strategy
-
అమెరికాకు ఎగుమతులు పెరిగే చాన్స్
న్యూఢిల్లీ: అమెరికా (US) అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చైనా (China) వస్తువులపై అధిక సుంకాలు విధిస్తామని హెచ్చరిస్తున్న నేపథ్యంలో అందివచ్చే అవకాశాలను భారత్ సద్వినియోగం చేసుకునే వీలుందని అత్యున్నత స్థాయి ఎగుమతిదారుల సంస్థ– ఎఫ్ఐఈఓ పేర్కొంది. ఈ దిశలో అమెరికాకు భారత్ ఎగుమతులను పెంచడానికి వ్యూహాన్ని రూపొందించినట్లు కూడా ఎఫ్ఐఈఓ తెలిపింది.ఈ ప్రణాళికలో భాగంగా దేశ ఎగుమతిదారులు (Exporters) అమెరికా అంతటా జరిగే వాణిజ్య, వ్యాపార ప్రదర్శనలలో పాల్గొనడానికి ఆర్థిక సహాయం అందించాలని ఎఫ్ఐఈఓ (ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్) వైస్ ప్రెసిడెంట్ ఇస్రార్ అహ్మద్ ఇక్కడ విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. తాను అధికారం చేపట్టింది వెంటనే మెక్సికో, కెనడా, చైనాలపై కొత్త టారిఫ్లు విధిస్తానని ట్రంప్ బెదిరించిన నేపథ్యంలో ఇస్రార్ అహ్మద్ ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ముఖ్యమైనవి...అమెరికా మార్కెట్కు భారత్ ఎగుమతుల్లో వృద్ధిని పెంచడానికి రూపొందించిన వ్యూహంలో మేము ఐదు కీలక రంగాలను గుర్తించాము. దుస్తులు, ఎలక్ట్రానిక్స్, బొమ్మలు, పాదరక్షలు, ఆర్గానిక్ కెమికల్స్ రంగాలు ఇందులో ఉన్నాయి. ఈ రంగాలకు సంబంధించి అమెరికా వాణిజ్య సంఘాలతో చేతులు కలపాలని ఎఫ్ఐఈఓ భావిస్తోంది. బంగ్లాదేశ్లో రాజకీయ అనిశ్చి తి కారణంగా చాలా దుస్తులు కంపెనీలు భారత్కు స్థావరాలను మార్చుకుంటున్నాయి. అమెరికా మార్కెట్లో భారత్ ఎగుమతులు విస్తరించాల్సిన అవసరం, అవకాశాలు ఉన్నాయి. అమెరికాలో భారత్ ఉత్పత్తులను విస్తృత స్థాయిలో మార్కెటింగ్ చేయడానికి ఎగుమతిదారులకు తగిన ఆర్థిక మద్దతు అవసరం. అందివస్తున్న అవకాశాలను వినియోగించుకోవడంలో ఇది కీలకం. దేశంలో పెద్ద ఫ్యాక్టరీలు వస్తున్నందున సామర్థ్యాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాలో భారత్ ఉనికి మరింత పెంచుకోవాలి. అవకాశాలను చేజిక్కించుకోవడానికి మార్కెట్ యాక్సెస్ ఇనిషియేటివ్స్ (ఎంఏఐ) పథకం కింద మరిన్ని నిధులు అడుగుతున్నాము. అమెరికాకు ఎగుమతులు లక్ష్యంగా ఈ పథకంపై దృష్టి పెట్టాలి. కనీసం మూడు సంవత్సరాలు దీనిని అమలు చేయాలి. ప్రస్తుతం భారత్ ఎగుమతిదారులు ‘ద్రవ్య లభ్యత’ (లిక్విడిటీ) సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఫైనాన్స్ అవసరాలు తీవ్ర సవాళుగా ఉన్నాయి.వస్తువులు, సేవలను కొనుగోలు చేసిన 45 రోజుల్లోగా ఎంఎస్ఎంఈ (లఘు, సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు)లకు చెల్లింపులు జరపాలన్న నిబంధనను సడలించాలి. రుణ వ్య యాలను తగ్గించుకోవడానికి సంబంధించిన – ఇంట్రస్ట్ ఈక్విలైజేషన్ స్కీమ్ (ఐఈఎస్)ను ఐదు సంవత్సరాల పొడిగించాలి. దేశం నుంచి ఎగుమతయ్యే ఉత్పత్తులకు సంబంధించి కేంద్రం అమలుచేస్తున్న ఆర్ఓడీటీఈపీ (ఎగుమతి ఉత్పత్తులపై సుంకాలు, పన్నుల రిఫండ్) పథకం ప్రయోజనాలు అందిస్తున్నప్పటికీ, ఆయా ఉత్పత్తుల దిగుమతిదేశాలు విధిస్తున్న కౌంటర్వ్యాలింగ్ సుంకాలు (రాయితీలు పొందిన ఉత్పత్తులపై సుంకాలు– యాంటీ సబ్సిడీ సుంకాలు) ఎగుమతిదారులకు ఇబ్బందులను సృష్టిస్తున్నాయి. ఈ సమస్యపై ఈఐఎఫ్ఓ వాణిజ్య మంత్రిత్వశాఖతో చర్చిస్తోంది.భారత్–అమెరికా వాణిజ్య బంధం ఇలా.. మార్చితో ముగిసిన గత 2023–24లో భారతదేశానికి అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. గత ఆర్థిక సంవత్సరంలో భారతదేశ ఎగుమతులు 77.51 బిలియన్ డాలర్లుగా ఉండగా, దిగుమతులు 42.2 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్–అక్టోబర్ కాలంలో అమెరికాకు దేశ ఎగుమతులు 6.31 శాతం పెరిగి 47.24 బిలియన్ డాలర్లకు చేరుకోగా, దిగుమతులు 2.46 శాతం పెరిగి 26 బిలియన్ డాలర్లకు ఎగశాయి. కొత్త అమెరికా ప్రభుత్వం ’అమెరికా ఫస్ట్’ అజెండాను అనుసరించాలని నిర్ణయించుకుంటే ఆటోమొబైల్స్, టెక్స్టైల్స్, ఫార్మాస్యూటికల్స్ వంటి వస్తువులపై భారతీయ ఎగుమతిదారులు అధిక కస్టమ్స్ సుంకాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని వాణిజ్య నిపుణులు పేర్కొన్నారు. -
ఫండ్స్ పెట్టుబడులకు హెడ్జింగ్ వ్యూహం?
ఫండ్స్లో పెట్టుబడులు ఉన్నాయి. హెడ్జింగ్ చేసుకోవడం ఎలా? – శ్యామ్ ప్రసాద్ఈక్విటీ మార్కెట్ నష్టపోయే క్రమంలో సెన్సెక్స్, నిఫ్టీ, స్మాల్క్యాప్ ఇండెక్స్ ఇలా అన్ని సూచీలు పడిపోతుంటాయి. మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో హెడ్జింగ్ ఆప్షన్ అంతర్గతంగా ఉండదు. కనుక పెట్టుబడులను వివిధ సాధనాల మధ్య వైవిధ్యం చేసుకోవడమే ఇన్వెస్టర్ల ముందున్న మార్గం. వివిధ సాధనాల మధ్య పెట్టుబడుల కేటాయింపుల (అసెట్ అలోకేషన్) ప్రణాళిక కలిగి ఉండడం ఈ దిశగా మంచి వ్యూహం అవుతుంది.ఉదాహరణకు మీ మొత్తం పెట్టుబడుల్లో 50 శాతాన్ని ఈక్విటీలు లేదా ఈక్విటీ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి. మరో 50 శాతాన్ని డెట్ సెక్యూరిటీలు లేదా డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఈక్విటీ మార్కెట్లు పెరగడం కారణంగా ఈక్విటీ పెట్టుబడుల విలువ 70 శాతానికి చేరినప్పుడు.. 20 శాతం మేర విక్రయించి ఆ మొత్తాన్ని డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. అప్పుడు ఈక్విటీ/డెట్ రేషియో 50:50గా ఉంటుంది. ఉదాహరణకు రూ. లక్ష పెట్టుబడిలో రూ.50 వేలను ఈక్విటీల్లో, రూ.50 వేలను డెట్లో ఇన్వెస్ట్ చేశారని అనుకుందాం. కొంత కాలానికి ఈక్విటీ పెట్టుబడుల విలువ రూ.70 వేలకు చేరి, డెట్ పెట్టుబడుల విలువ రూ.55 వేలకు వృద్ధి చెందిందని అనుకుందాం. అప్పుడు ఈక్విటీల నుంచి రూ.7,500 పెట్టుబడిని వెనక్కి తీసుకుని డెట్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. అప్పుడు రెండు సాధనాల్లో పెట్టుబడులు సమానంగా ఉంటాయి.ఒకవేళ ఈక్విటీ మార్కెట్ల పతనంతో ఈక్విటీ పెట్టుబడుల విలువ రూ.50 వేల నుంచి రూ.40 వేలకు తగ్గి, డెట్ పెట్టుబడులు రూ.55వేలుగా ఉన్నాయనుకుంటే.. అప్పుడు డెట్ పెట్టుబడుల నుంచి రూ.7,500ను వెనక్కి తీసుకుని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఇలా ఒక సాధనంలో పెట్టుబడుల విలువ మరో సాధనంలోని పెట్టుబడుల విలువ కంటే 10–15 శాతం అధికంగా ఉన్నప్పుడు మార్పులు చేర్పులు చేసుకోవాలి. అసెట్ అలోకేషన్ ఆటోమేట్ చేసుకోవడం, రీబ్యాలన్స్ వ్యూహాన్ని సరిగ్గా అమలు చేయడం ద్వారా మార్కెట్ల పతనంపై ఆందోళన చెందకుండా రాబడులను పెంచుకోవచ్చు.రూ.50 లక్షలను 15 ఏళ్ల కాలానికి ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాను. ఈ మొత్తాన్ని 12 నెలల సమాన వాయిదాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చా..? – శ్రీ కైవల్యకొంత రక్షణాత్మక ధోరణిలో అయితే మూడేళ్ల పాటు నెలసరి సమాన వాయిదాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కొంత రిస్క్ తీసుకునే ధోరణితో ఉంటే 18 - 24 నెలల సమాన వాయిదాల్లో ఈ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మార్కెట్లో దిద్దుబాట్లు పెట్టుబడుల అవకాశాలకు అనుకూలం.ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఆ మొత్తం విలువ తగ్గిపోతే విచారించాల్సి వస్తుంది. అందుకని ఒకే విడత కాకుండా క్రమంగా నెలకు కొంత చొప్పున కొంత కాలం పాటు ఇన్వెస్ట్ చేసుకోవడం సూచనీయం. వైవిధ్యమైన నేపథ్యంతో ఉండే ఫ్లెక్సీ క్యాప్ పథకాలను ఎంపిక చేసుకోవచ్చు. ఇవి వృద్ధి, రిస్్కను సమతుల్యం చేస్తుంటాయి. దీర్ఘకాల లక్ష్యాలకు ఇవి అనుకూలం. మీ వద్దనున్న మొత్తాన్ని లిక్వి డ్ లేదా అల్ట్రా షార్ట్ డ్యురేషన్ ఫండ్లో ముందు ఇన్వెస్ట్ చేసుకోవాలి. వాటి నుంచి ప్రతి నెలా నిరీ్ణత మొత్తాన్ని సిస్టమ్యాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ ద్వారా ఎంపిక చేసుకున్న ఈక్విటీ పథకాల్లోకి మళ్లించుకోవాలి.ధీరేంద్ర కుమార్ - సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
త్రిముఖ వ్యూహంతో ప్రజల్లోకి వెళ్తున్న కాంగ్రెస్
-
భారత్ వృద్ధికి 3i స్ట్రాటజీ!.. వరల్డ్ బ్యాంక్ సూచన
భారత్, చైనా వంటి సుమారు 106 దేశాలు మధ్య ఆదాయ ఉచ్చు (మిడిల్ ఇన్కమ్ ట్రాప్)లో పడే ప్రమాదం ఉందని ప్రపంచ బ్యాంక్ విడుదల చేసిన ఓ నివేదికలో పేర్కొంది. దీని నుంచి తప్పించుకోవడానికి పెట్టుబడులు, ఆవిష్కరణలతో పాటు.. కొత్త టెక్నాలజీలను కూడా అభివృద్ధి చేయడం మీద దృష్టి సారించే 3i (ఇన్వెస్ట్మెంట్, ఇన్నోవేషన్, ఇన్ఫ్యూజన్) విధానాన్ని అనుసరించాల్సిన అవసరం ఉందని వెల్లడించింది.ఇండియా వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం అయినప్పటికీ.. ప్రస్తుత ట్రెండ్ ఇలంగో కొనసాగితే దేశ తలసరి ఆదాయం అమెరికా ఆదయ స్థాయిలలో నాలుగింట ఒక వంతుకు చేరుకోవడానికి దాదాపు 75 సంవత్సరాలు పట్టే అవకాశం ఉందని వరల్డ్ బ్యాంక్ తన నివేదికలో స్పష్టం చేసింది.2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దార్శనికతను ప్రపంచ బ్యాంక్ తన 'వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2024'లో.. స్వాతంత్య్ర శతాబ్దిగా ప్రస్తావించింది. భారతదేశం ఆర్థిక వ్యవస్థలో పరివర్తన సాధించాలని ఆశిస్తున్నప్పటికీ.. అది కొంత క్లిష్టంగా కనిపిస్తున్నట్లు వెల్లడించింది.ఇప్పటికి కూడా అనేక దేశాలు గత శతాబ్దానికి చెందిన ప్లేబుక్ను ఉపయోగిస్తున్నాయి. ప్రధానంగా పెట్టుబడులను విస్తరించేందుకు రూపొందించిన విధానాలపై ఆధారపడుతూ ఉన్నయని.. ప్రపంచ బ్యాంక్ గ్రూప్ చీఫ్ ఎకనామిస్ట్ ఇండెర్మిట్ గిల్ పేర్కొన్నారు. ఇది మొదటి గేర్లోనే కారు నడుపుతూ వేగంగా ముందుకు వెళ్లాలనుకోవడంలాంటిదని అన్నారు.ఇది ఇలాగే కొనసాగితే.. అమెరికా తలసరి ఆదాయంలో నాలుగింట ఒక వంతుకు చేరుకోవడానికి ఇండియాకు 75 ఏళ్ళు, చైనాకు 10 సంవత్సరాలు, ఇండోనేషియా దాదాపు 70 సంవత్సరాలు పడుతుందని గిల్ అన్నారు. చైనా, ఇండియా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా వంటి దేశాలు రాబోయే కొన్ని దశాబ్దాల్లో తీవ్రమైన అడ్డంకులను ఎదుర్కునే అవకాశం ఉందని ఆయన అన్నారు. 1990 నుంచి కేవలం 34 దేశాలు మాత్రమే మిడిల్ ఇన్కమ్ ట్రాప్ నుంచి తప్పించుకోగలిగాయని ఆయన అన్నారు. -
వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
ఐదో దశ నామినేషన్ల చివరి రోజు వరకు యూపీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎక్కడి నుంచి పోటీ చేయనున్నారనే ఉత్కంఠను ఆ పార్టీ కొనసాగించింది. అయితే చివరికి ఆయన రాయ్బరేలీ నుంచి పోటీ చేస్తున్నట్లు పార్టీ వెల్లడించింది. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ మరో సస్పెన్స్కు తెరలేపింది. ఈ లోక్సభ ఎన్నికల్లో ఒకవేళ రాహుల్ అటు కేరళలోని వయనాడ్, ఇటు యూపీలోని రాయ్బరేలీలలో గెలిస్తే ఏ సీటును వదులుకుంటారనే ప్రశ్న ఇప్పుడు అందరిలోనూ మెదులుతోంది.గాంధీ కుటుంబానికి కంచుకోటగా ఉన్న రాయ్బరేలీ నుంచి మే 3న రాహుల్ గాంధీ నామినేషన్ దాఖలు చేశారు. రాహుల్కు ముందు ఆయన తల్లి సోనియా గాంధీ ఈ స్థానానికి వరుసగా 20 ఏళ్ల పాటు ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు ఆమె రాజ్యసభ సభ్యురాలు. ఇదిలా ఉండగా వయనాడ్, రాయ్బరేలీలలో గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు? అనే ప్రశ్నకు లక్నో యూనివర్శిటీ రాజనీతి శాస్త్ర విభాగాధిపతి ప్రొఫెసర్ సంజయ్ గుప్తా విశ్లేషణ చేశారు.తల్లి రాజకీయ వారసత్వం కోసం రాహుల్ గాంధీ అమేథీని వదిలి, రాయ్బరేలీ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఈ నిర్ణయం ద్వారా రాహుల్ గాంధీ సురక్షితమైన పందెం ఆడారు. మొదటిది బీజేపీ మహిళా నేత, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీతో పోటీపడితే గతంలో మాదిరిగా పరాభవం ఎదురుకాకుండా చూసుకున్నారు. మరోవైపు తన తల్లి గతంలో పోటీ చేసి, విజయం సాధించిన రాయ్బరేలీ స్థానాన్ని కాపాడుకునే ప్రయత్నం కూడా చేశారు.ఇక వయనాడ్ విషయానికొస్తే ముస్లిం, క్రైస్తవ ఓటర్లు అధికంగా ఉన్న ఈ లోక్సభ స్థానం సురక్షితమని రాహుల్ గాంధీ భావించారు. అలాగే అమేథీలో కన్నా రాయ్బరేలీలో పోటీ చేయడమే సరైనదని రాహుల్ నిర్ణయించుకున్నారు. 2019 లోక్సభ ఎన్నికల్లో వయనాడ్లో రాహుల్కు 7 లక్షల 6,000 ఓట్లు వచ్చాయి. ఆయన ప్రత్యర్థికి కేవలం రెండు లక్షల నాలుగు వేల ఓట్లు మాత్రమే దక్కాయి.అయితే ఈసారి వయనాడ్లో పరిస్థితులు మారాయి. రాష్ట్రంలోని అధికార వామపక్ష కూటమి ఈసారి అభ్యర్థిని మార్చింది. ఈసారి బీజేపీ ప్రధాన కార్యదర్శి డి.రాజా భార్య అన్నే రాజాపై రాహుల్ ఎన్నికల బరిలోకి దిగారు. గతంలో మాదిరిగానే ఈసారి కూడా రాహుల్కు ఇండియన్ ముస్లిం లీగ్ మద్దతు ఉంది. అయితే ఇక్కడ బీజేపీ కూడా తన సత్తాను చాటుకునే ప్రయత్నంలో ఉంది. ఒకవేళ రాహుల్ అటు వయనాడ్, ఇటు రాయ్బరేలీ రెండింటిలో గెలిస్తే రాయ్బరేలీని వదులుకుని, వయనాడ్కు ప్రాతినిధ్యం వహించే అవకాశాలున్నాయని ప్రొఫెసర్ సంజయ్ గుప్తా అన్నారు. అయితే అటువంటి సందర్భం ఏర్పడినప్పుడు రాయ్బరేలీకి జరిగే ఉప ఎన్నికలో రాహుల్ సోదరి ప్రియాంక పోటీ చేసి, గాంధీ కుటుంబపు కంచుకోటకు కాపాడే ప్రయత్నిం చేస్తారని ఆయన తన అభిప్రాయం తెలిపారు. -
కమలదళం.. వికేంద్రీకరణం!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో డబుల్ డిజిట్ ఎంపీ సీట్లు గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న కమలదళం ఇందుకోసం వికేంద్రీకరణ వ్యూహాన్ని అమలు చేస్తోంది. క్షేత్రస్థాయిలో పోలింగ్ బూత్లు కేంద్రంగా ప్రణాళికలు రచించింది. గత నెల ఎల్బీ స్టేడియంలో రాష్ట్రవ్యాప్తంగా 30 వేల మంది పోలింగ్ బూత్ కమిటీల అధ్యక్షులు, ఆపై మండల, జిల్లా స్థాయి అధ్యక్షులకు పార్టీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్షా చేసిన దిశానిర్దేశానికి అనుగుణంగా ముందుకు సాగనుంది. పోలింగ్ బూత్ల కేంద్రంగా కార్యకలాపాలపై ప్రత్యేకంగా దృష్టిని కేంద్రీకరిస్తోంది. వికేంద్రీకరణ పద్ధతిలో క్షేత్రస్థాయికి ప్రాధాన్యతనిస్తూ వివిధ స్థాయిల్లో వివిధ రకాల ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతోంది. ఓటర్లను పలుమార్లు కలిసేలా.. వచ్చేనెల 13న పోలింగ్ జరిగేలోగా రాష్ట్రవ్యాప్తంగా ప్రతి పోలింగ్ బూత్ పరిధిలోని ప్రతి ఇంటి తలుపు మూడుమార్లు తట్టి ఓటర్లను కలుసుకుని బీజేపీకి మద్దతు కోరాలని ఇప్పటికే నిర్ణయించారు. దీనితో పాటు ఒక్కో లోక్సభ సీటు పరిధిలో కాల్సెంటర్ను ఏర్పాటు చేసుకుని బూత్ కమిటీలను పరవేక్షించనున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్దిదారుల నుంచి క్రమం తప్పకుండా ఫీడ్బ్యాక్ తీసుకోవడం, తమ వద్దనున్న డేటాతో సరి చూసుకోవడం లాంటివి చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఈ నెల 15, 16, 17 తేదీల్లో తొలివిడత కార్యక్రమం ముగిసింది. ఈ నెల 28, 29, 30 తేదీల్లో రెండో విడత, సరిగ్గా పోలింగ్కు ముందు మే 9, 10, 11 తేదీల్లో మూడోవిడతలో ప్రతి ఇంటికీ వెళ్లి ప్రతి ఓటర్ను కలిసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్ధమవుతున్నారు. బూత్ స్థాయిలో కేంద్ర ప్రభుత్వ లబ్ధిదారులను కలిసి పూర్తిస్థాయిలో మద్దతు కూడగట్టాలని, ఈ నెల 29న నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిశాక క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయాలని నిర్ణయించారు. నామినేషన్ కార్యక్రమాలకు కేంద్ర మంత్రులు ఈ నెల 25 నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ కాగా 22 నుంచి బీజేపీ అభ్యర్థుల నామినేషన్ పత్రాల సమర్పణ ఊపందుకోనుంది. తొలి రెండురోజుల్లో సికింద్రాబాద్ (కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి) సహా ఐదుచోట్ల అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఇక 22న జహీరాబాద్లో బీబీ పాటిల్, చేవెళ్లలో కొండా విశ్వేశ్వరరెడ్డి, నల్లగొండలో సైదిరెడ్డి, మహబుబాబాద్లో సీతారాం నాయక్ నామినేషన్లు దాఖలు చేయనున్నారు. 23న భువనగిరిలో బూర నర్సయ్య, 24న పెద్దపల్లిలో గోమాస శ్రీనివాస్, ఆదిలాబాద్లో నగేష్, హైదరాబాద్ మాధవీలత, వరంగల్లో ఆరూరి రమేష్, చివరిరోజు 25న కరీంనగర్లో బండి సంజయ్, నిజామాబాద్లో అర్వింద్, నాగర్కర్నూల్లో భరత్ ప్రసాద్ నామినేషన్లు వేస్తారు. ఈ కార్యక్రమాల్లో కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, జైశంకర్, అనురాగ్ ఠాకూర్, కిరణ్ రిజిజు, గుజరాత్, ఉత్తరాఖండ్ సీఎంలు భూపేంద్ర పటేల్, పుష్కర్సింగ్లు పాల్గొననున్నారు. మే మొదటి వారంలో కార్నర్ మీటింగులు ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేయడంలో భాగంగా మే 1 నుంచి 8 దాకా కార్నర్ మీటింగులు నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. మూడు, నాలుగు పోలింగ్ బూత్లకు కలిపి ఓ కార్నర్ మీట్ను నిర్వహించి ఓటర్లను స్వయంగా కలుసుకోవడం ద్వారా పార్టీ అభ్యర్థి గెలుపు కోసం మరోసారి అప్పీల్ చేయనున్నారు. పోలింగ్కు ముందు పదిరోజులు అభ్యర్థులు పూర్తిగా క్షేత్రస్థాయి సమావేశాలు, బూత్ పర్యటనల్లో పాల్గొనేలా వ్యూహ రచన చేస్తున్నారు. పోలింగ్ బూత్ స్థాయిలో కేడర్తో ప్రచారం, ఓటర్ ఔట్ రీచ్ కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే 17 ఎంపీ స్థానాలకు పార్లమెంట్ కన్వినర్లు, ఇన్చార్జిలు, పొలిటికల్ ఇన్చార్జిల నియామకం పూర్తికావడంతో వారంతా తమకు అప్పగించిన విధుల్లో నిమగ్నమయ్యారు. మే మొదటి వారం నుంచి 11వ తేదీ మధ్య మోదీ, అమిత్షా, నడ్డా, ఇతర ముఖ్యనేతలు ఎన్నికల ప్రచారానికి రానున్నారు. వారు వచ్చినప్పుడే పెద్ద బహిరంగ సభలు ఉంటాయి. వికేంద్రీకరణ వ్యూహంలో భాగంగా మిగతా ప్రచారమంతా పలుమార్లు క్షేత్రస్థాయిలో ఓటర్లను కలుసుకోవడం, చిన్న చిన్న సభలు, సమావేశాలు, వీధి చివర మీటింగ్లు లాంటి వాటిపైనే పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి నిర్వహించనున్నారు. -
BJP: టార్గెట్ 50 శాతం
సాక్షి, న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల్లో సొంతంగానే 370కి పైగా స్థానాలను లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ, ఓట్ల శాతాన్ని గణనీయంగా పెంచుకుని దాన్ని సాధించేలా వ్యూహరచన చేస్తోంది. మోదీ కరిష్మాకు తోడు పదేళ్ల పాలన, అభివృధ్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తోంది. గతంలో కాస్త తేడాతో ఓడిన స్థానాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. కఠిన సవాలే స్వతంత్ర భారత చరిత్రలో 17 లోక్సభ ఎన్నికల్లో ఏడుసార్లు కాంగ్రెస్, రెండుసార్లు బీజేపీ, ఒకసారి జనతాపార్టీ సంపూర్ణ మెజారిటీ సాధించాయి. కానీ ఏ పారీ్టకీ 50 శాతం ఓట్లు రాలేదు! 1984లో ఇందిరాగాంధీ హత్యానంతరం లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన 48.1 శాతమే ఇప్పటిదాకా రికార్డు. ఆ తర్వాత ఏ లోక్సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్కు మెజారిటీ కానీ, 40 శాతం ఓట్లు కానీ రాలేదు. ఇక బీజేపీ 2014లో 31.4 శాతం ఓట్లతో 282 సీట్లు, 2019లో 37.7 శాతం ఓట్లతో 303 స్థానాలు సాధించింది. ఈసారి మరో 12 శాతం ఓట్ల కోసం చిన్నా పెద్దా పార్టీలతో బీజేపీ పొత్తు పెట్టుకుంది. ఆ 100 స్థానాలపై గురి 50 శాతం ఓట్లు, 370 ప్లస్ సీట్ల సాధనకు బీజేపీ రెండంచెల వ్యూహం పన్నింది. 2014లో నెగ్గి 2019 లోక్సభ ఎన్నికల్లో ఓడిన 35 స్థానాలపై ఫోకస్ పెంచింది. వీటిలో ఒక్క ఉత్తర్ప్రదేశ్లోనే 14 స్థానాలున్నాయి. బిహార్లో 6, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, చత్తీస్గఢ్ వంటి రాష్ట్రాల్లో రెండేసి చొప్పున ఉన్నాయి. వీటిని తిరిగి కైవసం చేసుకునేందుకు స్థానిక పారీ్టలతో పొత్తులు పెట్టుకుంది. అక్కడ బలమైన అభ్యర్థులను బరిలొ దింపుతోంది. ఇక కేవలం 2 నుంచి 3 శాతం ఓట్ల తేడాతో ఓడిన మరో 72 స్థానాలనూ బీజేపీ గుర్తించింది. అక్కడ సొతంగా బలం పెంచుకునే యత్నాలకు పదును పెట్టడంతో పాటు జేడీ(ఎస్), జేడీ(యూ), ఎల్జేపీ, పీఎంకే, ఆరెడ్డీ, తమిళ మానిల కాంగ్రెస్ వంటివాటితో పొత్తులు పెట్టుకుంది. పైరవీలు, సీనియార్టీలను పక్కన పెట్టి గెలుపు అవకాశాలున్న వారికే టికెట్లిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొనేందుకు ఇప్పటికే ఏకంగా 103 మందికి పైగా సిట్టింగులను తప్పించింది. వారిలో కేంద్ర మంత్రులు మీనాక్షి లేఖీ, అశి్వనీకుమార్ చౌబే తదితరులు, హర్షవర్ధన్, సదానందగౌడ వంటి మాజీలున్నారు. వరుణ్గాంధీ వంటి నేతను కూడా మొహమాటం లేకుండా పక్కన పెట్టేశారు. అనంత్కుమార్ హెగ్డే, సాధ్వీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ వంటి వివాదాస్పదులకూ మొండిచేయి చూపారు. -
ఢిల్లీలో ఏ పార్టీ ఏం చేస్తోంది?
దేశరాజధాని ఢిల్లీలో ఎన్నికల వేడి రాజుకుంది. బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్లు ప్రచారంలో వేర్వేరు వ్యూహాలను అనుసరిస్తున్నాయి. ఢిల్లీలో బీజేపీ ప్రచారాన్ని ప్రారంభించగా ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టుకు నిరసన వ్యక్తం చేస్తూ ప్రదర్శనలకు దిగుతోంది. దేశరాజధానిలో బీజేపీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. మొత్తం ఏడు లోక్సభ స్థానాలకు మేనిఫెస్టోలను సిద్ధం చేయడానికి కసరత్తు చేస్తోంది. ఎన్నికల్లో విజయం సాధించేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. అభ్యర్థులతో పాటు బీజేపీ నేతలు సభలు, పాదయాత్రలతో ఢిల్లీలో రాజకీయ వేడిని మరింతగా పెంచుతున్నారు. బీజేపీ రాష్ట్ర స్థాయి ఎన్నికల కార్యాలయాన్ని కూడా ప్రారంభించింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల ప్రచారం స్తబ్ధుగా మారింది. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టును వ్యతిరేకించడంపైనే పార్టీ దృష్టి పెట్టినట్లుంది. మరోవైపు ఈ నెల 31న రాంలీలా మైదాన్లో తలపెట్టిన ర్యాలీకి పార్టీ నేతలు, కార్యకర్తలు సన్నాహాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు ముందు, పొత్తు ఒప్పందం కింద నాలుగు స్థానాలకు ఆప్ తన అభ్యర్థులను ప్రకటించింది. లోక్సభ ఎన్నికలు ముంచుకొస్తున్నా ఢిల్లీలో మూడు స్థానాల్లో కాంగ్రెస్ తన అభ్యర్థుల పేర్లను ఇంకా ప్రకటించలేదు. మిగిలిన రెండు పార్టీలతో పోలిస్తే కాంగ్రెస్ ఎన్నికల సన్నాహాల్లో ఇంకా వెనుకబడి ఉంది. ప్రస్తుతం అభ్యర్థుల పేర్లను ఖరారు చేసే దిశగా పార్టీ కసరత్తు చేస్తోందని సమాచారం. ఢిల్లీలో లోక్సభ స్థానాలు, అభ్యర్థుల వివరాలు న్యూఢిల్లీ: బసురి స్వరాజ్ (బీజేపీ) సోమనాథ్ భారతి (ఆప్) తూర్పు ఢిల్లీ: హర్ష్ మల్హోత్రా (బీజేపీ) కులదీప్ కుమార్ (ఆప్) దక్షిణ ఢిల్లీ: రాంవీర్ సింగ్ బిధూరి (బీజేపీ) సహిరామ్(ఆప్) పశ్చిమ ఢిల్లీ: కమల్జిత్ సెహ్రావత్ (బీజేపీ) మహాబల్ మిశ్రా (ఆప్) ఈశాన్య ఢిల్లీ: మనోజ్ తివారీ (బీజేపీ) ప్రకటించలేదు (కాంగ్రెస్) చాందినీ చౌక్: ప్రవీణ్ ఖండేల్వాల్ (బీజేపీ) ప్రకటించలేదు (కాంగ్రెస్) వాయువ్య ఢిల్లీ: యోగేంద్ర చందోలియా (బీజేపీ) ప్రకటించలేదు (కాంగ్రెస్) -
ఇన్వెస్టర్స్ అలర్ట్: బడ్జెట్ 2024.. స్టాక్ మార్కెట్ స్ట్రాటజీ..!
మార్కెట్ ఆల్టైమ్హైలో ఉంది. రానున్న రోజుల్లో మార్కెట్ పయనం ఏ విధంగా ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో మదుపర్లు ఎలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి? రానున్న బడ్జెట్ సెషన్లో ఎలాంటి కీలక పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయి. దాని ప్రభావం స్టాక్మార్కెట్పై ఎలా ఉండబోతుంది. మదుపరులు ఎలాంటి స్ట్రాటజీలను అనుసరించాలో తెలుసుకోవడానికి ప్రముఖ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ శ్రీధర్ సత్తిరాజుతో బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్యరావు ముఖాముఖి ఈ వీడియోలో చూడండి. -
తెలంగాణ సీఎం ఎంపిక.. ఇది కాంగ్రెస్సేనా?
కాంగ్రెస్ అధిష్టానం ఏనాడైనా త్వరగతిన ఓ నిర్ణయం తీసుకుంటుందా?.. చర్చోపచర్చలు, అసంతృప్త నేతల బుజ్జగింపులు.. స్టేట్ టు హస్తిన రాజకీయాలు.. క్యాంప్ రాజకీయాలు.. హైకమాండ్ తీవ్ర తర్జన భర్జనలు.. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు ఇలాంటి పరిస్థితులే కనిపించేవి. ఈ పరిస్థితుల్నే ఆధారంగా చేసుకుని ప్రత్యర్థులు హస్తం పార్టీపై జోకులు కూడా పేల్చేవాళ్లు. కానీ, తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరనేది ఇంత వేగంగా ప్రకటిస్తుందని, అసంతృప్తుల పంచాయితీని కూడా ఇంత తక్కువ టైంలో తేలుస్తుందని రాజకీయ వర్గాలు ఊహించి ఉండవు!. ఏ పార్టీలో అయినా వర్గపోరు.. నేతల విభేదాలు సహజం. అయితే గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో అవి పరిధి దాటిపోతూ కనిపిస్తూ వస్తున్నాయి. సపోజ్.. తెలంగాణ కాంగ్రెస్నే పరిశీలిద్దాం. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వర్సెస్ ఆయన వ్యతిరేకవర్గం(కొందరు సీనియర్లు) మధ్య విభేదాలతో తెలంగాణ కాంగ్రెస్ నిలువునా చీలిపోతుందేమో అనే పరిస్థితి నెలకొంది. ఒక్క తెలంగాణ మాత్రమే కాదు, రాజస్థాన్లో సీనియర్ వర్గం జూనియర్వర్గం, కర్ణాటకలోనూ కీలక నేతల మధ్య వర్గపోరుతో దాదాపు చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్కు ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యాయి. మరీ ముఖ్యంగా సీనియర్లు వర్సెస్ జూనియర్ల పంచాయితీలను తీర్చేందుకు కొన్ని సందర్బాల్లో ఏఐసీసీ పెద్దలే రంగంలోకి దిగాల్సి వచ్చింది. అలాంటిది రేవంత్రెడ్డిని సీఎంగా కేవలం రెండే రోజుల్లో ప్రకటించడం ఇప్పుడు కచ్చితంగా ఆశ్చర్యానికి గురి చేసేదే!. సెటైర్లు.. జోకులు.. ‘‘ఇక్కడ సీఎం పోస్ట్ కోసం కాంగ్రెస్లో కనీసం 8 మంది రెడీగా ఉన్నారేమో!’’ అంటూ.. కిందటి ఏడాది హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ అగ్రనేత అమిత్ షా కాంగ్రెస్పై సెటైర్లు వేశారు. అలాగే.. నిన్న జరిగిన తెలంగాణ ఎన్నికల ప్రచారంలోనూ బీఆర్ఎస్ ఇదే తరహా కామెంట్లతో కాంగ్రెస్పై జోకులు పేల్చింది. అంతెందుకు కర్ణాటక ఎన్నికల సమయంలోనూ ముఖ్యమంత్రి ఎంపిక విషయంలోనూ ఫలితాలు వచ్చాక ఐదు రోజుల సమయం తీసుకోవడంపై హస్తం పార్టీని ప్రత్యర్థులు ఎద్దేవా చేశారు. సీఎం పంచాయితీ తప్పదేమోనని భావించిన తరుణంలో త్వరగతిన, అదీ పక్కా నిర్ణయం తీసుకుని రాజకీయ వర్గాలకు పెద్ద షాకే ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ మాత్రం తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకున్న అనుభవంతోనే ముందుకు సాగింది. ఆ తర్వాతే సీన్ మారింది.. వరుసగా పలు రాష్ట్రాల్లో ఓటములు.. అధికారం కోల్పోవడం గ్రాండ్ ఓల్డ్పార్టీని దెబ్బేస్తూ వచ్చాయి. ఈ మధ్యలో రాహుల్ గాంధీని ఏఐసీసీ అధ్యక్షుడ్ని చేశాక.. సీనియర్ల(జీ23 గ్రూప్) స్వరం పెద్ద తలనొప్పిగా మారింది. ఆఖరికి పార్టీ ప్రక్షాళన పేరిట కాంగ్రెస్ చింతన్ శిబిర్ (కాంగ్రెస్ నవ సంకల్ప్ శిబిర్) నిర్వహించినా.. అది కూడా అట్టర్ప్లాపే అయ్యింది. ఇలాంటి దశలో కాంగ్రెస్ అంతర్గత సంక్షోభం నుంచి బయటపడుతుందా? అనే అనుమానాలు తలెత్తాయి. అయితే రాహుల్ గాంధీ జోడో యాత్ర తర్వాత సీన్ మారింది. క్షేత్రస్థాయి పరిస్థితులను అర్థం చేసుకుంటూనే.. నేతల మధ్య ఐక్యత కోసం ఏఐసీసీ ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. కలిసి ఉంటేనే దక్కును అధికారం అని నేతలకు హితబోధ చేస్తూ వచ్చింది. ఇందుకోసం రాష్ట్ర వ్యవహారాలను పర్యవేక్షణకు అనుభవజ్ఞులైన నేతల్ని నియమిస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే రాజస్థాన్ సంక్షోభానికి ఎన్నికల వేళ చెక్ పెట్టడం, రెండు రోజుల వ్యవధిలోనే హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రిని ఎంపిక చేయడం, అలాగే.. డీకే శివకుమార్లాంటి సమర్థవంతమైన నేతను బుజ్జగించి కర్ణాటకలో సిద్ధరామయ్యను సీఎం చేయడం, ఇప్పుడు తెలంగాణలో అసమ్మతులతో సంప్రదింపులు జరిపి రేవంత్రెడ్డిని సీఎం చేయడం చేసింది. మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి కాంగ్రెస్ పెద్ద దెబ్బే. కానీ, తెలంగాణలో బీఆర్ఎస్ లాంటి బలమైన ప్రాంతీయ పార్టీని ఓడించి అధికారం కైవసం చేసుకోవడం మాత్రం మామూలు విషయం కాదు. ఇందుకు.. పార్టీలో ఐక్యత కూడా ఒక కారణమనేది కచ్చితంగా చెప్పొచ్చు. ఇదే టీమ్ ఎఫర్ట్ స్ట్రాటజీతో గనుక ముందుకు సాగితే.. వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ మెరుగైన ఫలితాలు సాధించడంంలో సఫలం కావొచ్చనేది విశ్లేషకుల అభిప్రాయం. ఇదీ చదవండి: రేవంత్రెడ్డి.. ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే! -
పిల్లల కథ! వ్యాపారానికి కావాల్సిన స్ట్రాటజీ!
అంజి అనే కోతి కొత్తగా మూలికలతో ఔషధాలు తయారుచేసి అడవిలో అమ్మటం మొదలుపెట్టింది. అది కొంతకాలం పక్క అడవిలో ఉండే తన మిత్రుడు మారుతి అనే కోతి దగ్గర మూలికలతో ఔషధాలు తయారుచేయడం నేర్చుకుంది. తిరిగి తన అడవికి వచ్చి మొక్కల వేర్లు, కాండం, బెరడు, ఆకులు, మొగ్గలు, పూలు, కాయలు, పండ్లు, గింజలు, చిగుళ్లను.. ఉపయోగించి ఎత్తుపెరగటానికి, బరువు తగ్గడానికి, జుట్టు పెరగటానికి, అందంగా అవడానికి.. ఇలా చాలావాటికి మందులు తయారు చేసేది. ఏ మొక్క దేనికి ఉపయోగపడుతుంది.. ఏ ఆకును ఏ రకంగా వాడాలో అంజికి పూర్తిగా తెలుసు. తన మూలికల ఔషధాలను అడవంతా విస్తరింపచేయాలనే ఆలోచనతో నలుగురు అమ్మకందారులనూ నియమించాలనుకుంది. వెంటనే అడవి అంతా చాటింపు వేయించింది. అంజి తయారుచేసే మందులను అమ్మి పెట్టేందుకు ఏనుగు, ఎలుగుబంటి, నక్క, పంది ముందుకు వచ్చాయి. ఔషధాలను తీసుకుని నాలుగూ నాలుగు దిక్కులకు వెళ్ళాయి. పదిరోజులైనా ఒక్క మందూ అమ్ముడుపోలేదు. అంజి తయారుచేసిన మందుల అడవిలోని జంతువులకు గురి కలగలేదు. దాంతో అంజి ఔషధాల తయారీని నిలిపివేయాలనుకుంది. విషయం తెలుసుకున్న మారుతి.. అంజిని కలసి ‘మిత్రమా! నీకు ఔషధాల తయారీలో మంచి నైపుణ్యం ఉంది. లోపం ఎక్కడుందో రేపు కనిపెడతాను’ అంటూ ధైర్యం చెప్పింది. మరునాడు అంజి వెంట మారుతి వెళ్ళి ఏనుగు, ఎలుగుబంటి, నక్క, పంది మందులను ఎలా విక్రయిస్తున్నాయో గమనించింది. అవి ఎండలో పెద్దగా అరుస్తూ ఔషధాలు కొనమని వాటి గుణాలను వివరిస్తున్నాయి. ఆ అరుపు విని జంతువులు, పక్షులు వస్తున్నాయి. ఏనుగు, ఎలుగుబంటి, నక్క, పందిని.. వాటి చేతుల్లో ఉన్న మందులను చూసి వెళ్ళిపోతున్నాయి. కానీ కొనటంలేదు. లోపం ఎక్కడుందో మారుతికి తెలిసిపోయింది. కాసేపు అలాగే పరిశీలించి.. అంజి, మారుతి రెండూ తిరిగి ఇంటికి బయలుదేరాయి. దారిలో ‘మిత్రమా! నువ్వు చేసిన మందులు సరైనవే’ అంది మారుతి. ‘మరి అమ్మకందారుల్లో లోపమా?’ అడిగింది అంజి. ‘పాపం నిజానికి అవి ఎండలో పెద్దగా అరుస్తూ, కష్టపడుతున్నాయి. వాటి శ్రమలోనూ ఎలాంటి లోపం లేదు’ అంది మారుతి. ‘మరి కారణం ఏంటీ?’ అడిగింది అంజి. ‘సరైన ఔషధాన్ని సరైన అమ్మకందారు అమ్మటం లేదు’ అంది మారుతి. అర్థంకాలేదు అంజికి. గ్రహించిన మారుతి ‘మిత్రమా! మొదట మన మీద నమ్మకం కుదిరితేనే మనం ఎదుటివారికి అమ్మగలం. ఒంటినిండా జుట్టుండే ఎలుగుబంటి జుట్టు పెరగటానికి ఔషధం అమ్మితే ఎలా ఆకర్షితులౌతారో.. సన్నబడడం గురించి ఏనుగు మాట్లాడితే అలాగే పారిపోతారు’ అంది మారుతి. ‘ఔషధం ఎంత గొప్పదైనా నమ్మకం లేకపోతే పనిచేయనట్లు.. తను ఔషధాన్ని ఎంత చక్కగా తయారుచేసినా సరైన వారు విక్రయించకపోతే అది వినియోగదారుడిని ఆకర్షించదని అర్థమైంది అంజికి. ‘మిత్రమా! ప్రతిజీవిలో ఏదో ఒక ప్రతిభ ఉంటుంది. దాన్ని సరైన సమయంలో, సరైన పనికి, సరిగ్గా వినియోగించుకోవాలి’ అని చెప్పింది మారుతి. ఆ సూచన పాటించి చిన్న చిన్న మార్పులతో పెద్ద వ్యాపారవేత్తగా ఎదిగింది అంజి. పైడి మర్రి రామకృష్ణ (చదవండి: పుట్టుకతో ఎవరూ మోసగాళ్లు కాదు! కానీ ఆ మోసం విలువ..!) -
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఫార్ములా ఇదే..
న్యూఢిల్లీ: త్వరలో జరగనున్న ఛత్తీస్గడ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్, మిజోరాం రాష్ట్రాల ఎన్నికలను బీజేపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎట్టిపరిస్థితుల్లోనూ ఏ ఐదు రాష్ట్రాల్లో గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించే పనిలో పడింది. స్థానిక నాయకత్వం.. ఇదే ఏడాది కర్ణాటక ఎన్నికల్లోనూ తర్వాత జరిగిన ఉపఎన్నికలలోనూ బీజేపీ వెనుకబడటంతో ఈ విడత ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని నిర్ణయించుకుంది. బీజేపీ పార్టీ ప్రధానంగా 'మోదీ నాయకత్వాన్ని' నమ్ముకోగా రెండో అంశంగా ఆయా రాష్ట్రాల్లో 'పార్టీ సమిష్టి నాయకత్వానికి' పెద్దపీట వేయనుంది. హిందీ భాషా ప్రాబల్యమున్న రాష్ట్రాల్లో ప్రధానంగా ముఖ్యమంత్రి అభ్యర్థిత్వానికి ప్రాధాన్యతనివ్వకుండా నాయకుల మధ్య సమన్వయం కుదర్చడానికే ప్రాధాన్యతనిస్తోంది. ముఖ్యంగా రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో స్థానిక నాయకత్వాన్ని బలపరచాలన్న యోచనలో ఉంది పార్టీ అధిష్టానం. నో వారసత్వం.. ముఖ్యమంత్రి అభ్యర్థి గురించి ఎలాంటి ప్రస్తావన చేయకుండా ఉంటే స్థానిక నాయకులకు తమ అభ్యర్థిత్వాన్ని బలపరచుకునే అవకాశం కల్పించినట్లు ఉంటుందన్నది అధిష్టానంని యొక్క ముఖ్య ఉద్దేశ్యం. అదే విధంగా వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా గళాన్ని వినిపిస్తోన్న ప్రధాని తమ పార్టీలో కూడా వారసత్వ రాజకీయాలకు చెక్ పెట్టే యోచనలో ఉన్నారు. ప్రస్తుత సంచరం ప్రకారం బీజేపీ ఒక కుటుంబం నుంచి ఒకే టికెట్ కేటాయించనున్నట్లు తెలుస్తోంది. మధ్యప్రదేశ్.. ఎన్నికల ప్రచారంలో ప్రస్తుత ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చోహాన్ ప్రాధాన్యతను తగ్గించడమే కాకుండా ఇప్పటివరకు ఆయన అభ్యర్థిత్వానికి సంబంధించిన ఎలాంటి ప్రకటన చేయలేదు. దీనికి తోడు నలుగురు ఎంపీలు, ముగ్గురు కేంద్ర మంత్రులతో పాటు జాతీయ జనరల్ సెక్రెటరీ విజయ్ వర్గియా కూడా ఈసారి ఎన్నికల్లో బరిలోకి దిగనున్నారు. శివరాజ్ సింగ్ భవితవ్యంపై ఎలాంటి సూచనలు లేని కారణంగా వీరిలో ఎవరినైనా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. రాజస్థాన్.. బీజేపీ అదే ఫార్ములాను రాజస్థాన్లో కూడా అమలు చేయాలని చూస్తోంది. ఇక్కడైతే బీజేపీ పార్టీకి ముఖ్యమంత్రి అభ్యర్ధికి కొదవే లేదు. గజేంద్ర సింగ్ షెకావత్, అర్జున్ రామ్ మేఘవాల్, కిరోడీ లాల్ మీనా, దియా కుమార్, రాజ్యవర్ధన్ రాథోడ్, సుఖవీర్ సింగ్, జౌన్పురియాలతో పాటు సింధియా రాజ కుటుంబీకురాలు వసుంధరా రాజే కూడా ఉండనే ఉన్నారు. వీరిలో కూడా అభ్యర్థి ఎవరనేది ప్రకటించకుండా బీజేపీ ఎన్నికలకు వెళ్లాలన్నది పార్టీ యోచన. ఛత్తీస్గడ్.. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఛత్తీస్గడ్లో బీజేపీ కాస్త భిన్నమైన ప్రణాలికను అమలు చేయనుంది. ఇప్పటికే ఆ పార్టీ అక్కడ ముఖ్యమంత్రి అభ్యర్థిని కూడా ప్రకటించింది. ప్రస్తుత ముఖ్యమంత్రి భూపేష్ భాఘేల్ మేనల్లుడు విజయ్ బాఘేల్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. కుటుంబ వైరం ద్వారా లబ్దిపొంది పార్టీని బలోపేతం చేయాలన్నది బీజేపీ అధిష్టానం యొక్క ప్రధాన ఉద్దేశ్యం. విజయ్ ఈసారి ఎన్నికల్లో పఠాన్ జిల్లాలోని దుర్గ్ నుంచి పోటీ చేయనున్నారు. 2003 నుంచి భూపేష్, విజయ్ల మధ్య ఈ స్థానంలో ఆధిపత్యం చేతులు మారుతూ వచ్చింది. వీరితోపాటు కేంద్రమంత్రి రేణుకా సింగ్, రాజ్యసభ ఎంపీ సరోజ్ పాండే తోపాటు మాజీ ముఖ్యమంత్రి రామం సింగ్ కూడా ఉన్నప్పటికీ బాఘేల్ కుటుంబానికే ప్రాధాన్యతనిచ్చింది బీజీపీ అధిష్టానం. తెలంగాణ.. ఇప్పటివరకు దక్షిణాదిన ఖాతా తెరవని బీజేపీకి ఈసారి కొద్దోగొప్పో ఊరటనిచ్చే రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తెలంగాణ రాష్ట్రమే. మిషన్ సౌత్లో భాగంగా ఇక్కడ కూడా సీఎం అభ్యర్థిత్వానికి నాయకుల మధ్య పోరే కొలమానం కానుంది. ఇక్కడ కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ బండి సంజయ్, మరో ఎంపీ ధర్మపురి అరవింద్, రాజ్యసభ ఎంపీ డా.కె.లక్ష్మణ్ లలో ఎవరైనా సీఎం కావచ్చు. అభ్యర్థిని మాత్రం ముందు ప్రకటించకుండా ఎన్నికల్లో పార్టీ గెలుపుకోసం సమిష్టిగా పనిచేయాలని సూచించింది. మిజోరాం.. ఇక బీజేపీకి ఈ ఎన్నికల్లో క్లిష్టతరమైన రాష్ట్రం మిజోరాం. ఈ రాష్ట్రానికి పొరుగు రాష్ట్రమైన మణిపూర్లో జరిగిన అల్లర్లు ఈ ఎన్నికలను ప్రభావితం చేస్తాయండంలో సందేహంలేదు. దీంతో బీజేపీ ఇక్కడ మాత్రం చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సిన అవసరముంది. వారి ప్రధాన అజెండా 'మోదీ నాయకత్వం' 'స్థానిక సమిష్టి నాయకత్వం' రెండూ ఇక్కడ పనిచేయకపోవచ్చు. ఇది కూడా చదవండి: జమిలి ఎన్నికలపై లా కమిషన్ నివేదిక -
కాంగ్రెస్ రూట్లో కమలం.. సర్ప్రైజ్ అందుకే!
ఈసీ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించనే లేదు. అయితేనేం ఈలోపే రెండు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసి సర్ప్రైజ్ చేసింది బీజేపీ. పైగా రిజర్వ్డ్సీట్లు.. గతంలో ఎన్నడూ గెలవని సీట్లకు ముందుగా అభ్యర్థులను ప్రకటించి మరింత ఆశ్చర్యానికి గురి చేయించిందనే చెప్పాలి. అయితే ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీని కమలం ఫాలో అవుతోందా?.. ఎన్నికలకు వంద రోజుల ముందుగానే అభ్యర్థుల ప్రకటన అనేది బీజేపీ నుంచి ఊహించని పరిణామం. అందునా షెడ్యూల్ రాకముందు బీజేపీ ఎన్నికల కమిటీ భేటీ మల్లాగుల్లాలు పడడం గమనార్హం. ఈ క్రమంలో కష్టతరమైన నియోజకవర్గాల జాబితాను విడుదల చేయడం ద్వారా బీజేపీ ఎలాంటి సంకేతాలు పంపిందనేది విశ్లేషిస్తే.. దక్షిణాది రాష్ట్రం కర్ణాటక వ్యూహం కనిపించకమానదు!. కర్ణాటకలో ఇలా.. కర్ణాటకలో అభ్యర్థులను ఎన్నికలకు ముందుగానే ప్రకటించి సక్సెస్ అయ్యింది కాంగ్రెస్. పేర్లు ప్రకటించిన వెంటనే క్షేత్ర స్థాయిలోకి దిగిన అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేసుకున్నారు. తాము అందించబోయే సంక్షేమం గురించి బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు టైం దొరికింది. తద్వారా బలంగా దూసుకుపోయి.. ఓట్లు రాబట్టుకోగలిగారు. సరిగ్గా.. అలాంటి ప్రణాళికే ఇప్పుడు బీజేపీ ఛత్తీస్గఢ్, అధికార మధ్యప్రదేశ్ విషయంలోనూ అనుసరిస్తోంది. మధ్యప్రదేశ్లో 39 మంది అభ్యర్థులను, ఛత్తీస్ఘడ్లో 21 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. వీటిలో ఎక్కువగా రిజర్వ్డ్ సీట్లుకాగా, మరికొన్ని బీజేపీ గతంలో ఎన్నడూ గెలవని సీట్లు. తద్వారా గెలుపు కఠినమైన నియోజకవర్గాల్లో అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేసేందుకు వీలుంటుందని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. నిజానికి మధ్యప్రదేశ్, ఛత్తీస్ఘడ్లలో బిజెపి పరిస్థితి బాగానే ఉంది. మధ్యప్రదేశ్లో అధికారంలో ఉండగా, ఛత్తీస్ఘడ్లో ప్రతిపక్షంలో ఉంది. అయితే కర్నాటకలో కాంగ్రెస్పార్టీ అందరి కంటే ముందే అభ్యర్థులను ప్రకటించి మంచి ఫలితాలను రాబట్టింది. అందుకే.. అదే ఫార్ములాను బీజేపీ అధిష్టానం అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది. తెలంగాణ సంగతేంది? నిజానికి ఈ కసరత్తు తెలంగాణలో జరగాలి. ఎందుకంటే, తెలంగాణలోనే బీజేపీ పరిస్థితి ఆశాజనకంగా లేదు. పైగా.. ఇటీవలి సర్వేలన్నీ బీజేపీ మూడో స్థానానికే పరిమితం కావొచ్చనే అంచనాలను వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో.. వంద రోజుల ముందు అభ్యర్థులను ప్రకటించాల్సిన అవసరం ఇక్కడే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో(ముందస్తు) బీజేపీ దాదాపు వందస్థానాల్లో డిపాజిట్లు కోల్పోయింది. హేమాహేమీలు కిషన్రెడ్డి, లక్ష్మణ్ లాంటి వారే ఓటమి పాలయ్యారు. కేవలం ఒక్క సీటుకే బిజెపి పరిమితమైంది. అలాంటప్పుడు.. గెలుపు అవకాశాలు అంతంతమాత్రంగా ఉన్న తెలంగాణ లాంటి రాష్ట్రాలలో అభ్యర్థులను ముందుగానే ప్రకటిస్తే.. ఎన్నికల సన్నాహానికి.. ప్రచారానికి తగిన సమయం దొరికడంతో పాటు అన్నిరకాల వనరులు సమకూర్చుకునే వీలు కలిగేది కదా అనే అభిప్రాయాన్ని పార్టీ క్యాడర్ వ్యక్తం చేస్తోంది. ఆగుదాం.. వెతుకుదాం! తెలంగాణలో మాత్రం మరో తరహా ఫార్ములాతో బీజేపీ ముందుకుపోయేలా కనిపిస్తోంది. బీజేపీ అధిష్టానం ఇటీవల చేసిన మార్పులతో తెలంగాణ పార్టీ కేడర్లో జోష్ ఒక్కసారిగా తగ్గిపోయింది. బండి సంజయ్ లాంటి డైనమిక్ నేతను పార్టీ చీఫ్ పదవి నుంచి తప్పించడాన్ని ఇప్పటికీ ఆయన వర్గీయులు, పార్టీ శ్రేణి చాలా మట్టుకు జీర్ణించుకోలేకపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకనో.. తిరిగి జోష్ తీసుకువచ్చేందుకు అధిష్టానం నుంచి పెద్దగా ప్రయత్నం కనిపించడం లేదు. ఈ తరుణంలో.. మధ్యప్రదేశ్, ఛత్తీస్ఘడ్లలో అభ్యర్థుల ఎంపికపై వంద రోజుల ముందే దృష్టి పెట్టిన అధిష్టానం పెద్దలు తెలంగాణపై ఎందుకు ఫోకస్ చేయడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అప్పుడే ప్రకటన! బీజేపీకి 35 చోట్ల మినహా మిగిలిన చోట్ల పెద్దగా పోటీ ఇచ్చే నాయకుల లేరట. అందుకే బీఆర్ఎస్, కాంగ్రెస్ జాబితాల ప్రకటన తర్వాత గానీ బీజేపీ తన లిస్ట్ ప్రకటించే అవకాశం లేదని స్పష్టమవుతోంది. ఈ లోపు.. గెలుపు గుర్రాల కోసం తాము అన్వేషిస్తున్నామంటూ రాష్ట్ర బీజేపీ నేతలు చెప్పుకుంటున్నారు. -
పచ్చ గూండాలు పేట్రేగిన వేళ..
సాక్షి, చిత్తూరు, పుంగనూరు (చిత్తూరు జిల్లా): చిత్తూరు జిల్లా పుంగనూరులో ఇటీవల తెలుగుదేశం పార్టీ సృష్టించిన విధ్వంసంలో విస్తుపోయే నిజాలు వెలుగుచూస్తున్నాయి. పక్కా ప్రణాళిక, భారీ వ్యూహంతోనే ఈ దాడులు జరిగినట్లు స్పష్టమవుతోంది. అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజలకు చేరువైన వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దింపడం, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని రాజకీయంగా అణగదొక్కటమే లక్ష్యంగా టీడీపీ ఈ దాడులకు వ్యూహ రచన చేసింది పక్కా ప్రణాళికతో జిల్లా నలుమూలల నుంచి టీడీపీకి చెందిన గూండాలను ఎంపిక చేసి మరీ పుంగనూరుకు తెచ్చినట్లు వెల్లడైంది. వారిపై జిల్లాలోని పలు పోలీసు స్టేషన్లలో అనేక కేసులు ఉన్నాయి. వీరిని ముందుగానే మారణాయుధాలతో సహా పుంగనూరులో మోహరించారు. చంద్రబాబు పర్యటనను కూడా వ్యూహాత్మకంగా పుంగనూరుకు వచ్చేలా మార్పు చేశారు. ముందస్తు షెడ్యూల్లో లేకపోయినా, పోలీసుల అనుమతి లేకుండానే దాడుల కోసమే ఆయన పుంగనూరు వచ్చారు. చంద్రబాబు వస్తూనే టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టడం, వెనువెంటనే విధ్వంసం సృష్టించడం.. అంతా వ్యూహం ప్రకారం చేశారు. కర్రలు, రాళ్లు, మద్యం సీసాలు, ఇతర మారణాయుధాలతో వందల సంఖ్యలో పోలీసులపై విరుచుకుపడ్డారు. ఈ దాడిలో పలువురు పోలీసులు గాయపడ్డారు. ఓ కానిస్టేబుల్ ఓ కంటి చూపు కోల్పోయాడు. అయితే, పోలీసులు చాలా సహనంతో వ్యవహరించడంతో టీడీపీ వ్యూహం బెడిసికొట్టింది. పుంగనూరు విధ్వంసంలో ఇప్పటి వరకు ఏడు నేరాలకు సంబంధించి మొత్తం 277 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ దాడుల్లో పాల్గొన్న వారిని పోలీసులు ఆధారాలతో సహా గుర్తించారు. వారిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మంగళవారం వరకు 90 మందిని అరెస్ట్ చేశారు.వారికి కోర్టు రిమాండ్ విధించడంతో కడప సెంట్రల్ జైలుకు తరలించారు. పోలీసులపై దాడి కేసులో ప్రధాన నిందితుడు చల్లా బాబుతోపాటు కుట్ర, వ్యూహ రచన, దాడుల్లో ప్రత్యక్షంగా పాల్గొన్న పలువురిని పోలీసులు గుర్తించారు. వారి గత చరిత్రను కూడా నిశితంగా పరిశీలించారు. దాడుల్లో భాగస్వాములైన వారిలో ఎక్కువ మంది పాత నేరాల చరిత్ర చూసి పోలీసులే షాక్ అయ్యారు. వారిలో కొందరి నేర చరిత్ర ఇదీ.. 1. నేరాల్లో ఘనుడు చల్లా బాబు పుంగనూరులో దాడి కేసులో ప్రధాన సూత్రదారి, పాత్రదారి ఆ నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జి చల్లా బాబు అలియాస్ చల్లా రామచంద్రారెడ్డి అని పోలీసులు తేల్చారు. దాడులకు కుట్ర పన్నడం, వ్యూహాన్ని అమలుపరచడంలో ఇతనిదే ప్రధాన పాత్రగా పోలీసులు నిర్ధారించారు. చల్లా బాబు గత చరిత్ర అంతా నేర పూరితమేనని పోలీసు విచారణలో తేలింది. పుంగనూరు నియోజకవర్గ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లలో పలు కేసులు ఉన్నాయి. ఇతను ఆలయ భూములు, ప్రభుత్వ భూముల ఆక్రమణకు పాల్పడినట్టు కూడా ఆరోపణలు ఉన్నాయి. చల్లా బాబుపై ఉన్న పాత కేసుల్లో మచ్చుకు కొన్ని.. 1.1985లో రొంపిచెర్ల పోలింగ్ స్టేషన్పై బాంబు దాడి కేసు 2. రొంపిచెర్ల క్రైం నం.368, 2021లో ఐపీసీ సెక్షన్లు, 143, 188, 341,269, 270, 290 రెడ్విత్ 149 ఐపీసీ, సెక్షన్ 3 ఈడీయాక్ట్ 3. క్రైం నం.18–2021 ఐపీసీ సెక్షన్లు 353, 506 రెడ్విత్ 34 కింద కేసు 4. క్రైం నం.8–2022 ఐపీసీ సెక్షన్లు 188, 341 కింద చౌడేపల్లి పోలీస్ స్టేషన్లో కేసు 5. క్రైం నం.89–2023 ఐపీసీ సెక్షన్లు 143, 341, 506 రెడ్విత్ 149 కింద సోమల పీఎస్లో కేసు 6. క్రైం నం.72–2022 ఐపీసీ సెక్షన్లు› 341, 143, 290 రెడ్విత్ 149 కింద కేసు 7. క్రైం నం.26–2022 ఐపీసీ సెక్షన్లు 341, 353, 143, 147, 148 రెడ్విత్ 149 కింద కల్లూరు పోలీసు స్టేషన్లో కేసు 2. టీఎం బాబు (40) ఊరు: తొట్లిగానిపల్లి, గుడిపల్లి, కుప్పం నియోజకవర్గం పార్టీలో హోదా: టీడీపీ మండల అధ్యక్షుడు పాత కేసులివీ.. 1. క్రైం నం.30–2009లో గుడిపల్లి పీఎస్లో పరిధిలో జరిగిన కేసు 2. క్రైం నం.171 ఇ, 506, 8–బి–1, ఏపీపీయాక్ట్ 3. క్రైం నం.165–2010 ఐపీసీ 392 సెక్షన్ల కింద కుప్పం పోలీస్ స్టేషన్లో కేసు 3. క్రైం నం.38–2022 ఐపీసీ సెక్షన్ 448, 427, 323, 324, రెడ్విత్ 34 కింద గుడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు 3. భాష్యం విశ్వనాథనాయుడు (45) మండలం: శాంతిపురం, కుప్పం నియోజకవర్గం పార్టీ హోదా: టీడీపీ మండల అధ్యక్షుడు పాత కేసులు: 3 కేసుల్లో నిందితుడు 1. క్రైం నం.191–2021, ఐపీసీ సెక్షన్లు 143, 341, 506, 188, 59 డీఎంఏ, ఈడీఏ కింద రాళ్ళబుదుగూరు పోలీస్ స్టేషన్లో కేసు 2. క్రైం నం.73–2022, ఐపీసీ సెక్షన్లు 177 ,182, 155 సెక్షన్ల కింద రెండో కేసు 3. రామకుప్పం పోలీస్ స్టేషన్ పరిధిలో క్రైం నం.130–2022 , ఐపీసీ సెక్షన్లు 143, 147, 148, 307, 324తో పాటు రెడ్విత్ 149 కింద కేసు 4. జి.దేవేంద్ర (31) ఊరు: గోపన్నగారిపల్లి, పులిచెర్ల మండలం, పుంగనూరు నియోజకవర్గం పార్టీలో హోదా: తెలుగు యువత మండల అధ్యక్షుడు పాత కేసులు: కల్లూరు పోలీస్స్టేషన్ పరిధిలో క్రైం నం.26–2022 ఐపీసీ సెక్షన్లు 341, 353, 143, 147, 148 రెడ్విత్ 149 కింద కేసు నమోదైంది. 5. లెక్కల ధనుంజయనాయుడు ఊరు: కొక్కువారిపల్లి, పులిచెర్ల మండలం, పుంగనూరు నియోజకవర్గం పార్టీలో హోదా: టీడీపీ రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గ ఆర్గనైజింగ్ సెక్రటరీ పాత కేసులు: రెండుకేసుల్లో నిందితుడు 1. క్రైం. నం. 26–2022 నంబరుతో కల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఐపీసీ సెక్షన్ 341, 506, 353, 143, 147, 148, రెడ్విత్ 149 కింద కేసు నమోదు 2. క్రైం.నం. 368– 2021. రొంపిచెర్ల పోలీస్ స్టేషన్లో ఐపీసీ సెక్షన్లు 143, 188, 341, 269, 270, 290 రెడ్విత్ 149 ఐపీసీ, సెక్షన్ 3 ఈడీ యాక్ట్ కింద కేసులు 6. ముల్లంగి వెంకటరమణ (52) ఊరు: ముల్లంగివారిపల్లి, పులిచెర్ల మండలం పార్టీలో హోదా: టీడీపీ ఎస్సీ సెల్ స్టేట్ ప్రిన్సిపల్ సెక్రటరీ పాత కేసులు: మూడు కేసుల్లో నిందితుడు 1.క్రైం. నం. 26–2022 ఐపీసీ సెక్షన్లు 341, 353, 143, 147, 148, రెడ్విత్ 149 ఐపీసీ కింద కల్లూరు పోలీస్ స్టేషన్లో కేసు 2. ఇదే స్టేషన్ పరిధిలో క్రైం.నం. 35–2017 ఐపీసీ సెక్షన్లు 447, 427, 324తోపాటు 34 ఐపీసీ కింద కేసు నమోదు 3. ఇక్కడే క్రైం. నం. 140–2021, ఐపీసీ సెక్షన్లు 353, 341 రెడ్ విత్ 34 కింద మరో కేసు 7. నూకల నాగార్జున నాయుడు (33) ఊరు: బొడిపటివారిపల్లి, పులిచెర్ల మండలం, పుంగనూరు నియోజకవర్గం పార్టీలో హోదా: టీడీపీ మండల యువనేత, రాష్ట్ర ఐటీ విభాగం సభ్యుడు పాత కేసులు: ఆరు కేసుల్లో నిందితుడు. రొంపిచెర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు, కల్లూరులో 1 , సోమల పరిధిలో మరొక కేసు 1. క్రైం.నం. 368–2021 ఐపీసీ 134, 188, 341, 269, 270, 290 రెడ్ విత్ 149 ఐపీసీతో పాటు సెక్షన్ 3 కింద ఈడీయాక్ట్ నమోదు 2. క్రైం.నం. 2–2023 ఐపీసీ సెక్షన్లు 143, 147, 148, 506 రెడ్ విత్, 149 3. క్రైం.నం. 374–2021 ఐపీసీ సెక్షన్లు 153, 153ఏ, 120బీ, 506, 507 4. క్రైం.నం. 5–2022 ఐపీసీ సెక్షన్లు 153, 427, 290 రెడ్ విత్ 34 ఐపీసీ 5. క్రైం.నం. 26–2022 ఐపీసీ సెక్షన్లు 341, 353, 143, 147, 148 రెడ్ విత్ 149 ఐపీసీ 6. క్రైం.నం. 149–2022 ఐపీసీ సెక్షన్లు 143, 148, 354డీ, 324, 506, 509 రెడ్విత్ 149 8. ఇ. క్రిష్ణమూర్తినాయుడు (55) ఊరు: రాయవారిపల్లి గ్రామం, రొంపిచెర్ల మండలం, పుంగనూరు నియోజకవర్గం పార్టీలో హోదా: టీడీపీ మండల అధ్యక్షుడు పాత కేసులు: ఇతనిపై కల్లూరు పోలీస్ స్టేషన్లో రెండు కేసులు నమోదయ్యాయి 1 క్రైం.నం. 26–2022 ఐపీసీ సెక్షన్లు 341, 506, 353, 143, 147, 148 రెడ్విత్ 149 2. క్రైం.నం. 12–2021, ఐపీసీ సెక్షన్లు 353, 506, రెడ్ విత్ 34 ఐపీసీ 9. నాగిశెట్టి నాగరాజ (38) ఊరు: బొమ్మయ్యగారిపల్లి గ్రామం, రొంపిచెర్ల మండలం, పుంగనూరు నియోజకవర్గం హోదా: మండలం తెలుగు యువత అధ్యక్షుడు పాత కేసులు: ఇతనిపై ఐదు కేసులు ఉన్నాయి. కల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 3, రొంపిచెర్లలో మరో రెండు కేసులు 1. క్రైం.నం. 140–2021, ఐపీసీ సెక్షన్లు 353, 341 రెడ్విత్ 34 2. క్రైం.నం. 368–2021 ఐపీసీ సెక్షన్లు 143, 188, 341, 269, 270, 290 రెడ్విత్ 149తో పాటు సెక్షన్ 3 ఈడీ యాక్ట్ 3. క్రైం.నం. 26–2022 ఐపీసీ సెక్షన్లు 341, 353, 143, 147, 148 రెడ్ విత్ 149 ఐపీసీ. 4. క్రైం.నం. 2–2023 ఐపీసీ సెక్షన్లు 143, 147, 148, 506 రెడ్విత్ 149 ఐపీసీ. 5. క్రైం.నం. 350–2021 ఐపీసీ సెక్షన్లు 151 సీఆర్పీసీ 10. కె.సహదేవుడు (50) ఊరు: బొమ్మయ్యగారిపల్లి గ్రామం, రొంపిచెర్ల మండలం, పుంగనూరు నియోజకవర్గం పార్టీలో హోదా: రొంపిచెర్ల మండలం బొమ్మయ్యగారి పల్లి ఎంపీటీసీ పాత కేసులు: రొంపిచెర్ల, మరికొన్ని స్టేషన్లలో 8 కేసుల్లో నిందితుడు 1. క్రైం.నం. 89–2014 ఐపీసీ సెక్షన్లు 447, 506 రెడ్విత్ 34 2. క్రైం.నం. 331–2020 సీఆర్పీసీ 151 3. క్రైం.నం. 365–2020 సీఆర్పీసీ 151 4. క్రైం.నం. 14–2021 ఐపీసీ సెక్షన్లు 188 , 353, 506, రెడ్ విత్ 34 5. క్రైం.నం. 356–2021 ఐపీసీ సెక్షన్ 151 6. క్రైం.నం. 368–2021 ఐపీసీ 143, 188, 341, 269, 270, 290 రెడ్విత్ 149 7. క్రైం.నం. 9–2022 ఐపీసీ సెక్షన్లు 447, 427, 506, 143 రెడ్విత్ 149 8. క్రైం.నం. 10–2022 ఐపీసీ సెక్షన్లు 341, 323, 506, 153 11. ఉయ్యాల రమణ (44) ఊరు: బొమ్మయ్యగారిపల్లి, రొంపిచెర్ల మండలం, పుంగనూరు నియోజకవర్గం హోదా: రొంపిచెర్ల మండలం టీడీపీ అధ్యక్షుడు పాత కేసులు: కల్లూరు , రొంపిచెర్ల, సోమల పోలీస్స్టేషన్ల పరిధిలో 8 కేసుల్లో నిందితుడు 1. క్రైం.నం. 140–2021 ఐపీసీ సెక్షన్ 353, 341 రెడ్ విత్ 34 2. క్రైం.నం. 368 – 2021 ఐపీసీ సెక్షన్లు 143, 188, 341, 269,270, 290 రెడ్విత్ 149 ఐపీసీతోపాటు 3 ఈడీ యాక్ట్ 3. క్రైం.నం. 2–2023 ఐపీసీ సెక్షన్లు 143, 147, 148, 506 రెడ్విత్ 149 4. క్రైం.నం.15–2021 ఐపీసీ సెక్షన్లు 188, 506 రెడ్విత్ 34 ఐపీసీ 5. క్రైం.నం.40 – 2014 ఐపీసీ సెక్షన్లు 307, 326, 324 రెడ్విత్ 34 6. క్రైం.నం. 26–2022 ఐపీసీ సెక్షన్లు 341, 353, 143, 147, 148 రెడ్విత్ 149 7. క్రైం.నం.140–2021 ఐపీసీ సెక్షన్లు 353, 341 రెడ్విత్ 34 8. క్రైం.నం. 89–2023 ఐపీసీ సెక్షన్లు 143, 341, 506 రెడ్విత్ 149 ఏ ఒక్కర్నీ వదలం పుంగనూరు దుశ్చర్యలో పోలీసుల రక్తం కళ్ల చూసిన ప్రతి ఒక్కరినీ వదలం. చట్ట ప్రకారం ముందుకెళ్తాం. బందోబస్తు డ్యూటీ కోసం వచ్చిన పోలీసులను మట్టుపెట్టాలని చూడటం, రాళ్లు, మద్యం బాటిళ్లు విసరడంపై మా వద్ద అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. వీడియో ఫుటేజీల ఆధారంగా ఇప్పటికే పలువురిని అరెస్టు చేశాం. ప్రధాన నిందితుల కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. ఆరోజు పోలీసులు అడ్డుపడకపోతే పుంగనూరు టౌన్లోకి పోయి విధ్వంసం సృష్టించేవాళ్లు. నిందితులపై చట్టరీత్యా చర్యలు తప్పవు.– వై.రిషాంత్రెడ్డి, ఎస్పీ, చిత్తూరు -
కమలంలో కలవరం
-
టీ కాంగ్రెస్ స్ట్రాటజీ సమావేశం.. హైకమాండ్ ఏం చెప్పింది?
సాక్షి, ఢిల్లీ: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే నేతృత్వంలో తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల వ్యూహ రచన సమావేశం మూడు గంటల పాటు సుదీర్ఘగా సాగింది. కాగా భారీ చేరికల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్లో జోష్ సంతరించుకుంది. ఈ భేటీలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్రావ్ ఠాక్రే, పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డిలతో పాటు ఉత్తమ్, కోమటిరెడ్డి, జానారెడ్డి, జగ్గారెడ్డి, మధుయాష్కీ తదితరలు ఈ ఎన్నికల వ్యూహ భేటీకి హాజరయ్యారు. భేటీ అనంతరం టీపీసీసీ ఛీప్ రేవంత్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ ఎన్నికల కార్యచరణ మొదలైందని, రాబోయే 120 రోజుల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించామని తెలిపారు. ‘‘మేనిఫెస్టో రూపకల్పన త్వరగా పూర్తి చేయాలని చర్చ జరిపాం. అభ్యర్థుల ఎంపికలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలనే దానిపై చర్చ జరిగింది. ఎన్నికల సన్నాహక సమావేశం సుదీర్ఘంగా చర్చ జరిగింది. కర్ణాటక ఫార్ములాను తెలంగాణలో అమలు చేయాలని నిర్ణయించాం. అక్కడ అనుసరించిన మౌలిక అంశాలు ఇక్కడ కూడా అమలు చేయాలని డిసైడ్ అయింది’’ అని రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతూ, అందరం ఐక్యంగా ఉండాలని అధిష్టానం కోరిందని, అభ్యర్థులను త్వరగా డిసైడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఖాళీగా ఉన్న పదవులు భర్తీ చేయాలి. కర్ణాటక తరహాలోనే వ్యూహం అమలు చేయాలని నిర్ణయం’’ జరిగిందని ఆయన పేర్కొన్నారు. చదవండి: తెలంగాణలో మతతత్వం పెరుగుతోంది: అసదుద్దీన్ ఓవైసీ మాజీ ఎంపీ మధు యాష్కీ మాట్లాడుతూ, బీఆర్ఎస్తో కాంగ్రెస్ పొత్తు ఉండదని మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారన్నారు. జాతీయస్థాయి ప్రతిపక్ష కూటమి లో బీఆర్ఎస్కు చోటు ఉండబోదు. తెలంగాణలో ప్రజలు త్యాగం చేస్తే, కేసీఆర్ ఫ్యామిలీ భోగం అనుభవిస్తుందని మధు యాషి అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి మానిక్రావు ఠాక్రే మాట్లాడుతూ.. అందరి సూచనలను రాహుల్ గాంధీ విన్నారని తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, వ్యూహాల గురించి చర్చించామన్నారు. తెలంగాణను కేసీఆర్ కుటుంబం లూటీ చేసిందని విమర్శించారు. చదవండి: ఈటల భార్య జమున సంచలన ఆరోపణలు -
బీఆర్ఎస్ బలం పెరుగుతుందా? తగ్గుతుందా?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అప్రమత్తమవుతున్నారు. ఇప్పటివరకు భారతీయ జనతా పార్టీ తనకు ప్రధాన ప్రత్యర్ధి అవుతుందేమోనన్న అంచనా కానివ్వండి.. బీజేపీ పెరిగితే తనకే ఎక్కువ రాజకీయ ప్రయోజనం అన్న భావన కానివ్వండి.. లేదా జాతీయ రాజకీయాలలో తన ప్రభావం చూపడానికి ఒక అవకాశం అన్న ఉద్దేశం కానివ్వండి.. ఇంతకాలం ఆయన బీజేపీపై విమర్శలు ఎక్కుపెట్టారు. ప్రధాని నరేంద్ర మోదీపై కూడా విమర్శలు కురిపించేవారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిందేనని అనేవారు. ఇప్పటికీ ఆయన తన వైఖరి మార్చుకోకపోయినా, తెలంగాణలో మారుతున్న రాజకీయ సమీకరణలను ఆయన గమనించి తన రూట్ మార్చారు. ఇప్పుడు బీజేపీపై కన్నా కాంగ్రెస్పై దాడి చేస్తున్నారు. తెలంగాణలో తాను చేపట్టిన అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివిధ సభలలో వివరిస్తున్నారు. పలు జిల్లాలలో నిర్మించిన కలెక్టరేట్ భవనాలను ఆయన ప్రారంభిస్తున్నారు. ఆ సందర్భంగా జరిగే సభలలో ఎన్నికల ప్రచారానికి తగిన విధంగా మాట్లాడుతున్నారు. ప్రజలు ప్రతిపక్షాల వైపు చూడకుండా ఉండడానికి ఎన్ని యత్నాలు చేయాలో అన్నీ చేస్తున్నారు. ఉదాహరణకు కాంగ్రెస్ పార్టీ ధరణి పోర్టల్ అంశాన్ని పెద్ద సమస్యగా మార్చుతోంది. పేదల భూములు కొట్టేయడానికే ధరణి పోర్టల్ తెచ్చారని, తాము అధికారంలోకి వస్తే ఆ పోర్టల్ను బంగళాఖాతంలో కలుపుతామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెబుతున్నారు. దానిని దృష్టిలో ఉంచుకుని ధరణి పోర్టల్ ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని, అవినీతి అరికడుతుందని, దీనిని అడ్డుకునేవారిని బంగళాఖాతంలో కలపాలని ఆయన పిలుపు ఇస్తున్నారు. మొత్తం ధరణి అంశం ప్రభుత్వాన్ని కాస్త ఇబ్బందిపెడుతున్నట్లుగానే ఉంది. వివిధ నీటిపారుదల ప్రాజెక్టులు, రాష్ట్రంలో కరెంటు సరఫరా, తాగునీటి సరఫరా మొదలైన అభివృద్ది అంశాలను పదే,పదే ప్రస్తావిస్తూ మరోసారి తమ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని ఆయన కోరుతున్నారు. మరి కొద్ది నెలల్లో ఎన్నికలు జరగనున్న తరుణంలో ఆయన బాగా యాక్టివ్ అయినట్లు కనిపిస్తుంది. మరో వైపు కేటీఆర్ తనదైన శైలిలో ప్రచారం చేస్తుంటే, కేసీఆర్ జరుగుతున్న రాజకీయాలకు అనుగుణంగా ప్రచారం చేస్తున్నారు. అయినప్పటికీ తెలంగాణలో హైదరాబాద్ కాకుండా మిగిలిన జిల్లాలలో బీఆర్ఎస్పై కాస్త నెగిటివ్ ఉందన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది. దానిని తగ్గించడానికి ఆయన ఎమ్మెల్యేలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కొన్ని చోట్ల ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉందని అంటున్నారు. కారణం ఏమైనా సెటిలర్లలో ఎక్కువమంది బీఆర్ఎస్ పట్ల సానుకూలంగా ఉంటే, తెలంగాణలో పుట్టి పెరిగినవారిలో ప్రభుత్వంపై, ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహార శైలిపై అసంతృప్తితో ఉన్నారు. తెలంగాణ ఉద్యమకారులకు అన్యాయం జరిగిందన్న కథనాలు, ఇంటర్వ్యూలు తరచుగా మీడియాలో వస్తున్నాయి. ఒక్క హైదరాబాద్ లో వంతెనలు నిర్మిస్తే సరిపోతుందా.. జిల్లాల సంగతేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చెబుతుంటే, దానినే ఆయనకు మైనస్ చేయడానికి ఆయా రాజకీయ పక్షాలు ,తెలంగాణవాదులు కొందరు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పుంజుకుంటే బీఆర్ఎస్కు అది చేటు తెస్తుందని గమనించి కేసీఆర్ కాంగ్రెస్పై దాడి పెంచారు. అంతేకాక బీజేపీలో మొదట ఉన్న జోష్ ఇప్పుడు లేదన్న భావన ప్రబలింది. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆ వాదనను కొట్టిపారేస్తున్నా, కర్నాటక ఎన్నికల తర్వాత బీజేపీ ఊపు తగ్గిందన్నది వాస్తవం. దీనివల్ల బీజేపీ కన్నా బిఆర్ఎస్ కు ఎక్కువ నష్టం వాటిల్లుతుంది. బీజేపీ, కాంగ్రెస్లు సమానంగా ఓట్లు తెచ్చుకుంటే బీఆర్ఎస్ గెలుపు సులువు అవుతుంది. అలాకాకుండా ఏదో ఒక పార్టీనే ప్రత్యర్ధిగా మారితే అది టైట్ ఫైట్గా మారవచ్చు. కర్నాటకలో మాదిరి ముస్లిం ఓట్లు తెలంగాణలో కూడా కాంగ్రెస్ వైపు మెగ్గు చూపితే మాత్రం అది బీఆర్ఎస్కు బాగా నష్టం చేసే అవకాశం ఉంటుంది. చదవండి: ఈ ప్రశ్నలకు సమాధానాలున్నాయా?.. కేసీఆర్ ఏమంటారో! మామూలుగా అయితే ఇక్కడ ముస్లిం ఓట్లు హైదరాబాద్ పాతబస్తీ మినహా మిగిలినచోట్ల టీఆర్ఎస్ వైపే ఉంటారు. కాని బీజేపీని అడ్డుకోవడానికి వారు కాంగ్రెస్కు అనుకూలంగా మారితే అది బీఆర్ఎస్కు కూడా చికాకు కలిగించవచ్చు. వీటన్నిటిని అంచనా వేసుకున్న కేసీఆర్ జిల్లాల పర్యటనల వేగం పెంచి, బీఆర్ఎస్ చెక్కు చెదరకుండా చూడడానికి అన్ని యత్నాలు చేస్తున్నారు. మరో వైపు కర్నాటకలో కాంగ్రెస్ గెలుపు తర్వాత తెలంగాణలో ఆ పార్టీకి కాస్త జోష్ వచ్చింది. సంస్థాగతంగా కొన్ని బలహీనతలు ఉన్నప్పటికీ , టీఆర్ఎస్కు ప్రధాన పోటీదారు కాంగ్రెస్సే అన్న భావన కొంతమేర తేగలిగారు. దానికి తగ్గట్లుగానే ఆయా నేతలు బీజేపీలో కన్నా కాంగ్రెస్లో చేరడానికే సుముఖత చూపుతున్నారు. అదే పెద్ద ఇండికేషన్ అని చెప్పాలి. ఖమ్మం జిల్లాలో స్ట్రాంగ్ మాన్ గా పేరొందిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాని, మాజీ మంత్రి , నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన జూపల్లి కృష్ణారావు వంటివారు కాని కాంగ్రెస్ లో చేరడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. వారిని ఆకర్షించడానికి బీజేపీ యత్నించినప్పటికీ, వాస్తవ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వారు ఆ పార్టీలో చేరలేదు. సొంతంగా పార్టీ పెట్టడం కన్నా బీఆర్ఎస్ను ఓడించడానికి కాంగ్రెస్లో చేరితే బెటర్ అన్న అభిప్రాయానికి దాదాపుగా వచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె.దామోదరరెడ్డి కూడా కాంగ్రెస్లో చేరవచ్చని చెబుతున్నారు. చదవండి: చంద్రబాబు కొత్త ట్రిక్కు.. ఆ భయంతోనేనా? అది జరిగితే నాగర్ కర్నాల్ ప్రాంతంలో కాంగ్రెస్ బలం పుంజుకుంటుంది. ఉమ్మడి మహబూబ్నగర్, నల్గొండ, ఖమ్మం వంటి జిల్లాలలో కాంగ్రెస్ పుంజుకుంటే అది బీఆర్ఎస్ కు గట్టిపోటీనే ఇస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా బీజేపీతో పోల్చితే నియోజకవర్గాలలో బలమైన క్యాడర్, నాయకత్వం కాంగ్రెస్కే ఉంది. పార్టీ విజయం సాదించే అవకాశం ఉందన్న నమ్మకం కుదిరితే వారంతా తీవ్రంగా కృషి చేస్తారు. బీజేపీ కూడా కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటనలు ఏర్పాటు చేస్తోంది. బీజేపీ అధికారంలోకి తేవడానికి వారి ప్రయత్నాలు వారు చేస్తారు. ఒకవేళ బీజేపీ అధికారంలోకి రాదన్న భావన నెలకొంటే, హంగ్ వచ్చేంత బలాన్ని అయినా పొందడానికి యత్నిస్తారు. అదికాకపోతే కాంగ్రెస్ నైతే అధికారంలోకి రావాలని వారు కోరుకోరని, అది జరిగితే దేశ వ్యాప్తంగా కొంత ప్రభావం పడుతుందని వారు భావించవచ్చని చెబుతున్నారు. అప్పుడు బీఆర్ఎస్కే వారు ఎంతో కొంత సాయపడవచ్చన్న ప్రచారం కూడా ఉంది. మామూలుగా అయితే కేసీఆర్కు నల్లేరు మీద బండిలా గెలుపు రావాలి. కాని ఆయన వ్యవహార శైలి, వివిధ కారణాల వల్ల పోటీని ఎదుర్కునే పరిస్థితి తెచ్చుకున్నారనిపిస్తుంది. ఏది ఏమైనా రాజకీయం ఎప్పుడూ ఒకరి సొంతం కాదు కదా! -కొమ్మినేని శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ ఛైర్మన్ -
బీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒక్కటే.. శరద్ పవార్
న్యూఢిల్లీ: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధ్యక్షుడు సీనియర్ నేత శరద్ పవార్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీని ఎదుర్కోవడానికి విపక్షాలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు. జూన్ 23న బీహార్లో జరగనున్న విపక్షాల సమావేశంలో కూడా తాను ఇదే విషయాన్ని ప్రతిపాదించనున్నట్లు తెలిపారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 24వ ఆవిర్భావ దినోత్సవంలో ఆ పార్టీ అధ్యక్షులు శరద్ పవర్ మాట్లాడుతూ పార్టీ వర్గాలకు తమ భవిష్యత్తు కార్యాచరణ గురించి వివరించారు. కేంద్రంలో బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా విపక్షాలన్నీ ఐక్యతతో పోరాడాలని ఆకాంక్షించారు. బీజేపీ పార్టీని ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో బీజేపీని వద్దనుకుంటున్నారంటే రేపు కేంద్రంలో కూడా ఆ పార్టీని వద్దనుకునే అవకాశం లేకపోలేదు. ఇలాంటి సమయంలోనే ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలి. కలిసికట్టుగా బీజేపీని సాగనంపే ప్రయత్నం చేయాలని అన్నారు. బీజేపీ అధికారంలోకి రావడం కోసం కష్టసాధ్యమైన హామీలిచ్చి ప్రజలను మభ్య పెట్టింది. ప్రజలకు ఆ విషయం తేటతెల్లమైంది. ఇప్పుడు వారు ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్నారు. అన్ని బీజేపీయేతర పార్టీలు సమిష్టిగా పోరాడితే ఆ పార్టీని ఓడించడం పెద్ద కష్టమేమీ కాదని అన్నారు. ఈ సందర్బంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ ప్రస్తావన తీసుకుని రాగా ఆయన స్పందిస్తూ అన్ని పార్టీలకూ తమ విస్తృతిని ఏ రాష్ట్రంలోనైనా పెంచుకునే అవకాశముంది. కానీ నాకెందుకో అది బీజేపీకి చెందిన తోక పార్టీగా అనిపిస్తోందన్నారు. ఇది కూడా చదవండి: వారితో చేతులు కలపడం దండగ.. -
ఎగుమతుల వృద్ధికి రంగాల వారీ ప్రాధాన్యత
న్యూఢిల్లీ: ఎగుమతుల రంగంలో పోటీతత్వాన్ని పెంపొందించడానికి రంగాల వారీ వ్యూహాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంటేషన్ మేనేజ్మెంట్– బెంగళూరు (ఐఐపీఎంబీ)డైరెక్టర్ రాకేష్ మోహన్ జోషి పేర్కొన్నారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, ఇంజినీరింగ్, ఫార్మాస్యూటికల్ ఇతర హైటెక్ పరిశ్రమల కోసం ఈ తరహా వ్యూహం అవసరమని పేర్కొన్నారు. భారత్ 2030 నాటికి 2 ట్రిలియన్ డాలర్ల వస్తు, సేవల ఎగుమతుల లక్ష్యాన్ని చేరడానికి ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందుకు వార్షిక వృద్ధి రేటు 14.5 శాతంగా నమోదుకావాలనీ అంచనావేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... ► పాలిష్ చేసిన వజ్రాలు, ఆభరణాలు, ప్యాసింజర్ కార్లు, టెలికమ్యూనికేషన్ పరికరాలు వంటి రంగాలు ఎగుమతుల భారీ పెరుగుదలలో దోహదపడతాయి. ► దేశాల పరంగా చైనా, యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ (యూఏఈ), హాంకాంగ్, జర్మనీ, వియత్నాం, బ్రిటన్, ఇండోనేషియా, మలేషియా, సౌదీ అరేబియా, ఫ్రాన్స్, ఇటలీ, థాయ్లాండ్, టర్కీ, జపాన్, దక్షిణ కొరియా, మెక్సికో, బెల్జియంలకు మన ఎగుమతులను పెంచుకోడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. ► ఎగుమతిదారులు, వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమాచార, సమన్వయ అంతరాన్ని తగ్గించడం ప్రస్తుతం అవసరం. రియల్ టైమ్ సమాచారాన్ని సేకరించడం, సమీకరించడం, ప్రాసెసింగ్ చేయడం, సంబంధిత వ్యక్తులకు ఆ సమాచారాన్ని సకాలంలో అందేలా చేయడం, ఆధునిక సాంకేతికతను అవలంబించడం చాలా ముఖ్యమైన అంశాలు. ► అమెరికా, యూరోపియన్ యూనియన్ తదితర అభివృద్ధి చెందిన దేశాలలో సెమీకండక్టర్ తయారీని సులభతరం చేయడానికి చిప్స్ చట్టం వంటి రక్షణవాద విధానాల పునరుద్ధరణను భారతదేశం నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ► పలు దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ► వ్యవసాయం, తోటల పెంపకం, ఉద్యానవన అనుబంధ రంగాల పురోగతికి ఐఐపీఎంబీ కీలక సహకారాన్ని అందిస్తోంది. విద్య, ఎగుమతులు, సామర్థ్యం పెంపుదల, శిక్షణ, విధాన పరిశోధన, అభివృద్ధి వంటి వివిధ కోణాల్లో పురోగతికి వ్యూహాలు రూపొందిస్తుంది. -
గేరు మార్చి.. స్పీడ్ పెంచి.. సీఎం జగన్ బలం అదే.. ఇదీ లెక్క..!
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గేరు మార్చి స్పీడ్ పెంచారు. తన రాజకీయ ప్రత్యర్ధులు ఏదైతే బలం అనుకుంటున్నారో, దానిని ఆయన వారి బలహీనతగా ప్రజలకు చూపిస్తున్నారు. ఒక వైపు తన ప్రభుత్వం పేదల కోసం చేపడుతున్న వివిధ కార్యక్రమాలను వివరిస్తూనే, మరో వైపు రాజకీయ విమర్శలకు ఆయన బదులు ఇస్తున్నారు. నిజాం పట్నంలో మత్స్యకార భరోసా కార్యక్రమం సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ అనుసరించిన వ్యూహం ఇదే అనిపిస్తుంది. ప్రతి సందర్భంలోనూ ఇదేరీతిలో ఆయన ప్రసంగాలు సాగుతున్నా, నిజాంపట్నంలో మరింత స్పష్టంగా తన రాజకీయ వ్యూహాన్ని ఆయన అమలు చేసినట్లు అనిపిస్తుంది. తాను పేద ప్రజల కోసం పనిచేస్తుంటే, ప్రతిపక్ష తెలుగుదేశం, జనసేనలు పెత్తందారి పార్టీలుగా మారాయని, ధనిక వర్గాల కోసం అవి పనిచేస్తున్నాయని జగన్ పేర్కొన్నారు. తద్వారా పేద,పెత్తందారి ధీరిని మరోసారి ప్రజలకు ఆయన వివరించారు. పేదల కోసం తీసుకు వస్తున్న స్కీములను ఈ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయని చెప్పడం ఆయన లక్ష్యం. అంతవరకు ఆయన సఫలం అయినట్లే అనిపిస్తుంది. అందుకే తెలుగుదేశం పార్టీ జనంతో యుద్దం చేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో మాదిరే ఆర్ధిక పరిస్థితి ఉన్నా, ఇంకా కొన్ని సమస్యలు అదనంగా వచ్చినా తాను ప్రజలకు 2.10 లక్షల కోట్ల మేర నేరుగా అందచేశానని, చంద్రబాబు అలా ఎందుకు చేయలేకపోయారని, ఆయన హయాంలో ఈ డబ్బు అంతా ఏమైందని జగన్ ప్రశ్నించడం ద్వారా తన ప్రభుత్వంలో అవినీతి లేదని, బటన్ నొక్కితే ప్రజల ఖాతాలలోకి వెళుతుందని ఆయన వివరించారు. తాను ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలలో 98.5 శాతం నెరవేర్చిన విషయాన్ని ఆయన ప్రస్తావిస్తున్నారు.ఈ నేపధ్యంలో తాము అధికారంలోకి వస్తే ఈ సంక్షేమ స్కీములను తీసివేయబోమని చంద్రబాబు,పవన్ లు చెప్పవలసి వస్తోంది. ఈ రకంగా వారిని జగన్ తన ట్రాప్ లోనే ఉంచుతున్నారు. వారికి తనే ఎజెండా సెట్ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. మత్స్యకారులకు తమ ప్రభుత్వ హయాంలో జరిగిన మేలు గురించి ఆయన చెప్పారు. ఈ రకంగా సంబంధిత కార్యక్రమం, ప్రభుత్వ స్కీముల గురించి మాట్లాడిన తర్వాత రాజకీయ అంశాల వైపు మళ్లుతున్నారు. తెలుగుదేశం, జనసేనల పొత్తు గురించి ఆయన వ్యాఖ్యానించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లు తాము కలవడం బలం అనుకుంటున్న సంగతి తెలిసిందే. దానినే వారి బలహీనతగా జగన్ చూపిస్తున్నారు. రాష్ట్రపతి, ప్రధాని వంటివారిని ఎంపిక చేశానని డాంబికాలు చెప్పుకునే చంద్రబాబు నాయుడు 175 సీట్లలో పోటీ చేయలేకపోతున్నారని, పవన్ కళ్యాణ్ తను బలహీనుడనని చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ రెండు పార్టీలు కలిసినా తనను ఓడించలేవని, తన బలాన్ని చూసి భయపడే వారు పొత్తులు పెట్టుకుంటున్నారని జగన్ ప్రజలకు అర్ధం అయ్యేలా చెప్పే ప్రయత్నం చేశారు. ఇదే సందర్భంగా పవన్ కళ్యాణ్ కొద్ది రోజుల క్రితం తనకు సీఎం పదవి ఎవరిస్తారని బేలగా మాట్లాడాన్ని జగన్ తనకు అడ్వాంటేజ్గా మలచుకున్నారు. లోకేష్ ను నాయకుడిగా చేసేందుకు చంద్రబాబు చేస్తోన్న ప్రయత్నం, దాని కోసం అందరినీ కలుపుకుని ప్రభుత్వంపై విష ప్రచారం దిగుతుందని ప్రజలకు కూడా అర్థమవుతోంది. ఇదే అంశాన్ని వైఎస్సార్ సిపి కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తొంది. ఇది పెత్తందార్లకు, పేదవారికి మధ్య జరుగుతున్న యుద్ధం. ఈ యుద్ధంలో పేదవారికి అండగా జగనన్న ప్రభుత్వం ఉంది. అందరూ ఒక్కసారి ఆలోచన చేయండి, ఈ యుద్ధంలో మీ మద్దతు ఎవరి వైపు..?#PedavalluVSPetthandarlu #RichVSPoor #YSJaganAgain pic.twitter.com/l75wbvOPAj — YSR Congress Party (@YSRCParty) May 15, 2023 పవన్ను ఎప్పుడూ ఆయన దత్తపుత్రుడు అని సంభోదిస్తారు. అదే సంబోధనతో ఆయనకు సీఎం పదవి వద్దట.. ప్యాకేజీ ఇస్తే చాలట అని వ్యంగ్యంగా అన్నారు. చంద్రబాబు ఏమి ఆదేశిస్తే జీహుజూర్ అంటూ పవన్ సిద్దంగా ఉంటారని చెబుతూ ప్రజలలో ఆయన పట్ల మరింత వ్యతిరేకత పెంచడానికి జగన్ యత్నించారు.పొత్తులు పెట్టుకుని వివాహం చేసుకునేది వీరే.. విడాకులు ఇచ్చేది వీళ్లే అని అంటూ గత చరిత్రను ఆయన గుర్తు చేశారు. 2014లో పవన్ కళ్యాణ్ తన పార్టీ పోటీ చేయకుండా కేవలం చంద్రబాబుకే మద్దతు ఇచ్చారు. 2019 ఎన్నికలనాటికి టీడీపీకి దూరం అయి అంటే విడాకులు తీసుకుని వేరే కూటమి కట్టి పోటీచేశారు. అది కూడా తెలుగుదేశం వ్యతిరేక ఓటు చీలడానికే అన్న వ్యూహం అప్పట్లో అమలు చేశారన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. పేరుకు విడిపోయినా, పవన్ కళ్యాణ్ ఆయా నియోజకవర్గాలలో చంద్రబాబు ఎంపిక చేసినవారికే జనసేన టిక్కెట్లు ఇచ్చారని చెబుతారు. చంద్రబాబు, లోకేష్లు పోటీచేసిన కుప్పం, మంగళగిరిలలో పవన్ ప్రచారం చేయలేదు.. అలాగే పవన్ పోటీచేసిన రెండు చోట్ల గాజువాక, భీమవరంలలో చంద్రబాబు ప్రచారం చేయలేదు. ఇదంతా మాచ్ ఫిక్సింగ్ లో భాగమేనని తేలింది. ఓటమి అనంతరం పవన్ కళ్యాణ్ మళ్లీ బిజెపి గూటికి చేరారు. అది కూడా చంద్రబాబును రక్షించే క్రమంలోనే అని వైసీపీ చెబుతుంటుంది. బీజేపీతో పొత్తులో ఉన్నా, పవన్ టీడీపీతో రాజకీయ అక్రమ సంబంధం నెరపుతున్నారు. వీటన్నిటిని జగన్ తో సహా వైసీపీ నేతలు బాగా ఎక్స్ పోజ్ చేశారు. చంద్రబాబు, పవన్ లు విలువలు లేని, విశ్వసనీయత లేని రాజకీయాలు చేస్తారని చెబుతూ సోదాహరణంగా ఆయా విషయాలను జగన్ ఉటంకిస్తున్నారు. చంద్రబాబు ఆధ్వర్యంలోని టీడీపీ గత రెండున్నర దశాబ్దాలలో పలు పార్టీలతో పొత్తులు పెట్టుకుంది. వారితో విడిపోయింది. ఉదాహరణకు 1996, 98 లోక్ సభ ఎన్నికలలో వామపక్షాలతో స్నేహం చేసి, బీజేపీని మసీదులతో కూల్చే పార్టీ అని చంద్రబాబు తీవ్రంగా తప్పుపట్టేవారు. చదవండి: రాజకీయాల్లో సినిమావాళ్ల విలువ ఎంతంటే.. కాని 1998 ఎన్నికలు పూర్తి కాగానే చెప్పాపెట్టకుండా వామపక్షాలకు గుడ్ బై చెప్పి బీజేపీ చంక ఎక్కారు. 1999,2004 ఎన్నికలలో వారితో కలిసి పోటీచేసి, ఆ తర్వాత జీవితంలో బీజేపీతో కలవనని అనేవారు. కాని 2014 ఎన్నికలనాటికి బీజేపీ అగ్రనేత నరేంద్ర మోదీ చుట్టూ తిరిగి మళ్లీ పొత్తు పెట్టుకున్నారు. 2002లో నరేంద్ర మోదీని నరహంతకుడని ధ్వజమెత్తారు. హైదరాబాద్కే రానివ్వనని అనేవారు. 2014లో ఆయన తో కలిసి రాజకీయంగా లబ్ది పొందినా, తిరిగి 2018 నాటికి మళ్లీ దూరం అయి మోదీ వేస్ట్ అని, దేశం నాశనం అవుతోందని అనేవారు. 2024 నాటికి తిరిగి మోదీతో ఎలాగొలా స్నేహం చేయాలని అర్రులు చాస్తున్నారు. 2009లో టీఆర్ఎస్తో పొత్తు కోసం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా లేఖ ఇచ్చారు. తీరా రాష్ట్ర విభజనకు కేంద్రం పూనుకుంటే సోనియాగాంధీ దెయ్యం, ఏపీకి నష్టం చేసిందని అనేవారు. కాని 2018 తెలంగాణ ఎన్నికల నాటికి కాంగ్రెస్ తోనే చెట్టపట్టాలేసుకుని తిరిగారు. ఇలా ఇన్ని విన్యాసాలు చేసిన వ్యక్తిగా చంద్రబాబును ప్రజల ముందు జగన్ ఉంచే యత్నం చేశారు. చంద్రబాబు మాదిరే పవన్ కూడా పలు కూటములు మార్చిన తీరును ఆయన ఎండగడుతున్నారు. వీరిద్దరూ అనైతిక రాజకీయాలు చేస్తారని ప్రజలలో ఎస్టాబ్లిష్ కావడానికి వీటిని గుర్తు చేస్తుంటారు. వచ్చే శాసనసభ ఎన్నికలలో టీడీపీ, జనసేనలు పొత్తు పెట్టుకుంటే వైసీపీకి కొంత ఇబ్బంది వస్తుందన్న ప్రచారాన్ని ఆయన తిప్పి కొడుతున్నారు.చంద్రబాబు, పవన్ లు కుట్ర పూరితంగా రాజకీయం చేస్తున్నారని, తద్వారా పేద ప్రజలకు నష్టం చేయాలని చూస్తున్నారని ఆయన వివరిస్తున్నారు. తాను పేదలవైపు ఉన్నానని, టీడీపీ, జనసేనలు, పెత్తందారుల వైపు ఉన్నాయని ఆయన ఉద్ఘాటిస్తున్నారు. పొరపాటున చంద్రబాబును గెలిపిస్తే ప్రస్తుతం అమలు అవుతున్న సంక్షేమ కార్యక్రమాలన్ని ఆగిపోతాయని కూడా ఆయన హెచ్చరిస్తున్నారు. చదవండి: మలుపు తిప్పిన ముఠా! పవన్ కల్యాణ్కూ వాటా ఈ రకమైన వ్యూహాలతో జగన్ తన ఓటు బ్యాంకును చెక్కు చెదరనివ్వకుండా కాపు కాచుకుంటున్నారని చెప్పాలి. యథా ప్రకారం చంద్రబాబు, దత్తపుత్రుడుతో పాటు ఈనాడు, జ్యోతి, టివి 5 మీడియా సంస్థలు తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి అసత్య కదనాలు ఇస్తున్నది చెప్పకుండా మానడం లేదు. వీళ్లందరిని కలిపి ఆయన తోడేళ్ల గుంపుతో పోల్చుతున్నారు. చంద్రబాబు కొంతకాలం క్రితం టీడీపీ, జనసేన కూటమి అంటే జగన్ భయపడుతున్నారని అన్నారు. దానికి ప్రతిగా వారిద్దరూ కలవడం వారి బలహీనత అని, వైఎస్సార్ కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని, ప్రజలే తన ధీమా అని, తాను దేవుడిని, ప్రజలనే నమ్ముకున్నానని జగన్ అంటున్నారు. మీ బిడ్డ అంటూ తనను పరిచయం చేసుకుంటున్నారు. ఇది మీ ప్రభుత్వం, మనందరి ప్రభుత్వం అని చెబుతూ ప్రజలను ప్రభుత్వంలో భాగస్వాములను చేస్తూ జగన్ ముందుకు సాగుతున్నారు. సింహంలా సింగిల్ గానే ఎన్నికలలో వైసీపీ పోటీచేస్తుందని, అదే తన బలం అని ప్రజలలో విశ్వాసం కల్పించడానికి జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని చెప్పవచ్చు. -కొమ్మినేని శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ ఛైర్మన్ -
పక్కా ప్లాన్డ్గా.. బీజేపీ హైకమాండ్ కొత్త స్ట్రాటజీ..
సాక్షి, చెన్నై: జాతీయ స్థాయి పదవుల్లో తమిళులకు ప్రాధాన్యమిస్తూ అటు నాయకులను, ఇటు ప్రజలను ఆకర్షించేందుకు బీజేపీ సిద్ధమైంది. ఇప్పటికే ఇద్దరు గవర్నర్లు, ఓ కేంద్రమంత్రి తమిళనాడు నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. తాజాగా మరొకరికి రాష్ట్ర ప్రథమ పౌరుడి హోదా దక్కింది. దీంతో ఆ పార్టీ నేతల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. భారతీయ జనతా పార్టీని నమ్ముకుంటే.. ఎప్పటికైనా పదవి సిద్ధిస్తుందనే ప్రచారం ప్రస్తుతం రాష్ట్రంలో ఊపందుకుంది. ఇది రానున్న లోక్సభ ఎన్నికల్లో తమకు లబ్ధి చేకూరుస్తుందని ఆ పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. తమిళనాడులో పాగా వేయడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ అధిష్టానం ‘కొత్త’ఎత్తులు వేస్తోంది. ఇందులో భాగంగా స్థానికంగా ఉన్న మరో సీనియర్ నేతకు గవర్నర్గా ప్రమోషన్ ఇచ్చింది. ఝార్ఖాండ్ గవర్నర్గా సీపీ రాధాకృష్ణన్ను నియమిస్తూ ఆదివారం ఉత్తర్వులు వెలువడడంతో ఆయన మద్దతుదారులు సంబరాల్లో మునిగిపోయారు. సీపీఆర్కు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన తమిళి సై సౌందరరాజన్ తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలాగే మరో సీనియర్నేత ఇలగణేషన్ను మణిపూర్ గవర్నర్గా నియమించారు. తాజాగా ఆయన్ని అక్కడి నుంచి నాగాలాండ్కు బదిలీ చేశారు. అలాగే రాష్ట్రానికి చెందిన ఎల్. మురుగన్కు ఏకంగా రాజ్యసభ హోదాలో కేంద్ర సహాయమంత్రి పదవి కట్టబెట్టారు. ఈ పరిణామాల నేపథ్యంలో తనకు కూడా అవకాశం రాక పోదా..? అని ఎదురు చూసిన బీజేపీ సీనియర్ సీపీ రాధాకృష్ణన్కు గవర్నర్ పదవి దక్కింది. లోక్సభ ఎన్నికల్లో తమిళుల ఓట్లను కొల్లగొట్టడమే లక్ష్యంగా వ్యూహ రచన చేస్తున్న బీజేపీ అధిష్టానం, మరో నేతను అందలం ఎక్కించడం విశేషం. కార్యకర్త నుంచి గవర్నర్ స్థాయికి.. తిరుప్పూర్లో రైతు కుటుంబంలో జన్మించిన సీపీ రాధాకృష్ణన్ 16 ఏళ్ల వయస్సు నుంచే ఆర్ఎస్ఎస్ ద్వారా తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు. బీజేపీలో కార్యకర్త స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. 1998, 1999లో రెండు సార్లు కోయంబత్తూరు లోక్సభ నియోజకవర్గం నుంచి లోక్సభకు ప్రాతినిథ్యం వహించారు. 2014, 2019 ఎన్నికల్లో పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందారు. బీజేపీలో సీనియర్ నేతగా ఉంటూ కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సంస్థల్లో నామినేటెడ్ పదవుల్లో కొనసాగారు. ఒకప్పుడు తమిళనాడు బీజేపీ అంటే సీపీరాధాకృష్ణన్ అనే స్థాయికి చేరుకున్నారు. ఈ క్రమంలో తన కన్నా జూనియర్లు అనేక మంది రాష్ట్రం నుంచి జాతీయ స్థాయిలో కీలక పదవుల్లోకి వెళ్తున్న సమయంలో, తనకు అవకాశం దక్కక పోదా? అని ఎదురు చూసిన సీపీఆర్ ఎట్టకేలకు లక్కీచాన్స్ కొట్టేశారు. మద్దతుదారుల సంబరాలు సీపీ రాధాకృష్ణన్ను ఝార్ఖాండ్ గవర్నర్గా నియమిస్తున్నట్లు ఉత్తర్వులు వెలువడగానే ఆయన మద్దతుదారులు సంబరాలు చేసుకున్నారు. ఇక సీఎం ఎంకే స్టాలిన్, ప్రధాన ప్రతిపక్ష నేత పళణి స్వామి, ఉప నేత పన్నీరు సెల్వం, గవర్నర్లు తమిళి సై, ఇలగణేషన్, కేంద్ర సహాయ మంత్రి ఎల్. మురుగన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైతో పాటు వివిధ పార్టీలకు చెందిన వారు శుభాకాంక్షలు తెలియజేశారు. సీఎం స్టాలిన్ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలుపుతూ, రాజ్యంగం ప్రకారం విధులు నిర్వహించాలని ఆకాంక్షించారు. చదవండి: ట్రెజర్ హంట్ – ఎంపవర్మెంట్! వారధిగా ఉంటా.. తనను కొత్త గవర్నర్గా నియమించినట్లు సమాచారం రావడంతో తిరుప్పూర్లో సీపీ రాధాకృష్ణన్ మీడియాతో మాట్లాడారు. ఈ అవకాశం కల్పించిన ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ పదవి తనకు దక్కిన గౌరవం కాదని.. తమిళనాడు ప్రజలకు లభించిన గొప్ప అవకాశం అని అభివర్ణించారు. అందుకే తమిళనాడు ప్రజలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వారధిగా ఉంటానని, ఝార్ఖాండ్ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి శ్రమిస్తానని వ్యాఖ్యానించారు. -
గుజరాత్ కాంగ్రెస్ లో కనిపించని ఎన్నికల జోష్
-
తుమ్మల వ్యూహం అర్థం కావడంలేదంటున్న అనుచరులు
-
Munugode Politics: మునుగోడుపై కమలనాథుల వ్యూహమేంటీ?
సాక్షి, హైదరాబాద్/నల్గొండ: మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి స్టీరింగ్ కమిటీ చైర్మన్గా వివేక్ను నియమిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిర్ణయం తీసుకున్నారు. 16 మందితో స్టీరింగ్ కమిటీని ప్రకటించారు. స్థానికుడైన గంగిడి మనోహర్రెడ్డికి కో-ఆర్డినేటర్గా బాధ్యతలు అప్పగించారు. చదవండి: మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల! సభ్యులుగా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాజీ ఎంపీలు ఏపీ జితేందర్ రెడ్డి, గరికపాటి మోహన్రావు, విజయశాంతి, రవీంద్ర నాయక్, రాపోలు ఆనంద్ భాస్కర్, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ స్వామి గౌడ్, మాజీ మంత్రి చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీ నారాయణ, మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్, మాజీ నేషనల్ బీసీ కమిషన్ మెంబర్ తల్లోజు ఆచారి, దాసోజు శ్రవణ్ను నియమించారు. దుబ్బాక, హుజురాబాద్ తరహాలో ఉప ఎన్నిక ఇంచార్జీ అని కాకుండా స్టీరింగ్ కమిటీ అని ప్రకటించడం బీజేపీలో చర్చనీయాంశంగా మారింది. మునుగోడు ఉప ఎన్నిక ఇంచార్జ్ కోసం నేతలు పోటీ పడ్డారు. కానీ బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి మాత్రం వివేక్ పేరు ప్రతిపాదించారు. ఇతర నేతలను నారాజ్ చేయకుండా స్టీరింగ్ కమిటీ పేరుతో 16 మంది టీం ప్రకటించారు. మరో రెండు మూడు రోజుల్లో మునుగోడు నియోజకవర్గంలో మండలాల వారీగా ఇంచార్జ్లను ప్రకటించనున్నారు. వచ్చే వారంలో ప్రతి గ్రామానికి ఇంచార్జ్ని నియమించి బూత్ స్థాయిలో పోల్ మేనేజ్మెంట్ చేయడానికి బీజేపీ పటిష్ట కార్యాచరణ రూపొందిస్తోంది. -
బీజేపీ ట్విస్ట్ల మీద ట్విస్ట్లు.. జేపీ నడ్డాతో భేటీ కానున్న హీరో నితిన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ సరికొత్త యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. శంషాబాద్ నోవాటెల్లో రేపు(శనివారం) బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో హీరో నితిన్ భేటీ కానున్నారు. సినీ రచయితలు, క్రీడాకారులతో కూడా నడ్డా సమావేశం కానున్నారు. ఇటీవలే అమిత్షాను జూనియర్ ఎన్టీఆర్ కలిసిన సంగతి తెలిసిందే. చదవండి: మునుగోడు ఉప ఎన్నిక: టికెట్ రెడ్డికా.. బీసీకా? -
‘గులాబీ’ బాస్ ఆదేశాలు.. ఆ ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లు..?
సాక్షి, నిజామాబాద్: రాబోయేది ఎన్నికల కాలం కావడంతో ఇందూరు పాలిటిక్స్ అప్పుడే హాట్ హాట్గా మారిపోతున్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక ఐదేళ్ళ పాటు గులాబీ పార్టీ హవా కొనసాగింది. ధర్మపురి అరవింద్ బీజేపీ ఎంపీగా గెలిచిన తర్వాత రాజకీయాల రంగు మారింది. గులాబీకి కమలం పోటాపోటీగా వస్తోంది. పీసీసీ చీఫ్గా రేవంత్ వచ్చాక హస్తం కూడా యాక్టివేట్ అయింది. దీంతో మూడు పార్టీల రాజకీయాలు ఇందూరులో ఆసక్తికరంగా సాగుతున్నాయి. చదవండి: మరో వీడియో విడుదల చేసిన రాజాసింగ్.. సంచలన వ్యాఖ్యలు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిజామాబాద్ జిల్లా యావత్తు గులాబీ మయంగా మారింది. తొలి ఎన్నికల్లో మొత్తం అసెంబ్లీ సీట్లు, లోక్సభ స్థానాలు టీఆర్ఎస్ గెలుచుకుంది. ఇందూరు జిల్లాలో మరో పార్టీకి అవకాశమే లేదన్నంతగా పరిస్థితులు టీఆర్ఎస్కు అనుకూలంగా మారాయి. కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత నిజామాబాద్ ఎంపీగా విజయం సాధించింది. అయితే ఆ తర్వాత క్రమంగా గులాబీ రంగు వెలియడం మొదలైంది. 2018 అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి పరిస్థితుల్లో కొంత మార్పు కనిపించింది. ఉద్యమపార్టీగా ప్రజల అభిమానం పొందిన గులాబీ పార్టీపై అసంతృప్తి ప్రారంభమైనట్టు స్పష్టమైంది. అంతకుముందు ఉమ్మడి జిల్లాలో 9 అసెంబ్లీ సీట్లను కైవసం చేసుకున్న గులాబీ పార్టీకి 2018లో ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ నుంచి ఎదురుదెబ్బ తగిలింది. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎల్లారెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికైన జాజుల సురేందర్ కారెక్కేశారు. కానీ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఆరు నెలలకు వచ్చిన లోక్సభ ఎన్నికల్లో కవిత ఓటమి చెంది బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ఎంపీగా విజయం సాధించారు. తొలిసారి నిజామాబాద్ లోక్సభ స్థానంలో కమలం వికసించింది. ఇది రాష్ట్రంలోనే సంచలనంగా మారింది. లోక్సభ ఎన్నికల తర్వాత జిల్లా రాజకీయాలు మారుతూ వస్తున్నాయి. అప్పటివరకూ ఏకఛత్రాధిపత్యంగా దూసుకుపోతున్న కారుకు... అడుగడుగునా కమలం అడ్డుపడుతుండటంతో జిల్లాలో మళ్లీ అధికార, ప్రతిపక్షాల మధ్య ఫైట్కు తెరలేచింది. అయితే తర్వాత మళ్లీ నిజామాబాద్ కేంద్రంగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కవిత విజయం సాధించారు. పలు సంక్షేమ పథకాలను ప్రకటిస్తూ... కొన్నింటిని అందిస్తూ... గత పాలక పార్టీలతో పోల్చి చూసినప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వమే బెటర్ అనే చర్చ జనసామాన్యంలో జరుగుతోంది. అయితే పథకాలు అందరికీ అందకపోవడం, గులాబీ పార్టీ కార్యకర్తలకే అందుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. స్థానికంగా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న మంచిప్ప వంటి రిజర్వాయర్స్, దళితబంధు పూర్తిస్థాయిలో అమలు కాకపోవడం... ఇచ్చిన పలు హామీలను నెరవేర్చకపోవడం ప్రజల్లో అసంతృప్తి పెంచుతున్నాయి. కొత్త పింఛన్లు రాకపోవడం.. క్షేత్రస్థాయిలో గులాబీ కార్యకర్తల విపరీత పోకడలు వంటివెన్నో ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకతకు కారణమయ్యాయి. అయితే ఈ వ్యతిరేకతను అదేస్థాయిలో విపక్షాలు తమకు అనుకూలంగా మార్చుకోలేకపోయాయి. కాంగ్రెస్ ఈ విషయంలో పూర్తిగా వెనుకబాట పట్టగా... బీజేపినే అంతో ఇంతో చెరకు రైతుల సమస్యలు, పసుపు రైతుల సమస్యల వంటివాటిని ముందుకు తెస్తూ ప్రజల్లో ప్రచారం తెచ్చుకుంటోంది. ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవి, మంత్రి పదవులు అనుభవించిన ధర్మపురి శ్రీనివాస్ ఆపద కాలంలో హస్తానికి హ్యాండిచ్చి.. కారెక్కడం ఆ పార్టీని కోలుకోలేని దెబ్బ తీసింది. హస్తాన్ని వీడినందుకు రాజ్యసభ సీటు దక్కినా, కొన్నాళ్ళ తర్వాత కారులో కూర్చోలేక బయటికొచ్చారు ధర్మపురి శ్రీనివాస్. ఉమ్మడి రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లా బాస్గా నిలిచిన మండవ వెంకటేశ్వరరావు వంటి సీనియర్ నేతల ఉనికే లేకుండా పోయింది. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి లాంటివాళ్లు రెండు సార్లుగా ప్రేక్షక పాత్రకే పరిమితం కావల్సి వచ్చింది. అయితే ధర్మపురి శ్రీనివాస్ తనయుడు అరవింద్ ఎంపీ కావడంతో... ఇందూర్ లో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపి ఫైట్ ముదిరి రాజకీయం రసవత్తరంగా మారింది. అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు రావచ్చన్న ప్రచారంతో ప్రతిపక్షాలు అప్రమత్తమయ్యాయి. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధం కావాలన్న పార్టీల అధినాయకత్వాల ఆదేశాలతో ఇందూరు జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇదే సమయంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరుపై సర్వేలు చేయిస్తుండటంతో... శాసనసభ్యుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్కు ఎదురుదెబ్బ తప్పదన్నట్టుగా పీకే సర్వే సారాంశమున్నట్టుగా వార్తలు గుప్పుమన్నాయి. జిల్లాలోనూ ఇవే పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిజామాబాద్ అర్బన్, ఆర్మూర్, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బోధన్ తో పాటు.. జుక్కల్ వంటి నియోజకవర్గంలోనూ రాబోయే రోజుల్లో గులాబీలు మళ్లీ వికసిస్తాయా అన్న అనుమానాలైతే ఇప్పటికే బలపడుతున్నాయి. ఉమ్మడి జిల్లాలోని మొత్తం 9 నియోజకవర్గాల్లో ఐదారు నియోజకవర్గాల్లో అధికారపార్టీకి ఎదురుగాలి వీస్తున్నదనే ప్రచారమైతే జరుగుతోంది. జిల్లాలో ఏర్పడిన ఈ ప్రతికూల పరిస్థితులను అధికారపార్టీ ఎలా అధిగమిస్తుంది? కాంగ్రెస్, బీజేపీలు తమకనుకూలంగా ఎలా మల్చుకుంటాయన్న ఆసక్తికర చర్చ జరుగుతోంది. త్రిముఖ పోటీ ఉంటుందనుకుంటున్న క్రమంలో.. ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ రూపంలో బీఎస్పీ, షర్మిల రూపంలో వైఎస్సార్టీపీ, తెలంగాణాలోనూ పోటీ చేస్తామంటున్న ఆప్ వంటి పార్టీలు కూడా బరిలోకి దిగడం వల్ల ఎవ్వరికి లాభం, ఎవ్వరికి నష్టమనే లెక్కలు వేసుకుంటున్నారు. -
పాతబస్తీలో బీజేపీ పాగా వేస్తుందా?.. వ్యూహం ఇదేనా?
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహానగరం మినీ భారతదేశం. రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలతో పాటు.. ఉత్తరాదివారు ఎక్కువగా నివసించే నగరం హైదరాబాద్. పైగా మైనారిటీలు కూడా అధికంగా ఉండే ప్రాంతం. ఇక్కడ ఒక్కో నియోజకవర్గం వైవిధ్యభరితంగా ఉంటుంది. సామాజిక సమీకరణాల్లో కూడా విభిన్నమైన నగరం. అందుకే ఏ పార్టీ అయినా హైదరాబాద్ నగరాన్ని గెలవాలనుకుంటుంది. వచ్చే ఎన్నికల్లో రాజధాని నగరం మీద ఏ పార్టీ పట్టు సాధించే అవకాశం ఉంది. పోటీలో నిలిచేదెవరు? గెలిచేదెవరు? రాజధాని రాజకీయాలపై సాక్షి ప్రత్యేక కథనాలు. చదవండి: ‘రాజాసింగ్ సస్పెన్షన్ పెద్ద డ్రామా.. కేంద్ర పెద్దల హస్తం ఉందా?’ తెలంగాణలో ముందస్తు ఎన్నికల ఊహాగానాలతో రాజకీయాలు ఊపందుకున్నాయి. హైదరాబాద్ జిల్లాలో మొత్తం 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. తెలంగాణ సెంటిమెంట్కు అతీతంగా హైదరాబాద్ ప్రజల తీర్పు ఉంటోంది. పాతబస్తీలోని 7 నియోజకవర్గాల్లో మజ్లిస్ పార్టీ ఆధిపత్యం కొనసాగుతోంది. న్యూ సిటీలోని 8 సెగ్మెంట్లలో ఆధిపత్యం కోసమే అన్ని పార్టీలు పోరాడుతున్నాయి. ఇందుకోసం అప్పుడే కసరత్తు కూడా ప్రారంభించేశాయి. కోటికి పైగా ఉన్న జనాభాతో నగరం కిక్కిరిసి ఉండటంతో పార్టీల ప్రచారం కూడా అంతే స్థాయిలో ఉంటుంది. చాలా సెగ్మెంట్లలో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, మజ్లిస్ పార్టీల మధ్య త్రిముఖ పోరు హోరా హోరీగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. గ్రేటర్ నగరపాలక సంస్థ ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో డివిజన్లు సాధించుకున్న కాషాయ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బలం నిరూపించుకోవాలని తహతహలాడుతోంది. అదేవిధంగా పార్టీల్లో టిక్కెట్ల కోసం పోటీ కూడా ఎక్కువగానే ఉంది. గత ఎన్నికల్లో గోషామహల్ సీటులో బీజేపీ విజయం సాధించింది. మిగిలిన ఏడు సీట్లు టీఆర్ఎస్ గెలుచుకుంది. ప్రస్తుతం పోటీ తీవ్రంగా ఉన్నందున గులాబీ పార్టీ కొందరు సిటింగ్లను మారుస్తుందనే ప్రచారం సాగుతోంది. పాతబస్తీలోని సీట్లను గెలవడం బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్లకు కష్టమే అయినప్పటికీ ఈ పార్టీలు సీరియస్గానే ప్రయత్నిస్తున్నాయి. అదే వ్యూహంతో బీజేపీ ఎమ్మెల్యేలు లేవనెత్తుతున్న సున్నిత అంశాలు కూడా చర్చనీయాంశమవుతున్నాయి. తాజాగా ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు, దానిపై వెల్లువెత్తిన నిరసనలు, పార్టీలోనే అసంతృప్తి.. ఇవన్నీ కూడా ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలు. ఇన్నాళ్లు పాత బస్తీని ప్రయోగ క్షేత్రంగా తీసుకున్న బీజేపీ నేతలు ఇప్పుడు ఎలాగైనా అక్కడ పాగా వేయాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. పాతబస్తీకి బ్రాండ్ అంబాసిడర్ చార్మినార్కు కూతవేటు దూరంలో ఉన్న భాగ్యలక్ష్మి దేవాలయం నుంచే బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఏ కార్యక్రమాన్నయినా చేపడుతున్నారు. హోంమంత్రి అమిత్షా, ఢిల్లీ నుంచి ఏ ప్రముఖులు వచ్చినా ఇక్కడ పూజలు నిర్వహించడం వల్ల బీజేపీ ఓ వర్గం ఓట్లన్నింటిని కేంద్రీకృతం చేసే వ్యూహాంలో ఉన్నట్టు కనిపిస్తోంది. న్యూ సిటీలోని సెగ్మెంట్లలో టీఆర్ఎస్ అసంతృప్త నేతలు, కార్పోరేటర్లను తమవైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్, బీజేపీలు ప్రయత్నిస్తున్నాయి. అయితే ఈ రెండు పార్టీలలో ఇప్పటికే టిక్కెట్ల కోసం తీవ్ర పోటీ నెలకొంది. ప్రతీ నియోజకవర్గంలో కనీసం ఇద్దరు, ముగ్గురు నేతలు పోటీ పడుతున్నారు. అన్ని పార్టీలు తమ బలాలు, బలహీనతలపై అంతర్గత సర్వేలు చేయించుకుంటున్నాయి. సర్వేలో వెల్లడైన సానుకూల అంశాలు, సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకుని టిక్కెట్లు కేటాయించేందుకు సిద్ధం అవుతున్నాయి. దీంతో రాజధాని నగర రాజకీయం వేడెక్కుతుంది. -
అయోమయంలో కాంగ్రెస్.. రేవంత్ స్ట్రాటజీ వర్కవుట్ అవుతుందా?
సాక్షి, హైదరాబాద్: 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు గట్టి పోటీ ఇచ్చేలా కనిపించిన కాంగ్రెస్ తీరా పోలింగ్ ప్రక్రియలో చతికిల పడింది. టీడీపీతో పొత్తు కాంగ్రెస్ పార్టీ పుట్టిముంచిందంటూ... కాంగ్రెస్ పాతకాపులు ఎన్నికల తరువాత పంచనామా చేసి ప్రకటించారు. తాము ఎంత మొత్తుకున్నా వినకుండా ఢిల్లీ పెద్దలు... బలవంతంగా చంద్రబాబును అంటగట్టారని నిట్టూర్చారు. ఉత్తమ్కుమార్రెడ్డి లాంటి సాఫ్ట్ లీడర్ నాయకత్వం పార్టీని అధికారంలోకి తేలేదని కాంగ్రెస్ గ్రహించలేకపోయింది. అందుకే ఉత్తమ్ తరువాత పక్కపార్టీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పెద్దలు పీసీసీ పీఠం అప్పగించారు. ఓటుకు నోటు వంటి తీవ్రమైన కేసులున్నా... రేవంత్ దూకుడు తమకు పనికి వస్తుందని కాంగ్రెస్ పెద్దలు ఆశించారు. అందుకే రేవంత్ తీసుకున్న ప్రతీ నిర్ణయానికి అండగా నిలిచారు. చదవండి: టీఆర్ఎస్లో టెన్షన్.. మునుగోడుపై ‘ఐ ప్యాక్’ కీలక నివేదిక! తొలినాళ్లలో సీనియర్లతో కాస్త ఇబ్బంది పడ్డా... చివరికి రేవంత్రెడ్డి పార్టీని తన కంట్రోల్లోకి తెచ్చుకున్నారు. టీడీపీలో కలిసి పనిచేసిన సీతక్క, వేం నరేందర్రెడ్డి లాంటి ఒకరిద్దరు నేతలతో ప్రారంభించి ఇప్పుడు రేవంత్ తనకంటూ బలమైన వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి వెళ్లిన నాయకులను తిరిగి వెనక్కి తెచ్చెందుకు రేవంత్ తెరవెనక మంత్రాంగం ప్రారంభించారు. ప్రతీ జిల్లాలో తన వర్గానికి టికెట్లు వచ్చేలా ఇప్పటి నుంచే రేవంత్రెడ్డి పావులు కదుపుతున్నారు. తన వ్యతిరేకులకు చెక్ పెట్టే విధంగా ఢిల్లీ పెద్దలు తనతోనే ఉన్నారనే సంకేతాలు వచ్చేలా రేవంత్రెడ్డి వ్యూహాత్మకంగా ముందుకు కదులుతున్నారు. కాంగ్రెస్ నుంచి నాయకులు టీఅర్ఎస్లోకి వెళ్లినా క్యాడర్ మాత్రం బలంగానే ఉంది. కేసీఆర్పై తనదైన స్టయిల్లో విమర్శలు చేసే రేవంత్రెడ్డి.. టీఆర్ఎస్కు కాంగ్రెస్సే ప్రత్యామ్నాయం అనే సంకేతాలిచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. జిల్లాల్లోని నేతలను పార్టీలో చేర్చుకోవడం ద్వారా కాంగ్రెస్ బలపడిందనే సిగ్నల్ ఇవ్వాలన్నది రేవంత్ స్ట్రాటజీ. రాహుల్ గాంధీని రెండురోజుల పాటు తెలంగాణాలో తిప్పడం ద్వారా పార్టీ క్యాడర్ను ఉత్సాహపరిచేందుకు టీ కాంగ్రెస్ ప్రయత్నించింది. ఇక టీఆర్ఎస్తో కాంగ్రెస్ మధ్య సంబంధాలపై ఉన్న అనుమానాలకు రాహుల్ చెక్ పెట్టారు. టీఆర్ఎస్తో పొత్తు అసంభవం అంటూ రాహుల్ ద్వారా గట్టి మెసేజ్ ఇప్పించడంలో రేవంత్ సక్సెస్ అయ్యారు. హుజురాబాద్ ఎన్నికల్లో దారుణంగా పరాజయం పాలైనప్పటికీ... రేవంత్ తన ఇమేజ్ డ్యామేజ్ కాకుండా జాగ్రత్త పడ్డారు. ఎమ్మెల్యే స్థాయి నాయకులను పార్టీలో చేర్చుకోవడం ద్వారా టీఆర్ఎస్కు సవాల్ విసరాలనేది కాంగ్రెస్ స్ట్రాటజీగా కనిపిస్తోంది. చేరికలపై దూకుడుగా ఉన్నా స్థానిక నేతలకు సమాచారం ఇవ్వడంలేదనే ఆరోపణలతో పార్టీలో కాస్త గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. టీఆర్ఎస్లో అసంతృప్తిగా ఉన్న నేతలను టార్గెట్ చేయడం ద్వారా అధికారపక్షం బలహీనపడుతోందనే మెసేజ్ ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. అయితే అనుకున్న స్థాయిలో చేరికలు లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ బలపడలేకపోతుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇక చాలా చేరికలకు సంబంధించి స్థానికంగా ఉన్న సీనియర్లకు అభ్యంతరాలున్నాయి. అనేక చోట్ల కాంగ్రెస్ పార్టీలో చేరికలు పార్టీని బలోపేతం చేయడం కంటే బలహీనపరుస్తున్నాయనే మెసేజ్ వెళుతోంది. అయితే ఇప్పటికే పార్టీకోసం పనిచేస్తున్న నాయకులను కాదని బయటి నుంచి వచ్చేవారికి అవకాశాలివ్వడం ఏంటనే విమర్శలూ వస్తున్నాయి. ఈ విమర్శల నేపథ్యంలో చేరికల విషయంలో కాంగ్రెస్ అయోమయంలో ఉంది. చదవండి: ఆకర్ష ఆకర్ష! బీజేపీ బిగ్ ప్లాన్.. గులాబీ నేతల్లో గుబులు! -
కాషాయ కెరటం.. తెలంగాణలో కమల వ్యూహం ఇదేనా?
హైదరాబాద్ లో ఈ వారం జరిగే జాతీయ కార్యవర్గ సమావేశం బీజేపీలో మాత్రమే కాదు... తెలంగాణా రాజకీయాలపైనా తన ముద్రవేయబోతోంది. జులై 2-3 తేదీల్లో జరిగే ఈ సమావేశానికి భారతీయ జనతాపార్టీ నాయకత్వం మొత్తం భాగ్యనగరానికి తరలిరానుంది. రెండురోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో పార్టీకి సంబంధించి కీలక నిర్ణయాలతో పాటు ముఖ్యమైన నియామాకాలు కూడా చేపట్టనున్నారు. ఇక కోవిడ్ తరువాత జరుగుతున్న తొలి పూర్తిస్థాయి కార్యవర్గ సమావేశాన్ని తెలంగాణలో నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణాలో పార్టీ విస్తరణ కోసం సర్వశక్తులు ఒడ్డుతున్న కమలదళం.. ఈ వేదిక ద్వారా రాష్ట్రంలో పార్టీ విస్తరణకు రాజమార్గం నిర్మించనుంది. చదవండి: బీజేపీ నేతలకు సవాల్ విసిరిన మంత్రి కేటీఆర్ జాతీయ రాజకీయాలపై కీలక నిర్ణయాలు.. ఈ సమావేశాల్లో పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, పార్లమెంటరీ చైర్పర్సన్ హోదాలో ప్రధాని నరేంద్రమోదీతో పాటు ఆర్ఎస్ఎస్ నుంచి బీజేపీలో సభ్యుడిగా ఉన్న పార్టీ ప్రధానకార్యదర్శి బీఎల్ సంతోష్ కీలక నాయకత్వంగా వ్యవహరిస్తారు. వీరితో పాటు పార్టీలో కీలకనేత అయిన హోంమంత్రి అమిత్ షా అదే విధంగా 19 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సమావేశాల్లో పాల్గొంటారు. జాతీయ కార్యవర్గ సమావేశాలకు ఇందులో సభ్యులుగా ఉన్న 80 మంది ఆఫీసు బేరర్లు హాజరవుతారు. పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలి హాజరయ్యే ఈ సమావేశాల్లో కీలకమైన అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో పార్టీ విస్తరణకు సంబంధించి ఒక రోడ్ మ్యాప్ ప్రకటించే అవకాశం ఉంది. త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరిగే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఎలాంటి వ్యూహాన్ని అమలు చేయాలనే అంశంపైనా ఈ సమావేశాల్లో చర్చించనున్నారు. పాతికేళ్లుగా అధికారంలో ఉన్న గుజరాత్ రాష్ట్రంలో అధికారాన్నినిలబెట్టుకునేందుకు బీజేపీ పక్కా వ్యూహంతో ముందుకు వేళ్లనుంది. ఇక ఉపఎన్నికల్లో ఓటమితో పాటు పార్టీలో అంతర్గత కలహాల కారణంగా బలహీనంగా ఉన్న హిమాచల్ ప్రదేశ్ లో గెలుపుకోసం బీజేపీ ఈ సమావేశాల్లోనే స్ట్రాటజీ ఖరారు చేయనుంది. పార్టీ నిర్మాణంపై దృష్టి హైదరాబాద్లో జరిగే జాతీయ కార్యవర్గ సమావేశంలో బీజేపీ నాయకత్వం కొన్ని కీలక నియామకాలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పార్టీలోని వివివిధ విభాగాలకు సంబంధించి కొత్తవారిని నాయకత్వ స్థానంలోకి తీసుకోవడంతో పాటు.. కొన్ని విభాగాలకు సంబంధించి బాధ్యతల మార్పు ఉండే అవకాశం ఉంది. పార్టీ అత్యున్నత నిర్ణాయక వ్యవస్థలైన పార్లమెంటరీ బోర్డుతో పాటు సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో ఖాళీగా ఉన్న స్థానాల్లోకి కొత్త వారిని తీసుకునే అవకాశం ఉంది.. ప్రస్తుత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆధ్వర్యంలో జరిగే చివరి జాతీయ కార్యవర్గ సమావేశం ఇదే. జనవరి 2023తో నడ్డా పదవీ కాలం ముగియనుంది. దీంతో నడ్డా తరువాత జాతీయ అధ్యక్షుడిగా ఎవరుండాలి అనే అంశంపై చర్చ జరిగే అవకాశం ఉంది. పార్టీలోని వివిధ విభాగాలు చేపడుతున్న కార్యక్రమాలపై బాధ్యులు సమావేశంలో అధిష్టానానికి నివేదిక సమర్పిస్తారు. ఇక రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పార్టీ పురోగతిని జాతీయ నాయకత్వానికి నివేదిస్తారు. ఇక గ్రామస్థాయిలో పార్టీ బలోపేతానికి పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు జాతీయ నాయకత్వం ఈ సమావేశాల్లో దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణాపై ప్రత్యేక దృష్టి జాతీయ కార్యవర్గ సమావేశాలను హైదరాబాద్లో నిర్వహించడం ద్వారా తెలంగాణా ప్రత్యేక దృష్టి పెట్టినట్లు బీజేపీ స్పష్టం చేసింది. ఇప్పటికే అధికారపక్షం టీఆర్ఎస్ పై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసిన బీజేపీ కేంద్ర నాయకత్వం.. రాష్ట్రంలో టీఆర్ఎస్ను గద్దెదించడానికి కార్యవర్గ సమావేశం వేదికగా సమరశంఖం పూరించనుంది. జాతీయ నాయకత్వాన్ని పూర్తిగా తెలంగాణాకు తీసుకురావడం ద్వారా... తమ బలం ఏంటో చూపించాలని కాషాయ పార్టీ నిర్ణయించింది. ప్రధాని నరేంద్రమోదీ, అమిత్ షా, కేంద్రమంత్రులతో పాటు పదుల సంఖ్యలో ముఖ్యమంత్రులు హైదరాబాద్కు రానున్నారు. కేవలం హైదరాబాద్లో మాత్రమే కాదు జిల్లాలకు సైతం జాతీయ నాయకులను తీసుకెళ్లాలని బీజేపీ నిర్ణయించింది. ముఖ్యంగా తెలంగాణాలోని ప్రముఖ దేవాలయాలను దర్శించుకోవడంతో పాటు వివిధ జిల్లాల్లో సామాన్యులతో కలిసి బీజేపి దిగ్గజ నేతలు భోజనం చేయనున్నారు. ఇక హైదరాబాద్లోని భాగ్యలక్ష్మి ఆలయానికి ప్రధాని మోదీని తీసుకెళ్లడం ద్వారా తెలంగాణా ప్రజలకు బలమైన సంకేతం ఇవ్వాలని బీజేపీ నిర్ణయించింది. హైదరాబాద్లో జరిగే జాతీయ కార్యవర్గ సమావేశాల ద్వారా పార్టీలో నూతనోత్సాహం తీసుకువచ్చి.. తెలంగాణాలో అధికారంలోకి రావాలనేది బీజేపీ వ్యూహంగా కనిపించతోంది. బీజేపీ నేతల మాటల్లో చెప్పాలంటే... రాబోయే రోజుల్లో తెలంగాణా రాజకీయాలను కాషాయకెరటం ముంచెత్తబోతోంది. -ఇస్మాయిల్, ఇన్పుట్ ఎడిటర్, సాక్షి టీవీ -
Russia-Ukraine war: ఉక్రెయిన్లో జెండా పాతేద్దాం
ఊహించని ఎదురుదెబ్బల నేపథ్యంలో ఉక్రెయిన్లో రష్యా వ్యూహం మార్చింది. ఆక్రమిత ప్రాంతాలన్నింటినీ శాశ్వతంగా అట్టిపెట్టుకునేలా పుతిన్ పథక రచన చేస్తున్నారు. చాపకింద నీరులా ఆ దిశగా ఒక్కో చర్యా తీసుకుంటూ వస్తున్నారు. ఇప్పటిదాకా ఆక్రమించిన 20 శాతం భూ భాగాన్ని రష్యాలో విలీనం చేసుకునేలా చర్యలను వేగవంతం చేశారు. కీవ్: ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి దిగి 100 రోజులు దాటింది. అధ్యక్షుడిని కూలదోసి తమ అనుకూల నేతను గద్దెనెక్కించడంతో రోజుల వ్యవధిలో ముగిసిపోతుందనుకున్న పోరు కాస్తా నెలలు దాటినా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ వ్యూహం మార్చారని, ఉక్రెయిన్ నుంచి వైదొలగరాదని నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. ఇప్పటిదాకా ఆక్రమించిన ప్రాంతాలను శాశ్వతంగా సొంతం చేసుకోనున్నట్టు చెప్తున్నారు. ఆ దిశగా ఇప్పటికే రష్యా పలు చర్యలకు దిగింది కూడా. ఉక్రెయిన్లోని దక్షిణ ఖెర్సన్, హ్రివ్నియా ప్రాంతాల్లో రష్యా కరెన్సీ రూబుల్ అధికార కరెన్సీగా మారింది. అక్కడి పౌరులకు రష్యా పాస్పోర్టులు కూడా ఇస్తున్నారు. ఆయా ప్రాంతాలను అధికారికంగా రష్యాలో భాగంగా ప్రకటించే దిశగా చర్యలు ఊపందుకున్నాయి. దీంతోపాటు తూర్పున డోన్బాస్లోని రష్యా అనుకూల వేర్పాటువాద పాలకులు కూడా పూర్తిగా ఆ దేశంతో కలిసిపోవాలన్న ఆకాంక్షలు వ్యక్తం చేస్తున్నట్టు క్రెమ్లిన్ వర్గాలు చెబుతున్నాయి. అక్కడ 2019 నుంచి ఇప్పటిదాకా రష్యా 7 లక్షలకు పైగా పాస్పోర్టులిచ్చింది! ఇలాంటి చర్యలతో ఉక్రెయిన్ భూ భాగాలను కొంచెం కొంచెంగా రష్యా విలీనం చేసుకుంటూ వెళ్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. సైనిక విజయాలను వృథా పోనివ్వబోమన్న పుతిన్ అధికార ప్రతినిధి పెస్కోవ్ వ్యాఖ్యల అంతరార్థం కూడా ఇదేనంటున్నారు. సైనికులు కావలెను! మరోవైపు, రష్యా ముట్టడిని దీటుగా అడ్డుకుంటూ వస్తున్న ఉక్రెయిన్ తాజాగా పెద్ద సమస్య ఎదుర్కొంటోంది. యుద్ధంలో సైన్యాన్ని భారీగా నష్టపోయిన నేపథ్యంలో దేశాన్ని బలగాల కొరత తీవ్రంగా వేధిస్తున్నట్టు సమాచారం. రోజుకు కనీసం 60 నుంచి 100 మంది దాకా సైనికులను కోల్పోతున్నట్టు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్వయంగా ప్రకటించారు. మరోవైపు రష్యాకు సైనిక నష్టాలు యుద్ధం తొలి రోజులతో పోలిస్తే ఇటీవల బాగా తగ్గాయని జెలెన్స్కీ సలహాదారు మిఖాయిలో పొడోల్స్క్ శనివారం ఒక ఇంటర్వ్యూలో అంగీకరించారు. జెలెన్స్కీ లెక్క ప్రకారం ఉక్రెయిన్ ఇప్పటిదాకా 10 వేల మంది సైనికులను కోల్పోయినట్టే. కానీ వాస్తవ ప్రాణ నష్టం అంతకంటే చాలా ఎక్కువగా ఉందని తాజా సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ముఖ్యంగా తూర్పున డోన్బాస్ ప్రాంతంపై రష్యా సైన్యం ప్రధానంగా దృష్టి సారించినప్పటి నుంచీ అక్కడ ఉక్రెయిన్ సైనికులు పెద్ద సంఖ్యలో మరణిస్తున్నట్టు తెలుస్తోంది. యుద్ధానికి ముందు ఉక్రెయిన్కు 2.5 లక్షల మంది సైనికులున్నారు. యుద్ధం మొదలయ్యాక లక్ష మంది దాకా స్వచ్ఛందంగా ముందుకొచ్చి సైన్యంలో చేరారు. ఈ 100 రోజుల యుద్ధంలో వీరిలో ఎంతమంది మరణించిందీ ఉక్రెయిన్ స్పష్టంగా వెల్లడించలేదు. యుద్ధం సుదీర్ఘ కాలం పాటు కొనసాగేలా కన్పిస్తున్న నేపథ్యంలో ఈ భారీ సైనిక నష్టం ఉక్రెయిన్ను బాగా కలవరపెడుతోంది. దీన్ని తగ్గించుకోవాలంటే అత్యంత శక్తిమంతమైన, అత్యాధునికమైన ఆయుధాలు తక్షణావసరమని ఉక్రెయిన్ సైనికాధికారులు చెబుతున్నారు. పౌరులు పెద్ద సంఖ్యలో సైన్యంలో చేరుతున్నా వారికి శిక్షణ తదితరాలకు చాలా సమయం పడుతుందని గుర్తు చేస్తున్నారు. భారీగా చేరికలు: ఉక్రెయిన్ తమ సైనికులు పెద్ద సంఖ్యలో చనిపోతుండటం వాస్తవమేనని ఉక్రెయిన్ సైన్యాధ్యక్షుడు ముజెంకో అంగీకరించారు. అయితే, ‘‘ఈ మేరకు జెలెన్స్కీ చేసిన ప్రకటన వాస్తవానికి మాకు చాలా మేలు చేస్తుంది. దానివల్ల మాకు పశ్చిమ దేశాల సాయుధ సాయం మరింతగా పెరుగుతుంది. ప్రజలందరికీ నిజం తెలిసింది గనుక దేశ రక్షణ కోసం వారు భారీ సంఖ్యలో ముందుకొస్తారు. అలా జరుగుతోంది కూడా. తద్వారా సైన్యంలో నైతిక స్థైర్యం బాగా పెరుగుతోంది’’ అని చెప్పుకొచ్చారు. ఉక్రేనియన్లకు రష్యా పౌరసత్వం ఉక్రెయిన్లో ఐదో వంతు ఇప్పటికే తమ అధీనంలోకి వచ్చిందని రష్యా తాజాగా ప్రకటించింది. ఇది నిజమేనని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా అంగీకరించారు. డోన్బాస్తో పాటు ఖెర్సన్, జపోరిజియా ప్రాంతాల్లో కూడా జూలై లోపే రిఫరెండం నిర్వహించే యోచన ఉన్నట్టు ఉక్రెయిన్తో చర్చల్లో పాల్గొన్న రష్యా బృందం సభ్యుడు లియోనిడ్ స్లట్స్కీ వెల్లడించారు! మెలిటోపోల్ వంటి నగరాల్లో రష్యా పౌరసత్వం కోసం పౌరుల నుంచి ఇప్పటికే దరఖాస్తులు తీసుకుంటున్నారు కూడా. మారియుపోల్ వంటి రష్యా ఆక్రమిత నగరాల్లో పలువురు పౌరులు ఈ పరిణామాన్ని స్వాగతిస్తుండటం విశేషం! ‘‘రష్యా పౌరునిగా మారాలన్నది నా చిన్నప్పటి కల. ఇప్పుడు ఇంటినుంచి అడుగు కూడా కదల్చకుండానే అది నెరవేరేలా కన్పిస్తోంది’’ అని ఓ మారియుపోల్వాసి ఉత్సాహంగా చెప్పుకొచ్చారు. అయితే ఇలాంటి పరిస్థితి అంతటా లేదు. తమ అధీనంలోకి వచ్చిన ఖెర్సన్, ద్నిప్రోపెట్రోవ్స్క్, మారియుపోల్ తదితర ప్రాంతాల్లో రష్యన్లను స్థానిక అధికారులుగా క్రెమ్లిన్ నియమించగా పలుచోట్ల వారికి స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పుతిన్ ఎవర్ని చూసుకుని కయ్యానికి కాలు దువ్వుతున్నారు? వెనుక ఉన్నదెవరు?
Strategies On The Battlefield: ఉక్రెయిన్పై దండయాత్రతో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఏకాకిగా నిలిచారు పది రోజులైనా నిర్విరామంగా దాడులు చేస్తూ ప్రపంచ ప్రజల దృష్టిలో విలన్గా ముద్ర పడ్డారు. దురహంకారపూరిత నిర్ణయాలతో యుద్ధాన్ని నడిపిస్తూ అందరికీ ఆయనే కనిపిస్తున్నారు. మరి పుతిన్ వెనుక ఉన్నదెవరు ? కథనానికి కాలు దువ్వడంలోనూ, యుద్ధ రంగంలో వ్యూహాలు రచించడంలో పుతిన్ వెంట నడుస్తున్నదెవరు అన్నది ఆసక్తికరంగా మారింది. ఉక్రెయిన్పై దాడిలో పుతిన్కు వీరందరూ అన్నీ తామై వ్యవహరిస్తున్నారు. సెర్గీ షొయిగు రక్షణ మంత్రి, వయసు 66 పశ్చిమ దేశాల మిలటరీ ముప్పు నుంచి రష్యాను కాపాడాలని, నాటోలో చేరాలని ఉబలాటపడుతున్న ఉక్రెయిన్ను నిస్సైనికీకరణ చేయాలన్న రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్కు మొదట్నుంచి వంత పాడుతున్నది ఆ దేశ రక్షణ మంత్రి సెర్గీ షొయిగు. పుతిన్కు మంచి మిత్రుడు. ఒకానొక సందర్భంలో సైబేరియాలో పుతిన్తో కలిసిమెలిసి సరదాగా చేపలు పడుతూ కూడా కెమెరాలకు చిక్కారు. పుతిన్ వారసుడు సెర్గీ అన్న ప్రచారం కూడా ఉంది. ఎలాంటి క్లిష్టమైన ఆపరేషన్లలో అయినా పుతిన్కు తోడుగా ఉంటారు. 2014లో క్రిమియాను స్వాధీనం చేసుకున్న క్రెడిట్ ఆయనకే దక్కింది. ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధం వ్యూహరచనలో కూడా ఆయనదే ప్రధాన పాత్ర. వలేరి జెరసిమోవ్ రష్యా సాయుధ బలగాల చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ వయసు 66 రష్యా సాయుధ బలగాల చీఫ్గా వలేరి జెరసిమోవ్ యుద్ధాన్ని ముందుండి నడిపిస్తున్నారు. 1999లో చెచెన్ యుద్ధ సమయం నుంచి మిలటరీ ప్రణాళికల్లో అందెవేసిన చెయ్యి. పుతిన్కి అత్యంత విధేయుడిగా ఉంటారు. ఉక్రెయిన్ యుద్ధ ప్రణాళిక ఆయన కనుసన్నుల్లోనే సాగుతోంది. గత నెలలో బెలారస్ మిలటరీ డ్రిల్స్ కూడా ఆయన పర్యవేక్షణలోనే సాగాయి. యుద్ధం మొదలయ్యాక ఉక్రెయిన్ నుంచి ఊహించని ప్రతిఘటన ఎదురు కావడంతో, రష్యా సైనికులు నైతిక స్థైర్యాన్ని కోల్పోయారు. దీంతో వలేరి పనితీరుపై పుతిన్ అసంతృప్తితో ఉన్నట్టుగా ప్రచారం సాగుతోంది. నికోలాయ్ పత్రుషెవ్ రష్యా భద్రతా మండలి కార్యదర్శి వయసు 70 పుతిన్కు అంతరంగికుల్లో నికోలాయ్ ఒకరు. 1970ల నుంచి వీరిద్దరి మధ్య గట్టి అనుబంధం ఉంది. పుతిన్ సలహాదారుల్లో దుందుడుకు చర్యలు తీసుకునే వారిగా పేరు పొందారు. సోవియెట్ యూనియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కేజీబీలో పుతిన్తో కలిసి సన్నిహితంగా పని చేశారు. ఇప్పటి రష్యన్ ఫెడరల్ సెక్యూరిటీ సర్వీసెస్ (ఎఫ్ఎస్బీ) చీఫ్గా 1999–2008 వరకు సేవలు అందించారు.ఒకప్పటి లెనిన్గ్రాడ్ (నేటి సెయింట్ పీటర్స్బర్గ్) మిత్రత్రయంలో మొదటి వారు. అంతర్జాతీయ వ్యవహారాలను సునిశిత దృష్టితో చూస్తారు. రష్యాని లొంగదీసుకోవడానికి అమెరికా ప్రయత్నిస్తోందని నమ్ముతూ వస్తున్నారు. ఉక్రెయిన్పై దాడి చేయాలని పుతిన్ నిర్ణయించుకోవడానికి ముందు సమావేశమైన అంతరంగికుల్లో నికోలాయ్ ఒకరు. ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత ఎదురవుతున్నా ఉక్రెయిన్పై దాడికి ఆజ్యం పోయడంలో ఆయన పాత్ర ఎక్కువగా ఉంది. అలెగ్జాండర్ బోర్టనికోవ్ ఫెడరల్ సెక్యూరిటీ సర్వీసెస్ డైరెక్టర్ వయసు 70 సోవియెట్ యూనియన్ విచ్ఛిన్నం కాకముం దు నుంచి పుతిన్ వెంటే అలెగ్జాండర్ ఉన్నారు. నికోలాయ్ పత్రుషెవ్ తర్వాత ఎఫ్ఎస్బీ డైరెక్టర్ పగ్గాలు చేపట్టారు. పుతిన్ మద్దతుతో చట్టాలను అమలు చేయడంలో ఎఫ్ఎస్బీని అత్యంత శక్తిమంతంగా తీర్చిదిద్దారు. నికోలాయ్, అలెగ్జాండర్ల మధ్య గాఢమైన స్నేహం ఉంది. పుతిన్కు రెండు కళ్లుగా ఉన్నారు. భద్రతా సర్వీసుల మాటంటేనే పుతిన్కు ఎప్పుడూ వేదవాక్కు. ఉక్రెయిన్పై యుద్ధానికి దిగాలన్న నిర్ణయం అలెగ్జాండర్దేనని, ఆయన మాట మీదే పుతిన్ ఈ దుస్సాహసానికి దిగారన్న ప్రచారం ఉంది సెర్గీ నారిష్కిన్ ఫారెన్ ఇంటెలిజెన్స్ సర్వీస్ (ఎస్వీఆర్) డైరెక్టర్ వయసు 67 సోవియెట్ యూనియన్ గూఢచర్య విభాగం కేజీబీ నుంచి పుతిన్తో ఉన్న వారిలో నారిష్కిన్ మరో ముఖ్యుడు. ఇప్పటివరకు ఎక్కువ కాలం పుతిన్ వెంట ఉన్న ఘనత ఈయనకే దక్కుతుంది. నికోలాయ్, అలెగ్జాండర్, సెర్గీ నారిష్కిన్లకు లెనిన్గ్రాడ్ ట్రయో అన్న పేరు ఉంది. ఎప్పుడూ పుతిన్కు నీడలా ఉంటారు. పుతిన్ విమర్శకులపై రష్యా వెలుపల విష ప్రయోగం చేయించి ప్రాణాలు తీస్తారన్న ఆరోపణలు కూడా ఆయనపై ఉన్నాయి. అయితే ఉక్రెయిన్తో యుద్ధానికి దిగడానికి ముందు జరిగిన సమావేశంలో పశ్చిమ దేశాలకు లాస్ట్ చాన్స్ ఇవ్వాలని పుతిన్కు సలహా ఇచ్చారు. ఆ తర్వాతే పుతిన్ ఉక్రెయిన్లోని తిరుగుబాటు దారుల అధీనంలో ఉన్న రెండు ప్రాంతాలకు స్వతంత్ర ప్రతిపత్తి కల్పిస్తూ అధ్యక్షుడి హోదాలో ఉత్తర్వులు జారీ చేశారు. సెర్గీ లావరోవ్ విదేశాంగ మంత్రి, వయసు 71 పుతిన్ కేబినెట్లో సీనియర్ నాయకుడు. 2004 నుంచి విదేశాంగ మంత్రిగా ఉంటూ అంతర్జాతీయ వేదికలపై పుతిన్ గళం వినిపిస్తూ ఉంటారు.పుతిన్కు అత్యంత విశ్వసనీయ వ్యక్తుల్లో ఆయన కూడా ఒకరు. ఉక్రెయిన్ సమస్యని దౌత్యపరంగా పరిష్కరించుకోవాలని ఆయన పలుమార్లు చెప్పినప్పటికీ పుతిన్ ఖాతరు చేయలేదని అంటారు. ఉక్రెయిన్పై దాడిలో ప్రత్యక్షంగా ఎలాంటి పాత్ర లేకపోయినప్పటికీ యుద్ధాన్ని సమర్థించుకుంటూ మాట్లాడాల్సిన బాధ్యత లావ్రావ్పైనే ఉంది. అందుకే తన వాదనను బలంగా వినిపిస్తారు. యూఎన్ భద్రతా మండలి సమావేశంలో ఆయన ప్రసంగాన్ని ఇతర దేశాల ప్రతినిధులు బహిష్కరించినప్పటికీ పట్టించుకోకుండా తాను చెప్పదలచుకున్నది చెప్పారు. – నేషనల్ డెస్క్, సాక్షి -
బీజేపీకి షాకిచ్చేలా.. మాస్టర్ స్ట్రోక్.. మైండ్గేమ్!
ఉత్తరప్రదేశ్లో ఏదో జరుగుతోంది. నిన్న మొన్నటి దాకా బీజేపీ మంచి స్థితిలో ఉన్నట్లు కనిపించింది. కానీ ఉన్నట్టుండి ఈ వలసలేమిటి? ఒకరివెంట మరొకరు పోటీలుపడి ఓబీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు బీజేపీని ఎందుకు వీడుతున్నారు. బీసీల ప్రయోజనాలను సమాజ్వాదీ పార్టీ మాత్రమే కాపాడగలదా? బీజేపీ మునిగిపోయే నౌకా? నాయకగణంలో, జనసామాన్యంలో ఇప్పుడీ అభిప్రాయం బలపడుతోంది. బీజేపీలో ‘ఆల్ ఈజ్ నాట్ వెల్’ అనేది బాగా ప్రబలింది. సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ బృందానికి సరిగ్గా ఇదే కావాలి. అంతా వారనుకున్నట్లే జరుగుతోంది. ఆడించినట్లే రక్తి కడుతోంది. వ్యూహరచనలో, క్షేత్రస్థాయిలో తమకు తిరుగులేదని భావిస్తున్న బీజేపీ పెద్దలకు అఖిలేశ్ ఇచ్చిన గట్టి ఝలక్ ఇది. ఎన్నికల నగారా మోగాక.. అసలుసిసలు ‘సినిమా’ చూపిస్తున్న వైనమిది. ఇదంతా ఈనెల 11న ప్రముఖ ఓబీసీ నేత, మంత్రి స్వామి ప్రసాద్ మౌర్యతో మొదలైంది. ఆయన మంత్రి పదవికి రాజీనామా చేసి బీజేపీకి గుడ్బై చెబుతున్నట్లు ప్రకటించారు. మౌర్య మద్దతుదారులైన నలుగురు ఎమ్మెల్యేలు అదే బాట పట్టారు. చిన్న అలజడి మొదలైంది. 12న మరో ఓబీసీ ముఖ్యనేత, మంత్రి దారాసింగ్ చౌహాన్ బీజేపీకి టాటా చెప్పారు. 13న మరో ఓబీసీ నేత ధరమ్సింగ్ సైనీ కాషాయదళాన్ని వీడారు. మూడురోజుల్లో ముగ్గురు మంత్రులు... ఐదుగురు ఎమ్మెల్యేలు బీజేపీని విడిచి వెళ్లిపోయారు. చిన్న పాయ కాస్తా ముందుకెళ్లిన కొద్దీ నదిగా మారుతున్న దృశ్యం గోచరమవుతోంది. బీజేపీ మిత్రపక్షమైన అప్నాదళ్ (సోనేలాల్)కూ సెగ తగిలింది. ఈ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఎస్పీ పంచన చేరుతున్నట్లు ప్రకటించారు. ఎన్నికల వేళ కప్పదాట్లు సహజమే అయినా... నలుగురైదుగురు పోతే ఫర్వాలేదు. అలాకాకుండా కీలక ఓబీసీ నేతలు పక్కా ప్రణాళిక ప్రకారం బీజేపీని టార్గెట్ చేస్తూ... కాషాయదళంలో ఓబీసీలను, దళితులను చిన్నచూపు చూస్తున్నారనే సందేశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ‘బౌన్సర్లు’ వేస్తున్నారు. ఆల్రౌండర్ ఆదిత్యనాథ్ యోగి (రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ ఇటీవల యూపీ సీఎంను క్రికెట్ పరిభాషలో ఆల్రౌండర్గా అభివర్ణించారు), జట్టు కెప్టెన్ జేపీ నడ్డా (బీజేపీ అధ్యక్షుడు), కోచ్... అమిత్ షా (ప్రధాన వ్యూహకర్త)లకూ అఖిలేశ్ టీమ్ షాక్ల మీద షాక్లు ఇస్తూనే ఉంది. పసిగట్టలేకపోయారా? ఫర్వాలేదనుకున్నారా? ఎన్నికల వేళ ఏ పార్టీ అయినా, ప్రభుత్వమైనా అప్రమత్తంగా ఉంటుంది. అసంతృప్తులు, అనుమానం ఉన్నవారి కదలికలపై నిఘా ఉంటుంది. వారేం చేస్తున్నారు... ఎవరిని కలుస్తున్నారనే దానిపై ఓ కన్నేసి ఉంచుతాయి. అలాంటిది కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీయే అధికారంలో ఉండి, ఐబీ, రాష్ట్ర నిఘా విభాగాలు రాబోయే ఈ వలసల ఉద్యమాన్ని ఎందుకు పసిగట్టలేకపోయాయి. ఒకవేళ కొంత సమాచారం ఉన్నా ఆ పోతే ఒకరిద్దరు పోతారు, దాంతో మనకొచ్చే నష్టమేముందని బీజేపీ అగ్రనేతలు తేలిగ్గా తీసుకున్నారా? ఈ స్థాయి ప్రణాళికాబద్ధమైన దాడిని ఊహించలేకపోయారా?. ఇప్పుడు నష్టనివారణకు దిగి ఎస్పీ, కాంగ్రెస్ల నుంచి ఇద్దరిని చేర్చుకున్నా జరిగిన డ్యామేజీని ఇలాంటివి పూడుస్తాయా? కసికొద్దీ ఇంకా కొంతమందిని లాగినా చేతులు కాలాక ఆకులు పట్టుకోవడమే అవుతుందనేది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. చెప్పి... మరీ! ఈనెల 11న మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య రాజీనామా చేయగానే నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్పవార్ మొత్తం 13 మంది ఎమ్మెల్యేలు, ఇంకొందరు నేతలు ఎస్పీలోకి వస్తారని ప్రకటించారు. జనవరి 20వ తేదీదాకా బీజేపీలో రోజుకు ఒకటి రెండు వికెట్లు పడుతూనే ఉంటాయని, 20న నాటికి బీజేపీని వీడిన మంత్రులు, ఎమ్మెలేల సంఖ్య 18కి చేరుతుందని ఎస్పీ మిత్రపక్షమైన సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ అధ్యక్షుడు ఓంప్రకాశ్ రాజ్బర్ బుధవారం ప్రకటించారు. 20 దాకా రాజీనామాల పరంపర కొనసాగుతుందని, రోజుకొక మంత్రి, ఎమ్మెల్యే కాషాయపార్టీకి గుడ్బై చెబుతారని రాజీనామా చేస్తూ మంత్రి ధరమ్సింగ్ గురువారం చెప్పారు. భవిష్యత్తు చేరికలపై ఎస్పీ మాట్లాడకుండా... బయటి వారు మాట్లాడుతుండటం... ఇదంతా ఒక విస్తృత అవగాహనతో జరుగు తోందనేది దానికి అద్దం పడుతోంది. నిజానికి పార్టీ మారేటపుడు ఎవరూ అంత ఆషామాషీగా అడుగు వేయరు. భవిష్యత్తుకు సంబంధించిన స్పష్టమైన భరోసా, తాము కోరిన నియోజకవర్గాల్లో తమ వారికి టికెట్లు ఖరారు చేసుకున్నాకే... బయటపడతారు. రాజీనామా చేస్తారు. అంటే అఖిలేశ్ వీరిందరితో ఎంతోకాలంగా టచ్లో ఉన్నట్లే లెక్క. పైగా ఎవరెవరు వస్తే ప్రయోజనం, ఎవరికి ఎన్ని సీట్లు ఇవ్వగలం... అనేది బాగా కసరత్తు చేశారు ఎస్పీ చీఫ్. అధికార, బీజేపీ వేగులకు ఉప్పందకుండా ఎంతో జాగ్రత్తగా ఈ డీల్ను పూర్తి చేయడం అఖిలేశ్ వయసుతో పాటే రాజకీయ వ్యూహాల్లో ఆరితేరారనే విషయాన్ని చాటిచెబుతోంది. ఇది ఒక ఎత్తైతే... తమ ప్రణాళికను అమలులో పెట్టిన తీరు బీజేపీ చాణక్యులనే నివ్వెరపరుస్తుండొచ్చు. అఖిలేశ్ను కలవడం... ఫొటోలు దిగడం, బయటకు వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు తాము బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం అంతా పక్కా ప్రణాళిక ప్రకారం జరిగిపోతోంది. వీరి రాజీనామా ప్రకటన వెలువడిందో లేదో నిమిషాల్లో అఖిలేశ్ ట్విట్టర్ హ్యాండిల్ వారు ఎస్పీ చీఫ్తో దిగిన ఫొటోలు ప్రత్యక్షమవుతున్నాయి. అంతా కట్టగట్టుకొని ఏ 20 మందో ఒకేసారి బీజేపీని వీడితే... అది ఒక్కరోజుకే టీవీ చానళ్లకు, పత్రికలకు వార్త అవుతుంది. మరుసటి రోజు ఫోకస్ వేరే అంశాలపైకి మళ్లుతుంది. అలాకాకుండా విడతల వారీగా వలసలు చోటుచేసుకుంటే రోజూ మీడియాలో సమాజ్వాదీ కవరేజీయే. పత్రికల్లో, టీవీల్లో రోజూ ఎస్పీలో చేరికలపై వార్తలు ఉంటే... ప్రజల్లోకి ఒకరకమైన సానుకూల సందేశం వెళుతుంది. బీజేపీ అధికార, అంగ, అర్థబలాన్ని ఎదుర్కొనగలమా అని లోలోపల సంశయంలో ఉన్న ఎస్పీ శ్రేణుల్లో నైతిక స్థైర్యం, ఆత్మవిశ్వాసం అమాంతం పెరిగిపోతాయి. వారు ద్విగుణీకృత ఉత్సాహంతో క్షేత్రస్థాయిలో పనిచేస్తారు. ప్రజల్లోనూ ఎస్సీకే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయనే భావన వస్తే... తటస్థ ఓటర్లు కూడా కొంతమేరకు సైకిల్ వైపు మొగ్గే అవకాశాలుంటాయి. అన్నింటికంటే ముఖ్యమైన అంశం... తమకు ఎదురులేదనే భావనలో ఉన్న బీజేపీని ఈ అనూహ్య పరిణామాలు ఆత్మరక్షణలోకి నెట్టేస్తాయి. ఊగిసలాటలో ఉన్న నాయకులు ఎస్సీవైపు చూసేలా ఈ పరిణామాలు ప్రోత్సహిస్తాయి. ఎవరుంటారో... ఎవరు పోతారో తెలియని పరిస్థితుల్లో బీజేపీ సొంత నాయకులనే అనుమాన చూపులు చూసే పరిస్థితి. ఒక్కసారి గనక బీజేపీ అవకాశాలు సన్నగిల్లుతున్నాయనే అభిప్రాయం బలపడితే... మునిగే నౌకలో ఉండటానికి ఎవరూ ఇష్టపడరు. కమలదళానికి సరైన ప్రత్యామ్నాయంగా ఉన్న ఎస్పీలోకి నాయకులు క్యూ కడతారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొనే అఖిలేశ్ విడతల వారీగా బీజేపీని దెబ్బకొట్టే వ్యూహాన్ని ఎంచుకున్నారు. చక్కటి మైండ్గేమ్ ఆడుతున్నారు. పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్న బీజేపీ తదుపరి ఎలాంటి పావులు కదుపుతుందో చూడాలి. – నేషనల్ డెస్క్, సాక్షి -
యమహా కొత్త వ్యూహం.. ది కాల్ ఆఫ్ ది బ్లూ..
దేశంలోకి ఎన్ని కంపెనీలు వచ్చినా టూ వీలర్ సెగ్మెంట్లో యమహాది ప్రత్యేక శైలి. ముఖ్యంగా యమహా నుంచి వచ్చే స్పోర్ట్స్బైక్స్ అంటూ యూత్లో ఫుల్ క్రేజ్. దశాబ్ధాలుగా ఇండియన్ మార్కెట్లో ఉన్నా మార్కెట్పై ఆధిపత్యం సాధించలేకపోయింది యహహా. తాజాగా దీన్ని సరి చేసేందుకు సరికొత్త వ్యూహంతో రంగంలోకి దిగుతోంది. న్యూ స్ట్రాటజీ ఇండియన్ టూ వీలర్ మార్కెట్లో యమహాకు చెందిన ఆర్ఎక్స్, ఎఫ్ జెడ్ సిరీస్ బైకులకు ఫుల్ క్రేజ్ ఉంది. పవర్ఫుల్ బైకులుకు ప్రతీకగా యమహా బ్రాండ్ పేరొందింది. ఇప్పుడా పేరును పూర్తిగా వాడుకుని మార్కెట్లోకి చొచ్చుకుపోయేందుకు ది కాల్ ఆఫ్ ది బ్లూ స్ట్రాటజీని అమలు చేయాలని యమహా నిర్ణయించింది. యూత్ టార్గెట్ ప్రపంచంలోనే అతి పెద్ద టూ వీలర్ మార్కెట్ ఇండియాలో ఉంది. ఇందులో యూత్కి యమహా బైకులంటే ఫుల్ క్రేజ్ ఉంది. మరోవైపు స్పోర్ట్స్ సెగ్మెంట్లో మిగిలిన కంపెనీలు దృష్టి సారించాయి. దీంతో ఉన్న మార్కెట్ను కాపాడుకోవడంతో పాటు మరింత దూకుడుగా వ్యవహరించాలని యమహా నిర్ణయించింది. ఈ మేరకు చిప్సెట్ల సంక్షోభం ముగియగానే యూత్ టార్గెట్గా యాడ్ క్యాంపెయిన్ పెంచడంతో పాటు కొత్త మోడళ్లను తీసుకురానుంది. ఇండియాకి కొత్త చీఫ్ ఇండియన్ మార్కెట్పై దృష్టి పెట్టిన యమహా కొత్త స్ట్రాటజీ అమలు చేయడంతో పాటు కొత్త చీఫ్ను కూడా నియమించింది. ఇప్పటి వరకు యమహా ఇండియా హెడ్గా మోటుఫోమి షితారా ఉండగా తాజాగా ఆయన స్థానాన్ని ఐషిన్ చిహానా భర్తీ చేశారు. యమహా ఇండియా చైర్మన్గా నియమితుడైన చిహానా ఇంతకు ముందు యూరప్, నార్త్ అమెరికా, ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ మార్కెట్లలో పని చేశారు. 1991 నుంచి యమహాలో వివిధ హోదాల్లో పని చేశారు. తాజాగా యమహా ఇండియా చైర్మన్గా నియమితులయ్యారు. చదవండి: సరికొత్త లుక్తో యమహా ఎమ్టీ 10, ఎమ్టీ 10 ఎస్పీ బైక్స్..! -
బిట్కాయిన్ @ 66,901 డాలర్లు
న్యూయార్క్: కొన్నాళ్ల క్రితమే 30,000 డాలర్ల కిందికి పడిపోయిన బిట్కాయిన్ విలువ మళ్లీ దూసుకుపోతోంది. తాజాగా బుధవారం ఆల్ టైమ్ రికార్డు స్థాయి 66,901 డాలర్లకు (దాదాపు రూ. 50,17,575) ఎగసింది. గతంలో ఆల్టైమ్ గరిష్ట స్థాయి 64,889 డాలర్లు. ఈ ఏడాది వేసవిలో బిట్కాయిన్ విలువ 30,000 డాలర్ల దిగువకు పడిపోయింది. ప్రోషేర్స్ బిట్కాయిన్ స్ట్రాటెజీ వంటి బిట్కాయిన్ ఆధారిత ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్లోకి గణనీయంగా పెట్టుబడులు వస్తుండటం కాయిన్ ర్యాలీకి దోహదపడుతోంది. లిస్టింగ్ రోజునే ప్రోషేర్స్ బిట్కాయిన్ ఈటీఎఫ్కి సంబంధించి 2.41 కోట్ల షేర్లు చేతులు మారటం బిట్కాయిన్ డిమాండ్కి నిదర్శనం. ఈ ఈటిఎఫ్లు నేరుగా బిట్కాయిన్లో ఇన్వెస్ట్ చేయకుండా, దానికి సంబంధించిన ఫ్యూచర్స్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఈటీఎఫ్ల వల్ల.. హాట్, కోల్డ్ వాలెట్లు వంటి సాంకేతిక అంశాల బాదరబందీ లేకపోవడంతో సామాన్య ఇన్వెస్టర్లు కూడా బిట్కాయిన్ వైపు మొగ్గు చూపుతున్నారని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. సాధారణ బ్రోకరేజి అకౌంటుతో కూడా బిట్కాయిన్లో ఇన్వెస్ట్ చేయడానికి వీలవుతోందని పేర్కొన్నాయి. -
Huzurabad: ‘సాగర్’ ఫార్మూలాతో ఈటలకు చెక్.. బాస్ ప్లాన్ ఇదేనా?
సాక్షి, కరీంనగర్: హుజురాబాద్ ఉపఎన్నిక రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరనేది సస్పెన్స్ గా మారింది. గులాబీ దళపతి మదిలో ఎవరున్నారు?.. పార్టీ టిక్కెట్ ఎవరికి దక్కనుందనేది ఇప్పుడు హాట్ టాఫిక్ గా మారింది. కెప్టెన్ లక్ష్మీకాంతారావు, ముద్దసాని దామోదర్రెడ్డి కుటుంబ సభ్యులకే టికెట్ దక్కనుందా లేక బీసీలకే అవకాశం రానుందా? అవసరమనుకుంటే జంప్ జిలానీల వైపు కారు పార్టీ మొగ్గుచూపుతుందా? అంటే, ఎవ్వరికీ అంతుచిక్కడం లేదనే సమాధానం వస్తుంది. అయితే డజన్కు పైగా అశావాహులు పోటీలో ఉన్నప్పటికీ.. బీ ఫామ్ దక్కించుకునే అదృష్టవంతులు ఎవరనే చర్చ సాగుతోంది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ గులాబీ గూటికి గుడ్ బై చెప్పి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపిలో చేరడంతో ఉత్పన్నమవుతున్న హుజురాబాద్ ఉప ఎన్నికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మొన్నటి వరకు టీఆర్ఎస్లో ఉండి మంత్రిగా కొనసాగిన ఈటల, రాజీనామా చేసి బీజేపిలో చేరి ఏడో సారి ఎమ్మెల్యేగా అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు బీజేపి అభ్యర్థిగా బరిలో నిలువనున్నారు. ఆత్మ గౌరవం పేరుతో బరిలో నిలుస్తున్న ఈటలను ఢీ కొట్టేందుకు అధికార పార్టీ టీఆర్ఎస్ అభ్యర్థి వెతుకులాటలో పడింది. ఈటలకు ధీటైన అభ్యర్థి కోసం కసరత్తు చేస్తోంది. మారుతున్న రాజకీయ సమీకరణాలను పరిగణలోకి తీసుకుని ఆచితూచి అడుగులు వేస్తోంది. ఈటల బలం, బలహీనతలను బేరీజు వేసుకుంటు రాజకీయంగా దెబ్బతీసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా ఈటలపై పోటీ చేసేందుకు అశావాహులు జాబితా రోజురోజుకు పెరుగుతుంది. డజన్కు పైగా మంది ఇప్పటికే తమ పేరును పరిశీలించాలని కోరుతున్నప్పటికి పలు అంశాలను పరిగణలోకి తీసుకుని పలువురి పేర్లు పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. సామాజిక, రాజకీయ అంశాలతోపాటు స్థానికత, యువతను పరిగణనలోకి తీసుకుని ఈటలకు ధీటైన అభ్యర్థి కోసం ఆరా తీస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా మాజీ ఎమ్మెల్యేలు, రిటైర్డ్ ఐఏఎస్, ఇతర పార్టీల నేతల గురించి ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. టాప్ ఫైవ్లో మాత్రం పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. మాజీ మంత్రి ముద్దసాని దామోదర్ రెడ్డి కుటుంబం నుంచి లేదా కెప్టెన్ లక్ష్మీకాంతరావు కుటుంబం నుంచి అభ్యర్థిని ఎంపిక చేస్తారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. దామోదర్ రెడ్డి సోదరుడు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వేములవాడ టెంపుల్ అథారిటి వైస్ చైర్మెన్ ముద్దసాని పురుషోత్తం రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. దామోదర్రెడ్డి ఇమేజ్, రెడ్డి సామాజిక వర్గం ఓట్లు, నియోజకవర్గంలోని మామిడాలపల్లికి చెందిన స్థానికుడు, టీఆర్ఎస్ బ్రాండ్ కలిస్తే విజయం సాధించవచ్చనే అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. పురుషోత్తమ్ రెడ్డికి పరిపాలన పరమైన అనుభవం ఉన్నా, రాజకీయ పరమైన అనుభవం లేదు. ఇక అదే ఇంటి నుంచి దామోదర్ రెడ్డి తనయుడు కాశ్యప్ రెడ్డి టీఆర్ఎస్లో చేరి పోటీకి సిద్ధమవుతున్నారు. కాశ్యప్ రెడ్డి 2014లో ఈటలపై టీడీపీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ కుటుంబం నుంచి కాకుంటే కేసీఆర్ రాజకీయంగా ఎదుగుదలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన కెప్టెన్ కుటుంబంలో వొడితెల రాజేశ్వర్ రావు మనువడు ప్రణవ్ బాబు పేరును సైతం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ రెండు కుటుంబాలను కాదనుకుంటే బీసీ అయిన ఈటలను మరో బీసీ నేతతో ఢీకొట్టాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణను టీఆర్ఎస్లోకి ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. రమణ కాదంటే ఆ స్థాయిలో ఉన్న బీసీ నేత టీసీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ను సైతం పార్టీలోకి అహ్వానించి అవకాశం ఇవ్వాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. పొన్నం ఇమేజ్, విపక్షాలు చేసే విమర్శలకు దీటైన సమాధానం చెప్పే సత్తా ఉన్న నాయకుడిగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. రెండు కుటుంబాలు సామాజిక అంశం ప్రక్కన పెడితే మాజీ ఎంపీ వినోద్, కాంగ్రెస్లో ఉన్న ప్రవీణ్ రెడ్డి, కౌశిక్ రెడ్డి, బీజేపీలో ఉన్న పెద్దిరెడ్డి పేర్లు సైతం వినిపిస్తున్నాయి. ఈటలకు రాజకీయంగా చెక్ పెట్టేందుకు నాగార్జునసాగర్ ఉపఎన్నికలో అనుసరించిన ఫార్ములాను హుజురాబాద్లో అమలు చేసే పనిలో గులాబీ దళపతి నిమగ్నమైనట్లు తెలుస్తోంది. సాగర్లో రాజకీయ అనుభవం లేని నోముల భగత్ బరిలో నిలిపి, సీఎం స్థాయి అభ్యర్థి కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిని రాజకీయాల నుంచి తప్పుకునే పరిస్థితి తీసుకువచ్చారు. అలాంటి పరిస్థితి రాజేందర్కు రావాలంటే హుజురాబాద్ ఉపఎన్నికలో రాజకీయంగా అనుభవం లేని వారిని బరిలో నిలిపి విజయం సాధించేందుకు కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. చదవండి: Huzurabad: టార్గెట్ ఈటల..పెద్దిరెడ్డి మాటల వెనుక అర్థం ఏమిటో? ‘ఈటలకు తొలిరోజే అవమానం’ -
‘వృథా’కు కట్టడి: మూడంచెల వ్యూహం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్ నియంత్రణకు సంబంధించి ప్రతి అంశంలోనూ అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని అధికారులు నిర్ణయించారు. మూడంచెల వ్యూహంతో ముందుకెళుతున్నారు. మందులు, ఆక్సిజన్, వ్యాక్సిన్ ఇలా అన్ని విషయాల్లోనూ తక్షణమే వృథా (వేస్టేజీ)ను నియంత్రించడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రతి విభాగంలోనూ కొంతమంది అధికారులను పర్యవేక్షణకు నియమించారు. ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లకు వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. వృథాను అరికట్టడం ద్వారా వేలాది మంది పేషెంట్లకు అదనంగా వైద్యసేవలు అందించే అవకాశం ఉంటుంది. ఒక్క ఇంజక్షన్ తేడా వచ్చినా కఠిన చర్యలు వాస్తవానికి కరోనా నియంత్రణకు ఇచ్చే రెమ్డెసివిర్ ఇంజక్షన్లు ఇతర రాష్ట్రాల్లో కంటే ఏపీలో ఎక్కువ ఉన్నాయి. కానీ కొన్ని ప్రైవేటు ఆస్పత్రులకు వచ్చిన ఇంజక్షన్లు దాచేసి బ్లాక్మార్కెట్కు తరలించి కృత్రిమ కొరత సృష్టించారు. దీన్ని మొదట్లోనే గుర్తించిన ఔషధ నియంత్రణ అధికారులు పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రెమ్డెసివిర్లను ఎలా? ఎవరికి ఉపయోగించారు? అన్నదానిపై ఆడిట్ చేస్తున్నారు. ఉదాహరణకు ప్రైవేటులో పదివేల పడకలు ఉంటే అందరికీ రెమ్డెసివిర్ల అవసరం ఉండదు. దీన్నిబట్టి ఎలా చేశారన్నది అంచనా వేయవచ్చు. ప్రైవేటు ఆస్పత్రులకు వచ్చే స్టాకును ఏరోజు కారోజు నివేదిక తెప్పించి పరిశీలిస్తున్నారు. ఒక్క ఇంజక్షన్ తేడావచ్చినా ఆయా ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకుంటారు. అవసరమున్న వారికే ఆక్సిజన్ దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత వేధిస్తోంది. ఏపీలో సరిపడా నిల్వలు ఉన్నప్పటికి కొన్నిసార్లు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొంతమంది వైద్యులు ఆక్సిజన్ శాతం 96గా ఉన్న పేషెంట్లకు కూడా ఆక్సిజన్ ఇస్తున్నారు. దీంతో నిజంగా ఆక్సిజన్ అవసరమైన వారికి ఆలస్యం అవుతోంది. దీంతో ఇలాంటి పరిస్థితులు ఎదురుకాకుండా ఆక్సిజన్ నిర్వహణకు జిల్లాల వారీగా, ఆస్పత్రుల వారీగా ప్రత్యేక సాంకేతిక బృందాన్ని ఏర్పాటు చేశారు. వీరు ఎప్పటికప్పుడు ఆక్సిజన్ నిల్వలను పర్యవేక్షిస్తున్నారు. పక్కా ప్రణాళికతో వ్యాక్సినేషన్ కరోనా వ్యాక్సిన్ వేయడమనేది తొలిసారి. ఇందులో సిబ్బందికి ఎంతగా శిక్షణ ఇచ్చినా కూడా వృథా జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 27 నాటికి 7.93 శాతం వృథా అయినట్టు తేలింది. వ్యాక్సిన్ మొదలుపెట్టిన తొలిరోజుల్లో వేయించుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఒక వయెల్ ఓపెన్ చేస్తే కనీసం 10 మందికి వేయవచ్చు. కానీ ఒక్కరే వస్తే 9 మందికి వేసే డోసు వృథా అవుతుంది. ప్రస్తుతం వ్యాక్సిన్పై అందరికీ అవగాహన పెరిగి, వేయించుకోవడానికి సిద్ధపడుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్ల వృథా ఉండదని అంచనా. మే 1 నుంచి మరింత పక్కా ప్రణాళికతో వృథా పునరావృతం కాకుండా కార్యాచరణ చేపట్టారు. ఆక్సిజన్ అవసరం ఉన్నవారికి ఇవ్వండి వైద్యులకు మళ్లీ విజ్ఞప్తి చేస్తున్నా. ఆక్సిజన్ అవసరం ఉన్నవారికి ఇవ్వండి. ఇది మరొకరి ప్రాణాలను కాపాడుతుంది. ఎక్కడా వృథా కానివ్వద్దు. ఆక్సిజన్ ఇప్పుడు మనకు చాలా విలువైనది. దేశమంతా దీనికోసం ఇబ్బంది పడుతోంది. – అనిల్కుమార్ సింఘాల్, ముఖ్య కార్యదర్శి, వైద్య ఆరోగ్యశాఖ రెమ్డెసివిర్పై నిఘా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులన్నిటిలోనూ రెమ్డెసివిర్ ఇంజక్షన్ల వినియోగంపై పూర్తి నిఘా ఉంచాం. తేడా వస్తే కఠిన చర్యలు తప్పవు. ఎవరికి ఎన్ని ఇంజక్షన్లు వేశారో కచ్చితంగా లెక్కచెప్పాల్సిందే. – రవిశంకర్ నారాయణ్, డైరెక్టర్ జనరల్, ఔషధ నియంత్రణ శాఖ చదవండి: ఏపీ: కోవిడ్ చికిత్సకు మరింత ఇద్దాం.. ఏపీ: 24 గంటల్లోనే కోవిడ్ టెస్టుల ఫలితాలు -
‘వృద్ధి కోసం ఐటీ కంపెనీల వ్యూహాలు’
ముంబై: కరోనా వైరస్ను ఎదుర్కొని వృద్ధి పథంలో దూసుకెళ్లెందుకు ఐటీ కంపెనీలు ప్రణాళికలు రచిస్తున్నాయి. ఈ అంశంపై ఇన్ఫోసిస్ ఉన్నతాధికారి రిచర్డ్ లోబో స్పందిస్తూ.. లాక్డౌన్ సమయంలో ఉద్యోగులకు శిక్షణ ఇచ్చేందుకు కొంత ఇబ్బంది పడ్డామని, కానీ ప్రస్తుతం పూర్తి స్థాయిలో అత్యుత్తమ శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. అయితే కంపెనీకి చెందిన షేర్ హోల్డర్లతో చర్చించి సంస్థకు ఉపయోగపడే మెరుగైన విధానాలను రూపొందిస్తామని పేర్కొన్నారు. బీవైఎల్డీ కన్సెల్టెన్సీ వైస్ ప్రెసిడెంట్ రొనాల్డ్ సోన్స్ స్పందిస్తూ.. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొని, కంపెనీ వృద్ధికి దోహదపడే ఉద్యోగులకే సంస్థలు ప్రాధాన్యత ఇస్తాయని అన్నారు. ప్రస్తుతం కరోనా సంక్షోభం నేపథ్యంలో ఇన్పోసిస్ సంస్థ ఉద్యోగుల శ్రేయస్సు కొరకు ప్రత్యేకమైన టీమ్ను ఏర్పాటు చేసింది. ఉద్యోగుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు లోబో తెలిపారు. (చదవండి: ఉద్యోగాలు, బోనస్ ఇస్తున్నాం: యాక్సెంచర్) -
‘ఇక మీదట స్కూల్స్ 100 రోజులే’
న్యూఢిల్లీ: కరోనా వైరస్ ఉదృతితో అన్ని వ్యవస్థలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. వైరస్ ఎక్కువగా పిల్లలు, వృద్ధులకు వ్యాపిస్తుందన్న నిపుణుల హెచ్చరికలతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. ముఖ్యంగా సరికొత్త ప్రణాళికతో విద్యావ్యవస్థ నిర్వహణకు ప్రభుత్వం వ్యూహాలు రచిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. గతంలో మాదిరిగా స్కూల్స్కు 220 పనిదినాలు 1,320గంటల తరగతి బోధన ఇక మీదట ఉండదని విద్యావేత్తలు భావిస్తున్నారు. గత విద్యావ్యవస్థకు ప్రత్యామ్నాయంగా రాబోయే విద్యా సంవత్సరంలో స్కూళ్లకు 100 రోజుల పనిదినాలు, 600 గంటల తరగతి బోధనకు ప్రభుత్వం ఆమోదం తెలిపే అవకాశం ఉందని ప్రభుత్వం వర్గాలు తెలిపాయి. అలాగే విద్యార్థికి ఇంట్లోనే ఆన్లైన్ బోధనతో 100 రోజులు, 600 అభ్యాస గంటల విద్యా ప్రణాళికను ప్రభుత్వం రచిస్తున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. కాగా మరో 20రోజులు విద్యార్థి మానసిక వికాసాన్ని పెంచే విధంగా డాక్టర్లు, కౌన్సెలర్లతో విద్యార్థులకు ప్రేరణ కలిగించే కార్యక్రములు చేపట్టనున్నట్లు ప్రభుత్వం భావిస్తోంది. ఆన్లైన్ సౌకర్యాలు లేని విద్యార్థులపై స్కూల్ యాజమాన్యాలు దృష్టి పెట్టాలని హెచ్ఆర్డీ మంత్రిత్వ శాఖ సూచించింది. చదవండి: స్కూల్స్ పునఃప్రారంభానికి కసరత్తు -
పాలమూరులో టీఆర్ఎస్ శంఖారావం
సాక్షి ,మహబూబ్నగర్: లోక్సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దూసుకెళ్తున్న గులాబీ అధినేత, సీఎం కేసీఆర్ ఈ నెల 31న ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన జిల్లాకు రావడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా నాగర్కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని వనపర్తి జిల్లా నాగవరంలో సాయంత్రం 4గంటలకు ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. అదే రోజు సాయంత్రం 5:30కు మహబూబ్నగర్ జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ బాలురు జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఈ మేరకు శనివారం రాత్రి పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ప్రతి లోక్సభ నియోజకవర్గం నుంచి లక్ష మందికి మించకుండా జనాన్ని తరలించే యోచనలో పార్టీ నేతలు ఉన్నారు. ఇప్పటికే మహబూబ్నగర్ లోక్సభ ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్న రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్, నాగర్కర్నూల్ ఇన్చార్జీగా వ్యవహరిస్తున్న వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి సీఎం పర్యటనను విజయవంతం చేసేందుకు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీకి చెందిన మహబూబ్నగర్ సిట్టింగ్ ఎంపీ జితేందర్రెడ్డికి బదులు మన్నే శ్రీనివాస్రెడ్డికి టికెట్ ఇవ్వడం.. ఇప్పటి వరకు గెలుచుకోని నాగర్కర్నూల్పైనా గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా ఉన్న టీఆర్ఎస్ ప్రచార వ్యూహాలకు పదునుపెడుతోంది. -
పాలమూరులో కమల..వ్యూహం
సాక్షి, మహబూబ్నగర్: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని మహబూబ్నగర్, నాగర్కర్నూల్ లోక్సభ స్థానాల్లో పాగా వేసేందుకు వ్యూహం రచిస్తోంది. సుదీర్ఘ కసరత్తు తర్వాత లోక్సభ అభ్యర్థులను ఖరారు చేసిన ఆ పార్టీ ఎలాగైనా వారిని గెలిపించుకునే పనిలో పడింది. ఈ క్రమంలో ఈ నెల 29న మహబూబ్నగర్లోని భూత్పూర్ మండలం అమిస్తాపూర్ వద్ద ఉన్న 50ఎకరాల్లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సభకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరుకానున్నారని పార్టీ వర్గాలు ప్రకటించాయి. ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గ పరిధి నుంచి లక్ష మంది చొప్పున రెండు లక్షల మంది జనాన్ని తరలించాలని పార్టీ నాయకులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం నుంచి మూడ్రోజుల పాటు రెండు సెగ్మెంట్లలో తిరిగి జనసమీకరణ చేయనున్నారు. 29న బహిరంగసభ ముగిసిన మరుసటి రోజు నుండే రెండు లోక్సభ స్థానాల్లోనూ ప్రచారం మొదలు ప్రారంభించే యోచనలో పార్టీ నేతలు ఉన్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర, జిల్లా నాయకులు రెండు పార్లమెంట్ పరిధిలో ఉన్న అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో పర్యటనకు షెడ్యూల్ ఖరారు చేసే పనిలో పార్టీ శ్రేణులు ఉన్నారు. పాలమూరులో పాగా వేయాలి.. మహబూబ్నగర్ స్థానం నుంచి 1999లో ఏపీ జితేందర్రెడ్డి బీజేపీ ఎంపీగా గెలుపొందారు. నాగర్కర్నూల్లో మాత్రం బీజేపీ ఇంత వరకు ఖాతా తెరవలేదు. దీంతో కనీసం ఈ సారైనా తెలంగాణలో అత్యధిక సీట్లు గెలుచుకోవాలనే పట్టుదలతో ఉన్న కాషాయ పార్టీ మహబూబ్నగర్, నాగర్కర్నూల్ లోక్సభ స్థానాల్లో టీఆర్ఎస్కు గట్టి పోటీనిచ్చే అభ్యర్థులను బరిలో దింపింది. ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుంచి కమలం గూటికి చేరుకున్న డీకే అరుణకు మహబూబ్నగర్ టికెట్ ఖరారు చేసిన బీజేపీ, కేంద్ర మాజీ మంత్రి బంగారు లక్ష్మణ్ తనయ బంగారు శ్రుతికి నాగర్కర్నూల్ టికెట్ కేటాయించింది. అయితే పాలమూరు నుంచి పోటీ చేస్తోన్న డీకే అరుణ స్థానిక టీఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి మధ్య గట్టి పోటీ ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే వ్యక్తిగత ఇమేజ్ ఉన్న అరుణకు, బీజేపీ బలం కూడా తోడవడంతో ఈసారి మహబూబ్నగర్లో పాగా వేయగలుగుతామనే ధీమా ఆ పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే.. అరుణ పార్టీ చేరికకు ముందు వరకు పాలమూరు బీజేపీ అభ్యర్థిగా భావించిన రాష్ట్ర కోశాధికారి శాంతకుమార్ నాలుగేళ్ల నుంచి మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలో పార్టీని బలోపేతం చేయడంలో దాదాపు సఫలీకృతమయ్యారు. ప్రస్తుతం తనకు టికెట్ రాలేదనే అసంతృప్తి శాంతకుమార్కు లేదు. ఇదే క్రమంలో శాంతకుమార్ తన క్యాడర్తో కలిసి అరుణ గెలుపు కోసం సహకరిస్తానని మీడియా ముందు స్పష్టం చేయడం, బీజేపీ గెలుపుపై పార్టీ శ్రేణుల్లో ఆశలు రేకెత్తాయి. నాగర్కర్నూల్ నుంచి పోటీ చేయనున్న బంగారు శ్రుతికి ఆ ప్రాంతం కొత్త కావడం.. ఆమె తొలిసారిగా పోటీకి దిగుతుండడంతో టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులను ఎదుర్కొవడానికి బీజేపీ ఎలాంటి వ్యూహం రచిస్తుందో అనే చర్చ మొదలైంది. -
వరంగల్లో ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ వ్యూహం
సాక్షి, వరంగల్ క్రైం: పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ వ్యూహంతో ముందుకు సాగాలని వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ విశ్వనాథ రవీందర్ పిలుపునిచ్చారు. శనివారం కమిషనరేట్లో పోలీసు అధికారులతో నెలవారీ నేర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ డాక్టర్ రవీందర్ మాట్లాడారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలీసు అధికారులు పోలీసుస్టేషన్ల పరిధిలో ఎన్ని పోలింగ్ కేంద్రాలు, పోలిం గ్ బూత్లు, పోలింగ్ స్టేషన్లు, రూట్లు తదితర వివరాలను అధికారులను తెలుసుకున్నారు. ఎన్నికలకు అవసరమైన బందోబస్తు ఏర్పాట్ల గురించి అడిగారు. సమస్యాత్మక, అతిసమస్యాత్మక ప్రాంతాల్లో రక్షణ చర్యల ప్రణాళికలను సీపీ అధికారులకు వివరించారు. ఎన్నికల సందర్భంగా ముమ్మరంగా తనిఖీలు నిర్వహించడంతో పాటు పెట్రోలింగ్ కొనసాగించాలని, పోలీసు స్టేషన్ల పరిధిలో ఉన్న లైసెన్స్ తుపాకులను తక్షణమే స్వాధీనం చేసుకోవాలని సూచించారు. పోలీసు అధికారులు అన్ని పార్టీల నాయకులతో ఒకే రీతిగా వ్యవహరించాలని తెలిపారు. ఎన్నికల ప్రచారానికి వచ్చే నాయకులకు భద్రత కల్పించే విషయంలో శ్రద్ధ పెట్టాలని చెప్పారు. ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది ఫాం–12, ఫాం–12ఏను వినియోగించుకొని విధులు నిర్వహించే ప్రదేశంలోనే ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. సైబర్ విభాగం బలోపేతం.. ఈ సందర్భంగా పోలీసు కమిషనర్ స్టేషన్ల వారీగా పోలీసు అధికారుల పనితీరుతోపాటు కేసుల నమోదు, çపరిష్కారం, నిందితుల అరెస్టు తదితర విషయాల వివరాలు తెలుసుకున్నారు. స్టేషన్ అధికారులు సిబ్బంది పనితీరుపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు పోలీసుశాఖకు చెడ్డపేరు తెచ్చేలా వ్యవహరించే సిబ్బందిని గుర్తించాలని సూచించారు. స్థానికంగా ఉన్న సమస్యలను పరిష్కరించడంలో అధికారులు వేగం పెంచాలని ఆదేశించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి వ్యాపారం చేసే అపరిచిత వ్యక్తులను గుర్తించి వారు ప్రస్తుతం నివాసం ఉంటున్న ప్రదేశాలను తనిఖీ చేసి ఆధార్కార్డులను పరిశీలించాలన్నారు. రాబోవు రోజుల్లో సైబర్ క్రైం విభాగా న్ని మరింత బలోపే తం చేస్తామని తెలిపారు. సెల్ఫోన్, బైక్ చోరీల కు సంబంధించిన ఫిర్యాదులను స్వీకరించి నిందితులను గుర్తించేందుకు చొరవ చూపాల ని ఆదేశించార. డీసీపీలు వెంకట్రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, అదనపు డీసీపీ పూజ, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. -
‘అవిశ్వాసం’పై బీజేపీ పక్కా వ్యూహం!
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ తదితర పార్టీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అనుమతించలేదు. సభ సవ్యంగా నడవడం లేదని, గందరగోళ పరిస్థితుల మధ్య అవిశ్వాసాన్ని అనుమతించలేనని అందుకు ఆమె సాకు కూడా చెప్పారు. మళ్లీ ఇప్పుడు వర్షాకాల పార్లమెంట్ సమావేశాల సందర్భంగా మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చిందే తడవుగా లోక్సభ స్పీకర్ అందుకు అనుమతించారు. ఎందుకు? నాటికి నేటికి మారిన పరిస్థితులు ఏమిటీ? నాడైనా, నేడైనా అవిశ్వాస తీర్మానం కారణంగా మోదీ ప్రభుత్వం పడిపోయే అవకాశాలు లేవు. నాడు తెలుగు దేశం పార్టీ అప్పుడే ఎన్డీయే నుంచి బయటకు వచ్చింది. ఇది కొంత పాలకపక్ష బీజేపీకి అసంతృప్తి కలిగించే అంశమే. ప్రతిపక్షాల మధ్య కొంత గందరగోళ పరిస్థితి కూడా నెలకొని ఉంది. ఎందుకంటే అవి తమ తమ రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితుల కారణంగానే కేంద్రంపై అవిశ్వాసానికి ముందుకు వచ్చాయి. కావేరీ నుంచి తమిళనాడుకు ఒక్క చుక్క నీరు కూడా ఇచ్చేది లేదంటూ కర్ణాటక పాలక, ప్రతిపక్ష పార్టీలు ఆందోళన చేస్తున్నాయి. సమీపంలోనే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. అవిశ్వాసాన్ని అనుమతిస్తే పరువు పోగొట్టుకొని కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని బీజేపీ భయపడింది. అలాగే ఆంధ్రప్రదేశ్కు చెందిన పాలక, ప్రతిపక్ష పార్టీలు ప్రత్యేక హోదా గురించి నిలదీస్తే సరైన సమాధానం చెప్పలేక తడబడాల్సి వస్తుందన్న ఆందోళన. అప్పుడు అవిశ్వాసంపై చర్చకు ప్రాంతీయ పార్టీలే ముందున్నాయి. ఇప్పుడు పరిస్థితి మారింది. అవిశ్వాసంపై చర్చకు కాంగ్రెస్ పార్టీయే ముందుంది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పాలకపక్ష బీజేపీకి ప్రత్యామ్నాయంగా తన నాయకత్వాన ప్రత్యామ్నాయ కూటమిని ఏర్పాటు చేయాలన్న సంకల్పం నుంచి వచ్చింది కాంగ్రెస్కు ఈ చొరవ. అందుకని అవిశ్వాసంపై జరిగే చర్చలో కాంగ్రెస్ పార్టీని దీటుగా ఎదుర్కొనగలిగితే ఆ పార్టీ భవిష్యత్తు వ్యూహాన్ని సగం దెబ్బతీసినట్లే అవుతుందన్నది బీజేపీ వ్యూహం. ఈ విషయాన్ని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని పలువురు బీజేపీ నాయకులు ధ్రువీకరించారు. వారికి తమ నాయకుడు నరేంద్ర మోదీ ప్రసంగం లేదా వాగ్వాద నైపుణ్యంపై ఎంతో నమ్మకం ఉంది. కాంగ్రెస్ ముస్లిం పురుషులను మెప్పించే పార్టీ అనే ప్రచారం, తలాక్కు వ్యతిరేకమంటూ ధ్వజమెత్తడం ద్వారా ఆ పార్టీని సులభంగానే ఎదుర్కోవచ్చని బీజేపీ వ్యూహకర్తలు భావిస్తున్నారు. లోక్సభ ఆమోదం పొందిన తలాక్ బిల్లు రాజ్యసభలో కాంగ్రెస్ వైఖరి కారణంగా ఆమోదం పొందని విషయం తెల్సిందే. కశ్మీర్లో టెర్రరిస్టులకు వ్యతిరేకంగా అనుసరిస్తున్న కఠిన వైఖరి కూడా తమకు ఎంతో ఉపయోగ పడుతుందని బీజేపీ భావిస్తోంది. టెర్రరిస్టులను సమూలంగా నిర్మూలించాలన్న లక్ష్యంతోనే ముఫ్తీ మెహబూబా ప్రభుత్వంతో తెగతెంపులు చేసుకున్నామన్న ప్రచారం కూడా తమకు బాగానే ఉపయోగ పడుతుందన్న ఆలోచన. మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్గఢ్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మరోసారి అవిశ్వాసాన్ని తిరస్కరించి అభాసుపాలవడం కంటే ఆమోదించి ఎదుర్కోవడమే ఉత్తమమని అభిప్రాయానికి వచ్చింది. అవిశ్వాసాన్ని నెగ్గడం ద్వారా ప్రతిపక్షాన్ని దూషించి ప్రజల మన్ననలను పొందవచ్చు. తద్వారా ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా ఉన్న పై మూడు రాష్ట్రాల ఎన్నికల్లో పరిస్థితిని మెరుగుపరుచుకోవచ్చు. ముందస్తు ఎన్నికలకు సిద్ధమూ కావచ్చు అన్నది బీజేపీ వ్యూహంలో భాగం. అందుకనే అవిశ్వాసంపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్ కుమార్ మాట్లాడుతూ ‘చర్చ నుంచి పారిపోవాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందంటూ ప్రతిపక్షం చేస్తున్న ప్రచారాన్ని తిప్పి కొట్టాలని చూస్తున్నాం. ప్రతిపక్షాల అబద్ధాలకు అడ్డుకట్ట వేయదల్చుకున్నాం. ఏ ప్రశ్ననైనా ఎదుర్కోవడానికి, దానికి సరైన సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం’ అని అన్నారు. దేశంలో నెలకొన్న అస్తవ్యస్థ ఆర్థిక పరిస్థితి, పెరుగుతున్న నిరుద్యోగం, గోసంరక్షకుల దాడులు, పిల్లల కిడ్నాపర్ల పేరిట అల్లరి మూకల హత్యలు, మహిళలపై అత్యాచారాలు తదితర అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ నిలదీయవచ్చు. అయితే అందులో ఎంత మేరకు విజయం సాధిస్తుందన్నది ప్రశ్న. -
'మా వ్యూహం విజయానికి కారణం ఇండియానే'
వాషింగ్టన్ : భారత్పై అమెరికా మరోసారి ప్రశంసలు కురిపించింది. ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు భారత్ చేస్తున్న కృషి చాలా గొప్పదని పేర్కొంది. తమ దక్షిణాసియా వ్యూహంలో భారత్దే కీలక పాత్ర అని వెల్లడించింది. ఉగ్రవాదంపై పోరాటం విషయంలో భారత్ పాత్ర ఏ మేరకు ఉందని భావిస్తున్నారని పెంటగాన్ చీఫ్ అధికారిక ప్రతినిధి దానా వైట్ను ప్రశ్నించగా ఆమె పై విధంగా స్పందించారు. 'భిన్న విధాలుగా ఉపయోగించుకునేలా భారత్తో మాకు అనుబంధాలు ఉన్నాయి. చాలా హుందాగా దక్షిణాసియా వ్యూహానికి భారత్ సహాయం చేస్తోంది. దీని అభివృద్ధి కోసం గొప్ప నిధిని కేటాయించింది. ఏవియేషన్ మెయింటెన్స్ విషయంలో కూడా భారత్ అద్భుతంగా సాయం చేస్తోంది. ఉగ్రవాదాన్ని ఎలాన్ని నిర్మూలించాలనే విషయంలో భారత్నే ఉదాహరణగా తీసుకోవచ్చు. ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు భాగస్వామ్యులను భారత్ ఏకం చేస్తున్న తీరునే తాము కొనసాగిస్తే లక్ష్యం నెరవేరుతుంది. ఈ రోజు మా దక్షిణాసియా స్ట్రాటజీ విజయవంతంగా అమలవుతుందంటే దానికి కారణం భారతే' అని ఆమె పేర్కొన్నారు. -
అమెరికా ‘అస్పష్ట’ వ్యూహం!
అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి ఏడాది కావస్తుండగా కీలకమైన జాతీయ భద్రతా వ్యూహానికి సంబంధించిన నివేదికను డోనాల్డ్ ట్రంప్ మంగళ వారం విడుదల చేశారు. జాతీయ, అంతర్జాతీయ అంశాల్లో అమెరికా వ్యూహం ఎలా ఉండబోతున్నదో, ప్రభుత్వ ప్రాధమ్యాలేమిటో అమెరికన్ కాంగ్రెస్కు వివరించడంతోపాటు... వివిధ సమస్యలపై, సవాళ్లపై అమెరికా వైఖరేమిటో ప్రపంచ దేశా లకు తెలియజెప్పడం కూడా ఈ నివేదిక ఉద్దేశం. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలోనూ, అధికారానికొచ్చాక ట్రంప్ చెబుతున్నవీ, చేస్తున్నవీ సహజంగానే ఇందులోనూ ఉన్నాయి. ‘అమెరికా ఫస్ట్’తో మొదలుపెట్టి ఉత్తర కొరియా వరకూ ట్రంప్ ఆలో చనల్నే ఈ నివేదిక కూడా ప్రతిబింబించింది. అక్కడక్కడ ఆయనకు భిన్నమైన ప్రతిపాదనలు కూడా చేసింది. కొన్ని అంశాల్లో పాత విధానాలే కొనసాగుతాయన్న సూచనలున్నాయి. తమకు రష్యా, చైనాలే ప్రధాన పోటీదారులని నివేదిక చెబు తోంది. అదే సమయంలో ఉగ్రవాదాన్ని ఓడించడానికీ... ప్రపంచ ఆర్ధిక వ్యవస్థను మెరుగుపరచడానికీ వివిధ దేశాలతో కలిసి పనిచేసేందుకు ప్రాధాన్యతనిస్తామని కూడా తెలిపింది. మన దేశంతోసహా అన్ని దేశాలూ వ్యూహాలను రూపొందించు కుంటాయి. అయితే అమెరికా మాదిరి అవి బాహాటంగా వెల్లడించవు. భారత్ను ఈ నివేదిక ‘ప్రధానమైన ప్రపంచ శక్తి’గా గుర్తించింది. ఇండో– పసిఫిక్ ప్రాంత భద్రతకు సంబంధించి దాని నాయకత్వాన్ని సమర్ధిస్తామని, ఆ దేశంతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగిస్తామని ప్రకటించింది. గతంలో విడుదలైన జాతీయ భద్రతా వ్యూహం నివేదికలతో పోలిస్తే భారత్పై అమెరికా అంచనాలు పెరిగినట్టే చెప్పుకోవాలి. ఎందుకంటే 2002 నాటి నివేదిక మన దేశాన్ని ‘21వ శతాబ్దిలోని శక్తివంతమైన ప్రజాస్వామ్య శక్తి’గా అభివర్ణించింది. 2006 నివేదిక భారత్ను ప్రాంతీయంగా, అంతర్జాతీయంగా ఉన్న వృద్ధి చోదక శక్తుల్లో ఒకటిగా పేర్కొంది. 2010నాటి జాతీయ భద్రతా వ్యూహం నివేదిక మన దేశాన్ని ‘21వ శతాబ్ది ప్రభావిత కేంద్రాల్లో ఒకటి’గా భావించింది. 2015 నివేదిక భారత్ ‘ప్రాంతీయ భద్రత ప్రదాత’ అని అభివర్ణించింది. కాబట్టి తాజా నివేదిక మన దేశానికి ‘పదోన్నతి’నిచ్చినట్టే భావించాలి. మన విదేశాంగ శాఖ ప్రతినిధి కూడా నివేదికను స్వాగతించారు. బాధ్యతాయుతమైన ప్రజాస్వామిక దేశాలుగా భారత్, అమెరికాలు రెండింటికీ ఉమ్మడి లక్ష్యాలున్నాయన్నారు. అయితే మనకు తాజా నివేదిక ఇచ్చిన నాయకత్వ స్థానం ‘ఇండో–పసిఫిక్ ప్రాంతం’ వరకే అని గుర్తుంచుకోవాలి. చాన్నాళ్లుగా వాడుకలో ఉన్న ఆసియా–పసిఫిక్ పదబంధానికి బదులు ఈమధ్య కాలంలో ‘ఇండో–పసిఫిక్’ను ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. ట్రంప్ తెలిసీ తెలియక మాట్లాడే అనేక మాటల్లో ఇదొకటని మొదట్లో చాలామంది అనుకున్నా ఉద్దేశపూర్వకంగానే దాన్ని ఆయన ఉపయోగిస్తున్నారని త్వరలోనే అవగాహన చేసుకున్నారు. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, భారత్ల మధ్య విస్తృత సహకారాన్ని నెలకొల్పి ఈ ప్రాంతంలో విస్తరిస్తున్న చైనా ప్రాబల్యానికి అడ్డుకట్ట వేయడమే దీని లక్ష్యం. చైనాతో మనకు సరిహద్దుతోసహా వివిధ అంశాల్లో భిన్నాభిప్రాయాలున్న సంగతి నిజమే. అయితే ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవ హరిస్తే, చర్చించుకుంటే అలాంటి సమస్యలు పరిష్కారమవుతాయి. దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో చైనాకు మలేసియా, ఇండొనేసియా, ఫిలిప్పీన్స్, వియత్నాం లతో వివాదాలున్నాయి. ఈ వివాదాల్లో అమెరికా సహజంగానే చైనా వ్యతిరేక వైఖరినే తీసుకుంటున్నది. అలాగే తూర్పు చైనా సముద్ర ప్రాంతంలో చైనా– జపాన్ల మధ్య ఏర్పడ్డ వివాదంలో జపాన్ను సమర్ధిస్తున్నది. ఇప్పుడు ఇండో– పసిఫిక్ ప్రాంత వివాదాల్లో భారత్ పాత్ర ఎలాంటి పాత్ర పోషించాలని అమెరికా అనుకుంటున్నదో తెలియదు. అసలు తమ విషయంలోనైనా ట్రంప్కు స్పష్టత వచ్చిందో లేదో అనుమానమే. ఎందుకంటే ఆయన రోజువారీ ట్వీట్లలోనే ఎన్నో వైరుధ్యాలు కనబడుతుంటాయి. ‘ఇండో–పసిఫిక్ ప్రాంతం’లో మనకిస్తున్న ప్రాధాన్యతను నిరాకరించాల్సిన అవసరం లేదనుకున్నా పశ్చిమాసియా విషయంలో మనల్ని ఎందుకు పరి గణనలోకి తీసుకోలేదన్న ప్రశ్న ఉదయిస్తుంది. నిజానికి పశ్చిమాసియాతో, ప్రత్యే కించి ఇరాన్తో మన ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయి. అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంటే అది మన ఆర్ధిక వ్యవస్థపై ప్రభావం కలిగిస్తుంది. అమెరికా ప్రాపకంతో ఇరాన్పై గత కొన్ని దశాబ్దాలుగా అమలైన ఆంక్షలు మనల్ని తీవ్రంగా నష్టపరిచాయి. మన దేశాన్ని బాధ్యతాయుత ప్రజాస్వామిక దేశంగా అమెరికా గుర్తిస్తున్నది కనుక ఇరాన్తో తనకున్న విభేదాల విషయంలోనూ, పశ్చిమాసియా దేశాల మధ్య సామరస్యతను సాధించడంలోనూ మన సాయం అవసరమని ఎందుకనుకోలేదో అనూహ్యం. అఫ్ఘానిస్తాన్లో భారత్ నిర్మాణాత్మక పాత్ర పోషించాల్సి ఉంటుందని లోగడ చెప్పిన అమెరికా ఈ నివేదికలో ఆ ప్రస్తావన తీసుకురాలేదు. అలాగే భారత్–పాక్ల మధ్య ఉన్న ఘర్షణ వాతావరణం అణు యుద్ధానికి దారి తీయొచ్చునని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. ఉగ్రవాదం విషయంలోనూ, అణ్వాయుధాల పరిరక్షణ విషయంలోనూ పాకిస్తాన్ బాధ్యతాయుతంగా మెలగాలన్న హితబోధ మాత్రం ఉంది. ఇక ‘అమెరికా ఫస్ట్’ పేరిట వీసాల జారీ మొదలుకొని ఆయన తీసుకుంటున్న అనేక చర్యలు, ఆంక్షలు మన ప్రయోజనాలను దెబ్బతీస్తున్నాయి. ఒకపక్క ఇలాంటి చర్యలు తీసుకుంటూనే మనను ‘ప్రధానమైన ప్రపంచ శక్తి’గా కీర్తించడం వల్ల ఒరిగేదేమిటి? పర్యావరణానికి తాజా నివేదికలో చోటు దొరకలేదు. వాతావరణ మార్పులు జాతీయ భద్రతకు ముప్పు తెస్తున్నాయని 2015 నాటి నివేదిక చెప్పింది. పైగా అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ భూతాపం వల్ల సముద్ర మట్టాలు పెరిగి ప్రపంచంలోని 128 సైనిక స్థావరాలకు ముప్పు వాటిల్లిందని చెప్పింది. మొత్తానికి అమెరికా జాతీయ భద్రతా నివేదిక అనేక ప్రశ్నలు మిగిల్చింది. కొన్ని విషయాల్లో ట్రంప్తో ఆ దేశ పాలనా వ్యవస్థ ఏకీభవించడం లేదన్న సంకేతాలిచ్చింది. -
బంగారం పండుతుంటే ఉప్పు నేలంటున్నారు..
గ్రానైట్ కోటలో పాగాకు ప్రత్తిపాటి పక్కా స్కెచ్ ► 416 ఎకరాల దళితుల భూములు కొట్టేసేందుకు మంత్రి వ్యూహం ► అందులో ఉన్న రూ.2 వేల కోట్ల విలువైన గ్రానైట్ ఖనిజంపై కన్ను ► వివిధ శాఖల అనుకూల నివేదికలతో పక్కా ప్రణాళిక ► పచ్చటి పొలాలను.. పంటలు పండని భూములుగా చూపిన వైనం ► అనుచరులు, ఉద్యోగుల ద్వారా మైనింగ్కు దరఖాస్తులు ► బాధిత రైతుల ఫిర్యాదుపై జాతీయ మానవ హక్కుల కమిషన్ విచారణ అన్ని విధాలా వెనుకబడిన దళితులను ఆదుకోడానికి 40 ఏళ్ల క్రితం ప్రభుత్వం భూములిస్తే.. ఇన్నాళ్లూ వారు చక్కగా పంటలు పండించుకుని జీవనం సాగించారు. అలాంటి భూముల్లో ఉప్పు శాతం ఎక్కువగా ఉందని ఓ ప్రభుత్వ శాఖ నివేదిక ఇచ్చింది. ఇతర శాఖలూ ఇందుకు వంతపాడాయి. అలాంటి భూములు మీకెందుకంటూ ప్రభుత్వం పట్టాలను రద్దు చేసింది. బంగారం పండే భూములను లాక్కోవడం అన్యాయమంటూ పేద దళిత రైతులు లబోదిబోమంటున్నా సర్కారు వినిపించుకోలేదు. ఎందుకిలా చేస్తున్నారని ఆరా తీస్తే ఆ భూముల్లో రూ.2 వేల కోట్ల విలువైన గ్రానైట్ రాయి ఉండటమే అని తెలిసింది. సాక్షి, ప్రత్యేక ప్రతినిధి/ సాక్షి, అమరావతి : దళితుల కడుపుకొట్టి వేల కోట్లకు పడగలెత్తేందుకు ఓ అమాత్యుడు చక్కటి వ్యూహం సిద్ధం చేసుకున్నాడు. వివిధ శాఖల అధికారులను లోబరుచుకుని తనకు అనుకూలంగా నివేదికలు ఇప్పించుకుని చక్రం తిప్పుతున్నారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం యడవల్లి గ్రామంలోని 250 మంది నిరుపేద దళితులకు సాంఘిక సంక్షేమ దినోత్సవాన్ని పురస్కరించుకుని జనవరి 19, 1975లో అప్పటి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లుకలాపు లక్షణదాసు, నాటి జిల్లా కలెక్టర్ కత్తి చంద్రయ్యలు సర్వే నెంబర్ 381లో 416.50 ఎకరాలను కేటాయించారు. లబ్ధిదారులందరికీ ఏకపట్టాగా ఆ భూమిని అందచేయడంతో వారంతా 1976లో ‘‘యడవల్లి వీకర్స్ సెక్షన్ ల్యాండ్ కాలనైజేషన్ సొసైటి లిమిటెడ్’’ పేరుతో గ్రూపుగా ఏర్పడ్డారు. ఆ భూములకు సాగునీటిని అందించేందుకు మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రూ.3.20 కోట్ల వ్యయంతో శ్రీ అరుణోదయ సోమేపల్లి సాంబయ్య ఎత్తిపోతల పథకం ఏర్పాౖటెంది. అప్పటి నుంచి ఈ పథకం ద్వారా దళిత రైతులు ఏటా పంటలు పండించుకుంటూ జీవిస్తున్నారు. చక్రం తిప్పిన ప్రత్తిపాటి పత్తి వ్యాపారంతో మొదలు పెట్టి కోటాను కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకున్న వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తన నియోజకవర్గ పరిధిలో గ్రానైట్ పరిశ్రమ స్థాపించాలని చాలా ఏళ్ల క్రితమే ప్రణాళిక రచించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక తన ప్రణాళికను కార్యరూపంలో పెట్టడానికి పావులు కదిపారు. తన చేతులకు మట్టి అంటకుండా అధికారికంగానే వ్యవహారాన్ని నడిపించారు. దళితులు సాగుచేస్తున్న భూముల్లో ఏ మేరకు గ్రానైట్ నిక్షేపాలు ఉన్నాయో తెలుసుకునేందుకు పొరుగు రాష్ట్రాల నుంచి జియాలజిస్టులను పిలిపించి సర్వే చేయించారు. దాదాపు రూ.2 వేల కోట్ల విలువ చేసే బ్లాక్ పెరల్ గ్రానైట్ ఉన్నట్టు అంచనాకు వచ్చారు. ఆ భూమిలో ఉప్ప శాతం ఎక్కువగా ఉన్నందున సాగుకు యోగ్యమైనది కాదని వ్యవసాయ శాఖ, ఆ సొసైటీ ఎన్నో ఏళ్ల నుంచి రికార్డులను సక్రమంగా నిర్వహించడం లేదని సహకార శాఖ, ఆ భూముల్లో విలువైన గ్రానైట్ నిక్షేపాలు ఉన్నాయని మైనింగ్ శాఖ, గ్రానైట్ నిక్షిప్తమై ఉన్న భూమిని పారిశ్రామికవేత్తలకు అమ్ముకునేందుకు దళితులు ప్రయత్నాలు చేస్తున్నారంటూ విజిలెన్స్ శాఖలు వేర్వేరుగా నివేదికలు ఇచ్చేలా చేశారు. ఈ నివేదికల ఆధారంగా ప్రభుత్వం దళితుల సొసైటీని రద్దు చేసి, ఆ భూములను ప్రభుత్వ భూములుగా ప్రకటించింది. 2015 ఫిబ్రవరిలో దళితులకు ఇచ్చిన పట్టాలను కూడా రద్దు చేశారు. దరఖాస్తుదారుల్లో కొందరి వివరాలు ► వై.శివయ్య తండ్రి బాలకోటయ్య, డోర్ నెం 1–130.యడవల్లి గ్రామం. ఇతని భార్య రమాదేవి. యడవల్లి గ్రామ సర్పంచ్. టీడీపీ. ► వై.రవీంద్రబాబు, తండ్రి శివయ్య, డోర్ నెం 1–130, యడవల్లి గ్రామం. యడవల్లి గ్రామ సర్పంచ్ రమాదేవి కుమారుడు. ► సీహెచ్ వెంకటరామిరెడ్డి, తండ్రి సుబ్బరామిరెడ్డి, డోర్ నెం 5–285, జాలయ్యకాలనీ, చిలకలూరిపేట. మంత్రి పుల్లారావు కుమార్తె స్వాతి ► పేరున గణపవరం గ్రామంలో ఉన్న స్వాతి ఆయిల్ మిల్స్లో సూపర్వైజరుగా పని చేస్తున్నారు. ► షకీలా సాంబశివరావు, తండ్రి కష్ణమూర్తి, డోర్నెం 2–52–2, గణపవరం గ్రామం, నాదెండ్ల మండలం. మంత్రి పుల్లారావుకు చెందిన పత్తిమిల్లులో (టీఎంసీ యూనిట్)లో క్యాషియర్గా పనిచేస్తున్నారు. ► తాళ్లూరి సుబ్బారావు, తండ్రి రాములు, డోర్నెం 3–404,9వ లైన్, పండరీపురం, చిలకలూరిపేట. మంత్రి పుల్లారావు పత్తి మిల్లులో పత్తి బయ్యర్గా పని చేస్తున్నారు. ► బొమ్మినేని రామారావు, తండ్రి పాపయ్య, గణేశునివారిపాలెం గ్రామం, యడ్లపాడు మండలం. మంత్రి పుల్లారావు పత్తిమిల్లులో పత్తి బయ్యర్గా పని చేస్తున్నారు. ► ఎం.సుధాకర్రెడ్డి, తండ్రి వెంకటరెడ్డి, డోర్ నెం 3–104, మానుకొండవారిపాలెం, చిలకలూరిపేట. మంత్రి పుల్లారావు పత్తిమిల్లులో పత్తి బయ్యర్గా పని చేస్తున్నారు. ► కొమ్మాలపాటి పూర్ణచంద్రరావు, తండ్రి వెంకటేశ్వర్లు, డోర్ నెం.5–46/5–1, మువ్వవారి బజార్, గణపవరం గ్రామం, నాదెండ్ల మండలం. మంత్రి కంపెనీ శివస్వాతి టెక్స్టైల్స్లో టీఎంసీ యూనిట్ ఇన్చార్జిగా పని చేస్తున్నారు. ► మేడూరి సత్యనారాయణ, తండ్రి పిచ్చయ్య, డోర్ నెం. 4–190, కొండ్రువారి వీధి, గణపవరం గ్రామం. నాదెండ్ల మండలం. మంత్రి కంపెనీ శివస్వాతి టెక్స్టైల్స్లో ప్రొడక్షన్ మేనేజర్గా పని చేస్తున్నారు. గ్రానైట్ నిక్షేపాల వివరాలు యడవల్లి గ్రామంలో లభించే గ్రానైట్లో ముఖ్యమైనది బ్లాక్ పెరల్. దీని ధర మీటరు రూ.12 వేల నుంచి రూ.20 వేల వరకు ఉంటుంది. సాధారణంగా ఏ క్వారీలోనైనా 6 మీటర్ల లోతు తవ్విన తర్వాతే మంచి మెటీరియల్ లభిస్తుంది. అయితే ఇక్కడ 4 మీటర్ల లోతు తవ్వితే మంచి మెటీరియల్ దొరుకుతుంది. ఎక్కువ లోతు తవ్వకుండానే నిర్వాహకులకు మంచి లాభాలు వస్తాయి. సొసైటి రద్దుపై జాతీయ ఎస్సీ కమిషన్ విచారణ తమకు జరిగిన నష్టంపై బాధిత దళిత రైతులు జాతీయ మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించారు. మంత్రి పుల్లారావు సహా టీడీపీ నాయకుల అక్రమాలను వివరించారు. విచారణకు హాజరు కావాలని ఆదేశించినప్పటికీ విధుల్లో బిజీగా ఉన్నామంటూ మూడుసార్లు హాజరు కాలేదు. 2016 జూలై 10వ తేదీన బాధితులు మరోసారి అర్జీ ఇచ్చారు. దీనిపై సంబంధిత నివేదికతో హాజరు కావాలని రాష్ట్ర రెవిన్యూ శాఖ కార్యదర్శి, గుంటూరు జిల్లా కలెక్టర్, గ్రామానికి చెందిన ఎస్సీలకు నోటీసులు వచ్చాయి. కష్ణా పుష్కరాలు జరుగుతున్నందున ఆ విధుల్లో బిజీగా ఉన్నామని, తర్వాత వస్తామని కమిషన్ కు ఉన్నతాధికారుల ద్వారా లేఖ పంపారు. అక్టోబర్ 1వ తేదీన కమిషన్ నూఢిల్లీలో నిర్వహించిన విచారణకు జిల్లా కో–ఆపరేటివ్ అధికారి పాండురంగారావు, డివిజన్ సొసైటీ అధికారి పురుషబాబు, నరసరావుపేట ఆర్డీవో జి.రవీందర్, చిలకలూరిపేట తహశీల్దార్ పీసీహెచ్ వెంకయ్యలు హాజరయ్యారు. జనవరి 8వ తేదీన న్యూఢిల్లీలో జరిగిన విచారణకు అధికారులు హాజరు కాకపోవడంతో ఫిబ్రవరి 8 వ తేదీకి విచారణ వాయిదా వేశారు. వాస్తవాలివీ.. పేద దళితులు ప్రభుత్వం నుంచి భూములు పొందినప్పటి నుంచి సొసైటీ సహకారంతో వరి, పత్తి తదితర పంటలు పండించుకున్నారు. బ్యాంకుల నుంచి వ్యవసాయ రుణాలు కూడా పొందారు. ఆయా సంవత్సరాలలో ఏమేరకు పంటలు సాగయ్యాయన్న సమాచారం వ్యవసాయ శాఖ వద్ద ఉంది. భూములు ఉప్పు కయ్యలుగా మారడానికి సమీపంలో సముద్రం లేదు. ఈ భూములు మినహా చుట్టుపక్కల ఉన్న భూముల్లో ఉప్పు సాంద్రత ఎక్కువగా ఉన్నట్లు తేలలేదు. నిజంగా ఉప్పుశాతం ఎక్కువుగా ఉంటే పంటలు ఎలా పండుతాయని రైతులు ప్రశ్నిస్తున్నారు. సొసైటీ రికార్డులు సరిగా లేకపోతే నోటీసు ఇవ్వాలి. ఒక్క నోటీసు కూడా ఇవ్వకుండా సొసైటీని ఎలా రద్దు చేస్తారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ నిరక్ష్యరాస్యతను ఆసరాగా తీసుకుని రికార్డులు సరిగా నమోదు చేయలేదనడం సరికాదని బాధిత రైతులు వాపోతున్నారు. 25.08.2012 : నరసరావుపేట ఆర్డీవో, మైనింగ్ శాఖకు చెందిన అసిస్టెంట్ డైరెక్టర్, మండల సర్వేయరు, వ్యవసాయశాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు యడవల్లి భూముల పరిస్థితిపై ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. 04.09.2015 : ఈ భూముల్లో ఉప్పు సాంద్రత ఎక్కువగా ఉండటం వల్ల సాగుకు యోగ్యమైనవి కావని నరసరావుపేట వ్యవసాయశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నివేదిక ఇచ్చారు. 02.12.2015 : చిలకలూరిపేట హార్టీకల్చర్ అధికారి కూడా ఈ భూములు సాగుకు పనికి రావని నివేదిక ఇచ్చారు. 02.12.2015 : నిబంధనల ప్రకారం యడవల్లి సొసైటీ రికార్డుల నిర్వహణ సక్రమంగా జరగడం లేదని, ఆసొసైటీని రద్దు చేస్తున్నామని జిల్లా సహకార శాఖ నివేదిక ఇచ్చింది. దరఖాస్తుదారుల్లో ఎక్కువ మంది మంత్రి బినామీలే ఒక వైపున సొసైటీని రద్దు చేయించడానికి మంత్రి ప్రయత్నాలు చేస్తూనే మరోవైపున ఆ భూముల్లోని గ్రానైట్ తవ్వకాలకు అనుమతి కోరుతూ తనకు అనుకూలమైన వ్యక్తులతో మైనింగ్ శాఖకు ముందస్తుగానే దరఖాస్తు చేయించారు. ఏడాది కాల వ్యవధిలోనే 39 మంది వ్యక్తులు యడవల్లి భూముల్లోని గ్రానైట్ తవ్వకాలకు అనుమతి ఇవ్వాలని దరఖాస్తు చేయడం గమనార్హం. మైనింగ్ నిబంధనల ప్రకారం తొలి దరఖాస్తుదారుకు తొలి ప్రాధాన్యత ఉంటుంది. ఆ విధంగా మొదటి 20 దరఖాస్తుల్లో మంత్రి అనుచరులు, ఆతని సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులు ఉన్నారనేది సమాచారం. వీరందరికీ త్వరలో గ్రానైట్ తవ్వకాలకు అనుమతి ఇచ్చేందుకు మైనింగ్ శాఖ సన్నాహాలు చేస్తోంది. ఈ విషయం తెలిసి.. బాధిత దళిత రైతులందరూ మంత్రి పుల్లారావును కలిశారు. తాము ఎప్పటి నుంచో ఆ భూములను సాగు చేసుకుంటున్నామని, ఉన్నఫళంగా తమకు భూములు లేకుండా చేస్తే ఎలా బతకాలని గోడు వెల్లబోసుకున్నా మంత్రి స్పందించలేదు. -
వ్యూహా రచనలో దిట్ట
ఏఓబీ ఎన్కౌంటర్లో కన్నుమూసిన గాజర్ల రవి మిలటరీ వ్యూహాల్లో పేరుపొందిన మావోయిస్టు అగ్రనేత పోలీసు స్టేషన్లపై వరుస దాడులు లెంక లగడ్డలో బీఎస్ఎఫ్ జవాన్లపై బాంబుదాడి ఏటూరునాగారం, కరకగూడెం పోలీస్స్టేషన్ల పేల్చివేతలో కీలకం మావోయిస్టుల ప్రతినిధిగా శాంతి చర్చలకు... అన్నదమ్ముల్లో ముగ్గురు మావోయిస్టు నేతలే ఇప్పటికే ఎన్కౌంటర్లో మృతిచెందిన ఆజాద్ కొద్దినెలల కింద లొంగిపోయిన గాజర్ల అశోక్ చిట్యాల, ఇల్లెందు, పెద్దపల్లి, హైదరాబాద్: ఏఓబీ ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టు అగ్రనేత గాజర్ల రవి అలియాస్ గణేశ్ అలియాస్ ఉదయ్ (46) మెరుపు దాడులకు, మిలటరీ వ్యూహరచనలో దిట్టగా పేరు పొందారు. చిన్న వయసులోనే పోరుబాట పట్టిన ఆయనది 26 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం. అసలు వారి కుటుంబమంతా మావోయిస్టు ఉద్యమంతో ముడిపడి ఉంది. రవి 1990లో ఉద్యమ బాట పట్టి ఎన్కౌంటర్లో మరణించేదాకా ప్రజాపోరులో కొనసాగారు. దళంలో చేరిన ఎనిమిది నెలలకే దళ కమాండర్గా ఎదిగిన నేపథ్యం ఆయనది. 2004లో ఉమ్మడి ఏపీ రాష్ట్ర ప్రభుత్వంతో జరిగిన శాంతి చర్చల్లో మావోయిస్టుల తరఫున ప్రతినిధిగా కూడా పాల్గొన్నారు. 1992లో ఉద్యమంలోకి రవి అలియాస్ గణేశ్ భూపాలపల్లి జిల్లా (పాత వరంగల్ జిల్లా) చిట్యాల మండలం వెలిశాలలో జన్మించారు. అక్కడి ప్రభుత్వ పాఠశాలలోనే పదో తరగతి వరకు చదువుకున్నారు. 1986 నుంచి 1988 వరకు పెద్దపల్లి ఐటీఐలో ఫిట్టర్ కోర్సు చేశారు. ఇంటర్మీడియట్ హన్మకొండలో పూర్తిచేశారు. 1990 నుంచి ఉద్యమానికి ఆకర్షితుడై 1992 వరకు విద్యార్థి సంఘం నాయకుడిగా పనిచేశారు. అప్పటికే ఆయన అన్న ఆజాద్ పీపుల్స్వార్ ఉద్యమంలో క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారు. దాంతో పోలీసులు గణేశ్ను చిత్రహింసలు పెట్టడంతో వెలిశాలకు వచ్చి టేకుమట్లలో పోలీస్ కానిస్టేబుల్ను కిడ్నాప్ చేశారు. తర్వాత అన్న ఆజాద్ స్ఫూర్తితో 1992లో పీపుల్స్వార్లో చేరారు. ఉత్తర తెలంగాణలో పీపుల్స్వార్ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచారు. నక్సలైట్ గ్రూపులన్నీ కలసి మావోయిస్టు పార్టీగా ఏర్పాటయ్యాక కీలక నేతగా మారారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా, ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ప్రత్యేక జోన్ కారదర్శివర్గ సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. మల్కన్గిరి సరిహద్దు ఇన్చార్జిగా వ్యవహరించారు. మెరుపు దాడుల్లో మావోయిస్టు ఉద్యమంలో రవి ఎంతో కీలకమైన పాత్ర పోషించారు. విధ్వంసాలు, దాడులు, మిలటరీ ఆపరేషన్లలో దిట్టగా ఆయనకు పేరుంది. పీపుల్స్వార్లో ప్లాటూన్లను ఏర్పాటు చేసిన కాలంలో ఆజాద్ ఆ వ్యవహారాలు చూసేవాడని చెబుతారు. 1994 సార్వత్రిక ఎన్నికల సమయంలో మంథని డివిజన్ లెంకలగడ్డలో బీఎస్ఎఫ్ జవాన్లపై దాడిచేసి ఆరుగురిని చంపిన ఘటనలో గణేశ్ పాత్ర కీలకమైనదని అంటారు. గణేశ్ వ్యూహంతోనే 1999-2000 మధ్య ఏటూరునాగారం పోలీస్స్టేషన్పై దాడి జరిగింది. కరకగూడెం, కొత్తగూడ, ఏటూరునాగారం పోలీస్స్టేషన్లపై దాడుల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ఉత్తర తెలంగాణ ఏరియా కమిటీ సభ్యుడిగా ఉన్న సమయంలో మహదేవపూర్ పోలీస్స్టేషన్పై బస్సు బాంబు దాడి చేశారు. మావోయిస్టు పార్టీ ఖమ్మం జిల్లా కార్యదర్శిగా, కేకేడబ్ల్యూ (కరీంనగర్, ఖమ్మం, వరంగల్) కార్యదర్శిగా కూడా పనిచేశారు. కారేపల్లి, బోడు పోలీస్స్టేషన్ల మీద జరిగిన దాడులతోపాటు ఇల్లెందు, పాకాల, మణుగూరు, పాల్వంచ, ఏటూరునాగారం, ములుగు ఏరియాల్లో జరిగిన అనేక సంఘటనలకు ఆయన నాయకత్వం వహించారు. గుండాల మండలం చెట్టుపల్లి సమీపంలో ప్రజాపథం వాహ నం పేల్చి వేసిన సంఘటన గణేశ్ నేతృత్వంలోనే జరిగిందని చెబుతారు. చెట్టుపల్లి గుట్టల్లో జరిగిన కా ల్పులు, కాచనపల్లి సమీపంలో జరిగిన కాల్పుల ఘటన, గుండాల-లింగాల మధ్య ఎదురుకాల్పుల ఘటనల్లో పాల్గొన్నారు. ప్రభుత్వంతో చర్చల అనంతరం నిర్బంధం తీవ్రం కావడంతో కేకేడబ్ల్యూ కార్యదర్శి బాధ్యతల నుంచి తప్పుకొని ఛత్తీస్గఢ్కు వెళ్లా రు. వందకుపైగా ఎన్కౌంటర్ల నుంచి చాకచక్యంగా తప్పించుకుని, కేడర్ను కూడా రక్షించాడని రవితో పనిచేసిన మాజీ మావోయిస్టులు చెబుతుంటారు. శాంతి చర్చల ప్రతినిధిగా.. 2004-05లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో శాంతి చర్చల్లో మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు రామకృష్ణ (ఆర్కే)తో కలసి గణేశ్ ముఖ్య భూమిక పొషించారు. ఏవోబీ కమిటీ నుంచి ఆయన ప్రాతినిధ్యం వహించారు. ప్రభుత్వంతో చర్చల సమయంలో గణేశ్ ఇల్లెందు, పాల్వంచ, మణుగూరు, పాకాల కొత్తగూడెం, ఏటూరునాగారం ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి మావోయిస్టు ఉద్యమ విస్తరణకు కృషి చేశారు. మణుగూరులో జరిగిన బహిరంగసభలో జనశక్తి నేత అమర్తో కలిసి పాల్గొన్నారు. అయితే ఆ చర్చలు విఫలం కావడంతో తిరిగి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల సెక్రెటరీగా మావోయిస్టు పార్టీని విస్తరింప జేయడంలో కీలక పాత్ర పోషించారు. ఇదే శాంతి చర్చలకు జనశక్తి ప్రతినిధిగా హాజరైన రియాజ్ బదనకల్లు ఎన్కౌంటర్లో చనిపోయారు. శాంతి చర్చలకు బ్రేక్ పడిన పదేళ్ల తర్వాత గణేశ్ ఏవోబీ ఎన్కౌంటర్లో హతమయ్యారు. మృతుల్లో కంకణాలపై ప్రచారం ఎన్కౌంటర్ మృతుల్లో కాల్వశ్రీరాంపూర్ మండలం కి ష్టంపేట గ్రామానికి చెందిన కంకణాల రాజిరెడ్డి కూడా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. కరీంనగర్ జిల్లా నుంచి ఖమ్మం వెళ్లిన ఆయన ఛత్తీస్గఢ్ మావోయిస్టు పార్టీలో ఉన్నారని కొందరు భావిస్తుండగా.. ఇటీవలి కాలంలో ఏవోబీకి వెళ్లారని కూడా అంటున్నారు. తాజా ఎన్కౌంటర్లో రాజిరెడ్డి కూడా మృతిచెందినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ కుటుంబమంతా పోరుబాటే... గాజర్ల కుటుంబంలో ముగ్గురు అన్నదమ్ములు మావోయిస్టు నేతలే సాక్షి, వరంగల్/భూపాలపల్లి: వెలిశాల.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా (పాత వరంగల్ జిల్లా) టేకుమట్ల మండలంలోని ఓ ఊరు.. ప్రజా పోరాటాలకు వేదికగా నిలిచింది. ఒకప్పటి పీపుల్స్వార్, ప్రస్తుత మావోయిస్టు ఉద్యమానికి కీలకమైన నాయకులను అందించింది. భూస్వామ్య, పెత్తందారీ వ్యవస్థను ఎదుర్కొనేందుకు ఈ గ్రామానికి చెందిన గాజర్ల కుటుంబం నుంచి ముగ్గురు అన్నదమ్ములు సాయుధ ఉద్యమ బాట పట్టారు. మావోయిస్టు అగ్రనేతలు సారయ్య అలియాస్ ఆజాద్, అశోక్ అలియాస్ ఐతు, రవి అలియాస్ గణేశ్లు ఉద్యమంలో తమదైన ముద్ర వేశారు. పెత్తందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా.. వెలిశాల గ్రామానికి చెందిన గాజర్ల కనకమ్మ-మల్లయ్య దంపతులకు రాజయ్య, సమ్మయ్య, సారయ్య, రవి, అశోక్లు సంతానం. ఎనిమిది ఎకరాల వ్యవసాయ భూమి, గీత వృత్తి వారి జీవనాధారం. ఈ ఐదుగురు అన్నదమ్ముల్లో సారయ్య, రవి, అశోక్లు వారి జీవితాన్ని ఉద్యమానికే ధారపోశారు. 1987లో వెలిశాలలో సింగిల్ విండో ఎన్నికలు జరిగాయి. డెరైక్టర్ పదవి కోసం పోటీ చేసిన ఆజాద్.. ప్రత్యర్థి నల్ల కృష్ణారెడ్డి జిత్తుల కారణంగా ఓడిపోయారు. పెత్తందార్ల అప్రజాస్వామిక వైఖరితో ఎన్నికల ఫలితాలు మారిపోయాయని గ్రహించి.. 1989లో పీపుల్స్వార్ బాటపట్టారు. అన్న మార్గంలో నడిచిన గణేశ్ 1992లో అజ్ఞాతంలోకి వెళ్లారు. తర్వాత 1994లో అశోక్ కూడా ఉద్యమంలో చేరారు. గాజర్ల సోదరులు అజ్ఞాతంలోకి వెళ్లక ముందే వారి తల్లిదండ్రులు కన్నుమూశారు. పెద్ద సోదరుడు రాజయ్య అనారోగ్యంతో మృతి చెందగా.. సమ్మయ్య సింగరేణిలో ఉద్యోగం చేసి రిటైరయ్యారు. ఆజాద్ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా, మిలటరీ ప్లాటూన్ కమాండర్గా పనిచేశారు. 2008 ఏప్రిల్ 2న ఏటూరునాగారం మండలం కంతనపల్లి అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో ఆయన, ఆయన భార్య రమ మృతిచెందారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆ ఎన్కౌంటర్పై ఇప్పటికీ న్యాయ విచారణ కొనసాగుతుండడం గమనార్హం. వీరికి వరుసకు సోదరుడయ్యే గాజర్ల నవీన్ కూడా మావోయిస్టు పార్టీలో పనిచేసి నేర్లవాగు ఎన్కౌంటర్లో చనిపోయారు. ఇక దండకారణ్య ప్రత్యేక జోన్ కమిటీ సభ్యుడిగా పనిచేసిన అశోక్.. అనారోగ్యంతో బాధపడుతూ కొద్దినెలల కింద లొంగిపోయారు. గణేశ్ సోమవారం నాటి ఏవోబీ ఎన్కౌంటర్లో కన్నుమూశారు. -
పాక్ ఉగ్రవాదుల వ్యూహం ఎందుకు మారింది?
న్యూఢిల్లీ: మన్మోహన్ సింగ్ ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు 2008లో ముంబైపై ఉగ్రవాదులు జరిపిన దాడి సందర్భంగా భారత్, పాక్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హయంలో పాక్ భూభాగంలో జరిపిన సర్జికల్ దాడుల సందర్భంగా మళ్లీ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. నాటి సంఘటనకు, నేటి సంఘటనకు ఎంతో వ్యత్యాసం ఉంది. ఉగ్రవాదుల వ్యూహం కూడా మారింది. ముంబై దాడుల వరకు పౌరులను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు దాడులు జరపగా, ఆ తర్వాత నుంచి భారత సైనిక దళాలనే లక్ష్యంగా చేసుకొని దాడులు జరుపుతున్నారు. ఉడీ సైనిక శిబిరంపై ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో 19 మంది సైనికులు మరణించిన విషయం తెల్సిందే. ఈ సంఘటనకు మూడు నెలల ముందు పాంపోర్ సమీపంలోని సీఆర్పీఎఫ్ శిబిరంపై జరిగిన దాడిలో 8 మంది సైనికులు మరణించారు. గతేడాది డిసెంబర్లో సైనిక 31వ రిజిమెంట్ ఆర్డినెన్స్ క్యాంప్పై ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఓ లెఫ్ట్నెంట్ కల్నల్ సహా 8 మంది సైనికులు, ముగ్గురు పోలీసులు మరణించారు. ఉగ్రవాదులు ఎందుకు తమ వ్యూహాన్ని మార్చుకున్నారు? 2008లో జరిగిన ముంబై దాడులతో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్పై అంతర్జాతీయంగా తీవ్ర ఒత్తిడి వచ్చింది. పాక్ ప్రభుత్వం ఒత్తిడి మేరకే ఉగ్రవాదులు తమ వ్యూహాన్ని మార్చుకొని ఉంటారని రక్షణ శాఖ నిపుణులు మనోజ్ జోషి తెలిపారు. సైనిక, పోలీసు బలగాలను లక్ష్యంగా చేసుకొని దాడులు జరిపితే అది అంతర్జాతీయ సమాజం ముందు ఉగ్రవాదులు దాడుల కిందకు రాదని, కశ్మీర్ స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న మిలిటెంట్ల దాడుల కిందకు వస్తుందని పాకిస్థాన్ భావించి ఉంటుందని ఆయన అన్నారు. నాటి నుంచి నేటి వరకు పౌరులపై దాడులు 93 శాతం తగ్గి, అదే స్థాయిలో సాయుధ బలగాలపై ఉగ్రవాదుల దాడులు పెరిగాయి. -
టీసీఎస్ బాటలో ఇన్ఫోసిస్
బెంగళూరు: ఇటీవల నిరాశాజనక ఫలితాలతో డీలా పడ్డ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సంస్థను మళ్లీ లాభాల బాటలో తీసుకెళ్లేందుకు సీఈవో విశాల్ సిక్కా పక్కా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగానే తన ప్రధాన పత్యర్థి, మరో ఐటీ దిగ్గజం టీసీఎస్ బాటలో నడుస్తున్నారు. టీసీఎస్ ఏడు సంవత్సరాల క్రితం అమల్లోకి తెచ్చిన ప్రక్రియను ఇన్ఫోసిస్ అవలంబించబోతోంది. తన వ్యాపారాన్ని చిన్న యూనిట్లుగా విస్తరించనున్నామనే ఎత్తుగడను ప్రకటించింది ప్రాఫిట్ అండ్ లాస్ (పీఎన్ఎల్) బాధ్యతలను విడదీస్తున్నట్టు తెలిపింది. పూనే సమావేశంలో విశ్లేషకుల ప్రశ్నలకు సమాధానం చెప్పిన విశాల్ సిక్కా ఈ మేరకు వివరణ ఇచ్చారు. వ్యాపార విభజనలో భాగంగా స్వయంప్రతిపత్తిగల యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఇది తమకు వ్యాప్తిని ఇస్తుందనీ, ఆయా వ్యక్తుల జవాబుదారీతనం ఇస్తుందని చెప్పారు. చిన్నచిన్న యూనిట్లుగా విభజించామని చెప్పినప్పటికీ సంఖ్యను పేర్కొనలేదు. అలాగే తరువాతితరం నాయకత్వం వివరాలను వెల్లడించడానికి నిరాకరించింది. ఎన్ చంద్రశేఖరన్ టీసీఎస్ సీఈవో ఉన్నప్పుడు దాదాపు ఏడు సంవత్సరాల క్రితం 2009లో ఇలాంటి చర్యలకు శ్రీకారం చుట్టింది. దాదాపు 23 మంది మినీ సీఈవో లకు బాధ్యలను అప్పగించి, వ్యాపార వృద్ధిలో టార్గెట్స్ ఇ చ్చింది. అయితే ప్రస్తుతమున్న వ్యాపారంలో అంతరాయం రాకుండా చిన్న చిన్న యూనిట్లను అనుమతినివ్వడమనే నూతన ప్రక్రియ ఇన్ఫోసిస్ వ్యాపార వృద్ధికి తోడ్పడే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. కాగా సంస్థలో ఎవరినీ ఉద్యోగాల నుంచి తొలగించడం లేదనీ, ఇన్ఫోసిస్ లో అట్రిషన్ ను తగ్గించేందుకు తామెన్నో చర్యలు తీసుకున్నామని, ప్రతిభావంతులైన ఉద్యోగులను గుర్తించి వారికి మరిన్ని ప్రోత్సాహకాలు అందిస్తున్నామని కూడా విశాల్ సిక్కా స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. -
ఇందుకే ఐఎస్ వ్యూహం మారింది..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో మారణహోమం తలపెట్టాలని భావించిన ఐసీస్ అనుబంధ సంస్థకు చెందిన ఉగ్రమూకల వ్యూహం మారిందా? ముస్లింల పవిత్రమాసం రంజాన్ పండుగ తర్వాత విధ్వంసం సృష్టించాలనుకున్నారా? ఆ తర్వాత ఐసిస్ ఆదేశాల మేరకు నిర్ణయం మార్చుకున్నారా? అవుననే అంటున్నాయి జాతీయ దర్యాప్తు బృందం (ఎన్ఐఏ) వర్గాలు. ముందు నిర్ణయించినట్లుగా కాకుండా రంజాన్కు వారం రోజుల ముందుగానే పేలుళ్లు జరపాలని నిర్ణయించినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో వెలుగు చూసింది. హైదరాబాద్లో పేలుళ్లకు కుట్రపన్నిన ఉగ్రమూకలను న్యాయస్థానం ఆదేశాల మేరకు కస్టడీలోకి తీసుకున్న ఎన్ఐఏ అధికారులు శనివారం ఎనిమిది గంటల పాటు ప్రశ్నించారు. కస్టడీలోకి తీసుకున్న ఐదుగురిని బృందాలుగా, విడివిడిగా కూర్చొబెట్టి కుట్రకోణంపై ఆరా తీశారు. వీరిలో కీలకమైన వ్యక్తులుగా భావిస్తున్న మహ్మద్ ఇబ్రహీం యాజ్దానీ, హబీబ్ మహ్మద్ అలియాస్ యూసఫ్ గుల్షన్లను ఎక్కువ సమయం ప్రశ్నించినట్లు తెలిసింది. వీరి ద్వారానే ఐసిస్ ప్రతినిధి అబ్ మహ్మద్ అల్ అద్నానీ పాత్ర వెలుగు చూసింది. అబ్ మహ్మద్ ప్రోద్బలంతోనే పేలుళ్లను వారం రోజుల ముందుకు మార్చినట్లు ఎన్ఐఏ అధికారులకు వెల్లడించారు. వాస్తవానికి రంజాన్ తర్వాత పేలుళ్లు జరపాలని భావిస్తే... అబ్ మహ్మద్ మాత్రం తీవ్రంగా వాదించి వారం రోజులు ముందుగా అది కూడా శని, ఆదివారాల్లో జరపాలని ఆదేశించినట్లు తెలిపారు. అందుకోసం అబ్ మహ్మద్ ప్రత్యేకంగా 30 నిమిషాల నిడివి గల ఆడియోను ఆన్లైన్ ద్వారా పంపినట్లు పోలీసులు గుర్తించారు. పేలుళ్లకు మొదట్లో విముఖత చూపిన వారు సైతం అబ్ మహ్మద్ ఆడియో విన్న తర్వాత ఆసక్తి కనబర్చారు. దీంతో ఆ ప్రత్యేక ఆడియోలో అతడు ప్రస్తావించిన అంశాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. షఫీ ఆర్మర్ ఆధ్వర్యంలో రిక్రూట్మెంట్లు... సిరియాలో ఉన్న ఐసిస్ ముఖ్యనేత షఫీ ఆర్మర్ కనుసన్నల్లో పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్లు చేసినట్లు ఎన్ఐఏ అనుమానిస్తోంది. కర్ణాటకలోని భత్కల్ ప్రాంతానికి చెందిన షఫీ ఆర్మర్ ఐసిస్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఇబ్రహీం సౌదీ టూర్పై ఆరా... మహ్మద్ ఇబ్రహీం యాజ్దానీ రెండు నెలల కిత్రం సౌదీ అరేబియా వెళ్లి వచ్చినట్లు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. ఆ పర్యటనలో ఎవరెవరితో సమావేశమయ్యారనే దానిపై లోతుగా ఆరా తీస్తున్నారు. సౌదీలో షఫీ ఆర్మర్ మారుపేర్లతో వచ్చి ఇబ్రహీంతో చర్చించినట్లు సమాచారం. ఎఫ్ఎస్ఎల్కు చేరిన ఫోన్లు, ల్యాప్టాప్లు.. ఉగ్రమూకల నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లు, ల్యాప్టాప్లను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్)కు పంపించారు. బుధవారం పాతబస్తీలో పట్టుబడిన వారి నుంచి ఎన్ఐఏ అధికారులు దాదాపు 40 సెల్ఫోన్లు, సిమ్కార్డులు, ల్యాప్టాప్లతో పాటు పెద్ద మొత్తంలో పలు రసాయన పదార్థాలు లభించాయి. ఎలక్ట్రానిక్ పరికరాలలో నిక్షిప్తమైన సమాచారాన్ని వెలికితీయాలని ఎఫ్ఎస్ఎల్ అధికారులకు సూచించారు. నేడు మహారాష్ట్ర తీసుకెళ్లే యోచన.. తమ కస్టడీలో ఉన్న ఐదుగురు ఉగ్రమూకలను నేడు మహారాష్ట్రకు తీసుకెళ్లాలని ఎన్ఐఏ అధికారులు యోచిస్తున్నారు. ఇబ్రహీం యాజ్దానీ మహారాష్ట్రలోని నాందెడ్లో పలు ప్రాంతాల్లో పర్యటించడం, అక్కడే ఆయుధాలు కొనుగోలు చేసినట్లు సమాచారం. దీంతో ఆయుధాల కొనుగోలుకు సహకరించిన వారితో పాటు అక్కడున్న పరిచయాలపై ఆరా తీయనున్నారు. అనంతరం అక్కడి నుంచి రాజస్థాన్లో ఇబ్రహీం పర్యటించిన ప్రాంతాలను పరిశీలించనున్నారు. -
పన్నీరు ప్రత్యక్షం
రంగంలోకి ఓపీఎస్ అమ్మ ఆజ్ఞతో ముందుకు ♦ ప్రచారాలు, పుకార్లకు చెక్ ♦ రాష్ట్ర కార్యాలయంలో బిజీబిజీ ♦ ఎన్నికల వ్యవహారాల పర్యవేక్షణ ♦ మద్దతు నేతలతో మంతనాలు అన్నాడీఎంకేలో నెలకొన్న గందరగోళానికి తెరపడింది. మంత్రుల బృందంపై అన్నాడీఎంకే అధినేత్రి, ముఖ్యమంత్రి జయలలిత కన్నెర్ర చేసినట్టుగా వస్తున్న సంకేతాలు, ప్రచారాలు, పుకార్లకు చెక్ పడ్డాయి. అమ్మ ఆజ్ఞతో ఆరుగురు మంత్రులు అసెంబ్లీ ఎన్నికల వ్యవహారాల పర్యవేక్షణకు రంగంలోకి దిగారు. రాష్ట్ర పార్టీ కార్యాలయంలో శనివారం అడుగు పెట్టారు. మద్దతు పార్టీల నాయకులతో మంతనాల్లో మునిగారు. సాక్షి, చెన్నై : మళ్లీ అధికారమే లక్ష్యంగా సరికొత్త వ్యూహ రచనలతో సీఎం, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు ముందుకు సాగుతున్న తరుణంలో పలువురు మంత్రుల బండారం వెలుగులోకి రావడం చర్చకు దారి తీశాయి. సీట్ల కోసం నోట్ల కట్టల్ని సీనియర్లుగా, నిత్యం అమ్మ వెంట ఉండే మంత్రుల మద్దతు దారులు అందుకున్నట్టు వెలుగులోకి రావడం పెద్ద షాక్కే. ఇందులో పలువురు సీనియర్ల ప్రమేయం ఉన్నట్టుగా సంకేతాల తదుపరి అన్నాడీఎంకేలో పెద్ద గందరగోళం బయలు దేరిందని చెప్పవచ్చు. వారి మద్దతు దారులు ఉద్వాసనల పర్వం సాగడంతో మంత్రులకు వ్యతిరేకంగా రోజుకో కథనం వెలువడుతున్నా, ఖండించిన వాళ్లు లేరు. దీంతో అన్నాడీఎంకేలో ఏమి జరుగుతున్నదో అన్న ఉత్కంఠ బయలు దేరింది. సీనియర్ మంత్రులు ఓ పన్నీరు సెల్వం, నత్తం విశ్వనాథన్ పార్టీ ఎన్నికల వ్యవహారాల్లో దూరంగా ఉండడంతో ఇక వారిపై వేటు పడ్డట్టే అన్న ప్రచారం బయలు దేరింది. ప్రతిపక్షాలు సైతం అన్నాడీఎంకేలో సాగుతున్న వ్యవహారాలపై వస్తున్న కథనాల్ని అస్త్రంగా చేసుకుని దుమ్మెత్తి పోసే పనిలో పడ్డాయి. మంత్రులకు వ్యతిరేకంగా వస్తున్న అవినీతి ఆరోపణలతో కూడిన కథనాలపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే వారి సంఖ్య పెరిగింది. ఈ వ్యవహారాలపై అన్నాడీఎంకేలో నోరు మెదిపే వారు లేరని చెప్పవచ్చు. ఈ పరిస్థితుల్లో ఏమి జరిగిందో ఏమోగానీ, సీనియర్ మంత్రుల్ని అమ్మ కరుణించినట్టున్నారు. అమ్మ ఆజ్ఞతో తెర ముందుకు ఆరుగురు మంత్రులు వచ్చారు. ఆరుగురు ప్రత్యక్షం అమ్మ జయలలిత తదుపరి స్థానంలో ఉన్న సీనియర్ మంత్రి ఓ పన్నీరు సెల్వం, నత్తం విశ్వనాథన్ చాలా రోజుల తర్వాత శనివారం తెర మీదకు వచ్చారు. అమ్మ కరుణించారో ఏమోగానీ, అమ్మ ఆజ్ఞను శిరసావహించే విధంగా పార్టీ వ్యవహారాల మీద దృష్టి పెట్టేందుకు రంగంలోకి దిగారు. పన్నీరు సెల్వం, నత్తం విశ్వనాథన్, వైద్యలింగం, ఎడపాడి పళని స్వామి, ఎస్పి వేలుమణి, తంగమణిలతో కూడిన బృందం ఉదయాన్నే రాయపేటలోని అన్నాడీఎంకే రాష్ట్ర కార్యాలయంలో అడుగు పెట్టింది. వీరి రాకతో పార్టీలో నెలకొన్న గందరగోళ పరిస్థితులకు తెర పడ్డట్టు అయింది. కార్యాలయంలోకి వచ్చిన ఆరుగుర్ని అక్కడి పార్టీ వర్గాలు ఆహ్వానించారు. తదుపరి మొదటి అంతస్తుకు చేరుకున్న ఈ బృందం ఎన్నికల వ్యవహారాల మీద పూర్తి దృష్టిని సారించాయి. అన్నాడీఎంకేకు మద్దతు తెలిపేందుకు వచ్చిన వివిధ సంఘాల, సంస్థల ప్రతినిధులతో సమావేశం అయ్యారు. ఇది వరకు జయలలితతో పోయెస్ గార్డెన్లో కలిసి మద్దతు తెలిపిన కొన్ని పార్టీల నాయకులతో సీట్ల పందేరాల చర్చలతో ఈ బృందం మునగడం విశేషం. ఇన్నాళ్లు వస్తున్న ఆరోపణలు, విమర్శలు, ప్రచార, పుకార్లుతో కూడిన కథనాలకు వీరి రాక చెక్ పెట్టినట్టు అయింది. పన్నీరు ప్రత్యక్షం దృష్టి పెట్టేందుకు రంగంలోకి దిగారు. పన్నీరు సెల్వం, నత్తం విశ్వనాథన్, వైద్యలింగం, ఎడపాడి పళని స్వామి, ఎస్పి వేలుమణి, తంగమణిలతో కూడిన బృందం ఉదయాన్నే రాయపేటలోని అన్నాడీఎంకే రాష్ట్ర కార్యాలయంలో అడుగు పెట్టింది. వీరి రాకతో పార్టీలో నెలకొన్న గందరగోళ పరిస్థితులకు తెర పడ్డట్టు అయింది. కార్యాలయంలోకి వచ్చిన ఆరుగుర్ని అక్కడి పార్టీ వర్గాలు ఆహ్వానించారు. తదుపరి మొదటి అంతస్తుకు చేరుకున్న ఈ బృందం ఎన్నికల వ్యవహారాల మీద పూర్తి దృష్టిని సారించాయి. అన్నాడీఎంకేకు మద్దతు తెలిపేందుకు వచ్చిన వివిధ సంఘాల, సంస్థల ప్రతినిధులతో సమావేశం అయ్యారు. ఇది వరకు జయలలితతో పోయెస్ గార్డెన్లో కలిసి మద్దతు తెలిపిన కొన్ని పార్టీల నాయకులతో సీట్ల పందేరాల చర్చలతో ఈ బృందం మునగడం విశేషం. ఇన్నాళ్లు వస్తున్న ఆరోపణలు, విమర్శలు, ప్రచార, పుకార్లుతో కూడిన కథనాలకు వీరి రాక చెక్ పెట్టినట్టు అయింది. -
విద్యార్థిని కిడ్నాప్నకు యత్నించిన ఎస్సై
♦ స్థానికుల అప్రమత్తతతో బెడిసికొట్టిన వ్యూహం ♦ పోలీసుల అదుపులో కిడ్నాప్కు ప్రయత్నించిన మహిళ రేపల్లె: సామాన్యులకు రక్షణ కల్పించాల్సిన ఎస్సై విద్యార్థినిని కిడ్నాప్ చేసేందుకు యత్నించిన సంఘటన పట్టణంలో కలకలం సృష్టించింది. పట్టణ సీఐ వీ మల్లిఖార్జునరావు కథనం ప్రకారం బేతపూడి గ్రామానికి చెందిన జగన్మోహనరావు ఒంగోలు పోలీసు ట్రైనింగ్ సెంటరు(పీటీసీ)లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నాడు. మల్లిఖార్జునరావుకు మండలంలోని బేతపూడి గ్రామానికి చెందిన విద్యార్థిని కుటుంబ సభ్యులతో విభేదాలున్నాయి. ఈ క్రమంలో పట్టణంలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థినిని పరిచయస్తురాలు ఒంగోలు లాయరుపేటకు చెందిన బ్యూటీపార్లర్ నిర్వాహకురాలు ఈదుపల్లి సుధారాణి సాయంతో కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించాడు. వారిద్దరూ శుక్రవారం పాఠశాల వద్దకు వచ్చి విద్యార్థినిని పిలిపించి కారులో ఎక్కించేందుకు ప్రయత్నించగా విద్యార్థిని గట్టిగా కేకలు వేస్తూ స్కూల్లోకి పరుగెత్తింది. దీంతో స్థానికులు, ఉపాధ్యాయులు వ చ్చేసరికి జగన్మోనహనరావు, సుధారాణిలు పరారయ్యరు. ఉపాధ్యాయులు విద్యార్థిని బంధువులకు, పోలీసులకు సమాచారమిచ్చి స్థానికుల సాయంతో పాఠశాల పరిసరాల్లో వెతుకుతుండగా సుధారాణి వారి కంటపడింది. ఆమెను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో సుధారాణి వివరాలు వెల్లడించింది. ఎస్సై జగన్మోహనరావు పరారీలో ఉన్నాడు. విద్యార్థిని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
రిలయన్స్ వ్యూహాత్మకంగానే మా గ్యాస్ లాగేసింది
♦ 18% వడ్డీతో పరిహారం చెల్లించాలి ♦ ఏపీ షా కమిటీ ముందు ఓఎన్జీసీ వాదనలు న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) ప్రణాళికా బద్ధంగా, వ్యూహాత్మకంగానే తమ క్షేత్రం నుంచి ఆరేళ్ల పాటు 1.4 బిలియన్ డాలర్ల విలువ చేసే గ్యాస్ను లాగేసిందని ఓఎన్జీసీ ఆరోపించింది. దీనికి సంబంధించి 2009 నుంచి 18 శాతం వడ్డీ రేటుతో కంపెనీ పూర్తి పరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేసింది. ఇరు కంపెనీల మధ్య వివాదంపై విచారణ జరుపుతున్న జస్టిస్ ఏపీ షా కమిటీకి ఈ మేరకు తమ వాదనలు తెలియజేసింది. 2001 ఆ తర్వాత 2007లోను ఆర్ఐఎల్ సొంత బ్లాకుతో పాటు తమ బ్లాకులో నిక్షేపాల గురించి కూడా అధ్యయనాలు జరిపిందని, దీనిపై తమకు సమాచారమూ ఇవ్వలేదని ఓఎన్జీసీ పేర్కొంది. డేటా ఆధారంగా ఆర్ఐఎల్ .. తమ బ్లాకు నుంచి గ్యాస్ను గరిష్టంగా లాగేసేలా వ్యూహాత్మకంగా, నిర్దిష్ట కోణాల్లో బావులను తవ్విందని ఆరోపించింది. డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ (డీజీహెచ్) కొన్ని అంశాలను పట్టించుకోకపోవడం కూడా దీనికి తోడ్పడిందని ఓఎన్జీసీ పేర్కొంది. మరోవైపు, ఈ ఆరోపణలను ఆర్ఐఎల్ ఖండించింది. తాము ఎటువంటి అవకతవకలకు పాల్పడలేదని స్పష్టం చేసింది. కేజీ బేసిన్లో ఓఎన్జీసీ కేజీ-డీ5, ఆర్ఐఎల్ కేజీ-డీ6 గ్యాస్ క్షేత్రాలు పక్కపక్కనే ఉన్నాయి. ముందుగా ఉత్పత్తి ప్రారంభించిన ఆర్ఐఎల్ , తమ నిక్షేపంలో నుంచి కూడా గ్యాస్ను వెలికితీసి, విక్రయించుకుందంటూ ఓఎన్జీసీ ఆరోపిస్తోంది. -
పచ్చ నేతల మైండ్ గేమ్!
♦ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చావుదెబ్బ ♦ తెలంగాణలో తుడిచి పెట్టుకుపోతున్న టీడీపీ ♦ ఆర్భాటపు ప్రచారంతో ఏపీలో లబ్ధి పొందాలని వ్యూహం సాక్షి ప్రతినిధి, కడప: బోడిగుండుకు, మోకాలికి ముడి బెట్టడంలో అధికార తెలుగుదేశం పార్టీ తనకు తానే సాటి. ‘ఎద్దు ఈనింది అంటే గాటిన కట్టేయండి’ అన్న చందాన ఎల్లో మీడియా ఆ పార్టీకి వంత పాడటం పరిపాటి. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ తుడిచి పెట్టుకుపోతుంటే నివారించలేని స్థితిలో కొట్టుమిట్టాడుతూ.. ఆంధ్రప్రదేశ్లో ఉపద్రవం ఎక్కడ ముంచుకు వస్తుందోనని ముందస్తు వ్యూహంలో భాగంగా వైఎస్సార్సీపీ నేతల వలసలంటూ హైడ్రామాకు తెరతీసింది. అదుగో పులి.. ఇదుగో తోక అంటూ ఇందుకు ఎల్లో మీడియా వంత పాడింది. వాస్తవంగా అన్ని వర్గాల ప్రజల నుంచి ఛీత్కారాలు ఎదుర్కొంటున్న ప్రభుత్వం.. ప్రజల ఆదరణ ఎలా చూరగొనాలో తెలియక తల్లడిల్లుతోంది. ఇలాంటి పరిస్థితిలో ఆ పార్టీ నేతలను నిలువరించుకోడానికి వ్యూహం రూపొందించుకుంది. ఇందులో భాగంగా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వస్తున్నారంటూ ప్రచారం ప్రారంభించింది. ఇలా ప్రచారం మొదలెట్టడం ఇదే ప్రథమం కాదు. ‘‘ప్రాణం ఉన్నంత వరకూ వైఎస్ కుటుంబాన్ని వీడం. వైఎస్సార్సీపీని వీడితే ప్రజలతోపాటు, మాకుటుంబ సభ్యులు సైతం క్షమించరు’’ అంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు బహిరంగంగా ఎన్నో సందర్భాల్లో పేర్కొన్నారు. ఆ మాటలకు కట్టుబడి ఉన్నారు. అయితే.. అదిగో ఆ జిల్లాలో ఎమ్మెల్యేలు వెళ్తున్నారు.. ఇదిగో ఇక్కడ అసంతృప్తి వాదులు ఉన్నారంటూ నిత్యం ప్రచార పర్వాన్ని కొనసాగిస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డితో ఉన్న వ్యక్తిగత సాన్నిహిత్యం, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్ల ఉన్న విధేయత వల్ల ఆ పార్టీ ఎమ్మెల్యేలు నైతిక విలువలకు కట్టుబడి ప్రజా సేవలో ఉన్నారు. ఇలాంటి తరుణంలో దుష్ర్పచారం చేస్తూ పబ్బం గడుపుకోడానికి టీడీపీ మైండ్గేమ్ ఆడుతోంది. కావాలనే ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ ముందుస్తుగా పార్టీ మారుతున్నట్లు ప్రచార పర్వాన్ని కొనసాగించడం ఆనవాయితీగా పెట్టుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రభుత్వం ఉన్నా, తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లోకి వరుస కట్టారు. ఈ పరిణామాన్ని నియంత్రించలేని స్థితిలోనే మైండ్గేమ్కు ప్రాధాన్యత ఇచ్చినట్లుగా పలువురు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా, ఎక్కడ ఎలాంటి ఘటన చోటు చేసుకున్నా, మన జిల్లాకు ముడిపెట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. తుని ఘటనలో సైతం కడపను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యానించడంపై తీవ్ర స్థాయిలో రగిలిపోతున్నారు. టీడీపీ మునిగిపోనున్న నావ రాచమల్లు శివప్రసాదరెడ్డి, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే ప్రొద్దుటూరు: రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు ఈ ప్రభుత్వంపై విశ్వాసాన్ని కోల్పోయి అసహనంతో, అభద్రత భావంతో ఉన్నారని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి పేర్కొన్నారు. గత ఎన్నికల ముందు పేదలను నమ్మించి మోసం చేసిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని సాగనంపడానికి ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. గురువారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన ఎల్లో మీడియా చేస్తున్న విష ప్రచారమే తప్ప ఇందులో వాస్తవం లేదన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చే నాటి నుంచి ఆ జిల్లాలో ఇంత మంది, ఈ జిల్లాలో ఇంత మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతున్నట్లు నిత్యం ప్రచారం చేస్తున్నారన్నారు. అయితే ఇప్పటికి 20 నెలలు గడిచాయని, 20 నెలల్లో తమ పార్టీకి చెందిన ఏ ఒక్క ఎమ్మెల్యే అయినా టీడీపీలో చేరారా అని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాల్లో దెబ్బతిని ఈ ప్రచారాన్ని తెరపైకి తెచ్చారన్నారు. అక్కడ నెగ్గిన ఒకే ఒక కార్పొరేటర్ కూడా టీఆర్ఎస్లో చేరుతుండటం.. టీడీపీ ఎమ్మెల్యేలు ఎర్రబల్లి దయాకర్ రావు, ప్రకాష్గౌడ్లు ఇప్పటికే చేరడంతో టీడీపీకి కోలుకోలేని దెబ్బ తగిలిందన్నారు. అక్కడ మిగిలేది రేవంత్ రెడ్డి ఒక్కడేనని, అతనూ ఎంతో కాలం ఇమడలేడన్నారు. ఇంతటి బలహీనమైన స్థితిలో ఉన్న తెలుగుదేశం పార్టీ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలపై విష ప్రచారం మొదలు పెట్టిందన్నారు. ‘జన్మనిచ్చిన తల్లిదండ్రుల సాక్షిగా చెబుతున్నా.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అంటే మాకు ప్రాణం. ఆయన ఆరోప్రాణమే వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఆయన కోసం ప్రాణాలను ఫణంగా పెడతామ’ని ఆయన వివరించారు. నైతిక విలువలకు కట్టుబడి ఉన్నాం ఎస్బి అంజద్బాషా, కడప ఎమ్మెల్యే కడప కార్పొరేషన్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలంతా నైతిక విలువలున్నవారేనని, ఏ ఒక్కరూ పార్టీ మారే అవకాశం లేదని కడప శాసన సభ్యుడు ఎస్బి అంజద్బాషా అన్నారు. గురువారం ఆయన మీడియాతో మట్లాడుతూ.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీడీపీ తుడిచిపెట్టుకుపోయి ఒక్క సీటుకు పరిమితమైన నేపథ్యంలో చంద్రబాబు ఈ మైండ్ గేమ్ ఆడుతున్నారని తెలిపారు. తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యేలంతా టీఆర్ఎస్లో చేరుతున్నారని, మొన్న ఒకరు, నిన్న ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారన్నారు. మిగతావారు కూడా పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఒక విధంగా చెప్పాలంటే తెలంగాణలో టీడీపీ భూస్థాపితమయ్యిందన్నారు. దాన్ని డైవర్ట్ చేయడానికి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతున్నారంటూ ఎల్లో మీడియా ద్వారా దుష్ర్పచారం చేయడం దారుణమన్నారు. దివంగత వైఎస్ఆర్ ముస్లిం, మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పించి ఎంతో మేలు చేశారని, వైఎస్ జగన్ నాయకత్వంపై ఎమ్మెల్యేలందరికీ అపారమైన నమ్మకం ఉందని, ఏ ఒక్కరూ పార్టీ మారే అవకాశం లేదని కొట్టిపారేశారు. పరువు కోసం టీడీపీ పాట్లు రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్రెడ్డి, ఆకేపాటి అమర్నాథ్రెడ్డి రాయచోటి : తెలంగాణ లో తుడిచి పెట్టుకుపోతే దిక్కుతోచక పరువు నిలుపుకోడానికి టీడీపీ ముఖ్యనేతలు మైండ్ గేమ్ మొదలు పెట్టారని రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం వారు మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఓటుకు-నోటు వ్యవహారంలో చిక్కుకుని, చివరికి అక్కడి సీఎం కేసీఆర్తో రాజీ అయిన విషయం సామాన్యులకు సైతం అర్థమవుతోందన్నారు. అక్కడ టీడీపీ తుడిచి పెట్టుకుపోతుండటంతో ఆంధ్రప్రదేశ్లో కొంత మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతున్నట్లు ఎల్లో మీడియా ద్వారా తప్పుడు సమాచారం ఇస్తున్నారని చెప్పారు. అయితే టీడీపీ మునిగిపోయే నావ అని, ఎవరూ ఆ పార్టీవైపు కన్నెత్తి చూసే ప్రసక్తేలేదన్నారు. కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అని, రాష్ట్ర అభివృద్ది ఆయనతోనే సాధ్యమని వారు పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో కాపులను బీసీల్లో చేరుస్తామని చెప్పి చంద్రబాబు మాట తప్పారన్నారు. మరో వైపు క్రి ష్ణయ్యతో బీసీ ఉద్యమం చేయించడం ఆయనకే చెల్లిందన్నారు. రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, డ్వాక్రా మహిళలు, వృద్ధులు.. ఇలా అందరినీ మోసగించిన పార్టీలో ఎవరు చేరుతారని వారు ప్రశ్నించారు. ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా.. అంటూ ఎస్సీలను అవమానించడం దారుణం అన్నారు. అలాంటి సీఎం అసెంబ్లీలో అంబేడ్కర్ను అడ్డుపెట్టుకుని పబ్బం గడుపుకోవడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. -
ఉండేదెవరు?.. ఊడేదెవరు?
-
గులాబీ గ్రేటర్ ఆపరేషన్
-
గ్రేటర్ పీఠం కోసం గ్ర్రేటర్ కసరత్తు
-
రెండు సీట్ల గెలుపు ఎవరి ఖాతాలో..?
-
మాటల్లేవ్!
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి నేటితో తెర పోటాపోటీగా అభ్యర్థుల ప్రచారం 22న ఉదయం 8 నుంచి పోలింగ్ 25న ఓట్ల లెక్కింపు సిటీబ్యూరో: హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారంతో తెరపడనుంది. సాయంత్రం 5 గంటలతో ప్రచార గడువు ముగుస్తోంది. ఈ ఎన్నికలను సవాల్గా తీసుకొని టీఆర్ఎస్, బీజేపీ-టీడీపీ, కాంగ్రెస్ పార్టీల వారు ఎవరికి వారుగా అన్ని మార్గాల్లో ప్రచారం చేస్తున్నారు. లోపాయికారీ ‘వ్యూహాలూ’ పూర్తి చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఎన్నికలకు 33 మంది నామినేషన్లు వేయగా...ఇద్దరు ఉపసంహరించుకున్నారు. 31 మంది బరిలో మిగిలారు. అధికార పార్టీకి చెందినజి.దేవీప్రసాద్రావు, టీడీపీ పొత్తుతో బీజేపీ అభ్యర్థి ఎన్.రామచంద్రరావు, కాంగ్రెస్ అభ్యర్థిగా ఆగిరు రవికుమార్ గుప్తా హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. ప్రతిష్ట కోసం టీఆర్ఎస్, సవాల్గా తీసుకొని కాంగ్రెస్, బీజేపీల అగ్రనాయకులు తమ అభ్యర్థుల కోసం ముమ్మర ప్రచారం చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి కోసం డిప్యూటీ ముఖ్యమంత్రులు మహమూద్అలీ, నాయిని నరసింహారెడ్డిలతో సహా పలువురు మంత్రులు ప్రచారంలో పాల్గొన్నారు. బీజేపీ అభ్యర్థి తరఫున కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ, కిషన్రెడ్డి, టీడీపీ రాష్ట్రనేతలు దయాకర్రావు, రేవంత్రెడ్డి, పెద్దిరెడ్డి, జిల్లా నాయకులు కృష్ణయాదవ్, కూన వెంకటేశ్ గౌడ్ తదితరులు ప్రచారం సాగించారు. కాంగ్రెస్ నుంచి పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి తదితర నాయకులు ప్రచారంలో పాల్గొన్నారు. ప్రచారానికి ఎస్ఎంఎస్లు, వాట్సప్ను కూడా విస్తృతంగా వినియోగించుకున్నారు. 2.86 లక్షల ఓటర్లు ఈ ఎన్నికల్లో 2,86,311 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో రంగారెడ్డి జిల్లా నుంచి అత్యధికంగా 1,33,003 మంది ఉన్నారు. హైదరాబాద్ జిల్లా నుంచి 87, 208 మంది, మహబూబ్నగర్ జిల్లా నుంచి 66,100 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు. మొత్తం ఓటర్లలో 1,92,110 మంది పురుషులు కాగా, 94,188 మంది మహిళలు, 13 మంది ఇతరులు ఉన్నారు. 413 పోలింగ్ కేంద్రాలు ఎన్నికలకు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లాలో 97 పోలింగ్ కేంద్రాలు, రంగారెడ్డి జిల్లాలో 165, హైదరాబాద్ జిల్లాలో 151... వెరసి మొత్తం 413 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. పోలింగ్ సందర్భంగా అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా చర్యలు తీసుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద వెబ్ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్ జిల్లాలో 894 మంది పోలింగ్ సిబ్బందిని నియమించారు. వీరిలో 182 మంది ప్రిసైడింగ్ అధికారులు, 182 మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు ఉన్నారు. ఇంకా 364 మంది పోలింగ్ సిబ్బందితో పాటు 166 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు. మిగతా జిల్లాల్లోనూ ఇదే స్థాయిలో సిబ్బందిని నియమించారు. 22న (ఆదివారం) ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. 25న ఉదయం 8 గంటల నుంచి చాదర్ఘాట్ విక్టరీ ప్లేగ్రౌండ్లో ఓట్లు లెక్కిస్తారు. కౌంటింగ్కు 28 టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు రిటర్నింగ్ అధికారి, జీహెచ్ఎంసీ స్పెషల్ కమిషనర్ నవీన్మిట్టల్ పేర్కొన్నారు. అభ్యర్థులెవరూ నచ్చని పక్షంలో ‘నోటా’ను వినియోగించుకునే వీలుంది. బల్క్ ఎస్సెమ్మెస్లు వద్దు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా 20వ తేదీ సాయంత్రం 4 నుంచి 22వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు ఎలాంటి బల్క్ ఎస్ఎంఎస్లు పంపించరాదని, వాటిని ఎన్నికల ప్రయోజనాలకు వినియోగించరాదని ఎన్నికల సంఘం ఆదేశించినట్లు జీహెచ్ఎంసీ వర్గాలు ఒక ప్రకటనలో పేర్కొన్నాయి. పోటీలో ఉన్న అభ్యర్థులు, వారి ఏజెంట్లు, రాజకీయ పార్టీలు దీన్ని పాటించాలని స్పష్టం చేశాయి. -
సివిల్స్ ప్రిలిమినరీ పాలిటీకి పదిలమైన వ్యూహాలు
దేశంలో జరిగే ప్రతి పోటీ పరీక్షలో ‘ఇండియన్ పాలిటీ (భారత రాజకీయ వ్యవస్థ) పై తప్పనిసరిగా అధిక సంఖ్యలో ప్రశ్నలు ఉంటాయి. అత్యున్నత పరీక్ష అయిన సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీలోని జనరల్ స్టడీస్ పేపర్-1లో పాలిటీ విభాగం ఎంతో ముఖ్యమైంది. దీనిలో సుమారు 16 నుంచి 18 ప్రశ్నలను అడుగుతారు. అందుకే పాలిటీపై సునిశిత దృష్టి సారించడం చాలా అవసరం. విస్తృత పఠనం, తార్కిక విశ్లేషణ, వర్తమాన రాజకీయ అంశాలను, సంఘటనలను రాజ్యాంగపరంగా అన్వయించుకుంటూ అధ్యయనం చేస్తే పాలిటీ విభాగంలో మంచి మార్కులు సాధించవచ్చు. సిలబస్ విస్తృతం-సమకాలీన సమన్వయం: పాలిటీ విభాగం మిగతా వాటి కంటే భిన్నంగా ఉంటుంది. సిలబస్లోని ప్రతి అంశం సమకాలీన సంఘటనలతో ముడిపడి గతిశీలతను సంతరించుకొంటుంది. భారత రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థ, పరిపాలన, పంచాయతీరాజ్ వ్యవస్థ, పబ్లిక్ పాలసీ, హక్కుల సమస్యలు మొదలైన అంశాలను సిలబస్లో ప్రస్తావించారు. వీటిని సమకాలీన అంశాలకు అన్వయించుకొన్నప్పుడు సిలబస్ పరిధి చాలా విస్తృతం అవుతుంది. ప్రశ్నల సరళి, స్వభావం, ప్రమాణాలు: ప్రిలిమినరీ పరీక్షలో ప్రశ్నలు పూర్తిగా ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటాయి. గత ప్రశ్న పత్రాలను విశ్లేషిస్తే ప్రశ్నల స్థాయిని మూడు రకాలుగా విభజించవచ్చు. 1. విషయ పరిజ్ఞానానికి సంబంధించినవి (Knowledge based) 2. విషయ అవగాహన (Understanding - Comprehension) 3. విషయ అనువర్తన (Application) మొదటిరకం ప్రశ్నలకు జవాబులు Facts, Figures ఆధారంగా గుర్తించాల్సి ఉంటుంది. చదివి గుర్తుంచుకుంటే సరిపోతుంది. మాదిరి ప్రశ్న: ఏకగ్రీవంగా ఎన్నికైన రాష్ర్టపతి ఎవరు? a) నీలం సంజీవరెడ్డి b) డా. రాజేంద్రప్రసాద్ c) ఆర్. వెంకట్రామన్ d) ఎవరూ కాదు సమాధానం: a రెండో తరహా ప్రశ్నల్లో సమాచారాన్ని అభ్యర్థి ఎంతవరకు అవగాహన చేసుకున్నాడు అనేది పరిశీలిస్తారు. మాదిరి ప్రశ్న: రాష్ర్టపతిగా పోటీ చేయాలంటే? a) పార్లమెంటులో సభ్యత్వం ఉండాలి b) లోక్సభలో సభ్యత్వం ఉండాలి c) రాజ్యసభలో సభ్యత్వం ఉండాలి d) ఏ సభలోనూ సభ్యత్వం ఉండాల్సిన అవసరం లేదు సమాధానం: d వివిధ పదవులకు పోటీ చేయాలంటే ఉండాల్సిన అర్హతలపై అవగాహన ఉన్నప్పుడు ఇలాంటి ప్రశ్నలకు సులభంగా సమాధానం గుర్తించగలుగుతారు. మూడో తరహా ప్రశ్నలు అభ్యర్థి తెలివి, సందర్భానుసార అనువర్తనకు సంబంధించి ఉంటాయి. తన విచక్షణా జ్ఞానంతో సరైన సమాధానాన్ని గుర్తించాల్సి ఉంటుంది. మాదిరి ప్రశ్న: రాష్ర్టపతికి ఉన్న ఆర్డినెన్స జారీ చేసే అధికారం? a) పార్లమెంట్ శాసనాధికారాలకు సమాంతరం b) పార్లమెంట్ శాసనాధికారాలకు అనుబంధం c) పార్లమెంట్ శాసనాధికారాలకు ప్రతిక్షేపం d) పైవేవీ కాదు సమాధానం: b రాష్ర్టపతి ఆర్డినెన్స అధికారాలకు సంబంధించి సంపూర్ణ అవగాహన,తార్కిక విశ్లేషణ సామర్థ్యాలు ఉన్నప్పుడే ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలను గుర్తించడం సాధ్యమవుతుంది. ఈ తరహా ప్రశ్నలనే సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలో ఎక్కవగా అడుగుతున్నారు. సిలబస్-అధ్యయనం చేయాల్సిన ముఖ్యాంశాలు రాజ్యాంగ చరిత్ర - రాజ్యాంగ పరిషత్: రాజ్యాంగ చారిత్రక పరిణామం, బ్రిటిషర్లు ప్రవేశపెట్టిన ముఖ్య సంస్కరణలు, చార్టర్, కౌన్సిల్ చట్టాలు, రాజ్యాంగ పరిషత్ నిర్మాణం ముఖ్య కమిటీలు, ప్రముఖ సభ్యులు, తీర్మానాలు, రాజ్యాంగ ఆధారాలు వంటి అంశాలపై దృష్టి సారించాలి. మాదిరి ప్రశ్న: భారత రాజ్యాంగ పరిషత్కు సంబంధించి సరైన అంశం? a) పూర్తిగా పరోక్ష ఎన్నికలు జరిగాయి b) ప్రొవిజనల్ పార్లమెంట్గా పనిచేసింది c) ఏకాభిప్రాయ పద్ధతిలో అంశాలను నిర్ణయించారు d) పైవన్నీ సమాధానం: d ప్రవేశిక, ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు: రాజ్యాంగ పునాదులు, తత్వం, లక్ష్యాలు, ప్రాథమిక హక్కులు - రకాలు, ప్రాముఖ్యత, వాటి సవరణలు, విస్తరణ, సుప్రీంకోర్టు తీర్పులు, సమకాలీన వివాదాలు, ఆదేశిక నియమాలతో ప్రతిష్టంభన, తాజా పరిణామాలపై విస్తృత అధ్యయనం చేయాల్సి ఉంటుంది. మాదిరి ప్రశ్న: రాజ్యాంగంలో అంతర్భాగమైన ఆర్థిక న్యాయాన్ని ఏ భాగంలో ప్రస్తావించారు? a) ప్రవేశిక, ప్రాథమిక హక్కులు b) ప్రవేశిక, ఆదేశిక నియమాలు c) ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు d) పైవేవీకాదు సమాధానం:b కేంద్ర ప్రభుత్వం: కార్యనిర్వాహక స్వభావం, రాష్ర్టపతి, ఉప రాష్ర్టపతి ఎన్నిక, తొలగింపు అధికారాలు, ప్రధానమంత్రి, మంత్రి మండలి, సంకీర్ణ రాజకీయాలు, బలహీనపడుతున్న ప్రధానమంత్రి పదవి, పార్లమెంట్ నిర్మాణం, లోక్సభ, రాజ్యసభ ప్రత్యేక అధికారాలు, పార్లమెంట్ ప్రాముఖ్యత- క్షీణత, జవాబుదారీతనం లోపించడం, విప్ల జారీ, పార్టీ ఫిరాయింపుల చట్టం, నేరమయ రాజకీయాలు. సుప్రీంకోర్టు అధికార విధులు, క్రియాశీలత, జాతీయ న్యాయ నియామకాల కమిషన్ బిల్లు మొదలైన సమకాలీన పరిణామాలపై అవగాహన కలిగి ఉండాలి. మాదిరి ప్రశ్న: ముఖ్యమంత్రిగా, స్పీకర్గా, రాష్ర్టపతిగా పనిచేసిన వారు? a) నీలం సంజీవరెడ్డి b) జ్ఞానీ జైల్సింగ్ c) సర్వేపల్లి రాధాకృష్ణన్ d) a, b సమాధానం: a మాదిరి ప్రశ్న: కింది వాటిలో 16వ లోక్సభకు సంబంధించి సరైంది? a) అత్యధిక మహిళా ప్రాతినిధ్యం ఉంది b) మెజారిటీ సభ్యులు మొదటిసారి ఎన్నికైనవారు c) రెండో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ అన్నాడీఎంకే d) పైవన్నీ సమాధానం: d రాష్ర్ట ప్రభుత్వం: గవర్నర్ నియామకం, అధికార విధులు విచక్షణాధికారాలు - వివాదాలు, ముఖ్యమంత్రి - మంత్రి మండలి, విధానసభ, విధాన పరిషత్, హైకోర్టు, సబార్డినేట్ కోర్టులు మొదలైన అంశాలను అధ్యయనం చేయాలి. మాదిరి ప్రశ్న: కింది వారిలో ఎవరికి ప్రత్యక్షంగా విచక్షణాధికారాలు ఉన్నట్లుగా రాజ్యాంగంలో పేర్కొనలేదు? a) గవర్నర్ b) రాష్ర్టపతి c) ముఖ్యమంత్రి d) ప్రధానమంత్రి సమాధానం: b కేంద్ర రాష్ర్ట సంబంధాలు: సమాఖ్య స్వభావం, అధికార విభజన, శాసన, పాలన, ఆర్థిక సంబంధాలు, అంతర్రాష్ర్ట మండలి, ప్రణాళికా సంఘం, జాతీయ అభివృద్ధి మండలి, కేంద్ర - రాష్ర్ట సంబంధాల సమీక్షా కమిషన్లు వాటి సిఫారసులను లోతుగా అధ్యయనం చేయాలి. మాదిరి ప్రశ్న: భారత సమాఖ్యలోని ఏకకేంద్ర లక్షణం? a) గవర్నర్ల నియామకం b) అఖిల భారత సర్వీసులు c) అవశిష్ట అధికారాలను కేంద్రానికి ఇవ్వడం d) పైవన్నీ సమాధానం: d స్థానికస్వపరిపాలన-73, 74వ రాజ్యాంగ సవరణలు: ప్రజాస్వామ్య వికేంద్రీకరణ, చారిత్రక పరిణామం - మేయో, రిప్పన్ తీర్మానాలు, సమాజ వికాస ప్రయోగం - బల్వంత్ రాయ్ మెహతా కమిటీ, అశోక్ మెహతా కమిటీ, జీవీకే రావు కమిటీ, ఎల్.ఎం. సింఘ్వి కమిటీలు, వాటి సిఫార్సులు; 73, 74వ రాజ్యాంగ సవరణ చట్టాలు, నూతన పంచాయతీ వ్యవస్థ, పెసా (PESA) చట్టం మొదలైన అంశాలపై పరిపూర్ణ అవగాహన ఉండాలి. మాదిరి ప్రశ్న: షెడ్యూల్డ్ ఏరియాకు వర్తించేందుకు చేసిన పంచాయతీ విస్తరణ చట్టం (PESA) 1996 ముఖ్య ఉద్దేశం? a) గ్రామ పంచాయతీలకు కీలక అధికారాలు b) స్వయంపాలన అందించడం c) సంప్రదాయ హక్కులను గుర్తించడం d) పైవన్నీ సమాధానం: d రాజ్యాంగపరమైన సంస్థలు: ఎన్నికల సంఘం, ఆర్థిక సంఘం, పబ్లిక్ సర్వీస్ కమిషన్లు, జాతీయ ఎస్సీ, ఎస్టీ, బీసీ కమిషన్లు, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, అటార్నీ జనరల్, అడ్వకేట్ జనరల్ ఇతర చట్టపర కమిషన్ల గురించి సాధికారిక సమాచారాన్ని కలిగి ఉండాలి. మాదిరి ప్రశ్న: కేంద్ర-రాష్ట్రాలకు ఉమ్మడిగా ఉన్న రాజ్యాంగపర సంస్థ, సంస్థలు? a) కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ b) ఆర్థిక సంఘం c) ఎన్నికల సంఘం d) పైవన్నీ సమాధానం: d రాజ్యాంగ సవరణలు: ముఖ్యమైన రాజ్యాంగ సవరణలపై అవగాహన పెంచుకోవాలి. ప్రధానంగా 1, 7, 15, 24, 25, 42, 44, 52, 61, 73, 74, 86, 91, 97, 98వ రాజ్యాంగ సవరణలతోపాటు తాజాగా ప్రతిపాదించిన బిల్లులను గుర్తుంచుకోవాలి. ప్రభుత్వ విధానాలు హక్కుల సమస్యలు: విధాన నిర్ణయాలు, వాటిని ప్రభావితం చేసే గతిశీలక అంశాలు, అభివృద్ధి, నిర్వాసితులు, పర్యావరణం, ఉద్యమాలు, పౌర సమాజం, మీడియా పాత్ర మొదలైన అంశాలను కూడా చదవాల్సి ఉంటుంది. రీడింగ్ అండ్ రిఫరెన్స బుక్స్ విస్తృత పఠనం/అధ్యయనం తప్పనిసరి. ప్రామాణిక పుస్తకాలను చదవాలి. మార్కెట్లో వ్యాపార ధోరణితో ముద్రించిన పుస్తకాలు, గైడ్లను చదవకూడదు! పునరుక్తి (రిపిటిషన్) అవుతాయి కాబట్టి సమయం వృథా అవుతుంది. ‘రీడింగ్’కు ‘రిఫరెన్సకు’ తేడా గుర్తించాలి. ఒకటి లేదా రెండు ప్రామాణిక పుస్తకాలు చదివితే చాలు. అంశాలను, అవసరాన్ని బట్టి ముఖ్యమైన పుస్తకాలను సంప్రదించాలి. (రిఫరెన్స): విషయ పరిధిని విస్తరించుకోవాలి. - NCERT 10th, 11th, 12th స్థాయి సివిక్స్ పుస్తకాలు - Our parliament, our constitutions our judicialy - National Book Trust Publication - భారత రాజ్యాంగం - రాజకీయ వ్యవస్థ - బి. కృష్ణారెడ్డి, జి.బి.కే. పబ్లికేషన్స - The constitution of India (Bare act) P.M. Bakshi - Introduction to the constitution of India - D.D. Basu - Note: ప్రీవియస్ క్వశ్చన్స సాధన చేయాలి. చాప్టర్ వారీగా టెస్ట్ పేపర్స కూడా సాధన చేయాలి. వీటిని గుర్తుంచుకోండి - జాతీయ స్థాయిలో నిర్వహించే అత్యున్నత పరీక్ష. సుదీర్ఘ ప్రయత్నం, పట్టుదల అనివార్యం. కొన్ని త్యాగాలకు సిద్ధంగా ఉండే మనస్తత్వం ఉండాలి. - చదివే అంశంపై స్పష్టత తప్పనిసరి. తార్కికంగా ప్రశ్నించుకుంటేనే ఇది సాధ్యమవుతుంది. - ప్రకరణలు, భాగాలు, షెడ్యూళ్లను పీరియాడికల్గా రివిజన్ చేస్తూ వాటిని గుర్తుంచుకోవాలి. కొన్ని మెమొరీ టెక్నిక్స్ను కూడా సృష్టించుకోవాలి. - చదవడం ఎంత ముఖ్యమో, చదివిన అంశంపై ఆలోచించడం అంతే ముఖ్యం. - గత ప్రశ్న పత్రాలను విస్తృతంగా సాధన చేయాలి. తద్వారా పరీక్ష ట్రెండ్, ప్రశ్నలస్థాయి తెలుస్తుంది. - నిర్ణీత ప్రణాళిక తయారు చేసుకొని దానికి కట్టుబడి ఉండాలి. - పాలిటీలో సమకాలీన అంశాలకు ఎక్కువ ప్రాధాన్యమివ్వాలి. - సొంత నోట్స్ తయారు చేసుకోవడం ఉత్తమం - ఆత్రుతతో సిలబస్ పూర్తి చేయొద్దు. ఆకళింపు చేసుకొని, ఎక్కువ పర్యాయాలు పునశ్చరణ చేయాలి. -
కుట్రా? వ్యూహమా?