t congress
-
కాంగ్రెస్ పై అన్ని వర్గాల ప్రజలు నిరాశతో ఉన్నారు
-
తెలంగాణ కాంగ్రెస్ లో తేలని టికెట్ల పంచాయతీ
-
తెలంగాణ కాంగ్రెస్.. మరో నలుగురు లోక్సభ అభ్యర్థుల జాబితా విడుదల
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ నుంచి బరిలో దిగే మరో నలుగురు లోక్సభ అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. మెదక్ నుంచి నీలం మధు, భువనగిరి నుంచి చామల కిరణ్కుమార్ రెడ్డి, నిజామాబాద్ నుంచి తాటిపర్తి జీవన్రెడ్డి, ఆదిలాబాద్ నుంచి ఆత్రం సుగుణ పోటీ చేస్తారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ బుధవారం రాత్రి విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 17 స్థానాలకుగాను 9 స్థానాలకు ఇంతకుముందే అభ్యర్థులను ప్రకటించగా, మిగతా స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసేందుకు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ బుధవారం ఢిల్లీలో సమావేశమైంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో రాష్ట్రం తరఫున టీపీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, సీఈసీ సభ్యుడు ఉత్తమ్కుమార్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి పాల్గొన్నారు. ఇంకా పెండింగ్లో నాలుగు స్థానాలు సీఈసీలో 8 స్థానాలపై చర్చ జరుగుతుందని భావించినప్పటికీ కేవలం ఆరు స్థానాలపై మాత్రమే చర్చ జరిగింది. పారీ్టలో అంతర్గతంగా ఒత్తిడి ఎక్కువగా ఉన్న ఖమ్మం స్థానంతో పాటు హైదరాబాద్ అభ్యర్థి ఎవరనేది ప్రస్తావనకు రాలేదు. ఇక ఆరు స్థానాల్లోనూ నాలుగు సీట్లను మాత్రమే ఖరారు చేశారు. వరంగల్ నుంచి దొమ్మాట సాంబయ్య, నమిళ్ల శ్రీనివాస్, కరీంనగర్ నుంచి ప్రవీణ్ రెడ్డి, రాజేందర్ రావు, తీన్మార్ మల్లన్నల పేర్లను పరిశీలించినా నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఈ రెండు స్థానాలతో పాటు ఖమ్మం, హైదరాబాద్ స్థానాల్లో ఎవరి అభ్యర్థిత్వానికి కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపుతుందనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ నెల 31న మరోసారి జరగనున్న సీఈసీ భేటీలో స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. తలనొప్పిగా మారిన ఖమ్మం తెలంగాణలో ఖమ్మం పార్లమెంట్ స్థానం హాట్ సీట్గా మారింది. ఎక్కువమంది పోటీ పడుతుండటంతో ఇక్కడ ఎవరిని బరిలో దించాలన్న అంశం కాంగ్రెస్ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులు తమకు సంబంధించిన అభ్యర్థులకు సీటు కేటాయించాలని ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం. భట్టి తన సతీమణి నందిని కోసం, పొంగులేటి తన సోదరుడు ప్రసాద్రెడ్డి కోసం, తుమ్మల తన కుమారుడు యుగంధర్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతున్నారు. వీరితో పాటు కమ్మ సామాజికవర్గానికి చెందిన పారిశ్రామికవేత్త వంకాయలపాటి రాజేంద్రప్రసాద్, టీపీసీసీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమకుమార్లు సైతం తమకు ఖమ్మం సీటు కేటాయించాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఖమ్మం అభ్యర్థి ప్రకటన వాయిదా పడుతోందని చెబుతున్నారు. -
ప్రచార వేగం పెంచిన టీ కాంగ్రెస్
-
తెలంగాణ ఎన్నికలకు కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల
-
ప్రతి నియోజకవర్గంలో వీఐపీ పర్యటనలు ఉండేలా కాంగ్రెస్ కసరత్తు
-
కాంగ్రెస్లో ఉత్కంఠ.. నాలుగు స్థానాల్లో ఎటూ తేలని టికెట్ల పంచాయితీ
-
14న భేటీ తర్వాత అభ్యర్థుల జాబితా
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులను ఖరారు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) ఈ నెల 14న ఢిల్లీలో భేటీ కానుంది. అంతకంటే ముందురోజు తెలంగాణ స్క్రీనింగ్ కమిటీ సమావేశం మరోమారు జరగనున్నట్టు తెలుస్తోంది. ఈనెల 14న సీఈసీ భేటీ తర్వాత ఏ క్షణమైనా తెలంగాణ అభ్యర్థుల తొలి జాబితా వస్తుందని, దసరా తర్వాత మలి జాబితా రానుందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల గుర్తింపు ప్రక్రియ పూర్తిచేసి, స్క్రీనింగ్ కమిటీ సమరి్పంచిన నివేదికల ఆధారంగా సీఈసీ ఫైనల్ చేయనుంది. ఏఐసీసీ కార్యాలయంలో జరిగే ఈ భేటీపై ఇప్పటికే కమిటీ సభ్యులకు సమాచారం ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈనెల 9న భేటీ అయిన స్క్రీనింగ్ కమిటీ 70కిపైగా స్థానాల్లో ఒక్కో అభ్యర్థిని, మిగతా స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థుల పేర్లతో జాబితాను రూపొందించింది. ఒక్కో స్థానంలో ఖరారైన అభ్యర్థుల జాబితాపై సీఈసీలో ఎలాంటి అభ్యంతరాలు లేనిపక్షంలో వాటిని యథావిధిగా ఆమోదించనున్నారు. ఏవైనా అభ్యంతరాలుంటే సహేతుక కారణాలను చూపి మరో అభ్యర్థిని ముందుకు తెచ్చే అవకాశాలుంటాయని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక ఇద్దరేసి అభ్యర్థులున్న చోట్ల ఎంపిక నిర్ణయానికి సీఈసీ కొన్ని మార్గదర్శకాలు సూచిస్తుందని, వాటికనుగుణంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారని చెబుతున్నాయి. ఈ నెల 16 లేదా 18న తొలి జాబితా విడుదల చేసేలా ఇప్పటికే నేతల నుంచి హైకమాండ్కు ఒత్తిళ్లు పెరిగాయి. దానికి అనుగుణంగా వారంలోనే జాబితా విడుదల చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
Telangana Congress: 70 సీట్లు ఓకే!
సాక్షి, న్యూఢిల్లీ/ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ ఓ కొలిక్కి తెచ్చింది. రాజకీయ అనుభవం, కుల సమీకరణాలు, ఆర్ధిక పరిస్థితులు, సర్వేలను బేరీజు వేసుకుంటూ దాదాపు 70 స్థానాల్లో అభ్యర్థులను కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ ఖరారు చేసింది. కమిటీ సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదరని మిగతా సీట్లకు అభ్యర్థుల ఎంపికపై మరో సారి భేటీ అయి చర్చించాలని నిర్ణయించింది. ఏకాభిప్రాయం రాని స్థానాలకు ఇద్దరు చొప్పున పేర్లతో జాబితా సిద్ధం చేసి పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ)కి పంపాలని.. వారు ఇచ్చే మార్గదర్శకాలకు అనుగుణంగా పేర్లను ఖరారు చేయాల ని తీర్మానించింది. ఇప్పటికే ఒక్కో పేరును ఖరారు చేసిన నియోజకవర్గాల జాబితాకు సీఈసీ అను మతి తీసుకుని విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ నెల 14 తర్వాత సీఈసీ భేటీ అయి అభ్యర్థుల జాబితాలను పరిశీలించనుందని.. ఈ నేపథ్యంలో ఈ నెల 16న లేక 18న తొలి జాబితాను విడుదల చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఈ నెల 15 నుంచి ముఖ్య నేతలతో బస్సు యాత్ర చేపట్టాలని టీపీసీసీ నిర్ణయించడంతో.. ఆ బస్సు యాత్ర పూర్తయ్యాక అభ్యర్థుల జాబితాను ప్రకటించే ఆలోచన కూడా ఉందని అంటున్నాయి. వాడీవేడిగా సమావేశం.. అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ ఆదివారం ఢిల్లీలోని కాంగ్రెస్ వార్రూమ్లో భేటీ అయింది. కమిటీ చైర్మన్ మురళీధరన్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్రావ్ ఠాక్రే, రేవంత్రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, మధుయాష్కీగౌడ్, ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు, ఇతర కార్యదర్శులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గత నెలలో ఖరారు చేసిన కొన్ని స్థానాలు సహా మొత్తంగా 70 సీట్లలో అభ్యర్థులను ఖరారు చేసి.. ఒక్కో పేరుతో జాబితాను పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) ఆమోదానికి పంపాలని నిర్ణయించినట్టు తెలిసింది. సుమారు 10 గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన ఈ భేటీ ఆసాంతం నేతల వాదనలు, అభిప్రాయాలతో వాడీవేడీగానే జరిగినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. కొన్ని నియోజకవర్గాలపై సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడం, ఇంకొన్ని చోట్ల కుల సమీకరణాలపై ఎవరి వాదన వారే వినిపించడంతో సమావేశం హీటెక్కినట్టు పేర్కొన్నాయి. ముఖ్యంగా డోర్నకల్, మహబూబాబాద్, జూబ్లీహిల్స్, ఆసిఫాబాద్, జనగాం, నారాయణఖేడ్, ఎల్లారెడ్డి, జుక్కల్, సికింద్రాబాద్, నర్సాపూర్ నియోజకవర్గాల అభ్యర్థుల ఖరారు అంశంపై నేతలు వేర్వేరు పేర్లను సూచించినట్టు తెలిసింది. సర్వేల ఆధారంగా గెలవగలిగే వారిని ఖరారు చేయాలని కొందరు సూచిస్తే.. సీనియారిటీ, పార్టీకి పనిచేసిన అనుభవం, ఆర్థిక, కుల సమీకరణాల ఆధారంగా ఎంపిక ఉండాలని ఇంకొందరు పట్టుబట్టినట్టు సమాచారం. ఉద్యమకారులకు టికెట్లు ఇవ్వాలంటూ.. టికెట్ల కేటాయింపులో తమకు ప్రాధాన్యం ఇవ్వాలంటూ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాల నేతలు, ఉద్యమకారులు కాంగ్రెస్ వార్రూమ్ ముందు నిరసనకు దిగారు. టికెట్లు ఆశిస్తున్న కురువ విజయ్కుమార్ (గద్వాల), మానవతారాయ్ (సత్తుపల్లి), పున్నా కైలాశ్ నేత (మునుగోడు), దుర్గం భాస్కర్ (చెన్నూరు), కేతూరి వెంకటేశ్ (కొల్లాపూర్), ఇతర నేతలు అక్కడ ఆందోళన చేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన తమకు టికెట్లు ఇవ్వాలని, ఉదయ్పూర్ డిక్లరేషన్ను అమలు చేయాలని ప్లకార్డులు ప్రదర్శించారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జితేంద్రసింగ్ వారితో మాట్లాడి, అన్ని అంశాలను పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. వీలైనంత త్వరగా తొలి జాబితా: ఠాక్రే ఆదివారం రాత్రి స్క్రీనింగ్ కమిటీ భేటీ అనంతరం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్ రావ్ ఠాక్రే మీడియాతో మాట్లాడారు. పార్టీ సీఈసీ సమావేశానికి ముందు మరోమారు స్క్రీనింగ్ కమిటీ భేటీ ఉంటుందని.. వీలైనంత త్వరగా అభ్యర్థుల జాబితాను సీఈసీకి అందిస్తామని చెప్పారు. త్వరలోనే తొలి జాబితాను విడుదల చేస్తామని వెల్లడించారు. వివిధ సామాజికవర్గాల నుంచి దరఖాస్తులు వచ్చాయని, పీసీసీ నుంచి ఒక జాబితా వచ్చిందని తెలిపారు. వచ్చిన అన్ని దరఖాస్తులను స్క్రీనింగ్ కమిటీ భేటీలో పరిశీలించామని.. అన్నివర్గాలకు తగిన ప్రాతినిధ్యం ఉండేలా చూస్తున్నామని వివరించారు. అయితే టికెట్ల ఖరారులో తుది నిర్ణయం పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీదే (సీఈసీ)నని చెప్పారు. కాగా.. త్వరలో సీఈసీ సమావేశం ఉండే అవకాశం ఉందని, వారం, పది రోజుల్లో తొలి జాబితా విడుదల చేస్తామని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. తొలి జాబితాలో ఉండే అభ్యర్థులు ఇలా.. (పీసీసీ వర్గాల సమాచారం మేరకు) 1. కొడంగల్ – రేవంత్రెడ్డి 2. హుజూర్నగర్ – ఉత్తమ్కుమార్రెడ్డి 3. కోదాడ – పద్మావతి 4. మధిర – భట్టి విక్రమార్క 5. మంథని – శ్రీధర్బాబు 6. జగిత్యాల – జీవన్రెడ్డి 7. ములుగు – సీతక్క 8. భద్రాచలం – పొదెం వీరయ్య 9. సంగారెడ్డి – జగ్గారెడ్డి 10. నల్గొండ – కోమటిరెడ్డి వెంకట్రెడ్డి 11. అలంపూర్ – సంపత్కుమార్ 12. నాగార్జునసాగర్ – కుందూరు జైవీర్ రెడ్డి 13. కామారెడ్డి – షబ్బీర్ అలీ 14. పాలేరు – తుమ్మల నాగేశ్వర్రావు 15. కొత్తగూడెం – పొంగులేటి శ్రీనివాసరెడ్డి 16. పరిగి – రామ్మోహన్రెడ్డి 17. వికారాబాద్ – గడ్డం ప్రసాద్కుమార్ 18. మహేశ్వరం – చిగురింత పారిజాత నర్సింహారెడ్డి 19. ఆలేరు – బీర్ల ఐలయ్య 20. దేవరకొండ – ఎన్.బాలూనాయక్ 21. వేములవాడ – ఆది శ్రీనివాస్ 22. ధర్మపురి – అడ్లూరి లక్ష్మణ్కుమార్ 23. జడ్చర్ల – అనిరుధ్రెడ్డి 24. నాంపల్లి – ఫిరోజ్ ఖాన్ 25. కోరుట్ల– జువ్వాడి నర్సింగ్రావు 26. అచ్చంపేట – వంశీకృష్ణ 27. జహీరాబాద్ – ఎ.చంద్రశేఖర్ 28. ఆందోల్ – దామోదర రాజనర్సింహ 29. మంచిర్యాల – ప్రేమ్సాగర్రావు 30. కొల్లాపూర్ – జూపల్లి కృష్ణారావు 31. ఆదిలాబాద్ – కంది శ్రీనివాస్రెడ్డి 32. వరంగల్ ఈస్ట్ – కొండా సురేఖ 33. భూపాలపల్లి – గండ్ర సత్యనారాయణ 34. షాద్నగర్ – వీర్లపల్లి శంకర్ 35. నిజామాబాద్ అర్బన్ – ధర్మపురి సంజయ్ 36. ఎల్బీనగర్ – మధుయాష్కీగౌడ్ 37. కల్వకుర్తి– కసిరెడ్డి నారాయణరెడ్డి 38. అశ్వారావుపేట– తాటి వెంకటేశ్వర్లు 39. పటాన్చెరు – కాట శ్రీనివాస్గౌడ్ 40. సూర్యాపేట – ఆర్.దామోదర్రెడ్డి 41. గద్వాల – సరితా తిరుపతయ్య 42. నాగర్కర్నూల్ – కూచుకుళ్ల రాజేశ్రెడ్డి 43. మేడ్చల్ – తోటకూర జంగయ్య యాదవ్ 44. ముషీరాబాద్ – అంజన్కుమార్ యాదవ్ 45. శేరిలింగంపల్లి – రఘునాథ్ యాదవ్ 47. ముథోల్ – ఆనందరావు పటేల్ 48. బెల్లంపల్లి – గడ్డం వినోద్కుమార్ 49. ఇల్లెందు – కోరం కనకయ్య 50. చొప్పదండి – మేడిపల్లి సత్యం 51. నారాయణపేట – ఎర్ర శేఖర్ 52. రామగుండం – రాజ్ఠాకూర్ 53. వరంగల్ వెస్ట్ – నాయిని రాజేందర్రెడ్డి 54. గజ్వేల్ – తూంకుంట నర్సారెడ్డి 55. నిర్మల్ – శ్రీహరిరావు 56. భువనగిరి – కుంభం అనిల్కుమార్రెడ్డి 57. పెద్దపల్లి – విజయరమణారావు 58. నర్సంపేట – దొంతి మాధవరెడ్డి 59. పాలకుర్తి – హనుమాండ్ల ఝాన్సీ 60. మహబూబ్నగర్ – యెన్నం శ్రీనివాస్రెడ్డి 61. ఇబ్రహీంపట్నం – మల్రెడ్డి రంగారెడ్డి 62. ఖానాపూర్ – ఎడ్మ బొజ్జు 63. బాల్కొండ – ఆరెంజ్ సునీల్రెడ్డి 64. రాజేంద్రనగర్ – జ్ఞానేశ్వర్ ముదిరాజ్ 65. హుస్నాబాద్ – పొన్నం ప్రభాకర్ 66. తాండూర్ – వై.మనోహర్రెడ్డి 67. సిరిసిల్ల – కేకే మహేందర్రెడ్డి 68. దుబ్బాక – చెరుకు శ్రీనివాస్రెడ్డి 69. మల్కాజ్గిరి – మైనంపల్లి హన్మంతరావు 70. కంటోన్మెంట్ – వెన్నెల (గద్దర్ కుమార్తె) -
కాంగ్రెస్లో ‘సర్వే’ల పీటముడి!
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ టికెట్ల ఖరారు ప్రక్రియలో ‘సర్వే’ల అంశంతో పీటముడి పడుతోంది. సర్వేల ప్రాతిపదికగానే టికెట్లు కేటాయిస్తామని ఏఐసీసీ, టీపీసీసీ నేతలు ముందునుంచీ చెప్తూనే ఉన్నా.. అలా చేస్తే ఇబ్బందికరమేనన్న వాదన పార్టీ నేతల్లో వినిపిస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఢిల్లీలో జరిగిన స్క్రీనింగ్ కమిటీ సమావేశాల్లో 60 స్థానాలపై ఏకాభిప్రాయం వచ్చిందని, ఆయా స్థానాల్లో ఒక్కో పేరునే కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ)కి పంపాలని నేతలు నిర్ణ యించారు. మరో 30–35 సీట్లపై ఏకాభిప్రాయం రాలేదు. ఈ స్థానాల్లో సర్వేల్లో వెల్లడైన బలాబలాల ప్రకారమే అభ్యర్థులను ఖరారు చేయాలని కొందరు నేతలు ప్రతిపాదించగా.. ఈ ప్రతిపాదన సరికాదని మరికొందరు నేతలు పేర్కొంటున్నట్టు తెలిసింది. కొత్తగా వచ్చిన నాయకులను సర్వేల ఆధారంగా కొన్నిచోట్ల మాత్రమే ఖరారు చేయవచ్చని, మిగతా చోట్ల సర్వేలతోపాటు పార్టీకి విధేయత, ఇతర కోణాలనూ సరిచూసుకుని అభ్యర్థులను ఖరారు చేయాలని కోరినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో సర్వేలను పునఃపరిశీలించడంతోపాటు ఆశావహు లతో మాట్లాడి, టికెట్లు ఇవ్వలేని నేతలను బుజ్జగించేందుకు రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్రావ్ ఠాక్రే ఈనెల 25న సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు తెలిసింది. ఆ భేటీ ముగిశాక ఈ నెల 28న లేదా 29న స్క్రీనింగ్ కమిటీ మరోమారు భేటీ అవుతుందని, అది ఢిల్లీలోనే జరిగే అవకాశం ఉందని పీసీసీ వర్గాలు చెప్తున్నాయి. ఈ భేటీ తర్వాత మెజార్టీ స్థానాలపై ఏకాభిప్రాయం తీసుకుని, సీఈసీ ఆమోదంతో ఒకేసారి జంబో జాబితా విడుదల చేస్తామని అంటున్నాయి. కొంత ఆలస్యమైనా ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులను ఒకేసారి ప్రకటించడమే మేలనే అభిప్రాయంతో ఏఐసీసీ పెద్దలు ఉన్నారని వివరిస్తున్నాయి. ఈ క్రమంలో జాబితాల విడుదల వాయిదా పడే అవకాశమూ ఉందని పేర్కొంటున్నాయి. ఇక కాంగ్రెస్ టికెట్లు ఆశిస్తున్న నేతలు ఢిల్లీలో నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్యారాచూట్లకు టికెట్లా? స్క్రీనింగ్ కమిటీలో జరిగిన చర్చ ప్రకారం ప్యారాచూట్లకు ఈసారి కూడా పెద్ద సంఖ్యలోనే టికెట్లు వచ్చే అవకాశం ఉందన్న దానిపై కాంగ్రెస్లోని సీనియర్ ఆశావహులు రగిలిపోతున్నారు. ప్యారాచూట్లకు టికెట్లు ఇవ్వబోమని, పార్టీ కోసం పనిచేసిన వారికే ప్రాధాన్యమిస్తామని అగ్రనేత రాహుల్గాంధీ, టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి పలుమార్లు ప్రకటించారని గుర్తు చేస్తున్నారు. ఆ ప్రకారం దశాబ్దాలుగా పార్టీకి సేవ చేస్తున్న తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఉప్పల్, గద్వాల, దుబ్బాక, మహబూబ్నగర్, ఆసిఫాబాద్ సహా పలుచోట్ల ప్యారాచూట్లకు ఇచ్చిన ప్రాధాన్యం తమకు ఇవ్వడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి సర్వేలు ఎలా అనుకూలంగా ఉంటాయని ప్రశ్నిస్తున్నారు. పార్టీ బలంగా ఉండటంతోనే సర్వేలు అనుకూలంగా చూపుతున్నాయని.. అందువల్ల పార్టీలో ముందునుంచీ ఉన్నవారికే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. వీరేశం చేరిక వాయిదా! నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కాంగ్రెస్లో చేరే కార్యక్రమం వాయిదా పడింది. ఆయన శనివారమే రాహుల్ లేదా ఖర్గే సమక్షంలో పార్టీలో చేరుతారని భావించారు. కానీ ఆ ఇద్దరు నేతలు అందుబాటులో లేనందున వీరేశంతోపాటు వెళ్లిన ఆయన ప్రధాన అనుచరులు మాత్రం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. అయితే ఈనెల 29న హైదరాబాద్లో జరిగే కార్యక్రమంలో వీరేశంతోపాటు ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, ఆయన కుమారుడు రోహిత్ తదితరులు కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని సమాచారం. అవకాశాన్ని బట్టి అగ్రనేతలు అందుబాటులో ఉంటే ఢిల్లీలోనే చేరికల కార్యక్రమం ఉంటుందన్న చర్చ జరుగుతోంది. కాగా వికారాబాద్ జిల్లా తాండూరుకు చెందిన మున్సిపల్ మాజీ చైర్మన్ సంపత్ కుమార్, వ్యాపారవేత్త పి.శ్రీనివాస్రెడ్డి తదితరులు శనివారం ఢిల్లీలో రేవంత్ సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. -
Congress Bus Yatra in Telangana 2023: వచ్చే నెలలో కాంగ్రెస్ బస్సు యాత్ర
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ త్వరలో రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్ర చేపట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. వచ్చే నెల మొదటి వారంలో ఈ యాత్రను నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని కీలక నేతలంతా ఇందులో కలసి పాల్గొననున్నారు. ఈ మేరకు బుధవారం ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. నిజానికి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ఖరారు కోసం బుధ, గురువారాల్లో స్క్రీనింగ్ కమిటీ భేటీ జరపాలని టీపీసీసీ నిర్ణయించింది. ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో భాగంగా స్క్రీనింగ్ కమిటీ సభ్యులైన ఎంపీలు ఉత్తమ్, రేవంత్ ఢిల్లీలోనే ఉండటంతో.. అక్కడే రెండు రోజుల పాటు కసరత్తు పూర్తి చేసి.. అభ్యర్థుల షార్ట్ లిస్ట్ జాబితాను ఏఐసీసీకి ఇవ్వాలని భావించారు. కానీ మహిళా రిజర్వేషన్ బిల్లుపై లోక్సభలో జరిగిన ఓటింగ్ ప్రక్రియతో ఎంపీలు ఇద్దరూ అక్కడే ఉండిపోయారు. వారు లోక్సభ నుంచి వచ్చాక స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్, సభ్యులు ఠాక్రే, భట్టి తదితరులతో కలసి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బస్సుయాత్ర చేపట్టాలని నిర్ణయించారు. ఆరు గ్యారంటీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు బీఆర్ఎస్ పాలనా వైఫల్యాలను ఎండగట్టాలని తీర్మానించారు. అక్టోబర్ తొలివారంలో మొదలుపెట్టి, 10–12 రోజుల పాటు బస్సుయాత్ర చేపట్టాలని.. యాత్ర రూట్మ్యాప్, షెడ్యూల్ను త్వరలో ఖరారు చేయాలని నిర్ణయానికి వచ్చారు. ఇక గురువారం తిరిగి స్క్రీనింగ్ కమిటీ సమావేశమై అభ్యర్థుల ఖరారు కసరత్తు పూర్తి చేయనున్నట్టు తెలుస్తోంది. కమిటీలోకి మరో ఇద్దరు.. స్క్రీనింగ్ కమిటీలోకి మరో ఇద్దరు నాయకులను తీసుకున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదేశాల మేరకు.. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ, స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకట్రెడ్డిలను స్క్రీనింగ్ కమిటీ సభ్యులుగా నియమించినట్టు గాంధీ భవన్ వర్గాలు వెల్లడించాయి. -
మీకు మిగిలింది 100 రోజులే!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీఆర్ఎస్కు బీజేపీ, ఎంఐఎం సహా ఎవరు మద్దతుగా వచ్చినా సరే వంద రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోవడం ఖాయమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కేవలం బీఆర్ఎస్తోనే కొట్లాడటం లేదని.. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తోందని చెప్పారు. ఈ మూడు పార్టీలు కలిసే పనిచేస్తున్నాయని.. కాంగ్రెస్ను అడ్డుకునేందుకు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో ఆదివారం సాయంత్రం జరిగిన ‘కాంగ్రెస్ విజయభేరి’సభలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. అటు కేంద్రంలోని బీజేపీ, మోదీ ప్రభుత్వ విధానాలతోపాటు రాష్ట్రంలో కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పాలనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో బీజేపీ విస్తరింపజేస్తున్న హింసను, విద్వేషాన్ని అడ్డుకుని ప్రేమను పంచేందుకు తాము ‘విద్వేషపు మార్కెట్లో ప్రేమ దుకాణం’ తెరిచామని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది తామేనని.. ఆ వెంటనే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని ప్రకటించారు. విజయభేరి సభలో రాహుల్ గాంధీ ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘‘బీఆర్ఎస్ అంటే బీజేపీ రిష్తేదార్ (బంధువుల) సమితి. పార్లమెంటులో బీజేపీకి అవసరమైన ప్రతీ సందర్భంలో బీఆర్ఎస్ మద్దతు పలకడం నా కళ్లతో చూశాను. కిసాన్ బిల్లులు, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలు, జీఎస్టీ తదితరాలపై నరేంద్ర మోదీ ఒక్క సైగతోనే బీఆర్ఎస్ మద్దతు పలికింది. ఈ రోజు తుక్కుగూడ బహిరంగ సభ జరుపుతుంటే ఆ మూడు పార్టీలు ఒకేసారి సభలు నిర్వహించి కాంగ్రెస్కు అంతరాయం కలిగించాలనుకున్నారు. కానీ తెలంగాణలో కాంగ్రెస్ బలంగా ఉండటం వల్ల మా బహిరంగ సభ విజయవంతమైంది. రాజకీయాల్లో ఎవరితో కొట్లాడుతున్నామో, మనకు వ్యతిరేకంగా నిలిచే శక్తులేంటో పూర్తి అవగాహనతో ఉండాలి. ఆరు గ్యారంటీ పథకాల పోస్టర్లను ఆవిష్కరిస్తున్న రాహుల్ గాంధీ, ఖర్గే. చిత్రంలో మధుయాష్కీ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, దామోదర రాజనర్సింహ, అశోక్ గెహ్లోత్, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, రేవంత్రెడ్డి, సుబ్బరామిరెడ్డి, కేసీ వేణుగోపాల్, ఠాక్రే, భట్టి విక్రమార్క, పొన్నాల లక్ష్మయ్య, జీవన్రెడ్డి తదితరులు కేసీఆర్పై కేసులు పెట్టడం లేదేం? కాంగ్రెస్ను అడ్డుకునేందుకు కొత్త మార్గాల కోసం బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం మూడు పార్టీలు పరస్పరం ఫోన్లు చేసుకుంటాయి. మేం ఎక్కడ బీజేపీతో కొట్లాడుతామో ఆయా రాష్ట్రాలకు ఎంఐఎం వచ్చి అంతరాయం కలిగిస్తుంది. ఈ మూడు పార్టీలు భాగస్వాములుగా మారి ప్రజలకు నష్టం చేస్తున్నాయి. ఈడీ, సీబీఐ, ఐటీ వంటి సంస్థలను అడ్డు పెట్టుకుని ప్రతిపక్ష నేతలపై కేసులు నమోదు చేస్తు న్న మోదీ ప్రభుత్వం.. అవినీతిలో అన్ని రికార్డులు బద్దలుకొట్టిన కేసీఆర్కు వ్యతిరేకంగా ఒక్క కేసూ పెట్టడం లేదేం? ఎంఐఎం నేతలపైనా ఎలాంటి కేసులు పెట్టడం లేదేం? కేవలం విపక్షాలపైనే దాడులు ఎందుకు జరుగుతున్నాయి? కేసీఆర్ను, ఎంఐఎంను తనవారిగా భావిస్తున్నందునే ప్రధాని మోదీ వారిపై ఎలాంటి కేసులు నమోదు చేయడం లేదు. ఒక్క కుటుంబం కోసం ఇవ్వలేదు కేసీఆర్ లాభం కోసం, ఒక్క కుటుంబం కోసం మేం తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వలేదు. పేదలు, రైతులు, మహిళలు, కూలీల కోసం తెలంగాణ ఇచ్చాం. కానీ ఇక్కడ అన్ని ప్రయోజనాలు సీఎం కుటుంబానికే అందుతున్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల గురించి ఆలోచిస్తుంది. ఎన్ని అవాంతరాలు వచ్చినా ఇచ్చిన మాటకు కట్టుబడి సోనియా తెలంగాణ ఇచ్చారు. ఇటీవలే పొరుగు రాష్ట్రం కర్ణాటకలో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను కూడా కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నెరవేర్చింది. తెలంగాణలో ఇచ్చిన ఆరు హామీలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే అమలు చేస్తాం’’ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నా కల: సోనియా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూడటం తన కల అని, తెలంగాణలోని అన్ని వర్గాల కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ చెప్పారు. కాంగ్రెస్కు ప్రజలంతా మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ఆదివారం తుక్కుగూడ విజయభేరి సభలో సోనియాగాంధీ మాట్లాడారు. కాంగ్రెస్ గ్యారంటీల్లో ఒకటైన ‘మహాలక్ష్మి’ పథకాన్ని ప్రకటించిన ఆమె.. కొన్ని నిమిషాల్లోనే తన ప్రసంగాన్ని ముగించారు. ‘‘నా సహచర నేతలతో కలసి తెలంగాణ వంటి గొప్ప రాష్ట్రానికి జన్మనివ్వడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ రాష్ట్రాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లడం ఇప్పుడు మా విధి. ఈ చారిత్రక దినోత్సవ సందర్భంలో మీతో ఉన్నందుకు ఎంతో సంతోషిస్తున్నాను. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఆరు గ్యారంటీలు ఇస్తున్నాం. అందులో ‘మహాలక్ష్మి’ పథకం మొదటిది. తెలంగాణ సోదరీమణులకు సాధికారత కల్పించే ఈ ప్రకటన చేస్తున్నందుకు ఎంతో సంతోషిస్తున్నా. ‘మహాలక్ష్మి’ పథకం ద్వారా మహిళలకు ప్రతీ నెలా రూ.2,500 ఆర్థిక సాయం అందిస్తాం, రూ.500కే వంట గ్యాస్ సిలిండర్ను ఇవ్వబోతున్నాం. మహిళలకు ఆర్టీసీ బస్సులలో రాష్ట్రవ్యాప్తంగా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం’’ అని సోనియా హామీ ఇచ్చారు. తెలంగాణ సోదర సోదరీమణులారా అంటూ ప్రసంగం ప్రారంభించిన సోనియా.. ‘జై హింద్.. జై తెలంగాణ’ నినాదంతో ముగించారు. ప్రజల సొమ్మంతా కేసీఆర్ కుటుంబం చేతిలోకి.. దేశంలో అదానీ లబ్దికోసం మోదీ ప్రభుత్వం పనిచేస్తోంది. ఈ విషయాన్ని లోక్సభలో మాట్లాడినందుకు నా పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేశారు. ఇక్కడ సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వ సొమ్మును తన కుటుంబానికి కట్టబెడుతున్నారు. కేసీఆర్ తన మద్దతుదారు కాబట్టే ఇక్కడ జరుగుతున్న అవినీతిపై మోదీ విచారణ జరిపించడం లేదు. కేసీఆర్ ప్రభుత్వం ఏళ్లుగా ప్రజల సొమ్మును దోపిడీ చేస్తోంది. కాళేశ్వరంలో రూ.లక్ష కోట్ల దోపిడీ జరిగింది. ధరణి పోర్టల్ తెచ్చి ప్రజలు, దళితుల భూములు లాక్కున్నారు. రైతుబంధుతో పెద్ద రైతులకే లాభం జరుగుతోంది. పేదలకు ఇళ్లు నిర్మించలేదు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్లను లీక్ చేశారు, 2 లక్షల ఉద్యోగ ఖాళీల భర్తీ ఊసే లేదు. ఇవన్నీ ప్రజల సొమ్మును దోపిడీ చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం ఎంచుకున్న మార్గాలు. మేం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజల సొమ్మును వాపస్ చేస్తాం. -
T Congress: అంతా హైకమాండ్ కంట్రోల్లోకి..
సాక్షి, హైదరాబాద్: ఎన్నికలు తరుముకొస్తున్న వేళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలన్నింటినీ ఏఐసీసీ హ్యాండోవర్ చేసుకుందా? ఈసారి తెలంగాణలో గెలుపు అవకాశాలున్నాయనే అంచనాల నేపథ్యంలో టీపీసీసీకి సంబంధించిన కీలక నిర్ణయాలన్నీ ఢిల్లీలోనే జరుగుతున్నాయా? రాష్ట్ర పార్టీ నేతల అభిప్రాయాలను గౌరవిస్తున్నామన్న భావన కల్పిస్తూనే చేయాల్సిందంతా అధిష్టానమే చేస్తోందా? తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోని తాజా పరిణామాలను గమనిస్తే.. అవుననే సమాధానమే వస్తోంది. పార్టీ కమిటీల ఏర్పాటు నుంచి టికెట్ల కేటాయింపు వరకు అంతా ఢిల్లీ కనుసన్నల్లోనే జరిగేలా ప్రణాళిక అమలవుతోందని, ఇటీవలి అన్ని పరిణామాలు టీపీసీసీకి పూర్తిస్థాయిలో సమాచారం లేకుండానే జరిగాయనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది. తెలంగాణ పార్టీలో ఉన్న కుమ్ములాటలు పుట్టి ముంచుతాయనే అభిప్రాయానికి వచ్చిన టెన్ జన్పథ్ వర్గాలు పూర్తిస్థాయిలో తెలంగాణ వ్యవహారాలను స్వయంగా పర్యవేక్షిస్తున్నాయని, అప్పుడప్పుడూ బెంగళూరు నుంచి అందే సంకేతాలు కూడా ఏఐసీసీ నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నాయని అంటున్నారు. రాష్ట్ర నాయకత్వానికి తెలియకుండానే.. రాష్ట్రాల్లోని ఇతర పార్టీల విషయంలో అవలంబించాల్సిన వైఖరిపై జాతీయ పార్టీలు సాధారణంగా ఆయా రాష్ట్రాల్లోని పార్టీ నేతల అభిప్రా యాలు తీసుకుంటాయి. కాంగ్రెస్ పార్టీ లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. కానీ వైఎస్సార్టీపీ నేత షర్మిలతో చర్చలు, వచ్చే ఎన్ని కల్లో కమ్యూనిస్టు పార్టీలతో పొత్తుల గురించి ఢిల్లీలో నిర్ణయం తీసుకున్న తర్వాతే రాష్ట్ర పార్టీ నేతలకు తెలియడం గమనార్హం. షర్మిల బెంగళూరులో డి.కె.శివకుమార్ను కలిసినప్పటి నుంచే ఆమె కాంగ్రెస్లో చేరతారన్న దానిపై ఊహాగానాలు సాగినప్పటికీ, దీనిపై నామమాత్రంగా కూడా రాష్ట్ర పార్టీ నేతలతో ఢిల్లీ పెద్దలు చర్చించకపోవడం గమనార్హం. మరోవైపు ఇండియా కూటమిలో భాగస్వాములైన సీపీఐ, సీపీఎం పార్టీలతో వచ్చే ఎన్నికల్లో పొత్తు గురించి కూడా రాష్ట్ర పార్టీ అభిప్రాయంతో పనిలేకుండా ఏఐసీసీయే రంగంలోకి దిగింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఠాక్రే కమ్యూనిస్టు పార్టీలతో చర్చలు జరిపిన తర్వాతే విషయం రాష్ట్ర నాయకత్వానికి తెలిసింది. ఇటీవల జరిగిన సంస్థాగత కమిటీల ఏర్పాటు విషయంలో కూడా తెలంగాణ నాయకత్వానికి తెలియకుండానే నిర్ణయాలు జరిగిపోవడం గమనార్హం. పార్టీలో అత్యున్నత విధాన నిర్ణాయక మండలి అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)లో తెలంగాణ నుంచి ఎవరికి అవకాశం వస్తుందన్న దానిపై అనేక ఊహాగానాలు వచ్చాయి. ఫలానా నేతను టీపీసీసీ సిఫారసు చేసిందనే సమాచారం కూడా బయటకు వచ్చింది. కానీ ఎన్నడూ చర్చ జరగని ఇద్దరు నేతలకు అనూహ్యంగా సీడబ్ల్యూసీలో చోటు దొరికింది. తమ పేర్లు ఎందుకు రాలేదా అని రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్లు ఆరా తీస్తున్న సమయంలోనే వారికి మరో షాక్ తగిలింది. కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ)ని ప్రకటించిన అధిష్టానం రాష్ట్ర పార్టీతో సంబంధం లేకుండానే తెలంగాణ నుంచి ఒకరికి అవకాశం కల్పించింది. అంతకంటే ముందు ఏర్పాటు చేసిన పార్టీ స్క్రీనింగ్ కమిటీలోనూ గతంలో ఎన్నడూ లేని విధంగా పీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ నేతతో పాటు మరో నేతను నియమించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ‘సీడబ్ల్యూసీ’పై పీఈసీలో తీర్మానం! గతంలో ఎన్నడూ లేని విధంగా సీడబ్ల్యూసీ సమావేశాలను హైదరాబాద్లో నిర్వహిస్తున్నారు. అయితే వీటి నిర్వహణ విషయంలోనూ అధిష్టానమే నిర్ణయం తీసుకుని టీపీసీసీకి సమాచారం ఇచ్చిందని అంటున్నారు. ఆ సమాచారం మేరకే సీడబ్ల్యూసీ సమావేశాలతో ఎలాంటి సంబంధం లేని ప్రదేశ్ ఎన్నికల కమిటీ (పీఈసీ) సమావేశంలో.. సీడబ్ల్యూసీ సమావేశాలు రాష్ట్రంలో నిర్వహించాలనే తీర్మానం చేశారనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది. ఈ తీర్మానం తర్వాత ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ఒకసారి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డితో సమావేశాల నిర్వహణపై ఆరా తీశారు. ఆ తర్వాత ఉన్నట్టుండి సీడబ్ల్యూసీ సమావేశాల షెడ్యూల్ను ఏఐసీసీ ప్రకటించింది. అలాగే ఈనెల 18న సీడబ్ల్యూసీ సభ్యులు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నాయకులు తెలంగాణ వ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటిస్తారన్న విషయాన్ని కూడా నేరుగా అధిష్టానమే ప్రకటించింది. కేవలం సోనియాగాంధీ పాల్గొనే సభ, ఆ సభలో ప్రకటించాల్సిన ఐదు గ్యారంటీ కార్డు స్కీంల గురించి మాత్రమే టీపీసీసీకి ముందస్తు సమాచారం ఉందని, మిగిలిన అంశాల్లో ఏఐసీసీ నిర్ణయం తీసుకుని టీపీసీసీకి చేరవేసిందనే చర్చ జరుగుతోంది. ఎందుకిలా? తెలంగాణ వ్యవహారాలను పూర్తిగా అధిష్టానం టేకోవర్ చేయడంపై గా>ంధీభవన్ వర్గాల్లో పలు రకాల చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర పార్టీ నేతల మధ్య పాతుకుపోయిన అనైక్యత ఇప్పట్లో సర్దుకునే అవకాశం లేదనే భావనతోనే ఏఐసీసీ రంగంలోకి దిగిందనే చర్చ జరుగుతోంది. ప్రతి చిన్న పరిణామంపైనా తీవ్రమైన విమర్శలు, ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అన్ని విషయాలపై హస్తినలో నిర్ణయం తీసుకున్న తర్వాతనే టీపీసీసీకి సమాచారం ఇస్తున్నారని కొందరు నేతలు విశ్లేషిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో గ్రూపు గొడవలు, భిన్నాభిప్రాయాలు సహజమే అయినా గతంలో ఎన్నడూ లేని విధంగా ఇవి తారస్థాయికి చేరాయని, ఎన్నికల్లో గెలుపు అంచనాలున్న పరిస్థితుల్లో తాము రంగంలోకి దిగడమే మంచిదనే నిర్ణయానికి అధిష్టానం వచ్చిందని అంటున్నారు. మరోవైపు రాష్ట్ర పార్టీలో జరుగుతున్న ప్రతి చిన్న పరిణామంపైనా ఢిల్లీకి నివేదికలు వెళుతున్నాయని, ఈ నివేదికల నేపథ్యం కూడా ఏఐసీసీ ఆజమాయిషీకి కారణమని తెలుస్తోంది. -
చెరొక్కటి మాత్రమే..!
-
‘కొడవలి’తో కుదిరేనా?
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ నుంచి విడిపోయిన ఉభయ కమ్యూనిస్టు పార్టీలను వచ్చే ఎన్నికల్లో తమతో కలుపుకోవడంపై కాంగ్రెస్ పారీ్ట ఊగిసలాటలో ఉంది. సీపీఎం, సీపీఐలతో కలసి వెళ్లడంపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మెజార్టీ నేతలు పొత్తులు వద్దనే అభిప్రాయంతో ఉండగా, పార్టీ హైకమాండ్ మాత్రం అందుకు భిన్నంగా ఆలోచన చేస్తోంది. జాతీయ స్థాయిలో ఏర్పడిన ఇండియా కూటమిలో కాంగ్రెస్, లెఫ్ట్ భాగస్వాములైన కారణంగా రాష్ట్ర స్థాయిలోనూ దోస్తీ కొనసాగించాలని రెండు పక్షాల హైకమాండ్లు భావిస్తున్నాయి. రాష్ట్రంలోని ఉభయ కమ్యూనిస్టు పారీ్టలు కూడా కాంగ్రెస్తో కలిసి పనిచేసేందుకు సంసిద్ధతను వ్యక్తం చేస్తున్నాయి. కానీ మెజార్టీ కాంగ్రెస్ నేతలు మాత్రం గతంలోలా ఓట్ల బదిలీ జరిగే అవకాశం లేదని అందువల్ల ఒంటరి పోటీయే మంచిదనే అభిప్రాయంతో ఉన్నారు. జాతీయ స్థాయిలోనే ప్రతిపాదనలు లెఫ్ట్, కాంగ్రెస్ల మధ్య పొత్తు వ్యవహారం ఇంకా కింది స్థాయికి రాలేదని, ఇప్పటిరకు ఏఐసీసీ, లెఫ్ట్ పారీ్టల జాతీయ నాయకత్వం స్థాయిలోనే ఈ ప్రతిపాదన ఉందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్రావ్ ఠాక్రే ఇరు కమ్యూనిస్టు పార్టీల రాష్ట్ర నేతలతో ఫోన్లో మాట్లాడారని వివరిస్తున్నాయి. ‘వారు మాట్లాడుకున్న తర్వాత వ్యవహారం రాష్ట్ర పారీ్టల వరకు వస్తుంది. అప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం.’ అని టీపీసీసీకి చెందిన ముఖ్య నేత ఒకరు వ్యాఖ్యానించారు. మరోవైపు రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈసారి ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలు ఎన్ని స్థానాల్లో ఏ మేరకు ప్రభావితం చూపుతాయన్న దానిపై కూడా కాంగ్రెస్ నేతలు అంచనాలు వేస్తున్నారు. రాష్ట్రంలో లెఫ్ట్ పారీ్టల ప్రభావం బాగా తగ్గిపోయిందని, 10–15 చోట్ల అంతోఇంతో ఓటుబ్యాంకు ఉందని, నాలుగైదు చోట్ల మాత్రం గెలుపోటములను ప్రభావితం చేయవచ్చని భావిస్తున్నారు. ఆ ఆరూ.. అసాధ్యమే ఇతర పార్టీలతో పొత్తు కుదరితే ఏయే అసెంబ్లీ స్థానాలు అడగాలన్న దానిపై సీపీఎం, సీపీఐ నేతలు ఇప్పటికే ఓ అభిప్రాయానికి వచ్చారు. పార్టీ రాష్ట్ర కమిటీల్లో చర్చించిన అనంతరం ఈ సీట్లపై ఏకాభిప్రాయం కూడా వచ్చినట్టు తెలుస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరు, భద్రాచలం, మధిర, ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నకిరేకల్, మిర్యాలగూడతో పాటు రంగారెడ్డి జిల్లా పరిధిలోనికి వచ్చే ఇబ్రహీంపట్నం స్థానాల్లో పోటీ చేయాలనే ఆలోచనతో సీపీఎం ఉంది. అయితే ఈ ఆరు స్థానాల్లో ఒక్క స్థానం వదులుకోవడం కూడా సాధ్యం కాదనే అభిప్రాయం కాంగ్రెస్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. మధిర, భద్రాచలంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలుండగా, పాలేరులో గతంలో కాంగ్రెస్ గెలిచింది. ఇక ఇబ్రహీంపట్నంలో మల్రెడ్డి రంగారెడ్డి, మిర్యాలగూడలో బత్తుల లక్ష్మారెడ్డి, కుందూరు రఘువీర్రెడ్డి లాంటి బలమైన నేతలున్నారు. నకిరేకల్లో మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం పోటీ చేస్తారనే ప్రచారం ఉంది. దీంతో సీపీఎం అడిగే ఈ ఆరుస్థానాల విషయంలోనూ చిక్కుముడి ఏర్పడే అవకాశం ఉందని అంటున్నారు. అతికష్టంగా ఆ ఒక్కచోట..! సీపీఐ ఐదు సీట్లలో పోటీ చేయాలని భావిస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, వైరా, నల్లగొండ జిల్లా మునుగోడు, మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి, సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ స్థానాలపై ఆ పార్టీ దృష్టి ఉంది. కాంగ్రెస్తో చర్చల్లో ఈ స్థానాలను అడిగే అవకాశాలున్నాయి. అయితే కొత్తగూడెం స్థానాన్ని సీపీఐకీ కాంగ్రెస్ ఇచ్చే అవకాశం లేదు. వైరాలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరోక్ష మద్దతుతో గెలిచిన ఎమ్మెల్యే రాములు నాయక్ బీఆర్ఎస్లో చేరారు. దీంతో అక్కడ పోటీకి రాందాస్ నాయక్తో పాటు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వర్గానికి చెందిన విజయాబాయి పోటీ పడుతున్నారు. కాబట్టి ఈ స్థానాన్ని సీపీఐకి ఇవ్వడం కుదరదని కాంగ్రెస్ వర్గాలంటున్నాయి. బెల్లంపల్లిలో మాజీ మంత్రి గడ్డం వినోద్, హుస్నాబాద్లో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్లు బరిలో ఉండే అవకాశం ఉంది కాబట్టి ఆ రెండు స్థానాలను వదులుకోవడం కూడా కాంగ్రెస్కు కష్టమే. ఇక మిగిలిన మునుగోడులోనే సీపీఐని సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. మునుగోడులో 2018 ఎన్నికల్లో గెలిచినా, ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. ఈసారి ఈ స్థానాన్ని పాల్వాయి స్రవంతి, పున్నా కైలాశ్నేత, చల్లమల్ల కృష్ణారెడ్డి ఆశిస్తున్నారు. అయితే అక్కడ బీఆర్ఎస్, బీజేపీల మధ్య తీవ్ర పోటీ ఉండే అవకాశముంది. దీంతో ఒకవేళ ఇస్తే మునుగోడునే సీపీఐకి ఇవ్వాల్సి వస్తుందని మెజారిటీ కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. అయితే వామపక్షాలతో చర్చలకు వెళ్లి పొత్తు కుదుర్చుకోవాల్సి వస్తే మాత్రం కనీసం చెరో రెండు సీట్లను వదులుకోవాల్సి ఉంటుందని, దానివల్ల పారీ్టకి నష్టమే జరుగుతుంది తప్ప ఎలాంటి లాభం ఉండదనేది కొందరి అభిప్రాయంగా ఉంది. ఆ రెండు సీట్లు అసలు కుదరవు? ఉభయ కమ్యూనిస్టు పార్టీల సారథులు తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావులు పోటీ చేయాలని భావిస్తున్న పాలేరు, కొత్తగూడెం స్థానాలపై పీటముడి పడే అవకాశం ఉందని, ఆ రెండు సీట్లు వదులుకోవడం కాంగ్రెస్ పారీ్టకి సాధ్యం కాదనే అభిప్రాయం వినిపిస్తోంది. పాలేరు, కొత్తగూడెంలలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని, స్థానిక ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లోకి వెళ్లినా ఆ రెండు చోట్లా 2018లో కాంగ్రెస్ పార్టీ విజయఢంకా మోగించిందని, అలాంటప్పుడు ఆ సీట్లను ఎలా వదులుకుంటామని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ‘పొత్తులపై చర్చలు జరిగితే సీపీఐ, సీపీఎంలు ఆ రెండు సీట్లపైనే పట్టుపట్టడం ఖాయం. కానీ మేం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రెండు స్థానాలు ఇవ్వలేం. అందువల్ల చర్చలకు వెళ్లకపోవడమే మంచిదేమో..’ అని కాంగ్రెస్ కీలక నేత ఒకరు వ్యాఖ్యానించారు. ‘ఈసారి ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ జిల్లాల నుంచే మేం మెజార్టీ సీట్లు గెలుస్తామని అనుకుంటున్నాం. అక్కడ నాయకత్వం బాగా కష్టపడి పార్టీని నిలబెట్టింది. అలాంటి చోట్ల సీట్లు కమ్యూనిస్టులకు ఇస్తామంటే స్థానిక నాయకత్వం ఎలా స్పందిస్తుందో తెలియదు. కాబట్టి ఆచితూచి ముందుకెళ్లాలని భావిస్తున్నాం.’ అని మరో ముఖ్యనేత చెప్పారు. -
ఎన్నికల నేపథ్యంలో దూకుడు పెంచిన టీకాంగ్రెస్
-
నేడు ఖమ్మంలో టీ-కాంగ్రెస్ జనగర్జన సభ
-
టీకాంగ్రెస్ నేతలకు ఇంచార్జీ మాణిక్ రావ్ ఠాక్రే హెచ్చరిక
-
టీ-కాంగ్రెస్ లో ట్రోలింగ్ పంచాయతీ కంటిన్యూ
-
ఉద్రిక్తంగా మారిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర
-
అక్కడ మార్చాల్సింది ఇంచార్జుల్ని కాదనుకుంటా సార్..!
అక్కడ మార్చాల్సింది ఇంచార్జుల్ని కాదనుకుంటా సార్..! -
సునీల్ కనుగోలుకు హైకోర్టులో చుక్కెదురు
హైదరాబాద్: కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో తెలంగాణ కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలుకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. సైబర్ క్రైం పోలీసుల ఎదుట హాజరు కావాల్సిందేనని సునీల్ కనుగోలుకు ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. పోలీసుల విచారణకు సహకరించాలని మంగళవారం విచారణ సందర్భంగా హైకోర్టు పేర్కొంది. ఈ నెల8వ తేదీన విచారణకు హాజరు కావాలని సునీల్ కనుగోలును తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. కాగా, తెలంగాణ గళం పేరుతో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయిన మీమ్స్ వీడియోల కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఆ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలుకు సిటీ సైబర్క్రైమ్ పోలీసులు ఇటీవల నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. సీఆర్పీసీ 41 (ఏ) కింద పోలీసులు నోటీసులు ఇచ్చారు. తుకారాంగేట్ ప్రాంతానికి చెందిన ప్రైవేట్ ఉద్యోగి ఆర్.సామ్రాట్ ఫిర్యాదుతో గతేడాది నవంబర్ 24న హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. దీని దర్యాప్తులో లభించిన క్లూ ఆధారంగా పోలీసులు ఈ నెల 13న రాత్రి మాదాపూర్లోని మైండ్షేర్ యునైటెడ్ ఫౌండేషన్లో ఉన్న కార్యాలయంపై దాడి చేశారు. అప్పుడే ఇది కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్గా తెలిసింది. అక్కడ పట్టుబడిన ముగ్గురి విచారణలో సునీల్ కనుగోలు పేరు వెలుగులోకి వచ్చింది. విచారణకు రాకపోతే అరెస్టు సహా ఇతర చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పోలీసులు స్పష్టం చేశారు. దీనిపై హైకోర్టుకు వెళ్లారు సునీల్ కనుగోలు. 41 ఏ సీఆర్పీసీ సెక్షన్ కింద ఇచ్చిన నోటీసుపై స్టే ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈరోజు(మంగళవారం) విచారణ జరిపిన హైకోర్టు..కచ్చితంగా పోలీసుల ఎదుట విచారణకు హాజరు కావాలని స్పష్టం చేసింది. అదే సమమంలో సునీల్ కనుగోలును అరెస్ట్ చేయవద్దని పోలీసుల్ని ఆదేశించింది. -
నేనే వార్ రూమ్ ఇన్చార్జిని: మల్లు రవి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహంలో భాగంగా ఏర్పాటు చేసిన ‘వార్ రూమ్’కు తానే ఇన్చార్జినని ఆ పార్టీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి స్పష్టం చేశారు. 2023 ఎన్నికల కోసం ఈ వార్ రూమ్ను ఏర్పాటు చేశామని తెలిపారు. అక్కడ జరిగే ప్రతీ రాజకీయ వ్యవహారం తన పర్యవేక్షణలోనే జరుగుతుందని పేర్కొంటూ.. తెలంగాణ గళం ఫేస్బుక్ పేజీతో ముడిపడి ఉన్న వార్ రూమ్ కేసుకు సంబంధించి ఆయన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు లేఖ రాశారు. ఈ విషయం పోలీసులకు తెలిసినప్పటికీ కేసులో తన వాంగ్మూలం నమోదు చేయడానికి బదులు సంబంధం లేని వ్యక్తులను విచారణకు పిలుస్తున్నారని పేర్కొన్నారు. తమ వార్ రూమ్లో పని చేస్తున్న ముగ్గురు యువకులను అకారణంగా నిర్బంధించారని ఆరోపించారు. దర్యాప్తు సంస్థకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. సీబీఐ విచారణకు పిటిషన్ వేస్తాం: ఎమ్మెల్యేలకు ఎర కేసులో తాము కూడా ఇంప్లీడ్ అవుతామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ కేసు విషయంలో న్యాయ నిపుణులను సంప్రదించిన అనంతరం తమ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో చేరడాన్ని కూడా సీబీఐ చేత విచారణ జరిపించాలని కోరుతామని, ఈ మేరకు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని మల్లు రవి వెల్లడించారు. శుక్రవారం గాంధీభవన్లో పార్టీ నేతలు సిరిసిల్ల రాజయ్య, రాములు నాయక్, బెల్లయ్య నాయక్, పున్నా కైలాశ్లతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఒక పార్టీ ఇంకో పార్టీలో విలీనమైన ఘటనలు ఉన్నాయి కానీ ఒక పార్టీ శాసనసభాపక్షం మరో పార్టీలో విలీనం అయినట్టు చరిత్రలో లేదని అన్నారు. హస్తం గుర్తు మీద గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలకు లబ్ధి చేకూర్చి, పదవులు ఇచ్చి బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారని ఆరోపించారు. దీనిపై విచారణ జరపాలని తాము డిమాండ్ చేస్తున్నామని, ఈ మేరకు సీబీఐ, ఈడీ, ఏసీబీలకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. తమ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరి లబ్ధి పొందిన విషయంలో అన్ని ఆధారాలను సేకరించామని, ఈ ఆధారాలతో కోర్టుకు వెళతామని మల్లురవి వెల్లడించారు. -
ఇదీ తెలంగాణ కాంగ్రెస్ సంగతి!
సాక్షి, న్యూఢిల్లీ: ఇటీవల ప్రకటించిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ)ల నియామకాలపై సీనియర్లు లేవనెత్తిన అభ్యంతరాలు, విమర్శలు ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్గాంధీ దృష్టికి వెళ్లాయి. హరియాణాలోని ఖేర్లీలాలా వద్ద రాహుల్ భారత్ జోడో యాత్రలో పాల్గొన్న రేవంత్రెడ్డి ఆయనతో కలిసి కొద్దిసేపు నడిచారు. ఈ సందర్భంగా టీపీసీసీ వ్యవహారాలపై ఆయనతో మాట్లా డారు. తనతోపాటు పార్టీలోకి వచ్చిన నేతలు 15 మందికి మించి ప్రస్తుత కమిటీలలో లేరని, ఈ నియామకాల్లో ఆయానేతలు సిఫారసు చేసిన పేర్లను పరిగణనలోకి తీసుకున్నామని రాహుల్కు వివరించినట్లుగా తెలిసింది. ఈ విషయంలో ఇప్పటికే అధిష్టాన దూతగా వచ్చిన సీనియర్ నేత దిగ్విజయ్ కాంగ్రెస్ నేతల మధ్య సయోధ్యకు చేసిన ప్రయత్నాలు వారి మధ్య ప్రస్తావనకు వచ్చినట్లుగా సమాచారం. ఇదే సమయంలో ఏఐసీసీ దేశవ్యాప్తంగా తలపెట్టిన ‘హాత్ సే హాత్ జోడో’యాత్రపైనా ఇద్దరి నేతలు చర్చించుకున్నట్లు తెలిసింది. దీంతోపాటే జనవరి 26 నుంచి తాను తలపెట్టిన ‘యాత్ర ఫర్ చేంజ్’ పాదయాత్రపైనా రేవంత్ వివరణ ఇచ్చినట్లుగా సమాచారం. దీనికి రాహుల్ నుంచి గ్రీన్సిగ్నల్ వచ్చినట్లుగా తెలుస్తోంది. అనంతరం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో జరిగిన అన్ని రాష్ట్రాల పీసీసీ, సీఎల్పీ నేతల భేటీలోనూ రేవంత్ పాల్గొన్నారు. ఈ భేటీకి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఏపీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు సైతం హాజరయ్యారు. ఇందులో రేవంత్ పాదయాత్ర అంశం ప్రస్తావనకు తెచ్చారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను, ప్రధాని మోదీ నియంతృత్వాన్ని ఈ యాత్ర ద్వారా ఎండగట్టే అంశాల ప్రణాళికను ఏఐసీసీ భేటీలో వివరించినట్లు తెలిసింది. జనవరి 2, 3 తేదీల్లో శిక్షణాతరగతులు: రేవంత్ హాత్ సే హాత్ జోడో యాత్ర, యాత్ర ఫర్ చేంజ్ అంశాలు ఏఐసీసీ భేటీలో ప్రస్తావనకు వచ్చాయని, ఈ కార్యక్రమాలను విజయవంతం చేసేలా కొత్త కార్యవర్గానికి జనవరి 2, 3 తేదీల్లో శిక్షణా తరగ తులు నిర్వహిస్తామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ప్రకటించారు. యాత్రల్లో ప్రస్తావించాల్సిన అంశాలు, రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలపై కార్య వర్గానికి దిశానిర్దేశం చేస్తామన్నారు. ఐఏసీసీ భేటీ ముగిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ యాత్రల ద్వారా తెలంగాణలో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో విఫలమైన కేసీఆర్ తీరును, దేశ రక్షణ విషయంలో ప్రధాని మోదీ విధానాలను ఎండగడతామని స్పష్టం చేశారు. కరోనా పేరు చెప్పి రాహుల్ భారత్ జోడో యాత్రను ఆపాలని చూడటంపై రేవంత్ ఆగ్ర హం వ్యక్తం చే శారు. యాత్ర విజయవంతాన్ని చూసి ప్రధాని నరేంద్ర మోదీ భయపడు తున్నా రని ఎద్దేవా చేశారు. రాహుల్ యాత్రకు సంఘీభావంగా కాంగ్రెస్ ఎంపీలు అందరం శనివారం యాత్రలో పాల్గొంటామని తెలిపారు. -
సర్దుకుపోదాం రండి!.. టీపీసీసీ నేతలతో దిగ్విజయ్ భేటీ
సాక్షి, హైదరాబాద్/ న్యూఢిల్లీ: రాష్ట్ర కాంగ్రెస్ నేతల అంతర్గత సమస్యలను పరిష్కరించేందుకు అధిష్టానం దూతగా సీనియర్ నేత దిగ్విజయ్సింగ్ హైదరాబాద్ వచ్చారు. బుధవారం రాత్రి 8:30 గంటల సమయంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు ఏఐసీసీ కార్యదర్శి, ఎమ్మెల్యే శ్రీధర్బాబు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు మహేశ్కుమార్గౌడ్, అంజన్ కుమార్, పార్టీ ముఖ్య నేతలు హర్కర వేణుగోపాల్రావు, సంగిశెట్టి జగదీశ్ తదితరులు స్వాగతం పలికారు. దిగ్విజయ్ నేరుగా తాజ్ కృష్ణా హోటల్కు చేరుకున్నారు. అక్కడ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆయన్ను కలిశారు. కాగా గురువారం ఉదయం 11 గంటల నుంచి గాంధీభవన్లో దిగ్విజయ్ రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో విడివిడిగా భేటీ కానున్నారు. పీసీసీ డెలిగేట్ల నియామకం నుంచి పీసీసీ కమిటీల ఏర్పాటు, రేవంత్ రెడ్డితో సీనియర్ల సమన్వయం, పార్టీ నేతల మధ్య నెలకొన్న విభేదాలకు గల కారణాలపై వారితో చర్చించనున్నారు. ఈ భేటీ అనంతరం నాలుగున్నర గంటల సమయంలో దిగ్విజయ్ మీడియాతో మాట్లాడనున్నట్లు గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే సమాచార సేకరణ తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితిపై దిగ్విజయ్ సింగ్ ఇప్పటికే కొంత సమాచారాన్ని సేకరించారు. హైదరాబాద్ బయలుదేరడానికి ముందే ఢిల్లీలో ఏఐసీసీ ఇన్చార్జి కార్యదర్శులు నదీమ్ జావెద్, బోసురాజుతో సమావేశమయ్యారు. పార్టీలో విభేదాలకు గల కారణాలపై ఆరా తీశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డితో సీనియర్లకు పొసగకపోవడానికి గల కారణాలు, పీసీసీ కమిటీపై సీనియర్ల అభ్యంతరాలు, వారి డిమాండ్లు అడిగి తెలుసుకున్నారు. పీసీసీలో రేవంత్ వర్గంగా ఉన్న నేతల వివరాలు, వారి రాజీనామాల అంశంపై కూడా చర్చ జరిగినట్లు తెలిసింది. రేవంత్కు, సీనియర్ల మధ్య సమన్వయానికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ చేసిన ప్రయత్నాల వివరాలను తీసుకున్నారు. అనంతరం పార్లమెంట్కు వెళ్లిన దిగ్విజయ్.. మాణిక్యం ఠాగూర్తోనూ సమావేశమై పార్టీలో విభేదాలపై చర్చించారు. ఆ తర్వాతే హైదరాబాద్ బయలుదేరారు. వాదనలకు సిద్ధం: దిగ్విజయ్ ముందు తమ వాదనలు వినిపించేందుకు రాష్ట్ర కాంగ్రెస్లోని రెండు వర్గాలు సిద్ధమయ్యాయి. పార్టీ అభివృద్ధికి తాము కష్టపడిన తీరును, సీనియర్లతో సమన్వయం కోసం రేవంత్రెడ్డి చేసిన ప్రయత్నాలను వివరించేందుకు రేవంత్ వర్గం సిద్ధమైనట్లు తెలిసింది. మరోవైపు రేవంత్ ఏకపక్ష వైఖరి, మాణిక్యం ఠాగూర్ వ్యవహారశైలి, పీసీసీ పదవుల్లో పార్టీలోని పాతకాపులకు జరిగిన అన్యాయం, సీనియర్లను కోవర్టులుగా చిత్రీకరించేందుకు యత్నించడం, సోషల్మీడియాలో దుష్ప్రచారం తదితర అంశాలపై సీనియర్లు నివేదికలు సిద్ధం చేసుకున్నారు. ఇలావుండగా పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో రేవంత్రెడ్డి గురువారం నాటి సమావేశానికి హాజరుకావడం లేదని గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి. -
తెలంగాణ కాంగ్రెస్ పై ఏఐసీసీ ఫోకస్
-
సోనియాకు మద్దతుగా టీ-కాంగ్రెస్ ధర్నా
-
ఈడీ కార్యాలయం ఎదుట భారీ బందోబస్తు
ఢిల్లీ: నేషనల్ హెరాల్డ్–ఏజేఎల్ వ్యవహారానికి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ.. ఈడీ ఎదుట విచారణకు హాజరుకానున్న నేపథ్యంలో కాంగ్రెస్ దేశ వ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది. దాంతో పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ నేపథ్యంలో న్యూఢిల్లీలోని ఈడీ కార్యాలయం ఎదుట భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ఆంక్షలను కఠినతరం చేశారు. టీ కాంగ్రెస్ ర్యాలీకి పర్మిషన్ తెలంగాణలో కాంగ్రెస్ నిరసనకు పోలీసులు పర్మిషన్ ఇచ్చారు. నిబంధనలతో కూడా అనుమతి ఇవ్వడంతో టీ కాంగ్రెస్ నేతలు ఇందిరా గాంధీ విగ్రహం నుంచి ర్యాలీగా బయల్దేరడానికి సన్నద్ధమయ్యారు.. టీపీసీసీ చీఫ్ రేవంతరెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ మంత్రి పొన్నాల, మాజీ ఎంపీ మల్లు రవి, రోహిణ్రెడ్డి, విజయారెడ్డి తదితర నేతలు, కార్యకర్తలు ఇందిరాగాంధీ విగ్రహం నుంచి ర్యాలీ చేపట్టారు. వీరి నిరసన ర్యాలీ ఇందిరాగాంధీ విగ్రహం నుంచి ఈడీ కార్యాలయం వరకూ సాగనుంది. -
రూటు మార్చిన తెలంగాణ కాంగ్రెస్.. పార్టీలోకి కీలక నేతలు
-
తెలంగాణ ప్రభుత్వం జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో ఉంది: భట్టి విక్రమార్క
-
పల్లె పల్లెకు కాంగ్రెస్ కార్యక్రమానికి ప్రణాళికలు
-
తెలంగాణ కాంగ్రెస్లో నయా జోష్
-
విద్యుత్ చార్జీల పెంపుపై కాంగ్రెస్ పోరుబాట
-
తెలంగాణ కాంగ్రెస్లో మరో లొల్లి
-
ఢిల్లీ పర్యటనకు నాకు ఆహ్వానం అందలేదు: వీహెచ్
-
అధ్యక్షుడిని కాబట్టే ఆగుతున్నా..
సాక్షి, హైదరాబాద్: ‘కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిలో ఉన్న కారణంగా కొంత సంయమనం పాటించాల్సి వస్తోంది. నేను యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో ఉన్నట్టయితే సీఎం కేసీఆర్ గుండెల్లో నిద్రపోయేవాడిని. ఆయన పడుకున్నా కళ్లు తెరిచి నిద్రపోయేలా, గుండెల్లో గునపం దింపేలా ఉద్యమించేవాడిని’అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. ఆదివారం గాంధీభవన్లో రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ‘నిరుద్యోగ నిరసన దీక్ష’జరిగింది. దీక్షలో పాల్గొన్న యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి తదితరులకు రేవంత్ నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. తర్వాత రేవంత్ మాట్లాడుతూ.. ‘నాడు రాష్ట్ర సాధన ఉద్యమంలో దళిత, గిరిజన, బడుగు, బలహీన వర్గాలకు చెందిన వంద లాది మంది పేదోళ్ల బిడ్డలు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పుడు ఉద్యోగాలు రాక, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని భరించలేక ఆ బిడ్డలే చనిపోతున్నారు’అని ఆవేదన వ్యక్తం చేశారు. 1.9 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని బిశ్వాల్ కమిటీ ఇచ్చిన నివేదిక ఏమైందన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఎక్కడని నిలదీశారు. రాష్ట్రంలో ఇప్పటికీ ఒక్క చెప్పుకోదగ్గ నోటిఫికేషన్ను కేసీఆర్ ఇవ్వలేదని మండిపడ్డారు. నిరుద్యోగులకు నెలకు భృతి కింద రూ.3,016 ఇస్తా నని చెప్పి ఆ హామీని పట్టించుకోకుండా నిరుద్యోగ యువత పొట్టకొడుతున్నారని విమర్శించారు. తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 12 నెలల్లో అధికారంలోకి వస్తుందని, అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని రేవంత్ చెప్పారు. గోల్కొండ కోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం, ప్రగతి భవన్ను అంబేద్కర్ భవన్గా మారుస్తూ తొలి సంతకం చేయడం ఖాయమని చెప్పారు. శివసేనారెడ్డి మాట్లాడుతూ.. వచ్చే బడ్జెట్లో నిరుద్యోగ భృతికి నిధులు కేటాయించాలని, లేదంటే ఆమరణ నిరాహారదీక్షకు దిగుతానని చెప్పారు. కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, సంపత్కుమార్, చిన్నారెడ్డి, టీపీసీసీ పీఏసీ కన్వీనర్ షబ్బీర్ అలీ, కిసాన్ కాంగ్రెస్ నేత కోదండరెడ్డి, యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎంపీలు మల్లు రవి, అంజన్కుమార్ యాదవ్, మాజీ మంత్రి నాగం జనార్దన్రెడ్డి పాల్గొన్నారు. -
రాజీనామాపై జగ్గారెడ్డి దిమ్మతిరిగే ట్విస్ట్
-
హుజురాబాద్ అభ్యర్థి ఎంపికలో టి కాంగ్రెస్ డైలామా?
-
‘సాగర్’లో భారీగా పోలింగ్...ఎవరిదో గెలుపు!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో భారీ పోలింగ్ నమోదైంది. శనివారం ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ రాత్రి 7 గంటల దాకా కొనసాగింది. గత ఎన్నికలకు భిన్నంగా ఎన్నికల కమిషన్ ఈసారి అదనంగా మరో 2 గంటలు పోలింగ్ సమయాన్ని పెంచింది. ఈ ఉపఎన్నికలో 86.2 పోలింగ్ శాతం నమోదైంది. మొత్తం 2,20,300 ఓట్లకు గాను, 1,90,329 ఓట్లు పోలయ్యాయి. తుది క్రోడీకరణల అనంతరం ఈ సంఖ్యలో కొంతమార్పు ఉండే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. వాస్తవానికి 2018 ఎన్నికల కంటే ఈసారి పోలింగ్ శాతం కొంత తక్కువగా నమోదైంది. గత ఎన్నికల్లో 2,08,176 ఓట్లకు గాను, 1,79,995 ఓట్లు పోల్ కావడంతో 86.46 శాతం పోలింగ్ నమోదైంది. అంతే కాకుండా.. గత ఎన్నికల కంటే ఈసారి 12 వేల ఓట్లు కూడా పెరిగాయి. ఉప ఎన్నికల్లో విజయం కోసం అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ హోరాహోరీగా తలపడ్డాయి. బీజేపీ సహా మొత్తం 41 మంది అభ్యర్థులు బరిలో ఉన్నా.. ప్రధాన పోటీ మాత్రం టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే సాగింది. ఓట్లు వేయించడంలోనూ పోటాపోటీ ఇరు పార్టీలకు ఈ ఎన్నికల్లో గెలవడం అనివార్యంగా మారడంతో ఎన్నికల ప్రచారంలో పోటీ పడినట్లే.. ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తీసుకొచ్చి ఓట్లేయించడలోనూ పోటీ పడినట్లే కన్పించింది. దీంతో పోలింగ్ జోరుగా సాగింది. ప్రతి ఓటును కీలకంగా భావించి.. ఆయా గ్రామాల్లో స్థానిక నేతలు శ్రద్ధ తీసుకున్నారు. మరోవైపు పల్లెల్లో పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల దూరంలోనే ఆయా పార్టీ కార్యకర్తల పోల్ చీటీలు పంచే అవకాశమిచ్చారు. దీంతో చాలా చోట్ల పోలింగ్ కేంద్రం దరిదాపుల్లో ఎవరూ లేకుండా అయ్యారు. చదవండి: కాంగ్రెస్ వడివడిగా.. -
‘సాగర్’ ప్రచారానికి తెర.. పోలింగ్పై పార్టీల దృష్టి
సాక్షి, హైదరాబాద్: నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక ప్రచారానికి గురువారం సాయంత్రం 5 గంటలకు తెరపడింది. శనివారం పోలింగ్ జరగనుండటంతో అభ్యర్థులు, స్థానిక నేతలు బూత్ స్థాయిలో ఏజెంట్ల నియామకం, సమన్వయంపై దృష్టి సారించారు. సామాజికవర్గాల ఓట్లను దృష్టిలో పెట్టుకుని అన్ని పార్టీలు అభ్యర్థులను ఎంపిక చేశాయి. గత 17న సాగర్ ఉప ఎన్నిక షెడ్యూలు వెలువడిన నాటి నుంచే నియోజకవర్గంలో రాజకీయ సందడి మొదలవగా, సుమారు 20 రోజులుగా అన్ని పార్టీలు ప్రచారంతో హోరెత్తించాయి. ప్రధాన రాజకీయ పక్షాల్లో కాంగ్రెస్ మాజీ మంత్రి జానారెడ్డి అభ్యర్థిత్వాన్ని ముందస్తుగా ప్రకటించగా, టీఆర్ఎస్, బీజేపీ చివరి నిమిషం వరకు అభ్యర్థిని ప్రకటించకపోవడంతో ఉత్కంఠకు దారితీసింది. టీఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుమారుడు భగత్కు అవకాశం దక్కగా, బీజేపీ నుంచి డాక్టర్ రవినాయక్ బరిలోకి దిగారు. గతేడాది డిసెంబర్ మొదటి వారంలో నోముల నర్సింహయ్య మరణించగా, టీఆర్ఎస్ ఎన్నికల సన్నాహాలను ముందుగానే ప్రారంభించింది. అభ్యర్థి ఎంపికతో సంబంధం లేకుండానే నియోజకవర్గం పరిధిలోని మండలాలు, మున్సిపాలిటీల వారీగా పార్టీ ఎమ్మెల్యేలు, కొందరు ముఖ్య నేతలకు ఇన్చార్జిలుగా బాధ్యతలు అప్పగించింది. మండలాలు, మున్సిపాలిటీల స్థాయిలో పార్టీ కేడర్తో సమావేశాలు నిర్వహించిన టీఆర్ఎస్, ప్రచార గడువు దగ్గరపడే కొద్దీ గ్రామ స్థాయి మీటింగ్లకు ప్రాధాన్యతనిచ్చింది. వివిధ సామాజికవర్గాల మద్దతు కూడగట్టేందుకు టీఆర్ఎస్ సర్వశక్తులూ ఒడ్డింది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 14న హాలియాలో జరిగిన బహిరంగ సభకు హాజరై పార్టీ ఎన్నికల ప్రచారానికి మరింత ఊపుతెచ్చారు. సర్వశక్తులూ కూడగట్టుకున్న కాంగ్రెస్ ఇదే నియోజకవర్గం నుంచి గతంలో రెండు పర్యాయాలు ప్రాతినిథ్యం వహించిన మాజీ మంత్రి జానారెడ్డి మరోమారు కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఎన్నికల షెడ్యూలు వెలువడక ముందే గ్రామాలను చుట్టివచ్చిన జానారెడ్డికి మద్దతుగా నామినేషన్ల తర్వాత పార్టీ రాష్ట్ర నేతలు, కేడర్ కూడా ప్రచారంలో కలసి వచ్చింది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి, శాసనసభా పక్షం నేత భట్టి విక్రమార్కతో పాటు పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు మండలాలు, మున్సిపాలిటీల వారీగా ప్రచార బాధ్యతలు స్వీకరించారు. బహిరంగ సభల జోలికి వెళ్లకుండా గ్రామ స్థాయి ప్రచారానికి కాంగ్రెస్ నేతలు పరిమితమయ్యారు. గతంలో జానారెడ్డి చేసిన అభివృద్ధిని వివరించడంతో పాటు రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో జానారెడ్డి అసెంబ్లీలో ఉండాల్సిన అవసరాన్ని పదే పదే ప్రస్తావించారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం కూడా సాగర్ చేరుకుని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. చాపకింద నీరులా బీజేపీ ప్రచారం చివరి నిమిషం వరకు అభ్యర్థి ఎంపికపై గోప్యత పాటించిన బీజేపీ, ఎస్టీ సామాజికవర్గానికి చెందిన డాక్టర్ రవి నాయక్ను బరిలోకి దించింది. కాగా, పార్టీ టికెట్ ఆశించిన కడారి అంజయ్య యాదవ్.. టీఆర్ఎస్లో చేరగా, 2018లో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి నివేదిత రెడ్డి కొంతకాలం ప్రచారానికి దూరంగా ఉన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, పార్టీ ముఖ్యనేతలు డాక్టర్ లక్ష్మణ్, డీకే అరుణ, విజయశాంతితో పాటు ఎమ్మెల్యే రఘునందన్రావు, ఇతర నేతలు ప్రచారంలో పాల్గొన్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ఛుగ్తో పాటు కేంద్ర మంత్రి అర్జున్రామ్ మేఘవాల్ కూడా ప్రచారానికి వచ్చారు. అయితే బీజేపీ బహిరంగ సభల జోలికి వెళ్లకుండా రోడ్షోలు, గ్రామ స్థాయి ప్రచారానికి పరిమితమైంది. చదవండి: తెలుగు యువకుడికి రూ.కోటిన్నర వేతనం -
గవర్నర్ను కలిసిన కాంగ్రెస్ నాయకులు
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ నేతలు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక వైఫల్యాలపై కాంగ్రెస్ నేతలు గవర్నర్కు వినతిపత్రం అందజేశారు. ఈ భేటీలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ కుంతియా, సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క, సీనియర్ నాయకులు అంజన్కుమార్ యాదవ్, జనారెడ్డిలతో పాటు ఇతర నాయకులు ఉన్నారు. అంతకు ముందు గాంధీభవన్ నుంచి రాజ్భవన్కు ర్యాలీగా బయలుదేరిన కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. దీంతో గాంధీభవన్ పరిసరాల్లో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. కాగా, కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చలో రాజ్భవన్కు పిలుపునిచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్కు వినతిపత్రం ఇచ్చేందుకు గాంధీభవన్ నుంచి రాజ్భవన్ వరకు కాంగ్రెస్ శ్రేణులు ర్యాలీగా బయలుదేరాయి. ఈ ర్యాలీలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ ఆర్సీ కుంతియా, సీఎల్పీ నేత భట్టు విక్రమార్క, సీనియర్ నాయకులు జనారెడ్డిలు పాల్గొన్నారు. అయితే ఈ ర్యాలీ గాంధీభవన్ నుంచి కొద్దిగా ముందుకు రాగానే ఈ ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు కాంగ్రెస్ శ్రేణులను అడ్డుకున్నారు. పలువురు కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో గాంధీభవన్ పరిసరాల్లో ఉద్రిక్తత నెలకొంది. అయితే 11 మంది కాంగ్రెస్ నేతలకు మాత్రం గవర్నర్ను కలిసేందుకు అనుమతిచ్చారు. -
ఉప పోరు హోరు
సాక్షి, హైదరాబాద్ : హుజూర్నగర్ ఉప ఎన్నిక... ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాలను కుదిపే స్తోంది. అధికార, ప్రతిపక్షాలకు అసలైన పరీ క్షగా మారింది. దీంతో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఈ ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మ కంగా తీసుకుంటున్నాయి. హుజూర్నగర్లో గెలవడం ద్వారా ప్రజామోదం తమకే ఉం దని చెప్పడంతోపాటు తమ పాల నపై విపక్షాల ఆరోపణలన్నింటికీ చెక్ పెట్టాలనే ఆలోచనలో టీఆర్ఎస్ ఉంది. మరోవైపు సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవ డం ద్వారా టీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయం అనే సంకేతాన్ని ఇవ్వడంతోపాటు రాష్ట్రంలో బలపడ దామనుకుంటున్న బీజేపీని వెనక్కు నెట్ట వచ్చని కాంగ్రెస్ భావిస్తోంది. ఈనేపథ్యంలో భవిష్యత్ రాజకీయాలను ప్రభావితం చేయగలుగుతుందనే అంచనా నడుమ హుజూర్నగర్ ఉప ఎన్నిక ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది. ఎవరి లెక్కలు వారివే... హుజూర్నగర్ ఉప ఎన్నికలో గెలుస్తామనే భావనతో ఇరు పార్టీలూ ఉన్నా అధికార పార్టీకి ఉప ఎన్నికలో కలసి వచ్చే సంప్రదాయం టీఆర్ఎస్కు అను కూలిస్తుందని రాజకీయ వర్గాలం టున్నాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, కేసీఆర్ చరిష్మా, గత ఎన్నికల్లో ఓడిపోయిన కారణంగా సైదిరెడ్డిపై ఉండే సానుభూతి, ఎన్నికల ప్రచార వ్యూహాలు గెలిపిస్తాయని గులాబీ శిబిరం ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే అంతర్గతంగా ఆ పార్టీలో కొంత సమన్వయ లోపం కనిపి స్తోంది. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే ఎమ్మెల్యేగా ఉత్తమ్ చేసిన అభివృద్ధి, నియోజకవర్గంలో ఉన్న సంప్ర దాయ ఓటు బ్యాంకు ఆ పార్టీకి ప్రధాన బలాలుగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్లో గ్రూపు రాజకీయాలు లేకపోయినా ఆ పార్టీ నేతలపై అధికార పార్టీ చేసే ఒత్తిడి, క్షేత్రస్థాయి నేతల్లో పార్టీ అధికారంలో లేదనే భావన కొంత ప్రతికూల ప్రభావం చూపవచ్చని అంచనా. అభివృద్ధే ప్రజల ఎజెండా... రాజకీయ పార్టీల ఆలోచనలు ఎలా ఉన్నా హుజూర్నగర్ నియోజకవర్గ ప్రజల్లో మాత్రం అభివృద్ధే ఎజెండాగా కనిపిస్తోంది. ఏ పార్టీ అభ్యర్థికి ఓటేయాలన్న దానిపై ఇక్కడి ప్రజలు అభివృద్ధి కోణంలోనే విశ్లేషణలు చేసుకుంటుండటం గమనార్హం. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నందున అధికార పార్టీ అభ్యర్థి గెలిస్తేనే అభివృద్ధి జరుగుతుందనే భావన కొంతమేర ప్రజల్లో వ్యక్తమవుతోంది. దీనికితోడు రైతుబంధు, పింఛన్ల పెంపు, మిషన్ భగీరథతోపాటు ఇతర సంక్షేమ పథకాలను చూసి ప్రజలు టీఆర్ఎస్కు ఓటేయవచ్చనే అంచనాలు వినిపిస్తున్నాయి. అయితే తాను ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు ఉత్తమ్ చేసిన అభివృద్ధి ఈ వాదనను కొంత నీరుగారుస్తోందని చెప్పక తప్పదు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు రోడ్లు, సబ్స్టేషన్లు, లిఫ్టులు, పేదలకు ఇళ్ల విషయంలో అభివృద్ధి జరిగిందనే భావన ఇప్పటికీ నియోజకవర్గ ప్రజల్లో నిలిచిపోయింది. దీనికితోడు గత ఐదేళ్లుగా టీఆర్ఎస్ హాయాంలో చెప్పుకోదగిన అభివృద్ధి పనులేవీ జరగలేదనే అభిప్రాయం కూడా ప్రజలపక్షాన వినిపిస్తోంది. ఎంపీగా ఉత్తమ్ ఉన్నందున ఎమ్మెల్యేగా ఆయన సతీమణిని గెలిపిస్తే నియోజకవర్గానికి భారీగా నిధులు వస్తాయనే వాదన కూడా వినిపిస్తోంది. ఇరు పార్టీలకు చెందిన అభ్యర్థులు ఖరారైన నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతిరెడ్డి ఈ నెల 30న భారీ ఎత్తున నామినేషన్ దాఖలు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి ఈ నెల 26 లేదా 28 తేదీల్లో సుముహూర్తం చూసుకొని నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు ఎన్నికల ప్రచారం కూడా నియోజకవర్గంలో అప్పుడే వేడెక్కింది. ఇరు పార్టీలు ప్రచార సభలు నిర్వహిస్తూ ఇతర పార్టీల కార్యకర్తలను పెద్ద ఎత్తున పార్టీలోకి చేర్చుకుంటున్నాయి. ఇక సోషల్ మీడియా వేదికగా ఇరు పార్టీలు, ఆయా పార్టీల అభ్యర్థులపై ఆరోపణలు, ప్రత్యారోపణలు దుమ్మురేపుతున్నాయి. ఇతర పార్టీలేమంటాయో? ప్రధాన పక్షాలైన టీఆర్ఎస్, కాంగ్రెస్లే కాకుండా నియోజకవర్గంలో టీడీపీ, సీపీఎం, సీపీఐలకు కూడా కొంత పట్టు ఉంది. బీజేపీ, టీజేఎస్కు సంస్థాగతంగా పట్టు లేనప్పటికీ కశ్మీర్ అంశంతోపాటు ఇటీవల తెరపైకి వచ్చినట్లుగా టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్నామన్న సంకేతాలు కూడా ఆ పార్టీకి కొన్ని ఓట్లు రాలుస్తాయని రాజకీయ విశ్లేషకులంటున్నారు. టీడీపీ, సీపీఐ, టీజేఎస్లు కాంగ్రెస్కు మద్దతిచ్చే లైన్లోనే ఉండగా, గత ఎన్నికల్లో 2 వేల పైచిలుకు ఓట్లు తెచ్చుకున్న సీపీఎం మాత్రం ఇంకా డైలమాలోనే ఉన్నట్లు కనిపిస్తోంది. మొత్తంమీద ఈ పార్టీల వైఖరి, ఆయా పార్టీలకు వచ్చే ఓట్లు కూడా ప్రధాన పార్టీల అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావితం చూపే అవకాశం లేకపోలేదు. గత ఎన్నికలను పరిశీలిస్తే....! 2009లో తొలిసారి హుజూర్నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో ప్రస్తుత విద్యుత్ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్కుమార్రెడ్డి గెలుపొందారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్కు 80,835 ఓట్లు రాగా, టీఆర్ఎస్కు 51,641 ఓట్లు వచ్చాయి. 2014లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఉత్తమ్కు 79,879 ఓట్లు, టీఆర్ఎస్ అభ్యర్థి శంకరమ్మకు 45,955 ఓట్లు వచ్చాయి. ఆ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి దాదాపు 30 వేల ఓట్లు రాగా టీడీపీకి కూడా 25 వేల ఓట్లు పోలయ్యాయి. ఆ తర్వాత 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో వైఎస్సార్సీపీ బరిలోకి దిగలేదు. తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్కు మద్దతిచ్చింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్కు 92,996 ఓట్లు రాగా, టీఆర్ఎస్ తరఫున బరిలో ఉన్న శానంపూడి సైదిరెడ్డికి 85,530 ఓట్లు పోలయ్యాయి. దాదాపు 7,400 ఓట్ల మెజారిటీతో ఉత్తమ్ గెలుపొందారు. ఈ ఎన్నికల తర్వాత ఉత్తమ్ నల్లగొండ ఎంపీగా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో పోలయిన ఓట్లను పరిశీలిస్తే హుజూర్నగర్లో వరుసగా నాలుగోసారి కూడా ఉత్తమ్కే మెజారిటీ లభించింది. 2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్కు హుజూర్నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో 88,138 ఓట్లు రాగా, టీఆర్ఎస్ అభ్యర్థి వేంరెడ్డి నర్సింహారెడ్డికి 75,145 ఓట్లు పోలయ్యాయి. అంటే 2018 ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకన్నా దాదాపు 5 వేలు ఎక్కువగా 12,993 ఓట్ల మెజారిటీ రావడం గమనార్హం. మరి ఈసారి జరిగే ఉప ఎన్నికలో ఉత్తమ్ సతీమణి పద్మావతి విజయం సాధిస్తారా? అనూహ్యంగా అధికార టీఆర్ఎస్కు ప్రజలు పట్టం కడతారా అన్నది అక్టోబర్ 24న తేలనుంది. పద్మావతికే కాంగ్రెస్ టికెట్ సాక్షి, న్యూఢిల్లీ: హుజూర్నగర్ అసెంబ్లీ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా పద్మావతిరెడ్డి బరి లో నిలవనున్నారు. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాఆమె అభ్యర్థిత్వానికి ఆమోదం తెలిపారని పార్టీ ప్రధానకార్యదర్శి ముకుల్ వాస్నిక్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బీజేపీ అభ్యర్థిగా శ్రీకళారెడ్డి? హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా శ్రీకళారెడ్డిని పోటీలో దింపే అవకాశం ఉన్నట్లు తెలిసింది. టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న రామకృష్ణ, జైపాల్రెడ్డి, రవీంద్రనాయక్, రాంమోహన్రెడ్డి, రామారా వు, రవీందర్, శ్రీకళారెడ్డి, భాగ్యరెడ్డి తదితరు ల బలాబలాలపై పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ అ«ధ్యక్షతన జరిగిన కోర్కమిటీ సమావేశంలో చర్చించినట్లు తెలిసింది. రెండురోజుల్లో పార్టీ అభ్యర్థిని ప్రకటిస్తామని లక్ష్మణ్ తెలిపారు. -
కాంగ్రెస్ జోలికొస్తే వదిలేది లేదు: ఉత్తమ్
గరిడేపల్లి: హుజూర్నగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అరాచకం సృష్టిస్తోందని, కాంగ్రెస్ను రక్షించుకోవడానికి చావడానికైనా సిద్ధమని, ఆత్మరక్షణ కోసం చంపడానికైనా సిద్ధమని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తల మనో ధైర్యాన్ని దెబ్బతీయాలని చూస్తే సహించేది లేదని, కార్యకర్తలకు అండగా ఉంటామన్నారు. సోమవారం ఆయన సూర్యాపేట జిల్లా గరిడేపల్లిలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ప్రసంగిస్తూ, హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో చావో రేవో తేల్చుకునేందుకు కాంగ్రెస్ సైనికులంతా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఎన్నికల షెడ్యూల్ రాగానే అధికారదుర్వినియోగం మొదలైందన్నారు. హుజూర్నగర్ నియోజకవర్గంలో ఆదివారం నుంచి రైతుబంధు డబ్బులు బ్యాంకుల్లో జమ అవుతున్నాయన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ మల్లు రవి తదితరులు పాల్గొన్నారు. -
సభ్యత్వం, శిక్షణపై ప్రత్యేక దృష్టి : ఉత్తమ్
సాక్షి, న్యూఢిల్లీ: సభ్యత్వ నమోదు, శిక్షణపై ప్రత్యేక దృష్టితో పనిచేయనున్నట్టు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. గురువారం ఇక్కడ జరిగిన ఏఐసీసీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘అక్టోబర్ 2 నుంచి మహాత్ముడి 150వ జయంతి వేడుకలను వీధివీధినా జరపాలని సమావేశం నిర్ణయించింది. సభ్యత్వ నమోదు ప్రక్రియ అమలుపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ చర్చపై అధ్యక్షురాలు సోనియాగాంధీ తుది నిర్ణయం తీసుకుని రెండు, మూడు రోజు ల్లో మార్గదర్శకాలు జారీ చేస్తారు. మోదీ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను ఎలా నాశనం చేస్తోందో మాజీ ప్రధాని మన్మోహన్ వివరించారు. ప్రస్తుతం ఆర్థిక మాంద్యం వల్ల నిరుద్యోగ సమస్య తీవ్రమవుతోందని, సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తోందని వివరించారు. బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ప్రమాదకరంగా వాడుకుంటోందని, ప్రతిపక్షాలపై అణచివేత ధోరణి కనబరుస్తోందని సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది’అని పేర్కొన్నారు. ‘బీజేపీ ఎదిగేందుకు అవకాశాలు తక్కువ’ శాసనసభలో, బయటా ప్రజల తరఫున పోరాడేందుకు సిద్ధమవుతున్నామని ఉత్తమ్ చెప్పారు. తెలంగాణలో బీజేపీ ఎదిగేందుకు అవకాశాలు తక్కువని ఓ ప్రశ్నకు సమాధానంగా పేర్కొన్నారు. ‘హిందువులు, ముస్లింలు అనే తేడా లేకుండా తెలంగాణ సమాజం కలిసిమెలిసి ఉంది. బీజేపీ విభజన రాజకీయాలు కుదరవు. తెలం గాణకు ఏం చేశారని బీజేపీ ఎదుగుతుంది? బిల్లులో ఉన్న కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీలు ఫ్యాక్టరీ, గిరిజన వర్సిటీ ఇవ్వలేదు. గతంలో ఐదుగురు ఎమ్మెల్యేలు ఉంటే ఇప్పుడు ఒక్కరికే పరిమితమయ్యారు. ఎన్నికలు 2023లో జరిగినా అంతకుముందు జరిగినా టీఆర్ఎస్ను ఓడించి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది’ అని ఉత్తమ్ పేర్కొన్నారు. -
కాంగ్రెస్ నేతల ముల్లేం పోయిందో?
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ నేతలు ఏదో టైం పాస్ కోసం, టీవీల్లో, పేపర్లలో కనబడాలని సచివాలయాన్ని సందర్శించారని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ మండిపడ్డారు. ఏదో విహార యాత్రకు వచ్చినట్టు ఫొటోలు దిగారని విమర్శించారు. కొత్త సచివాలయ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు సోమవారం సచివాలయాన్ని సందర్శించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అయితే వీటిపై స్పందించిన తలసాని.. సచివాలయానికి వచ్చిన కాంగ్రెస్ నేతలు కనీసం అరగంట కూడా అక్కడ లేరని ఎద్దేవా చేశారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న విధంగా కొత్త సచివాలయం, అసెంబ్లీ ఉండాలనేదే సీఎం ఆలోచన అని ఆయన తెలిపారు. కొత్త సచివాలయం నిర్మిస్తే కాంగ్రెస్ నేతల ముల్లేం పోయిందో అర్థం కావడం లేదన్నారు. కాంగ్రెస్ నేతలు కోడి గుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా కొత్త ప్రాజెక్టులు, గురుకులాల నిర్మాణం చేపడుతున్నట్టు పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ నేతలు ఏనాడూ ఆలోచించలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకోవడానికి కాంగ్రెస్ నేతలు అనేక కేసులు వేశారని తెలిపారు. ఆరునూరైన కొత్త సచివాలయం నిర్మాణం చేసి తీరుతామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతలు రాజకీయ ఉద్యోగాలు తీసుకున్నారే తప్ప.. ఒక్క ఉద్యోగం కూడా కల్పించలేదని విమర్శించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. ఆ పదవి వద్దని పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ తగాదాలతో ఎమ్మెల్యేలు ఇతర పార్టీలో చేరుతున్నారని వ్యాఖ్యానించారు. ఒక దళితుడు ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉండకూడదని.. ఎమ్మెల్యేలు పోయిన కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రేవంత్రెడ్డి మాట్లాడిన విషయాలపై తాను మాట్లాడనని అన్నారు. ఏనుగు వెళ్లేటప్పుడు ఎన్నో మొరుగుతాయని.. వాటిని పట్టించుకుంటామా అని ప్రశ్నించారు. -
కాంగ్రెస్ నేతల ముల్లేం పోయిందో?
-
టీఆర్ఎస్కు బీజేపీనే ప్రత్యామ్నాయం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితిపై ఆ పార్టీ సీనియర్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సంచలన వ్యాఖ్య లు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఘోరంగా తయారైందని, పార్టీ అధిష్టానం తప్పుడు నిర్ణయాల వల్లే ఈ దుస్థితి తలెత్తిందని మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ ఇప్పట్లో కోలుకొనే అవకాశం కనిపించడం లేదని, అది మునిగిపోయే పడవని వ్యాఖ్యానించారు. తెలంగాణలో టీఆర్ఎస్కు బీజేపీనే ప్రత్యామ్నాయమని ఆయన అభిప్రాయపడ్డారు. కేసీఆర్ కుటుంబ నియంతృత్వ ధోరణులను అడ్డుకోవాలంటే ప్రత్యామ్నాయంగా బీజేపీ తప్ప మరొక పార్టీ కనుచూపు మేరలో కనిపించడం లేదన్నారు. శనివారం నల్లగొండ కలెక్టరేట్లో డిండి ప్రాజెక్టు నిర్వాసితులతో జరిగిన సమీక్ష సమావేశానికి రాజగోపాల్రెడ్డి హాజరయ్యారు. అనంతరం ఆయన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై మీడియాతో మాట్లాడారు. కుంతియా, ఉత్తమ్ ఫెయిల్... అసెంబ్లీ సమావేశాల తర్వాత రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వాన్ని మార్చి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని, ఉత్తమ్కుమార్రెడ్డి పీసీసీ పదవి నుంచి తప్పుకొని ఉండాల్సిందని రాజగోపాల్రెడ్డి అభిప్రాయపడ్డారు. అలాగే ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి కుంతియా పార్టీని సమన్వయపరచలేక పోయారని రాజగోపాల్రెడ్డి పేర్కొన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ్ను మార్చనందుకే కాంగ్రెస్ ఓటమిపాలైందని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కాపాడుకోలేక పోయిందని, 12 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడినా పట్టించుకునే నాథుడే లేరని ఆయన ఘాటు విమర్శలు చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసినా ఉత్తమ్ మాత్రం అలా ఆలోచించలేకపోయారని విమర్శించారు. కేసీఆర్ను ఢీకొట్టే శక్తి కాంగ్రెస్కు లేదు... రాష్ట్రంలో టీఆర్ఎస్ను, నియంతలా వ్యవహరిస్తున్న సీఎం కేసీఆర్ ఢీకొట్టే శక్తి కాంగ్రెస్కు లేదని, కేసీఆర్ను, ఆయన కుటుంబ పాలనను ఢీకొట్టాలంటే ప్రధాని మోదీ వంటి నేతకే సాధ్యమని పేర్కొన్నారు. పీసీసీ సారథ్యాన్ని ఆశిస్తున్నారా అన్న ప్రశ్నకు స్పందిస్తూ ‘ఇప్పుడు చేయగలిగింది ఏమీ లేదు. అంతా అయిపోయింది’అని వ్యాఖ్యానించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని భువనగిరి, నల్లగొండ పార్లమెంటు స్థానాలను గెలుచుకున్న అంశంపై మాట్లాడుతూ భువనగిరిలో కేవలం తమ కుటుంబ బ్రాండ్ ఇమేజ్ వల్లే గెలిచామని, కాంగ్రెస్ ఎక్కడుందని ప్రశ్నించారు. నల్లగొండలో తామంతా కష్టపడ్డామని, అందుకే ఉత్తమ్ గెలిచారని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముందుకు వచ్చి పోటీలో ఉన్నామని, పార్టీ నాయకులు ఉత్తమ్, జానారెడ్డి వంటి వారు ఆ ఎన్నికను సీరియస్గా తీసుకోలేదని, అందుకే ఓడిపోయామన్నారు. కార్యకర్తలు, కుటుంబంతో మాట్లాడాకే పార్టీ మార్పుపై నిర్ణయం... బీజేపీలో చేరాలని తాను ఇంకా నిర్ణయించుకోలేదని, భవిష్యత్తులో ఒకవేళ పార్టీ మారాల్సి వస్తే కార్యకర్తలతో, కుటుంబ సభ్యులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ అంటే తమకు కృతజ్ఞత ఉందని, తెలంగాణ ఇచ్చిన పార్టీగా రాష్ట్రంలో బలపడటంలో మాత్రం కాంగ్రెస్ నాయకత్వం విఫలమైందని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా రాష్ట్ర కాంగ్రెస్ పరిస్థితిపై నాయకత్వం ఆలోచన చేయాలని, డీకే అరుణ వంటి నాయకులు బీజేపీలోకి ఎందుకు వెళ్లిపోయారో సమీక్షించుకోవాలని సూచించారు. -
టీడీపీలో మిగిలేది ఆ ఇద్దరేనా?
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో బలోపేతమయ్యే దిశగా భారతీయ జనతాపార్టీ పావులు కదుపుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల నాటికి అధికార టీఆర్ఎస్కు దీటుగా నిలవాలనే లక్ష్యంతో చక్రం తిప్పుతోంది. లోక్సభ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన జోష్తో దక్షిణ భారతదేశంలో తెలంగాణను గేట్వేగా మార్చుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీకి ఇప్పటివరకు అండగా నిలిచిన సామాజిక వర్గానికి చెందిన నేతలకు గాలం వేసే పనిని ముమ్మరం చేసింది. కాంగ్రెస్తో పాటు తెలుగుదేశం పార్టీలో మిగిలిపోయిన సీనియర్లను బీజేపీలో చేర్చుకోవాలనే యోచనతో కమలనాథులు చర్చలు జరుపుతున్నారు. ఈ నెలాఖరులోగా తెలంగాణలోని అరడజను మంది ప్రముఖ నేతలను పార్టీలో చేర్చుకుని తమ సత్తా చూపించాలని ఉవ్విళ్లూరుతున్నట్టు సమాచారం. రాష్ట్రంలో పార్టీని పటిష్టం చేసే బాధ్యతలను జాతీయ ప్రధాన కార్యదర్శులు రాంమాధవ్, మురళీధర్రావులకు అప్పగించిన అధిష్టానం.. రాష్ట్రంలో స్థానిక నేతలను సమన్వయం చేసే బాధ్యతలను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్కు అప్పగించారనే చర్చ జరుగుతోంది. ‘ముందస్తు’కు ముందు నుంచే... తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ కార్యక్రమాన్ని బీజేపీ 2018లో జరిగిన ముందస్తు ఎన్నికలకు ముందే ప్రారంభించింది. అప్పటి నుంచి ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీకి చెందిన డి.కె.అరుణ, మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డి, టీఆర్ఎస్కు చెందిన మాజీ ఎంపీ జితేందర్రెడ్డి, బాబూమోహన్, బొడిగె శోభ, ఆదిలాబాద్ నుంచి ఎంపీగా గెలిచిన సోయం బాపూరావు తదితరులను పార్టీలోకి చేర్చుకుంది. వీరిలో కొందరికి టికెట్లు ఇచ్చి పోటీ చేయించింది. వీరితోపాటు కాంగ్రెస్ పార్టీలోని బలమైన సామాజిక వర్గానికి చెందిన నేతలను తీసుకుంటే పార్టీని రాష్ట్రంలో పటిష్టం చేయొచ్చని భావిస్తోంది. ఈ నేపథ్యంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డిలతో పాటు పలువురు అదే సామాజిక వర్గానికి చెందిన నేతలతో రాంమాధవ్ చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. వీరితో పాటు మరికొందరు కాంగ్రెస్ ప్రముఖులు కూడా బీజేపీ ఢిల్లీ పెద్దలకు టచ్లో ఉన్నట్టు సమాచారం. కాంగ్రెస్ పార్టీలో జరగనున్న పరిణామాలను బట్టి ఈ నెలాఖరులోగా కొందరు కీలక కాంగ్రెస్ నేతలను బీజేపీలో చేర్చుకునే అవకాశాలున్నాయని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఆ తర్వాత వచ్చే స్పందనను బట్టి పార్టీలో కూడా వారికి తగిన ప్రాధాన్యమివ్వాలని, బీజేపీలోకి వస్తే అటు పార్టీపరంగా, ఇటు తమ భవిష్యత్తు పరంగా గ్యారంటీ ఉంటుందనే భావనను కలిగించాలనే ఆలోచనతో బీజేపీ అధిష్టానం ఉన్నట్టు సమాచారం. టీడీపీలో మిగిలేది ఆ ఇద్దరేనా? తెలుగుదేశం పార్టీలో మిగిలిపోయిన సీనియర్లపై కూడా బీజేపీ దృష్టి సారించింది. ఇప్పటికే మాజీ మంత్రి పెద్దిరెడ్డి, చాడా సురేశ్రెడ్డి వంటి నేతలు బీజేపీ పెద్దలను కలిసి చర్చలు జరిపారు. పెద్దిరెడ్డి టీటీడీ పాలకమండలి సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. వీరితో పాటు టీడీపీలో మిగిలిపోయిన నేతలను గుర్తించి వారందరినీ బీజేపీలో చేర్చుకునేందుకు చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. తెలుగు యువతలో కీలకంగా పనిచేసిన లెంకల దీపక్రెడ్డి, మహబూబ్నగర్కు చెందిన కొత్తకోట దయాకర్రెడ్డి, రేవూరి ప్రకాశ్రెడ్డి వంటి నేతలు ఈ జాబితాలో ఉన్నట్టు సమాచారం. రాష్ట్రంలో పార్టీకి బలం లేకపోవడంతో, ఆంధ్రప్రదేశ్లోనూ అధికారం కోల్పోవడంతో ఇదే అదనుగా టీడీపీని ఖాళీ చేసే పనిలో కాషాయపార్టీ నేతలు ఉన్నట్టు తెలుస్తోంది. ‘టీడీపీలో ఉన్న నేతలకు కనుచూపు మేరలో రాజకీయ భవిష్యత్తు కనిపించడం లేదు. వారు ఆ పార్టీలో ఎన్ని రోజులున్నా అదే పరిస్థితి. రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, చంద్రబాబుకు దగ్గరగా ఉండే రావుల చంద్రశేఖర్రెడ్డి మినహా ఆ పార్టీలో ఇంకెవరూ ఉండరేమో’ అని ఓ బీజేపీ ముఖ్య నేత వ్యాఖ్యానించడం చూస్తే టీడీపీని ఖాళీ చేయడమే కమలనాథుల లక్ష్యమని అర్థమవుతోంది. టార్గెట్.. 2023 దేశంలోని చాలా రాష్ట్రాల్లో అధికారం దక్కుతున్నప్పటికీ దక్షిణ భారతదేశంలో బీజేపీ పుంజుకోలేకపోతోంది. కర్ణాటకలో కూడా అధికారం దోబూచులాటగానే మారింది. ఈ నేపథ్యంలో మిగిలిన రాష్ట్రాల్లోని సామాజిక, రాజకీయ పరిస్థితులను బట్టి తెలంగాణపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్టు తెలుస్తోంది. ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో ఆ పార్టీకి ప్రజలు పట్టం కట్టడంతో కమలనాథులకు రాష్ట్రంపై నమ్మకం పెరిగింది. అందులో భాగంగానే గురువారం ఢిల్లీలో జరిగిన పార్టీ పదాధికారుల సమావేశంలో బీజేపీ చీఫ్ అమిత్షా తెలంగాణ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించినట్టు తెలుస్తోంది. అటు కాంగ్రెస్తో పాటు ఇటు మిగిలిన పార్టీల్లోని కీలక నేతలను పార్టీలో చేర్చుకుని ఎన్నికలకు రెండు మూడేళ్ల నుంచే తమ కార్యాచరణ ప్రారంభించాలని, ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రభావం చూపడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పార్టీకి ఊపు వచ్చేలా చేయాలనే వ్యూహంతో ఢిల్లీ పెద్దలు పావులు కదుపుతున్నారు. మొత్తంమీద రాష్ట్రంలో 2023 ఎన్నికల నాటికి బలీయ శక్తిగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్న కమలనాథులు.. ఇప్పటినుంచే కసరత్తు ప్రారంభించడం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి కలిగిస్తోంది. -
‘విలీనం’పై సభాపతులకు నోటీసులు
సాక్షి, హైదరాబాద్ : శాసనసభ, మండలిలో తమ సభ్యుల విలీనంపై కాంగ్రెస్ గతంలో దాఖలు చేసిన రెండు పిటిషన్లపై హైకోర్టు చర్యలు చేపట్టింది. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ కింద ట్రిబ్యునల్ అధిపతిగా వ్యవహరించే శాసనసభ స్పీకర్కు, అదే హోదాలో మండలి చైర్మన్కు నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్ తరఫున గెలిచి టీఆర్ఎస్లోకి ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్సీలు, 10 మంది ఎమ్మెల్యేలతోపాటు అసెంబ్లీ, మండలి కార్యదర్శులు, కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ధర్మాసనం నోటీసులిచ్చింది. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. శాసనమండలిలో కాంగ్రెస్పక్షాన్ని టీఆర్ఎస్లో విలీనం చేయడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ దాఖలు చేసిన వ్యాజ్యం ధర్మాసనం ఎదుట మంగళవారం మరోసారి విచారణకు వచ్చింది. మండలిలో తమ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలలో నలుగురు పార్టీ ఫిరాయించగా ఎలాంటి అధికారాలు లేకపోయినా మండలి చైర్మన్ కాంగ్రెస్పక్షాన్ని టీఆర్ఎస్లో విలీనమైనట్లుగా ప్రకటించారని షబ్బీర్ అలీ రిట్లో పేర్కొన్నారు. ఈ కేసు విచారణకు రాగానే మండలి చైర్మన్ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచంద్రరావు స్పందిస్తూ సుప్రీంకోర్టు నుంచి సీనియర్ న్యాయవాది హరేన్ రావల్ వాదించేందుకు వస్తారని, ఆయన విదేశీ పర్యటనకు వెళ్తున్నందున విచారణను వచ్చే నెలకు వాయిదా వేయాలని కోరారు. దీనిపై పిటిషనర్ తరఫు న్యాయవాది జంధ్యాల రవిశంకర్ అభ్యంతరం చెప్పారు. నిన్న, ఈరోజు కూడా హరేన్ రావల్ రాష్ట్ర హైకోర్టులోనే కేసులు వాదించారని చెప్పారు. అయితే ఆయన అమెరికా వెళ్లబోతున్నారని మాత్రమే చెప్పానని రామచంద్రరావు ధర్మాసనానికి వివరణ ఇచ్చారు. కేసుల్ని వాయిదా వేయాలని మీరే కోరుతున్నారని ధర్మాసనం పేర్కొనగా తానేమీ వాయిదాలు కోరలేదని జంధ్యాల బదులిచ్చారు. దీంతో ధర్మాసనం పదో షెడ్యూల్ కింద ట్రిబ్యునల్గా వ్యవహరించే మండలి చైర్మన్, మండలి సెక్రటరీ, పార్టీ పిరాయించిన నలుగురు ఎమ్మెల్సీలు ఎం.ఎస్. ప్రభాకర్రావు, కె. దామోదర్రెడ్డి, టి. సంతోష్ కుమార్, ఆకుల లలితకు నోటీసులు జారీ చేసింది. కేంద్ర ఎన్నికల సంఘానికీ నోటీసులు జారీ చేస్తున్నట్లు ప్రకటించింది. అసెంబ్లీలో సీఎల్పీ కేసులోనూ.. శాసనసభలో కాంగ్రెస్ శాసనసభాపక్షాన్ని (సీఎల్పీ) టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేసేందుకు తెర వెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇప్పటికే కౌన్సిల్లో చేశారంటూ ఏప్రిల్ 29న దాఖలైన మరో రిట్ పిటిషన్ను కూడా ధర్మాసనం విచారించింది. పది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లోకి ఫిరాయించారని, సీఎల్పీని సైతం టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేసేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని (అప్పటికి విలీనం నిర్ణయం తీసుకోలేదు) టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తమ పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై హైకోర్టు.. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ కింద ట్రిబ్యునల్గా వ్యవహరించే శాసనసభ స్పీకర్, శాసనసభ కార్యదర్శి, కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శితోపాటు టీఆర్ఎస్లోకి ఫిరాయించిన పది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. పార్టీ ఫిరాయించి టీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డి. సుధీర్రెడ్డి, హరిప్రియ, సబితా ఇంద్రారెడ్డి, ఉపేందర్రెడ్డి, బీరం హర్షవర్దన్రెడ్డి, రేగా కాంతారావు, ఆత్రం సక్కు, వనమా వెంకటేశ్వరరావు, జె. సురేందర్, చిరుమర్తి లింగయ్యలకు నోటీసులు జారీ చేసింది. ప్రతివాదులంతా తమ వాదనలతో కౌంటర్ వ్యాజ్యాలు దాఖలు చేయాలని రెండు కేసుల్లోనూ ధర్మాసనం ఆదేశించింది. కేసుల విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. సీఎల్పీ విలీనంపై తాజా వ్యాజ్యంలో.. కాంగ్రెస్ నుంచి తాజాగా మరో ఇద్దరు ఎమ్మెల్యేలు పైలెట్ రోహిత్రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి టీఆర్ఎస్లోకి ఫిరాయించాక సీఎల్పీ టీఆర్ఎస్ఎల్పీలో విలీనమైనట్లు స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై అసెంబ్లీ బులిటెన్ విడుదల చేసింది. అయితే పదో షెడ్యూల్ కింద ట్రిబ్యునల్గా వ్యవహరించే స్పీకర్ నిర్ణయాన్ని, శాసనసభ కార్యదర్శి ఇచ్చిన బులిటెన్ను రద్దు చేయాలని ఉత్తమ్, భట్టి రెండు రోజుల క్రితం మరో రిట్ దాఖలు చేశారు. నేటి విచారణ జాబితాలో కేసు లేకపోవడాన్ని పిటిషనర్ న్యాయవాది చెప్పడంతో బుధవారం విచారిస్తామని ధర్మాసనం ప్రకటించింది. కాంగ్రెస్ తరఫున ఎన్నికైన చట్టసభ్యుల్లో మూడింట రెండొంతుల మంది టీఆర్ఎస్లో చేరినప్పుడు ఆ పార్టీ శాసనసభాపక్షాన్ని టీఆర్ఎస్ఎల్పీలో విలీనమైనట్లుగా ప్రకటించే అధికారం అసెంబ్లీ స్పీకర్కు లేదని, ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో అనర్హత అంశంపై మాత్రమే స్పీకర్ తీర్పు చెప్పవచ్చునని, విలీన అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవాలని పిటిషనర్ల వాదన. శాసనసభాపతి వేరు, పదో షెడ్యూల్ కింద ట్రిబ్యునల్గా వ్యవహరించే స్పీకర్ వేరని, ట్రిబ్యునల్ తీసుకున్న నిర్ణయాన్ని న్యాయ సమీక్ష చేయవచ్చునని వారు వాదిస్తున్నారు. శాసనమండలి, శాసనసభల్లోని ఒక పార్టీకి చెందిన చట్ట సభ్యులను కలిపితేనే ఆ పార్టీ శాసనసభాపక్షం అవుతుందని, అంటే మండలిలో ఆరుగురు, శాసనసభలో 19 మంది చొప్పున (అప్పటికి ఉత్తమ్ ఎమ్మెల్యేగానే ఉన్నారు) కాంగ్రెస్ సభ్యులు ఉన్నారని, పాతిక మంది ఉన్న వారిలో 19 మంది పార్టీ వీడినప్పుడే విలీనానికి చట్టపరమైన అవకాశం ఉంటుందని కూడా పిటిషనర్ల వాదన. అయితే మండలిలో ఆరుగురులో నలుగురు, అసెంబ్లీకి ఉత్తమ్ రాజీనామా చేశాక మిగిలిన 18 మందిలో 12 మంది పార్టీకి గుడ్బై చెప్పాక ఆ సభ్యుల బలం మూడింట రెండు వంతులేనని అధికార టీఆర్ఎస్ చేస్తున్న వాదనను పిటిషనర్లు తప్పుపడుతున్నారు. మరోవైపు రాజ్యాంగ నిబంధనలకు లోబడే మండలి చైర్మన్, శాసనసభ స్పీకర్లు వ్యవహరించారని ప్రభుత్వ అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచంద్రరావు గట్టిగా వాదిస్తున్నారు. కాగా, ముగ్గురు ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, రాములు నాయక్, భూపతిరెడ్డిలను అనర్హులుగా ప్రకటిస్తూ శాసనమండలి చైర్మన్ తీసుకున్న నిర్ణయం చెల్లదంటూ దాఖలైన మరో వ్యాజ్యం కూడా హైకోర్టు విచారణలో ఉన్న విషయం విదితమే. ఈ మూడు స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయబోమని ఈసీ హామీ ఇవ్వడంతో అందుకు అనుగుణంగా ఇటీవలే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
‘తెలంగాణ డిక్టేటర్ షిప్కు కేరాఫ్ అడ్రస్’
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ డిక్టేటర్ షిప్కు కేరాఫ్ అడ్రస్గా మారిందని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి విమర్శించారు. గాంధీభవన్లో శుక్రవారం వారు మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ తెలంగాణలో ప్రతిపక్షాలు లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. పీసీసీ, సీఎల్పీ నేతలు ఫిర్యాదు చేసిన స్పీకర్ పట్టించుకోలేదని తెలిపారు. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒకేసారి టీఆర్ఎస్లో చేరారనేది అవాస్తమని అన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ఇంకో లేఖ ఇచ్చే హక్కు లేదని వ్యాఖ్యానించారు. పోచారం శ్రీనివాసరెడ్డి స్పీకర్ పదవికి అప్రతిష్ట పాలు చేశారని ఆరోపించారు. స్పీకర్ హైదరాబాద్కు రావడానికి భయపడితే సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క బాన్సువాడకు వెళ్లి పార్టీ ఫిరాయింపులపై ఫిర్యాదు చేశారని అన్నారు. స్పీకర్కు ఇది తగునా అనిప్రశ్నించారు. సీఎం కేసీఆర్ కుమారుడు కేటీఆర్ నైతికత గురించి మాట్లాడుతున్నారని.. అలాగైతే 12 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేసి ఎన్నికలకు రావాలన్నారు. పార్టీ ఫిరాయింపులపై గవర్నర్ నరసింహన్కు ఫిర్యాదు చేసిన స్పందించకపోవడం బాధకమరని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎల్పీ వీలినంపై సోమవారం మరోసారి కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్టు తెలిపారు. టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలు ఎలా లబ్ది పొందారనే ఆధారాలు సేకరిస్తున్నట్టు పేర్కొన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను కేవలం ప్రలోభాలకు, బెదిరింపులకు గురిచేసి కొనుగోలు చేసారని ఆరోపించారు. కాంగ్రెస్ సింబల్ మీద గెలిచిన ఎమ్మెల్యేలు రాజీనామా చేసి.. ఆ తర్వాత ఏ పార్టీలో చేరిన ఇబ్బంది లేదన్నారు. ఒక దళిత నాయకుడు సీఎల్పీ నేతగా ఉండటం కేసీఆర్కు ఇష్టం లేదని వ్యాఖ్యానించారు. శనివారం ఇందిరా పార్క్ దగ్గర చేపట్టే నిరహారదీక్షకు కాంగ్రెస్ కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చారు. -
కేటీఆర్ను కలిసిన రోహిత్రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. తాండూరు ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు పైలట్ రోహిత్రెడ్డి కాంగ్రెస్కు గుడ్ బై చెప్పనున్నారు. ఆయన టీఆర్ఎస్లో చేరేందుకు కూడా రంగం సిద్ధమైంది. ఇదివరకే టీఆర్ఎస్ నేతలతో చర్చలు జరిపిన రోహిత్రెడ్డి గురువారం ప్రగతిభవన్లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కలిశారు. దీంతో ఆయన టీఆర్ఎస్లో చేరడం ఖాయమైపోయినట్టుగా సమాచారం. ఏడాది క్రితం గులాబీ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ఆయన అనంతరం కాంగ్రెస్లో చేరి తాండూరు ఎమ్మెల్యేగా గెలుపొందిన సంగతి తెలిసిందే. గతేడాది డిసెంబర్లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున 19 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. అందులో ఇప్పటికే 11 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ చేరారు. తాజాగా రోహిత్రెడ్డి చేరికతో ఆ సంఖ్య 12కు పెరిగింది. నల్లగొండ ఎంపీగా గెలుపొందిన ఉత్తమ్కుమార్రెడ్డి బుధవారం తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే సంఖ్య 6కు చేరనుంది. అయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే కూడా పార్టీని వీడనున్నారనే ప్రచారం విస్తృతంగా జరుగుతుంది. ఇదే జరిగితే కాంగ్రెస్లో 5గురు ఎమ్మెల్యేలు మాత్రమే మిగలనున్నారు. టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలకు కేటీఆర్ విందు కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలకు కేటీఆర్ విందు ఇవ్వనున్నారు. ఇందుకోసం ఎమ్మెల్యేలంతా ప్రగతిభవన్కు చేరుకుంటున్నారు. టీఆర్ఎస్ఎల్పీలో సీఎల్పీని విలీనం చేయాల్సిందిగా ఎమ్మెల్యేలు అసెంబ్లీలో లేఖను సమర్పించనున్నట్టుగా తెలుస్తోంది. -
సార్వత్రిక ఎన్నికల కోసం టీ కాంగ్రెస్ వ్యూహాలు
-
మహాకూటమిలో కాంగ్రెస్ టిక్కెట్ల గోల
-
తెలంగాంణ కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తి
-
‘హస్త’వాసి ఎవరికో..?
సాక్షిప్రతినిధి, ఆదిలాబాద్: మహాకూటమి పొత్తుల లెక్కలు తేలకపోయినా... కాంగ్రెస్ ఎన్నికల కమిటీ ఉమ్మడి జిల్లా పర్యటన మాత్రం ఖరారైంది. నవంబర్ ఒకటో తేదీ నుంచి ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క, కో చైర్పర్సన్ డీకే.అరుణ, స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి ప్రచారం సాగనుంది. నాలుగు రోజుల పాటు సాగే ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా నిర్మల్ జిల్లాలోని నిర్మల్, ముథోల్లలో మినహా ఎనిమిది నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. భైంసాలో ఇటీవలే రాహుల్గాంధీ ప్రచారసభను విజయవంతంగా నిర్వహించిన నేపథ్యంలో ముథోల్, నిర్మల్ మినహా మిగతా నియోజకవర్గాల్లో ప్రచారాన్ని సాగించనున్నారు. ఈ మేరకు రూట్ మ్యాప్ కూడా తయారైంది. అయితే ఇప్పటివరకు మహాకూటమిలో పొత్తులపైన స్పష్టత లేకపోవడం కార్యకర్తలను అయోమయానికి గురిచేస్తోంది. నవంబర్ ఫస్ట్కు ముందే స్పష్టత! మహాకూటమిలో పొత్తుల అంశాన్ని నెలరోజులుగా నానుస్తూ వస్తున్న కాంగ్రెస్ వైఖరి పట్ల ఇప్పటికే టీజేఎస్, సీపీఐ తమ అసంతృప్తిని వ్యక్తం చేశాయి. టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ మరో అడుగు ముందుకేసి రెండురోజుల్లో తేల్చకపోతే మొదటి విడతగా తమ పార్టీ అభ్యర్థుల జాబితా విడుదల చేస్తానని హెచ్చరించినట్లు వార్తలు వచ్చాయి. పొత్తుల్లో తమకు కేటాయించే సీట్ల సంఖ్య తగ్గితే ఒప్పుకోమని, పార్టీ గుర్తుల మీద పోటీ చేస్తారని సీపీఐ కూడా హెచ్చరించింది. అయినా కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ, కోర్ కమిటీ సమావేశాలతోనే కాలం వెల్లుబుచ్చుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. సోమవారం కూడా స్క్రీనింగ్ కమిటీతో కోర్ కమిటీ భేటీ అయింది. ఇప్పటికే ఖరారు చేసిన జాబితాను ప్రకటించాలని కోర్ కమిటీలో నేతలు కోరగా, పొత్తులు ఖరారు కాకుండా అభ్యర్థులను ప్రకటించడం వీలుకాదని స్క్రీనింగ్ కమిటీ స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మంగళ, బుధవారాల్లోనే పొత్తులు ఖరారయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లా భట్టి వర్గంలో జోష్ పూర్వ ఆదిలాబాద్ జిల్లాలో నియోజకవర్గాల వారీగా పార్టీ రెండు వర్గాలుగా విడిపోయింది. డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్రెడ్డి అండదండలతో పార్టీ టికెట్టు ఆశిస్తున్న వారంతా ఉత్తమ్కుమార్రెడ్డి వర్గంగా ఉండగా, మహేశ్వర్రెడ్డిని వ్యతిరేకించే వారంతా మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేంసాగర్రావు నాయకత్వంలో భట్టి విక్రమార్క వర్గంగా టికెట్లు ఆశిస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రచార కమిటీ ఛైర్మన్, కో చైర్పర్సన్గా ఉత్తమ్కుమార్రెడ్డిని తీవ్రంగా వ్యతిరేకించే భట్టి, డీకేలకే అవకాశం లభించడం ఉమ్మడి జిల్లాలోని ప్రేంసాగర్రావు వర్గానికి ఊపునిచ్చింది. నవం»బర్ ఒకటి నుంచి నాలుగోతేదీ వరకు సాగే పర్యటనలో భట్టి వర్గీయులే ప్రముఖంగా కనిపించే అవకాశం ఉంది. అయితే ప్రచార కమిటీ పర్యటన కాబట్టి నాయకులంతా హాజరవుతారని, గ్రూపులతో సంబంధం ఉండదని ప్రేంసాగర్రావు సాక్షితో మాట్లాడుతూ చెప్పారు. హస్తవాసి దక్కేదెవరికో... పొత్తుల లెక్కలు తేలకపోయినా పది నియోజకవర్గాలలో కాంగ్రెస్ నుంచి టికెట్లు ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువే ఉంది. అయితే డీసీసీ, పీసీసీల స్థాయిలో వడబోత ముగిసింది. స్క్రీనింగ్ కమిటీ కూడా వేర్వేరు సర్వేలు, సలహాలు, సూచనలతో పాటు వాస్తవ పరిస్థితుల ఆధారంగా ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఖరారు చేసింది. ఈ మేరకు సోమవారం కోర్కమిటీ సమావేశం తరువాత ఏఐసీసీకి అభ్యర్థుల జాబితాను పంపించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో నిర్మల్ నుంచి ఏలేటి మహేశ్వర్రెడ్డి, ఆసిఫాబాద్ నుంచి ఆత్రం సక్కు మినహా ఎవరూ ఆశావహులు లేరు. ముథోల్లో రామారావు పటేల్, నారా యణరావు పటేల్తో పాటు ఎన్నారై పి.విజయ్కుమార్రెడ్డి కూడా టికెట్టు రేసులో ఉన్నారు. వీరిలో ప్రజలతో సంబంధాలు మెరుగ్గా ఉన్న నేతనే స్క్రీనింగ్ కమిటీ అభ్యర్థిత్వానికి సిఫారసు చేసినట్లు తెలిసింది. బోథ్లో సోయం బాపూరావు, అనిల్జాదవ్లలో ఎస్టీల్లోని రెండు వర్గాలను సమతుల్యం చేసే ప్రక్రియలోనే అభ్యర్థి ఖరారు కానున్నారు. ఆదిలాబాద్లో సామాజిక సర్థుబాటుతో పాటు మంత్రి రామన్నకు గట్టి పోటీనిచ్చే మహిళా అభ్యర్థిని నిలబెట్టాలని భావిస్తే గండ్రత్ సుజా తకు అవకాశం దక్కనుంది. ఖానాపూర్లో రాథోడ్ రమేష్ అభ్యర్థిత్వంపై హామీతోనే కాంగ్రెస్లో చేరిన నేపథ్యంలో ఆయనకే సీటు ఖాయమనే ప్రచారం ఉంది. సిర్పూరులో హరీష్బాబు, రావి శ్రీనివాస్ మధ్య పోటీలో హరీష్ వైపే స్క్రీనింగ్ కమిటీ మొగ్గు చూపినట్లు సమాచారం. చెన్నూరులో బోర్లకుంట వెంకటేష్ నేత, మాజీ మంత్రి బోడ జనార్దన్ ఎవరికి వారే ప్రయత్నాలు చేసినా, స్క్రీనింగ్ కమిటీ వెంకటేశ్ నేతను ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. బెల్లంపల్లిలో గద్దర్ తనయుడు సూర్యకిరణ్ను తెరపైకి తెచ్చినా, సీపీఐ పొత్తులో సీటు గల్లంతయ్యే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక మంచిర్యాలలో టికెట్టు తనదేనని కొక్కిరాల ప్రేంసాగర్రావు ధీమాతో ఉన్నారు. అయితే స్క్రీనింగ్ కమిటీ ఫైనల్ చేసిన వారే అభ్యర్థిగా బరిలో దిగనున్నారు. రెండు రోజుల్లో జాబితా కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. -
సెక్యూరిటీపై డీజీపీని కలిసిన టీ కాంగ్రెస్ నాయకులు
సాక్షి, హైదరాబాద్: తమ పార్టీ నేతలకు అదనపు భద్రత కల్పించాలని కోరుతూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు డీజీపీ మహేందర్ రెడ్డిని కలిశారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డికి జెడ్ క్యాటగిరీ భద్రతతోపాటు, బుల్లెట్ ప్రూఫ్ వాహనం, ఎస్కార్ట్ కల్పించాలని డీజీపీని కోరారు. అలాగే పార్టీ సీనియర్ నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి 4+4 సెక్యూరిటీ కల్పించాలని, భట్టి విక్రమార్కకు ప్రస్తుతం ఉన్న సెక్యూరిటీని పెంచాలని డీజీపీకి వినతిపత్రం అందజేశారు. వారితో పాటు విజయశాంతి, మధుయాష్కి, గూడూరు నారాయణ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్లకు సెక్యూరిటీ కల్పించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. డీజీపీని కలిసిన వారిలో టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి, ప్రధాన కార్యదర్శి హర్కర వేణుగోపాల్ ఉన్నారు. దీనిపై స్పందించిన డీజీపీ విధివిధానాలకు అనుగుణంగా నేతలకు భద్రతను కొనసాగిస్తామని వారికి హామీ ఇచ్చారు. మరోవైపు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి కేంద్ర బలగాలకు చెందిన 4+4 సిబ్బందితో భద్రత కల్పించాలని తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారిని, రాష్ట్ర డీజీపీని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. అలాగే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రకటించే వరకు ఈ భద్రతను కొనసాగించాలని పేర్కొంది. -
పెద్ద తలకాయల వేటలో ఇద్దరు ‘హస్తం’ సీనియర్లు
సాక్షి, హైదరాబాద్: టికెట్లు ఆశించి భంగపడ్డ టీఆర్ఎస్ అసంతృప్తవాదులకు కాంగ్రెస్ పార్టీ గాలం వేస్తోంది. ఇందులో భాగంగానే.. సొంత పార్టీలోని ప్రత్యర్థులను మట్టికరిపించాలని భావిస్తున్న ఇద్దరు టీఆర్ఎస్ మంత్రులు, ఇద్దరు ఎంపీలు, ఓ ఎమ్మెల్సీ.. కాంగ్రెస్ జాబితాలో ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ నెల 20న రాహుల్ గాంధీ పర్యటన తర్వాత వీరంతా పార్టీలో చేరే అవకాశం పుష్కలంగా ఉందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డే ‘సాక్షి’ ప్రతినిధితో వెల్లడించారు. ప్రస్తుతం చర్చలు తుది దశలో ఉన్నాయని ఆయన తెలిపారు. నిజామాబాద్ మాజీ ఎంపీ, రంగారెడ్డి జిల్లాకు చెందిన మరో మాజీ మంత్రి కలిసి.. టీఆర్ఎస్ అసంతృప్తులతో చర్చలు జరుపుతున్నారని విశ్వసనీయ సమాచారం. టీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డ చాలా మంది కాంగ్రెస్లో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నప్పటికీ.. పెద్ద తలకాయలను చేర్చుకునేందుకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లు టీపీసీసీ వర్గాలు చెప్పాయి. అయితే, ఇదంతా కాంగ్రెస్ ఆడుతున్న మైండ్గేమని టీఆర్ఎస్ ముఖ్య నాయకుడొకరు తేలిగ్గా తీసిపారేశారు. ఎన్నికల్లో గెలవలేమని తెలిసే.. కాంగ్రెస్ ఇలాంటి నక్కజిత్తులకు పాల్పడుతోందని ఆయన విమర్శించారు. కేసీఆర్ వద్దనుకున్నందుకే.. ఉత్తర తెలంగాణ జిల్లాలకు చెందిన ఓ మంత్రి ఈసారి శాసనసభకు పోటీ చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. అయితే, కేసీఆర్ ఒకేసారి ప్రకటించిన 105 నియోజకవర్గాల అభ్యర్థుల్లో.. తాను గతంలో ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గానికి తాజా మాజీ ఎమ్మెల్యే పేరు ప్రకటించడంతో ఆయనతోపాటు ఆయన అనుచరులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పోటీ చేయకపోతే.. ఆ నియోజకవర్గంపై పట్టు కోల్పోతానన్న భావనలో సదరు మంత్రి ఉన్నారు. దీనిని అదనుగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ ఆ మంత్రితో రాయబారం నెరిపింది. తాను కోరుకున్న నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టిక్కెట్ ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నామన్న సందేశం పంపింది. అయితే తనతో పాటు తన కుటుంబ సభ్యుల్లో ఒకరికి మరో చోట నుంచి టిక్కెట్ ఇవ్వాలని ఆయన షరతు పెట్టినట్లు తెలిసింది. బుధవారం ఢిల్లీ వెళ్లిన ఉత్తమ్ కుమార్ రెడ్డి.. కొత్తగా పార్టీలో చేరేవారి వివరాలు, వారు పెడుతున్న డిమాండ్లను పార్టీ పెద్దల దృష్టికి తీసుకొచ్చినట్లు సమాచారం. దక్షిణ తెలంగాణ జిల్లాలకు చెందిన మరో మంత్రి తన కుటుంబ సభ్యుల్లో ఒకరికి టీఆర్ఎస్ టిక్కెట్ కావాలని గట్టిగా అడుగుతున్నారు. ఇదే విషయాన్ని ఆయన బహిరంగంగానే వెల్లడించారు. అయితే సదరు మంత్రికి, ఆయన కుటుంబ సభ్యులకు టిక్కెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ సుముఖత వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో.. టీఆర్ఎస్ టిక్కెట్ రాకపోతే ఆలోచిస్తానని ఆయన చెప్పినట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. మంత్రిని ఓడించాలన్న కసితో ఎంపీ దక్షిణ తెలంగాణ జిల్లాలకు చెందిన లోక్సభ సభ్యుడొకరు ప్రస్తుత మంత్రి ఒకరిని ఓడించాలన్న కసితో ఉన్నారు. అవసరమైతే కాంగ్రెస్ పార్టీలో చేరి పోటీ చేసి అయినా అనుకున్నది సాధించాలన్న ఆలోచనతో ఉన్నారు. ఇదే విషయాన్ని ఆయన తన సన్నిహితులతో చెప్పారని తెలుసుకున్న కాంగ్రెస్ ఆయనకు పార్టీ టిక్కెట్ ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. దీనిపై ఆ ఎంపీ తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం. ఉత్తర తెలంగాణ జిల్లాలకు చెందిన మరో ఎంపీ కూడా శాసనసభకు పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఆయనకు కూడా కాంగ్రెస్ టికెట్ ఇస్తామని భరోసా ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజవకర్గం నుంచి పోటీ చేయాలన్న భావనలో ఉన్న అధికార పార్టీకి చెందిన ఓ ప్రముఖ ఎమ్మెల్సీకి కాంగ్రెస్ టికెట్ ఇచ్చేందుకు ముందుకొచ్చింది. అయితే.. ఈ విషయాన్ని సదరు ఎమ్మెల్సీ కొట్టిపారేయగా, ఆయన సీటు కోసం తమతో సంప్రదింపులు జరుపుతున్నారని కాంగ్రెస్ అంటోంది. -
‘ముస్లిం’ ప్రాంతాల్లో రాహుల్ టూర్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో.. తెలంగాణలో ముస్లిం ఓట్లు ప్రభావవంతంగా ఉండే ప్రాంతాల్లో ప్రచారం చేయించాలని ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగానే.. ఈ నెల 20న హైదరాబాద్లోని పాతబస్తీతోపాటు ఆదిలాబాద్ జిల్లా భైంసా, కామారెడ్డిల్లో సభలు నిర్వహించేలా షెడ్యూల్ ఖరారు చేసింది. మొదట బోథ్, కామారెడ్డిల్లో 20వ తేదీన సభలు నిర్వహించాలని అనుకున్నప్పటికీ.. ఆదివారం పార్టీ ముఖ్యనేతల భేటీలో ఈ వ్యూహం సిద్ధం చేశారు. తాజా షెడ్యూల్ ప్రకారం.. 20న ఉదయం 10:30 గంటలకు హైదరాబాద్ చేరుకున్న తర్వాత.. రాహుల్ నేరుగా పాతబస్తీకి వెళతారు. అక్కడ పార్టీ కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు ‘రాజీవ్ గాంధీ సద్భావన దివస్’సందర్భంగా ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. భోజన విరామం తర్వాత 1:30 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఆదిలాబాద్ జిల్లా భైంసా చేరుకుంటారు. అక్కడ బహిరంగసభ పూర్తయిన తర్వాత.. హెలికాప్టర్లో కామారెడ్డి జిల్లా కేంద్రానికి వెళ్లి అక్కడ మరో బహిరంగసభలో రాహుల్ పాల్గొంటారు. అక్కడినుంచి రోడ్డు మార్గంలో హైదరాబాద్ చేరుకుని.. రాత్రికి ఢిల్లీ వెళ్తారు. కాగా, భైంసా, కామారెడ్డిల్లో రాహుల్ పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి ఆర్సీ కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డిలు సోమవారం ఈ రెండు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. -
ఆ ఒక్కటీ తప్ప!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ‘రఫేల్’ భయం పట్టుకుంది. ఆ మాట వింటేనే వారిలో ఆందోళన కనిపిస్తోంది. అదేంటి.. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రధాన అస్త్రం అదే కదా? ఈ అంశంతోనే కదా కేంద్రంలోని బీజేపీని ఇరుకున పెడుతోంది. అలాంటిది ఈ విషయంలో కాంగ్రెస్ నేతలకు భయమెందుకు అంటారా? ఇక్కడే అసలు విషయం ఉంది. తెలంగాణలో రఫేల్ అంశం వల్ల తమకు పెద్దగా ఒరిగేదేమీ ఉండదని టీపీసీసీ నేతల భావన. రాష్ట్రంలో బీజేపీని విమర్శిస్తే ప్రయోజనం ఏమీ ఉండదని, టీఆర్ఎస్ లక్ష్యంగానే రాహుల్ ప్రసంగం ఉండాలని వారు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర పర్యటనకు వచ్చే రాహుల్గాంధీ.. ఆ ఒక్క అంశం తప్ప మిగిలినవాటిపై దృష్టిసారిస్తే బావుంటుందని భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఎక్కడ ప్రచారం చేస్తున్నా.. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ప్రధానంగా ప్రస్తావిస్తున్న అంశం.. రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు వివాదమే. బీజేపీ, మోదీ లక్ష్యంగానే ఆయన విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఇటీవల రెండ్రోజుల రాష్ట్ర పర్యటనలో భాగంగా రాహుల్ రెండు బహిరంగ సభల్లోనూ రఫేల్ డీల్ పైనే ప్రధానంగా దృష్టిపెట్టారు. బీజేపీని టార్గెట్ చేసుకుని అస్త్రాలు సంధించారు. అయితే.. ఇక్కడ కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థి అయిన టీఆర్ఎస్పై కాకుండా బీజేపీపై పోరాడితే పార్టీకి ఎన్నికల్లో చేకూరే ప్రయోజనం పెద్దగా ఉండదని రాష్ట్ర నేతలంటున్నారు. రఫేల్ గురించి గొంతు చించుకున్నా తెలంగాణలో కలిసిరాదనేది వారి ఆవేదన. అందుకే రాహుల్ తన ప్రసంగంలో ప్రస్తావించాల్సిన అంశాలను పేర్కొంటూ వీరు ఓ నోట్ సిద్ధం చేశారు. అందులో ఏముందని ఓ సీనియర్ కాంగ్రెస్ నేతను అడగ్గా.. రాఫెల్ తప్ప అన్నీ ఉన్నాయని నవ్వుతూ బదులిచ్చారు. టార్గెట్ టీఆర్ఎస్ ‘వచ్చే ఎన్నికల్లో మా కూటమికి ప్రధాన ప్రత్యర్థి టీఆర్ఎస్. అలాంటప్పుడు బీజేపీపై ఎంతగా అరచి గగ్గోలు పెట్టినా తెలంగాణలో మాకు పెద్దగా ఒరిగేది ఏముంటుంది. అందుకే.. టీఆర్ఎస్ను లక్ష్యంగా చేసుకుని ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన హామీలు, వాటిని నెరవేర్చని వైనంపై ఓ నివేదిక తయారు చేశాం. వాటినే ప్రధానంగా తీసుకుని ఓ నోట్ను సిద్దంచేశాం. దీనిలో ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ, డబుల్ బెడ్రూమ్, దళితులకు మూడెకరాలు, పాలమూరు ఎత్తిపోతల పథకం, పేదలకు ఇళ్ల నిర్మాణంలో నిర్లక్ష్యం, కేజీ టూ పీజీ వంటి హామీలకు సంబంధించి సవివరమైన పాయింట్లు చేర్చాం. బంగారు తెలంగాణకు బదులుగా కేసీఆర్ కుటుంబానికి తెలంగాణ బంగారంలా కలిసి వచ్చిందన్నది ఉదాహరణలతో సహ వివరించాం. ఇవి కాకుండా నిత్యం ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు, సీఏం ఏళ్లతరబడి సచివాలయానికి రాకపోవడం వంటి చాలా విషయాలుంటాయి’అని ఆ సీనియర్ కాంగ్రెస్ నేత వివరించారు. ఇక రాజకీయానికి వస్తే తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ, మజ్లిస్ సమన్వయంతో ముందుకు వెడుతున్న విషయాన్ని ప్రజలకు వివరించాలన్నది తెలంగాణ కాంగ్రెస్ నేతల కోరిక. ఈ విషయాన్ని తమద్వారా కాకుండా రాహుల్ నోటివెంటచెప్పిస్తే.. ప్రాధాన్యత ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. రాహుల్ అంగీకరిస్తారా? తెలంగాణ కాంగ్రెస్ నేతల ఆరాటం సరే.. వీరు సిద్దం చేస్తున్న ప్రసంగం నోట్ను రాహుల్ ఆచరిస్తారా? రాఫెల్ను కాదని స్థానిక రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని మాట్లాడతారా? అంటే స్పష్టమైన సమాధానం దొరకడం లేదంటున్నారు. తాము చెప్పింది రాహుల్ అర్థం చేసుకుంటారనే అనుకుంటున్నామన్నారు. ఇటీవల మధ్యప్రదేశ్ ప్రచారంలో భాగంగా.. రాహుల్కు అక్కడ 15ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ వైఫల్యాల గురించి మాట్లాడాలని రాష్ట్ర నేతలు పెద్ద చిట్టా తయారుచేసి ఇచ్చారు. అయితే రాహుల్ మాత్రం.. వీటన్నింటికీ పెద్ద ప్రాధాన్యత ఇవ్వలేదు. తన 50 నిమిషాల ప్రసంగంలో దాదాపు 40 నిమిషాల పాటు రాఫెల్ ఒప్పందం, కేంద్రంలో మోదీ ప్రభుత్వ వైఫల్యాలపైనే మాట్లాడారు. అయితే మధ్యప్రదేశ్లోని శివరాజ్సింగ్ చౌహాన్ ప్రభుత్వంపై రాహుల్ పొడిపొడిగా మాట్లాడారన్న విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నేతలు.. ఈసారి మరింత జాగ్రత్త పడాలని ఆలోచిస్తున్నారు. రాహుల్ పర్యటనకు రెండ్రోజుల ముందే.. ఢిల్లీ వెళ్లి తెలంగాణ సభల్లో ఏం మాట్లాడాలన్నది ఆయనకు విడమరిచి చెప్పాలనుకుంటున్నారు. మంచి ప్రయత్నమే.. కానీ రాహుల్ వీరి మొరను ఆలకిస్తారా! -
‘ముందస్తు ఎన్నికలకు వెళ్లడం కేసీఆర్ కర్మ’
సాక్షి, గద్వాల: తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు వెళ్లడం అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ కర్మ అని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. గురువారం గద్వాలలో జరిగిన కాంగ్రెస్ ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ.. గద్వాల ప్రజల ఉత్సాహం చూస్తుంటే కేసీఆర్ ఓటమి ఖాయంగా కనిపిస్తోందని జోస్యం చెప్పారు. ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకుంటే నాకేంటన్న కేసీఆర్కు 20 రోజుల్లోనే భయం పట్టుకుందని విమర్శించారు. కేసీఆర్ కుటుంబం గజదొంగల్లా తెలంగాణను దోచుకుంటుందని.. వారిని తరిమి కొట్టడానికి ప్రజాసంఘాలు, ప్రజలు, అన్ని పక్షాలు కలిసి రావాలని కోరారు. కేసీఆర్ నంబర్ వన్ తెలంగాణ ద్రోహి అని ఆరోపించారు. దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, లక్ష ఉద్యోగాలు ఇలా ప్రతి విషయంలో కేసీఆర్ మోసం చేశారని మండిపడ్డారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీకి ఎజెంట్.. మోదీ తీసుకున్న అన్ని నిర్ణయాలకు కేసీఆర్ మద్దతు తెలిపారు. నిజామాబాద్ సభలో ఇతరులపై నోరు పారేసుకున్నారు. తెలంగాణ ద్రోహులందరిని కేసీఆర్ పక్కకు పెట్టుకున్నారు. నేను పాకిస్తాన్, చైనా బార్డర్లో పనిచేసిన సమయంలో దుబాయ్ బ్రోకర్గా పనిచేసిన కేసీఆర్ నా గురించి మాట్లాడుతున్నావా?. రాబోయే కాంగ్రెస్ పాలనలో ఒకేసారి రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాం. కేంద్రం ఇచ్చే మద్దతు ధరకు మరింత బోనస్ కలిపి పంటలను కొనుగోలు చేస్తాం. మొదటి సంవత్సరమే లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాం. పది లక్షల మందికి నెలకు 3 వేల చొప్పున నిరుద్యోగ భృతి అందజేస్తాం. ప్రైవేట్ కాలేజ్ల్లో చదివేవారికి పూర్తి రీయింబర్స్మెంట్ ఇస్తామ’ని తెలిపారు. కేసీఆర్ది శృంగారం.. మాదీ వ్యభిచారామా? డీకే అరుణ మాట్లాడుతూ.. చంద్రబాబుతో కేసీఆర్ పొత్తు పెట్టుకుంటే తప్పులేదు కానీ.. కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటే తప్పా అని ప్రశ్నించారు. కేసీఆర్ది శృంగారం.. మాదీ వ్యభిచారామా అని తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందని విజయశాంతి పార్టీలో చేరారు కానీ.. టీఆర్ఎస్ను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తాని చెప్పిన కేసీఆర్ మాత్రం మాట మార్చరని మండిపడ్డారు. పాలమూరు నుంచి ఎంపీగా ఉన్న సమయంలో కేసీఆర్ పార్లమెంటులో ఒక్కసారైనా ఆర్డీఎస్ గురించి మాట్లాడలేదని తెలిపారు. పార్లమెంటులో తెలంగాణ గురించి చర్చ జరిగనప్పుడు కేసీఆర్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలను అన్నింటా మోసం చేసిన కేసీఆర్ కులాల మధ్య చిచ్చు పెట్టాడని విమర్శించారు. చేసిన అవినీతిని బయటపడకుండా ఉండేందుకు కేసీఆర్ బీజేపీతో లోపాయికారి ఒప్పందం పెట్టుకున్నారని ఆరోపించారు. -
‘అబద్ధాలు చెప్పేవారిని హైదరాబాద్లో బట్టేబాజ్ అంటారు’
సాక్షి, అలంపూర్: తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ జోగుళాంబ గద్వాల జిల్లా నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టింది. గురువారం ఉదయం అలంపూర్ చేరుకున్న కాంగ్రెస్ నాయకులు జోగుళాంబ శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు చేసి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత జరిగిన సభలో సీనియర్ నేత జనారెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా, రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా మోసం చేశాడని విమర్శించారు. ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగుల, విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ నియంత పాలన కొనసాగిస్తున్నారని.. ఎవరు ప్రశ్నించిన అణచివేస్తున్నాడని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. టీడీపీ, కాంగ్రెస్ పొత్తుపై మాట్లాడుతున్న కేసీఆర్.. ఇంతకుముందు టీడీపీతో పొత్తు పెట్టుకున్న విషయాన్ని గమనించాలని ప్రజలను కోరారు. కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇస్తే తాను టీఆర్ఎస్ కండువా కప్పుకుంటానని అన్నట్టు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని.. తాను ఆ మాట అన్నట్టు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాలు విసిరారు. టీపీసీసీ అధ్యక్షడు ఉత్తమ్ కుమార్రెడ్డి మాట్లాడుతూ.. ‘అబద్ధాలు చెప్పేవారిని హైదరాబాద్లో బట్టేబాజ్, దోకేబాజ్ అని అంటారు. తెలంగాణ ప్రజలను మోసం చేసినందుకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బట్టేబాజ్. గిరిజనులను, దళితులను, ఇలా అన్ని వర్గాలను మోసం చేసినందుకు కేసీఆర్ దోకేబాజ్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని, ప్రతి ఒక్కరికి సన్న బియ్యం అందజేస్తామని హామీలు ఇచ్చారు. కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి మాట్లాడుతూ.. ఉద్యమాలు చేసి ఎన్నో అవమానాలు పడి నేడు తెలంగాణను దొరల పాలు చేశామని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల అకాంక్ష తీర్చింది యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ మాత్రమేనని అన్నారు. రాములమ్మ సినిమాలో రాములమ్మ ఎన్ని కష్టాలు పడిందో.. తెలంగాణలో నేడు ప్రజలు ఆ కష్టాలు పడుతున్నారని ఆరోపించారు. తనను దేవుడిచ్చిన చెల్ల అన్న కేసీఆర్.. కారణం లేకుండా తనను పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చెప్పాలన్నారు. రైతు బంధు పథకం రైతు మరణ బంధు అవుతుందని విమర్శించారు. చిన్న ఇల్లు కోసం ఆశపడి తెలంగాణను దొరలకు కట్టబెట్టామని.. ఈ పాలనకు చరమ గీతం పాడి కాంగ్రెస్ను గెలిపించాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ డబ్బు ఇస్తే తీసుకుని కాంగ్రెస్కు ఓటు వేయాలని ప్రజలను కోరారు. ప్రజలు కేసీఆర్కు అయిదేళ్ల అధికారం ఇస్తే నాలుగేళ్లకే పారిపోయాడని.. మళ్లీ అధికారం ఇస్తే మూడేళ్లకే పారిపోతాడని ఎద్దేవా చేశారు. -
మల్కాజ్గిరిలో కాంగ్రెస్కు షాక్..!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రానున్న వేళ మల్కాజ్గిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురు ముఖ్య నాయకులు పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు, ఓబీసీ సెల్ రాష్ట్ర జాయింట్ కన్వీనర్ సీత బాబుయాదవ్, ఆయనతోపాటు జిల్లా కార్యదర్శులు ఎల్ లవకుమార్, రోహిత్ నాయుడు, ప్రవీణ్ కుమార్, రాష్ట్ర మైనారిటీ సెల్ కన్వీనర్ ముజీబ్లు రాజీనామా చేసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో నాయకులకు, కార్యకర్తలకు సరైన గుర్తింపు లేకపోవడంతోనే పార్టీకి రాజీనామా చేశామని అన్నారు. తమ రాజీనామాలను ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డికి పంపనున్నట్టు తెలిపారు. -
తెలంగాణ కాంగ్రెస్కు చంద్రబాబు ఆఫర్
-
60మందితో కాంగ్రెస్ తొలి జాబితా!
-
టీడీపీ-కాంగ్రెస్ నేతల రహస్య భేటీ...?
-
ఏం చేద్దాం.. ఎలా ముందుకెళ్దాం?
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారంలోకి రావాలంటే ఏం చేయాలనే అంశంపై ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్గాంధీ రాష్ట్రంలోని పార్టీ సీనియర్లతో చర్చించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు మాజీ మంత్రులు, మాజీ పీసీసీ అధ్యక్షులతో కూడిన 40 మంది నేతలతో ఆయన మంగళవారం ఇక్కడి హరిత ప్లాజాలో సమావేశమయ్యారు. ఒక్కొక్కరి దగ్గరకు విడిగా వెళ్లి రాష్ట్రంలో పార్టీ బలోపేతంతోపాటు రానున్న ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై చర్చించారు. ఈ విషయాల్లో ప్రతి ఒక్కరి వ్యక్తిగత అభిప్రాయాలను కూడా తీసుకున్నారు. నేతలందరూ చెప్పిన విషయాలను సావధానంగా విన్న రాహుల్... తెలంగాణలో పార్టీ పరిస్థితిపై పూర్తిస్థాయి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. సీనియర్ల సూచనలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. రాహుల్కు ఎవరేం చెప్పారంటే.... - రాష్ట్రంలోని వాస్తవ పరిస్థితులు, కేసీఆర్ వైఫల్యాల గురించి వివరించా – జీవన్రెడ్డి, ఎమ్మెల్యే - బీసీలకు క్రీమీలేయర్ ఎత్తేసే అంశాన్ని పార్టీ మేనిఫెస్టోలో పెట్టాలని, అలా చేస్తే దేశంలోని ఓబీసీలంతా కాంగ్రెస్ వైపే నిలుస్తారని చెప్పా. సచివాలయం తరలింపు కోసం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలనూ వివరించా.’ – వి.హనుమంతరావు, మాజీ ఎంపీ - మేనిఫెస్టోలో పెట్టాల్సిన అంశాలను మెమొరాండం రూపంలో తయారు చేసి ఇచ్చాను. పార్టీ బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యలు కూడా అందులో ఉన్నాయి. 18న శక్తియాప్ గురించి ఢిల్లీలో జరిగే సమావేశానికి ఆహ్వానించారు. – టి.రామ్మోహన్రెడ్డి, ఎమ్మెల్యే - పార్టీలో మొదటి నుంచీ ఉండి పోరాడుతున్న వాళ్లకే ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పా. ప్యారాచూట్ లీడర్లు, సైబీరియన్ పక్షులు, కొల్లేటి కొంగల్లా వచ్చే నేతలను పార్టీలో చేర్చుకోవద్దని సూచించా. – పొంగులేటి సుధాకర్రెడ్డి, ఎమ్మెల్సీ - మహిళలకు టికెట్ల కేటాయింపులో ప్రాధాన్యమివ్వాలని చెప్పా. 54 శాతం ఉన్న బీసీలకు, గెలిచే వారికి టికెట్లు ఇవ్వాలని కోరా. గతంలో అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో మహిళల కోసం అమలు చేసిన పథకాలన్నింటినీ మళ్లీ అధికారంలోకి వచ్చాక అమలు చేయించాలని కోరా. – ఆకుల లలిత, ఎమ్మెల్సీ - పార్టీ నిబంధనావళిని ఎంత పెద్ద నాయకుడైనా సరే ఉల్లంఘించకూడదని ఆదేశాలివ్వాలని కోరా. నేతల వివాదాస్పద వ్యాఖ్యలనూ నియంత్రించాలని కోరా. నాలుగేళ్లుగా పార్టీలో ఉన్న పరిస్థితులు వివరించా. పార్టీ కోసం నన్ను ఉపయోగించుకోవాలని కోరా. – ఎస్. సంపత్కుమార్, ఎమ్మెల్యే - పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకోవాలని అడిగా. పార్టీ వ్యవస్థ మరింత చురుగ్గా పనిచేయాలని, పార్టీలో సమన్వయం ఉండేలా నాయకులకు సూచనలు ఇవ్వాలని కోరా. – మర్రి శశిధర్రెడ్డి, మాజీ మంత్రి - చెన్నారెడ్డి, రాజశేఖర్రెడ్డిల హయాంలో పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్కు 51 శాతం సీట్లు రాలేదన్న విషయాన్ని గ్రహించాలని రాహుల్కు చెప్పా. దీనిపై లోతుగా విశ్లేషణలు జరగాలని, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే బీసీలు, సెటిలర్ల గురించి ఆలోచించాలని చెప్పారు. రాజకీయ భాగస్వామ్యం, ఆత్మగౌరవం కల్పించాలని కోరా. – పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రి - ‘గెలిచే వారికే టికెట్లు ఇవ్వాలని, టికెట్ల కేటాయింపులో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పా. జిల్లాకో బహిరంగ సభ పెట్టే విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లా. పార్టీ బలోపేతం గురించి ఢిల్లీ వచ్చి మాట్లాడతానని కోరగా రాహుల్ సానుకూలంగా స్పందించారు. – కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, మాజీ మంత్రి - తెలంగాణకు ఎక్కువ సమయం కేటాయించాలని కోరా. చిన్నచిన్న విషయాలు కొంత ఇబ్బందిని కలిగించినా పార్టీని అధికారంలో కి తెచ్చేందుకు అందరం కృషి చేస్తామని చెప్పా. – డి.కె. అరుణ, మాజీ మంత్రి - రాష్ట్ర ప్రజలంతా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుపై వ్యతిరేకంగా ఉన్నారని చెప్పా. ప్రభుత్వంలో, పాలనలోనూ భాగస్వామ్యం లేనందున కాంగ్రెస్ హయాంలోనే తమ గొంతు వినిపించేదనే భావనలో ప్రజలున్నారని చెప్పా. ఆ భావనను సద్వినియోగం చేసుకునే ప్రణాళిక రూపొందించాలని, బీసీలపై మరింత దృష్టి సారించాలని సూచించా. – వంశీచందర్రెడ్డి, ఎమ్మెల్యే - స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ అంశాల గురించి చర్చించా. పార్టీ సంస్థాగత బలోపేతంపై రాహుల్ చాలా కూలంకష అభిప్రాయంతో ఉన్నారు. – ఉత్తమ్ పద్మావతి, ఎమ్మెల్యే. - పార్టీలో ఏకాభిప్రాయం ఉన్నచోట్ల ముందుగానే అభ్యర్థులను ప్రకటించాలని కోరా. మిగిలిన చోట్ల ప్రజాభిప్రాయం తీసుకుని టికెట్లు ఇవ్వాలని, టికెట్లు రాని నేతలకు మరో రూపంలో ప్రాధాన్యం ఇవ్వాలని కోరా. పార్టీ సమన్వయ, ప్రచార, మేనిఫెస్టో కమిటీలను ఏర్పాటు చేసి భావసారూప్య పార్టీలతో పొత్తుల అంశాలను పరిశీలించాలని కోరా. – జి.చిన్నారెడ్డి, మాజీ మంత్రి -
చుట్టపు చూపు..
సాక్షి ప్రతినిధి, వరంగల్ : సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య రాజకీయ ప్రస్తానంపై చర్చ జోరుగా సాగుతోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరించిన పొన్నాల.. కొన్ని నెలల నుంచి పూర్తిగా మౌనముద్రలో ఉన్నారు. 2004 నుంచి 2014 వరకు ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాలను శాసిం చిన ఆయన ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నిర్వహించే పెద్ద కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటున్నారు. చివరికి తన సొంత నియోజకవర్గం జనగామకు కూడా అరుదుగానే వస్తున్నారు. ఈ నేపథ్యంలో పొన్నాల లక్ష్మయ్య రాజకీయ పయనం ఎటు వైపు అనే చర్చ సర్వత్రా జరుగుతోంది. అప్పట్లో అన్నీ తానై.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 2004 నుంచి 2014 వరకు పొన్నాల లక్ష్మయ్య ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాలను పూర్తిస్థాయిలో శాసించారు. రెడ్యానాయక్, కొండా సురేఖ, బస్వరాజు సారయ్యలు మంత్రులుగా పనిచేసినా... కాంగ్రెస్ వ్యవహారాలన్నీ పూర్తిగా పొన్నాల నిర్ణయంతోనే జరిగాయి. 2014 సాధారణ ఎన్నికలకు ముందు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అ«ధ్యక్షుడిగా నియమితులయ్యారు. కీలకమైన 2014 ఎన్నికల్లో కాంగ్రెస్కు సారథిగా వ్యవహరించారు. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయంతో పొన్నాల రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో టీపీసీసీ చీఫ్ పదవిని వదుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. 2019 ఎన్నికలకు ఎవరు దిక్కు..! గత సాధారణ ఎన్నికల్లో రాష్ట్రస్థాయిలో కీలకంగా పనిచేసినా, వరంగల్ ఉమ్మడి జిల్లా రాజకీయాల్లోనూ పొన్నాల తన ప్రభావాన్ని కొనసాగించారు. మరో వైపు కాంగ్రెస్లో అప్పటి వరకు కీలకంగా పనిచేసిన డీఎస్.రెడ్యానాయక్, కొండా సురేఖ, బస్వరాజు సారయ్యలు టీఆర్ఎస్లో చేరారు. దీంతో కాంగ్రెస్లో కీలక నేతలు లేని పరిస్థితి నెలకొంది. అయితే 2019 ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్కు పెద్ద దిక్కు ఎవరనే అంశంపై ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. కష్టకాలంలో నాయకత్వం వహించి పార్టీని నడిపించాల్సిన పొన్నాల దీనికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాలపై ప్రతిపక్షంగా పోరాటం చేయాల్సిన సందర్భాలలో పొన్నాల తీరు అసంతృప్తిగా ఉంటోందని అంటున్నారు. స్వయంగా కార్యక్రమాలను నిర్వహించడం విషయం ఎలా ఉన్నా... కాంగ్రెస్ పార్టీ నిర్ణయాల ప్రకారం జరిగే కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటున్నారని చర్చించుకుంటున్నారు. పొన్నాల లక్ష్మయ్య సొంత నియోజకవర్గమైన జనగామకు సైతం చుట్టపు చూపుగా వచ్చి వెళ్తున్నారు. జిల్లాల పునర్విభజన సమయంలో జనగామ జిల్లా ఏర్పాటు చేయాలంటూ ఉద్యమం తీవ్రస్థాయిలో జరిగిన సమయంలోనూ పొన్నాల కీలకంగా వ్యవహరించలేదనే అభిప్రాయం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉంది. ఆ తర్వాత అదే వైఖరి కొనసాగుతోందని అంటున్నారు. ప్రజాచైతన్య యాత్ర పేరుతో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన బస్సు యాత్రకు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రజల నుంచి సానుకూల స్పందన వచ్చింది. పాలకుర్తి, నర్సంపేట, మొగుళ్లపల్లి సభలకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. వరంగల్ పశ్చిమ, వరంగల్ తూర్పుతోపాటు పలు ఇతర సెగ్మెంట్లలో ఫర్వాలేదనిపించేలా ఈ యాత్ర జరిగింది. ఈ పన్నెండు నియోజకవర్గాల్లో ఏ ఒక్క చోట పొన్నాల పాల్గొనలేదు. రాష్ట్ర నాయకత్వం అంతా వరంగల్కు తరలివచ్చి ‘కాగ్ అద్దంలో కేసీఆర్ అబద్దాలు’ పేరుతో నిర్వహించిన పవర్ పాయింట్ ప్రజంటేషన్కు దూరంగా ఉన్నారు. పొన్నాల ప్రధాన అనుచరుడిగా ముద్రపడిన నాయిని రాజేందర్రెడ్డి ప్రస్తుతం డీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. వచ్చే సార్వ త్రిక ఎన్నికల్లో వరంగల్ పశ్చిమ నుంచి పోటీ చేసేందుకు కసరత్తు ప్రారంభించారు. దీంతో వరంగల్ కార్పొరేషన్ పరిధిలో డివి జన్లలో పాదయాత్రను ప్రారంభించారు. గత వారం రోజులుగా పాదయాత్ర కొనసాగుతోంది. పాదయాత్రను పురస్కరించుకుని నాయినిపై టీఆర్ఎస్ కార్పొరేటర్లు, నేతలు విమర్శలు ఎక్కుపెట్టారు. అధికార పార్టీ ఎదురుదాడిలోనూ యాత్ర జరుగుతున్నా సీనియర్ నేత పొన్నాల కన్నెత్తి చూడడం లేదని కాంగ్రెస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. -
జానారెడ్డి ఇంట్లో సీఎల్పీ సమావేశం
-
స్పీకర్ చర్యలను నిరసిస్తూ కాంగ్రెస్ సంచలన నిర్ణయం
-
టీ - కాంగ్రెస్ ఎన్నారై సెల్ కువైట్ కమిటీ
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎన్నారై సెల్ కువైట్ చాప్టర్ను టీపీసీసీ ఎన్నారై విభాగం చైర్మన్ డా. బీఎం వినోద్ కుమార్ శుక్రవారం (02.03.2018) హైదరాబాద్లో ప్రకటించారు. కన్వీనర్గా కళ్లెం పవన్ కుమార్ రెడ్డి (నల్గొండ జిల్లా), కో-కన్వీనర్గా గుల్లె రాజేశ్వర్ (నిజామాబాద్ జిల్లా), అడ్వైజరీ బోర్డు మెంబర్లుగా రాతుల రెడ్డి (కామారెడ్డి జిల్లా), కొలిచలం పూర్ణచందర్ రావు (ఖమ్మం జిల్లా), షేక్ ముక్తార్ అహ్మద్ (కామారెడ్డి జిల్లా), వర్ల మృణాళిని (మహబూబ్ నగర్ జిల్లా), శివనోళ్ల రాజు (నిజామాబాద్ జిల్లా) ను నియమించారు. కువైట్ దేశంలో పనిచేస్తున్న విదేశీయులు ఇమిగ్రేషన్, నివాస చట్టాలను ఉల్లంఘించిన వారు ఎలాంటి జరిమానా, జైలు శిక్ష లేకుండా తమ తమ దేశాలకు వెళ్లిపోయే అవకాశాన్ని కల్పిస్తూ కువైట్ ప్రభుత్వం ఇటీవల ఆమ్నెస్టీ (క్షమాబిక్ష) ప్రకటించిన విషయం తెలిసిందే. క్షమాబిక్ష పథకంలో వాపస్ రావాలనుకుని ఇబ్బందులు పడుతున్న ప్రవాస భారతీయ కార్మికులకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎన్నారై సెల్ కువైట్ చాఫ్టర్ సభ్యులు చేస్తున్న సేవలను డా. వినోద్ కుమార్ ప్రశంసించారు. -
వెళ్లొద్దన్నా వచ్చిన కాంగ్రెస్ నేతలు
సాక్షి, హైదరాబాద్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్భవన్లో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ శుక్రవారం సాయంత్రం తేనీటి విందు ఇచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు సహా తెలంగాణ, ఏపీ మంత్రులు పలువురు ఈ విందుకు హాజరయ్యారు. అయితే గవర్నర్ టీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నాడని టీ-కాంగ్రెస్ నేతలు ఈ విందును బహిష్కరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్, మాజీ మంత్రి దానం నాగేందర్లు విందుకు హాజరవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ విషయంపై రాపోలు ఆనంద భాస్కర్ మాట్లాడుతూ.. తనకు ఎలాంటి సమాచారం లేదని, వెళ్లొద్దని చెబితే వెళ్లేవాడిని కాదని, పార్టీ నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానన్నారు. కాగా ఈ విందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా హాజరు కాలేదు.. -
మైనార్టీల వైపు కాంగ్రెస్ చూపు
-
కోమటి బ్రదర్స్ వివాదం కొలిక్కి వచ్చినట్టేనా !
-
టీ కాంగ్రెస్కు తలపోటుగా మారిన కోమటిబ్రదర్స్
-
గవర్నర్ను రీకాల్ చేయాలి!
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ను రీకాల్ చేయాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ విషయమై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. గాంధీభవన్లో శనివారం టీ కాంగ్రెస్ కీలక నేతలు భేటీ అయ్యారు. వ్యవసాయ సమస్యలపై కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్యం చేస్తున్న అంశంపై నేతలు చర్చించారు. ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టాలని నిర్ణయించారు. అనావృష్టి, అతివృష్టి వల్ల జరిగిన పంట నష్టం వివరాలతో నివేదిక రూపొందించి ప్రభుత్వాన్ని సమర్పించాలని, ఇటీవలి వర్షాలకు నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు త్వరలో ఓ యాత్ర చేపట్టాలని నిశ్చయించారు. టీపీసీసీ కార్యాలయం కోసం భూమి కేటాయించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరాలని నిర్ణయించారు. -
మూడు టీఎంసీలివ్వండి
నారాయణపూర్ నుంచి విడుదల చేయాలని కర్ణాటక సీఎంను కోరిన టీ కాంగ్రెస్ సాక్షి, బెంగళూరు: తెలంగాణలో నెలకొన్న తీవ్ర కరువు పరిస్థితుల దృష్ట్యా కర్ణాటకలోని నారాయణ్పూర్ జలాశయం నుంచి జూరాలకు మూడు టీఎంసీల నీటిని విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రతిపక్ష నేత జానారెడ్డి, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి, ఇతర నేతలు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కోరారు. తెలంగాణ ప్రతిపక్ష నేతల బృందం మంగళవారం బెంగళూరులోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సిద్ధరామయ్యతో సమావేశమైంది. ఈ సందర్భంగా తెలంగాణలో ఏర్పడ్డ తీవ్ర కరువు పరిస్థితుల గురించి తెలంగాణ నేతలు సీఎంకు వివరించారు. మహబూబ్నగర్ జిల్లా ప్రజల దాహార్తిని తీర్చేందుకు కర్ణాటక నుంచి 3 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కోరారు. కర్ణాటక పరిధిలో జరగాల్సిన రాజోలిబండ మళ్లింపు పథకం ఆధునీకరణ పనులను త్వరగా పూర్తి చేయాలని కోరారు. దీనిపై సిద్ధరామయ్య స్పందిస్తూ ‘కర్ణాటకలో సైతం ప్రస్తుతం తీవ్ర కరువు తాండవిస్తోంది. అయినప్పటికీ మానవతా దృక్పథంతో తెలంగాణకు ఒక టీఎంసీ నీటిని ఇస్తాం’’ అని హామీ ఇచ్చారు. తమ వినతిపై సానుకూలంగా స్పందించిన సిద్ధరామయ్యకు తెలంగాణ నేతలు క ృతజ్ఞతలు తెలిపారు. -
హెచ్సీయూలో రాహుల్ దీక్ష
-
టీకెట్ల కోసం '1300' ధరఖాస్తులు
-
గ్రేటర్లో కలిసొచ్చేదెవరు?
-
రెండు సీట్ల గెలుపు ఎవరి ఖాతాలో..?