tanish
-
వైవిధ్యమైన టైటిల్తో తనిశ్ కొత్త సినిమా
నటుడు, బిగ్బాస్ ఫేం తనిశ్ హీరోగా వేద ఎంటర్ప్రైజెస్ బ్యానర్ ఓ చిత్రం రూపొందుతోంది. లవ్స్టోరీగా రాబోతున్న ఈ చిత్రం టైటిల్ను వాలంటైన్స్ డే సందర్భంగా చిత్ర బృందం ప్రకటించింది. ఈ సినిమాకు కేసీపీడి(కొంచ చూసి ప్రేమించు డూడ్) అనే సరికొత్త టైటిల్ను ఖరారు చేశారు. గౌతమ్ మన్నవ దర్శకత్వం తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని వేద ఎంటర్ప్రైజెస్ పతాకంపై గోదావరి రెస్టారెంట్ దుబాయ్ సహా నిర్మాణంలో కార్తిక్ రెడ్డి , వరుణ్ దగ్గుబాటి సంయుక్తంగా నిర్మించబోతున్నారు. తాజాగా ఈ మూవీ ఫస్ట్లుక్, టైటిల్ను రిలీజ్ చేసన అనంతరం మేకర్స్ మాట్లాడుతూ.. అ ఈ సినిమా షూటింగ్ని మార్చిలో ప్రారంభిస్తామన్నారు. అలాగే ఈఏడాది వేసవికే ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. ప్రజెంట్ జనరేషన్లో యువత మనస్తత్వం, వారి ఆలోచనల ధోరణి నేపథ్యంలో రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని చిత్రీకరించనున్నామన్నారు. -
బిగ్బాస్ బ్యూటీ నందిని బర్త్డే సెలబ్రేషన్స్, టాలీవుడ్ తారల సందడి
బిగ్బాస్ ఫేం, హీరోయిన్ నందిని రాయ్ బర్త్డే సెలెబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. నిన్న(సెప్టెంబర్ 18) ఆమె పుట్టిన రోజు. ఈ సందర్భంగా టాలీవుడ్ సినీ సెలబ్రెటీలు, బిగ్బాస్ మాజీ కంటెస్టెంట్స్ మధ్య ఆమె బర్త్డే వేడుక జరిగింది. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ బర్త్డే సెలబ్రెషన్స్లో నటుడు సాయి కుమార్, వరుణ్ సందేశ్, రాజ్ తరుణ్, తనిష్, బిగ్బాస్ మాజీ కంటెస్టెంట్ సోహెల్, రాహుల్ సిప్లిగంజ్, లహరి శారి, యాంకర్, నటి భాను శ్రీ, వైవా హర్ష, పూజిత, చాందినీ చౌదరి, దర్శకులు సతీష్, కృష్ణ, రఘులు హాజరయ్యారు. ఇక వారందరి సమక్షంలో కేక్ కట్ చేసి తన కోసం వచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సంతోషం వ్యక్తం చేసింది ఆమె. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి కాగా నందిని రాయ్.. అతి చిన్న వయసులోనే మోడల్గా కెరీర్ ప్రారంభించింది. ఈ క్రమంలో పలు అందాల పోటీల్లో పాల్గొన్న ఆమె తక్కువ సమయంలోనే మోడల్గా మంచి గుర్తింపు పొందింది. 2011లో వచ్చిన 040 అనే చిత్రంలో సినీరంగ ప్రవేశం చేసిన ఆమె ఆ తర్వాతా మాయ, ఖుషి ఖుషిగా, మోసగాళ్లకు మోసగాడు, సిల్లీ ఫెలోస్, శివరంజని వంటి హిట్ చిత్రాల్లో నటించింది.ఈ క్రమంలో బిగ్బాస్ 2 సీజన్లో పాల్గొని ఆడియన్స్కు మరింత దగ్గరైంది. బిగ్బాస్ అనంతరం వరుస ఆఫర్లు కొట్టేసి బిజీగా మారింది నందిని. ఇటీవల ఆమె సాయికుమార్, సీనియర్ నటి రాధిక శరత్ కుమార్లు ప్రధాన పాత్రలో వచ్చిన గాలివాన వెబ్ సిరీస్లో నటించి తన నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. -
బిగ్బాస్ తనీష్ హీరోగా 'అంతేలే కథ అంతేలే'
బిగ్బాస్ కంటెస్టెంట్ తనీష్, వికాస్ వశిష్ట (సినిమాబండి) సహర్ కృష్ణన్ (హీరోయిన్) , శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం "అంతేలే కథ అంతేలే". మహారాజశ్రీ, లంక వంటి చిత్రాలతో ప్రేక్షకాదరణ పొందినటువంటి దర్శకుడు శ్రీ ఎం నివాస్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. అనంతపురం బ్యాక్ డ్రాప్తో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్లో ప్రారంభం కానుంది. ఈ సందర్బంగా చిత్ర దర్శకుడు నివాస్ మాట్లాడుతూ.. రిధిమ క్రియేషన్స్ పతాకంపై అంతేలే కథ అంతేలే సినిమా నిర్మిస్తున్నాం. రాయలసీమ ప్రాంతంలోని ఒక మారుమూల గ్రామంలో జరిగే కథ ఇది. ఇందులో అనేక భావోద్వేగాలు మిళితమై ఉంటాయి. ఈ చిత్రాన్ని అనంతపురం, నల్గొండ, హైదరాబాద్లలో మూడు షెడ్యూల్స్లో షూటింగ్ చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నాము' అన్నారు. హీరో తనీష్ మాట్లాడుతూ.. 'ఇలాంటి సినిమాలు చాలా తక్కువ మంది అటెంప్ట్ చేస్తారు. అయితే ఇలాంటి సినిమాలు తక్కువ వచ్చినా ప్రేక్షకులు అదరిస్తారు. ఇప్పటి వరకు నాకున్న ఇమేజ్, నేను చేసిన పాత్రల నుంచి బయటకు వచ్చి చేస్తున్న అద్భుతమైన ఎమోషన్స్తో కూడిన పాత్ర ఇది. ఈ సినిమా చూసి బయటకు వచ్చే ప్రేక్షకుల గుండెలు బరువెక్కుతాయి' అన్నారు. హీరోయిన్ సహార్ కృష్ణన్ మాట్లాడుతూ.. 'నా యాక్టింగ్ చూడకుండానే నన్ను ఇంత ఎమోషన్ ఉన్న పాత్రకు సెలెక్ట్ చేసుకున్న దర్శక, నిర్మాతలకు ధన్యవాదములు' అన్నారు. నటుడు శ్రీనివాస్ మాట్లాడుతూ.. 'సీనియర్ నటి గీతాంజలి రామకృష్ణ గారి అబ్బాయిని. ఇంతకుముందు నేను కొన్ని సినిమాలు చేశాను. ఈ సినిమాలో నాకు మంచి గుర్తింపు వచ్చే పాత్ర దొరికింది' అన్నారు. చదవండి: నా షోకి రమ్మని వాళ్లిద్దరినీ ఎప్పటికీ పిలవను త్రిష రాజకీయ ఎంట్రీపై స్పందించిన హీరోయిన్ తల్లి! -
‘మరో ప్రస్థానం’ మూవీ రివ్యూ
టైటిల్ : మరో ప్రస్థానం నటీనటులు : తనీష్, ముస్కాన్ సేథీ , భానుశ్రీ మెహ్రా, కబీర్ దుహాన్ సింగ్, రాజా రవీంద్ర తదితరులు నిర్మాణ సంస్థ: మిర్త్ మీడియా నిర్మాతలు : ఉదయ్ కిరణ్ దర్శకత్వం: జాని సంగీతం : సునీల్ కశ్యప్ సినిమాటోగ్రఫీ :ఎంఎన్ బాల్ రెడ్డి ఎడిటింగ్: క్రాంతి (ఆర్కే), విడుదల తేది : సెప్టెంబర్ 24, 2021 చైల్డ్ ఆర్టిస్ట్గా ఎన్నో సినిమాల్లో నటించి ‘నచ్చావులే’తో హీరోగా మారాడు తనీష్. ఆ తర్వాత రైడ్, ‘మౌనరాగం’, ’ఏం పిల్లో ఏం పిల్లడో’ లాంటి సినిమాల్లో నటించి టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాధించుకున్నారు. అయితే ఇటీవల కాలంలో కెరీర్ పరంగా తనీష్ చాలా వెనుకబడ్డారు. ఆయన చేసిన సినిమాలన్ని బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. దీంతో కాస్త గ్యాప్ తీసుకున్న తనీష్.. చాలా కాలం తర్వాత ‘మరో ప్రస్థానం’తో ప్రేక్షకుల ముందకు వచ్చాడు. ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్కు పాజిటివ్ రెస్పాన్స్ రావడం, సినిమా ప్రమోషన్స్ కూడా గ్రాండ్గా చేయడంతో ‘మరో ప్రస్థానం’పై అంచనాలు పెరిగాయి. మరి అంచనాలను ఈ మూవీ ఏ మేరకు అందుకుంది? ఈ సినిమా తనీష్ను హిట్ ట్రాక్ ఎక్కించిందా? లేదా? రివ్యూలో చూద్దాం కథేంటంటే ముంబై క్రిమినల్ గ్యాంగ్ లో సభ్యుడు శివ (తనీష్). గ్యాంగ్ రాణేభాయ్( కబీర్ సింగ్ దుహాన్ ) ఈ గ్యాంగ్ లీడర్. ఆ గ్యాంగ్ నేరాల్లో తనూ భాగమవుతూ నేరమయ జీవితం గడుపుతుంటాడు శివ. ఇలా హత్యలు, కిడ్నాప్లంటూ తిరిగే శివ.. నైని (అర్చనా ఖన్నా) అనే అమ్మాయిని చూసి లవ్ లో పడతాడు. నైని కూడా శివను ప్రేమిస్తుంది. తన క్రిమినల్ జీవితానికి, నైని సరదా లైఫ్ కు సంబంధం లేదు. ఈ తేడానే శివను నైని ప్రేమలో పడేలా చేస్తుంది. నైనిని పెళ్లి చేసుకుని క్రిమినల్ లైఫ్ వదిలేసి కొత్త జీవితం ప్రారంభించాలని అనకుంటాడు శివ. గోవాలో కొత్త ఇంటిలోకి మారాలని ప్రయత్నాలు చేస్తుంటాడు. శివ ఇలాంటి ప్రయత్నాల్లో ఉండగా..రాణె భాయ్ గ్యాంగ్ సీక్రెట్స్ ఎవరో లీక్ చేస్తుంటారు. ఆ బ్లాక్ షీప్ ఎవరో కనుక్కునేందుకు రాణె భాయ్ అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరినీ చంపేస్తుంటాడు. జర్నలిస్ట్ సమీర (భాను శ్రీ మెహ్రా) రాణె భాయ్ నేరాలను ఆధారాలతో సహా డాక్యుమెంట్ చేస్తుంది. ఆమెను కిడ్నాప్ చేసిన రాణె భాయ్ గ్యాంగ్, ఆధారాలు ఇచ్చేయమని హింసిస్తుంటారు. రాణె భాయ్ గ్యాంగ్ లోని బ్లాక్ షీప్ ఎవరు, జర్నలిస్ట్ సమీర ఆధారాలతో గ్యాంగ్ ను పట్టించిందా. తన లీడర్ రాణె భాయ్ తో శివ ఎందుకు గొడవపడ్డాడు అనేది మిగిలిన కథ. ఎలా చేశారంటే.. శివ పాత్రలో తనీష్ నటన మెప్పిస్తుంది. ఎమోషనల్ కిల్లర్ క్యారెక్టర్ కు తనీష్ తన నటనతో న్యాయం చేశాడు. ఇక హీరోని ఇష్టపడే సరదా అమ్మాయిగా ముస్కాన్ సేథి తనదైన నటన, అందంతో ఆకట్టుకుంది. నైని పాత్రలో అర్చనా సింగ్ పర్వాలేదనిపించింది. రాణె భాయ్ గా కబీర్ సింగ్ దుహాన్ సెటిల్డ్ పర్మార్మెన్స్ చేశాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఎలా ఉందంటే.. మరో ప్రస్థానం మూవీ మేకింగ్ పరంగా ఇన్నోవేటివ్ ప్రయత్నమే అని చెప్పాలి. రియల్ టైమ్, రీల్ టైమ్ ఒకటే ఉండటం ఈ సినిమా ప్రత్యేకత. సినిమాలో కథ ఎంత టైమ్ లో జరిగితే, సరిగ్గా అదే టైమ్ కు సినిమా కంప్లీట్ అవుతుంది. ఇది ఒక డెత్ స్ట్రింగ్ ఆపరేషన్ ఆధారంగా సాగే సినిమా. దర్శకుడు అనుకున్న పాయింట్ కొత్తగా ఉన్నప్పటికీ, అనుకున్నట్లు తెరపై చూపిండంతో కాస్త తడబడ్డాడు. అయితే ఓ రాత్రిలో జరిగే కథను సింగిల్ షాట్లో చిత్రీకరించాలనుకున్న దర్శకుడి ఆలోచన మాత్రం బాగుంది. అందుకు తగ్గట్లు సన్నివేశాలను ప్లాన్ చేసుకుని సినిమాను చిత్రీకరిస్తూ వచ్చారు. వన్ షాట్ ఫిల్మ్ మేకింగ్ లో కొన్ని చోట్ల సీన్స్ ల్యాగ్ అనిపించవచ్చు. కానీ తన డెసిషన్ కు కట్టుబడి ఫిల్మ్ చేశాడు. ఫస్టాఫ్ అంతా సింపుల్గా సాగినా.. ఇంటర్వెల్ టిస్ట్ మాత్రం సెకండాఫ్పై ఆసక్తిని కలిగిస్తుంది. అయితే సెకండాఫ్ కూడా రోటీన్గా సాగడం కాస్త మైనస్. సునీల్ కశ్యప్ పాటలు కథలో స్పీడుకు బ్రేకులు వేసేలా ఉంటాయి. కానీ నేపథ్య సంగీతం మాత్రం అదిరిపోయింది. ఎంఎన్ బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ అంతంత మాత్రంగానే ఉంది. సింగిల్ షాట్ మూవీ కావడం, రీటేక్స్ తీసుకునే అవకాశం లేకపోవడంతో టెక్నికల్గా ఈ విషయంలో ఎవరినీ తప్పు పట్టలేం. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. కొద్దిగా ఎంటర్ టైన్ మెంట్ మిక్స్ చేసి ఉంటే మరో ప్రస్థానంలో మరింత రిలీఫ్ దొరికేది. మొత్తంగా సింగిల్ షాట్లో తీసిన మరో ప్రస్థానం టాలీవుడ్లో ఒక కొత్త ప్రయత్నమనే చెప్పాలి. - అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
ఆ పాత్ర ఛాలెంజింగ్గా అనిపించింది
‘‘మరో ప్రస్థానం’ సినిమా నా కెరీర్లో ల్యాండ్ మార్క్ అవుతుందని చెప్పగలను. ఈ చిత్రం నాకు చాలా ప్రత్యేకమైనది’’ అని హీరోయిన్ ముస్కాన్ సేథి అన్నారు. ‘పైసా వసూల్, రాగల 24 గంటల్లో’ చిత్రాల ఫేమ్ ముస్కాన్ సేథి నటించిన తాజా చిత్రం ‘మరో ప్రస్థానం’. తనీష్ హీరోగా నటించిన ఈ చిత్రానికి జానీ దర్శకత్వం వహించారు. హిమాలయ స్టూడియో మాన్షన్స్, ఉదయ్ కిరణ్ సమర్పణలో మిర్త్ మీడియా సంస్థ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న థియేటర్లలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా హీరోయిన్ ముస్కాన్ సేథి మాట్లాడుతూ–‘‘ఎమోషనల్గా సాగే యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఇది. ఇందులో నేను యాక్షన్ సీన్స్లో కూడా నటించా. ఫస్ట్ టైమ్ ఇటువంటి క్యారెక్టర్ చేయడం ఛాలెంజింగ్గా అనిపించింది. కొన్ని సీన్స్లో లెంగ్తీ డైలాగులు ఉండేవి. కొన్ని రోజులు డే అండ్ నైట్ షూట్ కూడా చేశాం. రీల్ టైమ్ రియల్ టైమ్ ఒకటే కావడం ఈ సినిమా ప్రత్యేకత. సింగిల్ షాట్లో చేసిన మొదటి సినిమా ఇదే కావడం మరో విశేషం.. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ‘మరో ప్రస్థానం’ లో భాగమవడం సంతోషంగా ఉంది. ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుంది.. థియేటర్లో ప్రేక్షకులను కలుసుకునేందుకు ఎదురు చూస్తున్నా’’ అన్నారు. -
ఈ వారం బాక్సాఫీస్ పోటీలో ‘లవ్ స్టోరీ' వర్సెస్ ‘మరో ప్రస్థానం'
ఈ వారం రెండు తెలుగు సినిమాలు థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. చాలా కాలం తరువాత థియేటర్లకు అనుమతులు ఇవ్వడంతో ఒక్కొక్క సినిమా రిలీజ్ అవుతున్నాయి. చాలా సినిమాలు ఓటీటీకే పరిమితం కాగా, కొన్ని సినిమాలు థియేటర్లలో రిలీజ్ కాబోతున్నాయి. అలా రిలీజ్ కాబోతున్న సినిమాల్లో నాగచైతన్య ‘లవ్స్టోరీ కాగా రెండో సినిమా మరో ప్రస్థానం. లవ్స్టోరీ సినిమాను భారీగా ప్రమోషన్ చేస్తున్నారు. ఆదివారం లవ్స్టోరీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్గా జరిగింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవితో పాటు, అమీర్ ఖాన్ కూడా హాజరయ్యారు. ఇప్పటికే సినిమా పాటలు, ట్రైలర్కు కూడా మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇక ఇదిలా ఉంటే, లవ్స్టోరీ రిలీజ్ అవుతున్న రోజునే తనీష్ ‘మరోప్రస్థానం' సినిమా కూడా రిలీజ్ కాబోతున్నది. విలన్ బృందం వరస హత్యలు చేస్తుండగా, వాటిపై స్ట్రింగ్ ఆపరేషన్ నిర్వహించి వాటిని సీక్రెట్ కెమెరాలో షూట్ చేస్తారు హీరో బృందం. ఆ కెమెరా విలన్లకు దొరుకుంది. ఆ తరువాత ఏం జరిగింది అనే ఆసక్తికరమైన అంశంలో థ్రిల్లింగ్గా కథను తెరకెక్కించారు. జానీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమా సెప్టెంబర్ 24 వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతున్నది. సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పక్కా మాస్ ఎంటర్టైనర్గా ఈ సినిమా తెరకెక్కింది. రియల్ టైమ్లోనే రీల్ టైమ్ సినిమాగా తెరకెక్కించారు. చదవండి: భీమ్లా నాయక్: పవర్ ఫుల్ డైలాగ్తో బెదిరించిన రానా పోర్నోగ్రఫీ కేసు: శిల్పాశెట్టి భర్త రాజ్కుంద్రాకు బెయిల్ -
డ్రగ్స్ కొనలేదు .. డబ్బు ఇవ్వలేదు.. ఈడీ మళ్లీ రమ్మనలేదు
సాక్షి, హైదరాబాద్: డ్రగ్స్ కేసులో తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమని సినీ నటుడు తనీష్ చెప్పారు. కెల్విన్ నుంచి తాను డ్రగ్స్ ఖరీదు చేయడం కానీ, దాని నిమిత్తం డబ్బు వెచ్చించడం కానీ జరగలేదని స్పష్టం చేశారు. టాలీవుడ్ ప్రముఖులతో ముడిపడి ఉన్న ఈ కేసులో మనీల్యాండరింగ్ కోణాన్ని దర్యాప్తు చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల ఎదుట శుక్రవారం ఆయన హాజరయ్యారు. ఉదయం 10.30 గంటల ప్రాంతంలో ఈడీ కార్యాలయంలోకి వెళ్లిన ఆయన సాయంత్రం 6 గంటలకు తిరిగి వచ్చారు. బుధవారం నటుడు తరుణ్ విచారణకు హాజరుకానున్నారు. ఈవెంట్ల వల్లే కెల్విన్తో పరిచయం డ్రగ్స్ కేసు ప్రధాన నిందితుడు కెల్విన్తో ఉన్న పరిచయం, అతడితో లావాదేవీలపై తనీష్ను ఈడీ అధికారులు ఆరా తీశారు. 2016–17 మధ్య కెల్విన్తో వాట్సాప్ ద్వారా చాటింగ్ చేసినట్టు ప్రాథమిక ఆధారాలు సేకరించిన ఈడీ దీనిపై వివరణ ఇవ్వాలని కోరింది. దీంతో తాను చేసిన పలు సినిమాలకు కెల్విన్ ఈవెంట్లు నిర్వహించాడని, ఆ విధంగానే అతడితో పరిచయం ఏర్పడిందని తనీష్ జవాబిచ్చారు. ఈ వ్యవహారంలో డ్రగ్స్ క్రయవిక్రయాలు, వినియోగానికి ఎక్కడా తావు లేదని స్పష్టం చేశారు. కెల్విన్ విచారణలో తన పేరు బయటకు రావడానికి అతడితో ఈవెంట్ల పరంగా ఉన్న పరిచయమే కారణమని వివరణ ఇచ్చారు. మళ్లీ రమ్మనలేదు తాను బాలనటుడిగా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి అంచెలంచెలుగా ఎదిగానని, డ్రగ్స్ వంటి వాటి జోలికి వెళితే అది సాధ్యమయ్యేది కాదని తనీష్ చెప్పారు. తన బ్యాంకు ఖాతాలకు సంబంధించిన స్టేట్మెంట్స్ను ఈడీ అధికారులకు ఆయన అందించారు. విచారణ ముగించుకుని తిరిగి వెళ్తూ మీడియాతో మాట్లాడారు. ఈడీ అధికారులను కోరిన వివరాలు అందించానని, వారు కొన్ని డాక్యుమెంట్లు సైతం పరిశీలించారని తెలిపారు. మరోసారి విచారణకు రావాల్సిన అవసరం ఉంటుందని చెప్పలేదని, ఒకవేళ పిలిస్తే కచ్చితంగా వచ్చి పూర్తి సహకారం అందిస్తానని పేర్కొన్నారు. -
Tollywood Drugs case: మనీలాండరింగ్, ఫెమా చట్టాల ఉల్లంఘనపై ఆరా
-
ఈడీ విచారణకు హాజరైన హీరో తనీష్
Tanish Appears Before ED: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణ కొనసాగుతుంది. హీరో తనీష్ ఈడీ విచారణకు హాజరయ్యారు. మనీలాండరింగ్, ఫెమా యాక్ట్ ఉల్లంఘనపై తనీష్ను ఈడీ ప్రశ్నించనుంది. కెల్విన్తో ఉన్న సంబంధాలుపై కూడా ఆరాతీయనుంది. అంతేకాకుండా ఎఫ్ క్లబ్తో ఉన్న పరిచయాలపై కూడా అధికారులు ప్రశ్నించనున్నారు. ఇప్పటికే తనీష్కు నోటీసులు జారీ చేసిన ఈడీ బ్యాంకు ఖాతాలను వెంట తేవాలని పేర్కొంది. కెల్విన్ సమక్షంలో తనీష్ను సుధీర్ఘంగా విచారించే అవకాశం కనిపిస్తుంది. గతంలో 2017లో తనీష్ ఎక్సైజ్ విచారణను సైతం ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. కాగా ఈ కేసులో ఇప్పటికే 10మంది సినీ ప్రముఖులను ఈడీ విచారించింది. -
Maro Prasthanam : ప్రపంచంలో ఆ ఇద్దరే అసలైన మనుషులు..
తనీష్ హీరోగా దర్శకుడు జాని రూపొందించిన ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ 'మరో ప్రస్థానం'. ఈ చిత్రాన్ని హిమాలయ స్టూడియో మాన్షన్స్ ఉదయ్ కిరణ్ సమర్పణలో మిర్త్ మీడియా సంస్థ నిర్మించింది. ముస్కాన్ సేథీ నాయిక. వరుడు ఫేమ్ భానుశ్రీ మెహ్రా, కబీర్ దుహాన్ సింగ్, రాజా రవీంద్ర కీలక పాత్రలు పోషించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న మహా ప్రస్థానం' మూవీ ఈ నెల 24న విడుదలకు సిద్దమవుతోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ని విడుదల చేసింది చిత్ర బృందం. ఇది స్ట్రింగ్ ఆపరేషన్ నేపథ్యంలో సాగే కథ అని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది . విలన్ చేసే వరుస హత్యలను హీరో బృందం కెమెరాల్లో బంధించి, నిజాన్ని బయటపెట్టాలనుకుంటుంది. ఈ క్రమంలో రెండు బృందాల మధ్య పోరాటం మొదలవుతుంది. చివరకు ఏమైందనేది ఆసక్తిని పెంచేలా ట్రైలర్ని కట్ చేశారు. ‘ప్రపంచంలో ఇద్దరే ఇద్దరు అసలైన మనుషులు. ఒకరు చనిపోయినవాడు. మరొకడు ఇంకా పుట్టనివాడు’ అని విలన్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకునేలా ఉంది. ట్రైలర్ విడుదల సందర్భంగా చిత్ర నిర్మాత ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ ...ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇచ్చేలా మరో ప్రస్థానం సినిమా ఉంటుంది. నటీనటుల పర్మార్మెన్స్, టెక్నికల్ అంశాల్లో కొత్తదనం చూస్తారు. అతి తక్కువ టైమ్ లో షూటింగ్ కంప్లీట్ చేశాం. లాక్ డౌన్ వల్ల రిలీజ్ ఆలస్యం అయ్యింది. ఈ నెల 24న థియేటర్ ల ద్వారా మరో ప్రస్థానం చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నాం’అన్నారు. చిత్ర దర్శకుడు జాని మాట్లాడుతూ.. ఇది ఒక డెత్ స్ట్రింగ్ ఆపరేషన్ ఆధారంగా సాగే సినిమా. స్ట్రింగ్ ఆపరేషన్ అంటే అక్కడ జరుగుతున్న దాన్ని ప్రపంచానికి చూపించడమే మెయిన్ టార్గెట్. ఈ సినిమా రెగ్యులర్ సినిమాల్లా షూటింగ్ జరగలేదు. ఫస్ట్ రిహర్సల్ చేసుకుని తర్వాతనే షూట్ చేయడం జరిగింది. అందరూ ఈ సినిమాకి మనసు ప్రాణం పెట్టి కష్టపడి పని చేశారు అందుకే అవుట్ ఫుట్ బాగా వచ్చింది. హీరో తనీష్ గారికి మోకాలు ఆపరేషన్ అయినా ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చాడు. మరో ప్రస్థానం సినిమాలో హార్ట్ టచింగ్ ఎమోషన్స్ ఉంటాయి. మా సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుంది’అన్నారు. ‘ప్రతి యాక్టరు ప్రతి సినిమాకి ఒక మెట్టు ఎదగాలనే కోరుకుంటూ సినిమాలు చేస్తారు. నేనూ మరో ప్రస్థానం చిత్రాన్ని అలాగే చేశాను. నటుడిగా నన్ను మరో మెట్టు పైకి ఎక్కించే సినిమా అవుతుంది’అన్నారు హీరో తనీష్. ఈ చిత్రానికి మాటలు - వసంత కిరణ్, యానాల శివ, పాటలు - ప్రణవం.., సంగీతం - సునీల్ కశ్యప్, సినిమాటోగ్రఫీ - ఎంఎన్ బాల్ రెడ్డి. -
డిఫరెంట్ కాన్సెఫ్ట్తో తనీష్ ‘మరో ప్రస్థానం’
యంగ్ హీరో తనీష్ నటించిన తాజా చిత్రం ‘మరో ప్రస్థానం’.జాని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ముస్కాన్ సేథీ హీరోయిన్గా నటిస్తోంది. ఈ యాక్షన్ మూవీని హిమాలయ స్టూడియో మాన్షన్స్, ఉదయ్ కిరణ్ సమర్పణలో మిర్త్ మీడియా సంస్థ నిర్మించింది. వరుడు ఫేమ్ భానుశ్రీ మెహ్రా, కబీర్ దుహాన్ సింగ్, రాజా రవీంద్ర కీలక పాత్రలు పోషించారు. ఈ నెలాఖరులో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ‘మరో ప్రస్థానం’విషయానికొస్తే.. ఇదొక ఎమోషనల్ కిల్లర్ జర్నీ మూవీ. రియల్ టైమ్, రీల్ టైమ్ ఒకటే ఉండటం ఈ సినిమా ప్రత్యేకత. సినిమాలో కథ ఎంత టైమ్లో జరిగితే, సరిగ్గా అదే టైమ్కు సినిమా పూర్తి అవుతుంది. కథ, కథనం సరికొత్తగా ఉంటుందని దర్శకుడు చెబుతున్నాడు. రెగ్యులర్ గా వచ్చే సినిమాలకు పూర్తి భిన్నంగా ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న తమ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుందని మేకర్స్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి మాటలు - వసంత కిరణ్, యానాల శివ, పాటలు - ప్రణవం.., సంగీతం - సునీల్ కశ్యప్, సినిమాటోగ్రఫీ - ఎంఎన్ బాల్ రెడ్డి. -
ఆ కంటెస్టెంట్ టాప్ 5లో ఉంటాడు: తనీష్
Tanish About Bigg Boss Telugu 5: బిగ్బాస్ తెలుగు ఐదో సీజన్ మొదలై ఇంకా వారం కూడా అవలేదు. అప్పుడే కంటెస్టెంట్లకు బయట ఆర్మీలు కూడా పుట్టుకొచ్చాయి. ఇక షో మొదటివారంలోనే కొందరు కంటెస్టెంట్లు దూకుడు చూపిస్తుంటే మరికొందరు మాత్రం ఇప్పటికీ అందరినీ అబ్జర్వ్ చేస్తూ ఆ ఇంటిని అలవాటు చేసుకునే పనిలోనే ఉన్నారు. తాజాగా ఈ షో గురించి బిగ్బాస్ సెకండ్ సీజన్ కంటెస్టెంట్ తనీష్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐదో సీజన్లో తన క్లోజ్ ఫ్రెండ్ మానస్ ఉన్నాడని, అతడు చాలా మంచి మనిషని చెప్పుకొచ్చాడు. అతడు తప్పకుండా టాప్ 5లో అడుగు పెడతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ షోలో పాల్గొన్న కంటెస్టెంట్ యూట్యూబర్ షణ్ముఖ్ తనకు పెద్దగా పరిచయం లేదని పేర్కొన్నాడు. అలాగే దీప్తి సునయన తనకు మంచి స్నేహితురాలు మాత్రమేనని స్పష్టం చేశాడు. కాగా బిగ్బాస్ రెండో సీజన్లో తనీష్తో పాటు దీప్తి సునయన కూడా పాల్గొన్న విషయం తెలిసిందే. ఆమె తన ప్రియుడు, యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జశ్వంత్ను ఒంటరిగా వదిలేసి మరీ షోలో అడుగు పెట్టింది. అయితే హౌస్లో అడుగు పెట్టాక ఆమె తనీష్కు దగ్గరైంది. హౌస్లో దీప్తి సునయనకు ఏ చిన్న కష్టమొచ్చినా ఆమె వెన్నంటే నిలబడ్డాడు తనీష్. ఇద్దరూ ఒకరి గురించి మరొకరు ఎక్కువ శ్రద్ధ తీసుకోవడంతో వాళ్ల మధ్య సమ్థింగ్ సమ్థింగ్ స్టార్ట్ అయిందని అభిప్రాయపడ్డారు జనాలు. వీళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నారంటూ సోషల్ మీడియాలో కథనాలు సైతం వెలువడ్డాయి. కానీ హౌస్ నుంచి బయటకు వచ్చాక ఈ ఇద్దరూ తాము కేవలం స్నేహితులమేనని క్లారిటీ ఇచ్చారు. ఇదిలా వుంటే గతంలో పలు కారణాల వల్ల దీప్తి సునయన, షణ్నూల మధ్య కొంత దూరం పెరిగినప్పటికీ, ఇప్పుడు మాత్రం మళ్లీ క్లోజ్ అయిపోయారు. ఈమధ్యే బిగ్బాస్ హౌస్లో ఎంట్రీ ఇచ్చిన తన ప్రియుడు షణ్నూకు గట్టి సపోర్ట్ ఇస్తోందీ భామ. -
యాంకరింగ్తో అలరించిన హీరో తనీష్
సాక్షి, విశాఖపట్నం : సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకల్లో భాగంగా సోమవారం పోర్టు స్టేడియంలో ప్రగతి భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వైఎస్సార్ కప్ క్రికెట్ టోర్నీని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, జిల్లా ఇన్చార్జి మంత్రి కురసాల కన్నబాబుతో కలిసి విజయసాయిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. ప్రతి మనిషిలో లక్ష్యాన్ని సాధించాలనే సంకల్పం ఉండాలని, అది సీఎం వైఎస్ జగన్లో పరిపూర్ణంగా ఉందని చెప్పారు. జీవితంలో ఎన్ని అవరోధాలు ఎదురైనా.. ధైర్యంగా ఎదురొడ్డి ముందుకు సాగుతూ తన లక్ష్యాన్ని సీఎం చేరుకున్నారని గుర్తు చేశారు. నేటి యువత సీఎం వైఎస్ జగన్ను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. క్రీడల్లో రాణించాలనే విశాఖ యువత అభిలాషను సాకారం చేసేందుకు ఈ టోర్నీ నిర్వహిస్తున్నామన్నారు. వజ్ర సంకల్పంతో కృషి చేస్తే యువత తమ లక్ష్యాన్ని సాధించగలరని వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. విద్యతో పాటు క్రీడల్లో కూడా సౌకర్యాలు, వనరులు కల్పించేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. అలరించిన సినీ హీరో తనీష్ సినీ హీరో తనీష్ వేదికపై యాంకరింగ్ చేస్తూ అలరించారు. పంచ్ డైలాగ్లతో యువతలో ఉత్సాహం నింపారు. 422 జట్లు పాల్గొనే ఈ టోర్నీలో విజేత జట్టుకు రూ.50 లక్షల నగదు బహుమతి అందించనున్నారు. 20 రోజుల పాటు 14 వేదికల్లో ఈ పోటీలు జరగనున్నాయి. క్రీడా జ్యోతితో స్టేడియంలో ఎంపీ విజయసాయిరెడ్డి నడవగా.. మంత్రులు ముత్తంశెట్టి, కన్నబాబు, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఎన్సీసీ క్యాడెట్లు వెంట పరుగులు తీశారు. జట్ల కెప్టెన్లు మార్చ్పాస్ట్ నిర్వహించారు. అరకులోని 18 గిరిజన తెగల మహిళలు ధింసా నృత్యంతో అలరించారు. మంత్రి ముత్తంశెట్టి మాట్లాడుతూ.. విశాఖలో మరిన్ని క్రీడా సౌకర్యాలు కల్పించాల్సి ఉందన్నారు. ఇటీవలే క్రీడల్లో ప్రతిభ చూపిన వారికి రూ.3కోట్ల నగదు ప్రోత్సాహకాలు అందించామన్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రి కన్నబాబు మాట్లాడుతూ విశాఖను క్రీడా రాజధానిగా తీర్చిదిద్దాలన్నారు. వైఎస్సార్ అనే పదంలోనే వైబ్రేషన్ ఉందన్నారు. ఈ టోర్నీ విశాఖలో యువత కెరీర్కు ఒక ప్రధాన వేదికగా నిలుస్తుందన్నారు. విశాఖను క్రీడా హబ్గా మార్చేందుకు ప్రణాళిక రచిస్తే ముఖ్యమంత్రి అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. పార్టీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జన్మదిన వేడుకల్లో భాగంగా యువత విస్తృతంగా రక్తదానం చేయడం ప్రశంసనీయమన్నారు. టోర్నీ ప్రారంభోత్సవంలో మాట్లాడుతున్న ఎంపీ విజయసాయిరెడ్డి కలెక్టర్ వినయచంద్ మాట్లాడుతూ.. క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో ఈ టోర్నీలో పోటీ పడాలన్నారు. ఏయూ వీసీ ప్రసాద్రెడ్డి మాట్లాడుతూ యువతను మహాశక్తిగా తీర్చిదిద్దేందుకు ఈ టోర్నీ దోహదపడుతుందన్నారు. జీవీఎంసీ కమిష నర్ జి.సృజన మాట్లాడుతూ మనిషి సంపూర్ణ అభివృద్ధిలో విద్యే కాకుండా ఆటలు కూడా దోహదపడతాయన్నారు. ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్కుమార్, తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ కరోనా కారణంగా సృజనాత్మకత, విద్య, వినోదానికి దూరంగా ఉన్న యువతకు ఈ టోర్నమెంట్ మానసిక, శారీరక ఉల్లాసాన్ని కలిగిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గుడివాడ అమర్నాథ్, అన్నంరెడ్డి అదీప్రాజ్, పార్టీ సమన్వయకర్తలు మళ్ల విజయప్రసాద్, కె.కె.రాజు, అక్కరమాని విజయనిర్మల, రాష్ట్ర మత్స్యకార కార్పొరేషన్ చైర్మన్ కోలా గురువులు, అనకాపల్లి పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు శరగడం చినఅప్పలనాయుడు, మాజీ మంత్రి బాలరాజు, మాజీ ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్బాబు, చింతలపూడి వెంకట్రామయ్య, తిప్పల గురుమూర్తిరెడ్డి, ఎస్.ఎ.రెహమాన్, సీనియర్ నాయకుడు జూపూడి ప్రభాకర్, నగర మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లంపల్లి రాజుబాబు, జేసీలు వేణుగోపాల్రెడ్డి, అరుణబాబు, వీఎంఆర్డీఏ కమిషనర్ కోటేశ్వరరావు, ప్రగతి భారతి ఫౌండేషన్ సభ్యులు గోపీనాథ్ రెడ్డి, మావూరి వెంకటరమణ, ఉమేష్కుమార్, బాలాజీ, ముఖ్య నాయకులు ఫరూఖీ, రవిరెడ్డి, కొండా రాజీవ్, పీలా వెంకటలక్ష్మి, బోని శివరామకృష్ణ, గెడ్డం ఉమ, వార్డు అధ్యక్షు లు, కార్పొరేట్ అభ్యర్థులు, క్రికెట్ టీం సభ్యులు పాల్గొన్నారు. -
తెలుగు బిగ్బాస్లో ఆవేశం స్టార్లు ఎవరో తెలుసా?
ఉగాది పచ్చడిలో అయినా షడ్రుచులు కాస్త అటూఇటుగా ఉంటాయోమో కానీ బిగ్బాస్ షోలో మాత్రం అన్ని రసాలు పండించే కంటెస్టెంట్లను లోనికి పంపిస్తారు. ఆవేశం స్టార్లను, అతి సహనపరులను, నవ్వించేవాళ్లను, డ్యాన్స్ చేసేవాళ్లను.. ఇలా ప్రతీది ప్రేక్షకులకు నచ్చేలా, మెచ్చేలా చూసుకుంటారు. ఈ నేపథ్యంలో ప్రతీ సీజన్లో ఓ అర్జున్ రెడ్డి క్యారెక్టర్ అనేది పక్కాగా ఉంటోంది. వీళ్లు చిన్న విషయానికి కూడా చిందులు తొక్కుతుంటారు. మరి మొదటి సీజన్ నుంచి నాల్గవ సీజన్ వరకు ఆ అర్జున్రెడ్డి ఎవరెవరున్నారో ఓ లుక్కేయండి.. ఇస్మార్ట్ సోహైల్ ఇప్పుడు అతడిని కెప్టెన్ సోహైల్ అని పిలుచుకోవాలి. ఈ సీజన్లో ఐదో కెప్టెన్గా అవతరించాడు. మొదట్లో కాస్త సాఫ్ట్గా కనిపించిన సోహైల్ ఉన్నట్టుండి వయొలెంట్గా మారిపోయాడు. గొడవ ప్రారంభమైందంటే చాలు కథ వేరుంటది అంటూ రెచ్చిపోయి మాట్లాడుతుంటాడు. ఈ క్రమంలో అతడికి తెలీకుండానే బూతులు కూడా మాట్లాడేస్తాడు. దీంతో అతడంటేనే ఓ రకమైన భయం వచ్చేసింది కొందరు కంటెస్టెంట్లకు. ఎలిమినేట్ అయిన స్వాతి దీక్షిత్ కూడా సోహైల్ నరాలు కట్ అయిపోయేలా మాట్లాడతాడని చెప్పింది. ఆఖరికి నాగార్జున కూడా చాలా కోపం ఉందని, కాస్త నియంత్రించుకోమని సూచించారు. తమన్నా సింహాద్రి మొట్టమొదటిసారి ఓ ట్రాన్స్జెండర్ను బిగ్బాస్లోకి తీసుకొచ్చారు. మొదట బాగానే ఉన్న ఆమె తన విశ్వరూపం చూపించింది. సహ కంటెస్టెంటు రవికి చుక్కలు చూపించింది. పప్పు అని ఆడుకుంటూ అతడిని ఏడిపించింది. అటు అలీ రెజా, రోహిణితో కూడా కయ్యానికి కాలు దువ్వేది. అలా హౌస్లో ఆమె పేరు చెప్తేనే వణికే పరిస్థితి వచ్చింది. దీంతో ఆమె అరాచకాలకు అడ్డు కట్ట వేయాలని భావించిన ప్రేక్షకులు ఆమెను తొందరగానే హౌస్ నుంచి బయటకు పంపించేశారు. అయితే ఇలా కోపంగా ఉంటూ గొడవలు పెట్టుకుంటూనే తను షోలో ఉన్నానన్న విషయం అందరికీ తెలుస్తుందనే ఈ ట్రిక్ ప్లే చేశానని చెప్పుకొచ్చింది. (చదవండి: అవినాష్, అరియానాల బండారం బయటపడనుందా?) అలీ రెజా టాస్క్ అంటే చాలు.. ఉన్న శక్తినంతా కూడదీసుకుని మరీ టాస్క్లో తన ప్రతాపాన్ని చూపేవాడు. అతని ఆటకు చాలామంది అభిమానులు కూడా ఉన్నారు. కానీ అతని కోపమే అతని పాపులారిటీని, ఓట్లను దెబ్బ తీసింది. వీరావేశంతో ఎదుటివారిపై నోరు జారడంతో ఆయన షో మధ్యలోనే వీడ్కోలు తీసుకోవాల్సి వచ్చింది. కానీ అతడు రీ ఎంట్రీ ఇవ్వాలని నెటిజన్లు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో డిమాండ్ చేయడంతో మళ్లీ బిగ్బాస్ హౌస్లో అడుగు పెట్టాడు. ఈ సారి గేమ్ ప్లాన్ మార్చి ఆడటంతో ఫైనల్ వరకు వెళ్లాడు. తనీష్ అల్లాడి రెండో సీజన్లో పాల్గొన్న హీరో తనీష్ను కోపానికి కేరాప్ అడ్రస్గా చెప్పుకోవచ్చు. కౌశల్, నూతన్ నాయుడుతో తరచూ గొడవలు జరిగేవి. వీటికి హద్దూ అదుపూ ఉండేది కాదు. అయినా సరే, తనీష్కు అభిమాన గణం మెండుగానే ఉండేది. దీనికితోడూ దీప్తి సునయనతో ప్రేమాయణం కూడా బాగానే వర్కవుట్ అయింది. దీంతో టాప్ 3 స్థానంలో నిలబడ్డాడు. ((చదవండి: 'అమ్మో' రాజశేఖర్, మళ్లీ శాపం పెట్టాడు!) తేజస్వి మడివాడ రెండో సీజన్లో తేజస్వి కూడా చీటికి మాటికీ రుసరుసలాడుతుండేది. తనకు ఏదైనా నచ్చకపోతే చాలా ఆ విషయాన్ని చీల్చి చెండాడేది. వివాదం, ఫిజికల్ టాస్క్, బ్రెయిన్ టాస్క్ ఇలా ఏదైనా సరే అందులో తన మార్క్ చూపించేది. ముక్కు మీద కోపం ఉన్న ఈ భామ ఏడో వారంలోనే బ్యాగు సర్దేసుకుని వెళ్లిపోయింది. (చదవండి: అవునా.. అరియానాకు బిగ్బాస్ అంత ఇస్తున్నాడా?) శివబాలాజీ అన్నీ అమర్చిన బిగ్బాసే ఒక్కోసారి కంటెస్టెంట్ల తిక్క కుదిర్చేందుకు కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వడు. అయితే ఇలాంటి సందర్భాల్లో బిగ్బాస్ను అభ్యర్థించాల్సింది పోయి అతడిపైనే ఆవేశపెట్టాడు శివబాలాజీ. మొదటి సీజన్లో పాల్గొన్న శివబాలాజీ ఓ రోజు నీళ్లు సడన్గా రాకపోవడంతో బిగ్బాస్పైనే ఆగ్రహించాడు. కోపంతో పాటు మిగతా ఎమోషన్స్ కూడా ఎక్కువే కావడంతో ఆ ఆగ్రహాన్ని కవర్ చేయగలిగాడు. అలా జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన తొలి సీజన్ విజేతగా నిలిచాడు. -
ఆవేశం ఆయుధమైతే...
‘గుండె కన్నీరైతే.. ఆవేశం ఆయుధమైతే.. ఆ కత్తి రాసే రుధిర కావ్యమే ఈ మహాప్రస్థానం’ అంటూ భావోద్వేగం నిండిన వాయిస్ ఓవర్తో విడుదలైన ‘మహాప్రస్థానం’ మోషన్ పోస్టర్ సినిమాపై ఆసక్తి పెంచుతోంది. తనీష్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘మహాప్రస్థానం’. ‘ద జర్నీ ఆఫ్ ఆన్ ఎమోషనల్ కిల్లర్’ అనేది ఉపశీర్షిక. జాని దర్శకత్వం వహించారు. ముస్కాన్ సేథీ కథానాయిక. ‘వరుడు’ ఫేమ్ భానుశ్రీ మెహ్రా, కబీర్ దుహాన్ సింగ్, రాజా రవీంద్ర కీలక పాత్రలు పోషించారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా వేసవికి విడుదలకానుంది. ఈ సందర్భంగా చిత్రం ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్లను విడుదల చేశారు. అనంతరం డైరెక్టర్ జాని మాట్లాడుతూ– ‘‘తనీష్ పాత్రలోని ఇంటెన్సిటీని ప్రేక్షకులు కొత్తగా ఫీలవుతారు. కిల్లర్గా తన నటన సినిమాకు ప్రధాన ఆకర్షణ. కథలోని బలం మా అందరికీ ఇంత ఎనర్జీని ఇచ్చి పనిచేసేలా చేస్తోంది. ఇదొక అసాధారణ సినిమా అని చెప్పాలనే కొత్తగా మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ చేయించాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సునీల్ కశ్యప్, కెమెరా: ఎంఎన్ బాల్ రెడ్డి. -
అప్పుడు నృత్యం చేశా.. ఇప్పుడు అతిథిగా వచ్చా
సాక్షి, పశ్చిమగోదావరి: దెందులూరు మండలంలోని గాలాయగూడెం అచ్చమ్మ పేరంటాలు తల్లి ఉత్సవాలతో తనకు చిన్ననాటి నుంచి అనుబంధం ఉందని సినీ హీరో తనీష్ చెప్పారు. శుక్రవారం గాలాయగూడెం శ్రీ అచ్చమ్మపేరంటాలు తల్లి 63వ వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఆయన విచ్చేశారు. ఈ సందర్భంగా తొలుత ఆలయ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు ఏనుగు సర్వేశ్వరరావు తదితరులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం తనిష్ విలేకరులతో మాట్లాడుతూ తాను చిన్నవయస్సులోనే అమ్మవారి ఆలయ ఉత్సవాల్లో నృత్యం చేశానన్నారు. మళ్లీ సినీ హీరోగా అమ్మవారి సన్నిధిలో ముఖ్య అతిథిగా రావటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇప్పటి వరకూ 20కి పైగా సినిమాలు చేశానన్నారు. హిందుస్తాన్ సినిమాకు నంది అవార్డు వచ్చిందని, నచ్చావులే, రైడ్, మేము వయసుకు వచ్చాం సినిమాలు ఎంతో గుర్తింపును తెచ్చిపెట్టాయన్నారు. చలనచిత్ర పరిశ్రమకు అంబికా కృష్ణ తనను పరిచయం చేశారని, హీరోగా రవిబాబు అవకాశం కలి్పంచారని చెప్పారు. ప్రస్తుతం మహాప్రస్థానం సినిమాతో పాటు మరో రెండు సినిమాల్లో నటిస్తున్నట్టు చెప్పారు. -
మహాప్రస్థానం మొదలైంది
తనీష్, ముస్కాన్ సేథీ జంటగా జానీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మహాప్రస్థానం’. ‘జర్నీ ఆఫ్ యాన్ ఎమోషనల్ కిల్లర్’ అనేది ఉపశీర్షిక. ‘వరుడు’ ఫేం భానుశ్రీ మెహ్రా, కబీర్ దుహాన్ సింగ్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో ప్రారంభమైంది. తనీష్ మాట్లాడుతూ– ‘‘సినిమా సెట్లో నేను అడుగుపెట్టి ఏడాదిన్నర అవుతోంది. కథలు వింటున్నా నచ్చడం లేదు. జానీగారు చెప్పిన ‘మహాప్రస్థానం’ కథ నాలో ఎంతో స్ఫూర్తి నింపింది. యాక్షన్ బ్యాక్డ్రాప్లో జరిగే కథ ఇది’’ అన్నారు. ‘‘నేను గతంలో ‘అంతకుమిం చి’ చిత్రాన్ని తెరకెక్కించా. ‘మహాప్రస్థానం’ నా రెండో సినిమా. యాక్షన్ బ్యాక్డ్రాప్లో జరిగే ఇంటెన్స్ లవ్ స్టోరీ ఇది’’ అన్నారు జాని. శుభాంగీ పంత్, గగన్ విహారి, అమిత్ నటిస్తున్న ఈ చిత్రానికి సం గీతం: సునీల్ కశ్యప్, కెమెరా: బాల్ రెడ్డి. -
మాకూ స్వాతంత్య్రం కావాలి
వీధి బాలల నేపథ్యంలో శ్రీ తారక్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వీధిబాలలం’. ‘మాకూ స్వాతంత్య్రం కావాలి’ అన్నది ఉపశీర్షిక. ఎ.వి. వర్మరాజు సమర్పణలో వాహిని క్రియేషన్స్ పతాకంపై రూపొందిన ఈ సినిమా పాటలను సిరిపురం వుడా చిల్డ్రన్స్ థియేటర్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘సమాజానికి సందేశమిచ్చే ఇటువంటి సినిమాలు మరెన్నో రావాలి. వీధిబాలల కథాంశంతో సినిమా చేసిన దర్శక–నిర్మాతలకు అభినందనలు. ఈ సినిమా విడుదల విషయంలో నా వంతు సాయం చేస్తా’’ అన్నారు. ‘‘సుమారు 1200 మంది పిల్లలను వివిధ స్కూల్స్ నుంచి ఎంపిక చేసి నటనలో మెళకువలు నేర్పించి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సమాజంలోని ప్రతి ఒక్కర్నీ ఆలోచింపజేసేలా మా సినిమా ఉంటుంది’’ అన్నారు శ్రీ తారక్. ‘‘ఈ సినిమా మీద వచ్చిన ప్రతి పైసా అనాథ పిల్లల సహాయార్థం ఉపయోగిస్తాం’’ అన్నారు ఎ.వి. వర్మరాజు. ‘‘నేను కూడా బాల నటుడిగా సినీ పరిశ్రమకు పరిచయమయ్యాను. ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలి’’ అన్నారు నటుడు తనీష్. ఈ కార్యక్రమంలో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, పాటల రచయిత దుర్గాప్రసాద్, విజయవాణి, ఎఫ్ఎమ్ బాబాయి తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అలీ,తనీష్
-
‘సరిహద్దు’ సైనికుడుగా తనీష్
బిగ్ బాస్ షోతో ఆకట్టుకున్న యువ నటుడు తనీష్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం సరిహద్దు. ఇటీవల రంగు సినిమాతో తనీస్ను డైరెక్ట్ చేసిన కార్తికేయ సరిహద్దు సినిమా కూడా దర్శకత్వం వహించనున్నాడు. ఈ సందర్భంగా దర్శకుడు కార్తికేయ మాట్లాడుతూ ‘భాషను నేర్చుకొని జ్ఞానాన్ని సంపాదించాలనుకొని...ప్రతి భాషకు ఒక తెగ అనీ...కొన్ని తెగలకు ఒక కులం అనీ.. కొన్ని కులాలు కలసి ఒక మతం అనీ విడిపోతూ మృగలనుండి మనుషులుగా.. మనుషులనుండి తెగలుగా... తెగలనునుండి.. కులాలుగా.. కులాలనుండి మతాలుగా... మతాలనుండి రాష్ట్రాలుగా... రాష్ట్రాలనుంచి దేశాలుగా.. సరిహద్దుల్ని గీసుకొంటూ... బతుకుతున్నాం. ఈ కాన్సెప్ట్ తో సరిహద్దు రూపొందబోతుంది ’ అన్నారు. తెలుగుతో పాటు హిందీ భాషలోనూ విడుదల చేయబోతోన్న ‘సరిహద్దు’ మూవీ షూటింగ్ మార్చి 16 నుంచి ప్రారంభం కానుంది. హైటెక్నికల్ స్టాండర్డ్స్తో తెరకెక్కనున్న ఈ సినిమాలో పలువురు బాలీవుడ్ నటులు కూడా నటించనున్నారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. -
ఆ పేరు తెచ్చుకోకూడదు!
చైల్డ్ ఆర్టిస్టుగా దాదాపు 17 సినిమాలు చేసిన నటుడు తనీష్ హీరోగా దాదాపు 20కి పైగా చిత్రాల్లో నటించారు. గతేడాది కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘నక్ష త్రం’ సినిమాలో విలన్గా నటించారాయన. హీరోగా తనీష్ తొలి చిత్రం ‘నచ్చావులే..!’ విడుదలై పదేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా హైదరాబాద్లో విలేకర్లతో తనీష్ మాట్లాడుతూ – ‘‘మా నాన్నగారు డిఫెన్స్లో జాబ్ చేసేవారు. చిన్నప్పటి నుంచి నాకు డ్యాన్స్ అంటే ఇష్టం. ఇరవైఏళ్ల క్రితం వెంకటేశ్గారి ‘ప్రేమంటే ఇదేరా’ సినిమాలో తొలిసారి చైల్డ్ ఆర్టిస్టుగా నటించాను. ఆ తర్వాత నా కెరీర్ కోసం మా నాన్నగారు జాబ్ నుంచి స్వచ్ఛంద విరమణ తీసుకున్నారు. హైదరాబాద్లోని కృష్ణానగర్లో ఉండేవాళ్లం. చాలా కష్టాలు పడ్డాం. చైల్డ్ ఆర్టిస్టుగా ఇక చాలు.. హీరోగా ప్రయత్నిద్దాం అనుకుంటున్న సమయంలో ఓ చాన్స్ వచ్చింది. రెండు రోజుల్లో సైన్ చేయాలి. ఇంతలోనే రవిబాబుగారి ‘నచ్చావులే..!’ సినిమా ఆడిషన్స్కి వెళ్లాను. నువ్వు లావు తగ్గితే మా సినిమాలో తీసుకుంటాం అన్నారాయన. ఇంటికి వచ్చి బాగా ఆలోచించాను. ముందు వచ్చిన అవకాశాన్ని వద్దనుకుని అసలు సెలెక్ట్ అవుతానో లేదో తెలియని రవిబాబుగారి సినిమా కోసం కష్టపడ్డాను. రెండు వారాల్లో దాదాపు 10 కేజీలు తగ్గి ఆయన దగ్గరికి వెళ్లాను. రేపటి నుంచి షూటింగ్ స్టార్ట్ చేద్దాం అన్నారు. ఆనందపడాలో, ఆశ్చర్యపడాలో నాకు అర్థం కాలేదు. ఈ సినిమా రిలీజైన తర్వాత నా తల్లిదండ్రుల కళ్లల్లో చూసిన ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. ఆ తర్వాత చాలా సినిమాలు చేశాను. నచ్చినప్పుడు నచ్చావ్ అన్నారు. నచ్చనప్పుడు నచ్చలేదు అంటూనే నన్ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. అలాగే నాకు అవకాశం ఇచ్చిన దర్శక–నిర్మాతలకు.. స్పెషల్గా తొలి అవకాశం ఇచ్చిన రవిబాబుగారికి థ్యాంక్స్. ఫిబ్రవరి లేదా మార్చిలో నేను హీరోగా ఓ సినిమా మొదలవుతుంది. ‘బిగ్ బాస్ షో’ నాకు ఎక్స్టెండెడ్ ఫ్యామిలీని ఇచ్చింది’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ – ‘‘సక్సెస్, ఫెయిల్యూర్స్ నా చేతిలోనే కాదు. ఎవరి చేతిలోనూ లేవు. ఇప్పటివరకు నా జర్నీని ప్లాన్ చేసుకోలేదు. ఇకపై ప్రతి స్టెప్ జాగ్రత్తగా వేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే.. ‘ఇంత వయసు వచ్చినా, ఇంత అనుభవం ఉన్నా వీడు మారలేదురా’ అంటారు. ఆ పేరు తెచ్చుకోకూడదు అనుకుంటున్నాను. అలాగే ఇక రాంగ్ స్టెప్స్ కూడా వేయను. నేను స్టార్ని కాదు. యాక్టర్ని. నెగటీవ్ పాత్రలే కాదు చాలెంజింగ్గా ఉన్న ఏ పాత్ర చేయడానికైనా రెడీ. ప్రస్తుతానికి పెళ్లి ఆలోచన లేదు’’ అన్నారు. -
‘రంగు’ మూవీ రివ్యూ
టైటిల్ : రంగు జానర్ : యాక్షన్ డ్రామా తారాగణం : తనీష్, ప్రియా సింగ్, పరుచూరి రవి, షఫీ, పోసాని కృష్ణమురళి, పరుచూరి వెంకటేశ్వర్రావు తదితరులు సంగీతం : యోగేశ్వర్ శర్మ దర్శకత్వం : కార్తికేయ నిర్మాత : పద్మనాభ రెడ్డి, నల్ల అయ్యన్నాయుడు బాలనటుడిగా సక్సెస్ అయిన తనీష్.. హీరోగా సక్సెస్ కావడానికి చాలా ప్రయత్నిస్తున్నాడు. తనీష్ తెరపై హీరోగా కనపడి చాలా కాలమే అయింది. ఇటీవలె బిగ్బాస్ షోతో పాపులర్ అయిన తనీష్.. రంగు సినిమాతో మరోసారి ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అయ్యాడు. విజయవాడ రౌడీ షీటర్ లారా జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన రంగు చిత్రం.. తనీష్ను హీరోగా నిలబెట్టిందా?.. అసలు ‘రంగు’ వెనుక కథేంటి? అన్నది ఓసారి చూద్దాం.. కథ : బెజవాడ రౌడీయిజం చుట్టూ రంగు కథ తిరుగుతుంది. లారా అనే వ్యక్తి జీవితంలో సంఘటనల ఆదారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. లారా పాత్రను తనీష్ పోషించాడు. పవన్ కుమార్ అలియాస్ లారా(తనీష్) అనే కుర్రాడు చదువుల్లో స్కూల్ ఫస్ట్. అయితే కాలేజ్లో గొడవలు, కొన్ని పరిస్థితుల వల్ల పోలీస్ స్టేషన్కు వెళ్లడం.. అటుపై రౌడీ షీటర్గా మారతాడు. అక్కడినుంచి సెటిల్మెంట్లు చేస్తూ.. ఎదుగుతూ ఉంటాడు. ఈ గొడవల మధ్యే తనకు పూర్ణ (ప్రియా సింగ్) అనే అమ్మాయితో ప్రేమా తరువాత పెళ్లి జరుగిపోతాయి. దీంతో జీవితంపై ఇష్టం ఏర్పడుతుంది. మళ్లీ మాములు మనిషిలా మారాలానుకుంటాడు. మరి అనుకున్నట్టుగా లారా మంచి వాడిగా మారిపోయాడా..? ఈ ప్రయత్నంలో లారాకు ఎదురైన సమస్యలేంటి..? ఈ కథలో ఏసీపీ రాజేంద్రన్ (పరుచూరి రవి), మణి (షఫీ)ల పాత్ర ఏంటీ? అసలు చివరకు ఏమైంది.. అనేదే ‘రంగు’ కథ. నటీనటులు : లారా పాత్రలో తనీష్ బాగానే నటించాడు. కొన్ని సన్నివేశాల్లో తడబడ్డట్టు అనిపించినా.. ఎమోషనల్ సీన్స్లో ఆకట్టుకున్నాడు. ఇక ఏసీపీ రాజేంద్రన్ పాత్రలో పరుచూరి రవి నటన గుర్తుండిపోతుంది. ఆ పాత్రకు కావల్సిన బాడీలాంగ్వేజ్తో బాగానే నటించాడు. ఇక ఈ సినిమాలో తనీష్ తరువాత ఎక్కువగా కనిపించేది, గుర్తుండేది పరుచూరి రవి పాత్రే. నటుడిగా అతను ఇంకా బిజీ అయ్యే అవకాశం ఉంది. రౌడీయిజం వదిలేసి సాధుజీవిలో బతుకుతున్న పాత్రలో షఫీ నటన బాగుంది. పూర్ణ తెరపై కనిపించింది కొద్ది సేపే అయినా ఉన్నంతలో మంచి నటన కనబరిచింది. ఇక మిగిలిన పాత్రల్లో పోసాని కృష్ణమురళీ, పరుచూరి వెంకటేశ్వర్రావు తమ పాత్ర పరిధిమేరకు నటించారు. విశ్లేషణ : ఓ వ్యక్తి రౌడీగా మారడానికి దారితీసే కారణాలు.. ఆవేశంలో చేసే పనులు.. ఆలోచన లేకుండా భవిష్యత్తును నాశనం చేసుకోవడం, తిరిగి సాధారణ జీవితాన్ని గడపాలనుకోవడం అయినా గతం వెంటాడటం లాంటి సంఘటనల్లో సినిమా కావాల్సినంత కమర్షియల్ కంటెంట్ ఉంది. కానీ రంగు విషయంలో ఇలాంటి అంశాలు చాలా ఉన్నా కూడా.. వాటిని దర్శకుడు సరిగ్గా వినియోగించుకోలేదనిపిస్తుంది. ఈ కథకు పరుచూరి బ్రదర్స్ మాటలు రాయడం ప్లస్ పాయింట్. వారి మాటలు మాస్ ఆడియన్స్ను ఆకట్టుకునేలా అదే సమయంలో ఆలోచింపచేసేలా ఉన్నాయి. యోగేశ్వర్ శర్మ అందించిన సంగీతం ఫర్వాలేదు. ఎడిటింగ్పై ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. ప్లస్ పాయింట్స్ ; కథ కొన్ని పాత్రలు మైనస్ పాయింట్స్ ; నిర్మాణ విలువలు సినిమా నిడివి కథనం బండ కళ్యాణ్, ఇంటర్నెట్ డెస్క్ -
ఏ పాత్ర చేయడానికైనా రెడీ
‘‘నేను ఇండస్ట్రీకి నటుడిగానే పరిచయమయ్యా. హీరోగా రాలేదు. హీరోనా.. విలనా..? అన్నది ఆలోచించను. నాకు ఎగై్జటింగ్గా అనిపిస్తే ఏ పాత్ర చేయడానికైనా సిద్ధమే’’ అని హీరో తనీశ్ అన్నారు. తనీశ్, పరుచూరి రవి, ప్రియా సింగ్, పరుచూరి వెంకటేశ్వరరావు, పోసాని కృష్ణమురళి, షఫీ ముఖ్య పాత్రల్లో కార్తికేయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రంగు’. నల్లస్వామి సమర్పణలో ఎ.పద్మనాభ రెడ్డి, నల్ల అయ్యన్న నాయుడు నిర్మించిన ఈ సినిమా ఈ రోజు విడుదలవుతోంది. తనీశ్ మాట్లాడుతూ– ‘‘ప్రతి మనిషిలో చాలా రంగులు, భావోద్వేగాలు ఉంటాయి. అందుకే ‘రంగు’ అని టైటిల్ పెట్టాం. విజయవాడకు చెందిన లారా (పవన్ కుమార్) అనే వ్యక్తి జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. ఇందులో లారా పాత్ర చేశా. కాలేజ్లో స్టేట్ ర్యాంకర్ అయిన లారాపై రౌడీషీటర్ అనే ముద్ర ఎలా పడింది. 27ఏళ్లకే ఆయన ఎందుకు చంపబడ్డారు? అనే విషయాలతో పాటు ఆయన గురించి ప్రజలకు తెలియని ఎన్నో అంశాలను ‘రంగు’లో చూపించాం. లారా కుటుంబ సభ్యులు తలెత్తుకుని తిరిగేలా ఈ సినిమా ఉంటుంది. చివరి 30 నిమిషాలు హైలైట్గా ఉంటుంది. కృష్ణవంశీగారి ‘నక్షత్రం’లో విలన్గా చేసినందుకు గర్వంగా ఉంది. ఆ సినిమా తర్వాత ఎవరూ విలన్ పాత్ర కోసం నన్ను సంప్రదించలేదు. హీరో పాత్ర కోసమే కథలు వినిపిస్తున్నారు’’ అన్నారు. -
అభ్యర్థి నచ్చకుంటే ‘నోటా’ ఉందిగా..
బంజారాహిల్స్: ఓటరుగా నమోదు చేసుకోవడంలో చూపిన ఉత్సాహం పోలింగ్ రోజు వినియోగిస్తేనే దానికి సార్థకత. ఐదేళ్ల పాటు మన మంచీచెడులను చూసే నేతలను ఎన్నుకునే ఈ క్రతువులో ఓటు అనే ఆయుధమే ప్రజా అస్త్రం. ఈ వజ్రాయుధాన్ని వినియోగించుకోకుంటే మనం విజయవంతమైనట్టే. అందుకే ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి. మెరుగైన సమాజం కోసం ఓటు వేసి బాధ్యతను నెరవేర్చుకోవాలి. ఒకవేళ మీకు ఏ అభ్యర్థి కూడా నచ్చకపోతే నోటా అనే మరో ఆప్షన్ ఉందనే విషయం మర్చిపోకూడదు. నేను ప్రతి ఎన్నికల్లోనూ తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగింకుంటాను. మీరు కూడా తప్పనిసరిగా ఓటు వేయండి. ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత శక్తిమంతమైన ఆయుధం ఏదైనా ఉందంటే అది ఓటు మాత్రమే. – తనీష్, సినీ నటుడు -
హీరోలు లేరు... విలన్లు లేరు!
‘‘నేను ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్లు అయ్యింది. నేను నటించిన తొలి సినిమా (బాలనటుడు) ‘ప్రేమంటే ఇదేరా’ హిట్ అయిన రోజు చాలా ఆనందమేసింది. చాలా ఏళ్ల తర్వాత ‘రంగు’ సినిమాతో మళ్లీ ఇంత ఆనందంగా ఉంది’’ అని తనీష్ అన్నారు. తనీష్, పరుచూరి రవి, ప్రియా సింగ్, పరుచూరి వెంకటేశ్వరరావు, పోసాని కృష్ణమురళి, షఫీ ముఖ్య తారలుగా కార్తికేయ.వి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రంగు’. నల్లస్వామి సమర్పణలో ఎ.పద్మనాభరెడ్డి, నల్ల అయ్యన్న నాయుడు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23న విడుదలవుతోంది. హైదరాబాద్లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్లో తనీష్ మాట్లాడుతూ– ‘‘చాలా రోజుల తర్వాత మా అమ్మగారు నా కోసం ఈ ఫంక్షన్కు వచ్చారు. చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రంలో హీరోలు, విలన్లు లేరు.. అన్నీ పాత్రలే’’ అన్నారు. ‘‘ఓ ఫ్రెండ్ ద్వారా లారా గురించి విన్నాను. ఆయన స్నేహితులను కలిసి కథను తయారు చేసుకున్నాను. పరుచూరి బ్రదర్స్ ఈ కథని కమర్షియల్ ఫార్మాట్లోకి మార్చి అద్భుతంగా మలిచారు’’ అన్నారు కార్తికేయ. ‘‘ఓ కొత్త బ్యానర్ పెట్టుకుని కొత్తవారితో సినిమాలు చేయాలనుకుంటున్నాం. మా సినిమా వల్ల ఎవరికీ నష్టం రాదు.. రానివ్వను. నేను చాలా సినిమాలు తీస్తున్నాను. తక్కువ ఖర్చులో సినిమా ఎలా తీయాలో నేర్చుకున్నా. ‘రంగు’ సినిమా బాగుంటుంది’’ అని పద్మనాభరెడ్డి అన్నారు. ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, పరుచూరి వెంకటేశ్వరరావు, ప్రియా సింగ్, నిర్మాతలు మల్కాపురం శివకుమార్, రవి, రామసత్యనారాయణ, రాజ్కందుకూరి తదితరులు పాల్గొన్నారు. -
‘రంగు’ ప్రీ రిలీజ్ ఫంక్షన్
-
డబ్బే జీవితం కాదు
‘‘కథకి నగేష్ ఇచ్చే ప్రాధాన్యం గురించి అందరూ చెప్పారు. ‘దేశ దిమ్మరి’ సినిమా తీసేందుకు ముందుకు వచ్చిన నిర్మాతకు అభినందనలు. ప్రస్తుతం చిన్న సినిమాల హవా నడుస్తోంది. ఈ సినిమా హిట్ అయి, విజయ పరంపర కొనసాగాలి’’ అని నిర్మాత రాజ్ కందుకూరి అన్నారు. తనీష్, షరీన్ జంటగా నగేష్ నారదాసి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దేశ దిమ్మరి’. స్వతంత్ర గోయల్ (శావి యుఎస్ఎ) నిర్మించారు. ఈ చిత్రంలో తనీష్ పాడిన ‘హే పైసా..’ సాంగ్ని విడుదల చేశారు. డైరెక్టర్ నగేష్ మాట్లాడుతూ– ‘‘పంజాబ్, హర్యానాలో ఈ చిత్రం షూటింగ్ చేశాం. కొండలు ఎక్కడం, దిగడం చాలా కష్టం. నేను ఈ సినిమా కోసం అందర్నీ చాలా ఇబ్బంది పెట్టాను. ముఖ్యంగా తనీష్ని, కెమెరామెన్స్ని’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో నేను చాలెంజింగ్ రోల్ చేశా’’ అన్నారు సుమన్. ‘‘ఈ చిత్రానికి ప్రేక్షకుల ఆశీస్సులు కావాలి’’ అని గోయల్ అన్నారు . ‘‘పనీపాటా లేకుండా దేశం మొత్తం తిరుగుతుండే ఓ కుర్రాడి చుట్టూ తిరిగే సినిమా ఇది. డబ్బు అనేది కేవలం అవసరం.. అదే జీవితం కాదనే కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది’’ అన్నారు తనీష్. సంగీత దర్శకుడు సుభాష్ ఆనంద్, పాటల రచయిత పార్వతి చంద్, ఫైట్మాస్టర్ అంజి, కెమెరామెన్ మల్లికార్జున నారగాని తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నో రంగులు
సమాజంలో యువత బాధ్యత ఏంటి? సమాజాన్ని కాపాడాల్సిన పోలీసుల బాధ్యత ఏంటి? ఇలాంటి కథాంశంతో నల్లస్వామి సమర్పణలో యు అండ్ ఐ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తనీష్, ప్రియాసింగ్ జంటగా రూపొందుతోన్న చిత్రం ‘రంగు’. కార్తికేయ.వి దర్శకత్వంలో ఎ. పద్మనాభ రెడ్డి, నల్ల అయ్యన్న నాయుడు నిర్మిస్తున్నారు. శనివారం హైదరాబాద్లో రచయిత, నటులు పరుచూరి వెంకటేశ్వర రావు ఈ చిత్రం ట్రైలర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా తనీష్ మాట్లాడుతూ– ‘‘నేను బిగ్ బాస్ హౌస్లో ఉండగా మా ‘రంగు’ సినిమాకు సంబంధించిన ట్రైలర్, మూడు పాటలను విడుదల చేశారు. మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాలో నా పాత్ర విషయానికి వస్తే విజయవాడకి చెందిన లారా అనే కుర్రాడి పాత్ర పోషిస్తున్నాను. 17–28 సంవత్సరాల మధ్య ఉండే వ్యక్తిగా నాలుగు వేరియేషన్లలో నా పాత్ర ఉంటుంది. సోషల్ మెసేజ్ ఉన్న సినిమా’’ అన్నారు. కార్తికేయ మాట్లాడుతూ– ‘‘న్యూస్ పేపర్లో ఓ విషయాన్ని చదివి నేరుగా అక్కడికి వెళ్లి లారా అనే వ్యక్తిని కలిసి తయారు చేసుకున్న కథ ఇది. రియలిస్టిక్గా ఉంటూనే కమర్షియల్ పంథాలో ఎలా సినిమా చేయాలో పరుచూరి బ్రదర్స్ చెప్పారు. ఓ చిన్న కుర్రాడి పాత్ర నుండి ఇరవై ఎనిమిదేళ్ల యువకునిగా కనపడే పాత్ర కోసం తనీష్ ఎంతో కష్టపడ్డారు’’ అన్నారు. ఎ.పద్మనాభరెడ్డి మాట్లాడుతూ– ‘‘యు అండ్ మీ సంస్థను స్థాపించటం వెనక ్రçపధాన కారణం ఆశయాన్ని బతికించటం. కృష్ణానగర్లో ఎంతో మంది దర్శకులు వారి ఆకలిని మరిచిపోయి ఆశయం కోసం బతుకుతుంటారు. నిర్మాతలెందరో వస్తుంటారు, పోతుంటారు. కానీ ఎన్ని ఎదురుదెబ్బలు తిన్నా చనిపోయే దాకా నిర్మాతగానే ఉంటాను’’ అన్నారు. ఈ చిత్రానికి సాహిత్యం: సిరివెన్నెల, సంగీతం: యోగేశ్వర శర్మ. -
బిగ్బాస్ : దీప్తి ఎలిమినేషన్ ఖాయం!
బిగ్బాస్ షో చివరి అంకానికి రాబోతోంది. ఇక మిగిలింది కొన్ని రోజులే. దాదాపు 70 రోజుల పాటు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ సాగిన బిగ్బాస్ ఇకపై మరింత ఆసక్తిగా మారేట్టు కనిపిస్తోంది. పది మంది కంటెస్టెంట్లు.. మిగిలింది నాలుగు వారాలు.. మరి వారానికి ఇద్దరిని బయటకు పంపిస్తారా? అయితే ఈ లెక్కన ఈ వారం నామినేట్ అయిన దీప్తీ, పూజ, తనీష్, కౌశల్లో మరి తనీష్, కౌశల్ స్ట్రాంగ్ కంటెస్టెంట్లు కాగా.. దీప్తి, పూజలు డేంజర్ జోన్లో ఉన్నట్టే లెక్క. ఎలిమినేషన్ అంటే చాలు తెగ టెన్షన్ పడిపోయి, గాబర పడిపోయే దీప్తి గతవారం ఆ ప్రక్రియలో లేకపోయేసరికి కాస్త ప్రశాంతంగా కనిపించింది. కానీ ఈ సంబరం ఎంతో సేపు లేదు. ఈ వారం మళ్లీ నామినేషన్లోకి వచ్చాక.. తనలో మళ్లీ అదే టెన్షన్. అందరితో కలిసి ఉన్నానని, ఎవరు తనను నామినేట్ చేసుంటారా అని గణేష్తో తన గోడును వెల్లిబుచ్చుకుంటుంటే.. కౌశల్ మధ్యలో వచ్చి.. ‘తనను ఎవరు నామినేట్ చేసుంటారో తనకు ఐడియా ఉంద’ని.. నామినేషన్లోకి రావాలంటే మినిమమ్ నాలుగు ఓట్లైనా రావాలని.. మరి ఎవరు వేశారో ఆలోచించుకోండంటూ దీప్తితో చెప్పుకొచ్చాడు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన పూజ రామచంద్రన్ మళ్లీ ఈ సారి కూడా నామినేషన్లోకి వచ్చింది. మరి ఈ సారి ప్రేక్షకులు పూజను సేవ్ చేస్తారో లేదో చూడాలి. లేక బిగ్బాస్ ఏదైనా ట్విస్ట్ అని చెప్పి ఇద్దరిని ఎలిమినేట్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అలా చూసుకుంటే ఈ సారి దీప్తి, పూజలపై వేటు పడే అవకాశమే ఎక్కువ. ఎందుకుంటే కౌశల్ ఎలాగూ సేవ్ అయిపోతాడు అది వేరే విషయం.. తనీష్పై సోషల్ మీడియాలో నెగెటివిటి ఉన్నా.. ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది కాబట్టి సేవ్ అయ్యే అవకాశాలే ఎక్కువ. కాబట్టి.. దీప్తి చేసే చేష్టలకు, అతికి విసిగిపోయిన ప్రేక్షకులు ఈ సారి మాత్రం ఈ అవకాశాన్ని ఉపయోగించుకునేలా కనిపిస్తోంది. పూజకు మరీ అంత ఫాలోయింగ్ లేదు కాబట్టి తను కూడా వెళ్లే అవకాశమూ ఉంది. ఈ వారాంతానికి షోలో ఇంకెన్ని పరిణామాలు జరుగుతాయో? ఎలాంటి మలుపులు తిరుగుతాయో చూడాలి.. ఏదైనా జరుగొచ్చు.. ఎందుకంటే ఇది బిగ్బాస్. -
బిగ్బాస్: తనీష్ నువ్వెలా బెస్ట్ ప్లేయర్?
సాక్షి, హైదరాబాద్ : బిగ్బాస్ సీజన్-2 రసవత్తరంగా కొనసాగుతోంది. సీజన్-1 కన్నా హౌజ్ మేట్స్ గొడవలు, సోషల్ మీడియా ట్రోల్స్తో ఈ సీజన్ వేడెక్కింది. శనివారం ఎపిసోడ్లో హోస్ట్ నాని తనదైన శైలిలో ఆకట్టుకున్నాడు. గత వారం రోజులుగా హౌస్లో జరిగిన పరిణామాలపై ఆరాతీశాడు. ఈ సందర్భంగా ఇంటిసభ్యుల ప్రవర్తనపై ఒకింత అసహనం కూడా వ్యక్తం చేశాడు. చెప్పిందే చెప్పి తనకే బోర్ వస్తుందని, హౌస్ మేట్స్ మాత్రం మారడం లేదన్నాడు. కాస్త సీరియస్గానే సాగిన ఈ ఎపిసోడ్లో ప్రేక్షకులకు కావాల్సిన మజా దొరికింది. రజనీకాంత్ ‘నరసింహా’ సినిమా స్టోరీని పిట్టకథగా చెబుతూ షోను ప్రారంభించిన న్యాచురల్ స్టార్.. డబ్బు ఏమైనా చేస్తుందని, దానితో జాగ్రత్త ఉండాలని, హౌస్లో కూడా ఇదే నిరూపితమైందని తెలిపాడు. శుక్రవారం హౌస్లో జరిగిన కొన్ని ఆసక్తికర ఘటనలను నాని చూపించాడు. ఇంటి సభ్యులు బిగ్బాస్తో నెలకొన్న బంధం గురించి సరదాగా ముచ్చటించారు. ఇక కౌశల్ కొందరి ఇంటిసభ్యులను ఇమిటేట్ చేస్తుండగా నూతన్ నాయుడు వారి పేర్లు చెప్పాడు. నామినేషన్లో ఉన్న కారణంగా ఇంటి సభ్యులతో ముచ్చటిస్తూ.. తన దగ్గరకు వచ్చిన దీప్తిపై నూతన్ నాయుడు ఫైర్ అయ్యాడు. (చదవండి: బిగ్బాస్-2.. అదే అసలు సమస్య!) తనీష్కు క్లాస్... తొలుత నామినేషన్లో ఉన్న ఒక్కక్కరితో నాని ముచ్చటించారు. ముఖ్యంగా తనీష్కు గట్టిగానే క్లాస్ పీకాడు. టాస్క్లో దీప్తి సునయన కోసం తప్పుకోవడం ఏమిటని మందలించాడు. దీనికి తనీష్ కాలునొప్పితో అలా చేశానని, సునయన కోసం కాదని ఎదో సాకు చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ నాని కన్విన్స్ కాలేదు. ఇక ఏ టాస్క్లో పాల్గొని నువ్వు బెస్ట్ ప్లేయర్ ఎలా అయ్యావని ప్రశ్నించాడు. కబడ్డీ టాస్క్, క్రైయింగ్ టాస్క్, బాక్స్ టాస్క్ల్లో పాల్గొనలేదు మరీ ఎలా బెస్ట్ పర్ఫార్మర్ అయ్యావు అని నిలదీశాడు. ఈ ప్రశ్నకు తనీష్, అతని మద్దతుదారులకు దిమ్మతిరిగింది. సమాధానం చెప్పడంలో తనీష్ తడబడ్డాడు. ఇక కౌశల్ కాయిన్స్ తీసుకెళ్లడం వ్యతిరేకించిన తనీష్ పూజా విసిరిన కాయిన్స్ ఎలా తీసుకుంటావని ప్రశ్నించాడు. ఎదో ఒకవైపు ఉండాలి అని మందలించాడు. గణేష్ మళ్లీ హౌస్లో కనబడటం లేదని, సమోసాలు, వర్షం అంటూ ఎదో చెప్పాడు. అయినా వేడివేడి వర్షం ఏంటీరా నాయనా అని ప్రశ్నించాడు. దీంతో నవ్వులు పూసాయి. బాబు డబుల్ గేమ్.. బాబుగోగినేని నుంచి ఎలాంటి ప్రయత్నం జరగడం లేదని, ప్రతీసారి ఇదే చెబుతున్నాని, కానీ తను మాత్రం లైట్ తీసుకుంటున్నాడని చెప్పుకొచ్చాడు. ఇక కాయిన్స్ టాస్క్లో కౌశల్ కాయిన్స్ ఎత్తుకెళ్లడాన్ని మహిళా కంటెస్టెంట్స్ వద్ద తప్పుబట్టడం, మళ్లీ కౌశల్ వద్ద సమర్ధించడం ఎంటని ప్రశ్నించాడు. దీనికి బాబు తనదైన సమాధానంతో నాని ట్రాప్లో పడే ప్రయత్నం చేశాడు. కానీ నాని వీడియో క్లిప్ ప్లే చేసి బాబు డబుల్ గేమ్ను బయటపెట్టాడు. దీనికి బాబుగోగినేని సైతం తన తప్పును అంగీకరించాడు. ఎలాగోలా బతికే చేపలు.. హౌస్లో అమిత్, రోల్రైడాలు ఎలాగోలా బతికే చేపలని నాని కామెంట్ చేశాడు. వీరు మంచితనం అనే ముసుగులో గేమ్ ఆడుతున్నారని, ఇంకా అది పనిచేయదని సూచించాడు. అమిత్ డబుల్ గేమ్ను సైతం వీడియో క్లిప్తో బట్టబయలు చేశాడు. కౌశల్తో కాయిన్స్ తీయడాన్ని సమర్ధించడం.. మళ్లీ ఆ విషయమే తనే తీయాలని రోల్రైడాతో చర్చించడం.. చివర్లో ఎవరికి చెప్పావని కౌశల్ను ప్రశ్నించడం ఏమిటని నాని నిలదీశాడు. ఏదో ఒకనిర్ణయానికి కట్టుబడి ఉండాలన్నాడు. ఆ విషయంలో నచ్చావ్ కౌశల్.. కెప్టెన్ టాస్క్లో భాగంగా దీప్తి సునయన సంచాలకులుగా వ్యవహిరంచడం ఏమిటని నాని ప్రశ్నించాడు. తనీష్కు క్లోజ్గా ఉండే తను న్యాయంగా ఉన్నా అలా అనిపించడం లేదన్నాడు. దీనికి సునయన ఎప్పుడు చేయలేదు కదా అని చేశా.. నిజాయితీగానే చెప్పా అని సమాధానమిచ్చింది. దీనికి ఎలిమినేష్న్ ఎప్పుడు కాలేదు కదా అని అయితావా ఏంటీ అని పంచ్ ఇచ్చాడు. ఇదే ఎవరి గొయ్యి వారు తవ్వుకోవడం అని బదులిచ్చాడు. ఈ టాస్క్ వ్యవహారంలో కౌశల్ ఓ స్టాండ్ తీసుకోని తన అభిప్రాయాన్ని వెల్లడించడం నచ్చిందని నాని మెచ్చుకున్నాడు. అయితే ఆ టాస్క్లో నేనైతే ఇలా చేశావాడినని, తోసేవాడినని చెప్పడం ఏమిటని ప్రశ్నించాడు. దానికి నేనైతే ఇలా ఆడేవాడినని మాత్రమే చెప్పానని కౌశల్ బదులిచ్చాడు. ఇక కాయిన్స్ టాస్క్ మొత్తం మార్చేశావని, అయితే ఆ పని మీ జట్టు సభ్యులకు చెప్పి చేస్తే బాగుండేదని నాని అభిప్రాయపడ్డాడు. ఇక సామ్రాట్ బాగా ఆడుతున్నాడని కితాబిచ్చాడు. గీతాగారు మీరు ఇన్ఫ్లూయెన్స్.. గత వారం నుంచి ఓ ఇంటి సభ్యుడితో ఓ లక్కీ అభిమాని ఫోన్ మాట్లాడే అవకాశం కల్పించాడు బిగ్బాస్. ఇందులో భాగంగా వరంగల్ నుంచి గీతామాధురి అభిమాని మాట్లాడారారు. ముందుగా నాని న్యాచురల్గా హోస్ట్ చేస్తున్నాడని కితాబిచ్చి.. గీతా మాధురితో మాట్లాడారు. ‘ తొలి రోజుల్లోని మీ ప్రవర్తనకు ఇప్పటికి తేడా వచ్చిందని, మీరు దీప్తి, శ్యామల మాటలకు ప్రభావం అవుతున్నారని ప్రశ్నించారు. మీరు మీలానే ఉండాలని సూచించారు’. దీనికి గీతా సైతం అలానే ఉండటానికి ప్రయత్నిస్తానని సమాధానిమచ్చింది. చివర్లో కౌశల్ నాని టాస్క్ల్లో హౌజ్ మేట్స్ నిజాయితీగా బెస్ట్ పర్ఫార్మర్ పేరు చెప్పడం లేదన్నాడు. దీనికి వారు నిజాయితీగా లేకుంటే ప్రేక్షకులున్నారు. నీకు ప్రేక్షకులు కావాలా కంటెస్టెంట్స్ కావాలా అని ప్రశ్నించాడు. దీనికి కౌశల్ ప్రేక్షకులేనని సమాధానమిచ్చాడు. ఇక నామినేషన్స్లో ఉన్న గీతా మాధురి, శ్యామల ప్రొటెక్ట్ అయ్యారని నాని తెలిపాడు. మిగిలిన తనీష్, బాబుగోగినేని, గణేష్, దీప్తిల్లో ఎవరూ ప్రొటెక్ట్ అవుతారు? ఎవరూ ఎలిమినేట్ అవుతారో తెలియాంటే నేటి ఎపిసోడ్ వరకు వేచి ఉండాల్సిందే. -
బిగ్బాస్ : కన్నీటి పర్యంతమైన నందిని..
ఆరో వారం బిగ్బాస్ షో సరదాగా సాగిపోతోంది. బిగ్బాస్ ఆదేశం మేరకు ఇంటి సభ్యులంతా కలిసి తెరకెక్కించిన సినిమాకు ప్రశంసలు దక్కాయి. సినిమాను అద్భుతంగా తెరకెక్కించినందుకు బిగ్బాస్ నిర్మాత బాబు గోగినేని, దర్శకుడు అమిత్కు కొంత డబ్బును ఇవ్వగా... దానిని సినిమా కోసం పనిచేసిన మిగతా బృందానికి నటీనటులు, సాంకేతిక బృందానికి తగిన పారితోషకం ఇవ్వాల్సిందిగా వారిని ఆదేశించారు. సభ్యులందరిలో ఎక్కువ డబ్బు ఎవరి దగ్గర ఉంటుందో వారే విజేతలని బిగ్బాస్ చెప్పగా.. ఎక్కువ మొత్తంలో డబ్బు ఉన్న బాబు గోగినేని, తనీష్, అమిత్లను ఈ వారం కెప్టెన్సీ పోటీకి అర్హులుగా ప్రకటించారు. కెప్టెన్గా తనీష్.. టమాటలను తొక్కుతూ.. వాటి నుంచి జ్యూస్ తీయాలని టాస్క్ను ఇవ్వగా.. ఎవరు ఎక్కువ రసం తీస్తే వారే విజేతలని బిగ్బాస్ తెలిపాడు. ఈ టాస్క్లో ఎవరైనా ఒక ఇంటి సభ్యుడి సహాయం తీసుకోవచ్చు అని చెప్పగా...అమిత్.. రోల్ రైడా, బాబు గోగినేని.. తేజస్వీ, తనీష్.. సామ్రాట్ల సహాయాన్ని తీసుకొన్నారు. ఈ టాస్క్లో తనీష్ చురుగ్గా పాల్గొనగా.. ఎక్కువ రసాన్ని తీసి కెప్టెన్గా బాధ్యతను తీసుకున్నారు. బిగ్బాస్ ఏర్పాటుచేసిన క్విజ్పోటీలు.. ఈ క్విజ్పోటీల్లో.. ఇచ్చిన స్టేట్మేంట్లు ఇంటిసభ్యుల్లో ఎవరికి సరిపోతుందో.. సరైన సమాధానం చెబితే వారికిష్టమైన ఫుడ్ను బిగ్బాస్ అందిస్తాడు. మేడిపండు చూడ మేలిమై ఉండు.. పొట్ట విప్పి చూడ పురుగులుండు.. అన్న దానికి సమాధానంగా ఇంటి సభ్యులు నందిని పేరును సజెస్ట్ చేయగా.. సరైన సమాధానమంటూ నందినికీ ఇష్టమైన ఫుడ్ను ఇచ్చాడు. ప్రపంచంలోని అన్ని విషయాలు తెలుసు.. కానీ బిగ్బాస్ హౌజ్ గురించి తెలియదు అనే ప్రశ్నకు బాబు గోగినేని పేరును చెప్పారు. కొండంత మనిషి.. కానీ మనసు వెన్న అనే దానికి అమిత్.. అసలు దాన్ని వదిలేసి కొసరును పట్టుకుని వేలాడుతుంది అనే దానికి గీతా మాధురి, ప్రేమ పూజారి అనే దానికి తనీష్, కొంచెం మంచి కొంచెం చెడుగా కౌశల్, ఎలిమినేషన్ అంటే భయపడే వ్యక్తిగా దీప్తి, లడ్డుబాబుగా గణేష్, అలరిస్తూ..ఆనందించే వాడుగా రోల్ రైడా, చిన్నదానిలా వచ్చి ఘాటు మిర్చిగా మారింది అనే దానికి దీప్తి సునయన పేర్లను కరెక్ట్గా చెప్పిన ఇంటి సభ్యులు సామ్రాట్, తేజస్వీ విషయాల్లో సరైన సమాధానాలు చెప్పలేకపోయారు. కన్నీరు పెట్టిన నందిని.. మేడిపండు చూడ మేలిమై ఉండు.. పొట్టవిప్పి చూడ పురుగులుండు అనే స్టేట్మేంట్ తనకు ఇచ్చినందుకు నందిని రాయ్ కన్నీటి పర్యంతమయ్యారు. ఇంటి సభ్యులందరూ ఓదార్చసాగారు. ఇంటి సభ్యులకు స్టేట్మెంట్స్ను ఊరికే ఇవ్వలేదని.. ఇంట్లో సభ్యులు ప్రవర్తించే తీరును గమనించే ఇచ్చాడని సోషల్ మీడియాలో అభిప్రాయపడుతున్నారు. -
బిగ్బాస్2 : తనీష్ వర్సెస్ నూతన్ నాయుడు
తెలుగు బిగ్బాస్ సీజన్ 2 రెండో వారం ఆసక్తికరంగా సాగుతోంది. తొలివారం వరకూ బాగానే ఉన్న హౌస్మేట్స్ రెండో వారాంతానికి గ్రూపులుగా విడిపోయారు. అంతేకాకుండా కంటెస్టెంట్ల మద్య చిన్నపాటి గొడవలు చోటు చేసుకున్నాయి. హోస్ట్ నానీ చెప్పినట్లుగానే ఏమైనా జరగొచ్చు.. ఇంకొంచెం మసాలా అన్నట్లుగానే సాగుతోంది. వీటన్నింటిని వివరిస్తూ, ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు శుక్రవారం విడుదల చేసిన ప్రోమో అందరినీ అలరించింది. ఈ ప్రోమోలో ఇంటి సభ్యుల మద్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. సామాన్యుల కోటా నుంచి బిగ్బాస్ హౌస్లో అడుగిపెట్టిన నూతన్ నాయుడు, సామ్రాట్ల మద్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఇంటిలోని వస్తువులను సక్రమంగా ఉంచట్లేదనే విషయంలో ఇద్దరు వాగ్వాదానికి తెలుస్తోంది. అంతేకాకుండా నూతన్నాయుడు, తనీష్ల మద్య కూడా గొడవ జరిగింది. ఇందులో నూతన్ నాయుడు ఎక్కువగా మాట్లాడకు అనగా.. స్పందించిన తనీష్ ఎవరు ఎక్కువగా మాట్లాడుతున్నారంటూ దూసుకువచ్చారు. పక్కనే ఉన్న గణేష్, కౌషల్లు తనీష్ను ఆపే ప్రయత్నం చేశారు. వీటితో పాటు మేమేమి చేతులకు గాజులేసుకు కూర్చోలేదు అంటూ నూతన్ నాయుడు పేల్చిన మాటల తూటాలు నేటి ఎపిసోడ్పై ఆసక్తిని పెంచుతున్నాయి. వీరితో పాటు తేజస్వి, కౌషల్ మధ్య కూడా మాటల యుద్ధం నడిచింది. -
సింగర్గా మారిన మరో యంగ్ హీరో
బాల నటుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన తనీష్ తరువాత హీరోగానూ కొన్ని సినిమాల్లో కనిపించాడు. అయితే కథానాయకుడిగా ఆశించిన స్థాయిలో సక్సెస్లు రాకపోవటంతో ఇటీవల నక్షత్రం సినిమాతో విలన్గా మారాడు. కృష్ణవంశీ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా కూడా తనీష్కు సక్సెస్ ఇవ్వలేదు. ప్రస్తుతం దేశ దిమ్మరి అనే సినిమాలో నటిస్తున్నాడు తనీష్. ఇప్పటికే హీరో నుంచి విలన్ గా మారిన తనీష్ ఈ సినిమాతో సింగర్ గా మారుతున్నాడు. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు నగేష్ నారదాసి దర్శకుడు. నవీన క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. -
పల్లెటూరి ప్రేమ
తనీష్, శ్రుతీ యుగళ్ జంటగా ఎస్.వి.ఎన్. రావు సమర్పణలో మహేంద్ర దర్శకత్వంలో దేశాల లక్ష్మయ్య నిర్మించిన చిత్రం ‘ప్రేమిక’. దిలీప్ బండారి స్వరపరచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్లో విడుదల చేశారు. ‘‘పల్లెటూరి నేపథ్యంలో సాగే మంచి ప్రేమకథ. మదర్ సెంటిమెంట్ కూడా ఉంటుంది. ఛాన్స్ ఇచ్చిన లక్ష్మయ్యకు రుణపడి ఉంటా’’ అన్నారు మహేంద్ర. ‘‘సెప్టెంబర్ 8న సినిమాను విడుదల చేస్తున్నాం’’ అన్నారు దేశాల లక్ష్మయ్య. తనీష్, శృతియుగళ్, ఎమ్మెల్యే రసమయి బాలకృష్ణ, దర్శకుడు త్రినాథరావు, గణేష్ మాస్టర్ పాల్గొన్నారు. -
మీడియాకు హీరో విజ్ఞప్తి
-
ప్రేమిస్తే సరిపోదు
‘అప్పుడే పుట్టిన పసిబిడ్డలాంటిదే చిన్న సినిమా. చిన్న చిత్రాలను కాపాడాలి. వాటి వల్ల చాలా మందికి జీవనోపాధి దక్కుతుంది. ‘ప్రేమిక’ టీజర్ బాగుంది’’ అని దర్శక-నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు అన్నారు. తనీష్, శ్రుతీ యుగళ్ జంటగా మహేంద్ర దర్శకత్వంలో దేశాల లక్ష్మయ్య నిర్మిస్తున్న ‘ప్రేమిక’ చిత్రం టీజర్ను హైదరాబాద్లో విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ఒక గ్రామంలో జరిగిన వాస్తవ సంఘటన నేపథ్యంలో రూపొందిస్తోన్న చిత్రమిది. అమ్మాయిల వెనక అల్లరి చిల్లరగా తిరిగే యువకులు... పెళ్లి చేసుకోవాలంటే ప్రేమిస్తే సరిపోద్ది. అదే అమ్మాయిని పోషించాలంటే సంపాదించాలనే నిజం తెలుసుకున్న తర్వాత వాళ్ల జీవితంలోకి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? వాటిని ఎలా పరిష్కరించుకున్నారు? అనేది కథ. త్వరలో పాటలు, ఆగస్టులో సినిమాను విడుదల చేయనున్నాం’’ అన్నారు. ‘ప్రేమిక’ అన్నది ఓ సినిమా కాదు. టాలెంటెడ్ యంగ్స్టర్స్ కష్టం. ఆ కష్టానికి నిర్మాత లక్ష్మయ్య ఎంతో సపోర్ట్ ఇచ్చారు’’ అన్నారు తనీష్. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శౌర్య, మ్యూజిక్ డైరెక్టర్ దిలీప్ బండారి, శ్యామ్ సుందర్రెడ్డి, జనార్ధన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: స్టార్ లైన్ మూవీస్, కెమెరా: రాహుల్ మాచినేని. -
షాకింగ్గా ఉంది: శ్యామ్ కే నాయుడు
హైదరాబాద్: డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ నుంచి తనకెలాంటి నోటీసులు రాలేదని కెమెరామెన్ శ్యామ్ కే నాయుడు తెలిపారు. తనకు నోటీసులు వచ్చినట్టు వార్తలు రావడంతో ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. మీడియాలో వార్తలు చూస్తే షాకింగ్గా ఉందని పేర్కొన్నారు. తానేప్పుడు బయట కూడా ఎక్కువగా కనిపించనని, వార్తల్లో తన పేరు రావడం బాధగా ఉందన్నారు. ఇలాంటి ప్రచారంతో తన కుటుంబ సభ్యులు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ వ్యవహారంతో తనకు సంబంధం లేదని వర్ధమాన హీరో తనీష్ తెలిపారు. తనకు ఎలాంటి నోటీసులు రాలేదని చెప్పారు. తమకు నోటీసులు అందాయని నవదీప్, సుబ్బరాజు తెలిపారు. డగ్స్ కేసుతో తమకు ఎటువంటి సంబంధం లేదని వారు చెప్పారు. ఎందుకు నోటీసులు పంపించారో అర్థం కావడంలేదని సుబ్బరాజు అన్నారు. -
కృష్ణవంశీ అంటే అభిమానం..
అందుకే హీరోనైనా ‘నక్షత్రం’లో విలన్పాత్ర చేస్తున్నా : హీరో తనీష్ అమలాపురం టౌన్ : ‘‘దర్శకుడు కృష్ణవంశీ అంటే నాకు చిన్నతనం నుంచీ అభిమానం. ఆయన తీసిన ఖడ్గం, సింధూరం తదితర సినిమాలు నాపై చాలా ప్రభావం చూపాయి. ఎప్పటికైనా ఆయన దర్శకత్వంలో పనిచేయాలనుకునే అవకాశం కోసం ఎదురు చేస్తున్నా. అందుకే ఆయన కొత్తగా తీస్తున్న నక్షత్రం చిత్రంలో విలన్ ప్రాతను ఏ మాత్రం ఆలోచించకుండా అంగీకరించానని వర్ధమాన సినీహీరో తనీష్ అన్నారు. తాను హీరోనైనా విలన్ పాత్ర పోషించేందుకు ఎంత మాత్రం వెనకడుగు వేయకుండా కృష్ణవంశీ దర్శకత్వంలో నెగిటివ్ షేడ్ పాత్రలో నటిస్తున్నానని చెప్పారు. ముమ్మిడివరం అనాతవరంలోని ప్రసిద్ధ ఇంజినీరింగ్ కళాశాలలో జరుగుతున్న పవర్ 2కే17 ఫెస్ట్లో ముఖ్యఅతిథిగా పాల్గొనేందుకు వచ్చిన హీరో తనీష్ అమలాపురంలోని గ్రాండ్ పార్కులో శుక్రవారం సాయంత్రం విలేకర్లతో ముచ్చటించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే.. ‘‘దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వంలో పనిచేయటమంటే ఏ నటుడికైనా ఓ గైడ్లా ఉంటుంది. నేను బాల నటుడిగా దాదాపు 50 చిత్రాల్లో, హీరోగా 22 చిత్రాల్లో నటించా. 1999లో ప్రేమంటే ఇదేరా చిత్రంలో బాలనటుడిగా నా సినీ ప్రస్థానం మొదలైంది. దేవుళ్లు, మన్మథుడు చిత్రాల్లో బాలనటుడిగా గుర్తింపు పొందా. ప్రస్తుతం దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న నక్షత్రం చిత్రం, దర్శకుడు కార్తికేయ తీస్తున్న రంగు చిత్రంలో నటిస్తున్నా. నక్షత్రం చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. హీరోగా.. ‘‘నచ్చావులే’’ హీరోగా నచ్చావులే చిత్రం గుర్తింపు తెచ్చిపెట్టింది. కోడిపుంజు, రైడ్, మేము వయసుకు వచ్చాం...ఏం పిల్లో...ఏం పిల్లడో చిత్రాలు నన్ను పరిశ్రమలో నిలదొక్కుకునేలా చేశాయి. గతంలో జరిగిన పొరపాట్లు, తప్పులు మళ్లీ దొర్లకుండా చిత్రాల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటున్నా. కోనసీమకు రావటం ఇది రెండోసారి. నేనూ గోదావరి జిల్లాల కుర్రాడినే. మా స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు. -
విజేతలు తనిష్క్, సృజన
ఐటా చాంపియన్షిప్ సిరీస్ టెన్నిస్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) చాంపియన్షిప్ సిరీస్ అండర్-16 బాలబాలికల టోర్నమెంట్లో తనిష్క్, సృజన విజేతలుగా నిలిచారు. బోరుున్పల్లిలోని ఎమ్మాన్యుయేల్ టెన్నిస్ అకాడమీలో శుక్రవారం జరిగిన బాలుర ఫైనల్లో తనిష్క్ మల్పాని 6-1, 6-3తో అఖిల్ కుమార్పై గెలుపొందగా... బాలికల సింగిల్స్ ఫైనల్లో సృజన 2-6, 6-0, 6-3తో సంజన సిరిమల్లపై గెలిచి టైటిల్ను దక్కించుకుంది. బాలికల డబుల్స్ ఫైనల్లో సంజన సిరిమల్ల-సంజన ఐరెడ్డి జోడీ 4-2, 3-5, 10-5తో రిధి- పవిత్ర జంటపై నెగ్గి విజేతగా నిలిచింది. -
'నక్షత్రం' విలన్ గా తనీష్?
యువ హీరో సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ తెరకెక్కిస్తున్న తాజా ప్రాజెక్టు 'నక్షత్రం'. ఈ సినిమాకు సంబంధించిన వార్తలు రోజు రోజుకి ప్రేక్షకుల్లోఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్గా గెస్ట్ రోల్లో నటిస్తున్నారని ఇప్పటికే తెలిపిన కృష్ణవంశీ.. విలన్ పాత్ర చిత్రీకరణలో కూడా వైవిధ్యతను చూపించే ప్రయత్నంలో ఉన్నారు. కథానాయకుడిగా అదృష్టాన్ని పరీక్షించుకున్న యువ నటుడు తనీష్ ఈ చిత్రంలో విలన్గా కనిపించే అవకాశాలున్నాయట.అయితే అది ఫుల్ లెన్త్ పాత్రా లేక గెస్ట్ అప్పీరియన్స్గానా అనే విషయం కృష్ణవంశీనే తేల్చాల్సి ఉంది. కాజల్, రెజీనా, సాయి ధరమ్ తేజ్ లాంటి స్టార్లు నటిస్తుండటంతో 'నక్షత్రం' సినిమాపై ఆసక్తి నెలకొంది. ఈ సినిమాతో కృష్ణవంశీ తిరిగి సక్సెస్ ట్రాక్ అందుకుంటారని భావిస్తున్నారు. -
భవనంపై నుంచి పడి సినీ హీరో తండ్రి మృతి
- సినీ హీరో తనీష్ తండ్రి ఏసు వర్ధన్ బాబు అనుమానాస్పద మృతి - ఆత్మహత్యకు పాల్పడ్డారా? జారిపడ్డారా? అనే విషయం నిర్ధారణ కాలేదన్న పోలీసులు హైదరాబాద్: యువ సినీ హీరో తనీష్ తండ్రి ఏసు వర్ధన్బాబు(50) భవనంపై నుంచి పడి అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. మంగళవారం అర్ధరాత్రి రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. సీఐ దుర్గాప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. సినీ హీరో తనీష్ తండ్రి ఏసు వర్థన్బాబు, భార్య సరస్వతి, కుమారులు తనీష్, వంశీకృష్ణ, కాశీవిశ్వనాథ్తో కలసి రాయదుర్గంలోని వెస్ట్రన్ ప్లాజాలోని ఏ బ్లాక్ ఫ్లాట్ నంబర్ 623లో నివాసం ఉంటున్నారు. ఆర్మీలో సుబేదార్గా పనిచేసి స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఏసు వర్ధన్ కొడుకులతోనే ఉంటున్నారు. మంగళవారం అర్ధరాత్రి 12.30 వరకు ఏసు వర్ధన్ ఫ్లాట్ బాల్కానీలో మద్యం సేవిస్తూ కూర్చున్నారు. బాల్కనీ నుంచి కేకలు వినిపించడంతో భార్య సరస్వతి వచ్చిచూడగా.. ఏసు వర్ధన్ అప్పటికే భవనంపై నుంచి కిందపడిపోయి ఉన్నారు. ఆయనకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే అపోలో ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయాడని వైద్యులు ధ్రువీకరించారు. పోలీసులు ఏసు వర్థన్ మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఏసు వర్ధన్ బిగ్గరగా అరవడంతో బాల్కనీలోకి వెళ్లి చూసేసరికి భవనంపై నుంచి కిందపడి ఉన్నాడని, పైనుంచి జారిపడి ఉండవచ్చని ఆయన భార్య సరస్వతి పోలీసులకు తెలిపింది. కాగా, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇటీవల మణికొండలోని ఓ ఫ్లాట్ను ఏసు వర్ధన్ అమ్మినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే భార్యాభర్తలకు గొడవ జరిగిందని పోలీసులు తెలిపారు. అయితే మద్యం మత్తులో జారిపడ్డారా? లేక ఆత్మహత్యకు పాల్పడ్డారా? అనే విషయం నిర్ధారణ కాలేదని పోలీసులు తెలిపారు. ఏసు వర్ధన్ భవనంపై నుంచి పడినప్పుడు భార్య సరస్వతితో పాటు చిన్న కొడుకు ఇంట్లో ఉన్నారని, మిగతా ఇద్దరూ ఫ్లాట్లో లేరని పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఓరి దేవుడా!
శ్రీవెంకటేశ్వర విజువల్స్ పతాకంపై వి. శ్రీవాత్సవ్ దర్శకత్వంలో వేణు ముక్కపాటి నిర్మించిన చిత్రం ‘ఓ మైగాడ్’. తనీష్, మేఘశ్రీ, పావని ముఖ్య తారలుగా నటించిన ఈ చిత్రానికి రాజ్ కిరణ్ సంగీత దర్శకుడు. హైదరాబాద్లో జరిగిన ఆడియో ఆవిష్కరణ వేడుకలో నిర్మాత డి.ఎస్.రావు సీడీని ఆవిష్కరించి, దర్శక-రచయిత శివశక్తి దత్తాకు అందించారు. ‘‘నా శిష్యుడు శ్రీవాత్సవ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం విజయవంతం కావాలి’’ అని శివశక్తి దత్తా అన్నారు. ఇది సోషియో ఫాంటసీ చిత్రమని తనీష్ పేర్కొన్నారు. చంద్రమహేశ్ దగ్గర ‘హనుమంతు’ చిత్రానికి దర్శకత్వ శాఖలో చేశాననీ, విజయేంద్ర ప్రసాద్ దగ్గర కూడా చేసిన అనుభవంతో ఈ చిత్రానికి దర్శకత్వం వహించానని దర్శకుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో శోభారాణి, చంద్రమహేష్, మేఘశ్రీ పాల్గొన్నారు.ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: రాజు తోట, కో-ప్రొడ్యూసర్: చనమాల పురుషోత్తం. -
టాలీవుడ్ హీరోకు జరిమానా వేసిన కోర్టు
బంజారాహిల్స్: న్యూసెన్స్ కేసులో సినీహీరో తనీష్కు నాంపల్లి కోర్టు సోమవారం రూ.50 జరిమానా విధించింది. తనీష్ ఈనెల 1న రాత్రి 9 గంటలకు మద్యం తాగి వాహనం నడుపుకుంటూ వెళ్తూ జూబ్లీహిల్స్ రోడ్ నెం.1/45 చౌరస్తాలో బైక్పై వెళ్తున్న సురేష్ అనే వ్యక్తిని ఢీకొట్టి ముందుకు దూసుకుపోయాడు. బాధితుడు సురేష్ తన బైక్పైనే చేజ్ చేసి తనీష్ను అడ్డుకున్నాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. తాగిన మైకంలో తనీష్ తనను దుర్భాషలాడాడని ఆరోపిస్తూ సురేష్ అదే రోజు రాత్రి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే సురేష్ తనను దూషించాడని తనీష్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇద్దరిపైన జూబ్లీహిల్స్ పోలీసులు 70(బి) కింద న్యూసెన్స్ కేసు నమోదు చేశారు. ఈ కేసులోనే తనీష్ కోర్టుకు హాజరు కాగా న్యాయమూర్తి రూ. 50 జరిమానా విధించారు. తనీష్ వెంటనే జరిమానా చెల్లించి వెళ్లిపోయారు. -
సరి కొత్తగా...
సైనికుడు సైన్యంలో ఉండాలి... సగటు మనిషి సంఘంలో ఉండాలి అనే వైవిధ్యమైన ఇతివృత్తంతో ఓ చిత్రం రూపొందనుంది. తనీష్, మోహిత జంటగా శ్రీ చీర్ల మూవీస్ పతాకంపై శ్రీనివాసయాదవ్ నిర్మించనున్న చిత్రం హైదరాబాద్లో ప్రారంభమైంది. సంజీవ్ మేగోటి దర్శకుడు. ముహూర్తపు సన్నివేశానికి శిరీష, మేగోటి ఉమామహేశ్వరి కెమెరా స్విచ్చాన్ చేయగా, సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు క్లాప్ ఇచ్చారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘స్టైలిష్ ఎంటర్టైనర్గా రూపొందనున్న ఈ సినిమాలో సాయికుమార్ ఓ ప్రత్యేక పాత్ర చేస్తున్నారు. 50 రోజుల్లో చిత్రీకరణ పూర్తిచేస్తాం. తనీష్ పాత్ర సరికొత్తగా ఉంటుంది’’ అని తెలి పారు. తనీష్ మాట్లాడుతూ-‘‘నా పాత్ర విభిన్న కోణాల్లో సాగుతుంది. నా కెరీర్లో మైలురాయిలా నిలిచిపోతుంది ’’ అని అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: హ యీష్. ఎస్.ఎన్. -
కొత్త ప్రేమకథలో తనీష్, శ్రీ
తనీష్, శ్రీ హీరోలుగా నటిస్తున్న ‘మీకో ప్రేమకథ చెప్పాలి’ చిత్రం హైదరాబాద్లో ఆరంభమైంది. శివగణేశ్ దర్శకత్వంలో కూనిరెడ్డి శ్రీనివాస్, శివణేష్ నిర్మిస్తున్నారు. ముహూర్తపు దృశ్యానికి నూకారపు సూర్యప్రకాశరావు కెమెరా స్విచాన్ చేయగా, వీరశంకర్ క్లాప్ ఇచ్చారు. శ్రీనివాసరెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం కూనిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ -‘‘ఓ అద్భుతమైన కథతో శివగణేశ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆయన దర్శకత్వంలో రూపొందిన ‘33 ప్రేమకథలు’ ఎంత వినూత్నంగా ఉంటుందో, ఈ చిత్రం కూడా అంతే కొత్తగా ఉంటుంది. ఇది చక్కని ఫీల్గుడ్ లవ్స్టోరీ’’ అని చెప్పారు. ప్రస్తుత ట్రెండ్కి తగ్గ కథతో ఈ చిత్రం ఉంటుందని, ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే కథ అని దర్శకుడు తెలిపారు. మూడు జంటల ప్రేమకథతో సాగే ఈ చిత్రంలో తనది మాస్ కారెక్టర్ అని శ్రీ చెప్పారు. ఈ చిత్రం తన కెరీర్కు మంచి బ్రేక్ అవుతుందనే నమ్మకం ఉందని తనీష్ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: బాలిరెడ్డి, ఆర్ట్: భాస్కర్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: జయశంకర్. -
నచ్చావులే
‘దేవుళ్లు’ మూవీలో అయ్యప్పగా నటించిన తనీష్.. హీరోగా కూడా ‘నచ్చావులే’ అనిపించుకున్నాడు. కాన్పూర్లో పుట్టిన ఈ తెలుగబ్బాయికి హైదరాబాద్తో బచ్పన్కా దోస్తీ ఉంది. గల్లీ క్రికెట్లో లొల్లి.. ఫిల్మ్నగర్లోని హోటల్స్లో ఇడ్లీ.. ట్యాంక్బండ్ పక్కన పల్లీ.. ఏదైనా సరే సిటీకి లింకుంటే చాలు తనకు నచ్చుతుందంటున్నాడు. అందుకే ఐ లవ్ హైదరాబాద్ అంటూ భాగ్యనగరంతో తన అనుబంధాన్ని ‘సిటీప్లస్’తో పంచుకున్నాడు. చిన్నప్పటి నుంచే ఆర్టిస్ట్గా చేయడంతో స్కూల్ డేస్ సరదాగా గడిచిపోయాయి. కృష్ణనగర్లోని శ్రీసాయిరాం హై స్కూల్లో చదివాను. షూటింగ్స్కు వెళ్లడంతో క్లాసులు మిస్సయ్యేవి. మా టీచర్లు స్పెషల్ క్లాసులు తీసుకుని మరీ చదివించేవారు. మేథమెటిక్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. హిస్టరీ లెక్చర్ బోర్ కొట్టినా, హిస్టారికల్ పిక్చర్ అనగానే ఫుల్ జోష్ వచ్చేది. హైదరాబాద్ వంటి చరిత్రాత్మక నగరంలో పెరిగినందుకు గర్వంగా అనిపిస్తుంటుంది. సిటీలో ఉన్న హిస్టారికల్ స్పాట్స్ చూడటం అంటే చాలా ఇష్టం. స్కూల్ డేస్లో సాలార్జంగ్ మ్యూజియం, గోల్కొండ ఫోర్ట్, చార్మినార్, జూపార్క్, ట్యాంక్బండ్ వంటి ప్రదేశాలకు పిక్నిక్ వెళ్లేవాళ్లం. గల్లీలో లొల్లి ఇంటర్ ఎస్ఆర్ నగర్లోని శ్రీచైతన్య జూనియర్ కాలేజ్లో చేశాను. మా కాలేజ్ ఎదురుగానే హంగ్రీ జాక్స్ బేకరీ ఉండేది. కాలేజ్ ఆయిపోగానే మా గ్యాంగ్ అంతా అక్కడ ప్రత్యక్షమయ్యేవాళ్లం. అక్కడ బర్గర్, కస్టర్డ్ ఆపిల్ జ్యూస్ టేస్టీగా ఉండేవి. అయితే ఇప్పుడా ప్లేస్లో టైటాన్ వాచ్ షోరూం వచ్చింది. ఆ రూట్లో వెళ్లినప్పుడల్లా కాలేజ్ డేసే గుర్తుకొస్తాయి. నేను క్రికెట్ సూపర్బ్గా ఆడతాను. గ్రౌండ్లో కాదు.. గల్లీలో. కాస్త తీరిక దొరికితే చాలు ఇరుగుపొరుగు పిల్లలతో కలసి గల్లీలో క్రికెట్ మొదలుపెడతాం. ఆ పిల్లలంతా నాకు థిక్ ఫ్రెండ్సే. నేను ఆడుదామని.. కిందకు దిగితే చాలు సందడే సందడి. హ్యాపీగా ఉన్నా.. డిస్టర్బ్డ్గా ఉన్నా.. క్రికెట్ ఆడతాను. స్వాద్ షహర్ అన్ని ప్రాంతాల రుచులు హైదరాబాద్లో దొరుకుతాయి. ఇందిరానగర్లోని మంగ టిఫిన్ సెంటర్లో పనీర్ దోశ నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది. ఫిలింనగర్లోని మయూరి హౌస్లో దొరికే కాకినాడ పెసరట్టు గురించి ఎంత చెప్పినా తక్కువే. డైలీ జిమ్ అయిపోగానే మయూరి హౌస్లో వాలిపోతాను. ఫిలింనగర్లోని కేఫ్ మిలేంజ్, జూబ్లీహిల్స్లోని టె స్టారోస్సాకు తరుచూ వెళ్తుంటాను. డెరైక్టర్స్, స్టోరీ రైటర్స్తో డిస్కషన్స్కు కూడా అక్కడే చేస్తుంటాను. ఇండియాకు జిరాక్స్ నేను ఇండియన్ అని చెప్పుకోవడానికి ఎంత గర్వపడతానో.. హైదరాబాదీ అని చెప్పుకోవడానికి కూడా అంతే ప్రౌడ్గా ఫీలవుతాను. సిటీని మించిన కూల్ ప్లేస్ మరొకటి లేదు. ఇండియాకు హైదరాబాద్ జిరాక్స్ కాపీలా ఉంటుంది. ఇక్కడ అన్ని సంస్కృతులు ప్రతిబింబిస్తాయి. ఇక హైదరాబాదీల గురించి చెప్పాలంటే.. వారి మనసుల్లో ప్యూరిటీ ఉంటుంది. కొత్తవారికి భాగ్యనగరం ఎప్పుడూ సాదర స్వాగతం పలుకుతుంది. సినిమాల విషయానికి వస్తే.. షూటింగ్ల కోసం ఎక్కడికీ వెళ్లాల్సిన పని లేదు. అంత కంఫర్ట్ ఉంటుంది ఇక్కడ. హైదరాబాద్ నా సెకండ్ బర్త్ ప్లేస్ అనిపిస్తుంటుంది. -
దేవదాసు స్టైల్ మార్చాడు మూవీ ఆడియో లాంచ్
-
ఆ పేరు వింటే ప్రాణం లేచొస్తుంది - దాసరి
‘దేవదాసు’ అనే పేరు వింటే నా ప్రాణం లేచొస్తుంది. నేను ఎక్కువసార్లు చూసిన సినిమా అది. దేశవ్యాప్తంగా 9 సార్లు తెరకెక్కిన కథ ‘దేవదాసు’. అలాంటి టైటిల్తో మళ్లీ సినిమా రావడం ఆనందంగా ఉంది’’ అని దాసరి నారాయణరావు అన్నారు. తనీష్, చాందిని జంటగా రూపొందుతోన్న చిత్రం ‘దేవదాస్ స్టైల్ మార్చాడు’. శ్రీనివాస్ గుండ్రెడ్డి దర్శకుడు. వి.ఎస్.రామిరెడ్డి నిర్మాత. గణ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను గంటా శ్రీనివాసరావు ఆవిష్కరించి ఏరాసు ప్రతాపరెడ్డికి ఇచ్చారు. దాసరి మాట్లాడుతూ-‘‘‘పాండవులు పాండవులు తుమ్మెద’లో మూగవాడిగా తనీష్ అద్భుతంగా నటించాడు. కొత్త హీరోలు, దర్శకులు కష్టపడి సినిమాలు చేసినా... సరైన సమయంలో విడుదల చేసుకోలేకపోతున్నారు. ప్రతి పండుగకూ సినిమా థియేటర్లను కొన్ని కుటుంబాలు కబ్జా చేసి, చిన్న సినిమాలకు స్థానం లేకుండా చేస్తున్నాయి’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తిస్థాయి వినోదభరితంగా సినిమా ఉంటుందని, త్వరలోనే విడుదల చేస్తామని దర్శక, నిర్మాతలు తెలిపారు. ప్రేక్షకులను ఆద్యంతం అలరించే సినిమా ఇదని తనీష్ అన్నారు -
వినోదాల దేవదాస్
తనిష్ హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘దేవదాస్ స్టైల్ మార్చాడు’. శ్రీనివాస్రెడ్డి గుండ్రెడ్డి దర్శకుడు. వి.ఎస్.రామిరెడ్డి నిర్మాత. నిర్మాణంతర కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్న ఈ చిత్రాన్ని మహానటుడు స్వర్గీయ డా.అక్కినేని నాగేశ్వరరావుకు అంకితం ఇచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ -‘‘అక్కినేని ‘దేవదాసు’ స్ఫూర్తితోనే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ఈ చిత్రం ఆడియో వేడుకను ఆయన చేతుల మీదుగానే జరపాలనుకున్నాం. కానీ మా ఆశ అడియాశే అయ్యింది. అందుకే ఆ మహానటుడికి ఈ చిత్రాన్ని అంకితం ఇస్తున్నాం. అక్కినేని ‘దేవదాసు’ చిత్రం భావోద్వేగాలతో నిండి ఉన్న కథ అయితే... ఈ సినిమా పూర్తిస్థాయి వినోదంతో కూడుకున్న కథ ’’అని తెలిపారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలోనే సినిమాను విడుదల చేస్తామని నిర్మాత అన్నారు. ఛాందిని, సన, సుజన, ధన్రాజ్, వినోద్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: చక్రి, సంగీతం: గణ. -
తనీష్, అనీషా జంటగా ప్రేమకథా చిత్రం
తనీష్, అనీషా జంటగా ఓ ప్రేమకథా చిత్రం రూపొందుతోంది. పంచగిరి క్రియేషన్స్ పతాకంపై కుమార్ బ్రదర్స్ సమర్పణలో శ్రీనివాస్ ఏలిజాల,డి.సురేష్ నిర్మించనున్న ఈ చిత్రానికి భాస్కర్ దర్శకుడు. ఈ నెల 30న తిరుపతిలో రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా నిర్మాతల్లో ఒకరైన శ్రీనివాప్ ఏలిజాల చిత్ర విశేషాలను తెలియజేశారు.ఇటీవల పాటల రికార్డింగ్ ను ప్రారంభించామని, తనీష్ కు ఇదొక వైవిధ్యమైన ప్రేమకథా చిత్రం అవుతుందన్నారు. క్యూట్ రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో కుటుంబ ప్రేక్షకులను అలరించే అంశాలను కూడా ఉన్నాయన్నారు. నేటి తరం ప్రతినిధిగా తనీష్ కనిపిస్తాడని, మలేషియాలో చిత్రీకరించబోయే పాటలు చిత్రానికి ప్రధాన ఆకర్షణ ఉంటాయన్నారు. సుమన్ శెట్టి, దండపాణి, సీత తదితరులు ముఖ్యపాత్రల్లో నటించనున్న ఈ చిత్రానికి సంగీతం:సాదక్ హాసన్. -
దేవదాస్ స్టైల్ మార్చాడు మూవీ స్టిల్స్
-
సందడి సందడిగా...
‘నలుగురు లేనివాడు అనాథ కాదు. ఎవరికీ ఏమీ కానివాడే అనాథ’. ‘బ్యాండ్బాజా’చిత్రంలో హీరో తనీష్ చెప్పే డైలాగ్ ఇది. ఈ డైలాగ్కి అనుగుణంగానే ఈ సినిమా కథ, కథనాలు సాగుతాయని చెబుతున్నారు ఈ చిత్రం దర్శకుడు నగేశ్ నారదాసి. నయీమ్ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా రూపల్ కథానాయికగా పరిచయం అవుతున్నారు. ఈ నెలలోనే సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- ‘‘నేనేమీ భారతదేశానికి బామ్మర్దినని మెళ్లో బోర్డేసుకొని తిరగట్లా... అంటాడు ఇందులో ఓ సన్నివేశంలో తనీష్. కచ్చితంగా ఆయన క్యారెక్టరైజేషన్కి అద్దం పట్టే డైలాగ్ ఇది. నేటి యువతరానికి ప్రతీక లాంటి పాత్ర ఇందులో ఆయనది. టైటిల్కి తగ్గట్టు సినిమా కూడా సందడిగా ఉంటుంది. ప్రతి సీన్లో నలభై, యాభైమంది ఆర్టిస్టులు కనిపిస్తారు. మనదేశంతో పాటు విదేశాల్లోని అందమైన లొకేషన్లలో చిత్రీకరణ జరిపిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందన లభిస్తోంది. త్వరలో ప్లాటినమ్ డిస్క్ వేడుక జరిపి, ఈ నెలలోనే సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. -
రొమాంటిక్ బ్యాండ్ బాజా
‘‘నయీమ్ నాకు చాలాకాలంగా తెలుసు. ఆయన నిర్మించిన ఈ చిత్రం విజయం సాధించి, ఈ బేనర్లో మరిన్ని మంచి చిత్రాలు రావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు ‘దిల్’ రాజు. తనీష్, రూపల్ జంటగా నాగమల్ల శంకర్ సమర్పణలో షేక్ నయీమ్ నిర్మిస్తున్న చిత్రం ‘బ్యాండ్ బాజా’. నాగేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి విజయ్ కురాకుల పాటలు స్వరపరిచారు. హైదరాబాద్లో జరిగిన ఈ చిత్రం ఆడియో విడుదల వేడుకలో పాల్గొన్న ‘దిల్’ రాజు సీడీని ఆవిష్కరించి తనీష్, రమేష్ పుప్పాలకి ఇచ్చారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘కుటుంబ సమేతంగా చూడదగ్గ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇది. గ్రామీణ, నగర నేపథ్యంలో సాగుతుంది. రెండున్నర గంటల పాటు ప్రేక్షకులు హాయిగా నవ్వుకునే విధంగా ఉంటుంది’’ అని చెప్పారు. స్క్రీన్ప్లే, సాంగ్స్, డైలాగ్స్.. ఇలా అన్నీ చక్కగా కుదిరాయని తనీష్ తెలిపారు. మంచి పాటలకు స్కోప్ ఉన్న కథ అని విజయ్ చెప్పారు. దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించారని నయీమ్ అన్నారు. ఇంకా ఈ వేడుకలో చదలవాడ శ్రీనివాసరావు, రామసత్యనారాయణ, సాయి వెంకట్, పాండు రంగారావు, రూపల్ తదితరులు పాల్గొన్నారు. -
బ్యాండ్ బాజా మోగనుంది
తనీష్, రూపల్ జంటగా రూపొందుతోన్న చిత్రం ‘బ్యాండ్ బాజా’. నగేష్ దర్శకుడు. షేక్ నయీమ్ నిర్మాత. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పాటలను ఈ నెల 15న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- ‘‘ఇప్పటివరకూ రాని కొత్త పాయింట్తో రూపొందుతోన్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. అనేక పెళ్లిళ్లతో ఈ కథ ముడి పడి ఉంటుంది. రెండు షేడ్స్ ఉన్న పాత్రలో తనీష్ కనిపిస్తారు. అందరి సహకారం వల్ల సింగిల్ షెడ్యూల్లో చిత్రీకరణ పూర్తి చేయగలిగాం. విజయ్ కూరాకుల మంచి సంగీతం ఇచ్చారు. మూడు పాటలు బ్యాంకాక్లో తీశాం. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి కావచ్చింది. ఈ నెల 15న పాటలను, ఇదే నెలలో సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కథ, మాటలు: పార్వతీచంద్, పాటలు: సాహితి, కెమెరా: అమర్, సమర్పణ: నల్లమల శంకర్.