిరీన్ ప్రొడక్షన్స్ కరణ్ జోహార్కు చెందిన ధర్మ ప్రొడక్షన్స్లో 50 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. ఇందుకు రూ. 1,000 కోట్లు వెచ్చించనుంది. ధర్మ ప్రొడక్షన్స్, ధర్మాటిక్ ఎంటర్టైన్మెంట్లలో రూ. 1,000 కోట్లు ఇన్వెస్ట్ చేసేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు సిరీన్ ప్రొడక్షన్స్ వెల్లడించింది. దీంతో ధర్మలో 50 శాతం వాటాను సిరీన్ ప్రొడక్షన్స్ సొంతం చేసుకోనుంది. మిగిలిన 50 శాతం వాటాతోపాటు యాజమాన్యాన్ని కరణ్ జోహార్ కలిగి ఉంటారని సిరీన్ స్పష్టం చేసింది. వెరసి పూనావాలా పెట్టుబడులు ధర్మ విలువను రూ. 2,000 కోట్లుగా నిర్ధారించాయి. ఎంటర్టైన్మెంట్ పరిశ్రమలోని అవకాశాలను అందిపుచ్చుకునేందుకు వీలుగా ధర్మ, సిరీన్ సంస్థల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పాటైనట్లు సిరీన్ పేర్కొంది. సినిమాల నిర్మాణంలో ధర్మకున్న నైపుణ్యం, అదార్ పూనావాలాకున్న వనరులు ఇందుకు తోడ్పాటునివ్వగలవని అభిప్రాయపడింది. ధర్మ మరింత పురోభివృద్ధిని సాధిస్తుందని, మరింత ఎత్తుకు ఎదుగుతుందని ఆశిస్తున్నట్లు తాజా పెట్టుబడులపై స్పందిస్తూ పూనావాలా పేర్కొన్నారు. భవిష్యత్ దృక్పథ వ్యూహాలు, నైపుణ్యంతోకూడిన సినిమాల నిర్మాణాల సక్రమ కలయికను తాజా భాగస్వామ్యం ప్రతిఫలిస్తున్నదని కరణ్ జోహార్ వ్యాఖ్యానించారు. బాధ్యతలు ఇలా: కంపెనీ నూతన ఏర్పాటులో భాగంగా ధర్మకు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ హోదాలో కరణ్ జోహార్ సృజనాత్మక కార్యక్రమాలను రూపొందిస్తారు. సీఈవోగా అపూర్వ మెహతా వ్యూహాత్మక మార్గదర్శకుడిగా కరణ్తో కలిసి బాధ్యతలు నిర్వహిస్తారు. కంటెంట్ నిర్మాణం, పంపిణీ, ఆధునిక టెక్నాలజీలను ఏకీకృతం చేయడం, ప్రొడక్షన్ విధానాలను మెరుగుపరచడం, ఆడియన్స్ను ఆకట్టుకోవడం తదితర కార్యకలాపాలపై దృష్టి పెట్టనున్నట్లు సిరీన్ వివరించింది. దేశీయంగా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ భారీగా విస్తరిస్తున్న నేపథ్యంలో తాజా డీల్కు ప్రాధాన్యత ఏర్పడింది. -
టైమ్ జాబితాలో రిలయన్స్, టాటా
న్యూఢిల్లీ: దేశీ దిగ్గజాలు రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా గ్రూప్, సీరమ్ ఇన్స్టిట్యూట్ ప్రతిష్టాత్మకమైన టైమ్ మ్యాగజైన్ లిస్టులో చోటు దక్కించుకున్నాయి. 2024కి గాను ప్రపంచంలోనే 100 అత్యంత ప్రభావవంతమైన కంపెనీలతో టైమ్ దీన్ని రూపొందించింది. ఈ లిస్టులో రిలయన్స్ చోటు దక్కించుకోవడం ఇది రెండోసారి. 2021లో కూడా ఈ జాబితాలో రిలయన్స్ ఉంది. కంపెనీలను అయిదు విభాగాలుగా వర్గీకరించగా టైటాన్స్ కేటగిరీలో రిలయన్స్, టాటాలను టైమ్ చేర్చింది. పయొనీర్స్ కేటగిరీలో సీరమ్ ఉంది. 58 ఏళ్ల క్రితం టెక్స్టైల్, పాలీయెస్టర్ కంపెనీగా ఏర్పాటైన రిలయన్స్ ఇండస్ట్రీస్ నేడు 200 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్తో దేశంలోనే అత్యంత విలువైన కంపెనీగా ఎదిగిందని టైమ్ పేర్కొంది. 1868లో ప్రారంభమైన టాటా గ్రూప్.. సాల్ట్ (ఉప్పు) నుంచి సాఫ్ట్వేర్ వరకు వివిధ రంగాల్లో విస్తరించిందని తెలిపింది. 2023లో ఐఫోన్లను అసెంబుల్ చేసే తొలి భారతీయ కంపెనీగా నిలి్చందని వివరించింది. అటు సీరమ్ ఏటా 3.5 బిలియన్ డోసుల టీకాలను ఉత్పత్తి చేస్తూ ప్రపంచంలోనే అతి పెద్ద వేక్సిన్ల తయారీ సంస్థగా ఉందని టైమ్ పేర్కొంది. -
'అదర్ పూనావాలా' రూ.10.5 కోట్ల కారు ఇదే.. చూసారా!
సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ 'అదర్ పూనావాలా' ఇటీవల 'ఫెరారీ పురోసాంగ్యూ' కొనుగోలు చేశారు. దీని ధర దాదాపు రూ. 10.5 కోట్లు (ఎక్స్-షోరూమ్). ఈ కొత్త కారుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.అదర్ పూనావాలా కొనుగోలు చేసిన కారు రిజిస్ట్రేషన్ నెంబర్ ప్రకారం.. ఇది ఇండియాలో కొనుగోలు చేసింది కాదని తెలుస్తోంది. నాలుగు డోర్స్ కలిగిన ఈ కారు నీరో డేటోనా షేడ్లో ఉండటం గమనించవచ్చు. ఎల్లో కలర్ బ్రేక్ కాలిపర్లు కలిగిన ఈ కారు బ్లాక్-అవుట్ ఎక్ట్సీరియర్ పొందుతుంది. ఇంటీరియర్ కూడా ఇదే బ్లాక్ అండ్ ఎల్లో కలర్ కలయికతో ఉండటం చూడవచ్చు.అద్భుతమైన డిజైన్, ఫీచర్స్ కలిగిన ఈ కారు 6.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగి.. 725 పీఎస్ పవర్, 716 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది మార్కెట్లో లంబోర్ఘిని ఉరస్, ఆస్టన్ మార్టిన్ డీబీఎక్స్ కార్లకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. ధర పరంగా ఫెరారీ కారు దాని ప్రత్యర్థుల కంటే ఎక్కువ.అదార్ పూనావాలా గ్యారేజిలో ఫెరారీ పురోసాంగ్యూ మాత్రమే కాకుండా.. రోల్స్ రాయిస్, ఫెరారీ 488 పిస్టా సూపర్కార్, బెంట్లీ బెంటెగా EWB, పోర్స్చే కయెన్, బీఎండబ్ల్యూ 7 సిరీస్, మెర్సిడెస్ బెంజ్ ఎస్600, బెంట్లీ కాంటినెంటల్ ఫ్లయింగ్ స్పర్ మొదలైన అన్యదేశ్య కార్లు ఉన్నాయి. View this post on Instagram A post shared by Automobili Ardent India (@automobiliardent) -
ఆస్ట్రాజెనెకాకు మరో షాక్, ఈ వాక్సీన్తోనే బిడ్డను కోల్పోయా ఓ తండ్రి కోర్టుకు
కోవిడ్ వ్యాక్సీన్ను తయారు చేసిన ప్రముఖ ఫార్మా కంపెనీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత తమ కుమార్తె చనిపోయిందని ఆరోపిస్తూ ఒక యువతి తల్లిదండ్రులు సెరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII)పై దావా వేశారు. బ్రిటన్కి చెందిన ఫార్మా దిగ్గజంపై పిటీషన్ దాఖలు చేశారు.ఇటీవల ఫార్మా సంస్థ ఆస్ట్రాజెన్కా తమ వ్యాక్సిన్ వల్ల రక్తం గడ్డ కట్టడం, తక్కువ ప్లేట్ లెట్ కౌంట్కి సంబంధించి అరుదైన దుష్ప్రభావాల ఆరోపణలు, వీటిని ఆస్ట్రాజెన్కా కూడా అంగీకరించిన తరువాత ఈ పరిణామం చోటుచేసుకుంది. కారుణ్య పుట్టిన రోజు మే 1. మా తొలి వివాహ వార్షికోత్సవ గిప్ట్ నా పాప. ఇపుడు అందనంతదూరంలో- వేణుగోపాల్ తమ 20 ఏళ్ల కుమార్తె కారుణ్య కోవిషీల్డ్ వ్యాక్సినేషన్ తర్వాత జూలై 2021లో మరణించిందని తండ్రి వేణుగోపాలన్ గోవిందన్ ఎక్స్లో ఆరోపించారు. డేటా సైన్స్ స్టూడెంట్ కారుణ్య టీకా తీసుకున్న ఒక నెల తర్వాత అనారోగ్యానికి గురైంది. వారం రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన తర్వాత ఆమె మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమెటరీ సిండ్రోమ్ కారణంగా మరణించింది. వ్యాక్సిన్ తీసుకున్న 8 రోజుల తర్వా ఆమె తీవ్రమైన సంస్యల బారినపడిందని, నెల తర్వాత మరణించిందని తండ్రి వేణుగోపాల్ గోవిందన్ ఆరోపించరాఉ. వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందు ఆమె పూర్తి ఆరోగ్యంగా ఉందని పేర్కొన్నారు.అలాగే ఇంత నష్టం జరిగిన తరువాత ఆస్ట్రాజెన్కా తప్పు ఒప్పుకోవడంపై వేణుగోపాలన్ మండి పడ్డారు. రక్తం గడ్డకట్టడం వల్ల సంభవించే మరణాలపై 15 యూరోపియన్ దేశాలు వ్యాక్సీన్ వినియోగాన్ని పరిమితం చేసిన తర్వాత సీరం ఇన్స్టిట్యూట్ వ్యాక్సిన్ సరఫరాని నిలిపేయాల్సి ఉండాల్సిందని ఆయన అన్నారు. తల్లిదండ్రులు న్యాయం కోసం వివిధ న్యాయస్థానాల్లో పోరాడుతున్నప్పటికీ విచారణకు నోచుకోవడం లేదని తన పోస్టులో పేర్కొన్నారు. 8 మంది బాధిత కుటుంబాల తరుపున తమ భావాలను ప్రతిధ్వనిస్తున్నామని వెల్లడించారు. ప్రాణాలు కోల్పోయినందుకు సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మరియు అదార్ పూనావాలా వారి పాపాలకు సమాధానం చెప్పవలసి ఉంటుందని అన్నారు. అలాగే వ్యాక్సిన్ని వినియోగంలోకి తీసుకువచ్చిన ప్రభుత్వ అధికారులను కూడా ఆయన నిందించారు. ఈ మేరకు వేణుగోపాలన్ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. అయితే దీనిపై సీరం నుంచి ఎలాంటి స్పందన రాలేదు.Thanks to @Teensthack for this article. 🙏I missed to tell Teena that today (May 1st) is Karunya's birthday and she was the first wedding anniversary gift to me and my wife from the heavens. 😭Perhaps due to editorial/space constraints few core points I gave missed to make… pic.twitter.com/bjJjHOc1aM— Venugopalan Govindan (@gvenugopalan) May 1, 2024 2021లో తమ కుమార్తె రితైక(18)ను కోల్పోయిన రచనా గంగూ కుమార్తె మరణంపై విచారణ జరిపేందుకు మెడికల్ బోర్డును నియమించాలని కోరుతూ గతంలో సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలులు చేశారు. ఆస్ట్రాజెనెకా ఇప్పటికే యూకేలో క్లాస్ యాక్షన్ దావాను ఎదుర్కొంటోంది.కాగా వ్యాక్సిన్ వల్ల థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్ (TTS)తో థ్రాంబోసిస్తో సహా మరణాలు మరియు తీవ్రమైన గాయాలు సంభవించాయని ఆరోపిస్తూ క్లాస్-యాక్షన్ దావా నుండి చట్టపరమైన చర్యను ఎదుర్కొంటోంది ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంతో కలిసి అభివృద్ధి చేసిన కోవిడ్-19 ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ను భారతదేశంలో సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) ‘కోవిషీల్డ్’ పేరుతో తయారు చేసి, విక్రయించిన సంగతి తెలిసిందే. -
మలేరియా వ్యాక్సిన్ తయారీపై ‘సీరమ్’ దృష్టి!
ప్రముఖ వ్యాక్సిన్ తయారీ కంపెనీ సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(పూణె) మలేరియా వ్యాక్సిన్ తయారీపై దృష్టి సారించింది. కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అదార్ పూనావాలా మీడియాతో మాట్లాడుతూ కరోనా వ్యాక్సిన్ తర్వాత తమ సంస్థ మలేరియా వ్యాక్సిన్ తయారీపై దృష్టి సారించిందని తెలిపారు. మలేరియా వ్యాక్సిన్ తయారు చేసేందుకు కంపెనీ తన తయారీ సామర్థ్యాన్ని పెంచుకుందని అదార్ పూనావాలా తెలిపారు. సంస్థకు పది కోట్ల డోసుల మలేరియా వ్యాక్సిన్ను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉందన్నారు. డిమాండ్కు అనుగుణంగా దీనిని మరింత పెంచవచ్చన్నారు. మలేరియా వ్యాక్సిన్ తయారీలో టెక్నాలజీ బదిలీ ఒప్పందంతో పాటు వ్యాక్సిన్ల ఎగుమతిపై దృష్టి సారిస్తామని ఆయన తెలిపారు. డెంగ్యూ వ్యాక్సిన్ తయారీపై కూడా దృష్టిపెట్టామన్నారు. ఏటా లక్షల మంది డెంగ్యూ, మలేరియా బారిన పడుతున్నారు. సీరమ్ ఇన్స్టిట్యూట్ గతంలో కరోనా నివారణకు కోవిషీల్డ్ వ్యాక్సిన్ తయారుచేసింది. ఇప్పుడు దీనికి డిమాండ్ తగ్గడంతో తక్కువ స్థాయిలో యాంటీ కరోనావైరస్ వ్యాక్సిన్ను తయారు చేస్తోంది. -
బెజోస్ ప్రియురాలితో నటాషా పూనావాలా స్టెప్పులు; ఫోటోలు, వీడియో వైరల్
ప్రముఖ వ్యాక్సిన్ మేకర్ సీరంసీఈవో అదార్ పూనావాలా భార్య, సీరంఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నటాషాపూనావాలా మరోసారి ఒక అంతర్జాతీయ వేదికపై తళుక్కున మెరిసారు. ప్రముఖ గాయని సల్మా హాయక్ సహ-అధ్యక్షురాలిగా ఉన్న కెరింగ్ ఫౌండేషన్ 15వ వార్షికోత్సవానికి హాజరైనఅతిథులలో ఫ్యాషన్ మొగల్ నటాషా స్పెషల్ ఎట్రాక్షన్గా నిలిచారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా బ్లాక్ అండ్ వైట్ షియాపరెల్లి గౌనులో నటాషా తనదైన ఫ్యాషన్ స్టయిల్లో అద్భుతంగా కనిపిస్తుంది. అలాగే అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ గర్ల్ఫ్రెండ్ లారెన్ శాంచెజ్, సల్మాతో కలిసి స్టెప్పులు వేసింది. దీనికి సంబంధించి వీడియోను, ఫోటోలను నటాషా పూనావాలా ఇన్స్టాలో షేర్ చేశారు. వీరితోపాటు నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్జాయ్ ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ వేడుకు ఫోటోలు, వీడియోలను, సల్మా హాయక్ , లారెన్ శాంచెజ్ షేర్ చేశారు. దీంతో ఇది వైరల్గా మారింది. సెప్టెంబర్ 12న అమెరికాలో మాన్హాటన్లో సల్మా హాయక్ ఇచ్చిన కేరింగ్ ఫర్ ఉమెన్ డిన్నర్ ఈవెంట్లో పలువురుమహిళా ప్రముఖులు స్పెషల్ గెస్ట్లు విచ్చేశారు. ముఖ్యంగా నటి ఓప్రా విన్ఫ్రే తన ప్రసంగంతో ఆకట్టుకుంది. ఇంకా మలాలా, నికోల్ కిడ్మాన్, కిమ్ కర్దాషియాన్, ఒలివియా వైల్డ్ లారెన్ శాంటో డొమింగో, ఎల్సా కాలిన్స్, జూలియా గార్నర్, లియోనార్డో డికాప్రియో, కింబాల్ మస్క్, క్రిస్టియానా మస్క్, డెరెక్ బ్లాస్బర్గ్ లాంటి వారున్నారు. 'కేరింగ్ ఫర్ ఉమెన్' విందుకు వచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా లింగ-ఆధారిత హింసను ఎదుర్కోవడానికి ,మహిళలు ,పిల్లలపై హింకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరులో కలిసి పనిచేయడం చాలా గౌరవంగా ఉందని పేర్కొంది. View this post on Instagram A post shared by Lauren Sanchez (@laurenwsanchez) View this post on Instagram A post shared by Salma Hayek Pinault (@salmahayek) View this post on Instagram A post shared by Natasha Poonawalla (@natasha.poonawalla) -
మళ్లీ కోవిషీల్డ్ ఉత్పత్తి
న్యూఢిల్లీ: తగిన డిమాండ్ లేకపోవడం, కోవిడ్ ఉధృతి తగ్గుముఖం పట్టడంతో గతంలో ఆగిన కోవిషీల్డ్ కోవిడ్ టీకా ఉత్పత్తిని తాజాగా పునఃప్రారంభించామని దాని తయారీసంస్థ సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా బుధవారం ప్రకటించారు. కొత్తగా కోవిడ్ కేసుల సంఖ్య రోజురోజుకూ ఎక్కువవుతుండటంతో వ్యాక్సిన్ ఉత్పత్తి మొదలుపెట్టినట్లు ఆయన వెల్లడించారు. ‘ ఇప్పటికే 60 లక్షల కోవోవ్యాక్స్ బూస్టర్ డోసులు అందుబాటులో ఉన్నాయి. వయోజనులు కచ్చితంగా బూస్టర్ డోసులు తీసుకోవాలి. ముందస్తు జాగ్రత్తగా ప్రజలు తమ ఐచ్ఛికంగా కోవిషీల్డ్నూ తీసుకోవచ్చు. వచ్చే 90 రోజుల్లో 60–70 లక్షల డోసుల కోవిషీల్డ్ అందుబాటులో ఉండేలా చూస్తాం. డిమాండ్కు తగ్గట్లు స్టాక్ను పెంచేందుకు తొమ్మిది నెలల సమయం పట్టొచ్చు’ అని పూనావాలా చెప్పారు. చివరిసారిగా కోవిషీల్డ్ ఉత్పత్తిని సీరమ్ సంస్థ 2021 డిసెంబర్లో నిలిపేసింది. -
హైదరాబాద్: అంటువ్యాధులు, మహమ్మారుల సన్నద్ధతపై ప్రత్యేక కేంద్రం
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ టీకాల తయారీ సంస్థ సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా హైదరాబాద్లో అంటువ్యాధులు, మహమ్మారుల సన్నద్ధతపై సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ)ను ఏర్పాటు చేయనుంది. నగరంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (ఐఐపీఎం) ఆవరణలో ఈ కేంద్రాన్ని డాక్టర్ సైరస్ పూనావాలా పేరిట నెలకొల్పనుంది. ఈ మేరకు సీరమ్ సంస్థ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. హైదరాబాద్లో వర్చువల్గా జరిగిన ఒక కార్యక్రమంలో సీరం ఇన్స్టిట్యూట్ ఈ మేరకు ప్రకటించింది. ప్రజారోగ్య అత్యవసర సమయాల్లో సమాచారం, వనరులు, సాయం అందించేందుకు దీన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. ప్రజారోగ్యంపై చైతన్యం, అంటువ్యాధుల వ్యాప్తిపై స్పందించేలా దీన్ని తీర్చిదిద్దనుంది. పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ దేశవ్యాప్తంగా స్థాపించిన ఐదు సంస్థలలో ఇదొకటి. గతేడాది దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమావేశాల సందర్భంగా సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్ పూనావాలాతో రాష్ట్ర ఐటీ పరిశ్రమల మంత్రి కేటీఆర్ సీవోఈ ఏర్పాటుపై చర్చించారు. ఆదివారం వర్చువల్ సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితికి సీవోఈ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ప్రపంచంలోనే వ్యాక్సిన్ రాజధానిగా పరిగణించబడే హైదరాబాద్ నగరానికి అతిపెద్ద వ్యాక్సిన్ తయారీదారు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీవోఈని నెలకొల్పుతుండటాన్ని ఆయన స్వాగతించారు. ఐఐపీఎం డైరెక్టర్ ప్రొఫెసర్ శ్రీనాథ్రెడ్డి మాట్లాడుతూ వ్యాధుల నివారణ, మహమ్మారి ముప్పులను అంచనా వేయడానికి, నివారించడానికి, తగ్గించడానికి సీవోఈ సహాయపడుతుందన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర పరిశ్రమల ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, తెలంగాణ ప్రభుత్వ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తి ఎం. నాగప్పన్ పాల్గొన్నారు. -
కోవిడ్ కేసుల పెరుగుదల ఆందోళనకరమే.. కానీ: అదర్ పూనావాలా
పొరుగు దేశం చైనాతో పాటు పలు దేశాల్లో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతుండటం ఆందోళన కలిగించే విషయమేన్నారు వ్యాక్సిన్ మేకర సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) సీఈఓ అదర్ పూనావాలా. అయితే, ప్రజలు ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదన్నారు. భారత్లో కోవిడ్ వ్యాక్సినేషన్ విస్తృతంగా చేపట్టడం, కేసుల కట్టడి వంటి ట్రాక్ రికార్డు గొప్పగా ఉందని పేర్కొన్నారు. అయితే, కేంద్ర ప్రభుత్వం, కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలని ట్విట్టర్ వేదికగా ప్రజలను కోరారు. ‘కరోనా కేసులు పెరుగుతున్నట్లు చైనా నుంచి వస్తున్న వార్తలు ఆందోళనకరమే. ఇప్పటికే మనం విస్తృత స్థాయిలో వ్యాక్సిన్ పంపిణీ చేయడం, మెరుగైన పనితీరు కారణంగా భయపడాల్సిన అవసరం లేదు. కేంద్రం, ఆరోగ్య శాఖ మార్గదర్శకాలపై నమ్మకం ఉంచి తప్పకుండా పాటించాలి.’అని ట్విట్టర్లో పేర్కొన్నారు సీరమ్ సీఈఓ అదర్ పూనావాలా. The news of rising COVID cases coming out of China is concerning, we need not panic given our excellent vaccination coverage and track record. We must continue to trust and follow the guidelines set by the Government of India and @MoHFW_INDIA. — Adar Poonawalla (@adarpoonawalla) December 21, 2022 కోవిడ్-19ను ఎదుర్కొనేందుకు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ‘కోవిషీల్డ్’ అనే వ్యాక్సిన్ను ఉత్పత్తి చేసింది. దేశంలో ఎక్కువ శాతం ఈ కోవిషీల్డ్నే ప్రజలకు అందించింది కేంద్రం. ఇతర దేశాలకు సైతం ఎగుమతి చేశారు. చైనాతో పాటు అమెరికా, బ్రెజిల్ కొరియా సహా పలు దేశాల్లో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. పాజిటివ్ కేసుల నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపుతూ కొత్త వేరియంట్లపై అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు సూచించింది. అలాగే.. రద్ది ప్రదేశాల్లో ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని కోరింది. ఇదీ చదవండి: కోవిడ్ కథ ముగియలేదు.. అప్రమత్తంగా ఉందాం: కేంద్రం -
అదర్ పూనావాలా పేరిట రూ.కోటి టోపీ
ముంబై: వ్యాక్సిన్ల తయారీ సంస్థ సీరం ఇనిస్టిట్యూట్ సీఈఓ అదర్ పూనావాలా పేరు చెప్పి సైబర్ నేరగాళ్లు రూ.కోటికి పైగా కాజేశారు. మహారాష్ట్రలోని పోలీసులు శనివారం ఈ మేరకు వెల్లడించారు. వెంటనే డబ్బు బదిలీ చేయాలంటూ పూనావాలా పేరిట సీరం సంస్థ డైరెక్టర్ సతీశ్ దేశ్పాండేకు సైబర్ నేరగాళ్లు వాట్సాప్లో మెసేజ్ పంపించారు. కొన్ని బ్యాంకు ఖాతాల వివరాలను వాట్సాప్ చేశారు. దాంతో కంపెనీ సిబ్బంది ఆ ఖాతాల్లోకి రూ.1,01,01,554 బదిలీ చేశారు. ఆ మెసేజ్ పూనావాలా పంపలేదని తర్వాత గుర్తించారు. వెంటనే పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు అందుకున్న పుణే పోలీసులు చీటింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం కింద గుర్తుతెలియని వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సీరం కంపెనీ కరోనా టీకా కోవిషీల్డ్తో సహా ఇతర వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తోంది. పుణే సమీపంలో సీరం ప్లాంట్ ఉంది. -
టీకా వల్లే నా కూతురు చనిపోయింది..వెయ్యి కోట్లివ్వండి..
ముంబై: ‘‘కోవిషీల్డ్ టీకా సైడ్ ఎఫెక్ట్స్ వల్లే నా కుమార్తె మరణించింది. కేంద్ర ప్రభుత్వ కమిటీ కూడా దీన్ని ధ్రువీకరించింది. కనుక రూ.వెయ్యి కోట్ల పరిహారం ఇప్పించండి’’ అంటూ నాసిక్కు చెందిన స్నేహాల్ అనే వైద్య విద్యార్థి తండ్రి లునావత్ దిలీప్ బాంబే హైకోర్టులో పిటిషన్ వేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం, కేంద్రంతోపాటు, టీకా తయారీదారు సీరం ఇన్స్టిట్యూట్కు, దానికి తోడ్పాటు అందించిన బిల్గేట్స్ ఫౌండేషన్కు కోర్టు నోటీసులు జారీ చేసింది. వచ్చే విచారణ నాటికి సమాధానమివ్వాలని ఆదేశించింది. చదవండి: జయలలిత మరణం.. కొడనాడులో ఎన్నో రహస్యాలు..! -
ఓ వైపు పెరుగుతున్న కరోనా కేసులు.. మరోవైపు ఆగిపోతున్న వ్యాక్సిన్ల ఉత్పత్తి
కరోనా విషయంలో పరస్పర విరుద్ధమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఓ వైపు కేసులు పెరుగుతుంటే మరో వైపు వ్యాక్సిన్లు అమ్ముడుపోక ఫార్మా కంపెనీలు లబోదిబోమంటున్నాయి. తమ దగ్గర నిల్వ ఉన్న స్టాకును ఉచితంగా అయినా ఇచ్చేందుకు సై అంటున్నాయి. కరోనా వ్యాక్సిన్లకు మార్కెట్లో డిమాండ్ లేనందున తమ ఫ్యాక్టరీ ఉత్పత్తి నిలిపేస్తున్నట్టు ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సిన్ల తయారీ సంస్థ సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. పూనేలో ఉన్న తమ ఫ్యాక్టరీలో ఇప్పటికే 20 కోట్ల కోవీషీల్డ్ వ్యాక్సిన్ డోసులు సిద్ధంగా ఉన్నాయని తెలిపింది. ప్రస్తుతం నిల్వ ఉన్న డోసులు 2021 డిసెంబరులో తయారు చేసినవిగా తెలుస్తోంది. కరోనా వ్యాక్సిన్లు ఉత్పత్తి నుంచి 9 నెలల పాటు వాడుకునే వీలుంది. డిసెంబరు స్టాకే ఇంకా క్లియర్ కాకపోవడంతో కొత్తగా తయారీ వృధా అనే అంచనాలతో సీరమ్ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు ఎవరైనా అడిగితే ఉచితంగా వ్యాక్సిన్లు ఇస్తామని కూడా చెబుతోంది. గత డిసెంబరులో ఒమిక్రాన్ వేరియంట్ వెలుగు చూసిన తరుణంలో ప్రపంచ దేశాలు అలెర్ట్ అయ్యాయి. విమాన సర్వీసులు రద్దు చేశాయి. కరోనా ఆంక్షలు విధించాయి. అయితే ఒమిక్రాన్తో ముప్పు తక్కుగా ఉండటంతో 2022 ఫిబ్రవరి నుంచి క్రమంగా ఆంక్షలు తొలగించాయి. దీంతో సాధారణ జీవితం మొదలైంది. అంతా సవ్యంగా సాగుతున్న దశలో ఏప్రిల్ రెండో వారం నుంచి దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. మళ్లీ మాస్క్ తప్పనిసరంటూ ఆంక్షలు విధిస్తున్నాయి ప్రభుత్వాలు. గతేడాది కరోనా సెకండ్ వేవ్ ఇండియాలో విలయ తాండవం చేసింది. లక్షల మందిని పొట్టన బెట్టుకుంది. ఆ వెంటనే ప్రభుత్వాలు అప్రమత్తమై వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగవంతం చేశాయి. వ్యాక్సిన్ మిత్ర పేరుతో విదేశాలకు ఎగుమతి చేస్తున వ్యాక్సిన్లపై నిషేధం విధించింది. ఎన్ని వ్యాక్సిన్లు ఉంటే అన్నింటినీ ఇండియాలోనే ఉపయోగించారు. దీంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. అనంతరం 2021 డిసెంబరులో ఒమిక్రాన్ వేరియంట్ వెలుగు చూడటంతో మరోసారి బూస్టర్ డోసును కూడా అందించారు. ఆ తర్వాత ప్రైవేటు సెక్టారులో కూడా వ్యాక్సిన్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వ్యాక్సిన్లపై ఆంక్షలన్నీ తొలగిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్లో కరోనా వ్యాక్లిన్లకు డిమాండ్ లేదు. దీంతో ఒక్కో కంపెనీ ఉత్పత్తి నిలిపేస్తున్నట్టు ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే యూఎస్కి ప్రముఖ హెల్త్కేర్ సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్ ఈ ప్రటకన చేయగా తాజాగా ఇండియన్ ఫార్మా కంపెనీ సీరమ్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సైతం ఇదే తరహా నిర్ణయం వెలువరించింది. చదవండి👉🏾 జాన్సన్ అండ్ జాన్సన్ సంచలన నిర్ణయం ! -
రూ. 225కే కోవిడ్ ప్రికాషన్ డోస్
న్యూఢిల్లీ: నేటి నుంచి దేశవ్యాప్తంగా మొదలయ్యే కరోనా టీకా ప్రికాషన్ డోస్ను రూ.225కే ప్రైవేట్ వ్యాక్సినేషన్ సెంటర్లకు సరఫరా చేయనున్నట్లు సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ), భారత్ బయోటెక్ సంస్థలు ప్రకటించాయి. ‘కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపిన తర్వాత కోవిషీల్డ్ టీకా ఒక్కో డోస్ ధరను రూ.600 నుంచి రూ.225కు తగ్గించాలని నిర్ణయించాం’అని ఎస్ఐఐ సీఈవో అథర్ పూనావాలా శనివారం ట్విట్టర్లో తెలిపారు. అదేవిధంగా, ‘మా సంస్థ తయారు చేసే కోవాగ్జిన్ టీకా ఒక్కో డోస్ను ప్రైవేట్ ఆస్పత్రులకు రూ.1,200కు బదులుగా రూ.225కే అందజేయాలని నిర్ణయించినట్లు తెలిపేందుకు సంతోషిస్తున్నాం’అని భారత్ బయోటెక్ సహ వ్యవస్థాపకురాలు, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్రా ఎల్లా వెల్లడించారు. 18 ఏళ్లు నిండి, రెండో డోస్ తీసుకుని 9 నెలలు పూర్తయిన వారంతా 10వ తేదీ నుంచి ప్రైవేట్ టీకా కేంద్రాల్లో కోవిడ్ ప్రికాషన్ డోస్కు అర్హులని కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే. -
ఓపెన్ మార్కెట్లో కోవిషీల్డ్ బూస్టర్ డోస్.. ధర ఎంతంటే ?
కరోనా తీవ్రత తగ్గి జనజీవతం క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటోంది.అయితే ఇప్పటికీ కరోనా భయాలు పూర్తిగా తొలగిపోలేదు. కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. దీంతో 18 ఏళ్లు పైబడి ఇప్పటికే రెండు డోసులు పూర్తి చేసుకున్నవారు బూస్టర్ డోసు వేసుకోవడం మంచిందని కేంద్రం స్పష్టం చేసింది. ఈ తరుణంలో బూస్టర్ డోస్ను ఓపెన్ మార్కెట్లో అందిస్తున్నట్టు సీరమ్ ఇన్స్టిట్యూట్ తెలిపింది. దేశంలోనే తొలి కరోనా టీకా కోవిషీల్డ్ని సీరమ్ ఇన్స్టిట్యూట్ ఉత్పత్తి చేసింది. మొదటి రెండు డోసులు దాదాపుగా ప్రభుత్వమే ప్రజలకు ఉచితంగా అందించింది. కాగా బూస్టర్ డోసును ప్రభుత్వ ఆధ్వర్యంతో ఓమిక్రాన్ నేపథ్యంలో ప్రభుత్వం అందించింది. కాగా ఇప్పుడు బూస్టర్ డోసును ఓపెన్ మార్కెట్లో కూడా అందుబాటులో ఉంచుతున్నారు. దీంతో బయట మార్కెట్లో కోవిషీల్డ్ బూస్టర్ డోసుకు రూ. 600లుగా సీరమ్ నిర్ణయించింది. దీనికి స్థానిక పన్నులు అదనం అని సీరమ్ స్పష్టం చేసింది. వ్యక్తిగతంగా కొనుగోలుకు రూ. 600 ధర వర్తిస్తుందని, ఆస్పత్రులకు తక్కువ ధరకే సరఫరా చేస్తామని కూడా తెలిపింది. ఈ వ్యాక్సిన్ 2022 ఏప్రిల్ 10 నుంచి మార్కెట్లో అందుబాటులోకి రానుందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. హెల్త్ వర్కర్లు, ఫ్రంట్లైన్వర్కర్లు 60 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ డోసును ప్రభుత్వం ఉచితంగా అందివ్వనుంది. #LargestVaccineDrive Precaution/ booster Dose to be now available to all 18+ population group from 10th April, 2022, at Private Vaccination Centres.https://t.co/f0QDul20gz#CovidVaccine #IndiaFightsCorona @narendramodi @mansukhmandviya @blsanthosh @saudansinghbjp pic.twitter.com/dinGOwC4aq — Tajinder Singh Sran (@TajinderSTS) April 8, 2022 చదవండి: గుడ్ న్యూస్: బహిరంగ మార్కెట్లో విక్రయానికి 2 వ్యాక్సిన్లకు అనుమతి -
కోవోవ్యాక్స్కు అనుమతివ్వండి
న్యూఢిల్లీ: కోవిడ్ టీకా కోవోవ్యాక్స్ను బూస్టర్ డోస్గా వాడేందుకు వీలుగా మూడో దశ ట్రయల్స్కు అనుమతివ్వాలని సీరం ఇన్స్టిట్యూట్ డీసీజీఐ (డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా)ని కోరింది. కోవోవ్యాక్స్ టీకాను అత్యవసర పరిస్థితుల్లో నిబంధనలకు లోబడి వాడొచ్చంటూ డిసెంబర్ 28వ తేదీన డీసీజీఐ అనుమతి మంజూరు చేసిన విషయం తెలిసిందే. కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకా పూర్తి డోసులు తీసుకుని కనీసం మూడు నెలలు పూర్తయిన వారికి బూస్టర్ డోసుగా కోవోవ్యాక్స్ను ఇచ్చేందుకు ఫేజ్–3 ట్రయల్స్ జరుపుతామంటూ ఎస్ఐఐ దరఖాస్తు చేసుకుందని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ)లో ప్రభుత్వ రెగ్యులేటరీ వ్యవహారాల డైరెక్టర్ ప్రకాశ్ కుమార్ సింగ్ ఆదివారం చెప్పారు. -
కోవోవ్యాక్స్, మొల్న్యుపిరావర్ అత్యవసర వాడుకకు సిఫార్సు
న్యూఢిల్లీ: కరోనాను అరికట్టే ప్రక్రియలో సీరమ్ సంస్థ తయారీ కోవోవ్యాక్స్ టీకాను అత్యవసర పరిస్థితుల్లో వినియోగించేందుకు అనుమతించవచ్చని సీడీఎస్సీఓకు చెందిన నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. అదేవిధంగా కరోనా చికిత్సలో మొల్న్యుపిరావర్ మాత్రల ఉత్పత్తి, అత్యవసర వినియోగ అనుమతికి కూడా పచ్చజెండా ఊపింది. కోవోవ్యాక్స్పై నిపుణుల కమిటీ రెండుమార్లు పరిశీలన జరిపి చివరకు కొన్ని పరిస్థితుల్లో అత్యవసరంగా వాడేందుకు అనుమతించవచ్చని సిఫార్సు చేసింది. ఇప్పటికే ఈ టీకా ఎమర్జన్సీ వాడుకకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అంగీకరించింది. కరోనా సోకిన వయోజనుల్లో ఆక్సిజన్ స్థాయి పడిపోయి, రిస్కు పెరిగిన సందర్భాల్లో మొల్న్యుపిరావర్ను వినియోగించవచ్చని నిపుణుల కమిటీ సూచించింది. ఈ ఔషధాన్ని డా. రెడ్డీస్ సహా పలు కంపెనీ కన్సార్టియం ఉత్పత్తి చేస్తోంది. ఐదు రోజుల కన్నా ఎక్కువ రోజులు దీన్ని వాడకూడదని, గర్భిణీలకు ఇవ్వకూడదని కమిటీ సిఫార్సు చేసింది. -
కోవోవాక్స్ అత్యవసర వినియోగానికి డబ్ల్యూహెచ్ ఓకే
న్యూఢిల్లీ: కరోనాపై పోరుకు సీరమ్ ఇనిస్టిట్యూట్ అభివృద్ధి చేస్తున్న కోవోవాక్స్ టీకాను అత్యవసర వినియోగానికి అనుమతిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) శుక్రవారం ప్రకటించింది. అమెరికాకు చెందిన నోవావాక్స్ నుంచి సీరమ్ లైసెన్సులు పొంది దీన్ని రూపొందిస్తోంది. సంస్థ నిర్ణయం కరోనాపై పోరులో మరో మైలురాయిగా సీరమ్ సీఈఓ అధార్ పూనావాలా అభివర్ణించారు. వచ్చే ఆరు నెలల్లో దీనిని విడుదల చేయాలని భావిస్తున్నట్లు ఇటీవల అధార్ చెప్పారు. ప్రస్తుతం ఇది ట్రయిల్స్ దశలో ఉంది. ట్రయల్స్లో ఆశాజనక ఫలితాలు వచ్చాయని కంపెనీ తెలిపింది. కొత్త టీకా వినియోగానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థకు దరఖాస్తు చేసినట్లు సీరమ్ గత నెలలో వెల్లడించింది. నోవావాక్స్ రూపొందించిన NVX& CoV2373 టీకా సామర్థ్యానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని డబ్ల్యూహెచ్వోకు అందించినట్లు పేర్కొంది. ఈ టీకా 90శాతం సమర్థత కలిగి ఉన్నట్లు ప్రయోగాల్లో వెల్లడైంది. బ్రిటన్, దక్షిణాఫ్రికాలో జరిపిన ప్రయోగాల్లోనూ 89 శాతం ప్రభావశీలత కలిగినట్లు తేలింది. ఇప్పటివరకు అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్లకు భిన్న సాంకేతికతతో నోవావాక్స్ను అభివృద్ధి చేశారు. ముఖ్యంగా స్పైక్ ప్రొటీన్ను గుర్తించి, వైరస్పై దాడి చేసేందుకు శరీరాన్ని సిద్ధం చేసేలా ఈ వ్యాక్సిన్ రూపొందించారు. డీజీసీఐ తనిఖీల ఫలితాల ఆధారంగా నోవోవాక్స్ వాడేందుకు అత్యవసర అనుమతినిస్తున్నట్లు డబ్ల్యూహెచ్వో తెలిపింది. అయితే భారత్లో దీని అత్యవసర వినియోగానికి డీజీసీఐ నుంచి అనుమతులురావాల్సిఉంది. ప్రస్తుతం 18ఏళ్లు పైబడినవారికే భారత్లో కరోనా టీకాలు ఇస్తున్నారు . -
కోవిషీల్డ్ బూస్టర్ కోసం సీరమ్ దరఖాస్తు
న్యూఢిల్లీ: కోవిషీల్డ్ కరోనా టీకాను బూస్టర్ డోసుగానూ అనుమతించాలని కోరుతూ డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ)కు సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా దరఖాస్తు చేసుకుంది. రెండు డోస్లతోపాటు మూడో(బూస్టర్) డోస్గానూ పంపిణీ చేసేంత స్థాయిలో భారత్లో టీకా నిల్వలు ఉన్నాయని కోవిషీల్డ్ తయారీసంస్థ సీరమ్ ఆ దరఖాస్తులో పేర్కొంది. ఒమిక్రాన్ వేరియంట్ భయాలు భారత్లోనూ కమ్ముకుంటున్న ఈ తరుణంలో బూస్టర్ డోస్కు దేశంలో డిమాండ్ పెరిగిందని సీరమ్ వెల్లడించింది. ఆస్ట్రాజెనెకా ఫార్మా సంస్థకు చెందిన కోవిడ్ వ్యాక్సిన్ను బ్రిటన్కు వైద్య, ఆరోగ్య ఉత్పత్తుల నియంత్రణ సంస్థ ఇప్పటికే బూస్టర్ డోస్గా ఆమోదించిందని డీసీజీఐకు పంపిన దరఖాస్తులో సీరమ్ ప్రభుత్వ, నియంత్రణ వ్యవహారాల విభాగం డైరెక్టర్ ప్రకాశ్ కుమార్ పేర్కొన్నారు. -
కోవిషీల్డ్కు పూర్తిస్థాయి అనుమతులివ్వండి
న్యూఢిల్లీ: భారత్తో పాటు పలు దేశాల్లో 100 కోట్లకు పైగా డోసుల పంపిణీ జరిగినందువల్ల కోవిషీల్డ్కు పూర్తిస్థాయి వ్యాపార అనుమతి మంజూరు చేయాలని తయారీ సంస్థ సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆప్ ఇండియా (సీఐఐ) డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)కి దరఖాస్తు చేసింది. భారత్లో వినియోగిస్తున్న కోవిషీల్డ్, కోవాగ్జిన్, స్పుత్నిక్లకు అత్యవసర వినియోగ అనుమతులు మాత్రమే ఉన్న విషయం తెలిసిందే. ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను ఇదివరకే సమర్పించామని, ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లకు పైగా కోవిషీల్డ్ టీకాల పంపిణీ జరిగిందని, వైరస్ నుంచి రక్షణ కల్పిస్తోందని, వ్యాక్సిన్ సమర్థతకు ఇదే నిదర్శనమని సీరమ్ పేర్కొంది. -
ప్రపంచం చూపు మనవైపు: మోదీ
న్యూఢిల్లీ: మన దేశంలో కోవిడ్–19 వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతమైన నేపథ్యంలో ప్రపంచమంతా మనవైపు చూస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఈ విజయగాథలో టీకా ఉత్పత్తిదారులు పెద్ద పాత్ర పోషించారని కొనియాడారు. ఆయన శనివారం కోవిడ్–19 వ్యాక్సిన్ ఉత్పత్తిదారులతో సమావేశమయ్యారు. టీకాపై తదుపరి పరిశోధనలతోపాటు పలు కీలక అంశాలపై ఈ భేటీలో చర్చ జరిగినట్లు అధికార వర్గాలు తెలిపాయి. సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ), భారత్ బయోటెక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, జైడస్ క్యాడిలా, బయోలాజికల్ ఈ, జెనోవా బయోఫార్మా, పనాసియా బయోటెక్ సంస్థల ప్రతినిధులు ప్రధానితో జరిగి సమావేశానికి హాజరయ్యారు. దేశంలో కేవలం 9 నెలల్లో 100 కోట్ల కరోనా టీకా డోసులు ప్రజలకు పంపిణీ చేయడం గొప్ప ముందడుగు అని, మోదీ నాయకత్వ పటిమతోనే ఈ ఘనత సాధ్యమైందని వారు ప్రశంసించారు. ప్రధానితో భేటీ అనంతరం ఎస్ఐఐ చైర్మన్ అదార్ పూనావాలా మీడియాతో మాట్లాడారు. ప్రధానమంత్రి దార్శనికతతో తక్కువ సమయంలోనే 100 కోట్ల డోసులు ఇవ్వడం సాధ్యమయ్యిందని తెలిపారు. దేశంలో ఫార్మా రంగం అభివృద్ధి, భవిష్యత్తులో తలెత్తబోయే మహమ్మారులు, వాటిని ఎదుర్కొనేందుకు అవసరమైన సన్నద్ధతపై మోదీతో చర్చించినట్లు తెలిపారు. ప్రతికూలతను అవకాశంగా మార్చుకోవడం ప్రధానమంత్రి మోదీ ప్రత్యేకత అని భారత్ బయోటెక్ సంస్థ అధినేత కృష్ణా ఎల్లా పేర్కొన్నారు. స్వల్ప వ్యవధిలో 100 కోట్ల టీకా డోసులు ఇవ్వడం అనేది సాధారణ విషయం కాదని, మోదీ పట్టుదల, అంకితభావంతో ఇది అచరణ సాధ్యమయ్యిందని చెప్పారు. ఒక నాయకుడు తన దేశానికి చేయగలిగిన గొప్ప పని ఇది అని కొనియాడారు. డీఎన్ఏ ఆధారిత కోవిడ్ వ్యాక్సిన్ అభివృద్ధి వెనుక మోదీ కృషి ఎంతగానో ఉందని జైడస్ క్యాడిలా సంస్థ ప్రతినిధి పంకజ్ పటేల్ చెప్పారు. -
బ్రిటన్కు ‘తగిన’ జవాబిస్తాం!
న్యూఢిల్లీ: యూకే జారీ చేసిన నూతన రవాణా నిబంధనలపై భారత్ తీవ్రంగా ప్రతిస్పందించింది. కరోనా టీకా తీసుకున్నట్లు సర్టిఫికెట్ ఉన్నా సరే బ్రిటన్కు వచ్చే భారతీయులు క్వారంటైన్లో ఉండాలంటూ బ్రిటన్ కొత్త ప్రయాణ నిబంధనలు తెచ్చిన సంగతి తెలిసిందే! ఈ నిబంధనలు వివక్షపూరితమైనవంటూ కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి హర్ష వర్ధన్ శ్రింగ్లా మండిపడ్డారు. మరోవైపు విదేశాంగ మంత్రి జైశంకర్ ఈ విషయాన్ని న్యూయార్క్ సందర్శనలో యూకే విదేశాంగ కార్యదర్శి ఎలిజబెత్ ట్రస్ దృష్టికి తెచ్చారు. కోవిషీల్డ్ టీకాను యూకే కంపెనీనే రూపొందించిందని, అదే టీకాను భారత్లో ఉత్పత్తి చేసి బ్రిటన్ ప్రభుత్వ అభ్యర్థన మేరకు 50లక్షల డోసులు పంపించామని శ్రింగ్లా గుర్తు చేశారు. అలాంటి టీకానే గుర్తించమనే నిబంధనలు నిజంగానే వివక్షాపూరితమని, యూకేకు ప్రయాణించే లక్షలాది ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తాయని ఆయన దుయ్యబట్టారు. అక్టోబర్ 4(యూకేలో కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చే తేదీ)లోపు ఈ సమస్యను పరిష్కరించకుంటే భారత్ నుంచి ప్రతిచర్య తప్పదని సంబంధిత వర్గాలు అభిప్రాయపడ్డాయి. సమస్యను గుర్తించామని, తగు చర్యలు తీసుకుంటామని యూకే అధికార వర్గాల నుంచి ప్రస్తుతానికి హామీ లభించినట్లు షి్రంగ్లా చెప్పారు. అయితే హామీలు నిజం కాకుంటే భారత్ తనకున్న హక్కుల పరిధిలో తగిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. ఏమిటీ నిబంధనలు? బ్రిటన్కు వచ్చే విదేశీ ప్రయాణికుల కోసం నూతన ప్రయాణ నిబంధనలను యూకే ప్రభుత్వం రెండు రోజుల క్రితం ప్రకటించింది. వీటి ప్రకారం అక్టోబర్4 నుంచి భారత్తో పాటు మరికొన్ని దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు కోవిషీల్డ్ రెండు డోసుల టీకా తీసుకున్నా సరే, వారిని టీకా తీసుకోనివారిగానే పరిగణిస్తామని పేర్కొంది. సదరు జాబితాలోని దేశాల ప్రయాణికులు, యూకేకు చేరుకున్న తర్వాత పీసీఆర్ పరీక్షలు చేయించుకోవాలని, పది రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉండాలని తెలిపింది. నిజానికి యూకేకు చెందిన ఆస్ట్రాజెనెకా కోవిషీల్డ్ను రూపొందించింది. దీన్ని భారత్లోని సీరమ్ ఇన్స్టిట్యూట్ ఉత్పత్తి చేస్తోంది. అలాంటి టీకానే గుర్తించమనే కొత్తనిబంధనలపై భారత్లోని అన్ని పక్షాలు మండిపడ్డాయి. బ్రిటన్ తీరుపై కాంగ్రెస్ సీనియర్ నేతలు జైరామ్ రమేశ్, శశిథరూర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బ్రిటన్ నిబంధనలు జాతి వివక్ష చూపేలా ఉన్నాయన్నారు. వెంటనే భారత ప్రభుత్వం తగిన స్పందన చూపాలని కోరారు. ట్రస్తో జైశంకర్ భేటీ పరిణామాలపై భారత్ తన స్పందనను బ్రిటన్కు తెలిపింది. మరోవైపు విదేశాంగ మంత్రి జైశంకర్ తన న్యూయార్క్ పర్యటనలో బ్రిటన్ కార్యదర్శి ట్రస్ను కలిశారు. రెండు దేశాల పరస్పర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ సమస్యకు సత్వర పరిష్కారం చూపాలని కోరినట్లు జైశంకర్ తెలిపారు. కొత్త నిబంధనల ప్రకారం భారత్ నుంచి వచ్చే ప్రయాణికులను రెడ్లిస్టులో పెడతారు. అంటే భారత్లో వేస్తున్న టీకాలను బ్రిటన్ గుర్తించదని పేర్కొన్నట్లయింది. భారత్తో తలెత్తిన ఇబ్బందిని సత్వరం పరిష్కరించే యత్నాల్లో ఉన్నామని ఇండియాలో బ్రిటిష్ హైకమిషన్ కార్యాలయం ప్రకటించింది. ట్రస్తో పాటు పర్యటనలో భాగంగా నార్వే, ఇరాక్ విదేశాంగ మంత్రులతో జైశంకర్ భేటీ అయ్యారు. ఆయా దేశాలతో వాణిజ్యపరమైన అంశాలను చర్చించారు. ఇండో పసిఫిక్, అఫ్గాన్ అంశాలు కూడా చర్చకు వచ్చినట్లు తెలిసింది. -
కాక్టైల్ వ్యాక్సిన్ సరైంది కాదు
పుణె: ఒక వ్యక్తికి రెండు వేర్వేరు కంపెనీల కోవిడ్–19 వ్యాక్సిన్లు ఇవ్వడానికి తాను వ్యతిరేకమని సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) చైర్మన్ డాక్టర్ సైరస్ పూనావాలా చెప్పారు. లోకమాన్య తిలక్ జాతీయ అవార్డుని అందుకున్న సందర్భంలో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ మిక్స్ అండ్ మ్యాచ్ వ్యాక్సిన్ల అవసరం లేదని అన్నారు. ఆక్స్ఫర్డ్–ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ను సీరమ్ ఇనిస్టిట్యూట్ తయారు చేస్తున్న విషయం తెలిసిందే. ఇలా వ్యాక్సిన్లను మిశ్రమంపై ప్రయోగాలకు అనుమతులు ఇచ్చిన అంశంపై ఆయన మాట్లాడుతూ ‘‘ఇలా రెండు రకాల వ్యాక్సిన్లు ఇచ్చాక మెరుగైన ఫలితాలు రాకపోతే సీరమ్, ఇతర కంపెనీ వ్యాక్సినే మంచిది కాదని అనే అవకాశం ఉంది. అదే విధంగా ఆ కంపెనీ కూడా సీరమ్ని నిందించే అవకాశం ఉంటుంది’’అని అన్నారు. రెండు వ్యాక్సిన్ల మిశ్రమాల ఫలితాలపై సరైన డేటా కూడా లేదని పూనావాలా గుర్తు చేశారు. రెడ్ టేపిజం బాగా తగ్గింది కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ టేపిజం, లైసెన్స్ రాజ్ బాగా తగ్గిపోయాయని పూనావాలా కొనియాడారు. అంతకు ముందు పారిశ్రామిక రంగం ఎన్నో గడ్డు రోజుల్ని ఎదుర్కొందని చెప్పారు. అధికారుల నుంచి వేధింపులు, అనుమతులు లభించడంలో జాప్యం వంటి వాటితో పారిశ్రామికవేత్తలు క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొన్నారని అన్నారు. గతంలో బ్యూరోక్రాట్లు, ఔషధ నియంత్రణ అధికారుల కాళ్ల మీద పడినంత పని అయ్యేదని మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పరిస్థితిలో ఎంతో మార్పు వచ్చిందన్నారు. కోవిషీల్డ్ వ్యాక్సిన్ యుద్ధ ప్రాతిపదికన మార్కెట్లోకి రావడమే దీనికి నిదర్శనమని పూనావాలా చెప్పారు. -
భారత్లో కోవిడ్ టీకా: ఒక అడుగు ముందుకు.. రెండు వెనక్కు!
ఒక అడుగు ముందుకు పడితే... రెండు అడుగులు వెనక్కు!! ఇదీ దేశంలో కోవిడ్ టీకా కార్యక్రమం పరిస్థితి. 2021లోపు అర్హులైన ప్రజలందరికీ టీకాలేస్తామని... కేంద్రం ప్రకటనైతే చేసింది కానీ... అందుకు తగ్గట్టుగా టీకా ఉత్పత్తి, సరఫరా, పంపిణీలలో సమస్యలు ఎదురు కాకుండా చూడటంలో మాత్రం విఫలమైంది. మరి దేశం ఏడాది చివరిలోగా తన లక్ష్యాన్ని అందుకోగలదా? ఎన్ని టీకాలు వేశాం? ఎన్ని వేయాలి? ఏ ఏ కంపెనీలు ఉన్నాయి? అన్నది పరిశీలిస్తే.... వూహాన్లో పుట్టి ప్రపంచమంతా వ్యాపించి మానవాళికి పెనువిపత్తుగా పరిణమించిన కోవిడ్ను నిలువరించేందుకు ఉద్దేశించిన టీకా కార్యక్రమం దేశంలో నత్తనడకన సాగుతోందంటే తప్పేమీ కాదు. ఈ ఏడాది జనవరి పదహారవ తేదీన సీరమ్ ఇన్స్టిట్యూట్, భారత్ బయోటెక్లు తయారు చేసిన కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలతో కార్యక్రమం మొదలైనా.. ఆ తరువాత ముడిసరుకుల కొరత, పంపిణీ లోపాలు, ప్రభుత్వ విధానాల్లో తరచూ మార్పుల వంటి అనేక సమస్యల కారణంగా ఆశించిన స్థాయిలో టీకాలు ఇవ్వలేకపోయామన్నది నిష్టూర సత్యం. తాజాగా ఆగస్టు 11వ తేదీ నాటికి దేశం మొత్తమ్మీద 51.90 కోట్ల మందికి టీకాలు ఇవ్వడం పూర్తయింది. అయితే ఇందులో రెండు డోసులు తీసుకున్న వారి సంఖ్య 12 కోట్లు మాత్రమే ఉండటం గమనార్హం. ఒక డోసు తీసుకున్న వారు 40 కోట్లు ఉన్నారు. ఇంకోలా చెప్పాలంటే దేశ జనాభాలో వైరస్ నుంచి పూర్తిగా రక్షణ పొందిన వారు కొంచెం అటు ఇటుగా పది శాతం మంది మాత్రమే! సరఫరా సమస్యలకు అవగాహన రాహిత్యం, అపోహలు తోడు కావడంతో చాలామంది టీకాలు వేయించుకునేందుకు ఇప్పటికీ తటపటాయిస్తున్నారు. అవసరాలేమిటి? ఉత్పత్తి ఎంత? 2011 నాటి జనాభా లెక్కల ప్రకారం దేశంలో టీకాకు అర్హులైన వారు దాదాపు 95 కోట్ల మంది ఉన్నారని ప్రభుత్వం లెక్క కట్టింది. ఇప్పటివరకూ వీరిలో 11 శాతం మందికి రెండు డోసుల టీకాలు పడ్డాయి. అంటే.. ఇప్పటివరకూ ఒక డోసు వేసుకున్న 40 కోట్ల మందితోపాటు ఒక టీకా కూడా తీసుకోని 44 కోట్ల మందికి కలిపి దాదాపు 130 కోట్ల టీకాలు అవసరమవుతాయి. డిసెంబర్ నాటికల్లా మిగిలిన వారందరికీ టీకాలు ఇవ్వాలంటే కొంచెం అటు ఇటుగా నెలకు 29 కోట్ల టీకాలు అందుబాటులో ఉండాలి. ప్రస్తుతం దేశంలో టీకా ఉత్పత్తి 12 నుంచి 13 కోట్లకు మించి లేదు. భారత్ బయోటెక్ తయారు చేస్తున్న కోవాగ్జిన్ ఉత్పత్తిలో నాణ్యత పరమైన సమస్యలు ఎదురయ్యాయని, ఫలితంగా ముందుగా అనుకున్న స్థాయిలో ఉత్పత్తి జరగలేదని టీకా కార్యక్రమంపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీకి చెందిన ఎన్కే ఆరోరా ఇటీవలే తెలపడం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం. ఆగస్టు – డిసెంబర్ మధ్యకాలంలో 40 కోట్ల కోవాగ్జిన్ టీకాలు అందుబాటులోకి వస్తాయని కేంద్రం మే నెలలోనే ప్రకటించింది. అయితే జనవరి –జూలై మధ్యకాలంలో సరఫరా చేసేందుకు అంగీకరించిన ఎనిమిది కోట్ల టీకాల్లోనూ భారత్ బయోటెక్ ఇందులో సగం కూడా అందించలేదని సమాచారం. కోవీషీల్డ్ తయారు చేస్తున్న సీరమ్ ఇన్స్టిట్యూట్ ప్రస్తుతం నెలకు 11 నుంచి 12 కోట్ల టీకాలు ఉత్పత్తి చేస్తోంది. కొత్త టీకాలు కొన్నింటికి అనుమతులిచ్చినా వాటి ఉత్పత్తి లేదా సరఫరా ఎప్పుడు మొదలవుతుందో తెలియని పరిస్థితుల్లో అనుకున్న సమయానికి టీకా కార్యక్రమం పూర్తవడం కష్టసాధ్యం! అందుబాటులో ఐదు టీకాలు.. దేశంలో కోవాగ్జిన్, కోవిషీల్డ్లతో టీకా కార్యక్రమం మొదలైన విషయం తెలిసిందే. అయితే కొంత కాలం తరువాత రష్యా తయారు చేసిన స్పుత్నిక్–వీ వినియోగానికి ప్రభుత్వం అనుమతులిచ్చింది. అయితే స్థానికంగా తయారీలో కొన్ని సమస్యలు ఎదురు కావడంతో వీటిని రష్యా నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. ఇది జాప్యానికి దారితీసింది. తాజా సమాచారం ప్రకారం స్పుత్నిక్–వీ స్థానిక ఉత్పత్తి వచ్చే నెలకు గానీ ప్రారంభమయ్యే అవకాశం లేదు. రెండు నెలల క్రితం కేంద్ర ప్రభుత్వం మోడెర్నా వ్యాక్సిన్ అత్యవసర వాడకానికి అనుమతులు జారీ చేసినా... న్యాయపరమైన రక్షణ కల్పించాలన్న కంపెనీ డిమాండ్కు ప్రభుత్వం ఒప్పుకోకపోవడంతో ఇప్పటివరకూ ఒక్క టీకా కూడా పడలేదు. తాజాగా అమెరికన్ కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్ టీకాకూ (సింగిల్ డోస్) ప్రభుత్వం అనుమతిచ్చింది. కానీ.. ఈ టీకాల వాడకం ఎప్పుడు మొదలవుతుందో తెలియదు. ఇదిలా ఉండగా.. జైడస్ క్యాడిల్లా జైకోవ్–డీ టీకాతోపాటు భారత్లో తయారైన మొట్టమొదటి ఎంఆర్ఎన్ఏ వ్యాక్సీన్ ‘హెచ్జీసీఓ19’, భారత్ బయోటెక్ తయారు చేస్తున్న నాసల్ వ్యాక్సిన్లు మానవ ప్రయోగాల దశలో ఉన్నాయి. ఇవే కాకుండా... అమెరికన్ కంపెనీ తయారు చేస్తున్న నోవావ్యాక్స్ టీకాను భారత్లో కోవావ్యాక్స్ పేరుతో తయారు చేసేందుకు సీరమ్ ఇన్స్టిట్యూట్ ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఆగస్టు – డిసెంబర్ మధ్యకాలంలో దేశంలో పంపిణీ అయ్యే టీకాల జాబితాలో కోవావ్యాక్స్ను కూడా చేర్చడాన్ని బట్టి చూస్తే దీనికి త్వరలోనే అత్యవసర అనుమతులు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అగ్రరాజ్యం అమోరికా, ఇతర జీ7 సభ్యదేశాలు ఇస్తామన్న టీకాలు న్యాయపరమైన చిక్కుల కారణంగా ఇప్పటికీ అందలేదు. –నేషనల్ డెస్క్, సాక్షి -
ఆ విద్యార్థులకు సీరం సీఈవో ఊరట
న్యూఢిల్లీ: విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్తున్న విద్యార్థులకు రూ.10 కోట్ల ఆర్థికసాయం చేయనున్నట్లు వ్యాక్సిన్ల తయారీ సంస్థ సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో, సంస్థ అధిపతి అదార్ పూనావాలా గురువారం ప్రకటించారు. ఇక్కడి నుంచి వెళ్లే భారతీయ విద్యార్థులు కొన్ని దేశాల్లో అక్కడికెళ్లాక క్వారంటైన్లో ఉండాల్సిన పరిస్థితులున్నాయి. క్వారంటైన్లో భాగంగా వసతి, భోజనం తదితర ఖర్చులు విద్యార్థులే భరించాలి. వీరికి ఆర్థికసాయం చేసే నిమిత్తం రూ.10 కోట్లు కేటాయించినట్లు పూనావాలా చెప్పారు. ఆర్థికసాయం కోరే విద్యార్థులు ఈ లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని పూనావాలా గురువారం తన ట్విట్టర్ ఖాతాలో ఒక ట్వీట్ చేశారు. భారత్లో కోవిషీల్డ్ కోవిడ్ టీకా తీసుకున్న విద్యార్థులు తమ దేశంలో క్వారంటైన్లో ఉండాల్సిన పనిలేదని 16 యూరోపియన్ దేశాలు జూలైలో ప్రకటించాయి. కానీ, ఇంకొన్ని దేశాలు క్వారంటైన్ కాలం పూర్తయ్యాకే దేశ భూభాగంలోకి అనుమతిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆర్థికసాయానికి పూనావాలా ముందుకొచ్చారు. -
కోవిషీల్డ్ రూ.205.. కోవాగ్జిన్ రూ.215..
న్యూఢిల్లీ: 66 కోట్ల డోసుల కోవిషీల్డ్,కోవాగ్జిన్ వ్యాక్సిన్ల కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం ఆర్డర్ పెట్టిందని అధికారులు వెల్లడించారు. వీటిలో 37.5 కోట్ల కోవిషీల్డ్ డోసులను సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి, 28.5 కోట్ల కోవాగ్జిన్ డోసులను భారత్ బయోటెక్ నుంచి కేంద్ర ఆరోగ్య శాఖ కొనుగోలు చేసింది. ఇవి ఆగస్టు నుంచి డిసెంబర్లోగా కేంద్రానికి చేరేలా ఉత్పత్తి ఏర్పాట్లను ఆయా కంపెనీలు చేపట్టనున్నాయి. కేంద్రం కొనుగోలు చేసిన రేట్ల ప్రకారం ఒక్కో డోసు కోవిషీల్డ్ టీకా ధర రూ. 205, కోవాగ్జిన్ రూ. 215గా ఉండనుంది. పన్నులు కలుపుకుంటే కోవిషీల్డ్ ధర రూ. 215.25, కొవాగ్జిన్ ధర రూ. 225.75గా ఉండనుంది. జూన్ నుంచి అమల్లోకి వచ్చిన నూతన వ్యాక్సిన్ విధానం కారణంగా టీకాల రేట్లు పెరిగాయని అధికారులు తెలిపారు. -
కొవిషీల్డ్ వ్యాక్సిన్ విషయంలో కొత్త ట్విస్ట్
న్యూఢిల్లీ: గ్రీన్ పాసుల జారీ విషయంలో ఈయూకు భారత్కు మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఈయూ అప్రూవల్కి కొంత టైం పట్టొచ్చని సీరమ్ సీఈవో అదర్ పూనావాలా ప్రకటించడం, కొవిషీల్డ్కు ఈయూలోని కొన్ని దేశాలు పరిమితులతో అనుమతించడంతో ఈ విషయం చల్లబడింది. అయితే ఈ వ్యవహారంలో ఇప్పుడో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. కొవిషీల్డ్ ఆథరైజేషన్ కోసం సీరమ్ ఇండియా అసలు ఈయూ మెడికల్ బాడీకి రిక్వెస్ట్ అప్లికేషన్ పంపలేదని తేలింది!. ఈ మేరకు యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ ట్విటర్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేసింది. కొవిడ్ వ్యాక్సిన్ల తయారీదారులు ఫార్మాలిటీకి ఒక మార్కెటింగ్ ఆథరైజేషన్ అప్లికేషన్ పంపాల్సి ఉంటుందని, కానీ, సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసిన కొవిషీల్డ్కు సంబంధించి ఇంతవరకు ఎలాంటి అప్లికేషన్ మాకు అందలేద’ని స్పష్టం చేసింది. అలాగే ఈయూ దేశాల వ్యాక్సిన్లు, మెడిసిన్స్కు సంబంధించి మాత్రమే అంతిమ నిర్ణయాలు తమ చేతుల్లో ఉంటాయని ఈఎంఏ స్పష్టం చేసింది. For the #COVID19vaccine Covishield to be evaluated for use in the EU, the developer needs to submit a formal marketing authorisation application to EMA, which to date has not been received. #EMAPresser — EU Medicines Agency (@EMA_News) July 15, 2021 ఇదిలా ఉంటే ఇండియన్ వెర్షన్ ఆస్ట్రాజెనెకా ‘కొవిషీల్డ్’కు ఈయూ మెడిసిన్స్ ఏజెన్సీ మొదటి నుంచి డిజిటల్కొవిడ్ సర్టిఫికెట్(గ్రీన్ పాస్) ఇవ్వడంలేదు. తయారీలో స్వల్ఫ తేడాల వల్ల వ్యాక్సిన్ తుది ఫలితం వేరుగా ఉంటుందని, కాబట్టి, తమ అనుమతులు తప్పనిసరని ఈయూ ఇదివరకే స్పష్టం చేసింది. ఆ అనుమతుల కోసమే సీరం ఇండియా ఒక అప్లికేషన్ పంపాల్సి ఉండగా.. ఇంతవరకు పంపలేదని ఇప్పుడు తెలిసింది. దీంతో ఆయా దేశాలకు వెళ్లే భారత ప్రయాణికులు(కొవిషీల్డ్ తీసుకున్నవాళ్లు) కఠిన క్వారంటైన్ ప్రొటోకాల్స్ను పాటించాల్సి ఉంటుంది. అంతేకాదు ఈయూలోని కొన్ని దేశాలు అనుమతించకపోయిన ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి ఆల్రెడీ అప్లికేషన్ పంపామని ప్రకటించిన సీరమ్ ఈ వ్యవహారంపై ఎలా స్పందిస్తుందో చూడాలి. -
Covovax: పిల్లలపై క్లినికల్ ట్రయల్స్కు కేంద్రం నో
న్యూడిల్లీ: రెండు నుంచి 17 ఏళ్లలోపు ఉన్న పిల్లలపై కొవోవాక్స్ క్లినికల్ ట్రయల్స్ ఇప్పుడే వద్దని నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. ఈ మేరకు పిల్లలపై టీకా రెండు, మూడో దశ ట్రయల్స్ నిర్వహించడానికి సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు ఎలాంటి అనుమతి ఇవ్వవద్దని నిపుణుల కమిటీ డీసీజీఐకి సిఫార్సు చేసింది. కొవొవాక్స్ క్లినికల్ ట్రయల్స్ను రెండు నుంచి 17ఏళ్లలోపు ఉన్న 920 మంది పిల్లలపై జరిపేందుకు సీరం ఇన్స్టిట్యూట్ సోమవారం డీసీజీఐ అనుమతి కోరిన విషయం తెలిసిందే. 12 నుంచి 17 ఏళ్ల లోపున్న460 మందిపై, రెండు నుంచి 11ఏళ్లలోపున్న460 మంది చిన్నారులపై దేశవ్యాప్తంగా 10 చోట్ల ట్రయల్స్ చేపట్టేందుకు అనమతి ఇవ్వాలని సీరం కోరింది. తాజాగా ఈ దరఖాస్తుపై చర్చించిన నిపుణుల బృందం.. కోవోవాక్స్ ఇప్పటివరకు ఏ దేశంలోనూ అనుమతి పొందనలేదనే విషయాన్ని గుర్తించింది. దీంతో పిల్లలపై క్లినికల్స్ ట్రయల్స్కు ముందు ప్రస్తుతం పెద్దలపై జరుగుతున్న కొవావాక్స్ క్లినికల్ ట్రయల్స్కు సంబంధించిన భద్రత, ఇమ్యునోజెనిసిటీ డేటాను సమర్పించాలని సీరంను ఆదేశించింది. ఆ ఫలితాలను పరిశీలించిన తర్వాతే చిన్నారులపై ప్రయోగాల అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటామని చెప్పినట్లు తెలుస్తోంది. కాగా అమెరికాకు చెందిన నొవావాక్స్ అభివృద్ధి చేసిన ఈ కరోనా వ్యాక్సిన్ను భారత్లో 'కొవొవాక్స్' పేరుతో ఉత్పత్తి చేసేందుకు సీరమ్ సంస్థ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మార్చిలో 18ఏళ్లు పైబడినవారిపై టీకా క్లినికల్ ట్రయల్స్ను కంపెనీ ప్రారంభించింది. జులై నుంచి చిన్నారులపై కూడా ప్రయోగాలు జరపాలని సీరమ్ భావించింది. ఇప్పటికే సీరమ్ కొవిషీల్డ్ టీకాను ఉత్పత్తి చేస్తోంది. చదవండి: అంతర్జాతీయ విమానాల రద్దు పొడిగింపు Corona: భారత్లో స్వల్పంగా పెరిగిన కేసులు -
కోవీషీల్డ్కు గ్రీన్ పాస్ షాక్! సీరం సీఈవో స్పందన
సాక్షి, ముంబై: కరోనా మహమ్మారిపై పోరులో భాగంగా వ్యాక్సిన్ తీసుకున్న ధృవీకరణ పత్రాలను చాలా దేశాలు తప్పనిసరి చేసాయి. అయితే మన దేశంలో తయారైన కోవీషీల్డ్ టీకా తీసుకుని విదేశాలకు పయనం కాబోతున్నవారికి ఎదురవుతున్న గ్రీన్ పాస్ ఇబ్బందులపై శుభవార్త. కోవీషీల్డ్ వ్యాక్సిన్ తీసుకుని ఈయూ దేశాలకు వెళుతున్న విమాన ప్రయాణీకులకు ఇబ్బందులపై సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) సీఈవో అదార్ పూనావాలా స్పందించారు. కోవీషీల్డ్ కారణంగా ప్రయాణ సమస్యలను ఎదుర్కొంటున్న భారతీయుల సమస్యలు తన దృష్టికి వచ్చాయని పూనావాలా ట్వీట్ చేశారు. ఈ త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తామని ఆందోళన అవసరం లేదని హామీ ఇచ్చారు. (DRDO: 2-డీజీ డ్రగ్, కమర్షియల్ లాంచ్ ) కోవీషీల్డ్ టీకా తీసుకున్న చాలామంది భారతీయులు ఎదుర్కొంటున్న విదేశీ ప్రయాణ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నానంటూ భరోసా ఇచ్చారు. దీనిని ఆయా దేశాల అత్యున్నత అధికారులు, రెగ్యులేటర్లు, దౌత్య అధికారులతో చర్చిస్తున్నామని తెలిపారు. దీనికి త్వరలోనే పరిష్కారం లభించనుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. గ్రీన్ పాస్ నుంచి ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ కోవిషీల్డ్ను యూరోపియన్ యూనియన్ మినహాయించిన తరువాత ఈ పరిణామం చోటు చేసుకుంది. పూణేకు చెందిన సీరం దేశీయంగా తయారు చేస్తున్న కోవిషీల్డ్ టీకా తీసుకున్న ప్రయాణికులు యూరోపియన్ యూనియన్ (ఈయు) ‘గ్రీన్ పాస్’కు కోవిడ్-19 వ్యాక్సిన్ల జాబితా నుంచి తొలగించింది. ప్రస్తుతం, ఫైజర్, మెడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ , వాక్స్ జెర్విరా ఈ నాలుగు టీకాలను యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ ఆమోదించింది. I realise that a lot of Indians who have taken COVISHIELD are facing issues with travel to the E.U., I assure everyone, I have taken this up at the highest levels and hope to resolve this matter soon, both with regulators and at a diplomatic level with countries. — Adar Poonawalla (@adarpoonawalla) June 28, 2021 -
జూన్లో 10.8 కోట్ల కోవిషీల్డ్ టీకాలు ఉత్పత్తి చేసిన సీరమ్
న్యూఢిల్లీ: ముందుగా హామీ ఇచ్చిన మేరకు సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) జూన్ నెలలో ఇప్పటిదాకా 10.8 కోట్ల కోవిషీల్డ్ డోసులను ఉత్పత్తి చేసి భారత ప్రభుత్వానికి అందజేసింది. జూన్ 21 నుంచి 18 ఏళ్ల పైబడిన వారందరికీ కేంద్ర ప్రభుత్వమే ఉచిత టీకాలను అందజేస్తున్న విషయం తెలిసిందే. 21న రికార్డు స్థాయిలో 86 లక్షల పైచిలుకు డోసులను వేసినప్పటి నుంచీ దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగం పుంజుకుంది. ఆరు రోజులుగా సగటున 69 లక్షల టీకాలు ఇస్తున్నారు. సీరమ్ జూన్లో ఇప్పటిదాకా 45 బ్యాచుల్లో 10.8 కోట్ల టీకా డోసులను కసౌలీ (హిమాచల్ప్రదేశ్)లోని సెంట్రల్ డ్రగ్స్ ల్యాబోరేటరీకి పంపింది. అక్కడ ప్రతిబ్యాచ్ను పరీక్షించిన తర్వాత... టీకాలను దేశవ్యాప్తంగా సరఫరా చేస్తారు. చదవండి: 5 నిమిషాల వ్యవధిలో మహిళకు కోవాగ్జిన్, కోవిషీల్డ్.. వైరల్: టూర్ బోటుతో 400 డాల్ఫిన్ల పోటీ.. 95 మిలియన్ల వ్యూస్! -
Novavax సెప్టెంబరుకే, పిల్లలపై ట్రయల్స్: సీరం కీలక ప్రకటన
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో అతి త్వరలోనే మరో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకొచ్చే విషయంలో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలో కోవిడ్-19 వ్యాక్సిన్ 'నోవావాక్స్' క్లినికల్ ట్రయల్స్ పూర్తయ్యే దశలో ఉన్నాయని, ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు సీరం సీఈవో అదార్ పూనావల్లా తెలిపారు. అంతేకాదు పిల్లలపై వ్యాక్సిన్ ట్రయల్స్ ప్రారంభించాలని యోచిస్తున్నట్టు కూడా వెల్లడించారు. నోవావాక్స్ టీకా ఒక మాదిరి నుంచి తత్రీవమైన వైరస్ బాధితుల్లో 100 శాతం రక్షణనిస్తోందని, సగటున నోవావాక్స్ వ్యాక్సిన్ 90 శాతం సమర్ధవంతమైందని పూనావల్లా వెల్లడించారు. అయితే ,గ్లోబల్ ట్రయల్స్ డేటా ఆధారంగా తాము లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందన్నారు.నవంబర్ నాటికి ఇది అందుబాటులోకి రానుందని భావిస్తున్నామన్నారు. రెగ్యులేటరీ ఆమోదం పొందితే కంపెనీ సెప్టెంబరు నాటికి నోవావాక్స్ ఉత్పత్తిని ప్రారంభిస్తుందని చెప్పారు. అలాగే పిల్లలకు టీకా అందుబాటులోకి తీసుకొచ్చే క్రమంలో నోవావాక్స్ క్లినికల్ ట్రయల్స్ ను జూలైలో ప్రారంభించాలని యోచిస్తున్నామనీ దీనిపై త్వరలోనే డ్రగ్ రెగ్యులేటరీ అనుమతినికోరనున్నామని పూనవల్లా తెలిపారు. కాగా నోవావాక్స్ అన్ని రకాల వేరియంట్లపై సమర్ధవంతంగా పనిచేస్తుందని కలుసుకుంది, నోవావాక్స్ ఇటీవల (జూన్ 14న) ప్రకటనలో తెలిపింది. అమెరికా, మెక్సికోలోని 119 సైట్లలో 29,960 మందిపై ట్రయల్స్ చేసినట్టు పేర్కొంది. నోవావాక్స్ టీకాలను సులువుగా నిల్వ చేయవచ్చు. రవాణా కూడా ఈజీగా ఉంటుందని నోవావాక్స్ ప్రెసిడెంట్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ స్టాన్లీ సీ ఎర్క్ వెల్లడించిన సంగతి తెలిసిందే. చదవండి: ట్విటర్కు మరోషాక్, కేసు నమోదు -
వ్యాక్సిన్ల కోసం కంపెనీలకు భారీ ఆర్డర్ ఇచ్చిన కేంద్రం..!
సాక్షి, న్యూఢిల్లీ: దేశ టీకా విధానంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం రోజు కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అర్హులైన దేశ ప్రజలందరికీ కేంద్రమే ఉచితంగా కోవిడ్ టీకా అందిస్తుందని తెలిపారు. దేశవ్యాప్తంగా 18 ఏళ్లు పైబడిన వారందరికి జూన్ 21 నుంచి ఉచితంగా టీకా అందించనున్నట్లు ప్రకటించారు. కాగా దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ కంపెనీలకు భారీ ఆర్డరును ఇచ్చింది. వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా పుణెకు చెందిన సీరం సంస్థకు 25 కోట్ల కోవిషీల్డ్ డోసులను ఆర్డర్ ఇచ్చింది. దాంతో పాటుగా భారత్ బయోటెక్ కంపెనీకి 19 కోట్ల కోవాగ్జిన్ డోసులను కేంద్ర ప్రభుత్వం ఆర్డర్ చేసింది. ఈ వ్యాక్సిన్ కంపెనీలకు అడ్వాన్స్ కింద 30 శాతం మొత్తాన్ని కేంద్రం చెల్లించింది. కాగా బయోలాజికల్-ఈ కంపెనీకి చెందిన కార్బివాక్స్ డోసులను 30 కోట్ల మేర ఆర్డర్ చేసింది. బయోలాజికల్-ఈ టీకాలు సెప్టెంబర్ కల్లా అందుబాటులోకి రానున్నాయి. చదవండి: వ్యాక్సిన్పై సందిగ్ధత తొలగించారని ప్రశంసలు -
వ్యాక్సిన్ల ఖర్చు ఎంతైనా రెడీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 18 ఏళ్ల వయసు దాటిన ప్రతి ఒక్కరికీ ఉచితంగానే వ్యాక్సిన్ వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అవసరమైన మేర వ్యాక్సిన్లను సమకూర్చుకునేందుకు గ్లోబల్ టెండర్ల ద్వారా విశ్వప్రయత్నాలు చేస్తోంది. కేంద్రం ఇచ్చే కేటాయింపుల్లోనూ ఇప్పటికే భారీగా కొనుగోలు చేసేందుకు కృషి చేస్తోంది. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చే వ్యాక్సిన్ కోసం ఎప్పటికప్పుడు చెల్లింపులు చేస్తూ మరిన్ని డోసులు పొందేలా ప్రయత్నాలు సాగిస్తోంది. ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ వేయాలన్న ధ్యేయంతో ఎంత ఖర్చు చేసేందుకైనా వెనుకాడటం లేదు. దేశంలో ఏ రాష్ట్రం చేయనివిధంగా ఒకేరోజు 6.28 లక్షలు టీకాలు వేసి మన రాష్ట్రం రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఇదిలావుంటే.. ఇప్పటివరకూ రాష్ట్ర ప్రభుత్వం రూ.125,63,97,450 విలువైన వ్యాక్సిన్ డోసుల కోసం ఆర్డరు పెట్టింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి వ్యాక్సిన్ సరఫరా చేస్తున్న భారత్ బయోటెక్, సీరం ఇన్స్టిట్యూట్ లైఫ్ సైన్సెస్ కంపెనీలకు ఆర్డర్లు పెట్టారు. ఇప్పటికే రూ.61 కోట్ల వరకు చెల్లింపు వ్యాక్సిన్ల కోసం ఇప్పటికే రూ.61 కోట్ల వరకూ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. మే నెలలో సరఫరా అయిన వ్యాక్సిన్కు రూ.49 కోట్లు అడ్వాన్స్ చెల్లింపులు జరిపారు. ఆ మొత్తం చెల్లించిన తరువాతే రాష్ట్రానికి మే నెలలో వ్యాక్సిన్ డోసులు వచ్చాయి. మరో రూ.64 కోట్లను చెల్లించేందుకు సిద్ధంగా ఉంది. ఆర్డరు పెట్టిన మేరకు వ్యాక్సిన్ రెడీ కాగానే సంబంధిత సంస్థలు ప్రభుత్వానికి సమాచారం ఇస్తాయి. వెంటనే చెల్లింపులు చేసి వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుందని ఏపీఎంఎస్ఐడీసీ (రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ) అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యాక్సిన్ కొనుగోలుకు ఆసక్తి చూపలేదని కొందరు రాజకీయ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు అవాస్తవమని ఆరోగ్య శాఖకు చెందిన ఓ అధికారి పేర్కొన్నారు. ఇప్పటివరకూ జూన్ వరకే పర్చేజ్ ఆర్డర్లు పెట్టామని.. జూలై కేటాయింపులను బట్టి మళ్లీ ఆర్డర్లు పెడతామని ఆ అధికారి తెలిపారు. -
స్పుత్నిక్ వీ: సీరంకు డీసీజీఐ గ్రీన్ సిగ్నల్
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా సెకండ్వేవ్తో అల్లాడిపోతున్న ప్రజలకు కేంద్రం మరో ఊరటనిచ్చింది. రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ తయారీకి అతిపెద్ద టీకా తయారీదారు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ)కు భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) అనుమతినిచ్చింది. మహారాష్ట్ర పుణేలోని హడాస్పార్ తయారీ కేంద్రంలో ఈ టీకాను పరీక్షించి, విశ్లేషించి, తయారు చేస్తుందని అధికారిక వర్గాలు తెలిపాయి. ఇందుకు సీరంకు ప్రాథమిక అనుమతినిచ్చామనీ, తయారీకి కొన్ని నెలలు పడుతుందని వెల్లడించింది. అయితే ఈ టీకాలను విక్రయించుకునేందుకు సీరం అనుమతి లేదని వెల్లడించాయి. దేశీయంగా అదర్ పూనావాలా నేతృత్వంలోని సీరం ఆక్స్ ఫర్డ్ ఆస్ట్రాజెనికా టీకా కోవీషీల్డ్ను తయారు చేస్తోంది. వ్యాక్సిన్ తయారీకి రష్యాలోని మాస్కోలో ఉన్న గమాలియా పరిశోధనా సంస్థ, సీరంతో జత కట్టింది. దీనికి సంబంధించిన పత్రాలను ఆ కంపెనీ ఇటీవల డీసీజీఐకి దరఖాస్తు చేసుకుంది. వ్యాక్సిన్ తయారీకి డీసీజీఐ అనుమతి ఇవ్వడంతో జెనెటిక్ మానిపులేషన్ రివ్యూ కమిటీ (ఆర్సీజీఎం) సీరమ్కు అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. సెల్ బ్యాంక్ను దిగుమతి చేసుకోవడం, వైరస్ స్టాక్ వివరాలను ఎలా సేకరించి భద్రపరుస్తారన్న విషయం ఆర్సీజీఎంకు తెలపాలి. అయితే ఈ అనుమతుల కోసం సీరమ్ గత నెల 18నే ఆర్సీజీఎమ్కు దరఖాస్తు పెట్టుకుంది. కాగా భారతదేశంలో అందుబాటులో ఉన్న కోవాగ్జిన్, కోవీషీల్డ్ వ్యాక్సిన్లతో పోలిస్తే స్పుత్నిక్ వీ టీకా 91.6 శాతం సామర్థ్యం ఉందని గమాలియా ఇదివరకే ప్రకటించింది. చదవండి: vaccine: మినహాయింపులపై సీరం కీలక వ్యాఖ్యలు -
vaccine: మినహాయింపులపై సీరం కీలక వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: డిసెంబర్ చివరి నాటికి అందరికీ కరోనా వ్యాక్సిన్లు వేయాలన్న లక్ష్యంలో భాగంగా విదేశీ వ్యాక్సిన్లపై కేంద్రం తీసుకున్న నిర్ణయంపై కోవిషీల్డ్ టీకా తయారీదారు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ)స్పందించింది. వ్యాక్సిన్ తయారీదారులందరికీ ఒకే సూత్రాలు వర్తింప చేయాలని అదర్ పూనావాలా కేంద్రాన్ని కోరారు. నష్టపరిహారం విషయంలో విదేశీ సంస్థలు రక్షణ పొందితే సీరం మాత్రమే కాదు, అన్ని దేశీయ టీకా కంపెనీలకు దీనిని వర్తింపజేయాలఅని సీరం వర్గాలు పేర్కొన్నట్టు తెలుస్తోంది. ఇండెమ్నిటీ బాండ్ ఇండెమ్నిటీ బాండ్ అనేది సెక్యూరిటీ బాండ్ లాంటిదే. వ్యాక్సిన్ ట్రయల్స్ సందర్భంగా ఏదైనా జరిగితే కేంద్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని, న్యాయపరమైన సమస్యలు రాకుండా చూసుకోవాలని తేల్చి చెప్పింది. ఈ హామీతో ఇండెమ్నిటీ బాండ్ ఇవ్వాలని మోడెర్నా, ఫైజర్ వంటి విదేశీ టీకా సంస్థలు కోరుతున్నాయి. కాగా వ్యాక్సినేషన్ను వేగవంతం చేసే క్రమంలో కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే విదేశాల్లో ఇప్పటికే అనుమతి పొందిన వ్యాక్సిన్లను మన దేశంలో వాడేందుకు బ్రిడ్జి ట్రయల్స్ అక్కర లేదంటూ విదేశీ టీకాలకు లైన్ క్లియర్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఇండెమ్నిటీ బాండ్, పరిహారాన్ని కూడా తామే చెల్లించే అవకాశాలను కూడా ప్రకటించింది. చదవండి: Vaccination: ఊరట, త్వరలో మరో స్వదేశీ వ్యాక్సిన్ Vaccination : గుడ్న్యూస్ చెప్పిన డీసీజీఐ -
తప్పంతా మీదే.. ముందు చూపు లేకుండా వ్యాక్సినేషన్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రజలకు టీకాలు అందించే విషయంలో ప్రభుత్వం ముందు చూపు లేకుండా వ్యవహరించడం వల్లనే వ్యాక్సిన్ల కొరత సమస్య ఎదురైందని సీరమ్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సురేశ్ జాదవ్ ఆరోపించారు. హీల్హెల్త్ సంస్థ నిర్వహించిన సమ్మిట్లో ఆయన మాట్లాడుతూ.. ‘కేంద్రం తొలుత మూడు కోట్ల మంది ఫ్రంట్లైన్ వారియర్లకు వ్యాక్సిన్లు ఇవ్వాలని నిర్ణయించింది. దానికి తగ్గట్టే మేము ప్రభుత్వానికి 6 కోట్ల డోసుల టీకాలు సరఫరా చేశాం. ఆ తర్వాత మమ్మల్ని సంప్రదించకుండానే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 45 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్లు ఇస్తామని కేంద్రం ప్రకటించింది. కోవీషీల్డ్ వ్యాక్సిన్ల ఉత్పత్తి పరిమితమే అని తెలిసి కూడా 45 ఏళ్లు పైబడిన వారందరికీ టీకాలు ఇవ్వడం మొదలుపెట్టారు. దీంతో ఉత్పత్తి అవుతున్న వ్యాక్సిన్లకు... టీకాలు తీసుకుంటున్న జనాలకు మధ్య పొంతన లేకుండా పోయింది. దాని ఫలితమే నేడు టీకాల కొరతకు దారి తీసింది’ అన్నారు. గుణపాఠం ప్రస్తుతం ఎదుర్కొంటున్న వ్యాక్సిన్ల కొరత మనకో గుణపాఠం లాంటిందన్నారు సురేశ్ జాదవ్. ఉత్పత్తి సామర్థ్యం, నిల్వల ఆధారంగా వ్యాక్సినేషన్ చేయడం సరైన పద్దతని అన్నారు. దీని కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ కొన్నినియమాలు రూపొందించింది. వాటిని పాటించాలన్నారు. ఇక కరోనాను ఎదుర్కొవాలంటే టీకా ఒక్కటే పరిష్కారమని తెలిసి కూడా కొందరు వ్యాక్సినేషన్ చేయించుకోమంటే సైడ్ ఎఫెక్ట్స్ అంటూ సందేహాలు వ్యక్తం చేస్తుంటారని సురేశ్ జాదవ్ విస్మయం వ్యక్తం చేశారు. -
వ్యాక్సిన్ల కొనుగోలుకు రూ.50 కోట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వ్యాక్సినేషన్ను వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని చెప్పారు. కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాల కొనుగోలుకు సీరం ఇన్స్టిట్యూట్, భారత్ బయోటెక్ కంపెనీలకు రూ.50 కోట్లకుపైగా చెల్లించాలని ఏపీ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎంఎస్ఐడీసీ)ను ఆదేశించినట్లు తెలిపారు. ఆయన శుక్రవారం మాట్లాడుతూ కోవిïÙల్డ్ ఒక డోస్ రూ.300, టాక్స్ 5 శాతంతో కలిపి రూ.315, కోవాగ్జిన్ ఒక డోస్ రూ.400, టాక్స్ 5 శాతంతో కలిపి రూ.415 వంతున చెల్లించనున్నట్లు వివరించారు. -
దేశ ప్రజలే మాకు ముఖ్యం: సీరం
సాక్షి, న్యూఢిల్లీ: దేశ ప్రజల ప్రాణాలు పణంగా పెట్టి విదేశాలకు టీకాలు ఎగుమతి చేయలేదని కోవిషీల్డ్ తయారీదారు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చీఫ్ అదర్ పూనావాలా తెలిపారు. కరోనా కట్టడి కోసం దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించినప్పటికి టీకాల కొరత వల్ల అది అనుకున్న మేర ముందుకు సాగడం లేదు. 45 ఏళ్ల పైబడిన వారికి రెండో డోస్ టీకా ఇవ్వడం పూర్తవ్వలేదు. ఇక పలు రాష్ట్రాల్లో మూడో దశ వ్యాక్సినేషన్ కార్యక్రమం ఇంకా ప్రారంభం కాలేదు. ఈ క్రమంలో వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్న కంపెనీలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్లో వ్యాక్సినేషన్పై సీరం సంస్థ మంగళవారం ఓ ప్రకటనను విడుదల చేసింది. దేశ ప్రజల ప్రాణాలు పణంగా పెట్టి తాము విదేశాలకు టీకాలు ఎగుమతి చేయలేదని తెలిపింది. దేశంలో వ్యాక్సినేషన్కు సహకరించేందుకు కట్టుబడి ఉన్నట్లు లేఖలో తెలిపింది. ఇప్పటివరకు 20 కోట్ల టీకా డోసులు సరఫరా చేసినట్లు వెల్లడించింది. భారత్ వంటి దేశంలో 2,3 నెలల్లో వ్యాక్సినేషన్ చేయలేమన్నది. భారత్లో వ్యాక్సినేషన్లో అనేక సవాళ్లు ఉన్నట్లు తెలిపింది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశాల్లో భారత్ ఒకటి అని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్కు 2 నుంచి 3 ఏళ్లు పడుతుందని సీఎం తెలిపింది. అమెరికా కంపెనీల కంటే తమకు 2 నెలలు ఆలస్యంగా అనుమతులు వచ్చాయన్నది. ఉత్పత్తిపరంగా ప్రపంచంలోనే తమది మూడో స్థానమని.. ఈ ఏడాది చివరకు మాత్రమే విదేశాలకు టీకాలు సరఫరా చేస్తామని సీరం తెలిపింది. కరోనాపై యుద్ధానికి అంతా కలిసికట్టుగా పోరాడాలని సీరం పిలుపునిచ్చింది. చదవండి: యూకేకు 50 లక్షల డోసుల ఎగుమతికి ‘నో’ -
Vaccine: రక్త స్రావం, గడ్డకట్టడం భారత్లో చాలా తక్కువ
న్యూఢిల్లీ: భారత్లో కోవిషీల్డ్ టీకా వేసుకున్న వారిలో కేవలం 26 మందిలో మాత్రమే రక్త స్రావం, రక్తం గడ్డకట్టడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనికా తయారు చేసిన టీకాలను.. ఇండియాలో సీరం సంస్థ కోవిషీల్డ్ పేరుతో పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆస్ట్రాజెనికా టీకాల వల్ల .. కొందరిలో రక్తం గడ్డకట్టినట్లు ఇటీవల కొన్ని వార్తలు వచ్చాయి. యూరోప్లో ఇలాంటి సమస్యలు తలెత్తిన కేసులు 20 వరకు నమోదు అయినట్లు రికార్డులు తెలిపాయి. కరోనా టీకా తీసుకున్న తర్వాత రక్తస్రావం, రక్తం గడ్డకట్టడం వంటి ఘటనలు భారత్లో అత్యంత తక్కువ అని నేషనల్ ఏఈఎఫ్ఐ (అడ్వెర్స్ ఈవెంట్ ఫాలోయింగ్ ఇమ్యూనైజేషన్) కమిటీ తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు సోమవారం నివేదిక సమర్పించింది. ఏప్రిల్ 3వ తేదీ వరకు ఇండియాలో 75,435,381 మందికి వ్యాక్సిన్లు ఇచ్చారని, దాంట్లో కోవీషీల్డ్ 650,819 మందికి, కోవాగ్జిన్ టీకాలను 6,784,819 మందికి ఇచ్చినట్లు నేషనల్ ఏఈఎఫ్ఐ తెలిపింది. భారత్లో వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టి తర్వాత 23 వేల సమస్యాత్మక కేసులను గుర్తించినట్లు.. కోవిడ్ పోర్టల్ ద్వారా దీని గురించి తెలిసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇక వీటిలో కేవలం 700 కేసులు మాత్రమే సీరియస్గా ఉన్నట్లు పేర్కొన్నది. అంటే పది లక్షల్లో 9.3 కేసులు మాత్రమే సమస్యాత్మకం అని గుర్తించినట్లు కమిటీ చెప్పింది. సుమారు 498 సీరియస్ కేసులను కమిటీ లోతుగా అధ్యయనం చేసింది. దాంట్లో 26 మందికి మాత్రం వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత రక్తం గడ్డకట్టినట్లు గుర్తించారు. కోవిషీల్డ్ తీసుకున్నవారిలో త్రాంబోఎంబోలిక్ కేసులు 0.61గా ఉన్నట్లు కమిటీ స్పష్టం చేసింది. ఇక కోవాగ్జిన్ టీకా తీసుకున్నవారిలో రక్తం గడ్డకట్టిన కేసులేవీ నమోదు కాలేదన్నది. రక్తం గడ్డకట్టే కేసులు ఇండియాలో అతి స్వల్పంగా నమోదు అయినట్లు ఏఈఎఫ్ఐ వెల్లడించింది. అది కేవలం 0.61గా ఉన్నట్లు చెప్పింది. దిలావుంటే, బ్రిటన్లో ఇది ప్రతి 10 లక్షల డోసులకు 4 కేసులు, జర్మనీలో ప్రతి 10 లక్షల డోసులకు కేవలం 10 కేసులు నమోదయినట్టు ఏఈఎఫ్ఐ కమిటీ వెల్లడించింది. ‘‘నేపథ్యం, శాస్త్రీయ కారణాలను పరిగణనలోకి తీసుకుంటే యూరోపియన్ సంతతికి చెందిన వారితో పోల్చితే దక్షిణ, ఆగ్నేయాసియా సంతతికి ఈ ప్రమాదం దాదాపు 70 శాతం తక్కువగా ఉందని సూచిస్తుంది’’ అని నివేదిక తెలిపింది. రక్తం గడ్డకట్టడం వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించి, వ్యాక్సిన్ భయాలను తొలగించాలని అధికారులకు కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, కండరాలు, గుండెల్లో నొప్పి, చర్మంపై దద్దుర్లు, కడుపునొప్పి వంటి లక్షణాలను పరిశీలించాలని తెలిపింది. గత నెలలో ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా మాట్లాడుతూ.. కోవిషీల్డ్ టీకా తీసుకున్నవారిలో రక్తం గడ్డకట్టడం అనేది చాలా అరుదుగా జరుగుతుందని తెలిపారు. ఇదిలావుంటే, కోవిడ్ టీకా తీసుకున్నవారిలో రక్తం గడ్డకట్టడం వంటి దుష్ప్రభావాలు ఎదురుకావడంతో డెన్మార్క్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ వంటి దేశాలు కోవిషీల్డ్ను నిషేధించాయి. దీనిపై ఐరోపా సమాఖ్య మెడికల్ ఏజెన్సీ దర్యాప్తు చేపట్టి కోవిషీల్డ్ సురక్షితమైందేనని, ప్రభావంతంగా పనిచేస్తుందని స్పష్టం చేసింది. చదవండి: Corona Vaccine: కోవాగ్జిన్ స్టాక్ లేదు.. కోవిషీల్డ్కు అర్హులు లేరు! -
అగ్ని ప్రమాదం: 25 లక్షల విలువైన వ్యాక్సిన్లు దగ్దం
భోపాల్ : భారత్లో కరోనా కేసులు, మరణాలు భారీ సంఖ్యలో పెరిగిపోతున్నాయి. ఓవైపు ఆసుపత్రుల్లో బెడ్స్, ఆక్సిజన్ దొరక్క కోవిడ్ భాదితులు అవస్థలు పడుతుంటే మరోవైపు దేశంలో వ్యాక్సిన్ కొరత ఏర్పడుతోంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మధ్యప్రదేశ్ ఇండోర్లోని భారత్ సీరమ్స్ అండ్ వ్యాక్సిన్స్ లిమిటెడ్లో ఆదివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కంపెనీ గోడౌన్లో నిల్వ ఉంచిన కరోనా మెడిసిన్స్, వ్యాక్సిన్తో పాటు బ్లాక్ ఫంగస్కు ఉపయోగించే మందులు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.ఇక ఈ ప్రమాదం వల్ల రూ. 25 లక్షల ఆస్తి నష్టం సంభవించినట్లు కంపెనీ యాజమాన్యం ప్రాథమికంగా నిర్ధారించింది. చదవండి: బళ్లారి పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం -
కోవీషీల్డ్ డోసుల గ్యాప్: పూనావాలా స్పందన
సాక్షి, న్యూఢిల్లీ: కోవీషీల్డ్ వ్యాక్సిన్ మోతాదుల మధ్య అంతరాన్ని పెంచడంపై సీరం సీఈఓ అదార్ పూనావాలా సానుకూలంగా స్పందించారు. కోవిషీల్డ్ వ్యాక్సిన్లను పుణేకు చెందిన అతిపెద్ద వ్యాక్సిన్ సంస్థ సీరం ఉత్పత్తి చేస్తోంది. తాజాగా వ్యాక్సిన్ డోసుల మధ్య విరామ కాలాన్ని ప్రస్తుతమున్న ఆరు నుంచి 8 వారాల నుంచి 12-16 వారాలకు పెంచడం మంచి నిర్ణయమని ఆదార్ పూనావాలా అన్నారు. టీకా సమర్థత, ఇమ్యునోజెనిసిటీ దృక్కోణంలో చూస్తే ప్రయోజనకరంగా ఉంటుందని వ్యాఖ్యానించారు.(మొదటి డోస్ తర్వాత కరోనా వస్తే.. వ్యాక్సిన్ ఎపుడు తీసుకోవాలి!) టీకా సామర్థ్యాన్ని, రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుందని, ఈ నిర్ణయం శాస్త్రీయంగా సరైందని పూనావల్లా చెప్పారు. పలు రాష్ట్రాలు వ్యాక్సిన్ల కొరతను ఎదుర్కొంటున్న తరుణంలో ఈ నిర్ణయం కోవిషీల్డ్ ఉత్పత్తిపై పడే ఒత్తిడిని తగ్గిస్తుందని అన్నారు. మరింత ఎక్కువమంది ప్రజలు మొదటి డోసును తీసుకోవడానికి కూడా ఇది ఉపకరిస్తుందని అంచనా. మొదట్లో రెండు డోసుల మధ్య విరామం నాలుగు నుంచి ఆరు వారాలు ఉండాలని నిర్దేశించారు. ఆ తరువాత అది 6 నుంచి 8 వారాలకు పెరిగింది. అయితే ఇటీవలి అధ్యయనం ప్రకారం రెండు డోసుల మధ్య అంతరం 12 నుంచి అంతకంటే ఎక్కువ విరామంలో ఇచ్చిన రెండు ప్రామాణిక మోతాదుల తరువాత టీకా సామర్థ్యం 81.3 శాతంగా ఉంది. 6 వారాల కన్నా తక్కువ ఉంటే ఇది 55.1 శాతం ఉంటుందని వెల్లడైంది. అదే బ్రిటన్ నుంచి అందిన ఆధారాల ప్రకారం ఈ విరామ కాలాన్ని పెంచేందుకు కోవిడ్ వర్కింగ్ గ్రూప్ అంగీకరించిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇండియాలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ల మధ్య గ్యాప్ పెంచడం ద్వారా టీకా సామర్థ్యం పెరుగుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ సౌమ్య స్వామినాథన్ గత ఫిబ్రవరిలోనే వెల్లడించిన సంగతి తెలిసిందే. చదవండి : గుడ్ న్యూస్: స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ త్వరలోనే మార్కెట్లోకి కరోనా: సీనియర్ వైద్యుల మూకుమ్మడి రాజీనామా -
Corona Vaccine: ‘కోవిషీల్డ్’ డోసుల వ్యవధిలో కీలక మార్పులు
సాక్షి, న్యూఢిల్లీ: సీరమ్ ఇన్స్టిట్యూట్ రూపొందించిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య వ్యవధి పెరిగింది. రెండో డోసు 12 నుంచి 16 వారాల మధ్యలో వేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సిఫారసు చేసింది. ఇదివరకు 28 రోజుల నుంచి ఆరు వారాల వ్యవధిలో వేసుకోవాలని నిబంధన ఉన్న విషయం తెలిసిందే. వాక్సిన్ బెటర్ రిజల్ట్స్ కోసం గ్యాప్ ఎక్కువగా ఉండాలని సూచించింది. కోవిడ్ పాజిటివ్ వచ్చినవారు ఆరు నెలల తర్వాత యాక్షన్ తీసుకోవాలని నేషనల్ ఇమ్యునైజేషన్ టెక్నికల్ అడ్వైజర్ గ్రూప్ (ఎన్టీఏజీఐ) పేర్కొంది. డెలివరీ తర్వాత తల్లులు ఎప్పుడైనా వ్యాక్సిన్ తీసుకోవచ్చు అని స్పష్టం చేసింది. ఈ మేరకు నేషనల్ ఇమ్యునైజేషన్ టెక్నికల్ అడ్వైజర్ గ్రూప్ సూచనలు చేసింది. 12-16 వారాల మధ్య కోవిషీల్డ్ రెండో డోసు వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించింది. కోవాగ్జిన్ డోసుల మధ్య ఎలాంటి మార్పు లేదు అని స్పష్టం చేసింది. నేషనల్ ఇమ్యునైజేషన్ టెక్నికల్ అడ్వైజర్ గ్రూప్ సిఫారసులు కరోనా రోగులకు కోలుకున్న ఆరు నెలల తర్వాత టీకాలు వేయాలి. ప్రస్తుతం కోలుకున్న రోగులకు 14 రోజుల తర్వాత మొదటి డోస్ ఇస్తున్నారు. ఆరు నెలల తర్వాత టీకాలు ఇచ్చినట్లయితే.. శరీరంలో ఉత్పత్తి అయ్యే సహజమైన యాంటీబాడీల కార్యాచరణను పెంచే అవకాశం ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. వ్యాక్సిన్ మొదటి మోతాదు ఇచ్చిన తర్వాత కరోనా సోకితే.. వారికి కోలుకున్న 4-8 వారాల తర్వాత రెండవ మోతాదు ఇవ్వాలి. ప్రస్తుతం, ఈ రోగులకు కోలుకున్న 14 రోజుల తర్వాత రెండో డోస్ ఇస్తున్నారు. చికిత్స సమయంలో ప్లాస్మా థెరపీ చేసిన రోగులకు కోలుకున్న 12 వారాల తర్వాత వ్యాక్సిన్ ఇవ్వాలి. ప్రస్తుతం, ఈ పేషెంట్స్కు నిర్దిష్ట నియమం అంటూ ఏం లేదు. కోలుకున్న 14 రోజుల తర్వాత వ్యాక్సిన్ మొదటి షాట్ ఇస్తున్నారు. ఇతర దీర్ఘకాలిక రోగాల కారణంగా ఆసుపత్రిలో చేరిన వారికి కోలుకున్న 4 నుంచి 8 వారాల తర్వాత టీకా ఇవ్వాలి. ప్రస్తుతం, ఈ రోగులకు ప్రత్యేక ప్రోటోకాల్ లేదు. దుష్ప్రభావాలు లేకుండా ఉండాలంటే వ్యాక్సిన్కు గ్యాప్ తప్పనిసరి అంటున్నారు. టీకా వేయించుకునే ముందు ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ అవసరం లేదు. కోవిషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య గ్యాప్ను 12-16 వారాలకు పెంచాలి. ప్రస్తుతం, 4-8 వారాల మధ్య రెండు డోస్ ఇస్తుండగా.. లాన్సెట్ అధ్యయనం ప్రకారం, 12 వారాల విరామం ఉంటే టీకా ప్రభావాన్ని 81.3% పెంచుతుందని తెలుస్తోంది. ఈ ప్రోటోకాల్ బ్రిటన్లో అనుసరిస్తున్నారు. గర్భిణీ స్త్రీలకు యాంటినెటల్ సెంటర్లలో టీకాలకు సంబంధించిన లాభాలు, నష్టాలు గురించి తెలియజేయాలి. సైడ్ ఎఫెక్ట్స్పై ఒక బుక్లెట్ వారికి అందించాలి. వారికి టీకా వేసేలా ప్రణాళికలు సిద్దం చేయాలి. పాలిచ్చే తల్లులు డెలివరీ తర్వాత ఎప్పుడైనా వ్యాక్సిన్ తీసుకోవచ్చునని తెలిపింది. చదవండి: అర్ధరాత్రి రౌడీ షీటర్ హల్చల్.. పోలీసుల ఎన్కౌంటర్ చదవండి: కౌశిక్రెడ్డి తీరుతో ఇరకాటంలో కాంగ్రెస్ -
కేంద్రం టీకాలను దుర్వినియోగం చేస్తోంది: సిసోడియా
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో కరోనా సెకండ్ వేవ్ కల్లోలం కొనసాగుతోంది. భారీ సంఖ్యలో బాధితులు ఆసుపత్రులకు క్యూకడుతున్నారు. ఆక్సిజన్ కొరతతో చాలా మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఢిల్లీకి కోవాక్జిన్ టీకా సరఫరా చేయడానికి ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ నిరాకరించిందంటూ ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా మీడియాకు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో.. టీకా నిల్వలు తక్కువగా ఉన్నాయని సరఫరాను నిలిపివేసినట్లు ఢిల్లీ డిప్యూటీ సీఎం ట్విట్టర్లో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం టీకాలను దుర్వినియోగం చేస్తోందని, మరలా 6.6 కోట్ల వ్యాక్సిన్లను విదేశాలకు ఎగుమతి చేయడం క్రూరమైన నేరమంటూ ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా తీవ్ర విమర్శలు చేశారు. వ్యాక్సిన్ల సరఫరా లేకపోవడంతో 17 పాఠశాలల్లోని 100 కోవాక్జిన్ సెంటర్లను మూసివేయాల్సి వస్తుందని ట్విట్టలో పేర్కొన్నారు. 18 నుంచి 44 సంవత్సరాల మధ్య వయసు వారికి టీకాలు వేయడానికి 1.34 డోసులు కావాలని ఢిల్లీ ప్రభుత్వం కోవాక్జిన్-భారత్ బయోటెక్, కొవిషీల్డ్- సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాను కోరినట్లు ఆయన తెలిపారు. ఇక ఇప్పటి వరకు రాష్ట్రంలో 13.5 లక్షల కేసులు నమోదు కాగా..12.4 లక్షల మంది కోలుకున్నారు. కరోనా కారణంగా 20,010 మంది మరణించారు. (చదవండి: బాలుడి దయార్థ హృదయానికి తమిళ సీఎం ఫిదా!) -
యూకేకు 50 లక్షల డోసుల ఎగుమతికి ‘నో’
న్యూఢిల్లీ: ఒకవైపు దేశం తీవ్ర వ్యాక్సిన్ కొరతను ఎదుర్కొంటుండగా... మరోవైపు 50 లక్షల కోవిషీల్డ్ డోసులను బ్రిటన్కు ఎగుమతి చేయడానికి తయారీ సంస్థ సీరమ్ ఇన్స్టిట్యూట్ (సీఐఐ) అనుమతి కోరింది. అయితే కేంద్ర ప్రభుత్వం దీన్ని నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. దేశంలో తయారయ్యే వ్యాక్సిన్లను మొదట భారత అవసరాలను తీర్చడానికి సరఫరా చేయాలని కేంద్రం స్పష్టం చేసింది. ఈ 50 లక్షల కోవిషీల్డ్ డోసులను 18–44 ఏళ్ల వయసుల వారికి వ్యాక్సినేషన్ కోసం రాష్ట్రాలకు అందుబాటులో ఉంచుతామని కేంద్ర ప్రభుత్వవర్గాలు తెలిపాయి. ‘ఈ 50 లక్షల డోసులు రాష్ట్రాలకే ఇస్తాం. వీటిని కొనాల్సిందిగా రాష్ట్రాలను కోరాం. ప్రైవేటు ఆసుపత్రులు కూడా వీటిని తీసుకోవచ్చు’ అని సీనియర్ అధికారి ఒకరు వివరించారు. వ్యాక్సిన్ మైత్రిలో భాగంగా దాదాపు 95 దేశాలకు భారత్ లక్షలాది వ్యాక్సిన్ డోసులను అందించింది. దేశంలో కరోనా కరాళనృత్యం చేస్తుంటే... విదేశాలకు వ్యాక్సిన్ ఎగుమతిని ఎలా అనుమతిస్తారంటూ కాంగ్రెస్ సహా పలు విపక్షపార్టీలు ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శల దాడికి దిగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీరమ్ తాజా అభ్యర్థనను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. చదవండి: ('సెకండ్ వేవ్ ప్రభావం అప్పటి వరకు కొనసాగుతుంది') -
యూకేలో 2200 కోట్ల పెట్టుబడి: సీరం అధినేత నిర్ణయం
లండన్: ప్రపంచంలోని అతిపెద్ద వ్యాక్సిన్ తయారీదారు సీరం ఇన్ట్సిట్యూట్ ఆఫ్ ఇండియా అధిపతి అదార్ పూనావాలా భారత్లో తనను బెదిరిస్తున్నారని చెప్పి తన ఫ్యామిలీతో కలిసి యూకే వెళ్లిన విషయం తెలిసిందే. యూకేలో కొత్త వ్యాక్సిన్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి అదార్ పూనావాలా సన్నాహాలను మొదలు పెట్టారు. దానిలో భాగంగా సుమారు 300 మిలియన్ డాలర్లును బ్రిటన్లో పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమయ్యాడు. భవిషత్తులో టీకా ఉత్పతి కేంద్రాలకు అవసరమైన సౌలభ్యాలను నిర్మించనున్నట్లు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సోమవారం రోజున ఒక ప్రకటనలో తెలిపారు. కాగా 334 మిలియన్ డాలర్ల ప్రాజెక్టుతో బ్రిటన్లో క్లినికల్ ట్రయల్స్, పరిశోధనలు, వ్యాక్సిన్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు జాన్సన్ అధికార కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. సీరం తక్కువ ఖర్చుతో కూడిన ఆస్ట్రాజెనెకా కరోనావైరస్ షాట్ను ఉత్పత్తి చేయడంలో ముందంజలో ఉంది. కరోనాను కట్టడి చేయడానికి నాజిల్ వ్యాక్సిన్ను తయారు చేయడంలో సీరం కీలకపాత్ర పోషిస్తోంది. ఈ వ్యాక్సిన్ నేరుగా ముక్కులో ఒక డోసు స్ప్రే చేస్తారు. ప్రస్తుతం సీరం యూకేలో మొదటి ఫేజ్ క్లినికల్ ట్రయల్స్ను మొదలుపెట్టింది. సీరం పెట్టుబడి భారత్, యూకే వాణిజ్య, పెట్టుబడి ఒప్పందాల విస్తృత ప్యాకేజీలో భాగమని డౌనింగ్ స్ట్రీట్ తెలిపింది. దీంతో సుమారు 6500 మందికి ఉద్యోగకల్పన జరుగుతుందని తెలిపారు. ఈ ఒప్పందం యూకే ప్రధాని బోరిస్, భారత ప్రధాని నరేంద్రమోదీకి మంగళవారం జరిగిన వర్చువల్ మీటింగ్ కంటే ముందుగానే జరగడం విశేషం. చదవండి: కరోనా వ్యాక్సిన్పై కీలక వ్యాఖ్యలు చేసిన సీరం -
వ్యాక్సిన్ కోసం నాపై తీవ్ర ఒత్తిళ్లు ఉన్నాయి: పూనావాలా
లండన్: భారత్లో కరోనా సెకండ్ వేవ్ విశ్వరూపం చూపుతున్న సమయంలో వ్యాక్సిన్ కోసం నెలకొన్న విపరీతమైన డిమాండ్పై కోవిషీల్డ్ను ఉత్పత్తి చేస్తున్న సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (సీఐఐ) సీఈవో అదర్ పూనావాలా స్పందించారు. తీవ్రంగా ఒత్తిళ్లు వస్తున్నాయని, దేశంలోని కొందరు అత్యంత బలవంతులైన ప్రముఖులు కోవిషీల్డ్ సరఫరా కోసం డిమాండ్ చేస్తూ దురుసుగా మాట్లాడుతున్నారని పూనావాలా ‘ది టైమ్స్’ పత్రికకు ఇచ్చిన ఇంటర్య్వూలో వెల్లడించారు. అందుకే భార్యా పిల్లలతో కలిసి ఉండటానికి లండన్కు వచ్చేశానని, దీనికి ఒత్తిళ్లే ముఖ్యకారణమని ఆయన చెప్పారు. ‘అనుకున్న దానికంటే ఎక్కువ సమయం లండన్లో ఉండటానికి కారణం అదే. మళ్లీ అటువంటి పరిస్థితుల్లోకి వెళ్లాలని అనుకోవడం లేదు. భారమంతా నా ఒక్కడి భుజస్కందాలపైనే పడుతోంది. కానీ నేనొక్కడినే చేయలేను. మీ బాధ్యత మీరు నెరవేర్చడానికి ప్రయత్నిస్తున్నపుడు కూడా... ఎవరో ఎక్స్, వై, జడ్ అడిగినంత సరఫరా చేయలేకపోయినందుకు వారేం చేస్తారోననే ఆలోచనలతో గడపలేం కదా. అలాంటి పరిస్థితులను ఎదుర్కొవడానికి నేను సిద్ధంగా లేను. ఇంతటి దూకుడు వ్యవహారశైలి (దురుసుతనం)ని, మానుంచి ఇంతగా ఆశించడాన్ని నేనెప్పుడూ చూడలేదు. మాకు వ్యాక్సిన్ అందాల్సిందేనని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. తమకంటే ముందు ఇతరులకు వ్యాక్సిన్లు అందడాన్ని వారు అర్థం చేసుకోలేరు’ అని పూనావాలా అన్నారు. సీరమ్ సంస్థ విజ్ఞప్తి మేరకు కేంద్ర హోంశాఖ ఇటీవలే పూనావాలాకు ‘వై’ కేటగిరీ భద్రతను కల్పించిన విషయం తెలిసిందే. చదవండి: (భారత్లో కరోనా పరిస్థితి విషాదకరం) భారత్కు బయట కూడా కోవిషీల్డ్ను ఉత్పత్తి చేసే ప్రణాళికలు ఉన్నాయని, లండన్లో మకాం పెట్టడానికి ఇది కూడా ఒక కారణమని పూనావాలా సంకేతాలిచ్చారు. బ్రిటన్తో సహా ఇతరదేశాల్లో కోవిషీల్డ్ ఉత్పత్తికి సంబంధించిన రాబోయే కొద్దిరోజుల్లో ఒక ప్రకటన వెలువడుతుందని చెప్పారు. భారత్లో పరిస్థితి ఇంతగా విషమిస్తుందని ఎవరూ ఊహించలేకపోయారన్నారు. కోవిషీల్డ్ డోసు ధరను రాష్ట్రాలకు రూ.300, ప్రైవేటు ఆసుపత్రులకు రూ.600లుగా నిర్ణయించడం ద్వారా విపత్కర పరిస్థితుల్లోనూ లాభాలు మూటగట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని వచ్చిన విమర్శలపై పూనావాలా స్పందిస్తూ... ప్రపంచంలోనే అత్యంత సరసమైన ధరకు లభిస్తున్న వ్యాక్సిన్ తమదేనని అన్నారు. తామేమీ తప్పు చేయడం లేదని, దీనిపై కాలం చెప్పే తీర్పు కోసం వేచిచూస్తానని అన్నారు. -
Covid-19 Vaccine: చేతులెత్తేసిన రాష్ట్రాలు
సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్ కట్టడికి కేంద్ర ప్రభుత్వం మే 1 నుంచి 18-45 లోపు వయసు వారికి వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. మూడో దశ వ్యాక్సినేషన్ ప్రారంభం కావడానికి మరో 24 గంటల వ్యవధి కూడా లేదు. ఈ క్రమంలో పలు రాష్ట్రాలు రేపటి నుంచి 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ ఇవ్వలేమని స్పష్టం చేశాయి. వ్యాక్సిన్ల కొరత తీవ్రంగా ఉందని.. ఈ నేపథ్యంలో తాము రేపటి నుంచి వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభిచలేమని పలు రాష్ట్రాలు కేంద్రానికి తెలిపాయి. వ్యాక్సిన్ కోసం శుక్రవారం ఉదయం నాటికే 2.45 కోట్ల మంది కోవిన్ ప్లాట్ఫామ్లో రిజిస్టర్ చేసుకున్నారు. బుధవారం నాడు వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కాగా.. మూడు రోజుల వ్యవధిలోనే ఇంత మంది రిజిస్టర్ చేసుకోవడం గమనార్హం. ఇక వ్యాక్సిన్లు సరఫరా చేస్తున్న సీరం ఇన్స్టిట్యూట్ నెలకు 6-7 కోట్ల టీకాలను ఉత్పత్తి చేసే సామార్థ్యం కలిగి ఉండగా.. భారత్ బయోటెక్ నెలకు సుమారు రెండు కోట్ల డోసులను ఉత్పత్తి చేస్తుంది. ఇక రేపటి నుంచి వ్యాక్సిన్ ప్రక్రియ చేపట్టలేమని తెలిపిన రాష్ట్రాలు.. తెలంగాణ.. ‘‘రాష్ట్రాలకు ఉచితంగా వ్యాక్సిన్లు సరఫరా చేసే బాధ్యత కేంద్రానిదే. మేం భారత్ బయోటెక్, సీరం కంపెనీలతో టచ్లో ఉన్నాం. కానీ వారి నుంచి సరైన స్పందన లేదు. మేం రోజుకు పది లక్షల మందికి వ్యాక్సిన్ వేయగలం. మాకు 4 కోట్ల డోసుల వ్యాక్సిన్లు కావాలి. కంపెనీలతో మాట్లాడుతున్నాం. రేపటి నుంచి 18-44 ఏళ్ల వారికి వ్యాక్సిన్ ఇవ్వలేం’’ అని ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. మహారాష్ట్ర.. మహారాష్ట్రలో కోవిడ్ ఉధృతి తీవ్రంగా ఉంది. దేశంలో అత్యధికంగా ఇక్కడే కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోప్ మాట్లాడుతూ.. ‘‘మాకు అత్యవసరంగా 20-30 లక్షల వ్యాక్సిన్ వయల్స్ కావాలి. 18-45 ఏళ్ల లోపు వారికి వ్యాక్సిన్ ఇవ్వాలంటే 12 కోట్ల డోసుల టీకాలు కావాలి. అంత మొత్తంలో మా దగ్గర వ్యాక్సిన్లు లేవు. ప్రస్తుతం మేం కోవిడ్ థర్డ్ వేవ్కు సిద్ధమవుతున్నాం. ఇప్పటికే వ్యాక్సిన్ల కొరత వల్ల ఇప్పటికే ముంబైలో టీకాలు వేయడం ఆపేశాం. ఇక రేపటి నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభించలేం’’ అని తెలిపారు. కర్ణాటక.. కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కే సుధాకర్ మాట్లాడుతూ.. ‘‘రేపటి నుంచి మా దగ్గర మూడో దశ వ్యాక్సినేషన్ని ప్రారంభించలేం. ఇప్పటికే కోటి డోసులకు ఆర్డర్ చేశాం. కానీ వారు రేపటి వరకు డోసులను డెలివరీ చేయలేమన్నారు. ఈ నేపథ్యంలో 18-44 ఏళ్ల వారు వ్యాక్సిన్ కోసం రేపు ఆస్పత్రులకు వచ్చి ఇబ్బంది పడవద్దని కోరుతున్నాం’’ అన్నారు. ఢిల్లీ.. మూడో దశ వ్యాక్సినేషన్ ప్రారంభించేందుకు తమ దగ్గర సరిపడా వ్యాక్సిన్లు లేవని సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. 18-44 ఏళ్ల వారు మే 1న వ్యాక్సిన్ కోసం ఆస్పత్రుల వద్దకు రావద్దని.. వ్యాక్సినేషన్ గురించి రెండు మూడు రోజుల్లో తామే చెప్తామని వెల్లడించారు. ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే 67 లక్షల డోసుల కోవిషీల్డ్ వ్యాక్సిన్లను ఆర్డర్ చేసింది. మే 3 నాటికి మూడు లక్షల డోసుల డెలివరీ చేస్తామని కంపెనీ అధికారులు తమకు తెలిపారని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. గోవా.. గోవా సీఎం ప్రమోద్ సావంత్ వ్యాక్సిన్ డోసులు ఎప్పుడు అందుబాటులోకి వస్తే.. అప్పుడే 18-44 ఏళ్ల వారికి టీకా వేస్తామని ప్రకటించారు. ఇప్పటికే ఐదు లక్షల డోసులు డెలివరీ చేయాల్సిందిగా సీరం కంపెనీకి ఆర్డర్ ఇచ్చామని తెలిపారు. మధ్యప్రదేశ్.. కంపెనీలు తాము ఆర్డర్ చేసిన వ్యాక్సిన్ డోసులను ఇంకా డెలివరీ చేయలేదని.. ఈ నేపథ్యంలో తాము రేపటి నుంచి మూడో దశ వ్యాక్సిన్ ప్రారంభించలేమని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. పశ్చిమబెంగాల్.. 18-44 ఏళ్ల వయసు వారికి వ్యాక్సిన్ వేయాలంటే కేంద్రం తమకు 3 కోట్ల డోసుల వ్యాక్సిన్లు సరఫరా చేయాలని.. అప్పుడు మాత్రమే తాము వ్యాక్సినేషన్ ప్రారంభిచగలమని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. ఇవే కాక జార్ఖండ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలు తాము మే 1 నుంచి 18-44 ఏళ్ల వారికి వ్యాక్సిన్ ఇవ్వలేమని తెలిపాయి. చదవండి: ఉత్పత్తి పెరిగితే... ధరలు దిగిరావా? -
సరసమైన ధర, సబ్సిడీ... అంత ఈజీ కాదు
కోవిడ్ రెండోదశ చాలా ఉధృతంగా వచ్చింది. అయినా పౌరుల్లో మాత్రం స్పృహ ఇంకా కొరవడుతూనే ఉంది. ప్రతిరోజూ 3 లక్షలకు పైగా కేసులు, మొత్తం కోటిన్నర మందికిపైగా బాధి తులు, 1.86 లక్షల మరణాలు.. ఈ అంకెలు చూస్తేనే భయం అనిపిస్తున్నా.. రాబోయే కాలంలో ఇవి మరింతగా ఎక్కు వయ్యే ప్రమాదం కళ్లెదుటే కనిపిస్తోంది. కోవిడ్ పరీక్షలు, బాధితుల మరణాల విషయంలో కొన్ని రాష్ట్రాలు ఇస్తున్న లెక్కలు ఎంతవరకు నిజమన్న అనుమానాలూ తలెత్తుతు న్నాయి. కానీ వీటన్నింటి కంటే ప్రజల నిర్లక్ష్యమే చాలా ప్రమా దకరం. వైరస్ ప్రస్తుతం విజృంభిస్తున్న తీరు చూస్తే దాన్ని నిరో ధించడం మన చేతుల్లోనే ఉందని అర్థమవుతుంది. జూలై లోపు రెండోదశ ఉధృతి తగ్గుతుందన్న ఆశలు ఏమాత్రం లేవు. ఇలాంటి సమయంలో మనం ఏం చేయాలి? టీకా వేసుకోవడం ఒక్కటే ప్రస్తుత తరుణంలో వైరస్ను అడ్డుకోవడానికి కొంతలో కొంత ఉత్తమ మార్గం. అయినా టీకా వేయించుకున్నంత మాత్రాన భౌతికదూరం నిబం ధనలను మాత్రం వదలకూడదు. టీకా వేయించుకుంటే కరోనా వచ్చే అవకాశాలు చాలావరకు తగ్గుతాయి. ఒకవేళ వచ్చినా.. వ్యాధి తీవ్రత బాగా తగ్గుతుంది. ఈ కథనం రాసే సమయానికి దేశంలో 13.5 కోట్ల టీకాలు వేశారు. వారిలో 11.5 కోట్ల మంది తొలిడోసు తీసుకున్నారు. రోజుకు సుమారు 50 లక్షలమందికి వేయొచ్చని ఓ అంచనా. ఈ లెక్కన మొత్తం జనాభాకు టీకాలు వేయడానికి ఎంత సమయం పడుతుందో లెక్క వేసుకోవచ్చు. భారతదేశ జనాభా, వైశాల్యం.. వీటన్నింటి దృష్ట్యా చూస్తే అందరికీ టీకాలు అంత త్వరగా వేయడం కష్టమే. ప్రస్తుతం సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్ టీకాలే అందుబాటులో ఉన్నాయి. త్వరలో స్పుత్నిక్ కూడా వస్తుంది. డిమాండు- సరఫరా పరిస్థితిని బట్టే టీకా ధర ఎంతన్నది నిర్ణయిస్తారు. ప్రభుత్వం టీకాను ధరల నియంత్రణ పరిధిలోకి తెస్తే.. మార్కెట్ అస్తవ్యస్తం అవుతుంది. క్లియరెన్స్ సేల్ పద్ధతిలో టీకాలను ఎవరూ ఇవ్వలేరు. అందువల్ల ప్రభుత్వం నిర్ణయించే ధర కూడా అలాంటి ధర కంటే ఎక్కువగానే ఉండాలి. మూడోదశ టీకా వ్యూహం ప్రకారం.. కంపెనీలు ముందుగానే టీకా ధర వెల్ల డిస్తాయి. ఈ ధర ఒక్కో డోసు రూ. వెయ్యి కంటే తక్కువగానే ఉండే అవకాశం లేదు. రూ. 150, రూ. 200 అనేది సాధారణ ధర కంటే చాలా తక్కువ. దురదృష్టవశాత్తు ప్రజలు చెల్లించలేరన్న భావనతో ముందుగా తక్కువ ధరలు నిర్ణయిస్తారు. కానీ భరించ లేనివారికి మాత్రమే సబ్సిడీ ధరలకు ఇవ్వడం వేరు.. అందరికీ అలా ఇవ్వడం వేరు. టీకా డిమాండు ఎప్పుడూ సరఫరా కంటే ఎక్కువగానే ఉంటుంది. కానీ ఆ ధరకు టీకా ఉత్పత్తి చేయడం వల్ల వారికి ఎలాంటి ప్రోత్సాహం అందదు. మొత్తం జనాభా అందరికీ ప్రభుత్వమే టీకాలు వేయించాలా అన్నది కూడా ఒక ప్రశ్నే. తొలుత 60 ఏళ్లు దాటిన వారికి, 45 ఏళ్లు దాటినవారిలో వేరే ఆరోగ్య సమస్యలు ఉన్నవారికే టీకాలు ఇచ్చారు. వీరిలో చాలామంది ఉత్పాదకతకు దూరంగా ఉన్నవారే. ఉత్పాదక రంగంలో యువత ఉంటారు. ఆర్థిక కార్యకలాపాలు, జీవనోపాధి దెబ్బతినకుండా చూడాలంటే.. ఉత్పాదక రంగం లోని వారికి తొలుత టీకాలు ఇవ్వాలి. కానీ రాజకీయ పరంగా చూస్తే ఇది అంత సులభం కాదు. మూడోదశలో 50% టీకాలను కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చి, మిగిలినది మార్కెట్ ధరకు రాష్ట్ర ప్రభుత్వాలకు, ప్రైవేటు ఆసుపత్రులకు ఇస్తామన్నారు. దానివల్ల 18 ఏళ్లు దాటిన వారం దరికీ టీకాలు ఇవ్వచ్చు. ఈ పద్ధతి వల్ల సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్ సంస్థలు ఉత్పత్తి పెంచగలవు. ఈ రెండు కంపెనీలూ విదేశాలకూ టీకాను సరఫరా చేయడానికి ముందే ఒప్పందాలు చేసుకున్నాయి. ఈ లెక్కన టీకా ఉత్పత్తి పెరిగి, అది అందరికీ అందుబాటు లోకి రావాలంటే కనీసం 2021 సెప్టెంబర్ వరకు వేచిచూడాలి. అప్పటికీ కొంత కొరత ఉంటుంది. టీకా ముడిపదార్థాల ఎగుమ తిని నియంత్రించడానికి అమెరికాలో డిఫెన్స్ ప్రొడక్షన్ యాక్ట్ అమలుచేశారు. దీనికితోడు ప్రపంచ వాణిజ్య ఒప్పందం నేప థ్యంలో టీకా ఉత్పత్తికి లైసెన్సు తప్పనిసరి. ఇంతటి సంక్లిష్ట పరి స్థితుల్లో టీకా ఉత్పత్తి చేయడం, దాన్ని సరసమైన ధరలకే అందించడం అంటే కంపెనీలకు అసాధ్యం. కేంద్ర ప్రభుత్వం తమకు అందే 50% కోటాలో ఎంత మొత్తాన్ని ఏయే రాష్ట్రాలకు ఎలా సరఫరా చేస్తుందన్నది చూడాలి. ఆ టీకాలు చాలకపోతే.. రాష్ట్రాలు తమంతట తాముగా కొనుగోలు చేయాల్సి వస్తుంది. అలాగే ప్రైవేటు ఆసుపత్రులూ టీకా ఉత్పత్తి సంస్థల నుంచి నేరుగా కొనుక్కోవాలి. తప్పనిసరిగా మార్కెట్ ధరలకు అను గుణంగానే వారు వెచ్చించాల్సి ఉంటుంది. బిబేక్ దేబ్ రాయ్ ప్రధాని ఆర్ధిక సలహా మండలి చైర్మన్ (ది న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ సౌజన్యంతో) -
ఉత్పత్తి పెరిగితే... ధరలు దిగిరావా?
కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు, ప్రైవేటు ఆస్పత్రులకు వేర్వేరుగా టీకా ధరలు ఉంటాయని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) చేసిన ప్రకటన అనేక ప్రశ్నలకు తావిచ్చింది. మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ టీకాలు అందుబాటులోకి వస్తాయని చెప్పడం కొంతలో కొంత శుభ వార్తే అయినా ఇన్నాళ్లూ కేంద్ర ప్రభుత్వం వద్ద ఒక్కో డోసుకు రూ.150 తీసుకుంటున్న ఎస్ఐఐ.. ఇకపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.400, ప్రైవేటు ఆసుపత్రులకు రూ.600 చొప్పున తీసుకుంటామని ప్రకటించింది. తన టీకా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతామని, మొత్తం డోసుల్లో సగం కేంద్రానికి ఇచ్చి, మిగిలినవి రాష్ట్రాలకు, ప్రైవేటు ఆసుపత్రులకు ఇస్తామని చెబుతోంది. కేంద్ర ప్రభుత్వం ఎప్పటిలాగే ప్రభుత్వాసుపత్రులకు సరఫరా చేయడంతో పాటు కొంత మొత్తం టీకాలను రాష్ట్రాలకూ ఇస్తుంది. కానీ రాష్ట్రాలకు ఇంకా అదనపు కోటా కావాలంటే అవి సొంతంగా ఎస్ఐఐ నుంచి కొనుక్కోవాలి. అయితే.. తాము ఎస్ఐఐ నుంచి కొనుగోలు చేసిన టీకాలను రాష్ట్రాలకు ఉచితంగానే ఇస్తామని కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. కేంద్రం నుంచి వస్తున్న టీకాలు అరకొరగానే ఉంటున్న పరిస్థితుల్లో రాష్ట్రాలు సొంతంగా కూడా కొనుక్కునే వెసులుబాటు ఉన్నా.. దాని ధర విషయమే కాస్త పంటికింద రాయిలా తగులుతోంది. నిజానికి సరఫరాకు, ధరలకు మధ్య ఉండే సంబంధంలో సాధారణ ఆర్థిక సూత్రాల ప్రకారం సరఫరా పెరిగితే ధర తగ్గాలి. చిన్న మొత్తంలో ఉత్పత్తి చేయడం కంటే పెద్దమొత్తంలో చేస్తే ఉత్పత్తి వ్యయం కూడా కలిసొస్తుంది. అలాంటప్పుడు ధర ఎందుకు పెంచుతున్నట్లు? అసలు ఈ ధరలకు ప్రాతిపదిక ఏంటి? అమెరికా, యూకే, ఈయూలలో ఆక్స్ఫర్డ్/ఆస్ట్రాజెనెకా టీకాను ఒక్కో డోసు 2-4 డాలర్ల మధ్య అమ్ముతున్నారు. ఎస్ఐఐ తయారుచేసే టీకా కూడా అదే. మొదటి 40, 50 కోట్ల డోసుల్లో లాభం చూసుకోబోమని ఆస్ట్రాజెనెకా చెప్పింది కూడా. ప్రాంతాన్ని బట్టి, ఉత్పత్తిని బట్టి ధర మారుతుందనే 2-4 డాలర్లు అన్నారనుకోవాలి. ఎస్ఐఐ మొత్తం 91 పేద దేశాలకు టీకా ఇవ్వాలని ఆస్ట్రాజెనెకా లైసెన్సులో పేర్కొంది. భారత్ లాంటి దేశాల్లో ఉత్పత్తి వ్యయం తక్కువ అవుతుందని, ఎస్ఐఐ ప్రపం చంలోనే అతిపెద్ద టీకా ఉత్పత్తిదారని లైసెన్సు ఇచ్చింది. అలాం టప్పుడు ఆస్ట్రాజెనెకాకు అయ్యే వ్యయం కంటే ఎస్ఐఐకి ఎక్కువ అవుతుందని ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పలేం. కేంద్ర ప్రభుత్వానికి ఇన్నాళ్లూ ఇచ్చిన టీకాల వల్ల తనకు నష్టమేమీ రాలేదని.. అయితే లాభాలు పెద్దగా లేకపోవడంతో పెద్దమొత్తంలో పెట్టుబడి పెట్టడం వీలు కావట్లేదని ఓ ఇంటర్వ్యూలో ఎస్ఐఐ సీఈఓ అదర్ పూనావాలా చెప్పారు. తనకు రూ.3 వేల కోట్ల గ్రాంటు కావాలని ఆయన అడిగారు. కానీ, ప్రభుత్వం భవిష్యత్తులో ఇవ్వబోయే టీకాలకు అడ్వాన్సుగా మాత్రమే ఇస్తామని చెప్పింది. అందుకే ఒక్కసారిగా టీకా ధర రూ.150 నుంచి రూ.400కు పెరిగింది. డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) కోవిషీల్డ్ అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చినా.. ప్రభుత్వానికే అమ్మాలని చెప్పింది. ప్రైవేటు ఆసుపత్రులకు అమ్మాలంటే అందుకు వేరే అనుమతులు తీసుకోవాలి. వ్యాపారం ఎవరైనా లాభాలకోసమే చేస్తారు. అదర్ పూనావాలా కష్టపడుతున్నారన్న విషయంలో అనుమానం లేదు. కానీ, ఉత్పాదక సామర్థ్యం పెంచితే ధర రెట్టింపు కంటే ఎక్కువ ఎందుకు అయ్యిందన్నదే అసలు ప్రశ్న. మరోవైపు అసలు కేంద్ర ప్రభుత్వం ఈ టీకా ధర విష యంలో ఇంతవరకు ఎందుకు స్పందించలేదో అర్థం కాదు. ప్రపంచంలో చాలా దేశాల్లో ప్రభుత్వాలే టీకా నేరుగా కొని, ప్రజలకు ఉచితంగా ఇస్తున్నాయి. 136 కోట్లకు పైగా జనాభా ఉన్న భారతదేశం ధనికదేశమేమీ కాదు. అయినా ధరలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. దేశ జనాభాలో 18 ఏళ్లు దాటినవారి సంఖ్య సుమారు 91 కోట్లు. వాళ్లలో ప్రతి ఒక్కరికీ రెండు డోసులు ఇచ్చినా 182 కోట్ల డోసుల్లో ఒక్కోదానికి రూ.200 వెచ్చించారనుకున్నా దానికి రూ.36,400 కోట్లు అవుతుంది. టీకాల కోసం రూ.35 వేల కోట్లు కేటాయిస్తున్నామని, అవసరమైతే ఇంకా ఇస్తామని బడ్జెట్లో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఎస్ఐఐ ఒక్కో డోసుకు రూ.200 చొప్పున ఇస్తే ఆ బడ్జెట్ దాదాపుగా సరిపోతుంది. అప్పుడు అదర్ పూనావాలాకూ కొంత లాభం పెరుగుతుంది. కానీ రూ. 150కి కొన్నటీకాపై అదనంగా వెచ్చించి కోవిషీల్డ్ టీకాలను కేంద్రం ఎందుకు కొనాలనుకుం టోందో ఆ బ్రహ్మదేవుడికే ఎరుక! ప్రసేన్ జిత్ దత్తా వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు (ది ప్రొజాయిక్ వ్యూ సౌజన్యంతో) -
కరోనా వ్యాక్సిన్పై కీలక వ్యాఖ్యలు చేసిన సీరం
పుణే: కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్ పై కేంద్రం ప్రకటించిన కొత్త వ్యాక్సిన్ ధరలు తీవ్ర దుమారం రేపగా దానిని సమర్ధిస్తూ సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా కీలక వ్యాఖ్యలు చేసింది. కోవిషిల్డ్ వ్యాక్సిన్ ధర పెంపు కొన్ని రాష్ట్రాల్లో చర్చకు దారి తీసింది. కోవిషిల్డ్ వ్యాక్సిన్ను ముందు లభించే ధర కంటే 1.5 రెట్లు అధికంగా విక్రయించాలనే అంశాన్ని సీరం ఇన్స్టిట్యూట్ తోసిపుచ్చింది. కోవిషిల్డ్ వ్యాక్సిన్ ధరను రూ. 150 గా కేంద్రానికి నిర్ణయించింది. దీని కారణం వివిధ దేశాలు వ్యాక్సిన్ తయారీకి ముందుగానే పెట్టుబడి సహాయం అందించడమే. ప్రస్తుతం మరిన్నీ కోవిషిల్డ్ వ్యాక్సిన్ షాట్లను భారీ మొత్తంలో ఉత్పత్తి చేయడానికి పెట్టుబడి అవసరమని కంపెనీ పేర్కొంది. ప్రపంచ దేశాల్లో లభించే కరోనా వ్యాక్సిన్ల ధరతో పోల్చుకుంటే భారత్లో తక్కువగా ఉందని కంపెనీ ప్రకటించింది. ప్రస్తుతం తయారైన కోవిషిల్డ్ వ్యాక్సిన్లో కొంత భాగం మాత్రమే ప్రైవేటు ఆసుపత్రులకు విక్రయిస్తామన్నారు. ఒక్కో డోసును రూ. 600కు విక్రయిస్తామని సీరం తెలిపింది. ప్రస్తుతం కోవిడ్-19కు ఇతర వైద్య చికిత్సల కంటే కోవిషిల్డ్ ధర తక్కువగా ఉందని కంపెనీ వివరించింది. ఆస్ట్రాజెనీకా కనుగొన్న టీకా కోవిషీల్డ్ను సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా పూణే సెంటర్లో తయారయ్యే వ్యాక్సిన్ ఒక్కో డోసును ప్రైవేటు సంస్ధలకు రూ. 600, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ. 400 టీకా కొత్త ధరలను ప్రకటించిన విషయం తెలిసిందే. We at @SerumInstIndia have for the past five decades been at the forefront of supplying vaccines and saving lives globally. We care about and respect every human life and strongly believe in transparency, and thus we hope our statement below can clear any confusions. pic.twitter.com/YQ3x38BuFL — SerumInstituteIndia (@SerumInstIndia) April 24, 2021 చదవండి: కోవిడ్ వ్యాక్సిన్: కేంద్రం కీలక ప్రకటన -
రాష్ట్రాలకు రూ.400లకు డోసు
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ తయారీదారు, పుణేకు చెందిన సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (సీఐఐ) తమ కరోనా వ్యాక్సిన్ ’కోవిషీల్డ్’బహిరంగ మార్కెట్ ధరలను బుధవారం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వాలకైతే రూ.400 డోసు చొప్పున అందజేస్తామని, ప్రైవేటు ఆసుపత్రులకు ఒక డోసుకు రూ.600 వసూలు చేస్తామని వెల్లడించింది. భారత్లో జనవరి 16న వ్యాక్సినేషన్ ప్రారంభం కాగా, కేంద్ర ప్రభుత్వం వైద్య సిబ్బందికి, ఫ్రంట్లైన్ వర్కర్స్కు, 45 ఏళ్ల పైబడిన వారందరికీ ఉచితంగా టీకాలు వేస్తున్న విషయం తెలిసిందే. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు, నిపుణుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను దృష్టిలో పెట్టుకొని మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సినేషన్కు అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం రెండు రోజుల కిందట నిర్ణయం తీసుకుంది. ఫార్మా కంపెనీలు ఉత్పత్తి చేసే టీకాల్లో 50 శాతం కేంద్ర ప్రభుత్వానికి ఎప్పటిలాగే తక్కువ ధరకు అందిస్తూ... మిగతా 50 శాతం వ్యాక్సిన్లను బహిరంగ మార్కెట్లలో రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు ఆసుపత్రులు, సంస్థలకు అమ్ముకోవడానికి వీలు కల్పించింది. అయితే ఫార్మా కంపెనీలు మే1 లోపే పారదర్శకంగా తమ బహిరంగ మార్కెట్ ధరలను ప్రకటించాలని కేంద్రం షరతు విధించింది. కేంద్ర అదేశాలకు అనుగుణంగా సీరమ్ కోవిషీల్డ్ ధరలను ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వాలకు రూ. 400 డోసు, ప్రైవేటు ఆసుపత్రులకు రూ.600 డోసు చొప్పున అందజేస్తామని ఒక ప్రకటనలో తెలిపింది. ‘ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ల ధరలను దృష్టిలో పెట్టుకొని... వాటితో పోల్చితే తక్కువ ధర ఉండేలా, అందరికీ అందుబాటులో ఉండేలా కోవిషీల్డ్ ధరలను నిర్ణయించాం. అమెరికా వ్యాక్సిన్లు బహిరంగ మార్కెట్లో ఒక్క డోసుకు రూ.1,500 కంటే ఎక్కువగా, రష్యా, చైనా వ్యాక్సిన్లు ప్రతి డోసుకు రూ.750కి పైగా ఉన్నాయి. రాబోయే రెండు నెలల్లో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం ద్వారా సరఫరాను పెంచుతాం. నాలుగైదు నెలల తర్వాత వ్యాక్సిన్ రిటైల్ మార్కెట్లో అందుబాటులోకి వస్తుంది’అని సీరమ్ ఇన్స్టిట్యూట్ వివరించింది. కేంద్ర ప్రభుత్వం ఎప్పటిలాగే 45 ఏళ్ల పైబడిన వారందరికీ ఉచితంగా టీకా కార్యక్రమాన్ని ఇకపై కూడా కొనసాగించనుంది. 18–45 ఏళ్ల లోపు వయసు వారికి టీకాలు వేసే విషయం రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ప్రైవేటు ఆసుపత్రుల్లో వేసుకోదలచుకున్న వారు నేరుగా వెళ్లి ఆసుపత్రి నిర్ధారించిన ఫీజు చెల్లించి వేసుకోవచ్చు. గతంలో 45 ఏళ్ల పైబడిన వారికి ప్రభుత్వం తరఫున టీకాలు సరఫరా అయ్యాయి కాబట్టి... ప్రైవేటులో వేసుకుంటే టీకాకు రూ. 150, సర్వీసు ఛార్జీ కింద రూ.100 వసూలు చేసుకోవడానికి అనుమతించారు. ఇప్పుడు సీరమ్ డోసును రూ.600లకు అమ్మనుంది. దీనిపై ప్రైవేటు ఆసుపత్రులు ఎంత అదనంగా వసూలు చేస్తాయనేది చూడాలి. కాంట్రాక్టు ముగిశాక కేంద్రానికీ అదే ధర కేంద్ర ప్రభుత్వానికి రూ.150 డోసు చొప్పున అందిస్తూ... రాష్ట్ర ప్రభుత్వాలకు మాత్రం రూ.400 ధర నిర్ణయించడంపై విపక్షాలు మండిపడ్డాయి. ఇంత అధికధర వసూలు చేయడంలోని ఔచిత్యాన్ని ప్రశ్నించాయి. వైరస్ సమర్థత ఎంత ఉంటుందో ఇంకా పూర్తిగా తెలియకముందే, చాలాకాలం ముందే కేంద్ర ప్రభుత్వం గంపగుత్తగా తమకు 10 కోట్ల డోసులకు అర్డర్ ఇచ్చిందని, రిస్క్ను తాము కూడా పంచుకొనే దాంట్లో భాగంగానే రూ.150 డోసును కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడానికి అంగీకరించామని సీరం సీఈవో అదర్ పూనావాలా తెలిపారు. ఈ పది కోట్ల డోసుల సరఫరా పూర్తికాగానే కేంద్ర ప్రభుత్వానికి కూడా రూ.400 డోసు చొప్పునే ఇస్తామన్నారు. ప్రస్తుతం నెలకు 6–7 కోట్ల డోసులు ఉత్పత్తి చేస్తున్నామని, జులై కల్లా దీన్ని 10 కోట్ల డోసులకు పెంచుతామన్నారు. -
కోవిషీల్డ్: ప్రైవేటు మార్కెట్లో టీకా ధరలను ప్రకటించిన సీరమ్
సాక్షి, ముంబై: భారత్లో కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తిని అడ్డుకునేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాల్లో టీకా కొరతను తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాక్సిన్ ఉత్పత్తి దారులు 50శాతం డోసులను నేరుగా రాష్ట్ర ప్రభుత్వాలు, బహిరంగా మార్కెట్లో అమ్ముకునేందుకు వీలు కల్పించింది. దీంతో కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు తాజాగా ప్రైవేటు మార్కెట్లో కోవిషీల్డ్ టీకా ధరలను సీరమ్ సంస్థ బుధవారం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చే ఒక్కో డోస్ ధర 400 రూపాయలు, ప్రైవేట్ ఆస్పత్రులకు ఇచ్చే ఒక్కో డోస్ ధర రూ.600గా నిర్ణయించింది. నాలుగైదు నెలల్లో రిటైల్ స్టోర్లలోనూ విక్రయించనున్నట్లు వెల్లడించింది. కేంద్రానికి కోవిషీల్డ్ ఒక్కో డోసును 150 రూపాయలకు సీరమ్ సంస్థ అందిస్తోంది. కాగా వచ్చే రెండు నెలల్లో టీకా ఉత్పత్తిని మరింత పెంచి కొరతను అధఙగమిస్తామని సీరమ్ సంస్థ పేర్కొంది. 4, 5 నెలల తర్వాత రిటైల్ మార్కెట్లోనూ అందుబాటులోకి తచ్చెందుకు ప్రయత్నిస్టున్నట్లు వెల్లడించింది. కోవాగ్జిన్ ఒక్కో డోసు రూ.206కి భారత్ బయోటెక్ ఇస్తోంది. కోవిషీల్డ్ కావాలంటే రాష్ట్ర ప్రభుత్వాలపై ఒక్కో డోసుకు రూ.250 భారం పడుతుంది. కాగా ఫైజర్ వ్యాక్సిన్ ఒక్కో డోసు రూ.1431, మోడర్నా వ్యాక్సిన్ రూ.2348-2715, సినోవాక్ వ్యాక్సిన్ ఒక్కో డోసు రూ.1027, జాన్సన్ అండ్ జాన్సన్ రూ.734గా ఉంది. చదవండి: రెమ్డెసివిర్ కావాలంటే ఈ నంబర్కు వాట్సాప్ చేయండి IMPORTANT ANNOUNCEMENT pic.twitter.com/bTsMs8AKth — SerumInstituteIndia (@SerumInstIndia) April 21, 2021 -
కొవిషీల్డ్ టీకా ధరలు ప్రకటించిన సీరం సంస్థ
-
వ్యాక్సిన్ల కొరత: రూ.4500 కోట్లు విడుదల
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజువారి నమోదవుతున్న కేసులు సంఖ్య 2 లక్షలకు పైగానే ఉంటున్నాయి. ఈ క్రమంలో జనాలు వ్యాక్సిన్ కోసం క్యూ కడుతున్నారు. అయితే పలు రాష్ట్రాల్లో ఇప్పటికే టీకా డోసులు అయిపోయాయి. ఎక్కువ మొత్తంలో వ్యాక్సిన్లను పంపిణీ చేయాల్సిందిగా రాష్ట్రాలు కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాక్సిన్ల ఉత్పత్తిని పెంచడానికి సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్లకు 4,500 కోట్ల రూపాయలు ఇవ్వాలని నిర్ణయంచింది. ఈ మేరకు ఆర్థిక శాఖ సోమవారం సూత్రప్రాయ అంగీకారం తెలిపింది. ఇందులో 3 వేల కోట్ల రూపాయలను సీరమ్కు, 1,500 కోట్ల రూపాయలను భారత్ బయోటెక్కు ఇవ్వనున్నట్లు సమాచారం. నెలకు 10 కోట్ల డోసుల వ్యాక్సిన్స్ ఉత్పత్తి చేయడానికి తమకు 3 వేల కోట్ల రూపాయలు అవసరమని సీరమ్ సీఈవో అదార్ పూనావాలా కొద్ది రోజుల క్రితమే ప్రభుత్వాన్ని కోరిన సంగతి తెలిసిందే. వ్యాక్సిన్ల ఉత్పత్తిని పెంచడానికి ఆర్థిక సాయం చేయడంతో పాటు.. వినూత్న విధానాలను కనుగొనడానికి వ్యాక్సిన్ తయారీదారులతో కలిసి ప్రభుత్వం పని చేస్తోందని పూనావాలా చెప్పారు. జూన్ నెలలోగా వ్యాక్సిన్ల ఉత్పత్తిని పెంచాలని సీరమ్ భావిస్తోంది. చదవండి: కరోనా వ్యాక్సిన్.. వేధించే సందేహాలు.. సమాధానాలు -
కోవిషీల్డ్ టీకా: సీరమ్కు లీగల్ నోటీస్
సాక్షి,న్యూఢిల్లీ: ఆస్ట్రాజెనెకా సంస్థ తమకు లీగల్ నోటీసు జారీ చేసిందని కరోనా వైరస్ టీకా ‘కోవిషీల్డ్’ను ఉత్పత్తి చేస్తున్న సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) వెల్లడించింది. ఒప్పందం మేరకు కోవిషీల్డ్ను సరఫరా చేయడంలో జరుగుతున్న జాప్యంపై నోటీసులో ప్రశ్నించిందని ఎస్ఐఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అదర్ పూనావాలా బుధవారం తెలిపారు. ఈ విషయం కేంద్రానికి కూడా తెలుసన్నారు. దీనిపై ఇప్పుడే వ్యాఖ్యానించలేనని, వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకునేందుకు మార్గాలను అన్వేషిస్తున్నామన్నారు. (కరోనా ప్రమాద ఘంటికలు: సోనూసూద్ స్పెషల్ డ్రైవ్) భారత్లో సరఫరా చేయాల్సిన డోసులకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఆస్ట్రాజెనెకాకు సరఫరా చేయాల్సిన టీకా డోసుల్లో జాప్యం నెలకొన్నదని ‘బిజినెస్ స్టాండర్డ్’ పత్రికకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పూనావాలా తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా తమ టీకాకు డిమాండ్ ఉందని, భారత దేశ అవసరాలకు ప్రాధాన్యత ఇస్తున్నప్పటికీ.. టీకా అవసరమైన భారతీయులందరికీ దీన్ని అందజేయలేమని ఆయన స్పష్టం చేశారు. విదేశాల్లో టీకా డోసు ధర కూడా ఎక్కువగా ఉందన్నారు. ఎస్ఐఐ నెలకు ఆరు కోట్ల నుంచి ఆరున్నర కోట్ల టీకాలను ఉత్పత్తి చేస్తోందని తెలిపారు. ఇప్పటివరకు 10 కోట్ల డోసులను కేంద్ర ప్రభుత్వానికి సరఫరా చేశామని, మరో 6 కోట్ల డోసులను విదేశాలకు ఎగుమతి చేశామని వివరించారు. ‘భారత ప్రభుత్వ అభ్యర్థనపై భారత్కు సబ్సీడీ ధరకు సుమారు రూ. 150 రూ. 160 కే టీకా డోసు అందిస్తున్నాం. లాభాలు రావడం లేదని చెప్పలేం. కానీ గొప్పగా లాభాలేమీ రావడం లేదు’ అని వ్యాఖ్యానించారు. -
భారత్లో కొవొవాక్స్ ప్రయోగాలు షురూ
న్యూఢిల్లీ: భారత్లో కోవిడ్ వ్యాక్సిన్ కొవొవాక్స్ ప్రయోగాలు ప్రారంభమైనట్టుగా సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదార్ పూనావాలా వెల్లడించారు. అమెరికా వ్యాక్సిన్ కంపెనీ నొవవాక్స్ భాగస్వామ్యంతో కొత్త వ్యాక్సిన్ను అభివృద్ధి చేస్తున్నారు. సెప్టెంబర్ నాటికి ఈ వ్యాక్సిన్ ప్రజంలందరికీ అందుబాటులోకి వస్తుందని ట్వీట్ చేశారు. ఈ వ్యాక్సిన్ను యూకేలో పరీక్షించగా 89.3శాతం సామర్థ్యంతో పని చేస్తున్నట్టుగా వెల్లడైంది. దక్షిణాఫ్రికా, యూకే వేరియెంట్లను టీకా సమర్థంగా ఎదుర్కోగలదు. గత ఏడాది ఆగస్టులోనే నొవావాక్స్, ఎస్ఐఐ వ్యాక్సిన్ తయారీ, అమ్మకాలకు సంబంధించి ఒక అంగీకారానికి వచ్చాయి. ఆక్స్ఫర్డ్–ఆస్ట్రాజెనికా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ను ఇప్పటికే తయారు చేస్తున్న సీరమ్ ఇనిస్టిట్యూట్ ఇప్పుడు కొవొవాక్స్ ఉత్పత్తిని కూడా చేపట్టనుంది. కరోనాపై పోరాటంలో భారత్ ఇతర దేశాలకు కూడా అండగా ఉంటూ కోవిషీల్డ్ వ్యాక్సిన్ను ప్రపంచ దేశాలకు పంపిణీ చేస్తోంది. విదేశాలకే ఎక్కువ వ్యాక్సిన్లు భారత్లో ప్రజలకి వేసిన కరోనా వ్యాక్సిన్ల కంటే ఎక్కువ మొత్తంలో టీకా డోసులు విదేశాలకు పంపిణీ చేసినట్టుగా ఐక్యరాజ్యసమితిలో డిప్యూటీ శాశ్వత ప్రతినిధి నాగరాజ్ చెప్పారు. ప్రపంచ దేశాల్లో వ్యాక్సిన్ అసమానతలు యూఎన్ స్ఫూర్తిని దెబ్బతీస్తాయని ఐరాససర్వ ప్రతినిధి సభలో ఆందోళన వ్యక్తం చేశారు. కోవిడ్ వ్యాక్సిన్ నిరుపేద దేశా>లకు కూడా అందాలన్న యూఎన్ రాజకీయ డిక్లరేషన్కు భారత్ కూడా మద్దతు పలికింది. ఎక్కువ వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తున్న కొద్దీ సవాళ్లను అధిగమించగలమని వ్యాక్సిన్ లభ్యత, అందుబాటులో ధర, పంపిణీ, నిరుపేద దేశాలకు కూడా పంపేలా సహకారం భారత్ బాగా ఇస్తోందని వివరించారు. భారత్ 70కిపైగా దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్లను పంపిణీ చేస్తోంది. -
కరోనా వ్యాక్సిన్.. వేధించే సందేహాలు.. సమాధానాలు
కోవిడ్ నిరోధం కోసం వ్యాక్సిన్ రాకముందు ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ ప్రజలు వేచిచూశారు. తీరా అందుబాటులోకి వచ్చాక వారిలో వ్యాక్సిన్పై అనేక రకాల సందేహాలూ, సంశయాలూ ముప్పిరిగొంటున్నాయి. సాధారణంగా గుండెజబ్బులు ఉన్నవారిలో ఇవి మరీ ఎక్కువగా ఉంటున్నాయి. దీనికితోడు రక్తం గడ్డకట్టే ధోరణిని పెంపొందిస్తుందా అనే సందేహం తో కొన్నిదేశాల్లో దీని వాడకాన్ని తాత్కాలికంగా ఆపడంతో ఆ సందేహాలు మరింతగా పెరిగాయి. ఇటీవల చాలామందిలో వాక్సిన్ పై సందేహాలూ ఎక్కువయ్యాయి. ప్రత్యేకించి బ్లడ్ థిన్నర్స్ వాడే వారు వ్యాక్సిన్ తీసుకోవద్దంటూ భారత్ బయోటిక్, సీరమ్ ఇన్స్టిట్యూట్ వాళ్లు మన ఫ్యాక్ట్షీట్లో చెప్పిన అంశాలతో గుండెజబ్బులున్నవారిలో ఈ సందేహాలు మరింత ఎక్కువయ్యాయి. అలాంటి సంశయాలున్నవారికి వ్యాక్సిన్పై అపోహలు తొలిగేలా మరింత విపులమైన సమాధానాలను తెలుసుకోండి...నిశ్చింతగా వ్యాక్సిన్ తీసుకోండి. ►రక్తాన్ని పలుచబార్చే మందులు (బ్లడ్ థిన్నర్స్) వాడేవాళ్లు కోవిడ్–19 వ్యాక్సిన్ వేసుకోవచ్చా? ఈ విషయంలో సందిగ్ధత రావడానికి భారత్ బయోటెక్ వాళ్లూ, సీరమ్ ఇన్సి్టట్యూట్ సంస్థ విడుదల చేసిన ఫ్యాక్ట్ షీట్ కారణమైంది. బ్లడ్ థిన్నర్స్ వాడేవారు ఈ వ్యాక్సిన్ను తీసుకోకూడదని అందులో ఉంది. అయితే వాస్తవానికి బ్లడ్ థిన్నర్స్ తీసుకునేవాళ్లలో ఈ వ్యాక్సిన్ వలన ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఏమీ ఉండదు గానీ ఇంజక్షన్ ఇచ్చిన దగ్గర రక్తం గడ్డకట్టే అవకాశం మాత్రం కొంతమేరకు ఉండవచ్చు. అంతకుమించి ఎలాంటి దుష్ఫలితాలూ ఈ మందుల వల్ల వచ్చే అవకాశం ఉండదు. బ్లడ్ థిన్నర్స్ రెండు రకాలుంటాయి. ఒక రకాన్ని ‘యాంటీ ప్లేట్లెట్స్’ అంటారు రెండో రకాన్ని ‘యాంటీ కోయాగ్యులెంట్స్’ అంటారు. యాంటీ ప్లేట్లెట్స్ అంటే ఆస్పిరిన్, క్లోపిడోగ్రెల్, టికాగ్రిలార్, ప్రాసూగ్రిల్ లాంటివి. ఇవి వాడేవాళ్లు నిర్ద్వంద్వం గా కోవిడ్ వ్యాక్సిన్ని తీసుకోవచ్చు. ఈ బ్లడ్ థిన్నర్స్ ఎక్కువ గా హార్ట్ఎటాక్ వచ్చినవాళ్లు వాడుతూ ఉంటారు. వీటిని వ్యాక్సిన్ తీసుకునే ముందు ఆపినట్లయితే ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందున వీటిని ఆపకుండానే వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మందులు వేసుకునే వాళ్లు వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందర గుండె జబ్బుల నిపుణుల దగ్గర అనుమతి తీసుకునే అవసరం లేదు. మరొక రకం బ్లడ్ థిన్నర్స్ని ‘యాంటీకోయాగ్యులెంట్స్’ అని పిలుస్తారని చెప్పుకున్నాం కదా. వార్ఫేరిన్, అసిట్రోమ్ ఇలాంటి మందుల్ని పాత రకం యాంటీకోయాగ్యులెంట్స్ అంటారు. వాల్వ్ మార్పిడి ఆపరేషన్ చేయించుకున్న వాళ్లు, కొన్ని రకాల కండిషన్ల కారణంగా రక్తం గడ్డకట్టే స్వభావం ఉన్న వాళ్లు ఈ మందుల్ని వాడుతుంటారు. అలాంటి వారు ఆ మందులు సరైన మోతాదులో సరైన విధంగా పనిచేస్తున్నాయా లేదా అనేది తెలుసుకోవడం కోసం పీటీ విత్ ఐఎన్ఆర్ అనే పరీక్ష క్రమబద్ధంగా చేయించుకుంటూ ఉంటారు. ఈ పరీక్షని వ్యాక్సిన్ ముందుకూడా చేయించుకోవచ్చు. ఒకవేళ ఈ ఐఎన్ఆర్ పరీక్ష మూడు కన్నా తక్కువ ఉన్నట్లయితే ఎలాంటి సందేహం లేకుండా వ్యాక్సిన్ వేసుకోవచ్చు. ఐఎన్ఆర్ వాల్యూ మూడు కన్నా ఎక్కువ ఉన్నట్లయితే అప్పుడు గుండె జబ్బు డాక్టర్ని సంప్రదించవచ్చు. ఇకపోతే కొత్తతరం యాంటీ కొయాగ్యులెంట్స్ అనేవి ఇంకొన్ని బ్లడ్ థిన్నర్స్. రివారోక్సబాన్, ఎపిక్సబాన్, డాబిగాట్రాన్ అనే మందులు ఈ కోవకు చెందినవి. ఈ మందులు వేసుకునే వాళ్ళు కూడా కోవిడ్–19 వ్యాక్సిన్ని సేఫ్గా వేసుకోవచ్చు. బ్లడ్ థిన్నర్స్ వేసుకునే వాళ్లు కోవిడ్ –19 వ్యాక్సిన్ తీసుకునే ముందు వాళ్ల మందుల వివరాలను వ్యాక్సినేషన్ అధికారికి చెప్పాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇంజక్షన్ తీసుకున్న తర్వాత ఇంజక్షన్ తీసుకున్న ప్రదేశాన్ని ఒక ఐదు నిమిషాల పాటు గట్టిగా నొక్కి పట్టుకోవాల్సి ఉంటుంది. ఈ మందులు వేసుకునే వాళ్ళు వాక్సిన్ కోసం వీటిని ఆపడం అనేది కొన్నిసార్లు ప్రమాదకరం కావచ్చు. అందువల్ల ఏదైనా కారణాల వల్ల ఒకవేళ ఈ మందుల్ని ఆపదలుచుకుంటే మాత్రం వాటికి సంబంధించిన డాక్టర్ని ఖచ్చితంగా సంప్రదించాలి. ►కోవిడ్–19 వాక్సిన్ తర్వాత రక్తం గడ్డకట్టే అవకాశం ఉంటుందా? ఈ కారణంతో యూరోప్లో అనేక దేశాలు వ్యాక్సిన్ ని తాత్కాలికంగా నిలిపివేశారు అనే వార్తలు వస్తున్నాయి. అవి నిజమేనా? ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనికా వాక్సిన్ వాడిన తర్వాత కొంతమందిలో రక్తం గడ్డ కట్టిందనే అనుమానంతో కొన్ని యూరోపియన్ దేశాలు ఈ వ్యాక్సిన్ని తాత్కాలికంగా నిలిపివేశాయి. అయితే ఆ కంపెనీ అధికారులు, యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ అధికారులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారులు... ఈ ముగ్గురూ చెప్పే విషయం ఏమిటంటే వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కొంతమందికి రక్తం గడ్డకట్టినప్పటికీ వ్యాక్సిన్ వల్లనే రక్తం గడ్డకట్టినట్లుగా ఎలాంటి ఆధారాలూ లేవు అని. లక్షమంది ప్రజల్ని తీసుకున్నట్లయితే వాళ్లలో వ్యాక్సిన్ వాడనప్పటికీ కొంతమందిలో రక్తం గడ్డకట్టే అవకాశం ఉంటుంది. వాక్సిన్ తరువాత అదే లక్షమందిలో ఎక్కువమందికి రక్తం గడ్డకడితే గనక అప్పుడు వ్యాక్సిన్ వల్లనే రక్తం గడ్డకట్టే అవకాశం పెరిగిందని అనుకోవచ్చు. కానీ రక్తం గడ్డకట్టే స్వభావం వ్యాక్సిన్ తీసుకోడానికి ముందూ... వ్యాక్సిన్ తీసుకున్న తర్వాతా ఏ మాత్రం ఎక్కువగా లేదని ఆస్ట్రోజెనికా కంపెనీ చెబుతోంది. మన దేశంలో కూడా వాక్సిన్ తర్వాత వచ్చే దుష్ఫలితాల గురించి పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తున్నామని డీసీజీఐ వెల్లడించింది. ఇప్పటివరకు మాత్రం ఇలాంటి రక్తం గడ్డకట్టే స్వభావం ఇండియా లో ఉన్న ఏ వ్యాక్సిన్తోనూ కనపడలేదని తెలుస్తోంది. ►కోవిడ్–19 వాక్సిన్ తర్వాత బీపీగానీ, షుగర్ గాని వచ్చే అవకాశం ఉంటుందా? కోవిడ్–19 వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కొంతమందిలో బీపీ ఎక్కువకావడం లేదా మరికొంతమందిలో బీపీ తక్కువ కావడం డాక్టర్ల దృష్టికి వచ్చింది. అయితే ఈ వాక్సిన్ తీసుకోవడం పట్ల ఉన్న అనుమానాలూ, టెన్షన్ల వల్లనే బీపీ పెరగడం గానీ, తగ్గడంగానీ జరుగుతోందని నిపుణుల అభిప్రాయం. బీపీలో ఈ రకమైన మార్పు తాత్కాలికమైనదేననీ, దీర్ఘకాలంలో కోవిడ్ వ్యాక్సిన్ వల్ల బీపీగానీ, షుగర్గానీ వచ్చే అవకాశం లేదని నిపుణులు తెలియజేస్తున్నారు. ►కోవిడ్–19 వాక్సిన్ తర్వాత వంధ్యత్వం వచ్చే అవకాశం ఉంటుందా? ఇది పూర్తిగా నిరాధారమైన సందేహం మాత్రమే. వంధ్యత్వం రావడానికి కోవిడ్ –19కీ లేదా కోవిడ్–19 వ్యాక్సిన్కీ ఎలాంటి సంబంధమూ లేదు. ►కోవిడ్–19∙వ్యాక్సిన్ తర్వాత కొంతమంది హెల్త్ కేర్ వర్కర్స్ ప్రెగ్నెంట్ కావడం జరిగింది. వాళ్లు ప్రెగ్నెన్సీ కంటిన్యూ చెయ్యవచ్చా లేక అబార్షన్ చేయించుకోవాలా? గర్భిణీ స్త్రీలూ, పాలిచ్చే తల్లులకు కోవిడ్–19 వ్యాక్సిన్ని ప్రస్తుతానికి ఇవ్వకూడదని ఇండియన్ డీసీజీఐ నిర్ణయించింది. ఇప్పటివరకు గర్భవతులపై ఈ వ్యాక్సిన్ ప్రయోగం జరగలేదు కాబట్టీ, వారిపై ఎలాంటి ట్రయల్స్ నిర్వహించలేదు కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేగాని ఈ వ్యాక్సిన్ వల్ల గర్భిణుల్లో ఏమైనా దుష్ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నట్టు గా కూడా ఇప్పటివరకైతే ఎలాంటి దాఖలాలూ లేవు. కాబట్టి గర్భిణులు ప్రస్తుతానికి ఈ వ్యాక్సిన్ తీసుకోకూడదు. ఒకవేళ ఈ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత గర్భధారణ జరిగితే గనక అలాంటివారు ఎలాంటి భయాలూ, సందేహాలూ, లేకుండా తమ గర్భధారణ (ప్రెగ్నెన్సీ)ని కొనసాగించవచ్చు. ►వాక్సిన్ వేసుకున్న తర్వాత చేతి దగ్గర నొప్పి లేకపోతే యాంటీబాడీస్ డెవలప్ కావా? వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత భుజం దగ్గర నొప్పి రావడం సహజం. నొప్పి ఉన్నప్పుడు మనకి ఆ ఇంజక్షన్ ద్వారా విడుదలైన యాంటిజెన్ పనిచేస్తోందని కూడా తెలుస్తుంది. వ్యాక్సిన్ పట్ల మన శరీరం ప్రతిక్రియ జరపడం (రియాక్షన్ చూపడం) వల్ల కొంత నొప్పి గాని కొన్నిసార్లు జ్వరం గాని రావచ్చు. అయితే బాగా భుజం నొప్పి వచ్చిన వాళ్లకో... లేదా బాగా జ్వరం వచ్చిన వాళ్లకు మాత్రమే యాంటీబాడీస్ ఎక్కువ మోతాదులో ఉత్పత్తి అవుతాయనడానికి ఆధారాలు లేవు. అసలు ఏ నొప్పి లేకపోయినప్పటికీ వాక్సిన్ తర్వాత యాంటీ బాడీస్ పెద్దమొత్తంలో వృద్ధి కావచ్చు. కాబట్టి వాక్సిన్ వేసుకున్న తర్వాత నొప్పి గురించి భయపడాల్సిన అవసరం లేదని ఎలా చెబుతున్నామో, నొప్పి లేకపోయినా వ్యాక్సిన్ ప్రభావం గురించి భయపడాల్సిన అవసరం లేదని గట్టిగా చెప్పాల్సి వస్తోంది. అంటే... చేతి నొప్పికీ... వ్యాక్సిన్ కారణంగా వృద్ధి అయ్యే యాంటీబాడీస్ సంఖ్యకూ ఎలాంటి సంబంధమూ లేదని అర్థం చేసుకోవాలి. డా. ఎంఎస్ఎస్ ముఖర్జీ, సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ -
భారత టీకాపై చైనా హ్యాకర్ల దృష్టి
న్యూఢిల్లీ/వాషింగ్టన్/బీజింగ్: కోవిడ్–19కి టీకా తయారు చేస్తున్న రెండు భారత ఫార్మా కంపెనీలను చైనా హ్యాకర్లు లక్ష్యంగా చేసుకున్నారని సైబర్ నిఘా సంస్థ ‘సైఫర్మా’ వెల్లడించింది. ‘ఏపీటీ 10’, ‘స్టోన్ పాండా’ అనే పేర్లున్న ఆ హ్యాకింగ్ బృందానికి చైనా ప్రభుత్వం మద్దతుందని పేర్కొంది. ‘భారత్ బయోటెక్’, ‘సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా’ సంస్థలకు చెందిన ఐటీ వ్యవస్థల్లో, పంపిణీ చైన్లో లొసుగులను హ్యాకర్లు గుర్తించారని సింగపూర్, టోక్యోల్లో కార్యాలయాలున్న సైఫర్మా వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా అమ్ముడైన కోవిడ్–19 టీకాల్లో దాదాపు 60% భారత్లోనే ఉత్పత్తి అవుతున్నాయి. కోవిడ్ –19 వ్యాక్సిన్ విషయంలో భారతీయ ఫార్మా ఆధిపత్యాన్ని తగ్గించే లక్ష్యంతో చైనా బృందం ఈ హ్యాకింగ్కు పాల్పడుతోందని సైఫర్మా చీఫ్ ఎగ్జిక్యూటివ్ కుమార్ రితేశ్ తెలిపారు. వారి ప్రధాన లక్ష్యం ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ఉత్పత్తిలో పాలు పంచుకుంటున్న సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియానేనన్నారు. సీరం ఇన్స్టిట్యూట్ పబ్లిక్ సర్వర్లు బలహీనమైన వెబ్ సర్వర్లపై ఆధారపడి ఉన్నాయని వారు గుర్తించారని రితేశ్ తెలిపారు. సైఫర్మా వెల్లడించిన ఈ విషయాలపై సీరమ్ ఇన్స్టిట్యూట్ కానీ, భారత్ బయోటెక్ కానీ స్పందించలేదు. చైనా విదేశాంగ శాఖ కూడా దీనిపై స్పందించేందుకు నిరాకరించింది. పవర్ గ్రిడ్ వ్యవస్థపై దాడి కూడా చైనా పనే భారత్, చైనాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు తీవ్రంగా ఉన్న సమయంలో భారత్లో కీలకమైన పవర్ గ్రిడ్ వ్యవస్థను మాల్వేర్తో చైనా హ్యాకర్ల బృందం లక్ష్యంగా చేసుకుందని అమెరికాకు చెందిన మరో సంస్థ తాజాగా వెల్లడించింది. దాంతో, గత సంవత్సరం ముంబైలో ఒక్కసారిగా విద్యుత్ సరఫరాలో భారీ ఆటంకానికి హ్యాకింగే కారణమనే అనుమానాలు తాజాగా తలెత్తాయి. చైనా ప్రభుత్వంతో సంబంధమున్న ‘రెడ్ఎకో’ అనే హ్యాకర్స్ గ్రూప్ భారత్ పవర్ గ్రిడ్ వ్యవస్థను పలుమార్లు లక్ష్యంగా చేసుకుందని అమెరికా సైబర్ నిఘా సంస్థ ‘రికార్డెడ్ ఫ్యూచర్’ తాజాగా వెల్లడించింది. 2020 జూన్ నుంచి పలుమార్లు 10 ముఖ్యమైన భారతీయ విద్యుత్ సంస్థలపై హ్యాకర్లు దాడి చేశారంది. రెండు నౌకాశ్రయాలను కూడా లక్ష్యంగా చేసుకున్నారని తెలిపింది. ‘ప్లగ్ ఎక్స్ మాల్వేర్ సీ2’ ద్వారా రక్షణ రంగ సంస్థలతో పాటు ప్రభుత్వ సంస్థలను హ్యాక్ చేయడానికి ప్రయత్నించారని పేర్కొంది. కాగా, భారత ‘పవర్ సిస్టమ్ ఆపరేషన్ కార్పొరేషన్’ పనితీరుపై ఎలాంటి మాల్వేర్ దాడి ప్రభావం చూపలేదని, సవాళ్లను ఎదుర్కొనేలా వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని విద్యుత్ శాఖ ప్రకటించింది. మాల్వేర్ కారణంగా ఎలాంటి డేటాను కోల్పోలేదని స్పష్టం చేసింది. మరోవైపు, ‘రికార్డెడ్ ఫ్యూచర్’ ఆరోపణలను చైనా ఖండించింది. భారత పవర్ గ్రిడ్ను ఆటంకపరిచే హ్యాకింగ్ చర్యల్లో తమ పాత్ర ఉందన్న ఆరోపణలను చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్ తోసిపుచ్చారు. అక్టోబర్ 12న ముంబైలో అకస్మాత్తుగా విద్యుత్ సరఫరాకు ఆటంకం ఏర్పడడంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోవడం, గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డ విషయం తెలిసిందే. -
చైనా వక్రబుద్ది: టార్గెట్ కోవిడ్ వ్యాక్సిన్
న్యూఢిల్లీ: గతేడాది ముంబైలో సంభవించిన భారీ పవర్ కట్ వెనక చైనా హ్యాకర్ల హస్తం ఉందనే వార్తను చదివాం. తాజాగా డ్రాగన్ దేశం మరో నీచానికి పాల్పడింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి, పంపిణీ వంటి కార్యక్రమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మన దేశంలో సీరం ఇన్స్టిట్యూట్, భారత్ బయోటెక్ కంపెనీలు అభివృద్ధి చేసిన కోవిన్, కోవాగ్జిన్ టీకాల పంపిణీ కార్యక్రమం అమలవుతోంది. అంతేకాక ఇప్పటికే పలు దేశాలకు కేంద్రం మన వ్యాక్సిన్ డోసులను సరఫరా చేసిన సంగతి తెలిసిందే. ఇక చైనా తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ అంత సమర్థవంతమైంది కాదని ఆ దేశానికి చెందిన పలువురు పరిశోధకులు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చైనా హ్యాకర్లు సీరం ఇన్స్టిట్యూట్, భారత్ బయోటెక్ల ఐటీ సిస్టమ్ని హ్యాక్ చేసేందుకు ప్రయత్నించారట. ఈ విషయాన్ని సింగపూర్, టోక్యో కేంద్రంగా పనిచేస్తున్న గోల్డ్మాన్ సాచ్స్ మద్దతుగల సైఫిర్మా అనే కంపెనీ వెల్లడించింది. చైనీస్ హ్యాకింగ్ కంపెనీ యాప్ట్10 అలియాస్ స్టోన్ పాండ అనే కంపెనీ భారత్ బయోటెక్, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) కంపెనీల ఐటి మౌలిక సదుపాయాలు, సప్లై చైన్ సాఫ్ట్వేర్లను హ్యాక్ చేసేందుకు యత్నించినట్లు వెల్లడించింది. వ్యాక్సిన్ రేసులో భారత ఫార్మ కంపెనీలను ఢీకొట్టడం.. వాటి మేధో సంపత్తిని నిర్మూలించడం ఈ హ్యాకర్ల ముఖ్య ఉద్దేశం అని సైఫిర్మా వెల్లడించింది. సీరం ఇన్స్టిట్యూట్ ఆస్ట్రాజెనికాతో కలిసి కోవిడ్ వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తోన్న సంగతి తెలిసిందే. మరి కొద్ది రోజుల్లోనే భారీ ఎత్తున ప్రపంచ దేశాలకు ఈ వ్యాక్సిన్ డోసులను సరఫరా చేయనుంది సీరం. ఈ నేపథ్యంలో చైనా యాప్ట్10 సీరంని టార్గెట్ చేసి.. వ్యాక్సిన్కు సంబంధించిన డాటాను కొల్లగొట్టేందుకు యత్నించినట్లు సైఫిర్మా తెలిపింది. యాప్ట్10 అనేది చైనీస్ మినిస్ట్రి ఆఫ్ స్టేట్ సెక్యూరిటీతో కలిసి పని చేస్తుందని అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ 2018లో వెల్లడించింది. "సీరం ఇన్స్టిట్యూట్ విషయానికి వస్తే, వారు బలహీనమైన వెబ్ సర్వర్లను నడుపుతున్నారు. వారి పబ్లిక్ సర్వర్లు చాలా బలహీనంగా ఉన్నాయి.. ఇవి హాని కలిగించే వెబ్ సర్వర్లు. యాకర్లు ఈ బలహీనమైన వెబ్ అప్లికేషన్, కంటెంట్-మేనేజ్మెంట్ సిస్టమ్ గురించి కూడా మాట్లాడుతున్నారు. ఇది చాలా భయంకరమైనది’’ అని సైఫిర్మా ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. దీనిపై చైనా విదేశాంగ శాఖ స్పందన కోరగా.. ఎలాంటి సమాధానం లభించలేదు. అలానే సీరం, భారత్బయోటెక్లు కూడా దీనిపై స్పందిచలేదు అన్నారు. భారతదేశం, కెనడా, ఫ్రాన్స్, దక్షిణ కొరియా,అమెరికాలోని కోవిడ్ వ్యాక్సిన్ కంపెనీలను లక్ష్యంగా చేసుకుని రష్యా, ఉత్తర కొరియా నుంచి సైబర్ దాడులు జరిగినట్లు మైక్రోసాఫ్ట్ నవంబర్లో తెలిపింది. ఉత్తర కొరియా హ్యాకర్లు బ్రిటిష్ ఔషధ తయారీదారు అస్ట్రాజెనీకా వ్యవస్థల్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించారని రాయిటర్స్ నివేదించింది. చదవండి: కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న ప్రధాని మోదీ ముంబై పవర్కట్: డ్రాగన్ పనే! -
సీరం వ్యాక్సిన్లు అందుకున్న తొలి విదేశీ దేశం
అక్రా: భారత్లోని పుణెలో సీరమ్ ఇనిస్టిట్యూట్ తయారు చేస్తున్న కోవిషీల్డ్ కోవిడ్ వ్యాక్సిన్ 6 లక్షల డోసులు ఘనా దేశానికి చేరుకున్నాయి. నిరుపేద దేశాలకు కరోనా టీకా లభ్యమయ్యేలా ఐక్యరాజ్య సమితి ప్రవేశపెట్టిన కోవాగ్జ్ కార్యక్రమంలో భాగంగా ఈ టీకా డోసుల్ని పంపించారు. 2021 చివరి నాటికి కనీసం 2 బిలియన్ మోతాదుల కరోనా వ్యాక్సిన్లను అందించే అపూర్వ ప్రయత్నంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తెలిపింది. సీరం త్వరలో 25-30 దేశాలకు వ్యాక్సిన్లను పంపిణీ చేయనున్నట్లు సీరం సీఈవో అదర్ పూనవల్లా చెప్పారు. కోవిక్స్ కోవిషీల్డ్ మొదటి బ్యాచ్ మోతాదులను అందించడం చారిత్రాత్మక క్షణంగా అభివర్ణించిన ఆయన, మహమ్మారిపై పోరులో భాగంగా సరసమైన ధరలో, ఇమ్యునోజెనిక్ వ్యాక్సిన్లతో అందించడంలో సీరం ముందంజలో ఉంటుందన్నారు. కోవాక్స్ ఫెసిలిటీ కార్యక్రమం కింద కరోనా టీకా లభించే తొలి దేశం ఘనాయే కావడం విశేషం. యూనిసెఫ్ ఆర్డర్ చేసిన ఈ కరోనా టీకా డోసులు ఆక్రా అంతర్జాతీయ విమానాశ్రయానికి బుధవారం చేరుకున్నాయి. కోవాగ్జ్ కార్యక్రమంలో భాగస్వామ్యమైన 92 దేశాల్లో ఘన కూడా ఉన్నట్టుగా ఆ దేశ సమాచార శాఖ మంత్రి కోజో అపాంగ్ చెప్పారు. ఘనా జనాభా 3 కోట్లు. ఈ దేశంలోఇప్పటివరకు 81 వేల కేసులు, 600మరణాలు సంభవించాయి. మార్చి 2 నుంచి టీకా డోసుల్ని ఇవ్వడానికి ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసింది. డబ్ల్యూహెచ్ఓ, వ్యాక్సిన్ గ్రూప్ గవీ, కొయిలేషన్ ఫర్ ఎపిడిమిక్ ప్రిపేర్డ్నెస్ ఇన్నోవేషన్ సంయుక్తంగా పేద దేశాలను ఆదుకోవడానికి ఈ కార్యక్రమం ప్రారంభించాయి. -
కోవిషీల్డ్ సేఫ్ కాదు: కేంద్రానికి హైకోర్టు నోటీసులు
చెన్నై: సీరం ఇన్స్టిట్యూట్ కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల తన సృజనాత్మకత దెబ్బతిన్నదని.. ఈ వ్యాక్సిన్ని సురక్షితం కాదని ప్రకటించండి అంటూ చెన్నైకి చెందిన ఓ వలంటీర్ గతేడాది డిసెంబర్లో కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన సీరం.. సదరు వలంటీర్ చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తమని ఖండించింది. అతడిపై 100 కోట్ల పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం మద్రాస్ హై కోర్టు ఈ పిటిషన్ని విచారించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ)కి నోటీసులు జారీ చేసింది. 2021, మార్చి 26 వరకు దీనిపై సమాధానం చెప్పాల్సిందిగా హై కోర్టు ఆదేశించింది. కేసు వివరాలు.. చెన్నైకి చెందిన అసిఫ్ రియాజ్(41) అనే వలంటీర్ గతేడాది అక్టోబర్ 1న సీరం ఇన్స్టిట్యూట్ కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నాడు. ఓ పది రోజలు తర్వాత అతడికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తినట్లు వెల్లడించాడు. టీకా వల్ల మెదడు దెబ్బతిన్నదని వైద్య పరీక్షలో స్పష్టమైందన్నాడు. మాట, చూపు, జ్ఞాపక శక్తిలోనూ దుష్ప్రభావాలు తలెత్తాయన్నాడు. దీనితో భవిష్యత్తులోనూ అనారోగ్య సమస్యలు ఎదురయ్యే ప్రమాదముందన్నాడు. ఇందుకు పరిహారంగా తనకు 5 కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. టీకా దుష్ప్రభావాలను దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించాడు. పరిహారంతో పాటు తక్షణమే టీకా ప్రయోగాలను నిలిపేయాలని డిమాండ్ చేస్తూ కోర్టును ఆశ్రయించాడు. ఇప్పడేమంటున్నాడు.. కోర్టు తీర్పు అనంతరం అసిఫ్ రియాజ్ మాట్లాడుతూ.. "నాకు న్యాయం జరుగుతుందని నేను నమ్ముతున్నాను. నేను తీసుకున్న (కోవిషీల్డ్) వ్యాక్సిన్ వల్లనే నాకు అనారోగ్య సమస్యలు తలెత్తినట్లు వైద్యులు వెల్లడించారు. దీని గురించి ఎవరికి చెప్పినా ప్రయోజనం ఉండదని నాకు తెలుసు. ఇక కోర్టును ఆశ్రయించడం తప్ప నాకు వేరే మార్గం లేదు. ఈ కేసులోని వాస్తవాల ఆధారంగా కోర్టు దీన్ని విచారిస్తుందని నేను ఆశిస్తున్నాను. టీకా కారణంగా నేను బాధపడ్డానని నన్ను పరీక్షించిన వైద్య నిపుణలు వెల్లడించారు. నాకు న్యాయం జరగుతుందని నేను భావిస్తున్నాను’’ అన్నాడు. చదవండి: వ్యాక్సిన్పై వార్.. 100 కోట్లకు దావా! వ్యాక్సిన్: ‘అలాంటివారిపై ఓ కన్నేసి ఉంచండి’ -
జూన్ కల్లా మరో వ్యాక్సిన్
న్యూఢిల్లీ: కోవిడ్–19ను నిలువరించే కోవోవ్యాక్స్ అనే మరో టీకాను వచ్చే జూన్కల్లా అందుబాటులోకి తెస్తామని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ)ప్రకటించింది. ట్రయల్స్ ప్రారంభించేందుకు అనుమతులు కోరుతూ ఇప్పటికే దరఖాస్తు చేశామని ఎస్ఐఐ సీఈవో అధర్ పూనావాలా శనివారం ట్విట్టర్లో తెలిపారు. నోవావ్యాక్స్తో కలిసి అభివృద్ధి చేస్తున్న ఈ టీకా పనితీరు అద్భుతంగా ఉందన్నారు. 2021 జూన్ కల్లా ఈ టీకా అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ– ఆస్ట్రా జెనెకా ఉమ్మడిగా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్ టీకాను ఎస్ఐఐ ఉత్పత్తి చేస్తున్న విషయం తెలిసిందే. దేశంలో ప్రారంభమైన ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమంలో కోవిషీల్డ్తోపాటు కోవాగ్జిన్ టీకాలను ఇస్తున్న విషయం తెలిసిందే. ఇందుకోసం కేంద్రం 1.1 కోట్ల డోసుల కోవిషీల్డ్ టీకాను ఎస్ఐఐ నుంచి కొనుగోలు చేసింది. ఏప్రిల్ నాటికి నాలుగైదు కోట్ల నోవావ్యాక్స్ టీకా డోసులను ఉత్పత్తి చేస్తామని ఇటీవలే పూనావాలా ప్రకటించారు. 35 లక్షల మందికి కోవిడ్ టీకా ఆరోగ్య సిబ్బంది కోసం ప్రారంభించిన దేశవ్యాప్త కోవిడ్–19 వ్యాక్సినేషన్లో ఇప్పటి వరకు 35 లక్షల మందికి టీకా ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. గడిచిన 24 గంటల్లో 5.70 లక్షల మందికి టీకా వేసినట్లు తెలిపింది. వీరిలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్ నుంచి 4,63,793 మంది, రాజస్తాన్లో 3,24,973 మంది, కర్ణాటకలో 3,07,891 మంది, మహారాష్ట్రలో 2,61,320 మంది లబ్ధిదారులు ఉన్నారంది. ఇప్పటి వరకు వ్యాక్సినేషన్ కోసం 63,687 సెషన్లు నిర్వహించినట్లు వెల్లడించింది. దేశంలో కోవిడ్ యాక్టివ్ కేసులు 1.7 లక్షలకు తగ్గిపోయాయని ఆరోగ్య శాఖ తెలిపింది. మొత్తం పాజిటివ్ కేసుల్లో యాక్టివ్ కేసులు 1.58% మాత్రమేనని వెల్లడించింది. -
కరోనా టీకా: సీరం మరో కీలక ప్రకటన
ముంబై: దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ పంపిణీ కొనసాగుతున్న వేళ సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ ఆదార్ పూణావాల మరో కీలక ప్రకటన చేశారు. అమెరికాకు చెందిన ఫార్మా సంస్థ నోవావాక్స్ భాగస్వామ్యంతో రూపొందిస్తున్న కోవోవాక్స్ మంచి ఫలితాలనిస్తోందని పేర్కొన్నారు. యూకే కోవిడ్-19 స్ట్రెయిన్పై నోవోవాక్స్ 89.3 శాతం ప్రభావంతంగా పనిచేస్తున్నట్లు వెల్లడైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వచ్చే జూన్ నాటికి కోవోవాక్స్ను అందుబాటులోకి తీసుకువస్తామని పూణావాలా తెలిపారు.(చదవండి: వ్యాక్సిన్లో భారత్ రికార్డ్: ప్రపంచంలోనే తొలిస్థానం) ఈ మేరకు.. ‘‘కోవిడ్-19 టీకా తయారీలో నోవోవాక్స్తో కలిసి పనిచేస్తున్న క్రమంలో మెరుగైన ఫలితాలు పొందాం. భారత్లో కూడా ఇందుకు సంబంధించి ట్రయల్స్ మొదలుపెడతాం. జూన్ 2021 నాటికి కోవోవాక్స్ను లాంచ్ చేస్తాం’’ అని ఆయన ట్వీట్ చేశారు. కాగా అతిపెద్ద వ్యాక్సిన్ తయారీ సంస్థగా పేరొందిన సీరం, ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా భాగస్వామ్యంతో ఇప్పటికే 'కోవిషీల్డ్' రూపొందించిన విషయం తెలిసిందే. కోవిషీల్డ్తో పాటు హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ డోసులను ఇప్పటికే దేశవ్యాప్తంగా పంపిణీ చేస్తున్నారు. విదేశాలకు సైతం భారత్ కోవిషీల్డ్ డోసులు ఎగుమతి చేస్తోంది. కాగా అమెరికాకు చెందిన నోవావాక్స్ను 15 వేల మందికి పైగా వాలంటీర్లపై ప్రయోగించగా, వారిలో 89.3 శాతం మందిలో కరోనాను తట్టుకునే యాంటీబాడీలు తయారయ్యాయి. ఇక 85.6 మందిలో కొత్త స్ట్రెయిన్కు కూడా తట్టుకోగల సామర్థ్యం వచ్చిందని సంస్థ ప్రకటించింది. అంతేగాక దక్షిణాఫ్రికా కరోనా స్ట్రెయిన్పై సైతం 60 శాతం ప్రభావం చూపిందని తెలిపింది. ఈ స్ట్రెయిన్పై ఏ వ్యాక్సిన్ పని చేయబోదన్న వార్తల నేపథ్యంలో నోవావాక్స్ కొంతమేర అడ్డుకట్ట వేయడం ఊరట కలిగించే అంశంగా పరిణమించింది. Our partnership for a COVID-19 vaccine with @Novavax has also published excellent efficacy results. We have also applied to start trials in India. Hope to launch #COVOVAX by June 2021! — Adar Poonawalla (@adarpoonawalla) January 30, 2021 -
వ్యాక్సిన్: ‘అలాంటివారిపై ఓ కన్నేసి ఉంచండి’
న్యూఢిల్లీ: కోవిడ్ సామర్థ్యంపై ప్రజల్లో అపోహలు రేకెత్తిస్తూ, తప్పుడు వార్తలను ప్రచారం చేస్తూ పుకార్లు పుట్టించేవారిపై ఓ కన్నేసి ఉంచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. కోవిడ్ వ్యాక్సిన్లపై తప్పుడు వార్తలు ప్రచారం చేసేవారిని గుర్తించి, అటువంటి వారిపై తగు చర్యలు తీసుకోవాలని కేంద్రం, రాష్ట్రాలకు సూచించింది. ఈ మేరకు హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సమాచారమిచ్చారు. అందులో సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేస్తోన్న కోవిషీల్డ్, భారత్ బయోటెక్ తయారుచేస్తోన్న కోవాగ్జిన్ సురక్షితమైనవి అజయ్ భల్లా అన్నారు. ఈ రెండు వ్యాక్సిన్లు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయని దేశంలోని నేషనల్ రెగ్యులేటరీ అథారిటీ గుర్తించిన విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. భారత్లో తయారు చేస్తోన్న ఈ రెండు వ్యాక్సిన్ల వ్యాక్సినేషన్ ప్రక్రియకు జనవరి 16 కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెల్సిందే. అయితే ఔషధ నియంత్రణ సంస్థ అనుమతులు పొందిన ఈ రెండు వ్యాక్సిన్ల సమర్థతపై అనేక అనుమానాలకు తావిస్తూ, అపోహలు సృష్టిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిపట్టించే ప్రయత్నం సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందని, అలా చేస్తే చర్యలు తప్పవన్నారు. -
స్టెయిన్తో యూరప్ బెంబేలు, మరణాలూ ఎక్కువే!
కోపెన్హాగెన్: బ్రిటన్లో కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్ యూరప్ని ఊపిరాడనివ్వకుండా చేస్తోంది. 70శాతం వేగంగా కొత్త స్ట్రెయిన్ కేసులు వ్యాప్తి చెందుతున్నట్టుగా డెన్మార్క్ ప్రభుత్వ సంస్థ సీరమ్ ఇనిస్టిట్యూట్ అంచనా వేసింది. డెన్మార్క్లో అత్యంత కఠినంగా లాక్డౌన్ నిబంధనలు అమలు చేస్తున్నప్పటికీ ఒకే వారంలో కేసుల సంఖ్య ఏకంగా 70శాతం ఎగబాకింది. ఈ వైరస్ జన్యుక్రమాన్ని త్వరితగతిన మార్చుకుంటూ ఉండడంతో పాజిటివ్ కేసులు నమోదైన వారిలో ఏ రకమైన వైరస్ సోకిందో విశ్లేషించాల్సి ఉంటుందని సీరమ్ ఇనిస్టిట్యూట్ సైంటిఫిక్ డైరెక్టర్ ట్యారా గ్రోవ్ క్రాజ్ అన్నారు. టీకా తీసుకున్నా జాగ్రత్తలు తప్పదు కరోనా వ్యాక్సిన్ వేసుకున్న వెంటనే రోగ నిరోధక శక్తి రాదని, అందుకే ప్రజలం దరూ కచ్చితంగా లాక్డౌన్ నిబంధనల్ని పా టించాలని ఇంగ్లాండ్ డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ ప్రొఫెసర్ జొనాథన్ వాన్–టామ్ అన్నారు. వ్యాక్సిన్ తీసుకున్న మూడు వారాల తర్వాతే అది పని చేయడం మొదలవుతుందని చెప్పారు. వ్యాక్సిన్ తీసుకున్న వారి నుంచి ఈ వైరస్ వ్యాప్తి చెందదని ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. అందుకే ప్రజలందరూ అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావొద్దని సూచించారు. ‘‘వ్యాక్సిన్ వేసుకున్నా వేసుకోకపోయినా ప్రజలందరూ కచ్చితంగా నిబంధనల్ని పాటించాలి. ప్రజారోగ్యం కోసం ప్రభుత్వం ఇచ్చే సలహాల్ని స్వీకరించాలి. మరణాలు అధికం.. కొత్త స్ట్రెయిన్ వల్ల మరణా లు అధికంగా సంభవిస్తున్నా యని అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వెల్లడించింది. యూకే ఆరోగ్య సంస్థలతో కూడా సీడీసీ మాట్లాడింది. సాధారణ కరోనా వైరస్ సోకిన ప్రతీ వెయ్యి మందిలో 10 మంది ప్రాణాలు కోల్పోతే ఈ కొత్త స్ట్రెయిన్తో సగటున వెయ్యి కేసుల్లో 14 మంది వరకు ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ కూడా ఈ వైరస్తో అత్యధికంగా మరణాలు సంభవిస్తున్నాయని చెప్పారు. అంతేగాక గత వారం రోజుల్లో బ్రిటన్లో మృతుల సంఖ్య ఏకంగా 16 శాతం పెరిగింది. -
సీరం ఘటన: ప్రమాదమా.. విధ్వంసమా..?
ముంబై: ‘సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ)లో అగ్నిప్రమాదానికి గల కారణాన్ని నిర్ధారించేందుకు దర్యాప్తు ప్రారంభించాం. అది పూర్తయిన తర్వాత, ఇది ప్రమాదమా? లేదా విధ్వంసమా? అ ని మాకు తెలుస్తుంది. దర్యాప్తు పూర్తి చేయని వ్వండి. ఈ ఘటనపై ఇప్పుడు ఏమీ చెప్పలేం’ అని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. గురువారం ఎస్ఐఐలో జరిగిన ప్రమాద ఘటనను తెలుసుకునేందుకు సీఎం ఉద్ధవ్ శుక్రవారం ఎస్ఐఐని సందర్శించారు. ప్రమాదానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీఎం ఉద్ధవ్ ఠాక్రే సీరం ఇన్స్టిట్యూట్ సీఈవో అదర్ పూనావాలాతో కలసి విలేకరులతో మాట్లాడారు. ‘గత వారం టీకా డ్రైవ్ ప్రారంభమైనప్పుడు కరోనాపై విజయం సాధించగలమనే ఆశలు రేకెత్తాయి. అయితే టీకా తయారు చేస్తున్న కేంద్రంలో అగ్ని ప్రమాదం గురించి వార్తలు ఆందోళనకు గురిచేశాయి. దురదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు. వీరి కుటుం బ సభ్యుల బాధ్యత సీరం ఇన్స్టిట్యూటే తీసుకుం టుంది. ప్రభుత్వం తరఫున కూడా వీరికి సాయం అందజేస్తాం’ అని సీఎం పేర్కొన్నారు. ‘కోవిడ్–19 వ్యాక్సిన్ తయారు చేస్తున్న కేంద్రానికి ఎలాంటి హానీ జరగలేదు. ప్రమాదం జరిగిన రెండు అంతస్తుల్లో కొత్త సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఆ రెండు అంతస్తుల్లో వేరే టీకాలు తయా రు చేస్తున్నారు. కోవిషీల్డ్ వ్యాక్సిన్ తయారీ యూనిట్.. అగ్నిప్రమాదం జరిగిన ప్రదేశానికి కిలోమీటర్ దూరంలో ఉంది. దీంతో వ్యాక్సిన్ల ఉత్పత్తికి ఎలాంటి ఆటంకం కలగదు’ అని ఉద్ధవ్ వెల్లడించారు. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే తాను పోస్ట్ చేసిన ట్వీట్ గురించి పూనావాలాను అడిగినప్పడు.. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, ఎవరికీ గాయాలు కాలేదని తెలిసింది. దీంతో ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేనందుకు సంతోషంగా ఉంది అని ట్వీట్ చేశాను. కొంత సమయం తర్వాత ఐదు మృతదేహాలను కనుగొన్నారు. మరణించిన కార్మికులందరూ కాంట్రాక్టర్ ఉద్యోగులని, దీంతో వారి వివరాలు ఎస్ఐఐ వద్ద లేకపోవడంతో తప్పిందం జరిగింది’ అని పేర్కొన్నారు. (చదవండి: టీకాపై అపోహలు తొలగిద్దాం) రూ.1,000 కోట్ల నష్టం జరిగింది... సీరం ఇన్స్టిట్యూట్ గురువారం జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో దాదాపు రూ.1,000 కోట్ల నష్టం జరిగిందని ఆ కంపెనీ సీఈవో అదార్ పూనావాలా తెలిపారు. ప్రమాదం జరిగిన అంతస్తుల్లో భవిష్యత్తు అవసరాల కోసం ఫిల్లింగ్ లైన్, బల్క్ ప్రొడక్షన్ లైన్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందులో ఉత్పత్తి ప్రారంభించాల్సి ఉందని, ఇంతలోనే ఈ ఘటన చోటుచేసుకోవడంతో నష్టం భారీగానే జరిగిందని పేర్కొన్నారు. కోవిడ్–19 వ్యాక్సిన్ నిల్వ చేయని భవనంలో ఈ సంఘటన జరిగింనందున తాము చాలా అదృష్టవంతులమన్నారు. రోటా వైరస్, బీసీజీ వ్యాక్సిన్ల తయారీ కోసం ఉద్దేశించిన భవనంలో ఈ ప్రమాదం జరిగిందని, దీంతో భవిష్యత్తులో ఈ వ్యాక్సిన్ల ఉత్పత్తిపై ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. ఈ ప్రమాదంతో ఆర్థికంగా నష్టపోయాం కానీ వ్యాక్సిన్ సరఫరా విషయంలో ఆటంకం కలగదని పూనావాలా స్పష్టం చేశారు. మూడు ఏజెన్సీలతో విచారణ.. వ్యాక్సిన్ తయారీదారు సీరం ఇన్స్టిట్యూట్లో గురువారం జరిగిన అగ్నిప్రమాదం ఘటనపై విచారించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన మూడు ఏజెన్సీలు సిద్ధమయ్యాయి. పుణే మున్సిపల్ కార్పొరేషన్ (పీఎంసీ), పుణే మెట్రోపాలిటన్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎంఆర్డీఏ), మహారాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి కార్పొరేషన్ (ఎంఐడీసీ)లు సీరం ప్రమాద ఘటనపై కలిసి దర్యాప్తు చేయనున్నాయి. సెజ్–3 ప్రాంతంలోని సీరం ఇన్స్టిట్యూట్కు చెందిన ఐదంతస్తుల భవనంలో గురువారం మంటలు చెలరేగగా.. ఆ భవనంలోని రెండు అంతస్తులు పూర్తిగా కాలిపోయాయి. అగ్నిప్రమాదంలో ఐదుగురు చనిపోయారు. ఈ భవనంలో మంటలు చెలరేగడానికి కారణమేంటో విచారించేందుకు పీఎంసీ, ఎంఐడీసీలతో కలిసి పీఎంఆర్డీఏ ఉమ్మడి దర్యాప్తు చేపట్టనున్నట్లు పీఎంఆర్డీఏ చీఫ్ ఫైర్ ఆఫీసర్ దేవేంద్ర పాట్ఫడే తెలిపారు. (చదవండి: ఒక్కసారి తిరస్కరిస్తే.. మళ్లీ నో కరోనా వ్యాక్సిన్!) ప్రమాదంలో భవనంలోని 4, 5వ అంతస్తులు పూర్తిగా పాడయ్యాయని పేర్కొన్నారు. పలు రకాల పరికరాలు కూడా ధ్వంసం అయ్యాయన్నారు. దర్యాప్తు తర్వాత అసలు అగ్నిప్రమాదం ఎలా సంభవించిందనేది తెలుస్తుందన్నారు. అయితే కారణాలేమై ఉంటాయన్న దానిపై మాత్రం స్పందించడానికి ఆయన నిరాకరించారు. ప్రమాదానికి కారణం ఏమై ఉంటుందన్న దానిపై ఇప్పుడే స్పందించలేమని ఎంఐడీసీ చీఫ్ ఫైర్ ఆఫీసర్ సంతోష్ వార్రిక్ పేర్కొన్నారు. సీరం అగ్ని ప్రమాద ఘటనపై విచారణ ప్రారంభించామని, అసలు ప్రమాదం ఎలా సంభవించిందో తెలుసుకోవడమే తమ దర్యాప్తు ముఖ్యోద్దేశం అని పీఎంసీ ఫైర్ శాఖ అధిపతి ప్రశాంత్ రానిప్సే తెలిపారు. ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలానికి చేరుకుని, ఆధారాలు సేకరిస్తున్నారని మరో అధికారి వెల్లడించారు. ఈ ప్రమాదానికి సంబంధించి హడాప్సర్ పోలీస్ స్టేషన్లో ‘మంటలు చెలరేగడం, ప్రమాదవశాత్తు మృతి’ కేసు నమోదు చేశామని స్థానిక జోన్–5 డీసీపీ నమ్రతా పాటిల్ వెల్లడించారు. ఐదుగురు చనిపోవడం బాధాకరం..: ఐరాస ఐక్యరాజ్యసమితి: పుణేలోని సీరం ఇన్స్టిట్యూట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని, ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరుగుతుందని భావిస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ పేర్కొన్నారని ఆయన అధికార ప్రతినిధి వెల్లడించారు. ప్రమాదంలో మృతిచెందిన కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలుపుతున్నామని సెక్రటరీ జనరల్ ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ గురువారం విలేకరుల సమావేశంలో వ్యాఖ్యానించారు. సీరం ఇన్స్టిట్యూట్ అగ్ని ప్రమాద ఘటనపై యూఎన్ చీఫ్ స్పందించారా అన్న ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. (చదవండి: అక్కడ వేసవి వరకూ లాక్డౌన్..) ప్రమాదవశాత్తు జరిగింది..: పవార్ ముంబై: పుణేలోని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ)లో జరిగిన అగ్ని ప్రమాద ఘటన ప్రమాదవశాత్తు జరిగిందే తప్ప, ఇందులో పనిచేసే శాస్త్రవేత్తల సమగ్రత గురించి ఎలాంటి సందేహం లేదని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ పేర్కొన్నారు. గురువారం సీరం ఇన్స్టిట్యూట్లో జరిగిన అగ్నిప్రమాదం వెనుక విధ్వంసం ఆరోపణలు ఉన్నాయన్న విలేకరుల ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. శుక్రవారం కొల్హాపూర్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘సీరం ఇన్స్టిట్యూట్లో జరిగింది ఒక ప్రమాదం. ఈ ఘటనలో ఎలాంటి విధ్వంసం లేదు. దీని గురించి ఈ రోజు మాట్లాడటం మాకు సరైంది కాదు. అయితే సీరంలో పనిచేసే నిపుణులు, శాస్త్రవేత్తల సమగ్రత గురించి మాకు ఎలాంటి సందేహం లేదు’అని అన్నారు. కోవిడ్–19 వ్యాక్సిన్ తీసుకోవడంలో ప్రజలు సంకోచిస్తున్నారన్న ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, ఎస్ఐఐ ప్రపంచ ప్రఖ్యాత సంస్థ అని, నిపుణులు ఆ సంస్థ ఉత్పత్తుల వాడకాన్ని సమర్థించారని పేర్కొన్నారు. ప్రధాని మోదీ కూడా ఇక్కడ తయారు చేసిన వ్యాక్సిన్పై పూర్తి నమ్మకంతో ఉన్నారు, అలాంటిది తాను దీనిపై ఏమి మాట్లాడాలని అని పవార్ అన్నారు. -
భారత్ వ్యాక్సిన్ మైత్రి.. పాక్ తప్ప
న్యూఢిల్లీ: కోవిడ్ మహమ్మారి నుంచి భారత్ తనని తాను కాపాడుకుంటూనే పొరుగు దేశాలకు సాయపడుతోంది. పొరుగు దేశాల సంక్షేమమే లక్ష్యంగా ప్రపంచ ఆరోగ్య అవసరాలను తీర్చడంలో భారత్ విశ్వసనీయ భాగస్వామిగా కొనసాగుతుందని భారత ప్రధాని మోదీ ఇటీవల హామీ ఇచ్చారు. అందులో భాగంగా జనవరి 20వ తేదీ నుంచి పొరుగు దేశాలకు వ్యాక్సిన్ పంపించే ప్రక్రియను భారత్ ప్రారంభించింది. తాజాగా శుక్రవారం మారిషస్ సీషెల్లెస్లకు సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయరుచేస్తోన్న కోవిషీల్డ్ వ్యాక్సిన్ను విమానాల ద్వారా పంపించి, భారత్ వ్యాక్సిన్ మైత్రీ ఒప్పందాన్ని నిలబెట్టుకుంది. వ్యాక్సిన్ విదేశీ సరఫరా సందర్భంగా తీసిన ఫొటోలను విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. భూటాన్, బాంగ్లాదేశ్, మాల్దీవ్స్, నేపాల్, మయన్మార్, సీషెల్లన్స్లకు కోవిషీల్డ్ వ్యాక్సిన్ని పంపిస్తామని భారత ప్రభుత్వం ప్రకటించింది. భారత ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది. చైనా మినహా భారత పొరుగు దేశాల వ్యాక్సిన్ మైత్రి జాబితాలో చేరని ఏకైక దేశం దాయాది పాకిస్తాన్. పాకిస్తాన్ మాత్రం భారత్ సాయాన్ని ఆశించలేదని భారత ప్రభుత్వాధికారులు తెలిపారు. భారత్ నుంచి తొలి రోజు భూటాన్, మాల్దీవులకు వ్యాక్సిన్ డోసులను సరఫరా చేశారు. రెండో రోజు బాంగ్లాదేశ్, నేపాల్లకు కోవిషీల్డ్ వ్యాక్సిన్ని పంపించారు. శుక్రవారం మయన్మార్, సీషెల్లెన్స్లకు వ్యాక్సిన్ని సరఫరా చేశారు. పొరుగు దేశాలతో స్నేహపూర్వక సంబంధాల కొనసాగింపులో భాగంగా ఈ వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసింది. దీంతో పాటు బ్రెజిల్, మొరాక్కో దేశాలకు సైతం కోవిడ్ –19 వ్యాక్సిన్ వాణిజ్య ఎగుమతులను కూడా భారత్ ప్రారంభించింది. బ్రిటన్కి చెందిన ఆస్ట్రాజెనికా, ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం సంయుక్తంగా అభివృద్ధిపరుస్తోన్న కోవిడ్–19 వ్యాక్సిన్ని ప్రపంచంలోనే అతిపెద్ద ఔషధ దిగ్గజ సంస్థ సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారుచేస్తోంది. (చదవండి: కరోనా టీకా: యాప్లో కనిపించని పేర్లు..!) భూటాన్... భారత్ నుంచి స్నేహపూర్వక వ్యాక్సిన్ బహుమతిని అందుకున్న తొలి దేశం భూటాన్ కావడం విశేషం. తొలిసారి జనవరి 20న , 150,000 డోసుల కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులను భారత్ మైత్రీ ఒప్పందంలో భాగంగా మన దేశం భూటాన్కి పంపింది. భారత ప్రభుత్వ ఉదారత్వానికి భూటాన్ విదేశాంగ మంత్రి తాండి డోర్జీ కృతజ్ఞతలు తెలిపారు. మాల్దీవులు.. పొరుగు దేశాలకు ప్రథమ ప్రాధాన్యాన్నిస్తూ మల్దీవులకు సైతం భారత్ 100,000 కోవిడ్– 19 వ్యాక్సిన్ డోసులను సరఫరా చేసింది. వ్యాక్సిన్ సరఫరా చేసి సాయపడినందుకు గాను మాల్దీవుల అధ్యక్షుడు ఇబ్రహీం మొహమ్మద్ సోలి భారత ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ‘‘కొద్ది సేపటి క్రితమే లక్ష వ్యాక్సిన్ డోసులతో భారత్ నుంచి మాల్దీవులకు ఓ విమానం చేరుకుంది. త్వరలోనే కోవిడ్–19ను అధిగమించాలన్న మా ఆశలను ఇది పునరుద్ధరించింది. ప్రధాని మోదీకి హృదయపూర్వక కృతజ్ఞతలు’’అని మాల్దీవ్స్ అధ్యక్షుడు ట్వీట్ చేశారు నేపాల్... పొరుగు దేశాలకు తోడ్పాటు నందించే కార్యక్రమంలో భాగంగా భారత్ నేపాల్కి సైతం గురువారం పది లక్షల కోవిడ్ వ్యాక్సిన్ డోసులను సరఫరా చేసిందని ప్రజారోగ్య మంత్రి హృద్యేష్ త్రిపాఠీ తెలిపారు. గురువారం పంపిన ఈ పది లక్షల వ్యాక్సిన్ డోసులు తొలిదశ వాయిదాలో భాగంగా పంపినవే. వ్యాక్సిన్ డోసులను మాత్రమే కాకుండా కోవిడ్ మహమ్మారితో పోరాడేందుకు నేపాల్కి గతంలో వైద్య పరికరాలు, ఔషధాలు తదితరాలను సైతం భారత్ సరఫరా చేసింది. నేపాల్ ప్రభుత్వం 72 శాతం మంది ప్రజలకు వ్యాక్సినేషన్ ఇవ్వాలని భావిస్తోంది. అత్యంత క్లిష్లసమయంలో భారత్ పదిలక్షల కోవిడ్ వ్యా క్సిన్ డోసులను నేపాల్కి ఇవ్వడం పట్ల నేపాల్ ప్రధాని కెపి.ఓలి భారత ప్రధాని మోదీకి, భారత ప్రభుత్వానికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు. (చదవండి: టీకాల పనితీరుపై.. ‘టెన్షన్’ ప్రభావం!) బంగ్లాదేశ్... స్నేహపూర్వక హామీలో భాగంగా బాంగ్లాదేశ్కి 20 లక్షల కోవిడ్–19 వ్యాక్సిన్ డోసులను భారత దేశం సరఫరా చేసింది అని బాంగ్లాదేశ్ విదేశాంగ శాఖా మంత్రి డాక్టర్ ఎకె.అబ్దుల్ మొహమ్మద్ చెప్పారు. ‘‘1971లో జరిగిన విముక్తియుద్ద కాలం నుంచి భారత్ బాంగ్లాదేశ్ పక్షాన నిలిచింది. ప్రపంచాన్ని చుట్టేస్తోన్న కోవిడ్ సంక్షోభ కాలంలోనూ భారత్ కోవిడ్ వ్యాక్సిన్ రూపంలో బహుమతిని ఇచ్చింది’’అని ఆయన ట్వీట్ చేశారు. సెషెల్లెస్... మైత్రీ ఒప్పందంలో భాగంగా సెషెల్లెస్కి భారత్ నుంచి 50,000 కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులను సరఫరాచేయాలని భావించారు. అందులో భాగంగానే వ్యాక్సిన్ డోసులను ఆ దేశానికి సరఫరా చేశారు. ఈ 50,000 మోతాదుల కోవిషీల్డ్ వ్యాక్సిన్తో దాదాపు సెషెల్లెస్ జనాభాలో పావుభాగానికి టీకా వేయొచ్చని భావిస్తున్నారు. నిజానికి డిసెంబర్ 2020 నాటికి సెషెల్లెస్ కోవిడ్ ఫ్రీ కంట్రీగా ఉంది. మారిషస్... శుక్రవారం మధ్యాహ్నం నాటికి మారిషస్కి భారత్నుంచి ఒక లక్ష డోసుల కోవిషీల్డ్ వ్యాక్సిన్ చేరింది. -
‘సీరం’లో అగ్ని ప్రమాదం
పుణే: కోవిడ్–19 టీకా ‘కోవిషీల్డ్’తయారు చేస్తున్న పుణేలోని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కర్మాగారంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు సిబ్బంది చనిపోయారు. అయితే, ఈ ప్రమాదంతో టీకా తయారీపై ఎటువంటి ప్రభావం ఉండబోదని సీరం యాజమాన్యం తెలిపింది. గురువారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో సీరం ఇన్స్టిట్యూట్లోని నిర్మాణంలో ఉన్న ఒక భవనం 4, 5 అంతస్తుల్లో మంటలు వ్యాపించాయి. మంటలు, భారీగా పొగ కమ్ముకోవడంతో అందులో పనిచేస్తున్న ఐదుగురు సిబ్బంది చనిపోయారు. అగ్నిమాపక యంత్రాంగం రంగంలోకి దిగి భవనంలో ఉన్న మరో 9 మంది సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చింది. రెండు గంటల్లో మంటలను అదుపులోకి తెచ్చింది. ఈ ఘటనలో యంత్రాలకు గానీ, పరికరాలకు గానీ నష్టం వాటిల్ల లేదని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంపై మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే స్పందించారు. సీరం ఇన్స్టిట్యూట్లోని బీసీజీ టీకా యూనిట్లో ప్రమాదం జరిగినట్లు తెలిసిందన్నారు. ఘటనకు విద్యుత్ వ్యవస్థలో లోపాలే కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని తెలిపారు. ఇందులో ఎటువంటి కుట్ర కోణానికి అవకాశం లేదన్నారు. ప్రాణనష్టంపై ప్రధాని విచారం సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో జరిగిన ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర విచారం వెలిబుచ్చారు. ఊహించని విధంగా జరిగిన ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ట్విట్టర్లో ఆకాంక్షించారు. గత ఏడాది సీరం ఇన్స్టిట్యూట్ను సందర్శించిన ప్రధాని మోదీ..ఘటన జరిగిన భవనంలోని మొదటి అంతస్తులో టీకా తయారీపై సమీక్ష జరిపారని సంస్థ వర్గాలు తెలిపాయి. టీకా ఉత్పత్తికి ఢోకా లేదు ప్రమాదం జరిగిన ఎస్ఈజెడ్–3 భవనం కోవిషీల్డ్ టీకా తయారవుతున్న మంజరి సముదాయానికి కిలోమీటర్ దూరంలో ఉందని సీరం ఇన్స్టిట్యూట్ సీఈవో అదార్ పూనావాలా తెలిపారు. ప్రమాదంతో కోవిషీల్డ్ టీకా తయారీపై ఎటువంటి ప్రభావం లేదని వివరించారు. ఘటనలో ప్రాణనష్టం జరగడంపై విచారం వెలిబుచ్చారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామన్నారు. అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు కోవిషీల్డ్ ఉత్పత్తికి ఆటంకం కలగకుండా ప్రత్యామ్నాయాలను సిద్ధంగా ఉంచినట్లు ట్విట్టర్లో వెల్లడించారు. -
సీరంలో అగ్నిప్రమాదం: ఐదుగురు మృతి
సాక్షి, ముంబై: అతిపెద్ద వ్యాక్సిన్ తయారీదారు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పూణేలోని సీరం సంస్థ మాంజ్రీ ప్లాంట్లోని టెర్మినల్-1 గేట్ వద్ద మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు సిబ్బంది మృతిచెందగా.. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించిన చికిత్స అందిస్తున్నారు. అగ్రి ప్రమాదంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంపై సీరం ఇన్స్టిట్యూట్ బృందం విచారణ జరుపుతోంది. కాగా ఆక్స్ఫర్డ్ ఆస్ట్రా జెనెకా అభివృద్ధి చేసిన 'కోవిషీల్డ్' వ్యాక్సిన్ను సీరం భారీ ఎత్తున తయారు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే కోవీషీల్డ్ టీకాలు తయారీకి ఎలాంటి ఆటంకంలేదని సీరం సిబ్బంది తెలిపింది. -
కోవీషీల్డ్ వ్యాక్సిన్ ధర : సీరం కీలక ప్రకటన
సాక్షి,ముంబై: మరికొన్ని రోజుల్లో దేశంలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. తొలిదశలో ఫ్రంట్లైన్ వారియర్స్కు, ఆ తరువాత క్రమంగా దేశ ప్రజలకు ఈ టీకాను అందించనున్నారు. ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్ కోసం ప్రజలంతో ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. దీంతో ఈక్రమంలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధరపై సీరం కీలక ప్రకటన చేసింది. దేశంలో తొలి కోవిడ్-19 వ్యాక్సిన్ అందించడం ఒక చారిత్రక క్షణం గురించి సీరం సీఈవో అదర్ పూనావాలా సంతోషం వ్యక్తం చేశారు. అలాగే భారత ప్రభుత్వ అభ్యర్థన మేరకు కోవిడ్-19 వ్యాక్సిన్ను కేంద్రం "ప్రత్యేక ధర" కు కొనుగోలు చేసినట్లు పూనావాలా మంగళవారం ధృవీకరించారు. (సీరం, కేంద్రం డీల్ : రూ. 200కే వ్యాక్సిన్) ప్రభుత్వ మెగా టీకా డ్రైవ్లో అందించే కోవిషైల్డ్ వ్యాక్సిన్ ధరపై స్పందించిన అదర్ పూనావాలా మొదటి 100 మిలియన్ మోతాదులకు మాత్రమే 200 రూపాయల ప్రత్యేక ధరకు అందించాం. ప్రధానంగా సామాన్యులకు, బలహీనంగా, పేదలకు, ఆరోగ్య కార్యకర్తలతోపాటు, ఇతర అణగారిన వర్గాలకు మద్దతు ఇవ్వడమే తమ లక్క్ష్యం.ఇందులో భాగంగా లభాపేక్ష లేకుండా తక్కువ ధరను నిర్ణయించామన్నారు. 100 మిలియన్ యూనిట్ల సరఫరా తర్వాత కూడా ప్రభుత్వానికి చాలా సహేతుకమైన ధరకే అందిస్తామని, అయితే ఇది రూ.200 కన్నా కొంచెం ఎక్కువే అవుతుందన్నారు. ఇక ప్రైవేట్ మార్కెట్లలో రూ. 1000 విక్రయిస్తామని చెప్పారు. అలాగే ఈ ఏడాది చివరి నాటికి దేశంలోని ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ను అందించడమే తమ ప్రధాన సవాల్ అని పేర్కొన్నారు. వ్యాక్సిన్ ఉత్పత్తి గురించి ఆయన మాట్లాడుతూ తాము ప్రతి నెలా 70-80 మిలియన్ మోతాదులను తయారుచేస్తామన్నారు. అలాగే విదేశీ దేశాలకు తమటీకాను అందించనున్నామని, ఇందుకు సంబంధించిన ప్రణాళికలు జరుగుతున్నాయన్నారు. పూణే విమానాశ్రయానికి ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా కోవిడ్ వ్యాక్సిన్ తొలి లోడ్ను తీసుకెళ్తున్న మూడు ట్రక్కులు ఈ రోజు దేశవ్యాప్తంగా 13 ప్రదేశాలకు చేరుకోనున్నాయి. ఢిల్లీ, కర్నాల్, అహ్మదాబాద్, చండీగఢ్, లక్నో, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, భువనేశ్వర్, కోల్కతా, గౌహతి తదితరాలున్నాయి. జనవరి 16న దేశవ్యాప్త టీకా డ్రైవ్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. We've given a special price of Rs 200 for the first 100 mn doses only to GoI on their request, that we want to support common man, vulnerable, poor, healthcare workers. After that we'll be selling it at Rs 1000 in pvt markets: Adar Poonawalla, CEO-Owner, Serum Institute of India pic.twitter.com/EmKwGhevc2 — ANI (@ANI) January 12, 2021 -
స్పైస్జెట్ విమానాల ద్వారా కరోనా టీకా రవాణా ఫోటోలు
-
గుడ్న్యూస్.. బయల్దేరిన ‘కోవిషీల్డ్’
ముంబై: ఏడాది పాటుగా కరోనా వైరస్తో కకావికాలమైన దేశం మరి కొద్ది రోజుల్లో ఊపిరి పీల్చుకోనుంది. వైరస్ని ఎదుర్కొనే కోవిడ్ టీకా అందుబాటులోకి రానుంది. ఈ నెల 16 నుంచి దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అందుకు శరవేగంగా ఏర్పాట్లు ప్రారంభమవుతున్నాయి. అందులో భాగంగా మంగళవారం తెల్లవారుజామున కీలక పరిణామం చోటుచేసుకుంది. కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్ను అభివృద్ధి చేసిన సీరం ఇన్స్టిట్యూట్ తొలి విడత టీకా సరఫరా ప్రారంభించింది. పుణెలోని తయారీ కేంద్రం నుంచి వ్యాక్సిన్ డోసుల్ని మూడు ప్రత్యేక ట్రక్కుల ద్వారా పంపించింది. కట్టుదిట్టమైన భద్రత నడుమ వీటిని పుణె విమానాశ్రయానికి తరలించారు. అక్కడి నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు ఉదయం 10 గంటలకల్లా సరఫరా చేయనున్నారు. రవాణా కోసం జీపీఎస్ సౌకర్యమున్న ట్రక్కులను వినియోగించారు. మొత్తం 478 బాక్సుల్లో టీకాలను భద్రంగా ఉంచినట్లు అధికారులు తెలిపారు. ఒక్కో బాక్సు బరువు దాదాపు 32 కిలోలు ఉంటుందని సమాచారం. (చదవండి: 6 కోట్ల డోసుల టీకా కొనుగోలుకు కేంద్రం ఉత్తర్వులు) తొలి విడత డోసులు పుణె నుంచి ఢిల్లీ, అహ్మదాబాద్, కోల్కతా, చెన్నై, బెంగళూరు, కర్నాల్, హైదరాబాద్, విజయవాడ, గువాహటి, లఖ్నవూ, చండీగఢ్, భువనేశ్వర్కు చేరనున్నట్లు సమాచారం. ఇందుకోసం మొత్తం 8 ప్రత్యేక వాణిజ్య, 2 కార్గో విమానాలను వినియోగించుకోనున్నట్లు తెలుస్తోంది. తొలి కార్గో విమానం హైదరాబాద్, విజయవాడ, భువనేశ్వర్కు రానుండగా.. మరొకటి కోల్కతా, గువాహటికి వెళ్లనున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఓ అధికారి తెలిపారు. ముంబయికి రోడ్డుమార్గం ద్వారా వ్యాక్సిన్ డోసులను సరఫరా చేయనున్నట్లు సమాచారం. స్పైస్జెట్కు చెందిన విమానాల్ని టీకా రవాణా కోసం వినియోగిస్తున్నట్లు ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ సింగ్ తెలిపారు. (చదవండి: తొలి దశలో.. టీకా ఖర్చు కేంద్రానిదే) Ready get set go! Stand by India! The vaccine to kill the disease is being loaded onto the aircrafts for distribution all over the country now.@AAI_Official @aairedwr pic.twitter.com/5lY9i4Tjdk — PuneAirport (@aaipunairport) January 12, 2021 కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ఈ నెల 16 నుంచి ప్రారంభం కానుంది. ఇందులో మూడు కోట్ల మంది ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్లైన్ వర్కర్లకు మొదటి ప్రాధాన్యత ఇస్తారు. ఆ తర్వాత.. 50 ఏళ్లు పైబడినవారికి, ఆరోగ్య సమస్యలున్న 50 ఏళ్లలోపు వారికి టీకా వేస్తారు. దేశంలో తొలివిడతలో మూడు కోట్ల మంది కరోనా యోధులకు వ్యాక్సిన్ ఇచ్చేందుకయ్యే ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. మరోవైపు భారత్ బయోటెక్ కూడా తన టీకాలను నేరుగా 12 రాష్ట్రాలకు సరఫరా చేయనుంది. ఈ ప్రక్రియ మంగళవారం ప్రారంభమై, రెండు రోజుల్లో ముగియనుందని సంబంధిత అధికారులు తెలిపారు. -
ఏపీకి వ్యాక్సిన్ వచ్చేస్తోంది..
అమరావతి: కరోనా వైరస్కు విరుగుడు వచ్చేస్తోంది. అత్యవసర అనుమతి పొందిన సీరమ్ ఇన్స్టిట్యూట్కు చెందిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ నేడు ఆంధ్రప్రదేశ్కు రానుంది. పూణె నుంచి కోవిషీల్డ్ టీకాలు మంగళవారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటుంది. మొత్తం 4.7 లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులు రాష్ట్రానికి రానున్నాయి. ఆ వ్యాక్సిన్ వచ్చిన వెంటనే 19 వాహనాలలో రేపు (జనవరి 13) అన్ని జిల్లా కేంద్రాల స్టోరేజ్ పాయింట్లకు తరలించనున్నారు. 2 నుంచి 8 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు ఉండేలా వ్యాక్సిన్ డెలవివరీ వాహనాలలో ఏర్పాట్లు చేశారు. గన్నవరం రాష్ట్రస్థాయి శీతలీకరణ కేంద్రంలో రెండు పెద్ద వాక్ ఇన్ కూలర్స్.. ఒకటి 40 క్యూబిక్ మీటర్లు.. రెండోది 20 క్యూబిక్ మీటర్ల సామర్థ్యం ఉన్న వాటిని సిద్ధం చేశారు. వ్యాక్సిన్ భద్రపరచడానికి గన్నవరం కేంద్రానికి నిరంతరం విద్యుత్ సరఫరా అందిస్తున్నారు. రాష్ట్రస్థాయి వ్యాక్సిన్ స్టోరేజ్ కేంద్రం వద్ద ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. బయటి వ్యక్తులకు ప్రవేశం నిషేధం. 8 సీసీ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు. టీకాల పంపిణీలో భాగంగా తొలి దశలో 3.87లక్షల మంది వైద్య సిబ్బందికి వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలుపెట్టనున్నారు. ఈనెల 16వ తేదీ నుంచి కరోనా వారియర్స్కు టీకాల పంపిణీ ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. -
6 కోట్ల డోసుల టీకా కొనుగోలుకు కేంద్రం ఉత్తర్వులు
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్న కోవిడ్ వ్యాక్సినేషన్ దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. అత్యవసర వినియోగానికి అనుమతులిచ్చిన కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాల 6 కోట్ల డోసుల కొనుగోలుకు కేంద్రం సోమవారం ఆర్డర్ ఇచ్చింది. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) తయారు చేస్తున్న ఆక్స్ఫర్డ్ టీకా కోవిషీల్డ్ను మొదటి విడతలో 1.1 కోట్ల డోసులు, రెండో విడతలో ఏప్రిల్ కల్లా మరో 4.5 కోట్ల డోసులు కొనుగోలు చేస్తుంది. అదేవిధంగా, భారత్ బయోటెక్ టీకా కోవాగ్జిన్ను రూ.162 కోట్ల విలువైన 55 లక్షల డోసులను కొనుగోలు చేస్తోంది. ఇందుకు గాను మొత్తం రూ.1,300 కోట్లు వెచ్చిస్తోంది. తయారీ కేంద్రాల నుంచి టీకా డోసుల సరఫరా మంగళవారం ఉదయం నుంచి ప్రారంభం కానున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. కేంద్ర ఆరోగ్య శాఖ తరఫున ప్రభుత్వ రంగ హెచ్ఎల్ఎల్ లైఫ్కేర్ లిమిటెడ్ నుంచి అడిషనల్ డైరెక్టర్ ప్రకాశ్ కుమార్ సింగ్ పేరిట ఈ కొనుగోలు ఆర్డర్ జారీ అయింది. టీకా ఒక్కో డోసు ఖరీదు రూ.200 కాగా, జీఎస్టీతో రూ.10 కలుపుకుని డోసు ఖరీదు మొత్తం రూ.210 అని ఆ అందులో పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం నుంచి దేశవ్యాప్తంగా గుర్తించిన 60 పాయింట్లకు టీకా డోసులు సరఫరా అవుతాయి. అక్కడి నుంచి వివిధ పంపిణీ కేంద్రాలకు దానిని చేరవేస్తారు. ఢిల్లీలోని తహిర్పూర్లో ఉన్న రాజీవ్గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన సెంట్రల్ స్టోరేజీ పాయింట్కు 2,54,500 డోసుల కోవిషీల్డ్ టీకా చేరనుందని అధికారులు తెలిపారు. పుణేలోని మంజరి వద్దనున్న సీరం ఇన్స్టిట్యూట్ కేంద్రం నుంచి వ్యాక్సిన్ తీసుకెళ్లే ట్రక్కులకు రాష్ట్ర సరిహద్దుల వరకు, విమానాశ్రయాల వరకు మహారాష్ట్ర ప్రభుత్వం పోలీసు భద్రత కల్పిస్తోంది. ఇమ్యునైజేషన్ ప్రక్రియలో భాగంగా ఈ టీకాను వ్యక్తులకు 28 రోజుల వ్యవధిలో రెండు డోసులుగా ఇస్తారు. స్వచ్ఛందంగా వేయించుకోండి వ్యాక్సిన్ను స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వేయించు కోవాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) తన 3.5 లక్షల మంది సభ్యులకు పిలుపునిచ్చింది. సంపూర్ణ శాస్త్రీయ విశ్లేషణ, నిపుణుల బృందం నివేదికల పరిశీలన, ఐసీఎంఆర్, డబ్ల్యూహెచ్వోలతో చర్చల అనంతరం ప్రభుత్వం చేపట్టే కోవిడ్–19 వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని నిర్ణయించినట్లు తెలిపింది. కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలను దేశీయ వాతావరణ పరిస్థితుల్లో నిల్వ ఉంచడం, వినియోగించడం సులువని వివరించింది. -
సీరం, కేంద్రం డీల్ : రూ. 200కే వ్యాక్సిన్
సాక్షి, న్యూఢిల్లీ: జనవరి 16వ తేదీనుంచి కరోనా వైరస్ మహమ్మారికి అంతానికి దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ షురూ కానున్న నేపథ్యంలో కేంద్రం కీలక చర్యలకు దిగింది. ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకాకు చెందిన కొవిషీల్డ్ టీకా డోసుల కొనుగోలు, అందుబాటులో ధరలో టీకాను అందించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం డీల్కు సిద్ధపడుతోంది. కోవీషీల్డ్ వ్యాక్సిన్ను ఉత్పత్తి చేస్తున్న పుణేకు చెందిన అతిపెద్ద టీకా తయారీదారు సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో కేంద్రం ఒప్పందం కుదుర్చుకోనుంది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధరపై ప్రభుత్వంతో ఒప్పందం కుదిరిందని సీరం తాజాగా ధృవీకరించినట్టు సమాచారం.ఈ డీల్ తరువాత వ్యాక్సిన్ ధర 200 రూపాయలుగా ఉంటుందని సీరం వర్గాలు ప్రకటించాయి. ప్రారంభ దశలో తొలి 100 మిలియన్ (కోటి ) మోతాదులను 200 రూపాయలకే అందించనున్నామని వెల్లడించాయి. మొత్తం 11 మిలియన్ల టీకాలను అందిస్తామన్నారు. అంతేకాదు ఈ రాత్రికి(సోమవారం) లేదా రేపు ఉదయానికి టీకాల రవాణా మొదలవుతుందని స్పష్టం చేశాయి. దీనిపై అధికారిక ప్రకటేన రావాల్సి ఉంది. కాగా కోవిషీల్డ్తో పాటు భారత్ బయోటెక్ రూపొందిస్తున్న కోవాగ్జిన్ టీకాల అత్యవసర వినియోగానికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ) ఇటీవల అనుమతులు మంజూరు చేసింది. జనవరి 16 నుంచి టీకా పంపిణీ చేపట్టనున్నట్లు గతవారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. తొలి ప్రాధాన్యం కింద 3 కోట్ల మంది ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్లైన్ వర్కర్లకు టీకా అందించనున్నారు. ఆ తర్వాత 50ఏళ్లు పైబడిన వారికి, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడే 50ఏళ్ల లోపు వారికి వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు కేంద్రం తెలిపింది. జులై నాటికి 30కోట్ల మందికి వ్యాక్సినేషన్ ఇవ్వాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ అమలు, కోవిన్యాప్ తదితర అంశాలపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ సాయంత్రం చర్చిస్తున్నారు. దాదాపు ప్రతీ జిల్లాలోనూ కరోనా వ్యాక్సిన్ డ్రైవ్ రన్ పూర్తి చేశామని ప్రధాని వెల్లడించారు. చదవండి: వ్యాక్సిన్పై సాధారణ సందేహాలు! టీకా పంపిణీలో ‘కోవిన్’ కీలకం -
వ్యాక్సిన్ల ఎగుమతులపై నిషేధం లేదు
ముంబై, సాక్షి: దేశీయంగా హెల్త్కేర్ కంపెనీలు తయారు చేస్తున్న కోవిడ్-19 వ్యాక్సిన్ల ఎగుమతులపై ఎలాంటి నిషేధాన్నీ విధించలేదని కేంద్ర ప్రభుత్వం తాజాగా పేర్కొంది. ఎగుమతి నియంత్రణలకు సంబంధించిన నాలుగు మంత్రిత్వ శాఖలూ కోవిడ్-19 వ్యాక్సిన్లపై ఎలాంటి నిషేధాన్ని ప్రకటించలేదని ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ స్పష్టం చేశారు. సోమవారం ఒక ఇంటర్వ్యూలో సీరమ్ ఇన్స్టిట్యూట్ సీఈవో అదార్ పూనావాలా వ్యాక్సిన్లను తొలుత దేశీయంగా సరఫరా చేసేందుకే కట్టుబడినట్లు చెప్పిన విషయం విదితమే. తొలి దశలో భాగంగా ఎగుమతులకు కేంద్రం అనుమతించలేదని పేర్కొన్నారు. తదుపరి తాజాగా ఒప్పందాల ప్రకారం వ్యాక్సిన్లను ఎగుమతి చేయనున్నట్లు పూనావాలా వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆరోగ్య శాఖ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకున్నట్లు ఫార్మా వర్గాలు తెలియజేశాయి. పలు దేశాలు వ్యాక్సిన్ల సరఫరా కోసం దేశీ మార్కెట్పై ఆధారపడి ఉన్నట్లు పేర్కొన్నాయి. వ్యాక్సిన్ల తయారీలో భారత్ భారీ సామర్థ్యాన్ని కలిగి ఉండటమే దీనికి కారణమని తెలియజేశాయి. దీంతో పలు పశ్చిమేతర దేశాలు మిలియన్లకొద్దీ వ్యాక్సిన్ల కోసం భారత్వైపు చూస్తున్నట్లు వివరించాయి. (తొలుత మనకే వ్యాక్సిన్లు: సీరమ్) పలు దేశాలు కోవిడ్-19 కట్టడికి బ్రిటిష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కోవీషీల్డ్ వ్యాక్సిన్ను దేశీయంగా సీరమ్ ఇన్స్టిట్యూట్ తయారు చేస్తోంది. ఈ వ్యాక్సిన్ల కోసం బ్రెజిల్, మెక్సికో, సౌదీ అరేబియా తదితర పలు దేశాల నుంచి ఆర్డర్లు లభించే వీలున్నట్లు గత నెలలో పూనావాలా పేర్కొన్నారు. ఇదేవిధంగా దేశీయంగానే కోవిడ్-19కు వ్యాక్సిన్ను రూపొందిస్తున్న భారత్ బయోటెక్ సైతం పలు దేశాలు తమ వ్యాక్సిన్లపట్ల ఆసక్తి చూపుతున్నట్లు వెల్లడించింది. లాటిన్ అమెరికా దేశాలకు వ్యాక్సిన్లను సరఫరా చేసేందుకు చర్చలు జరుపుతున్నట్లు తెలియజేసింది. (ఫైజర్ వ్యాక్సిన్కు WHO గుర్తింపు) కోవాక్స్లో భాగం ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో)కు చెందిన కోవాక్స్ కన్సార్షియం, గవీ వ్యాక్సిన్ అలయెన్స్లో దేశీ వ్యాక్సిన్ల కంపెనీలు భాగమైనట్లు ఫార్మా రంగ నిపుణులు పేర్కొన్నారు. దీంతో పేద, మధ్యాదాయ దేశాలకు డబ్ల్యూహెచ్వో ద్వారా వ్యాక్సిన్లు సరఫరా చేయవలసి ఉంటుందని తెలియజేశారు. కోవాక్స్ ఒప్పందంలో భాగంగా యూఎస్కు చెందిన బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ నుంచి వ్యాక్సిన్ల సరఫరాకు వీలుగా సీరమ్ ఇన్స్టిట్యూట్కు నిధులు లభించినట్లు ప్రస్తావించారు. ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ సహకారంతో ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్లతోపాటు.. నొవావాక్స్ వ్యాక్సిన్లను ఫార్మా కంపెనీలు 1 బిలియన్ డోసేజీల వరకూ కోవాక్స్కు సరఫరా చేయవలసి ఉంటుందని వివరించారు. ప్రాథమిక ఒప్పందంలో భాగంగా కోవాక్స్కు 20 కోట్ల డోసులను సీరమ్ ఇన్స్టిట్యూట్ సరఫరా చేయవలసి ఉన్నట్లు ఈ సందర్భంగా గవీకి చెందిన కమ్యూనికేషన్స్ హెడ్ ఒల్లీ కాన్ తెలియజేశారు. ఈ ఏడాది తొలి త్రైమాసికానికల్లా భారత్ నుంచి వ్యాక్సిన్ల సరఫరా ప్రారంభంకాగలదని భావిస్తున్నట్లు చెప్పారు. -
‘ప్రజలను కాపాడటమే మా ప్రథమ కర్తవ్యం’
న్యూఢిల్లీ: భారత్లో రెండు కరోనావైరస్ వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమత్చిన నేపథ్యంలో పలు విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. మూడవ దశ ట్రయల్స్ పూర్తి కాకుండానే.. కోవాగ్జిన్కు ఎలా అనుమతి ఇచ్చారని విమర్శలు వెల్లువత్తాయి. కోవాగ్జిన్ సామర్థ్యాన్ని తక్కువ చేసి చూపడంపై నిన్న భారత్ బయోటెక్ తీవ్రంగా స్పందించింది. ఈ క్రమంలో దీనికి ముగింపు పలికేందుకు రెండు సంస్థలు ముందుకు వచ్చాయి. వివాదానికి శుభం కార్డు వేస్తూ భారత్ బయోటెక్, సీరం ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. (చదవండి: ఎందుకు భారత వ్యాక్సిన్లపై వివాదం...?) Important Announcement: Joint statement @BharatBiotech and @SerumInstIndia pic.twitter.com/la5av27Mqy — SerumInstituteIndia (@SerumInstIndia) January 5, 2021 ప్రపంచానికి కరోనా టీకాలు అందించాలన్నదే తమ లక్ష్యం అని.. ప్రజలను కాపాడటమే తమ కర్తవ్యం అని రెండు కంపెనీలు తెలిపాయి. ప్రజలను కరోనా నుంచి రక్షించే సత్తా వ్యాక్సిన్లకు ఉంది అని స్పష్టం చేశాయి. తమ టీకాలకు అత్యవసర వినియోగానికి అనుమతి వచ్చిందని.. ప్రస్తుతం టీకాల ఉత్పత్తి, పంపిణీపై దృష్టి పెట్టామని భారత్ బయోటెక్, సీరం ఈ ప్రకటనలో తెలిపాయి. వ్యాక్సిన్ల పంపిణీ సవ్యంగా జరిగేలా చూస్తామని వెల్లడించాయి. అంతేకాక తమ వ్యాక్సిన్లను ప్రపంచం అంతా వినియోగించేలా చూస్తామని ప్రతిజ్ఞ చేశాయి. కోవిడ్ -19 వ్యాక్సిన్లకు సంబంధించిన వివాదంపై ఇరు కంపెనీలు సంయుక్తంగా వివరణ ఇవ్వబోతున్నాయని ముందురోజు అదార్ పూనావాలా ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. -
కోవిషీల్డ్ @ రూ.200-400
న్యూఢిల్లీ: ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం, ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధిచేసిన కోవిడ్ టీకా ’కోవిషీల్డ్’ను భారత ప్రభుత్వానికి ఒక్కో డోసు 3–4 డాలర్ల చొప్పున, ప్రైవేట్ మార్కెట్లో 6–8 డాలర్ల చొప్పున విక్రయిస్తామని సీరమ్ ఇన్స్టిట్యూట్ సీఈఓ అదర్ పూనావాలా చెప్పారు. దేశీయంగా ఆక్స్ఫర్డ్ టీకా ఉత్పత్తి, పంపిణీ సీరమ్ ఇన్స్టిట్యూట్ చేపట్టనుంది. ఇప్పటికే దాదాపు 5 కోట్ల డోసుల కోవిషీల్డ్ను ఉత్పత్తి చేశామని అదర్ చెప్పారు. తొలిదశలో భారత ప్రభుత్వానికి, జీఏవీఐ (గ్లోబల్ అలయన్స్ ఫర్ వాక్సిన్స్ అండ్ ఇమ్యూనైజేషన్స్) దేశాలకు అందిస్తామని, తర్వాతే ప్రైవేటు మార్కెట్లోకి విడుదల చేస్తామని తెలిపారు. తమ వ్యాక్సిన్ అందరికీ అందుబాటు ధరలో ఉండాలన్నదే తమ ప్రయత్నమని, అందుకే ప్రభుత్వానికి ఒక్కో డోసు 3–4 డాలర్ల ధరకు (సుమారు 200– 280 రూపాయలు) అందిస్తామని చెప్పారు. ప్రైవేట్ మార్కెట్లో ధర రెట్టింపు ఉండొచ్చని అంటే సుమారు 6–8 డాలర్లు (సుమారు 400–600 రూపాయలు) ఉంటుందని చెప్పారు. ఈప్రకారం చూస్తే రెండు డోసులకు కలిపి ప్రభుత్వానికి సుమారు 400–600 రూపాయలు, ప్రైవేట్ మార్కెట్లో రూ. 800–1,200 వరకు ఉంటుంది. వ్యాక్సిన్ అందజేయడంపై ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. డీసీజీఐ అనుమతి అనంతరం 7–10 రోజుల్లో టీకా పంపిణీకి రెడీగా ఉంటుందన్నారు. దేశీయ అవసరాలు తీరే వరకు టీకాను ఎగుమతి చేయవద్దని సీరమ్ను డీసీజీఐ ఆదేశించడంపై స్పందిస్తూ, ప్రభుత్వంతో అనుమతి పొందిన అనంతరమే ఎగుమతులు ఆరంభిస్తామన్నారు. తమ వ్యాక్సిన్ 100 శాతం సమర్ధవంతంగా పనిచేస్తోందని భరోసా ఇచ్చారు.