Third Wave
-
వృద్ధికి కేంద్రం పెట్టుబడులు కొనసాగుతాయ్
ముంబై: మహమ్మారి కోవిడ్–19 మూడవ వేవ్ తర్వాత తిరిగి ఆర్థిక వృద్ధి ఊపందుకోవడానికి కేంద్ర మూలధన వ్యయాలు కొనసాగుతాయని, ఇందుకు కేంద్రం కట్టుబడి ఉందని ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) వీ అనంత నాగేశ్వరన్ శుక్రవారం పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందని ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ నిర్వహించిన ఒక బ్యాంకింగ్ కార్యక్రమంలో అన్నారు. పన్నులను తగ్గించడం, ప్రైవేటీకరణ కొనసాగింపు, మొండి బకాయిల సమస్య పరిష్కారానికి ప్రత్యేక సంస్థలను ఏర్పాటు చేయడం, వాటిని నిర్వహించడం, నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ ఆస్తులను వినియోగంలోకి తేవడం (మానిటైజేషన్ డ్రైవ్) వంటి అనేక చర్యలను ప్రభుత్వం తీసుకుందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. బ్యాంకింగ్– నాన్–బ్యాంకింగ్ నుంచి నిధుల సమీకరణ విషయంలో అనిశ్చితి, ప్రైవేట్ రంగ భాగస్వాముల స్పందనలో ఇంకా పురోగతి లేకపోవడం వంటి అంశాల నేపథ్యంలో వృద్ధి లక్ష్యంగా మరో మార్గంలో కేంద్రం మూలధన వ్యయం కొనసాగుతుందని అన్నారు. 2021–22లో కేంద్ర బడ్జెట్ మూలధన వ్యయాల విలువ రూ.6 లక్షల కోట్లయితే, ప్రభుత్వం రూ.5.92 లక్షల మేర ఖర్చు చేసిందని అనంత నాగేశ్వరన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. బడ్జెట్ లక్ష్యాలకు అనుగుణంగా ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ.7.5 లక్షల కోట్లు ఖర్చుచేయగలిగితే ఇది ఎకానమీ పురోగతికి సంబంధించి పెద్ద విజయమే అవుతుందని ఆయన అన్నారు. ఎటువంటి పరిస్థితులు ఎదురయినా ఎదుర్కొనడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోడానికి సిద్ధంగా ఉందని అన్నారు. ఇతర దేశాలతో పోల్చితే, భారత్ ఆర్థిక వ్యవస్థ వృద్ధి మెరుగైన స్థితిలో ఉందని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ద్రవ్యోల్బణం కట్టడికి (2–6 శాతం శ్రేణిలో) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)తో కలిసి ప్రభుత్వం తగిన చర్యలు అన్నింటినీ తీసుకుంటుందని నాగేశ్వరన్ పేర్కొన్నారు. ఎకానమీ పురోగతిలో బ్యాంకింగ్ది కీలక పాత్ర అని ఆయన పునరుద్ఘాటించారు. ఈ విషయంలో బ్యాంకింగ్ తగిన సమర్ధవంతనీయమైన పాత్ర పోషిస్తోందని తెలిపారు. రుణాలు మంజూరీలో బ్యాంకింగ్ కొంత అప్రమత్తత అవసరమేనని కూడా అన్నారు. -
దడ పుట్టిస్తున్న ధరలు.. ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ..
న్యూఢిల్లీ: దేశ ప్రధాన ఆర్థిక రంగం ఇంకా సవాళ్లలోనే కొనసాగుతోందని తాజాగా విడుదలైన రిటైల్ ద్రవ్యోల్బణం, పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలు వెల్లడించాయి. కరోనా మూడవ వేవ్ (ఒమిక్రాన్) సవాళ్ల నేపథ్యంలో మార్చిలో పారిశ్రామిక ఉత్పత్తి కేవలం 1.9 శాతంగా నమోదయ్యింది. ఇక సామాన్యునికి ఆందోళన కలిగించే స్థాయిలో వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఏప్రిల్లో ఏకంగా 7.79 శాతానికి ఎగసింది. అంటే 2021 ఇదే నెలతో పోల్చితే రిటైల్ ఉత్పత్తుల బాస్కెట్ ధర 7.79 శాతం పెరిగిందన్నమాట. 2021 ఏప్రిల్లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.23 శాతం. ఆర్బీఐకి కేంద్రం నిర్దేశాల ప్రకారం రిటైల్ ద్రవ్యోల్బణం 2–6 శాతం శ్రేణిలో ఉండాలి. అయితే వరుసగా నాలుగు నెలల నుంచి ఆపై స్థాయిలోనే రిటైల్ ద్రవ్యోల్బణం కొనసాగుతుండడం గమనార్హం. కరోనా సవాళ్లతో నెలకొన్న సరఫరాల సమస్యలు ఉక్రెయిన్పై రష్యా యుద్ధంతో మరింత పెరిగాయి. డాలర్ మారకంలో రూపాయి కనిష్ట స్థాయి పతనం ధరా భారాన్ని మరింత పెంచుతోంది. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) గురువారం విడుదల చేసిన ద్రవ్యోల్బణం గణాంకాల్లో ముఖ్యాంశాలు పరిశీలిస్తే... ► 2014 మేలో రిటైల్ ద్రవ్యోల్బణం 8.33 శాతానికి చేరింది. అటు తర్వాత మళ్లీ ఆ స్థాయిలో రేటును చూడ్డం ఇదే తొలిసారి. ► ఆహార, ఇంధన ధరల భారీ పెరుగుదల తాజాగా రిటైల్ ద్రవ్యోల్బణాన్ని పెంచుతోంది. ► 2021 ఏప్రిల్లో ఒక్క ఫుడ్ బాస్కెట్ ద్రవ్యోల్బణం 1.96% అయితే, 2022 మార్చితో 7.68%గా ఉంది. ఏప్రిల్లో ఈ రేటు ఏకంగా 8.38%కి పెరిగింది. ఫుడ్ బాస్కెట్లో ఒక్క కూరగాయల ధరలు ఏకంగా 15.41% పెరిగాయి. మార్చిలో ఈ పెరుగుదల 11.64 %. ► ఇంధనం, లైట్ విభాగంలో రిటైల్ ద్రవ్యోల్బణం మార్చిలో 7.52 శాతం ఉంటే, ఏప్రిల్లో 10.80 శాతానికి ఎగసింది. ► వంట నూనెలు, ఫ్యాట్స్ విభాగంలో ధరల భారం మార్చితో పోల్చితే (18.79 శాతం) స్వల్పంగా 17.28 శాతానికి తగ్గినా సామాన్యునికి ఈ స్థాయి ధరల పెరుగుదలే చాలా తీవ్రమైనది కావడం గమనార్హం. ఎరువులతోపాటు భారత్ వంట నూనెల అవసరాలకు ఉక్రెయిన్ ప్రధాన వనరుగా ఉంది. యుద్ధంతో ఆ దేశం అతలాకుతలం నేపథ్యంలో సరఫరాల సమస్యలు తీవ్రమయ్యాయి. జూన్లో మరో దఫా రేటు పెంపు! ఈ సంవత్సరం ప్రారంభం నుంచి రిటైల్ ద్రవ్యోల్బణం లక్ష్యానికి మించి నమోదవుతోంది. జనవరిలో 6.01 శాతం, ఫిబ్రవరిలో 6.07 శాతం, మార్చిలో 17 నెలల గరిష్ట స్థాయిలో ఏకంగా 6.95 శాతానికి చేరడం ఆందోళన కలిగిస్తోంది. తాజా సమీక్షా నెలల్లో రిటైల్ ద్రవ్యోల్బణం 7.79 శాతానికి చేరడంతో జూన్ మొదటి వారంలో జరిగే పాలసీ సమీక్ష సందర్భంగా ఆర్బీఐ ఎంపీసీ మరో దఫా రేట్ల పెంపు ఖాయమని నిపుణులు పేర్కొంటున్నారు. పాలసీ విధానానికి ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్ మొదటి వారం ఆర్బీఐ పరపతి సమీక్ష భారీగా 1.2 శాతం మేర పెంచేసింది. దీనితో 2022–23లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.5 శాతం ఉంటుందన్న క్రితం అంచనాలు 5.7 శాతానికి పెరిగాయి. వరుసగా నాలుగు త్రైమాసికాల్లో ద్రవ్యోల్బణం 6.3 శాతం, 5.8 శాతం, 5.4 శాతం, 5.1 శాతంగా ఉంటుందని ఆర్బీఐ కమిటీ అంచనావేసింది. అయితే ఈ లెక్కలు తప్పే అవకాశాలు స్పష్టమవడంతో నేపథ్యంలో ఈ నెల మొదట్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్యపరపతి విధాన మధ్యంతర కమిటీ ద్రవ్యోల్బణం కట్టడే లక్ష్యంగా రెపో రేటును అనూహ్య రీతిలో 4 శాతం నుంచి 4.4 శాతానికి పెంచింది. నాలుగేళ్ల తర్వాత రెపో రేటు పెరగడం ఇదే తొలిసారి. 2018 ఆగస్టు తర్వాత ఆర్బీఐ పాలసీ రేటు పెంపు ఇది. కరోనా సవాళ్ల తీవ్రత నేపథ్యంలో... 2020, మే 22న రుణ రేటును కనిష్ట స్థాయికి (4 శాతానికి) తగ్గించిన నాటి నుంచి 4 శాతం వద్ద రెపో రేటు కొనసాగుతోంది. వరుసగా 11 ద్వైమాసిక సమావేశాల కాలంలో రెపో రేటును 4 శాతం వద్ద యథాతథంగా ఆర్బీఐ కొనసాగిస్తోంది. 4.4 శాతానికి రెపో రేటును పెంచడంతోపాటు వ్యవస్థలో నుంచి తక్షణం రూ.87,000 కోట్లు వెనక్కు మళ్లే విధంగా... రెపో రేటుతో బ్యాంకులు ఆర్బీఐ వద్ద తప్పనిసరిగా ఉంచాల్సిన ‘వడ్డీ రహిత’ నిధులకు సంబంధించిన నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్)ని కూడా పరపతి విధాన కమిటీ 50 బేసిస్ పాయింట్లు పెంచి, 4.5%కి చేర్చింది. మేలోనూ పైపైనే... గతవారం అనూహ్యంగా జరిగిన ఆర్బీఐ రేటు పెంపు నిర్ణయం సమర్థనీయమేనని వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం తాజా స్పీడ్ (7.79 శాతం) స్పష్టం చేస్తోంది. అలాగే జూన్ 2022లో మరో దఫా రేటు పెంపు ఖాయమన్న అంచనాలను ఈ గణాంకాలు పెంచుతున్నాయి. 2021 మేలో అధిక బేస్ వల్ల (6.3 శాతం) 2022 మేలో రిటైల్ ద్రవ్యోల్బణం కొంత తగ్గవచ్చని భావిస్తున్నాం. హై బేస్ ప్రాతిపదిక కొంత తగ్గినా, ఆర్బీఐకి నిర్దేశిస్తున్న లక్ష్యానికి ఎగవనే 6.5 శాతంగా మేలో ద్రవ్యోల్బణం ఉంటుందని మేము అంచనా వేస్తున్నాము – అదితి నాయర్, ఇక్రా చీఫ్ ఎకనమిస్ట్. పారిశ్రామికోత్పత్తికి హైబేస్, ఒమిక్రాన్ తలనొప్పులు పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) వృద్ధి రేటు 2022 మార్చిలో కేవలం 1.9 శాతంగా నమోదయ్యింది. కరోనా మూడవ వేవ్ ఒమిక్రాన్ సవాళ్లతో పాటు 2021 మార్చి నెల హై బేస్ (అప్పట్లో వృద్ధి రేటు ఏకంగా 24.2 శాతం) దీనికి కారణమని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ‘పోల్చుతున్న నెలలో’ అతి తక్కువ లేదా ఎక్కువ గణాంకాలు నమోదుకావడం, అప్పటితో పోల్చి, తాజా సమీక్షా నెలలో ఏ కొంచెం ఎక్కువగా లేక తక్కువగా అంకెలు నమోదయినా అది ‘శాతాల్లో’ గణనీయ మార్పును ప్రతిబింబించడమే బేస్ ఎఫెక్ట్. మొత్తం ఐఐపీలో దాదాపు 70 శాతం వాటా కలిగిన తయారీ రంగం సమీక్షా నెల మార్చిలో పేలవ పనితనాన్ని ప్రదర్శించింది. జనవరి, ఫిబ్రవరిలో కూడా ఐఐపీపై (వృద్ధి రేటు కేవలం 1.5 శాతం) ఒమిక్రాన్ ప్రతికూల ప్రభావం పడిన సంగతి తెలిసిందే. గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం దాదాపు అన్ని కీలక రంగాలపై హై బేస్ ప్రభావం కనిపించింది. ► తయారీ: మార్చిలో కేవలం 0.9 శాతం వృద్ధి నమోదయ్యింది. గత ఏడాది ఇదే నెల్లో ఈ రేటు ఏకంగా 28.4 శాతం. ► మైనింగ్: వృద్ధి రేటు 6.1% నుంచి 4 శాతానికి తగ్గింది. ► విద్యుత్: 22.5 శాతం వృద్ధి రేటు 6.1 శాతానికి దిగివచ్చింది ► క్యాపిటల్ గూడ్స్: భారీ యంత్ర పరికరాల ఉత్పత్తి, డిమాండ్కు ప్రాతిపదిక అయిన ఈ విభాగంలో వృద్ధి రేటు 50.4 శాతం నుంచి ఏకంగా 0.7 శాతానికి తగ్గింది. ►కన్జూమర్ డ్యూరబుల్స్: 2021 మార్చిలో 59.9 శాతం వృద్ధి నమోదయితే, తాజా సమీక్షా నెల్లో అసలు వృద్ధి లేకపోగా 3.2 శాతం క్షీణించింది. 2021–22లో 8.4 శాతం పురోగతి కాగా మార్చితో ముగిసిన 2021–22 ఆర్థిక సంవత్సరంలో ఐఐపీ వృద్ధి రేటు 8.4 శాతంగా ఉంది. 2020–21 ఇదే కాలంలో అసలు వృద్ది నమోదుకాకపోగా 8.4 శాతం క్షీణతలో ఉంది. 2020 మార్చి నుంచి ఒడిదుడుకుల బాట... మహమ్మారి కరోనా భయాలతో 2020 మార్చి 25 మే 31వ తేదీ వరకూ నాలుగు దశల్లో (మార్చి 25– ఏప్రిల్ 14, ఏప్రిల్ 15– మే 3, మే 4– మే 17, మే 18–మే 31) కఠిన లాక్డౌన్ అమలైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఐఐపీ తీవ్ర ఒడిదుడుకుల్లో ఉంది. 2020 మార్చి (మైనస్ 18.7%) నుంచి ఆ ఏడాది ఆగస్టు వరకు క్షీణతలోనే నడిచింది. అటు తర్వాత కొన్ని నెలల్లో భారీ వృద్ధి కనబడినా, దానికి ప్రధాన కారణం లో బేస్ ఎఫెక్ట్ కారణంగా కనబడింది. -
కరోనా మూడో దశ ముప్పుకు ఏపీ సర్కార్ చెక్..
సాక్షి, అమరావతి: కరోనా మూడో దశ కట్టడికి ప్రభుత్వం రచించిన వ్యూహం ఫలించింది. గత డిసెంబర్ నుంచే ఫీవర్ సర్వేలు, యుద్ధప్రాతిపదికన తొలి డోసు టీకా పంపిణీ చేపట్టడం వంటి చర్యలతో ప్రభుత్వం కరోనాను సమర్థంగా ఎదుర్కొంది. ప్రాణనష్టం తలెత్తకుండా పటిష్ట చర్యలు చేపట్టింది. దీంతో రెండో దశతో పోలిస్తే మూడో దశలో వైరస్ ఉధృతికి కళ్లెం పడింది. లక్ష్యాన్ని మించి టీకా పంపిణీ.. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో గతేడాది నవంబర్లో జిల్లా కలెక్టర్లు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. రాష్ట్రంలో 18 ఏళ్లు పైబడిన ప్రజలందరికీ యుద్ధప్రాతిపదికన మొదటి డోసు కరోనా టీకా పంపిణీ పూర్తి చేయాలని ఆదేశించింది. ఆదేశాలు జారీ చేసిన నాటికి రాష్ట్రవ్యాప్తంగా 18 ఏళ్లు పైబడిన వారిలో 87.43 శాతం మందికి తొలి డోసు, 62.19 శాతం మందికి రెండో డోసు టీకా పంపిణీ పూర్తయింది. కట్ చేస్తే.. నెల తిరిగే లోపు కేంద్ర ప్రభుత్వం 3.95 కోట్ల మందికి టీకాలు పంపిణీ చేయాలని లక్ష్యం నిర్దేశించగా.. ఈ లక్ష్యాన్ని మించి 4.01 కోట్ల మందికి అంటే 101.49 శాతం మందికి రాష్ట్ర ప్రభుత్వం తొలి డోసు టీకా పంపిణీ చేసింది. అదే విధంగా తొలి డోసు వేసుకున్న వారిలో 79.45 శాతం మందికి రెండో డోసు టీకా వేశారు. ఇలా ఇప్పటివరకు 4.05 కోట్ల మందికి తొలి డోసు, 3.80 కోట్ల మందికి రెండు డోసుల టీకా వేశారు. పిల్లలకు (15–18 ఏళ్లు) టీకా పంపిణీలోను ప్రభుత్వం దూకుడుగా వ్యవహరించింది. 24.41 లక్షల మందికి టీకా పంపిణీ చేయాలని కేంద్రం లక్ష్యం నిర్దేశించింది. ఈ లక్ష్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం స్వల్పకాలంలోనే ఛేదించింది. తద్వారా దేశంలోనే పిల్లలకు టీకా పంపిణీలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో నిలిచింది. ఇలా ఇప్పటివరకు 25.08 లక్షల మందికి తొలి డోసు, 15.18 లక్షల మంది పిల్లలకు రెండు డోసులు టీకా పంపిణీ పూర్తయింది. ఆస్పత్రుల్లో సౌకర్యాలు పెంపు రాష్ట్ర ప్రభుత్వం ఓ వైపు దూకుడుగా టీకా పంపిణీ చేస్తూనే... మరోవైపు వైరస్ నియంత్రణపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఆస్పత్రుల్లో పడకలు, మందులు, ఆక్సిజన్, ఇతర వనరులు సమకూర్చడంపైన దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా రెండో దశలో ఆక్సిజన్, సాధారణ ఐసీయూ బెడ్స్ అన్నీ కలిపి 48,874 అందుబాటులో ఉండగా.. మూడో దశలో 55,649 బెడ్స్ను ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. ఆక్సిజన్ కొరత లేకుండా 133 ప్రభుత్వాస్పత్రుల్లో 1,13,708 ఎల్పీఎం సామర్థ్యంతో గాలి నుంచి మెడికల్ ఆక్సిజన్ తయారు చేసే 167 పీఎస్ఏ ప్లాంట్లను అందుబాటులోకి తెచ్చింది. దీంతో ప్రభుత్వాస్పత్రుల్లో 24,419 పడకలకు నిరంతరాయంగా ఆక్సిజన్ సరఫరాను పెంచింది. ముందు నుంచే జాగ్రత్తలు కరోనా కట్టడిలో కేంద్రం మార్గదర్శకాలు వెలువడటానికి ముందే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా సంబంధిత దేశాల నుంచి వచ్చిన వారికి విమానాశ్రయాలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో వైద్య పరీక్షలు తప్పనిసరి చేసింది. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో గత డిసెంబర్ నుంచి వైద్య, ఆరోగ్య శాఖ నాలుగు పర్యాయాలు ఫీవర్ సర్వే చేపట్టింది. తొలి దశ నుంచి వైరస్ నియంత్రణకు ఫీవర్ సర్వే ఓ ప్రధాన ఆయుధంగా మారింది. సర్వేలో భాగంగా వైద్య సిబ్బంది రాష్ట్రవ్యాప్తంగా అన్ని గృహాలు సందర్శించి అనుమానిత లక్షణాలున్న వారిని గుర్తించడం, వారికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేపట్టడం చేస్తున్నారు. హోమ్ ఐసోలేషన్లో ఉంటూ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు, సలహాలు అందజేస్తున్నారు. ఇలా ఇప్పటివరకు 38 విడతలు సర్వే చేపట్టారు. ముందస్తు సన్నద్ధత తోడ్పడింది మూడో దశ వైరస్ వ్యాప్తి కట్టడికి ముందస్తు సన్నద్ధత తోడ్పడింది. రాష్ట్రంలో టీకా వేగవంతంగా పంపిణీ చేయడం కలిసొచ్చింది. వ్యాక్సిన్ తీసుకున్న వారిపై ఒమిక్రాన్ ప్రభావం లేదు. వీరికి వైరస్ సోకినా ఆస్పత్రిలో చేరకుండానే సాధారణ, దగ్గు, జలుబు జ్వరం మాదిరి ఇంట్లోనే తగ్గిపోయింది. వైరస్ తగ్గినప్పటికీ అప్రమత్తంగానే ఉన్నాం. – డాక్టర్ హైమావతి, ప్రజారోగ్య సంచాలకులు -
కరోనా థర్డ్వేవ్: ఆరు వారాల్లోనే ఆగింది.. బాధితుల్లో ఆ వయసువారే అధికం
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఎవరూ ఊహించని పరిణామం. అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్న సమయం. మొదటి వేవ్, సెకండ్ వేవ్ల తరహాలోనే విలయం సృష్టిస్తుందనుకున్న కరోనా థర్డ్ వేవ్ ఆరువారాల్లోనే చాప చుట్టేసింది. ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుందని, భారీగా నష్టం జరుగుతుందని వార్తలొచ్చాయి. కానీ, నామమాత్రంగా కూడా ప్రభావం చూపించలేదు. మూడో వేవ్ కేవలం 6 వారాల్లోనే అంతమైంది. ఆస్పత్రుల్లో చేరిన వారి సంఖ్య చాలా స్వల్పంగా ఉంది. ఎంత ఉధృతంగా వచ్చినా ఎదుర్కొనేందుకు సర్కారు భారీగా చర్యలు చేపట్టడంతో నియంత్రణ సాధ్యమైంది. కేసులూ తక్కువే మొదటి, సెకండ్ వేవ్లతో పోలిస్తే మూడో వేవ్లో పాజిటివ్ కేసులు తక్కువగా నమోదయ్యాయి. ఫస్ట్ వేవ్లో రమారమి 6 లక్షలకు పైగా పాజిటివ్ కేసులొచ్చాయి. సెకండ్ వేవ్లో సైతం 8 లక్షల కేసులొచ్చాయి. థర్డ్వేవ్లో ఇప్పటివరకు 2 లక్షల కేసులు మాత్రమే నమోదయ్యాయి. మొదటి వేవ్లో కేసులు అదుపులోకి రావడానికి 10 నెలలు పట్టింది. సెకండ్ వేవ్లోనూ నాలుగు మాసాలు పట్టింది. కానీ థర్డ్ వేవ్ ఆరు వారాల్లోనే అదుపులోకి వచ్చింది. పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ ప్రక్రియ జరగడం వల్లే కేసుల తీవ్రత తగ్గినట్టు నిపుణులు చెబుతున్నారు. భయాందోళనలు లేవు థర్డ్ వేవ్లోనూ కుర్రాళ్లే ఎక్కువగా కరోనా బారినపడ్డారు. మొత్తం కేసుల్లో 21–30 ఏళ్ల మధ్య వయస్కులు 26.63 శాతం ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే కుర్రాళ్లు థర్డ్వేవ్లో ఎదురొడ్డి నిలిచినట్టయ్యింది. పైగా ఈసారి భయాందోళనలు కూడా లేవు. మహమ్మారిని ఎలా ఎదుర్కోవాలో, దీన్నుంచి ఎలా బయట పడాలో అవగాహన ఉండటంతో సులభంగా గట్టెక్కారు. రికవరీ రేటు కూడా ఎక్కువగానే ఉన్నట్టు తాజా గణాంకాల్లో వెల్లడైంది. మొత్తం బాధితుల్లో మూడు శాతం మంది మాత్రమే ఆస్పత్రులకు వచ్చినట్టు తేలింది. అదే సెకండ్ వేవ్లో 17 శాతం మంది ఆస్పత్రుల్లో చేరారు. -
థర్డ్వేవ్ నుంచి గట్టెక్కినట్టే
సాక్షి ప్రతినిధి, అనంతపురం: జిల్లాలో కోవిడ్ థర్డ్ వేవ్ నుంచి గట్టెక్కినట్టేనని అధికారులతో పాటు వైద్యనిపుణులూ భావిస్తున్నారు. సెకండ్ వేవ్లో ఎంత ఉధృతంగా వచ్చిందో అందరికీ తెలిసిందే. సెకండ్ వేవ్లో ఆస్పత్రుల్లో చేరిన వారితో పాటు మృతుల సంఖ్య ఎక్కువే. మొదటి, సెకండ్ వేవ్లలో తీవ్ర భయాందోళన సృష్టించిన కరోనా.. థర్డ్ వేవ్లో ఒమిక్రాన్ వేరియంట్ అంతగా ప్రభావం చూపించకపోవడంతో జిల్లాలో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మొదటి వేవ్లో మొత్తం పాజిటివ్ కేసుల్లో 14.4 శాతం మంది ఆస్పత్రుల్లో చేరారు. సెకండ్వేవ్లో ఈ సంఖ్య 17 శాతానికి పెరిగింది. థర్డ్వేవ్లో మూడు శాతం వరకు మాత్రమే వెళ్లింది. ఈ నెల మూడో తేదీ నాటికి జిల్లాలో యాక్టివ్ కేసుల సంఖ్య 9,095గా ఉంది. 12వ తేదీ నాటికి 610 కేసులు మాత్రమే. దీన్ని బట్టి పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతున్నదని చెప్పుకోవచ్చు. జిల్లాలో 15 కోవిడ్ కేర్ సెంటర్లు ఉండగా శనివారం నాటికి ఒక్క అడ్మిషన్ కూడా కాలేదు. అయినా అప్రమత్తంగానే... మొదటి వేవ్, సెకండ్వేవ్లతో పోలిస్తే థర్డ్వేవ్ ప్రభావం నామమాత్రంగా కూడా లేదనేది తెలిసిందే. అయినా సరే ఏమరుపాటుగా ఉండకూడదని, మరికొన్ని రోజులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ప్రజల్లో కోవిడ్ భయం పోయిందని, వైరస్ ప్రభావం లేదు కదా అని ఇష్టారాజ్యంగా తిరగడం మంచిది కాదని, కోవిడ్ నిబంధనలు అమల్లో ఉన్నాయని అధికార వర్గాలు తెలిపాయి. మరోవైపు కోవిడ్ నియంత్రణలో భాగంగా హెల్త్కేర్ వర్కర్లకు ప్రికాషన్ డోస్, 60 ఏళ్లు దాటిన వారికి బూస్టర్ డోస్, 15–18 ఏళ్లలోపు వారికి ప్రత్యేక టీకా డ్రైవ్ కొనసాగుతూనే ఉంది. -
ఒమిక్రాన్ మళ్లీ రాదనుకోవద్దు!
సాక్షి, హైదరాబాద్: ఒమిక్రాన్ ఒకసారి వచ్చిపోయాక మళ్లీ రాదని నిర్లక్ష్యం వద్దని కిమ్స్ ఆస్పత్రి పల్మనాలజిస్ట్, స్లీప్ డిపార్డర్స్ స్పెషలిస్ట్ డా. వీవీ రమణప్రసాద్ అన్నారు. ఒకసారి ఒమిక్రాన్ వచ్చి తగ్గాక మళ్లీ నెల, నెలన్నరలో రీ ఇన్ఫెక్షన్ వస్తోందని, దీని పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కరోనా ప్రస్తుత పరిస్థితులపై ‘సాక్షి’తో ఆయన మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ఒమిక్రాన్ రీ ఇన్ఫెక్షన్లు వస్తున్నాయా? ఒకసారి ఒమిక్రాన్ వచ్చాక మళ్లీ రాదనుకోవద్దు. గత నెలలో ఒమిక్రాన్ సోకి నెగెటివ్ వచ్చాక బయట తిరిగి వైరస్కు మళ్లీ ఎక్స్పోజ్ అయిన కొందరు కరోనా బారిన పడుతున్నారు. కొన్ని రోజుల వ్యవధిలోనే ఒమిక్రాన్ రీ ఇన్ఫెక్షన్ కేసులు మళ్లీ వస్తున్నాయి. అలాంటి కొన్ని కేసులు గుర్తించాం. కాబట్టి కరోనా ఎండమిక్ స్టేజ్కు చేరే దాకా జాగ్రత్తలు తీసుకోవాలి. రెండోసారి వచ్చిన వాళ్లలో లక్షణాలేంటి? కరోనా రెండోసారి సోకినా తీవ్రత ఎక్కువగా ఉండట్లేదు. లక్షణాలూ మునుపటిలా స్వల్పంగానే ఉంటున్నాయి. ఇప్పటి వరకు వచ్చిన కేసులన్నీ దాదాపుగా ‘అప్పర్ రెస్పిరేటరీ సిస్టమ్’లోనే ఉంటున్నాయి. డెల్టాతో ›ఇన్ఫెక్ట్ అయిన వారు, అస్సలు టీకా తీసుకోనివారు కొంతమంది దీర్ఘకాలిక కోవిడ్ అనంతరం అనారోగ్య సమస్యలతో ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ఇప్పుడు ఎలాంటి సమస్యలతో వస్తున్నారు? ప్రస్తుతం ఒకరోజు జ్వరం, జలుబు, ఒళ్లు నొప్పులు, ఇతర లక్షణాలు తగ్గిపోయాక కఫంతో కూడిన దగ్గు ‘అలర్జీ బ్రాంకైటీస్ లేదా అస్థమా’ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. రాత్రి కాగానే కొంచెం దగ్గురావడం, పడుకున్నాక దగ్గుతో ఇబ్బంది పడటం, కొందరికి పిల్లి కూతలుగా రావడం వంటి సమస్యలతో వస్తున్నారు. వారం కిందట ఒకరోజు జ్వరం, కొద్దిగా ఒళ్లునొప్పులు వచ్చి తగ్గిపోయాయని, ఆ తర్వాత ఇలాంటి సమస్యలు వస్తున్నాయని ఎక్కువ మంది చెబుతున్నారు. అలా వారికి అప్పటికే కరోనా సోకిందని తెలుస్తోంది. చాలా మందికి మళ్లీ ఆస్థమా లేదా ‘అలర్జీ బ్రాంకైటీస్’ సమస్యలు పెరుగుతున్నాయి. కాబట్టి ఇలాంటి వాళ్లు దుమ్ము, పొగ, చల్లటి పదార్థాలు, చల్లటి గాలి నుంచి తగిన రక్షణ పొందుతూ జాగ్రత్తలు తీసుకోవాలి. లాంగ్ కోవిడ్ సమస్యలుంటున్నాయా? అసలు టీకాలు తీసుకోని వారు, ఒక్క డోస్ తీసుకున్న వారికి సంబంధించి వైరస్ సోకాక వారం, పది రోజుల తర్వాత దగ్గు, ఆయాసం పెరిగిన కేసులు స్వల్పంగా వస్తున్నారు. వీరిలో కొన్ని కేసులు ‘లంగ్ షాడోస్’ వంటివి వస్తున్నాయి. ఇంకా అక్కడక్కడ డెల్టా కేసులు వస్తున్నాయి కాబట్టి న్యూమోనియా, ఇతర లక్షణాలు కనిపిస్తున్నాయి. -
Anand Mahindra: మిమ్మల్ని ఇలా చూస్తున్నందుకు సంతోషంగా ఉంది
సామాజిక అంశాలపై ఎప్పుడూ స్పందించే ఆనంద్ మహీంద్రా ఈసారి వర్క్ ఫ్రం హోంపై స్పందించారు. 2020 మార్చి 24న లాక్డౌన్ విధించింది మొదలు వర్క్ కల్చర్ అంతా మారిపోయింది. ఒకాదిన వెంట ఒకటిగా కరోనా వేవ్స్ వస్తుండటంతో వర్క్ ఫ్రం హోంకి తెర పడలేదు. ఉద్యోగులు లేక ఆఫీసులు వెలవెలబోయాయి. తాజాగా ఒమిక్రాన్తో వచ్చిన థర్డ్ వేవ్తో మరోసారి ఉద్యోగులు ఆఫీసులకు రానక్కర్లేది ఇంటి నుంచి పని చేసుకోవచ్చంటూ ప్రభుత్వాలు ఆదేశించాయి. అయితే గతానికి కంటే భిన్నంగా ఈ సారి త్వరగా కోవిడ్ వేవ్ ముగిసి పోయింది. దీంతో ఉద్యోగులను ఆఫీసులకు రావాలంటూ ప్రభుత్వాలు ఆదేశించాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగులతో కళకళాడుతున్న కార్యాలయానికి సంబంధించి వార్తను ఆనంద్ మహీంద్రా షేర్ చేశారు. మిమ్మల్ని ఇలా చూస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారాయన. Hello normal life. It’s good to see you again… pic.twitter.com/OKgIfIAw7P — anand mahindra (@anandmahindra) February 7, 2022 -
అతి తెలివి: తొమ్మిదో తరగతి చదవకుండానే నేరుగా టెన్త్ క్లాస్
సాక్షి హైదరాబాద్: కోవిడ్ నేపథ్యంలో పదో తరగతి గండం నుంచి సునాయాసంగా గట్టెక్కించేందుకు కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు పడరాని పాట్లు పడుతున్నారు. వరుసగా రెండు పర్యాయాలు పరీక్షలు నిర్వహించకుండానే పదో తరగతిలో మొత్తం విద్యార్థులను ప్రభుత్వం పాస్ చేసింది. ఈసారి కూడా థర్డ్వేవ్ నేపథ్యంలో పాత పరిస్థితులు పునరావృతం కావచ్చని తల్లిదండ్రులు ఒక అడుగు ముందుకు వేసి తమ పిల్లలను తొమ్మిదో తరగతి చదివించకుండానే పదో తరగతిలో కూర్చోబెట్టడంలో సఫలీకృతులయ్యారు. ఏకంగా పరీక్ష ఫీజులు చెల్లించినట్లు తెలుస్తోంది. ఇందుకు ప్రైవేటు యాజమాన్యాల తోడ్పాటుకు కూడా కలిసివస్తోంది. ఒకవేళ పరీక్షలు నిర్వహించినా సులభమైన ప్రశ్నలతో పాటు జవాబు పత్రాల మూల్యాంకనం కూడా అంతా కఠినంగా ఉండబోదన్న అభిప్రాయం తల్లిదండ్రుల్లో వ్యక్తమవుతోంది. వయసు ఉంటేసరి... పదో తరగతి పరీక్షలకు 14 ఏళ్ల వయసు తప్పనిసరి. ఈ వయసు పిల్లలను ఏకంగా పదో తరగతిలో పరీక్షకు సిద్ధం చేయడం విస్మయానికి గురిచేస్తోంది. తల్లిదండ్రుల విజ్ఞప్తుల మేరకు కొన్ని పేరొందిన ప్రైవేటు పాఠశాలలు సైతం అక్రమ పదోన్నతులకు తెరలేపాయి. ఇందుకు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి భారీగానే వసూళ్లకు పాల్పడినట్లు తెలుస్తోంది. పాత రెగ్యులర్ విద్యార్థులను పదోన్నతులు కల్పించడమే కాకుండా ఇతర పాఠశాల విద్యార్థులను సైతం చేర్చుకొని పదో తరగతి పరీక్ష ఫీజులు చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. టెన్త్ పరీక్ష ఫీజు గడువు ఈ నెల 14 వరకు ఉండగా ఇప్పటికే అక్రమంగా పదోన్నతి పొందిన విద్యార్థులు ఫీజులు చెల్లింపు ప్రక్రియ పూర్తయినట్లు తెలుస్తోంది. మరోవైపు కొంత వయసు తక్కువగా ఉన్న వారి పుట్టిన తేదీల్లో మార్పు చేసి పరీక్షల ఫీజులు చెల్లింపులకు చేస్తున్నట్లు సమాచారం. కాగా.. వచ్చే విద్యాసంవత్సరం నుంచి వయసులో మరో రెండేళ్ల సడలింపు అమలు కానుంది. సిలబస్ అంతంతే.. పదో తరగతి సిలబస్ అంతంత మాత్రంగా మారింది. కరోనా సెకండ్ వేవ్, థర్డ్ వేవ్లతో ప్రత్యక్ష తరగతులు ఆలస్యంగా మొదలవ్వడంతో సిలబస్పై తీవ్ర ప్రభావం చూపింది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఇప్పటి వరకు 50 శాతం సిలబస్ మించలేదు. సంక్రాంతి సెలవుల అనంతరం పాఠశాలలు పునఃప్రారంభమైనా.. ప్రత్యక్ష బోధన అంతంతగా తయారైంది.సైన్స్, లెక్కలు, సోషల్ స్టడీస్లో ముఖ్యమైన చాప్టర్లతో పాటు రివిజన్ పూర్తయితేనే విద్యార్థులకు పరీక్షలు తేలికగా ఉంటాయి. జంపింగ్ చేసిన విద్యార్థులకు మాత్రం అంత సులభం కాదన్నట్లు సమాచారం. సుమారు 2.90 లక్షల మంది.. గ్రేటర్ పరిధిలో ప్రభుత్వ, ప్రైవేటు హైస్కూళ్లలో ప్రస్తుత విద్యా సంవత్సరంలో సుమారు 2.90 లక్షల మంది పదో తరగతి చదువుతున్నట్లు అధికార లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఇందులో తొమ్మిదో తరగతి చదవకుండానే పదో తరగతి చదువుతున్న విద్యార్థులు 10 శాతం వరకు ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా నేపథ్యంలో గత రెండు పర్యాయాల నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రద్దవుతూ వస్తున్నాయి. పరీక్షలు రాయకున్నా కేవలం పరీక్ష ఫీజు చెల్లించిన విద్యార్థులందరినీ ఫార్మెటివ్ పరీక్షల ఆధారంగా పాస్ చేస్తూ వస్తున్నారు. ఈసారి కూడా కరోనా థర్డ్వేవ్ కొనసాగుతుండటంతో పాత పరిస్థితులకు అవకాశాలు లేకపోలేదు. ఒకవేళ పరీక్షలు నిర్వహించినా ప్రశ్నపత్రాలు సులభంగా వచ్చే అవకాశముందన్న ప్రచారం సాగుతోంది. దీంతో కరోనా కష్టకాలంలోనే తమ పిల్లలను టెన్త్ గట్టెక్కించాలన్న తల్లిదండ్రులు ప్రయత్నించడం ప్రైవేటు యాజమాన్యాలు తోడ్పాటు అందిస్తుండటంతో ఈ వ్యవహారం గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్నట్లు తెలుస్తోంది. -
గేట్ పోస్ట్పోన్.. కుదరదు: సుప్రీం కోర్టు
గేట్ పరీక్షను పోస్ట్ పోన్ చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. పరీక్ష నిలుపుదలకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ఈ మేరకు దాఖలైన పిటిషన్లను కొట్టేస్తూ.. యధాతధంగా పరీక్ష నిర్వహణ ఉంటుందని గురువారం తీర్పు వెలువరించింది. పరీక్షకు 48 గంటల ముందు గేట్ ఎగ్జామ్ను పోస్ట్పోన్ చేయడం ద్వారా విద్యార్థుల్లో ఆందోళన, అనిశ్చితి నెలకొంటుందని జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ వ్యాఖ్యానించింది. దేశంలో ఇప్పుడు ప్రతీది తెరుచుకుంటోంది. పరిస్థితులు ఇప్పుడిప్పుడే సాధారణం అవుతున్నాయి. ఇలాంటి టైంలో విద్యార్థుల కెరీర్తో ఆడుకోలేం. ఇది అకడమిక్ పాలసీకి సంబంధించింది. పర్యవేక్షించాల్సింది వాళ్లు.. మేం కాదు. ఇలాంటి వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం ప్రమాదకరం అంటూ వ్యాఖ్యానించింది బెంచ్. కొవిడ్-19 థర్డ్వేవ్ తరుణంలో విద్యార్థుల ఆరోగ్య భద్రత దృష్ట్యా గేట్ను వాయిదా వేయాలంటూ అభ్యర్థనల మేర పిటిషన్ దాఖలు అయిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై రెండు పిటిషన్లు దాఖలు కాగా..అందులో ఒకటి అభ్యర్థుల తరపున దాఖలైంది. పిటిషనర్ల తరపున పల్లవ్ మోంగియా, సత్పల్ సింగ్ వాదనలు వినిపించారు. కాగా, సుప్రీం కోర్టు తాజా ఆదేశాలతో ఫిబ్రవరి 5, 6, 12, 13 తేదీల్లో యధాతధంగా గేట్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. -
రోజుకు 250 టన్నుల ఆక్సిజన్
సాక్షి, అమరావతి: కరోనా థర్డ్వేవ్ వేగంగా విస్తరిస్తున్న వేళ తగినంత ఆక్సిజన్ అందుబాటులో ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా చిత్తూరు జిల్లా శ్రీసిటీలో నోవా ఎయిర్ మెడికల్ ఆక్సిజన్ యూనిట్ ఉత్పత్తికి సిద్ధమయ్యింది. త్వరలో దీనిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వర్చువల్గా ప్రారంభించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రికార్డు స్థాయిలో నిర్మాణం ప్రారంభించిన 12 నెలల్లోనే ఈ యూనిట్ ఉత్పత్తి ప్రారంభించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా సింగిల్ విండో విధానంలో అనుమతులు మంజూరు చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద పారిశ్రామిక వాయువుల తయారీ కంపెనీ నోవా ఎయిర్ టెక్నాలజీ.. ఒకపక్క కోవిడ్ ఇబ్బందులు వెంటాడుతున్నప్పటికీ 2020 డిసెంబర్లో నిర్మాణ పనులు ప్రారంభించి 2021 నవంబర్కి పూర్తిచేసింది. ప్రయోగ పరీక్షలు విజయవంతం కావడంతో వాణిజ్యపరంగా ఉత్పత్తి ప్రారంభించడానికి సిద్ధమయ్యింది. రోజుకు 250 టన్నుల మెడికల్ ఆక్సిజన్, లిక్విడ్ ఆక్సిజన్, లిక్విడ్ నైట్రోజన్, లిక్విడ్ ఆర్గాన్ను ఉత్పత్తి చేసేవిధంగా ఈ యూనిట్ను రూ.106 కోట్లతో ఏర్పాటు చేశారు. ఈ యూనిట్ ద్వారా 150 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. హాంకాంగ్కు చెందిన అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ పీఏజీ నోవా ఎయిర్ టెక్నాలజీ పేరుతో ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక వాయువులను ఉత్పత్తి చేస్తోంది. పీఏజీ నిర్వహిస్తున్న ఆస్తుల విలువ రూ.3,37,500 కోట్లకుపైగా ఉండగా, ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా రూ.22,500 కోట్ల విలువైన పారిశ్రామిక వాయువుల వ్యాపారం చేస్తోంది. ఈ సంస్థ రాష్ట్రంలో యూనిట్ ఏర్పాటు చేయడానికి 2020 జనవరి 24న ఒప్పందం కుదుర్చుకుంది. -
భారత్లో థర్డ్ వేవ్ ప్రభావం తక్కువే.. కారణమిదే!
న్యూఢిల్లీ: గతేడాది దేశాన్ని కుదిపేసిన కరోనా సెకండ్వేవ్తో పోలిస్తే ప్రస్తుత థర్డ్ వేవ్ వల్ల మరణాలు, ఆస్పత్రిపాలవడం తక్కువగానే ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ అభిప్రాయపడింది. ప్రస్తుత వేవ్లో కేసులు పెరుగుతున్నా, వ్యాక్సినేషన్ కార్యక్రమం స్పీడందుకోవడంతో భారీగా అనారోగ్యాలపాలవడం, చావులు పెరగడం కనిపించడంలేదని తెలిపింది. ఈ మేరకు రెండు, మూడు వేవ్స్ను పోల్చిచెప్పే కీలక సూచీలను కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ మీడియా సమావేశంలో గురువారం ప్రదర్శించారు. దేశంలో 2021 ఏప్రిల్ చివరకు 3.86 లక్షల కొత్త కేసులు, 3,059 మరణాలు, 31.70 లక్షల యాక్టివ్ కేసులు నమోదయ్యాయని, ఆ సమయంలో దేశంలో రెండు డోసుల టీకా తీసుకున్నవారి సంఖ్య మొత్తం జనాభాలో 2 శాతమని చెప్పారు. 2022 జనవరి 20న దేశంలో 3.17 లక్షల కొత్త కేసులు, 380 మరణాలు, 19.24 లక్షల యాక్టివ్ కేసులు నమోదయ్యాయని, ఈ సమయానికి పూర్తిడోసులందుకున్న వారి సంఖ్య 72 శాతానికి చేరిందని వివరించారు. టీకా కార్యక్రమం వల్ల థర్డ్ వేవ్లో మరణాలు తగ్గాయన్నారు. 18ఏళ్లకు పైబడినవారిలో 72 శాతం మంది రెండు డోసులు, 94 శాతం మంది తొలిడోసు అందుకున్నారని చెప్పారు. 15– 18 ఏళ్ల కేటగిరీ ప్రజల్లో 52 శాతం మంది తొలిడోసు టీకా తీసుకున్నారన్నారు. ఈ కేటగిరీలో టీకాలందుకున్నవారిలో ఏపీ టాప్లో ఉందని చెప్పారు. -
కరోనాపై ‘మూడో పోరు’కు సిద్ధం
గజ్వేల్: కరోనా మూడో వేవ్ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్ల టెస్టింగ్ కిట్లు, కోటి హోం ఐసోలేషన్ కిట్లు అందుబాటులో ఉంచామని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. బుధవారం గజ్వేల్ ప్రభుత్వాస్పత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కరోనా పరీక్షల తీరు, సాధారణ ఓపీ సేవలు, ప్రసూతి సేవల తీరును పరిశీలించారు. ఆక్సిజన్ ప్లాంట్ వివరాలను ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మహేశ్ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కరోనా సోకితే భయాందోళనకు గురికావద్దని, సబ్సెంటర్ స్థాయి నుంచి పీహెచ్సీలు, అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో టెస్టింగ్ కిట్లు అందుబాటులో ఉంచామని చెప్పారు. ఎప్పటికప్పుడు పరీక్షలు చేయడంతోపాటు హోం ఐసోలేషన్ కిట్లు కూడా అందుబాటులో ఉంచామని తెలిపారు. సిద్దిపేట మెడికల్ కళాశాలలో వంద పడకలతో కరోనా వార్డును ప్రత్యేకంగా సిద్ధం చేశామని, వ్యాక్సినేషన్ ప్రక్రియ సైతం వేగంగా సాగుతోందన్నారు. 60 ఏళ్లు పైబడినవారు బూస్టర్డోస్ తప్పనిసరిగా వేసుకోవాలని సూచించారు. కేసీఆర్ కిట్ కార్యక్రమంతో ప్రభుత్వాసుపత్రుల్లో 22 శాతం మేర ప్రసవాల సంఖ్య పెరిగిందన్నారు. గజ్వేల్ ఆస్పత్రిలో వైద్యసేవల తీరు బాగుందని ప్రశంసించారు. ఈ ఆస్పత్రిలో నెలకు 400కుపైగా డెలివరీలు చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఆయనతో పాటు రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ రోజాశర్మ ‘గడా’ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అంతర్జాతీయ విమాన ప్రయాణికులకు అలర్ట్
అంతర్జాతీయ విమాన సర్వీసులపై తాజాగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా కేసులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దును పొడిగిస్తున్నట్లు ప్రకటిస్తుంది. ఫిబ్రవరి 28వ తేదీ వరకు ఈ సస్పెన్షన్ కొనసాగుతుందని Directorate General of Civil Aviation తెలిపింది. అయితే ఎయిర్ బబూల్ ఆరేంజ్మెంట్స్ విమానాలకు ఈ కొత్త రెగ్యులేషన్స్ వర్తించవు. డీజీసీఏ అప్రూవ్ చేసిన విమానాలకు, అంతర్జాతీయ కార్గో ఆపరేషన్లకు ఈ ఆంక్షలు వర్తించబోవని సివిల్ ఏవిషేయన్ జనరల్ డైరెక్టర్ నీరజ్ కుమార్ ఒక సర్క్యులర్లో వెల్లడించారు. ఇదిలా ఉంటే ఒమిక్రాన్ నేపథ్యంలో 2021 డిసెంబర్ 9న అంతర్జాతీయ విమాన సర్వీసులపై డిసెంబర్ 31వ తేదీ వరకు డీజీసీఏ నిషేధం విధించిన విషయం తెలిసిందే. అంతకు ముందు మార్చి 29, 2020 కరోనా టైం నుంచి చాలావరకు అంతర్జాతీయ విమాన సర్వీసులు చాలా వరకు రద్దు అయ్యాయి. కాకపోతే వందేమాతం మిషన్ లాంటి కొన్ని సర్వీసులను ‘ఎయిర్ బబూల్’ అరేంజ్మెంట్స్తో ఎంపిక చేసిన దేశాలకు జులై 2020 వరకు నడిపించారు. యూఎస్, యూకే, యూఏఈ, భూటాన్, ఫ్రాన్స్తో పాటు మొత్తం 32 దేశాలకు ఎయిర్బబూల్ అగ్రిమెంట్ ద్వారా విమానాలు నడిపిస్తోంది భారత్. pic.twitter.com/5KCcDlZHMX — DGCA (@DGCAIndia) January 19, 2022 పునరుద్ధరణపై వెనక్కి.. కరోనా సెకండ్ వేవ్ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ పెరగడం, కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో నవంబరు 26న సివిల్ ఏవియేషన్ శాఖ అంతర్జాతీయ విమానాలన్నింటిని పునరుద్ధరిస్తున్నట్టు ప్రకటించింది. కరోనాకు ముందు తరహాలోనే 2021 డిసెంబరు 15 నుంచి అన్ని విమాన సర్వీసులు అందుబాటులోకి తెస్తామని తెలిపింది. అయితే ఇంతలోనే వేరియెంట్లు, కేసులు పెరగడంతో ఆ నిర్ణయం వాయిదా వేసుకుంది. -
విజయవాడ రైల్వే డివిజన్లో కరోనా కలకలం
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): కరోనా మూడో వేవ్ విజయవాడ రైల్వే డివిజన్ను ఆందోళనకు గురిచేస్తోంది. ఒక్క రోజులోనే 104 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. వీరిలో 50 మంది మెయిల్, ప్యాసింజర్, గూడ్స్ లోకో పైలట్లు, 49 మంది అసిస్టెంట్ లోకో పైలట్లు ఉన్నారు. కరోనా సోకిన వారిని అధికారులు క్వారంటైన్కు పంపారు. ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో లోకో పైలట్లు, అసిస్టెంట్ పైలట్లు కరోనా బారిన పడటంతో సిబ్బంది కొరత ఏర్పడింది. దీంతో ఈ నెల 18 నుంచి 22వ తేదీ వరకు పలు గూడ్స్, ప్యాసింజర్ రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మచిలీపట్నం–సికింద్రాబాద్ ప్రత్యేక రైళ్ల రద్దు తక్కువ ఆక్యుపెన్సీ కారణంగా మచిలీపట్నం–సికింద్రాబాద్ల మధ్య ప్రకటించిన ప్రత్యేక రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. మచిలీపట్నం–సికింద్రాబాద్ ప్రత్యేక రైళ్ల(07577/07578)ను ఈ నెల 23, 30 తేదీల్లో రద్దు చేశారు. కాకినాడ టౌన్–లింగంపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కాకినాడ టౌన్–లింగంపల్లి మధ్య 8 ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. ప్రత్యేక రైలు(07295) ఈ నెల 24, 26, 28, 31 తేదీల్లో రాత్రి 8.10 గంటలకు కాకినాడ టౌన్లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 8.15 గంటలకు లింగంపల్లి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07296) ఈ నెల 25, 27, 29, ఫిబ్రవరి 1 తేదీల్లో సాయంత్రం 4.40 గంటలకు లింగంపల్లిలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 6.10 గంటలకు కాకినాడ టౌన్ చేరుకుంటుంది. రెండు మార్గాల్లో ఈ రైళ్లు సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, పిడుగురాళ్ల, నల్గొండ, సికింద్రాబాద్ స్టేషన్లలో ఆగుతాయి. -
ఎయిర్లైన్స్కు ఈ ఏడాదీ కష్టకాలమే
ముంబై: కరోనా వచ్చిన దగ్గర్నుంచి విమానయాన రంగం (ఎయిర్లైన్స్) కోలుకోకుండా ఉంది. కరోనా మూడో విడత రూపంలో విస్తరిస్తూ ఉండడం, పెరిగిన ఇంధన (ఏటీఎఫ్) ధరలు వెరసి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) మొత్తం మీద ఎయిర్లైన్స్కు రూ.20,000 కోట్ల నష్టాలు రావచ్చని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం (2021–21)లోనూ ఎయిర్లైన్స్ సంస్థలు రూ.13,853 కోట్ల నష్టాలను మూటగట్టుకున్నాయి. వీటితో పోలిస్తే నష్టాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 44 శాతం మేర పెరగనున్నాయని క్రిసిల్ నివేదిక పేర్కొంది. దీంతో ఈ రంగం కోలుకోవడానికి మరింత సమయం పట్టొచ్చని అంచనా వేసింది. 2022–23 ఆర్థిక సంత్సరం తర్వాతే రికవరీ ఉండొచ్చని పేర్కొంది. దేశీయంగా 75 శాతం మార్కెట్ వాటా కలిగిన ఇండిగో, స్పైస్జెట్, ఎయిర్ఇండియా గణాంకాల ఆధారంగా క్రిసిల్ ఈ నివేదికను రూపొందించింది. దేశీయ మార్కెట్ కోలుకుంది.. కరోనా మహమ్మారి దెబ్బకు 2020లో విమాన సర్వీసులు దేశీయంగా చాలా పరిమితంగా నడిచాయి. 2021 డిసెంబర్ నాటికి కానీ ప్రయాణికుల రద్దీ కోలుకోలేదు. కరోనా పూర్వపు నాటి గణాంకాలతో పోలిస్తే 86 శాతానికి పుంజుకుంది. కానీ మరో విడత కరోనా ఉధృతితో 2022 జనవరి మొదటి వారంలో 25 శాతం రద్దీ తగ్గిపోయినట్టు క్రిసిల్ తెలిపింది. కరోనా రెండో విడతలో 2021 ఏప్రిల్–మే నెలలోనూ ఇదే మాదిరి 25 శాతం మేర క్షీణత నమోదైనట్టు గుర్తు చేసింది. అంతర్జాతీయ రెగ్యులర్ విమాన సర్వీసులు ఈ ఏడాది జనవరి తర్వాతే ప్రారంభం కావచ్చని క్రిసిల్ పేర్కొంది. ప్యాసింజర్ లోడ్ ఫ్యాక్టర్ (విమానంలో ప్రయాణికుల భర్తీ) 2021 మే నెలలో 50 శాతంగా ఉండగా.. 2021 డిసెంబర్ నాటికి 80 శాతానికి పెరిగింది. ఆరు నెలల్లో రూ.11,323 కోట్ల నష్టం ‘మూడు ప్రధాన ఎయిర్లైన్స్ కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లోనే (2021 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు) రూ.11,323 కోట్ల నష్టాలను నమోదు చేశాయి. కాకపోతే దేశీయ విమాన సర్వీసులు బాగా పుంజుకోవడంతో మూడో త్రైమాసికంలో (అక్టోబర్–డిసెంబర్) మెరుగైన ఆదాయం కొంత వరకు నష్టాలను సర్దుబాటు చేసుకునేందుకు మద్దతుగా నిలిచాయి. కానీ, కరోనా మూడో విడత కారణంగా వచ్చిన ఆంక్షల ప్రభావంతో నాలుగో త్రైమాసికంలో (2021 జనవరి–మార్చి) నష్టాలు గణనీయంగా పెరగనున్నాయి. దీంతో ఆర్థిక సంవత్సరం మొత్తం మీద ఎయిర్లైన్స్ భారీ నష్టాలు నమోదు చేస్తాయని అంచనా వేస్తున్నాం’ అని క్రిసిల్ డైరెక్టర్ నితేశ్ జైన్ తెలిపారు. ఏటీఎఫ్ ధర 2021 నవంబర్లో లీటర్కు గరిష్టంగా రూ.83కు చేరింది. 2020–21లో సగటు ఏటీఎఫ్ ధర లీటర్కు రూ.44గానే ఉంది. ఇంధన ధరలు రెట్టింపు కావడం, ట్రాఫిక్ తగ్గడం నష్టాలు పెరిగేందుకు కారణంగా క్రిసిల్ వివరించింది. దీంతో ఎయిర్లైన్స్ రుణ భారం కూడా పెరిగిపోతుందని అంచనా వేసింది. -
దేశంలో కరోనా థర్డ్ వేవ్ టెన్షన్
-
థర్డ్ వేవ్ను ఎదుర్కొనేందుకు సీతారామన్ సన్నద్ధం!
ముంబై: కోవిడ్–19 మూడవ వేవ్ను ఎదుర్కొంటున్న భారత్ ఎకానమీని సవాళ్ల నుంచి గట్టెక్కించడానికి, బలహీనంగా ఉన్న రికవరీకి మద్దతును అందించడానికి ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ రానున్న వార్షిక బడ్జెట్లో పలు ద్రవ్యపరమైన చర్యలను తీసుకునే అవకాశం ఉందని బ్రోకరేజ్ సంస్థ బార్క్లేస్ ఇండియా ఒక నివేదికలో పేర్కొంది. ఇది ద్రవ్యలోటు పెరుగుదలకు దారితీయవచ్చని వివరించింది. ఫిబ్రవరి ఒకటవ తేదీన ఆర్థికమంత్రి పార్లమెంటులో 2022–23 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశం ఉన్న సంగతి తెలిసిందే. బార్క్లేస్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎకనమిస్ట్ రాహుల్ బజోరియా వెల్లడించిన నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ► 2021–22 బడ్జెట్లో ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు స్థూల దేశీయోత్పత్తలో (జీడీపీ)6.8 శాతం ఉంటుందని అంచనా వేయడం జరిగింది. అయితే 7.1 శాతానికి ఈ పరిమాణం పెరిగే అవకాశం ఉంది. ► కన్సాలిడేటెడ్ (కేంద్రం, రాష్ట్రాలు) ద్రవ్యలోటు 2021–22లో 11.1 శాతంగా ఉండే వీలుంది. కేంద్రం విషయంలో ఇది 7.1 శాతం అయితే, రాష్ట్రాలకు సంబంధించి 4 శాతంగా ఉం టుందన్నది అంచనా. కన్సాలిడేటెడ్ ద్రవ్యలోటు వచ్చే ఐదేళ్లలో 7 శాతం దిశగా దిగిరావచ్చు. ► 2022–23లో కన్సాలిటేడెడ్ ద్రవ్యలోటు 10.5 శాతానికి తగ్గవచ్చు. ఇందులో కేంద్రం వాటా 6.5 శాతంగా (రూ.17.5 లక్షల కోట్లు) నమోదుకావచ్చు. ► ఆయా అంశాల నేపథ్యంలో కేంద్రం వ్యయాల మొత్తం దాదాపు రూ.41.8 లక్షల కోట్లకు పెరిగే అవకాశం ఉంది. ► ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రభుత్వ రుణాలు రూ.12 లక్షల కోట్లయితే, ఇది 2022–23లో రూ. 16 లక్షల కోట్లకు పెరిగే వీలుంది. ► కొత్త బడ్జెట్లో సంక్షేమ కార్యక్రమాలకు వ్యయాలు, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వవచ్చు. ద్రవ్యలోటు పెరుగుదలకు ఇది దారితీస్తుంది. ► ఇప్పటికే బలహీనంగా ఉన్న రికవరీ పటిష్టతకు మూలధన వ్యయాల పెంపు అవసరం. ► పన్ను, పన్ను యేతర ఆదాయాలు 2021–22లో అలాగే 2022–23లో బడ్జెట్ లక్ష్యాలను అధిగమించే వీలుంది. ► ప్రస్తుత ధరల ప్రాతిపదిక (నామినల్ బేస్) జీడీపీ 2021–22లో 19.6 శాతంగా నమోదుకావచ్చు. ప్రభుత్వ అంచనా (17.4 శాతం) ఇది అధికం కావడం గమనార్హం. 2022–23 ఆర్థిక సంవత్సరంలో నామినల్ ఎకానమీ విలువ 13.6 శాతం పెరిగే అవకాశం ఉంది. ద్రవ్యలోటు ధోరణి ఇది... కరోనా తీవ్ర పరిస్థితుల నేపథ్యంలో 2020–21 స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) ద్రవ్యలోటు 9.3 (బడ్జెట్ లక్ష్యం 3.5 శాతానికి మించి) శాతంగా నమోదయ్యింది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దీనిని 6.8 శాతం (రూ.15.06 లక్షల కోట్లు) వద్ద కట్టడి చేయాలని 2021–22 బడ్జెట్ నిర్దేశించింది. 2025–26 ఆర్థిక సంవత్సరం నాటికి ద్రవ్యలోటును 4.5 శాతానికి తీసుకురావడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీతారామన్ 2021–22 బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. 15వ ఫైనాన్స్ కమిషన్ సిఫారసుల ప్రకారం– 2021–22 నాటికి ద్రవ్యలోటు 6 శాతానికి తగ్గాలి. 2022–23 నాటికి 5.5 శాతానికి దిగిరావాల్సి ఉంటుంది. 2023–24 నాటికి 5 శాతానికి, 2024–25 నాటికి 4.5 శాతానికి, 2025–26 నాటికి 4 శాతానికి తగ్గించాలి. కాగా, ద్రవ్యలోటు విషయంలో కొంత ధైర్య సాహసాలతో కూడిన విధానాన్ని అనుసరించాలని ప్రముఖ బ్యాంకర్ కేవీ కామత్ లాంటి వారు సూచిస్తుండడం మరో విషయం. ద్రవ్యలోటును పూడ్చుకోవడంలో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2021–22) ప్రభుత్వ రంగ కంపెనీలు, ఫైనాన్షియల్ సంస్థల నుంచి వాటాల విక్రయం ద్వారా (పెట్టుబడుల ఉపసంహరణల) కేంద్రం రూ.1.75 లక్షలు సమకూర్చుకోవాలని నిర్దేశించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకూ తద్వారా ఒనగూడింది కేవలం రూ.9,330 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. కేంద్రం ఆదాయ వ్యత్యాసం భర్తీలో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) మొదటి ఆరు నెలల కాలంలో (ఏప్రిల్–సెప్టెంబర్) బాండ్ల జారీ ద్వారా 7.02 లక్షల కోట్లు సమీకరించింది. మొత్తం రూ.12.05 లక్షల కోట్ల సమీకరణలో భాగంగా అక్టోబర్ నుంచి 2022 మార్చి వరకూ రూ.5.03 లక్షల కోట్ల రుణ సమీకరణ జరపనుంది. -
కిరాణ సరుకుల అమ్మకాలపై భారీ దెబ్బ!
కరోనా కేసుల విజృంభణ భారత్లో మొదలైంది. థర్డ్ వేవ్లోకి ప్రవేశించిన నేపథ్యంలో.. ఆంక్షలు, కర్ఫ్యూలు, వీకెండ్ లాక్డౌన్లతో కొన్ని రాష్ట్రాల్లో వైరస్ కట్టడికి చర్యలు మొదలయ్యాయి. ఈ తరుణంలో నిత్యావసరాల అమ్మకాలపై భారీ దెబ్బ పడుతోంది. వ్యాక్సినేషన్ ఉధృతంగా కొనసాగడం, మరోవైపు కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టబోతున్న జోష్.. ప్రొడక్టివిటీ మార్కెట్లో స్పష్టంగా కనిపించింది. దీంతో నిత్యావసర సరుకులతో పాటు డ్రై ఫ్రూట్స్ వ్యాపారం అద్భుతంగా జరగొచ్చని భావించారు. అక్టోబర్ నుంచి పెరిగిన కిరాణ వస్తువుల అమ్మకాలు.. డిసెంబర్ మధ్యకల్లా తారాస్థాయికి చేరింది. దీనికి తోడు పెళ్లి, పండుగ సీజనులు వస్తుండడంతో కలిసొస్తుందని వ్యాపారులు అనుకున్నారు. అయితే ఊహించని రీతిలో ఒమిక్రాన్ వేరియెంట్, కరోనా కేసుల పెరుగుదల దేశవ్యాప్తంగా నిత్యావసరాల అమ్మకాలను దెబ్బ కొడుతున్నాయి. నో సప్లయ్ నిత్యావసర దుకాణాల అమ్మకాల జోరుకు ఒక్కసారిగా బ్రేకులు పడ్డాయి. కొవిడ్ ఆంక్షలతో హోల్ సేల్ నుంచి కిందిస్థాయి దుకాణాలకు, చిన్నచిన్న మార్ట్లకు సరుకులు చేరడం లేదు. మరోవైపు కఠిన ఆంక్షలతో వాహనాల రాక ఆలస్యమవుతోంది. హోల్సేల్ షాపుల నుంచి చిన్న చిన్న కిరాణ కొట్టుల దాకా చాలా రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. హోల్సేల్ మార్కెట్ల నుంచి కిందిస్థాయి మార్కెట్లకు డిమాండ్కు తగ్గ సప్లయ్ ఉండడం లేదు. ఇంకోవైపు దుకాణాల ముందు జనాలు.. క్యూలు కట్టే పరిస్థితి కనిపించడం లేదు. ఈ పరిణామాలతో అధిక ధరలకు అమ్మకాలు కొనసాగుతున్నాయి చాలా చోట్ల. అయితే హోల్సేల్ రవాణాకు అనుమతులు లభించడం, ఆంక్షలపై స్వల్ఫ ఊరట ద్వారా ఈ సమస్య గట్టెక్కొచ్చని భావిస్తున్నారు. ఫ్రెష్ సరుకు రవాణాకి అంతరాయం ఏర్పడడంతో చాలాచోట్ల కొన్ని ఉత్పత్తుల మీద అవుట్ ఆఫ్ స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. అయితే కొందరు వ్యాపారులు మాత్రం ఎక్స్పెయిర్ అయిన ప్రొడక్టులను అలాగే అమ్మేస్తున్నారు. హోల్సేల్, చిన్ని చిన్న దుకాణాల్లో అయితే అవేం చూడకుండా కొనేస్తున్నారు వినియోగదారులు. కాబట్టి, జాగ్రత్తగా ఉండాలని, ఎక్స్పెయిరీ వగైరా వివరాల్ని ఒకసారి చెక్ చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ-కామర్స్ మినహాయింపు అయితే మెట్రో సిటీ, సిటీ, అర్బన్, టౌన్లలో ఆన్లైన్ షాపింగ్ పెరిగింది. ఈ-కామర్స్, ఆన్లైన్ గ్రాసరీ యాప్ల ద్వారా డోర్ డెలివరీలు నడుస్తున్నాయి. పనిలో పనిగా డెలివరీ ఛార్జీలపై అదనపు బాదుడు స్పష్టంగా కనిపిస్తోంది. ఫిబ్రవరి చివరి దాకా ఇదే పరిస్థితి కొనసాగవచ్చనే అంచనా వేస్తున్నారు. సంబంధిత వార్త: షాపుల ముందు తగ్గుతున్న ‘క్యూ’లు.. జోరందుకున్న ఆన్లైన్ ఆర్డర్లు -
వర్క్ ఫ్రమ్ హోమ్.. ఇక అవసరమైతేనే ఆఫీస్కి!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా కేసులు గణనీయంగా పెరిగిపోతుండడం, కరోనా మూడో ఉధృతి ఖాయమన్న పరిస్థితుల నేపథ్యంలో దేశీయ కంపెనీలు.. అత్యవసర విధానాలను అమలు చేయడంపై దృష్టి మళ్లించాయి. కరోనా కేసులు గతేడాది జూలై నుంచి తగ్గుముఖం పట్టడంతో ఇంటి నుంచే పనిచేసే ఉద్యోగులను (వర్క్ ఫ్రమ్ హోమ్/డబ్ల్యూఎఫ్హెచ్) తిరిగి కార్యాలయాలకు క్రమంగా రప్పించుకునే ప్రణాళికలను అమలు చేస్తున్నాయి. కానీ, ఒక్కసారిగా కరోనా రూపంలో మళ్లీ కేసుల తీవ్రతను చూసిన కంపెనీలు ఉన్న చోట నుంచే సౌకర్యవంతంగా పనిచేసే విధానాలను ఆచరణలో పెడుతున్నాయి. అత్యవసర ప్రయాణాలనే అనుమతిస్తున్నాయి. ఢిల్లీ, ముంబై, కోల్కతా నగరాల్లోని కంపెనీలు గడిచిన కొన్ని నెలల కాలంలో కేసులు తక్కువగా ఉండడంతో హైబ్రిడ్ పని నమూనాను అమలు చేస్తున్నాయి. ఇప్పుడు కేసులు పెరగడం మొదలుకావడంతో తిరిగి పూర్తి స్థాయిలో ఇంటి నుంచి పనివిధానానికి మారిపోవడం లేదంటే కీలకమైన సిబ్బంది వరకే కార్యాలయాలకు వచ్చే విధానాన్ని అనుసరిస్తున్నాయి. అత్యవసరమైతేనే ఆఫీసుకు.. ఐటీసీ గత కొన్ని నెలలుగా గ్రూపు పరిధిలో హైబ్రిడ్ పని నమూనాను అమలు చేస్తోంది. ‘‘అత్యవసరమైన పనుల కోసమే కార్యాలయానికి రండి’’అంటూ తాజాగా ఢిల్లీ ఎన్సీఆర్, కోల్కతా, ముంబైలోని ఉద్యోగులకు సూచనలు జారీ చేసింది. ఇతర పట్టణాలు, కేంద్రాల్లో 30 శాతానికి ఉద్యోగుల హాజరును తగ్గించింది. అంటే ఏకకాలలో 30 శాతం మించి కార్యాలయంలో పని చేయకూడదు. మిగిలిన వారు తామున్న చోట నుంచే పనులను నిర్వహించాల్సి ఉంటుంది. పూర్తి సన్నద్ధత..: కార్యాలయంలో ఉద్యోగుల హాజరు 50 శాతానికి మించకూడదన్న ప్రభుత్వ ప్రొటోకాల్ను అనుసరిస్తున్నట్టు ప్రముఖ ఎఫ్ఎంసీజీ కంపెనీ అదానీ విల్మార్ సీఈవో అంగ్షు మాలిక్ తెలిపారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం తాము మెరుగ్గా సన్నద్ధమై ఉన్నట్టు చెప్పారు. ‘‘గత రెండేళ్లలో సరఫరా చైన్ సవాళ్లను చవిచూసింది. ఆ అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకున్నాం. దీంతో మా ఉత్పత్తులకు ఎటువంటి కొరత ఏర్పడకుండా మిగులు నిల్వలను సిద్ధం చేశాం’’ అని మాలిక్ వివరించారు. గోద్రెజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఈ వారమే తన బృందాలకు ఇంటి నుంచి పని చేయాలని సూచించింది. అంతకుముందు ఈ సంస్థ హైబ్రిడ్ పని నమూనాను (ఇంటి నుంచి, కార్యాలయం నుంచి) అమలు చేసింది. 50% సిబ్బంది ఒక రోజు కార్యాలయానికి వచ్చి, మరుసటి రోజు ఇంటి నుంచి పని చేసేవారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో సేల్స్ విభాగంలో సిబ్బందిని సైతం 100% ఇంటి నుంచి పనిచేసేందుకు అనుమతించింది. ప్రాంతాల వారీగా విధానం.. చెన్నై కేంద్రంగా పనిచేసే శ్రీరామ్ గ్రూపు పరిధిలో 75 శాతం మంది ఉద్యోగులే కార్యాలయానికి వచ్చి పనిచేసే వారు. ఇక నుంచి 50 శాతం మంది ఇంటి నుంచి పనిచేసేందుకు అనుమతించాలని నిర్ణయం తీసుకుంది. ‘‘రాష్ట్రాల వారీగా పని విధానాలను అమలు చేస్తున్నాం. మహారాష్ట్రలో కేసుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో అక్కడ ఎక్కువ మంది ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాం. హైదరాబాద్లో కేసులు తక్కువ ఉండడంతో అక్కడ తక్కువ ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేస్తారు’’ అని శ్రీరామ్ గ్రూపు అధికార ప్రతినిధి తెలిపారు. ఇక ముంబైకు చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్, మహీంద్రా గ్రూపు, టాటా గ్రూపు, ఆదిత్య బిర్లా గ్రూపు తదితర కంపెనీల పరిధిలో కార్యాలయానికి వచ్చి కొద్ది మందే పనిచేస్తున్నారు. ఉద్యోగులకు టీకా క్యాంపులు ‘‘సౌకర్యవంతమైన పని విధానం అమలవుతోంది. నచ్చిన చోట నుంచి ఉద్యోగులు పనిచేయొచ్చు. అదే విధానం కొనసాగుతుంది’’ అని మహీంద్రా గ్రూపు సీనియర్ ఉద్యోగి ఒకరు తెలిపారు. టాటా మోటార్స్ ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేయవచ్చని సూచించింది. కార్యాలయంలో కొద్ది మంది ఉద్యోగులే ఉండేలా రొటేషన్ విధానంలో హైబ్రిడ్ పని విధానాన్ని అమలు చేస్తున్నట్టు టాటా మోటార్స్ అధికార ప్రతినిధి వెల్లడించారు. మారుతి సుజుకీ తన ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి టీకాలు ఇప్పిస్తోంది. బూస్టర్ డోసులను కూడా ఇప్పిస్తున్నట్టు సంస్థ ఎగ్జిక్యూటివ్ రాజేష్ ఉప్పల్ తెలిపారు. స్టార్టప్లు ఉద్యోగుల రక్షణ దిశగా చర్యలు తీసుకుంటున్నాయి. ఓకేక్రెడిట్ అయితే ఉద్యోగులకు హెల్త్ కవరేజీని రూ.10 లక్షలకు పెంచింది. డెస్క్లో పనిచేసే ప్రతి ముగ్గురిలో ఇద్దరికి వర్క్ ఫ్రమ్ హోమ్కు అనుమతించింది. సంబంధిత వార్త: డామిట్.. కంపెనీల కథ అడ్డం తిరిగింది -
కరోనాని ఎదుర్కొనేందుకు అత్యధునిక టెక్నాలజీ
-
భారత్లో థర్డ్వేవ్.. మొదటి వారంలో ఆర్– వాల్యూ 4.. ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు
న్యూఢిల్లీ: దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తున్న వేళ కరోనా వ్యాప్తిపై ఐఐటీ మద్రాస్ తాజాగా అధ్యయనం నిర్వహించింది. కరోనా వ్యాప్తికి సంకేతంగా నిలిచే ఆర్ నాట్ విలువ జనవరి మొదటి వారంలో 4కి చేరుకుందని తాము చేసిన ప్రాథమిక విశ్లేషణలో వెల్లడైందని తెలిపింది. దేశంలో కరోనా థర్డ్ వేవ్ ఫిబ్రవరి 1–15 మధ్య తారాస్థాయికి చేరుకుంటుందని అంచనా వేసింది. వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే సామర్థ్యాన్ని ఆర్ నాట్ వాల్యూ లేదంటే ఆర్ఒ అని పిలుస్తారు. ఈ విలువ ఒకటి కంటే తక్కువగా ఉంటేనే మనం సురక్షితంగా ఉన్నట్టు లెక్క. డెల్టా వేరియెంట్ ప్రబలి కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని అతలాకుతలం చేసిన సమయంలో కూడా ఆర్ నాట్ వాల్యూ 1.69 దాటలేదు. అలాంటిది ఒమిక్రాన్ వేరియెంట్ విజృంభిస్తున్న వేళ డిసెంబర్ 25–31 తేదీల్లో ఆర్ నాట్ వాల్యూ 2.9 ఉంటే, జనవరి 1–6 తేదీల మధ్య అది ఏకంగా 4కి చేరుకోవడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. కంప్యూటేషనల్ మోడల్లో ఐఐటీ మద్రాస్ కరోనాలో ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తిని విశ్లేషించింది. ఈ వివరాలను డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జయంత్ ఝా శనివారం వెల్లడించారు. వైరస్ వ్యాప్తికి గల అవకాశం, కాంటాక్ట్ రేటు, వైరస్ సోకడానికి పట్టే సమయం వంటివన్నీ పరిగణనలోకి తీసుకొని ఆర్ నాట్ వాల్యూని అంచనా వేస్తారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కోవిడ్ ఆంక్షలు అమల్లోకి రావడంతో కాంటాక్ట్ రేటు తగ్గి ఆర్ఒ విలువ తగ్గే అవకాశాలు కూడా ఉంటాయని జయంత్ ఝా చెప్పారు. గత రెండు వారాల్లో కేసులు ప్రబలే తీరుపైనే తాము ప్రాథమికంగా విశ్లేషించామని, కోవిడ్ని అరికట్టడానికి తీసుకునే చర్యలను బట్టి ఆర్ వాల్యూ మారవచ్చునని జయంత్ తెలిపారు. ఫిబ్రవరి 1–15 మధ్య దేశంలో కేసులు ఉధృతరూపం దాలుస్తాయని, గతంలో కుదిపేసిన వేవ్ల కంటే ఈ సారి కేసులు భారీగా పెరుగుతాయని అంచనా వేసినట్టు వివరించారు. 2 కోట్ల మంది బాలలకు మొదటి డోసు టీకా ఈ నెల 3వ తేదీ నుంచి 15–18 ఏళ్ల గ్రూపు బాలబాలికలకు కోసం ప్రారంభించిన కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఇప్పటి వరకు 2 కోట్ల మందికి పైగా టీకా వేసినట్లు కేంద్రం వెల్లడించింది. గత 24 గంటల్లో వేసిన 90,59,360 డోసులతో కలుపుకుని శనివారం రాత్రి 7 గంటల సమయానికి ఇప్పటి వరకు అర్హులందరికీ వేసిన మొత్తం డోసుల సంఖ్య 150.61 కోట్లకు చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ తెలిపారు. దేశంలోని అర్హులైన వారిలో 91% మందికి కనీసం ఒక్క డోసు టీకా అందగా, 66% మందికి టీకా రెండు డోసులూ పూర్తయినట్లు పేర్కొన్నారు. -
ఒమిక్రాన్పై పోరులో సహకరించండి: కేంద్రం విజ్ఞప్తి
న్యూఢిల్లీ: కోవిడ్–19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వల్ల ప్రతికూల ప్రభావాలకు గురయ్యే రంగాలకు చేయూతను అందించాలని ప్రభుత్వ రంగం బ్యాంకులకు (పీఎస్బీ) ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ విజ్ఞప్తి చేశారు. బ్యాంకుల సీఎండీలు, ఎండీలతో ఆమె శుక్రవారం వర్చువల్గా ఒక అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. కోవిడ్–19 ప్రభావాలను ఎదుర్కొనడంలో వారి సన్నద్ధతను సమీక్షించారు. సవాళ్లను ఎదుర్కొనే వ్యవసాయం, రిటైల్, లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ)కు తగిన చేయూతను అందించాలని బ్యాంకర్లకు విజ్ఞప్తి చేశారు. సమావేశానికి సంబంధించి ఆర్థిక శాఖ విడుదల చేసిన ప్రకటనలో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ► మహమ్మారిని ఎదుర్కొనడంలో ప్రభుత్వం, ఆర్బీఐ తీసుకున్న వివిధ చొరవలను అమలు చేయడంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు తీసుకున్న వివిధ చర్యలను ఆర్థికమంత్రి సమీక్షించారు. అలాగే భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనడంలో సన్నద్ధత గురించి చర్చించారు. ► అత్యవసర రుణ హామీ పథకం (ఈసీఎల్జీసీ) వల్ల ఒనగూరిన ప్రయోజనాలను ఆమె ప్రస్తావిస్తూ, అయితే ఈ విజయాలపై ఆధారపడి విశ్రాంతి తీసుకోవడానికి ఇంకా సమయం రాలేదని అన్నారు. కోవిడ్–19 మహమ్మారి నిరంతర దాడి కారణంగా అంతరాయాన్ని ఎదుర్కొంటున్న రంగాలకు మద్దతిచ్చే దిశగా సమష్టి కృషి కొనసాగాలని పిలుపునిచ్చారు. ► అంతర్జాతీయ ప్రతికూలతలు, ఒమిక్రాన్ వ్యాప్తి వంటి అంశాలు ఉన్నప్పటికీ దేశంలో వ్యాపార దృక్పథం క్రమంగా మెరుగుపడుతుందని పేర్కొన్నారు. ► రిటైల్ రంగంలో వృద్ధి, మొత్తం స్థూల ఆర్థిక అవకాశాల మెరుగుదల, రుణగ్రహీతల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడటం వంటి కారణాల నేపథ్యంలో రుణ డిమాండ్ పెరుగుతుందని చెప్పారు. ► 2021 అక్టోబర్లో ప్రారంభించిన క్రెడిట్ అవుట్రీచ్ కార్యక్రమం కింద ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ.61,268 కోట్ల రుణ మంజూరీలు జరిపాయి. ఇక 2020 మేలో ప్రారంభించిన రూ. 4.5 లక్షల కోట్ల రుణ హామీ పథకం ద్వారా నవంబర్ 2021 నాటికి రూ.2.9 లక్షల కోట్ల (కేటాయింపు నిధుల మొత్తంలో 64.4 శాతం) మంజూరీలు జరిగాయి. ప్రత్యేకించి ఎంఎస్ఎంఈ రంగం ఈ పథకం వల్ల ప్రయోజనం పొందిందన్న గణాంకాలు వెలువడుతున్నాయి. ఈ పథకం వల్ల 13.5 లక్షల చిన్న పరిశ్రమలు ప్రయోజనం పొందాయని, రూ.1.8 లక్షల కోట్ల రుణాలు మొండిబకాయిలుగా మారకుండా రక్షణ పొందాయని, దాదాపు ఆరు కోట్ల మంది కుటుంబాలకు జీవనోపాధి లభించిందని ఆర్థికశాఖ పేర్కొంది. ►ఈసీఎల్జీఎస్ వల్ల ఎకానమీకి భారీ ప్రయోజనాలు కలిగినట్లు బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పరిశోధనా నివేదిక తెలిపింది. ఈ పథకం వల్ల దాదాపు 13.5 లక్షల సంస్థలు దివాలా చర్యల నుంచి రక్షణ పొందాయని, ఫలితంగా 1.5 కోట్ల మంది ఉద్యోగాలకు రక్షణ లభించిందని విశ్లేషించింది. ఒక్కొ క్కరి కుటుంబ సభ్యుల సంఖ్య నలుగురిగా భావిస్తే, ఆరు కోట్ల జీవిత అవసరాలకు రుణ హామీ పథకం రక్షణ కల్పించిం దని తెలిపింది. ఈ పథకం వల్ల లబ్ధి పొం దిన రాష్ట్రాల్లో తొలుత గుజరాత్ ఉంది. -
ట్విటర్ ట్రెండ్: డోలో 650 మేనియా
Dolo 650 Twitter Trending: ‘సొంత వైద్యం’.. కరోనా టైంలో ఎక్కువ చర్చకు వచ్చిన అంశం. అయితే ఆరోగ్యానికి అంత మంచిది కాదనే వైద్య నిపుణుల సలహాలను పాటించిన వాళ్లు కొందరైతే.. తమకు తోచింది చేసుకుంటూ పోయినవాళ్లు మరికొందరు!. వాట్సాప్ యూనివర్సిటీ ప్రచారమో, మరేయితర కారణాల వల్లనో ఇంటి వైద్యానికే ఎక్కువ ప్రాధాన్యం లభించింది ఫస్ట్ వేవ్ టైంలో. అదే సమయంలో అల్లోపతి మందులకు ఫుల్ డిమాండ్ నడిచిన విషయమూ చూశాం. మూడో వేవ్ ముప్పు తరుణంలో మళ్లీ ఇప్పుడా పరిస్థితి నెలకొంది. అసలే ఫ్లూ సీజన్. ఆపై కరోనా ఉధృతి. తాజాగా లక్షాయాభై వేలకు కొత్త కేసులు చేరువైన వైనం. కేసులు ఒక్కసారిగా పెరిపోతుండడంతో జనాల్లోనూ ఆందోళన పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో జ్వరం, ఇతర ట్యాబెట్లు, సిరప్ల అమ్మకాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. డోలో మాత్రపై ట్విటర్లో సరదా-సీరియస్ కోణంలో కొనసాగుతున్న ట్రెండ్ ఇందుకు నిదర్శనం. డోలో 650 మేనియా.. అవును ఇప్పుడిది ట్విటర్ను షేక్ చేస్తోంది. ప్రమోషనో లేదంటే ట్విటర్ యూజర్ల అత్యుత్సాహామో తెలియదుగానీ నిన్నటి నుంచి ట్విటర్లో పోస్టులు పడుతూనే ఉన్నాయి. జలుబు, జ్వరం, గొంతు నొప్పి, దగ్గు, ఒళ్లు నొప్పులు.. ఎలాంటి లక్షణం కనిపించినా డోలో మాత్ర వేసుకుంటే సరిపోతుందని భ్రమలో మునిగిపోయారు చాలామంది. కొవిడ్ టెస్టులకువెళ్లకుండానే ఈ మాత్రతో తగ్గిపోతుందనే ఉద్దేశంతో ఏదో చాక్లెట్ చప్పరించినట్లు డోలో మాత్రల్ని వేసుకుంటున్నారు. దీనిపై సోషల్ మీడియా రెండుగా విడిపోయింది. విచ్చిల విడిగా వాడడం మంచిదికాదని.. వాడితే తగ్గిపోతుందని ఎవరికి తోచిన ట్వీట్లు వాళ్లు చేసుకున్నారు. ఈ దెబ్బతో ట్విటర్ టాప్ ట్రెండింగ్లో #Dolo650 నడుస్తోంది. అందులో కొన్ని పోస్టులు.. Every Indian during Covid 3rd wave👇😂 Taking Dolo 650#Dolo650 pic.twitter.com/ygNploDihV — சிட்டுகுருவி (@save_sparrow2) January 7, 2022 Dolo 650 has become a joke in this country. I see random people behaving like medical experts & popping pills of Dolo 650 like vitamin tablets. Understand. Medicines have a composition & dosage for a reason. Consult a doctor, before becoming a pseudo doctor yourself.🤦🏻♀️#COVID19 — Santwona Patnaik (@SantwonaPatnaik) January 8, 2022 Indian patient when the doctor doesn't prescribe Dolo 650 😂🤣😂#dolo650 pic.twitter.com/QCFMdA9q0V — JITESH JAIN (@Jitesh_Jain) January 8, 2022 I don't no about theories, but it has zero side effects and cure 100%. Biggest medical Mafia is going on be careful my friend. It's time help people. Homeopathy will cure from roots. And You should have a good doctor. Do you know how paracitamol or dolo 650 damage liver ? — Dr.Venkat (@KiteTrades) January 8, 2022 When chemist gives only one Dolo 650.... Indian nibba : pic.twitter.com/zeRC53hDei — Arush Chaudhary (@ArushGzp) January 7, 2022 ప్రొడక్షన్ పెరిగింది ఫ్లూ సీజన్లో సాధారణంగా ట్యాబెట్లు వాడే జనం, కరోనా ఫియర్తో ఈసారి అడ్డగోలుగా మందుల్ని వేసుకుంటున్నారు. కరోనా ఫస్ట్ వేవ్ టైంలో జ్వరం, గొంతు ఇన్ఫెక్షన్ మాత్రలకు ఫుల్ గిరాకీ నడిచిన విషయం తెలిసిందే. అయితే రెండో వేవ్ సమయానికి వ్యాక్సిన్ రావడంతో ఆ వ్యవహారం కొద్దిగా తగ్గిపోయింది. ఇప్పుడు వ్యాక్సినేషన్ పూర్తైనా కరోనా బారిన పడుతున్నారనే అంశం కలవరపాటుకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో మళ్లీ పాత చిట్కాలను పాటించడంతో పాటు మెడిసిన్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. పెరిగిన ఈ డిమాండ్ను పసిగట్టి మరోవైపు మందుల కంపెనీలు సైతం ప్రొడక్షన్ను పెంచుతున్నాయి. "Dolo 650" i.e. acetaminophen/ paracetamol. Liver injury induced by paracetamol. .. pic.twitter.com/IqXfUiwBYI — Amit 🗨️ (@newindia_in) January 8, 2022 వైద్యుల కీలక ప్రకటన అయితే ‘అన్నింటికి ఒకే మందు’ అంటూ సోషల్ మీడియాలో సాగుతున్న ఈ వ్యవహారాన్ని వైద్యులు సీరియస్గా తీసుకుంటున్నారు. ఏ మందు అయినా అవసరం ఉన్నప్పుడు.. అవసరం మేరకే వాడాలి. అంతేకానీ ముందు జాగ్రత్త, సొంత ట్రీట్మెంట్ పేరుతో వాడితే సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పైగా అవసరం లేకున్నా వాడడం వల్ల బాడీలో ‘డ్రగ్ రెసిస్టెన్స్’ పెరిగి.. అవసరమైనప్పుడు మందులు పనిచేయకుండా పోతాయని చెప్తున్నారు. ►ఒమిక్రాన్కానీ, ఇంకేదైనా వేరియెంట్గానీ కరోనా వైరస్ను తేలికగా తీసుకోవద్దు. ►కరోనా అవునో కాదో తెలియకుండా ట్యాబ్లెట్లు వేసుకోవడం మంచిదికాదు. ►ఎవరో ఒకరిద్దరికి తగ్గిందనే భ్రమతో వైద్యుల పర్యవేక్షణ లేకుండా మందులు వాడడం ప్రాణాల మీదకు తెస్తుంది. ►సోషల్ మీడియా ప్రచారాన్ని అస్సలు నమ్మొద్దు.. వైద్యులను నమ్మండి ►లక్షణాలు కనిపిస్తే అప్రమత్తంగా కావాలి. జాగ్రత్తలు పాటించాలి. ఆకలి లేకపోవడం, ఛాతీ నొప్పి, ఊపిరి తీసుకోవడం లాంటి లక్షణాలు కనిపిస్తే టెస్టులు చేయించుకోవడం, ఆసుపత్రికి వెళ్లడం లేదంటే డాక్టర్ సలహాను తీసుకోవడం మంచిది. ►కరోనా సోకినా భయపడాల్సిన అవసరం లేదు. చికిత్సకు మనోధైర్యం తోడైతే కొవిడ్-19 వ్యాధిని అధిగమించొచ్చు. ►అవసరమైతే టెలికాన్సల్టేషన్ ద్వారా కూడా డాక్టర్ను సంప్రదించొచ్చు. ►టీకాలతో ఏం ఒరగట్లేదనే ఆలోచన మంచిది కాదు. అవి వ్యాధులనుంచి రక్షణ కలిగిస్తాయి. రోగ నిరోధకశక్తిపై దీర్ఘకాలం పనిచేస్తాయి. కాబట్టి, వ్యాక్సినేషన్కు దూరంగా ఉండకూడదు. ►అనుమానంతో పదేపదే కరోనా టెస్టులు చేయించుకుంటూ ఇబ్బంది పడొద్దు. కుటుంబ సభ్యులను కూడా ఇబ్బందులకు గురిచేయొద్దు. ►అన్నింటికి మించి మాస్క్లు ధరించడం, భౌతిక దూరం పాటించడం, శుభ్రత తదితర జాగ్రత్తలతో కరోనాను జయించొచ్చు. -
థర్డ్వేవ్ ముంగిట!.. ఊపందుకున్న ఈ-కామర్స్
లక్ష కొత్త కేసుల నమోదుతో భారత్ కరోనా మూడో వేవ్లోకి ప్రవేశించిందన్న సంకేతాలు మొదలయ్యాయి. భారీగా పెరిగిపోతున్న కేసులు.. మరోవైపు ఒమిక్రాన్ భయాందోళనలు, టైం పరిమితుల నడుమ ఫిజికల్ స్టోర్ల ముందు క్యూ కట్టే జనం తగ్గిపోతున్నారు. ఈ క్రమంలో ఈ-కామర్స్ వెబ్సైట్లలో అమ్మకాలు జోరందుకున్నాయి. ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్లో నిత్యావసరాల అమ్మకాలు గత వారం రోజులుగా జోరుగా నడుస్తున్నాయి. కొత్త సంవత్సరం మొదటి రోజు నుంచే ఒమిక్రాన్ ఫియర్తో పాటు ప్రభుత్వ ఆంక్షలు, వారాంతపు కర్ఫ్యూ-లాక్డౌన్ల నేపథ్యంలో ప్రజలు షాపుల ముందు క్యూ కట్టేందుకు ఆసక్తి చూపించడం లేదు. ఈ క్రమంలో నిత్యావసరాలు, ప్యాకేజ్డ్ ఫుడ్, సబ్బుల ఇతరత్రాల అమ్మకాలు ఆన్లైన్ ఆర్డర్ల రూపంలో పెరిగిపోతున్నాయి. మరోసారి ప్రభుత్వాల ఆంక్షలతో ఫిజికల్ ఎకానమీ యాక్టివిటీకి అవాంతరం ఎదురుకాగా.. ఈ నష్టాన్ని భర్తీ చేసేందుకు మళ్లీ ఈ-కామర్స్ ఛానెల్స్ ముందుకు వచ్చాయి. అమెజాన్ ఇండియాతో పాటు బిగ్బాస్కెట్, బ్లింకిట్, స్విగ్గీ ఇన్స్టామార్ట్లలో డిమాండ్ ఇప్పటికే మొదలైంది. కర్ఫ్యూ, లాక్డౌన్ విధించే ఆస్కారం ఉందన్న అనుమానంతో నిల్వలకు సిద్ధపడుతున్నారు మరికొందరు. గత వారంలోనే 10 నుంచి 15 శాతం పెరుగుదల కనిపిస్తోందని ఆయా ప్లాట్ఫామ్స్ ప్రకటించుకున్నాయి. ఇక ఈ వారం వ్యవధిలో దేశవ్యాప్తంగా ఆన్లైన్లో ఎక్కువగా డిమాండ్ ఉంటున్న ఉత్పత్తులు చాక్లెట్, శీతల పానీయాలకు సంబంధించినవి కావడం విశేషం. హైజీన్ ఉత్పత్తులు కూడా రెండో వేవ్ ఉధృతి తగ్గాక ఊసే లేకుండా పోయిన హైజీన్ ఉత్పత్తులకు మళ్లీ టైం మొదలైంది. శానిటైజర్లు, హ్యాండ్ వాష్లు, క్లీనింగ్ లిక్విడ్స్, డిస్ఇన్ఫెక్టెడ్ సొల్యూషన్స్, ఎన్95 మాస్కులు, ఇతర మాస్కులకు డిమాండ్ మొదలైంది. ఒమిక్రాన్ ఎఫెక్ట్తోనే ఈ ఊపు వస్తోందని తయారీ కంపెనీలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో డిమాండ్కు తగ్గట్లు సప్లయి కోసం ప్రయత్నాలు ప్రారంభించాయి. మెట్రో సిటీ, సిటీ, టౌన్లలో ఆన్లైన్ ఆర్డర్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాలను, ప్రజల ఆర్థిక స్థితిగతులను పరిగణనలోకి తీసుకోకుండా ఈ నివేదికను ఈ-కామర్స్ పోర్టల్స్ వెల్లడించాయని గమనించగలరు. -
ఎకానమీపై ‘థర్డ్వేవ్’ ఎఫెక్ట్.. వృద్ధికి గొడ్డలిపెట్టు
ముంబై: భారత్ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) వృద్ధి రేటులో 10 బేసిస్ పాయింట్ల మేర (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) ఒమిక్రాన్ వల్ల హరించుకునిపోయే అవకాశం ఉందని దేశీయ రేటింగ్ ఏజెన్సీ ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ అంచనా వేసింది. జనవరి–మార్చి మధ్య ఈ ప్రతికూలత 0.40 శాతం మేర ఉండే వీలుందని పేర్కొంది. క్యూ4కు సంబంధించి ఇక్రా రేటింగ్స్ అంచనాలకు అనుగుణంగా ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ అంచనాలు ఉండడం గమనార్హం. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అంచనాలు ఈ విషయంలో 0.3 శాతంగా ఉంది. ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ నివేదికలో ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. - మార్కెట్, మార్కెట్ కాంప్లెక్స్ల సామర్థ్యాన్ని తగ్గించడం, రవాణా, ప్రయాణ ఆంక్షలు, రాత్రి–వారాంతపు కర్ఫ్యూలు వంటి వివిధ రూపాల్లో నియంత్రణలు ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ప్రారంభమయ్యాయి. ఇవి ఆర్థిక కార్యకలాపాలను ప్రభావితం చేస్తున్నాయి. - క్యూ4లో తొలి అంచనాలు 6.1 శాతంకాగా, దీనిని 40 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నాం. దీనితో జనవరి–మార్చి త్రైమాసికంలో వృద్ది 5.7 శాతానికి పరిమితం కానుంది. ఇక 2 0 2 1–22 ఆర్థిక సంవత్సరం జీడీపీ అంచనాలను 9.4 శాతం నుంచి 9.3 శాతానికి తగ్గిస్తున్నాం. - కొత్త కేసుల్లో ఎక్కువ భాగం కరోనావైరస్ ఒమిక్రాన్ వేరియంట్గా అనుమానాలు ఉన్నాయి. ఇది వేగంగా వ్యాప్తి చెందుతుందన్న ఆందోళనలు ఉన్నాయి. - అయితే ప్రభుత్వాలు, వ్యాపార సంస్థల ముందస్తు చర్యలు, వ్యాక్సినేషన్ వంటి అంశాల నేపథ్యంలో మొదటి రెండు వేవ్లంత తీవ్రత మూడవ వేవ్లో ఉండదని భావిస్తున్నాం. బ్యాంకుల రుణ నాణ్యతకు దెబ్బ! - రేటింగ్ ఏజెన్సీ ఇక్రా విశ్లేషణ - పునర్ వ్యవస్థీకరించిన రుణాలపై ప్రభావం తీవ్రమని అంచనా బ్యాంకుల రుణ నాణ్యతపై కోవిడ్–19 థర్డ్వేవ్ ప్రతికూల ప్రభావం పడనుందని దేశీయ రేటింగ్ ఏజెన్సీ– ఇక్రా తన తాజా నివేదికలో పేర్కొంది. ప్రత్యేకించి ఇప్పటికే పునర్వ్యవస్థీకరించిన రుణాలపై ఈ ప్రభావం అధికంగా ఉంటుందని విశ్లేషించింది. నివేదికలోని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. మొండిబకాయిలతోపాటు కరోనా వైరస్ ఒమిక్రాన్ వేరియంట్ వల్ల కలిగే ఇబ్బందుల కారణంగా రుణదాతలు లాభదాయకత, దివాలా సంబంధిత సవాళ్లను ఎదుర్కొనాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతోంది. రుణ పునర్ వ్యవస్థీకరణలకు దరఖాస్తులు తక్షణం పరిణామాల ప్రాతిపదిక చూస్తే, 15 నుంచి 20 బేసిస్ పాయింట్ల మేర (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) పెరిగే అవకాశం ఉంది. బ్యాంకులు 12 నెలల వరకు మారటోరియంతో చాలా వరకూ రుణాలను పునర్వ్యవస్థీకరించాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుత మారటోరియం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ4 (జనవరి–మార్చి) నుంచి 2022–23 మొదటి త్రైమాసికం (ఏప్రిల్–జూన్) వరకూ కొనసాగే వీలుంది. మహమ్మారి రెండు వేవ్ల సమయంలో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రుణగ్రహీతలకు, బ్యాంకులకు ఉపశమనం కలిగించడానికి రిజల్యూషన్ ఫ్రేమ్వర్క్ 1.0, 2.0లను ప్రకటించింది. కోవిడ్ 2.0 పథకం కింద పెరిగిన రుణ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో 2021 సెప్టెంబర్ 30 నాటికి బ్యాంకుల మొత్తం స్టాండర్డ్ రీస్ట్రక్చర్డ్ లోన్ బుక్ స్టాండర్డ్ అడ్వాన్స్లో (రుణాల్లో) 2.9 శాతానికి పెరిగింది. 2021 జూన్ 30 నాటికి ఇది కేవలం 2 శాతం మాత్రమే కావడం గమనార్హం. తాజా పునర్వ్యవస్థీకరణల అవకాశాల నేపథ్యంలో మొత్తం స్టాండర్డ్ రీస్ట్రక్చర్డ్ లోన్ బుక్ స్టాండర్డ్ రుణాల్లో మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్బీఐ ద్రవ్య విధానం మరికొంత కాలం ఇంతే.! - సాధారణ స్థితికి వెంటనే తీసుకురాకపోవచ్చు - కరోనా ఒమిక్రాన్తో ఆంక్షల వల్ల అనిశ్చితి - ఆర్థికవేత్తల అంచనా కరోనా మహమ్మారి ప్రవేశించిన తర్వాత ఆర్బీఐ ద్రవ్యపరపతి విధానాన్ని ఎంతో సులభతరం చేసి, వ్యవస్థలో లిక్విడిటీ పెంపునకు చర్యలు తీసుకుంది. వృద్ధికి మద్దతే తమ మొదటి ప్రాధాన్యమని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ఇప్పటి వరకు చెబుతూ వస్తున్నారు. గత ఆరు నెలల్లో ఆర్థిక పరిస్థితులు పుంజకుంటూ ఉండడం, అంతర్జాతీయంగానూ ఫెడ్, యూరోపియన్ బ్యాంకు తదితర సెంట్రల్ బ్యాంకులు సులభ ద్రవ్య విధానాలను కఠినతరం చేసే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ క్రమంలో ఆర్బీఐ కూడా తన విధానాన్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకువస్తుందన్న అంచనాలున్నాయి. కానీ, కరోనా ఒమిక్రాన్ రూపంలో మరో విడత విజృంభిస్తుండడం, లాక్డౌన్లు, పలు రాష్ట్రాల్లో ఆంక్షల అమలు వృద్ధిపై ప్రభావం చూపుతాయి. ఈ నేపథ్యంలో వృద్ధికి ప్రాధాన్యం ఇచ్చే ఆర్బీఐ పాలసీ సాధారణీకరణను ఇప్పుడప్పుడే చేపట్టకపోవచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు 50,000ను దాటిపోవడం తెలిసిందే. ఆర్బీఐ సమీప కాలంలో ద్రవ్య విధానాన్ని సాధారణ స్థితికి తీసుకురాకపోవచ్చని హెచ్డీఎఫ్సీ బ్యాంకు ముఖ్య ఆర్థికవేత్త అభిషేక్ బారువా అన్నారు. కనీసం ఫిబ్రవరి సమీక్ష వరకైనా ఇది ఉండకపోవచ్చన్నారు. వృద్ధిపై ప్రభావం పడుతుంది కనుక కీలక రేట్ల పెంపుపై అనిశ్చితి నెలకొందన్నారు. ‘‘ఒమిక్రాన్ కారణంగా ఏర్పడే రిస్క్ల నేపథ్యంలో సమీప కాలానికి అనిశ్చితి కొనసాగుతుంది. కనుక ఆర్బీఐ ఎంపీసీ వేచి చూసే విధానాన్ని అనుసరించొచ్చు’’ అని యూబీఎస్ సెక్యూరిటీస్ ముఖ్య ఆర్థికవేత్త తన్వీ గుప్తాజైన్ పేర్కొన్నారు. పెరిగే రిస్క్లు వృద్ధి అవకాశాలను బలహీనపరుస్తాయని, దీంతో ఆర్బీఐ యథాతథ స్థితినే కొనసాగించొచ్చని ఇక్రా రేటింగ్స్ ముఖ్య ఆర్థికవేత్త అదితి నాయర్ అభిప్రాయపడ్డారు. జనవరి–మార్చి త్రైమాసికంలో వృద్ధి అంచనాలను 0.40 శాతం తగ్గిస్తున్నట్టు (4.5–5శాతం) చెప్పారు. పూర్తి ఆర్థిక సంవత్సరానికి 9 శాతం వృద్ధి రేటునే ఇక్రా కొనసాగించింది. కేంద్రం, రాష్ట్రాల సమన్వయ చర్యలు అవసరం - సీఐఐ సూచన కరోనా ఒమిక్రాన్ రకంతో సాధారణ వ్యాపార కార్యకలాపాలకు విఘాతం కలుగుతుందన్న ఆందోళనల నేపథ్యంలో.. కేంద్రం, రాష్ట్రాలు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని సీఐఐ కేంద్రానికి సూచించింది. ‘‘ఒమిక్రాన్పై కచ్చితంగానే ఆందోళన ఉంది. అయితే, ఇది వేగంగా విస్తరిస్తున్నా కానీ, ఆరోగ్యంపై ప్రభావం స్వల్పంగానే ఉంటున్న అభిప్రాయం ఉంది’’అని సీఐఐ అధ్యక్షుడు టీవీ నరేంద్రన్ పేర్కొన్నారు. కనుక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమష్టి చర్యలతో కరోనా వైరస్ మూడో విడత ప్రభావాన్ని తగ్గించొచ్చని అభిప్రాయపడ్డారు. మొత్తం మీద 2021లో చాలా రంగాలు కోలుకున్నట్టు ఆయన చెప్పారు. ఆతిథ్యం, ప్రయాణం, ఎంఎస్ఎంఈ, కొన్ని సేవల రంగాలు వైరస్ రెండు విడతలతో తీవ్రంగా ప్రభావితమైనట్టు పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ 9.5 శాతం మేర వృద్ధి సాధిస్తుందని, తదుపరి ఆర్థిక సంవత్సరంలో 8.5 శాతం నమోదు కావచ్చన్నారు. సాగుచట్టాలను కేంద్రం వెనక్కి తీసుకోవడంపై ఎదురైన ప్రశ్నకు నరేంద్రన్ స్పందిస్తూ.. కొన్ని సమయాల్లో కొద్ది కాలం పాటు విరామం ప్రకటించాల్సి రావచ్చని, ప్రభుత్వ చర్య కూడా ఇదే అయి ఉండొచ్చన్నారు. మొత్తం మీద సంస్కరణల విషయంలో ప్రభుత్వం సానుకూలంగానే ఉన్నట్టు అభిప్రాయపడ్డారు. చదవండి:ఓమిక్రాన్ దెబ్బతో జీడీపీ ఢమాల్..? -
హోం క్వారంటైన్ ఇక ఏడు రోజులే
న్యూఢిల్లీ: కరోనా ఒమిక్రాన్ వేరియెంట్ కేసులు విస్తృతంగా వ్యాపిస్తూ థర్డ్ వేవ్ ముంచుకొస్తున్న నేపథ్యంలో హోం క్వారంటైన్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ వేరియెంట్ ప్రమాదకారి కాకపోవడంతో హోం క్వారంటైన్ వ్యవధిని 10 రోజుల నుంచి ఏడు రోజులకు తగ్గించింది. కోవిడ్–19 స్వల్ప లక్షణాలు కలిగిన వారు, ఏ లక్షణాలు లేకుండా పాజిటివ్ వచ్చిన వారికి హోం క్వారంటైన్ కాల పరిమితిని తగ్గిస్తూ బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిన దగ్గర్నుంచి ఏడు రోజులు ఐసోలేషన్లో ఉంటే సరిపోతుందని స్పష్టం చేసింది. ప్రజలెవరూ సొంత వైద్యం చేసుకోవద్దని సూచించింది. వైద్యుడిని సంప్రదించకుండా సీటీ స్కాన్, ఎక్స్రేలు, రక్త పరీక్షలు చేయించుకోవద్దని హితవు చెప్పింది. వైద్యులు చెప్పకుండా సొంతంగా స్టెరాయిడ్స్ వంటివి తీసుకుంటే ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరించింది. ► ఎవరికైనా కరోనా పాజిటివ్గా నిర్ధారణై స్వల్ప లక్షణాలు, లేదంటే అసలు లక్షణాలు లేకపోతే వారు హోం క్వారంటైన్ ఉంటే సరిపోతుంది. ► కరోనా సోకిన తర్వాత వరుసగా మూడు రోజులు జ్వరం రాకపోతే మాస్కులు ధరించి వారు బయట తిరగవచ్చు. ► స్వల్ప లక్షణాలున్న వారు హోం క్వారంటైన్ ముగిసిన తర్వాత తిరిగి కరోనా పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం లేదు. కోవిడ్–19 నెగెటివ్గానే వారిని పరిగణిస్తారు. ► 60 ఏళ్ల వయసు పైబడి గుండె, కిడ్నీ వంటి వ్యాధులున్న వారు వైద్యుల పర్యవేక్షణలో హోం క్వారంటైన్లో ఉండాలి. ► హెచ్ఐవీ, కేన్సర్ రోగులు మాత్రం కరోనా సోకిన వెంటనే ఆస్పత్రిలో చేరాలి ► జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు హోం క్వారంటైన్ కేసుల్ని పర్యవేక్షించాలి. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనికి బాధ్యత వహించాలి. ► క్షేత్ర స్థాయిలో ఎఎన్ఎం, శానిటరీ ఇన్స్పెక్టర్, మల్టీపర్పస్ హెల్త్వర్కర్తో కూడిన కోవిడ్ బృందాలు హోం క్వారంటైన్ రోగుల్ని పర్యవేక్షిస్తూ ఉండాలి. ► రాష్ట్ర ప్రభుత్వాల విధానాల ఆధారంగా ఈ బృందాలు రోగులకు కరోనా కిట్లను అందించాలి. డేంజర్ బెల్స్ భారత్లో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయని కేంద్రం తెలిపింది. వైరస్ వ్యాప్తిని సూచించే ఆర్–వాల్యూ ప్రస్తుతం ఏకంగా 2.69కు చేరింది. డెల్టా వేరియెంట్ కారణంగా సెకండ్ వేవ్ అత్యంత ఉధృతంగా ఉన్నపుడు సైతం గరిష్ట ఆర్– వాల్యూ 1.69 శాతమేనని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరాం భార్గవ తెలిపారు. నగరాల్లో వ్యాప్తి ఎక్కువగా ఉందని, ఒమిక్రానే ప్రధాన వేరియెంట్గా అవతరించిందని పేర్కొన్నారు. ప్రజలు పెద్ద సంఖ్యలో గుమిగూడటాన్ని నివారించాలన్నారు. -
థర్డ్వేవ్ వచ్చేసినట్లే.. హెల్త్ మినిస్టర్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, శివాజీనగర(కర్ణాటక): ప్రజలు ఏదైతే జరగకూడదని కోరుకున్నారో అదే జరుగుతోంది. ఆరోగ్యమంత్రి మాటలే అందుకు నిదర్శనం. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ రేటును గమనిస్తే థర్డ్ వేవ్ వచ్చినట్లు ఖరారైందని ఆరోగ్య శాఖ మంత్రి కే.సుధాకర్ అన్నారు. గత ఆరు నెలల నుంచి పాజిటివ్ రేటు 0.1 శాతం కూడా లేదని, ప్రస్తుతం 1.06 శాతానికి పెరిగిందని, అంటే మూడో దశ ఆరంభమైనట్లు అర్థమని తెలిపారు. మంగళవారం బెంగళూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఒమిక్రాన్ రోజు రోజుకు పెరుగుతోంది, సోమవారం ఒకే రోజు 1.06 శాతానికి చేరింది, బెంగళూరులో అధికంగా సోకితులు ఉన్నారని చెప్పారు. బెంగళూరులో మైక్రో కంటైన్మెంట్లు? బెంగళూరులో కేసులు వచ్చినచోట మైక్రో కంటోన్మెంట్ జోన్ చేయడంపై సీఎంతో చర్చించనున్నట్లు తెలిపారు. బెంగళూరు ఇప్పటికే రెడ్ జోన్లో ఉండగా, కొన్ని కఠిన నిర్ణయాలు అవసరమన్నారు. సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని, ప్రజల బతుకులను యథాస్థితికి తెచ్చేలా కరోనాను నియంత్రించడం పెద్ద సవాల్గా మారిందని వాపోయారు. బెంగళూరుకు అధికంగా విదేశీయులు వస్తున్నారు. అందుచేత వైరస్ అతి వేగంగా విస్తరిస్తోందన్నారు. జనవరి 15 తరువాత మూడో అల రావచ్చని అనుకుంటే అంతకంటే ముందుగానే వచ్చేసిందని మంత్రి అన్నారు. కాంగ్రెస్నేతలు మేకెదాటు పాదయాత్రను విరమించుకోవాలని కోరారు. -
వేల సంఖ్యలో కేసులు.. భారత్లో మొదలైన కరోనా థర్డ్వేవ్?
సాక్షి, న్యూఢిల్లీ: భారత్లో కోవిడ్ మహమ్మారి మరోసారి గుబులు పుట్టిస్తోంది. రోజూ వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ప్రధాన నగరాల్లో విచ్ఛలవిడిగా ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతోంది. గతవారం రోజుల్లో కేసుల్లో భారీ పెరుగుదల.. దేశంలో థర్డ్ వేవ్ను సూచిస్తోందని కోవిడ్ టాస్క్ఫోర్స్ ఛైర్మన్ డాక్టర్ ఎన్కే అరోరా పేర్కొన్నారు. అయితే, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని తెలిపారు. అది మాత్రం మరువొద్దు దక్షిణాఫ్రికా తరహాలోనే భారత్లో మూడోవేవ్ ఉద్ధృతి ఉండవచ్చని డాక్టర్ అరోరా అంచనా వేశారు. గత పదిరోజుల్లో ఇన్ఫెక్షన్ ప్రవర్తనను చూస్తుంటే త్వరలోనే మూడో ముప్పు గరిష్ఠానికి చేరుకుంటుందని భావిస్తున్నామన్నారు. సౌతాఫ్రికాలో రెండు వారాలకే కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిన విషయాన్ని డాక్టర్ అరోరా ఈ సందర్భంగా గుర్తుచేశారు. అయితే, వ్యాధి తీవ్రత, ఆస్పత్రి బారినపడకుండా రక్షణ పొందాలంటే రెండు డోసుల వ్యాక్సినేషన్ తీసుకోవాలని ఆయన స్పష్టంచేశారు. వీటితోపాటు కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. (చదవండి: కేంద్రమంత్రి మహేంద్ర నాథ్ పాండేకు కరోనా) రెండు వారాల్లోనే భారీ విస్తరణ డిసెంబర్ తొలివారంలో దేశంలో ఒమిక్రాన్ తొలి కేసును గుర్తించగా.. రెండు వారాల్లోనే 23రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కొత్త వేరియంట్ విస్తరించింది. ఇప్పటివరకు 1892 కేసులు వెలుగుచూశాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 568 కేసులు రికార్డ్ అవ్వగా.. ఢిల్లీలో 382, కేరళలో 185, రాజస్థాన్లో 174, గుజరాత్ 152, తమిళనాడు 121 కేసులు నమోదయ్యాయి. ఇక గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 37,379 కరోనా కేసులు నమోదుకాగా.. యాక్టివ్ కేసుల సంఖ్య లక్షా 72వేలకు పెరిగినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం నాటి బులెటిన్లో పేర్కొంది. (చదవండి: ఒమిక్రాన్ సాధారణ జ్వరం మాత్రమే: యోగి ) -
కరోనా మూడో ముప్పు
-
రాష్ట్రంలో థర్డ్ వేవ్.. వెల్లడించిన మధ్యప్రదేశ్ సీఎం
భోపాల్: దేశవ్యాప్తంగా కరోనా వైరస్, కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. మధ్యప్రదేశ్లో కరోనా కేసుల పెరుగుతున్న కమ్రంలో.. రాష్ట్రంలో కోవిడ్ థర్డ్వేవ్ వచ్చిందని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. భారీగా కోవిడ్ పాజిటివ్ కేసులు పెరిగితే.. కరోనా థర్డ్ వేవ్ ఎదుర్కొక తప్పదని ఇప్పటికే నిపుణులు హెచ్చిరించిన విషయం తెలిసిందే. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొక తప్పదని సీఎం అన్నారు. ప్రజల భాగస్వామ్యంతో కరోనాపై పోరాడాగలమని శివరాజ్ సింగ్ చెప్పారు. ప్రభుత్వం కరోనా నియంత్రణకు అన్ని చర్యలు చేపడుతుందని, ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. భోపాల్, ఇండోర్ నగరాల్లో ఆంక్షలు కఠినంగా అమలు చేస్తున్నామని తెలిపారు. మరోవైపు గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 124 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన నగరమైన ఇండోర్లో 62 కేసులు, భోపాల్లో 27 కేసులు నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు. -
కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న మహమ్మారి
-
కోవిడ్ బాధితులకు స్వల్ప లక్షణాలే ఉంటున్నాయి: అరవింద్ కేజ్రీవాల్
-
భారత్లో కోవిడ్ థర్డ్వేవ్.. ఫిబ్రవరిలో విజృంభణ!
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్ థర్డ్వేవ్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పతాక స్థాయికి చేరవచ్చని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) కాన్పూర్ పరిశోధకులు చేపట్టిన ఓ ముందస్తు అధ్యయనంలో తేలింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా పెరుగుతున్న కోవిడ్ కేసుల తీరు ప్రాతిపదికగా ఈ అంచనాకు వచ్చినట్లు తెలిపింది. గౌసియన్ మిక్సర్ మోడల్ అనే టూల్ను ఉపయోగించి చేపట్టిన ఈ అధ్యయనాన్ని పూర్తిస్థాయిలో పరిశీలించాల్సి ఉందని స్పష్టం చేసింది. ఇప్పటికే థర్డ్వేవ్తో సతమతమవుతున్న అమెరికా, బ్రిటన్, జర్మనీ, రష్యాల్లో నమోదైన రోజువారీ కేసుల డేటాను ఉపయోగించుకుంటూ దేశంలో థర్డ్వేవ్ ప్రభావంపై ఈ అంచనాకు వచ్చినట్లు చెప్పింది. దేశంలో థర్డ్వేవ్లో డిసెంబర్ 15వ తేదీకి అటూఇటుగా కరోనా కేసుల్లో పెరుగుదల నమోదు చోటుచేసుకోగా 2022 ఫిబ్రవరి 3వ తేదీకల్లా ఇది తీవ్ర స్థాయికి చేరుకోనుంది’ అని ఆ అధ్యయనం పేర్కొంది. అయితే, వ్యాక్సినేషన్ డేటాను పరిగణనలోకి తీసుకోనందున అప్పటికి కేసుల్లో పెరుగుదల ఏ మేరకు ఉంటుందో కచ్చితంగా చెప్పలేమని కూడా స్పష్టం చేసింది. -
Covid Alert: 70 రెట్లు వేగంతో వ్యాపిస్తున్న ఒమిక్రాన్! నిపుణుల హెచ్చరికలు..
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా దాదాపు 90 దేశాల్లో ఒమిక్రాన్ ఉధృతి కొనసాగుతోంది. ఏడాది ప్రారంభంలో గరిష్ఠ స్థాయిలో మారణహోమాన్ని రగిలించిన కోవిడ్ రెండో వేరియంట్ డెల్టాప్లస్ కంటే కూడా ఒమిక్రాన్ ఇన్ఫెక్షన్ శర వేగంగా విస్తరిస్తోంది. ఐతే తాజా అధ్యయనాల ప్రకారం త్వరలో దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతాయని, వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి మూడో వేవ్ తాకే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే దేశం మొత్తంలో 200 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఐతే డెల్టా ప్లస్ కంటే ఒమిక్రాన్ 70 రెట్లు వేగంగా వ్యాపిస్తుందని యూనివర్సిటీ ఆఫ్ హాంగ్ కాంగ్ అధ్యయన నివేదిక వెల్లడించింది. అంతేకాదు రోగనిరోధక వ్యవస్థపై దాడిచేసి పతనంచేస్తుందని, రానున్న కాలంలో మరిన్ని వేరియంట్లు ఉద్భవించే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఇప్పటివరకూ వెలుగుచూసిన ఒమిక్రాన్ కేసుల్లో గొంతు నొప్పి, అలసట వంటి తేలికపాటి లక్షణాలు మాత్రమే బయటపడ్డాయి. ఇంట్లోనే తగు జాగ్రత్తలతో కోలుకుంటున్నారు కూడా. దేశంలో ఇప్పటివరకూ ఒక్క ఒమిక్రాన్ మృతి నమోదవ్వనప్పటికీ, అమెరికాలో తొలి ఒమిక్రాన్ మరణం సంభవించడంతో యావత్ ప్రపంచం భయాందోళనల్లో ఊగిసలాడుతోంది. చదవండి: ఈ దగ్గుమందు చాలా ప్రమాదకరమైనది, పిల్లలందుకే మృతి చెందారు: డీజీహెచ్ఎస్ -
Omicron Variant: ప్రస్తుతానికి.. ఒమిక్రాన్తో ముప్పు లేదు
న్యూఢిల్లీ: ఒమిక్రాన్ రూపాంతరితం దేశంలోకి కూడా ప్రవేశించడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఈ వైరస్తో ఇక థర్డ్ వేవ్ తప్పదేమోనన్న భయాలు పెరిగిపోతున్నాయి. అయితే కేంద్ర ఆరోగ్య శాఖ ఈ వేరియెంట్తో ప్రస్తుతానికి మాత్రం ముప్పు లేదని చెబుతోంది. వ్యాక్సిన్ వేసుకొని, కోవిడ్ నిబంధనలన్నీ పాటిస్తే సరిపోతుందని అంటోంది. కొత్త వేరియెంట్తో ప్రజల్లో వచ్చే సందేహాలకు సమాధానాలిచ్చే ప్రయత్నం కేంద్ర ఆరోగ్య శాఖ చేసింది. అవేంటో చూద్దాం. థర్డ్ వేవ్ వస్తుందా ? ఒమిక్రాన్ కేసులు కొన్ని రెట్ల వేగంతో పెరుగుతున్నప్పటికీ, ఇప్పటివరకు ఈ వేరియెంట్లో తీవ్ర లక్షణాలేమీ కనిపించలేదు. ఇప్పటికే భారత్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా జరుగుతూ ఉండడం, డెల్టా వైరస్ కారణంగా యాంటీ బాడీలు అత్యధికుల్లో వృద్ధి చెందాయని సెరో సర్వేల్లో తేలడంతో వ్యాధి తీవ్రత తక్కువగానే ఉండే అవకాశాలే ఉన్నాయి. అయితే ఈ విషయం ఇంకా శాస్త్రీయంగా నిర్ధారణ కావాల్సి ఉంది. ఏయే జాగ్రత్తలు తీసుకోవాలి? కరోనాకి ఏయే జాగ్రత్తలు తీసుకోవాలో అవన్నీ పాటించాలి. మాస్కు కచ్చితంగా పెట్టుకోవాలి. ఇప్పటివరకు వ్యాక్సిన్ వేసుకోకపోతే తప్పనిసరిగా వేయించుకోవాలి. రద్దీ ప్రదేశాలకు వెళ్లడం మానాలి. గాలి , వెలుతురు ధారాళంగా ఉండేలా చూసుకోవాలి. ఒమిక్రాన్పై ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు పని చేస్తాయా ? ప్రస్తుతం లభిస్తున్న కోవిడ్ వ్యాక్సిన్లు ఒమిక్రాన్ వేరియెంట్ని అడ్డుకోలేవని చెప్పడానికి ఎలాంటి ఆధారాల్లేవు. వైరస్ కొమ్ము జన్యువుల్లో చోటు చేసుకున్న కొన్ని మార్పుల కారణంగా టీకా సామర్థ్యం తగ్గే అవకాశాలున్నాయి. అయితే ఇప్పటికే వ్యాక్సిన్లు వేసుకున్న వారు, కరోనా సోకిన వారిలో ఏర్పడిన యాంటీబాడీలతో కణజాలంలో ఏర్పడే రోగనిరోధక శక్తి ఇంకా కొనసాగుతుంది. అయితే వ్యాధి తీవ్రతని తగ్గించడానికి తప్పనిసరిగా అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. ఒమిక్రాన్ ఎంత ఆందోళనకరం ? వైరస్లో వస్తున్న మార్పులు, ఎంత వేగంతో వ్యాప్తి చెందుతుంది, రోగ నిరోధక వ్యవస్థ నుంచి తప్పించుకోవడం, రీ ఇన్ఫెక్షన్లు వంటివాటిపై అంచనాలన్నింటినీ క్రోడీకరించి ఈ వైరస్ను వేరియంట్ ఆఫ్ కన్సర్న్గా డబ్ల్యూహెచ్వో గుర్తించింది. కరోనా వైరస్ ఉన్నంతకాలం జన్యుమార్పులు, కొత్త రూపాంతారితాలు పుట్టుకురావడం సాధారణంగా జరిగేదే. సాధారణంగా వేరియెంట్లలో ఎక్కువ శాతం ప్రమాదకరం కాదు. ఎక్కువజన్యు మార్పులు జరిగిన వైరస్ బలహీన పడుతుంది. ఒమిక్రాన్ ఆ కోవలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. -
థర్డ్వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి : సీఎస్ సమీర్శర్మ
సాక్షి, అమరావతి: కోవిడ్ థర్డ్వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డాక్టర్ సమీర్శర్మ వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. ఆయన అధ్యక్షతన గురువారం సచివాలయంలో కోవిడ్–19 వ్యాక్సినేషన్ కార్యక్రమం రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి అనిల్కుమార్ సింఘాల్, కమిషనర్ కాటమనేని భాస్కర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్రంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రగతిని వివరించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని కోవిడ్ థర్డ్వేవ్ను ప్రణాళికాబద్ధంగా ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. థర్డ్వేవ్ కోవిడ్ను గుర్తించి, అందుకు అనుగుణంగా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టేందుకు అందుబాటులో ఉన్న ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్సు ప్రాజెక్టు, ఇంటిగ్రేటెడ్ హెల్త్ సమాచార ప్లాట్ఫామ్, కమ్యూనికేషన్ వ్యవస్థల పనితీరు గురించి ఆరా తీశారు. సకాలంలో వ్యాక్సినేషన్ డ్రైవ్ను పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. -
ఏవై.4.2 కలకలం; 6 రాష్ట్రాలు.. 17 కేసులు
న్యూఢిల్లీ: భారత్కు కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్న నేపథ్యంలో దేశంలో కొత్త వేరియెంట్ ఏవై.4.2 కేసులు ఆందోళనని పెంచుతున్నాయి. ఆరు రాష్ట్రాల్లో ఇప్పటివరకు 17 కేసులు నమోదయ్యాయి. కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కేరళ, తెలంగాణ, జమ్మూ కశ్మీర్లలో ఈ కేసులు నమోదు కావడంతో ఆయా రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. డెల్టా ప్లస్ వేరియెంట్ నుంచి జన్యు మార్పులు చోటు చేసుకొని ఈ కొత్త రకం వైరస్ పుట్టుకొచ్చింది. తొలిసారిగా బ్రిటన్లో వెలుగులోకి వచ్చిన ఈ వైరస్ ప్రస్తుతం బ్రిటన్, రష్యా, అమెరికాతో సహా 10కి పైగా దేశాలకు విస్తరించింది. ఈ వేరియెంట్ త్వరితంగా వ్యాప్తి చెందుతోంది కానీ ఇదెంత ప్రమాదకరమో శాస్త్రవేత్తలు అంచనాకి రాలేకపోతున్నారు. -
థర్డ్ వేవ్ ముప్పు: 5 రాష్ట్రాల్లో కరోనా కొత్త వేరియంట్
-
ముందుంది ముప్పు.. చేయద్దు తప్పు.. గమనించగలరు
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ దేశాల్లోనే కాదు..గ్రేటర్ జిల్లాల్లోనూ కరోనా కేసులు ఇప్పటికీ నమోదవుతూనే ఉన్నాయి. దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతూ అనేక మంది కోవిడ్ పరీక్ష కేంద్రాలకు క్యూ కడుతున్నారు. అయినా జనం వైఖరిలో మాత్రం మార్పు రావడం లేదు. కోవిడ్ నిబంధనల్ని యథేచ్ఛగా తుంగలో తొక్కుతున్నారు. మాస్క్ను, భౌతిక దూరాన్ని మర్చిపోయారు. లాక్డౌన్ పూర్తిగా ఎత్తివేయడం..వ్యాక్సిన్ వేసుకున్నామన్న ధీమాతో చాలా మంది వీకెండ్ పార్టీలు, ఫంక్షన్లు, మార్కెట్ల పేరుతో ఇష్టారాజ్యంగా తిరుగుతున్నారు. ఫలితంగా మళ్లీ వైరస్ బారినపడుతున్నారు. గతంతో పోలిస్తే..ప్రస్తుతం చికిత్సకు పడుతున్న సమయం రెట్టింపైంది. రికవరీ శాతం కూడా చాలా తక్కువగా ఉంటుండటంతో వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో రోజుకు సగటున వందకు పైనే కేసులు నమోదవుతున్నాయి. ఇదే నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తే..భవిష్యత్తులో థర్డ్వేవ్ రూపంలో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. సరిహద్దులో ఉన్న చైనా సహా ఇతర ప్రపంచదేశాల్లో కరోనా మళ్లీ విజృంభిస్తుండటంతో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. జీహెచ్ఎంసీ తరహాలో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇంటింటికి తిరిగి ఫీవర్ సర్వే నిర్వహించి, టీకాల కార్యక్రమం వందశాతం పూర్తి చేయాలని ఆదేశించింది. విద్యా సంస్థల్లో కన్పించని భౌతికదూరం కేసులు తగ్గక పోయినప్పటికీ..విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలను పునఃప్రారంభించింది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ విద్యార్థులకు పాఠాలు బోధించాలని సూచించింది. అయినా ప్రైవేటు విద్యా సంస్థలు మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు. ఒక్కో గదిలో 40 నుంచి 60 మంది విద్యార్థులను కూర్చొబెట్టి పాఠాలు బోధిస్తున్నాయి. తరగతి గదులను కనీసం శానిటైజ్ చేయడం లేదు. విద్యార్థులే స్వయంగా శానిటైజర్లను వెంటతెచ్చుకుని వారు కూర్చొనే ప్రదేశాన్ని శానిటైజ్ చేసుకుంటున్నారు. అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు పారిశుధ్యలోపంతో కొట్టుమిట్టాడుతున్నాయి. పాఠశాలల్లో పారిశుధ్య నిర్వహణ బాధ్యతను మున్సిపాలిటీ, గ్రామపంచాయితీలకు అప్పగించినప్పటికీ అక్కడి పారిశుధ్య కార్మికులు ఇందుకు నిరాకరిస్తుండటం ఆందోళన క లిగిస్తుంది. రెండో డోసు కోసం తప్పని నిరీక్షణ.. ► ప్రస్తుతం 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకాలు వేస్తున్న విషయం తెలిసిందే. గ్రేటర్ జిల్లాల్లో ఇప్పటి వరకు 1,05,98,603 మందికి టీకాలు వేయగా, వీరిలో 43,17,778 మంది రెండు డోసులు పూర్తి చేసుకోగా, మరో 75,32,946 మంది ఫస్ట్ డోసు పూర్తి చేసుకుని రెండో డోసు కోసం ఎదురు చూస్తున్నారు. ► మొదట్లో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో మొత్తం 720 కేంద్రాల్లో టీకాలు వేశారు. ప్రస్తుతం వీటి సంఖ్యను వందలోపునకే కుదించారు. ఫలితంగా ఇప్పటికే ఫస్ట్ డోసు వేసుకుని, రెండు డోసు గడువు సమీపించిన వారికి నిరీక్షణ తప్పడం లేదు. ► ఏ సెంటర్లో ఏ టీకా వేస్తున్నారో తెలియక లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. అంతేకాదు మొదట్లో 364 కేంద్రాల్లో కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే...ప్రస్తుతం వంద కేంద్రాల్లోనే చేస్తుండటం ఆందోళన కలిగిస్తుంది. నవంబర్ 3 వరకు వందశాతం పూర్తి కోవిడ్ నియంత్రణ, టీకాల వేగవంతం కోసం గ్రామస్థాయిలో మల్టీ లెవల్ డిసిప్లీనరీ టీమ్లు ఏర్పాటు చేస్తున్నాం. ఇందుల్లో ఆశావర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, పంచాయితీ కార్యదర్శులు, వీఆర్ఏలను సభ్యులుగా నియమిస్తున్నాం. వీరు గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికి తిరిగి, ఇప్పటి వరకు టీకా తీసుకోని వారితో పాటు ఎవరెవరు ఎన్ని డోసులు టీకా తీసుకున్నారో గుర్తించి ఆ మేరకు వ్యాక్సినేషన్ పూర్తయ్యేలా చూస్తారు. జిల్లా అదనపు కలెక్టర్లు సహా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ఈ స్పెషల్ డ్రైవ్ను స్వయంగా పర్యవేక్షించనున్నారు. - డి.అమయ్కుమార్, కలెక్టర్ రంగారెడ్డి జిల్లా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.. ఆగస్టు, సెప్టెంబర్తో పోలిస్తే అక్టోబర్లో పాజిటివ్ కేసుల సంఖ్య కొంత పెరుగుతున్నట్లు కన్పిస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కోవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలి. లేదంటే మళ్లీ ప్రమాదం తప్పదు. రంగారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు టీకా తీసుకోని వారు 45 వేల మంది ఉన్నట్లు గుర్తించాం. ఒకటి రెండు రోజుల్లో వీరందరికీ టీకాలు వేయిస్తాం. - డాక్టర్ స్వరాజ్యలక్ష్మి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి చదవండి: Giant Owl:150 ఏళ్ల క్రితం అంతరించిపోయిందనుకున్న పక్షి, మళ్లీ ప్రత్యేక్షం -
భారత్ లో కరోనా థర్డ్ వేవ్ ముప్పు !
-
పండుగ వేళ జర భద్రం
సాక్షి, చెన్నై(తమిళనాడు): పండుగల సీజన్లో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆరోగ్య శాఖ కార్యదర్శి రాధాకృష్ణన్ హెచ్చరించారు. రాష్ట్రంలో థర్డ్ వేవ్కు ఆస్కారం ఉండదు..రాదు...అనే హామీ ఇవ్వలేమని స్పష్టం చేశారు. ఇక, శనివారం రాష్ట్రంలో 50 వేల శిబిరాల్లో మెగా వ్యాక్సిన్ డ్రైవ్ పకడ్బందీగా నిర్వహించారు. కరోనా నియంత్రణ లక్ష్యంగా రాష్ట్రంలో ప్రతి ఆదివారం మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఐదు విడుదలు ఈ శిబిరాలు విజయవంతం అయ్యాయి. నాలుగున్నర కోట్ల మందికి పైగా వ్యాక్సిన్ వేసుకున్నారు. మరో కోటి మంది తొలి డోస్ వ్యాక్సిన్ వేయించుకోవాల్సి ఉంది. అయితే, ఆదివారం శిబిరాల ఏర్పాటు కారణంగా మందుబాబులు, మాంసం ప్రియులు టీకా వేసుకునేందుకు ముందుకు రావడం లేదన్న విషయం పరిశీలనలో తేలింది. దీంతో ఈసారి మెగా శిబిరం శనివారానికి మార్చారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రపథమంగా 50 వేల శిబిరాల్ని ఏర్పాటు చేశారు 60 లక్షల మేరకు డోస్ల టీకాను సిద్ధంగా ఉంచారు. అయితే, ఆశించిన మేరకు ఈసారి ఈ డ్రైవ్కు స్పందన రాలేదు. 15 లక్షల మంది మేరకు టీకా వేయించుకున్నారు. సీఎం పరిశీలన, సమీక్ష కన్నగి నగర్లో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ శిబిరాన్ని సీఎం ఎంకే స్టాలిన్ పరిశీలించారు. ప్రజలతో మాట్లాడా రు. వారి సమస్యల్ని తెలుసుకున్నారు. అలాగే, అక్కడ వెళ్తున్న నగర రవాణా సంస్థ బస్సుల్లో ఆకస్మికంగా ఎక్కి.. మహిళా ప్రయాణికులతో మాట్లాడారు. ఉచిత బస్సు సేవల గురించి అభిప్రాయాలు తీసుకున్నారు. ఈసందర్భంగా పలువురు మహిళలు కొన్ని సమస్యలు, సూచనలు ఇచ్చారు. అనంతరం సచివాలయానికి చేరుకున్న సీఎం స్టాలిన్ అధికారులతో సమావేశం అయ్యారు. పండుగ సీజన్ వేళ కరోనా ఆంక్షల సడలింపు, ఈనెల 31తో ముగియనున్న ఆంక్షలు, కొనసాగింపు గురించి సమీక్షించారు. అంగన్వాడీలు, నర్సరీ పాఠశాలలు నవంబర్ 1వ తేదీ నుంచి తెరవాలనే విషయాన్ని వాయిదా వేసినట్లు వెల్లడించారు. షిఫ్ట్ల వారీగా తరగతులు ఒకటి నుంచి ఎనిమిదవ తరగతి విద్యార్థులకు నవంబర్ 1వ తేదీ నుంచి షిఫ్టుల వారీగా తరగతులు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం శనివారం ప్రకటించింది. కరోనా ఆంక్షలను నవంబర్ 15వ తేది వరకు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. క్రీడల, స్విమ్మింగ్ తదితర పోటీల నిర్వహణకు, థియేటర్లలో 100 శాతం ప్రేక్షకులకు అనుమతి కల్పించారు. అయితే, రాజకీయ కార్యక్రమాలు, ఆలయ ఉత్సావలకు గతంలో విధించిన ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఇక చెన్నైలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ప్రారంభించినానంతరం ఆరోగ్య కార్యదర్శి రాధాకృష్ణన్ మీడియాతో మాట్లాడుతూ, పండుగ సీజన్లో జనం మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. పలు దేశాల్లో థర్డ్ వేవ్ విజృంభిస్తున్నదని గుర్తు చేశారు. ప్రస్తుతం పండుగ సీజన్ ఆందోళన కల్గిస్తోందని, టీకా వేసుకోని వాళ్లు శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని విన్నవించారు. ఇంకా కోటి మందికి తొలి డోస్ వేసుకోవాల్సి ఉందని, మరో 57 లక్షల మంది రెండో డోస్ వేసుకోవాల్సి ఉందని వివరించారు. వీరంతా టీకా వేయించుకోకుండా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. అరియలూరులో ఏర్పాటు చేసిన శిబిరాన్ని ప్రారంభించినానంతరం మీడియాతో ఆరోగ్య మంత్రి సుబ్రమణియన్మాట్లాడుతూ, విద్యార్థులకు చదువులు కుంటు పడకుండా ఉండేందుకే.. పాఠశాలల్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. చదవండి: Match Box: 14 ఏళ్ల తరువాత దాని ధర డబుల్ .. -
TS High Court: ఎన్ని ప్రాణాలు పోవాలి?
సాక్షి, హైదరాబాద్: కరోనా చికిత్సలో ఉపయోగించే ఔషధాలను ప్రాణాధారమైనవిగా గుర్తిస్తూ.. అత్యవసర మందుల జాబితాలో చేర్చాలన్న తమ ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదని హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కోవిడ్ మొదటి, రెండో దశలతో ఎన్నో ప్రాణాలు పోయాయని, ఇంకా ఎన్ని ప్రాణాలు పోయిన తర్వాత మేల్కొం టారని నిలదీసింది. కరోనా చికిత్సలో వినియోగిం చిన రెమిడెసివిర్ ఇంజెక్షన్లు అత్యవసర మందుల జాబితాలో లేకపోవడంతో.. వాటిని బ్లాక్ మార్కెట్లో భారీ రేట్లకు అమ్ముకున్నారని గుర్తు చేసింది. ఆయా ఔషధాలను అత్యవసర జాబితాలో చేరిస్తే.. తయారీ సంస్థలు అవసరమైన మేర వాటిని ఉత్పత్తి చేయడానికి ప్రణాళికలు రూపొందించుకుంటా యని స్పష్టం చేసింది. కరోనా చికిత్సలో ఉపయోగించే మందులను అక్టోబర్ 31 నాటికల్లా అత్యవసర ఔషధాల జాబితాలో చేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచందర్రావు, జస్టిస్ టి.వినోద్కుమార్లతో కూడిన ధర్మా సనం బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఇక కలర్ కోడెడ్ రెస్పాన్స్ కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని గతంలో రెండు పర్యాయా లు ఆదేశించినా ఎందుకు అమలు చేయలేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు నిలదీసింది. తాము దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చామని, ప్రభుత్వం విధానపరమైన (పాలసీ) నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు వివరణ ఇవ్వగా.. ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ప్రభుత్వ పాలసీ తెస్తే తప్ప హైకోర్టు ఇచ్చి న ఆదేశాలను అమలు చేయరా అని ప్రశ్నిం చింది. తమ ఆదేశాలు అమలు చేయకుంటే కోర్టుధిక్కరణ చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. పాజిటివిటీ శాతం తగ్గింది రాష్ట్రంలో గత రెండు నెలల్లో కరోనా కేసుల పాజిటివిటీ శాతం 0.51 శాతానికి తగ్గిందని డాక్టర్ శ్రీనివాసరావు ధర్మాసనానికి నివేదించారు. ఈ మేరకు ఆయన బుధవారం హైకోర్టుకు నివేదిక సమర్పించారు. ‘‘ఇప్పటివరకు 2.58 కోట్ల కరోనా టెస్టులు చేశాం. ఈనెల 19 నాటికి మొత్తంగా రాష్ట్రంలో 6,63,450 కరోనా కేసులు నమోదయ్యాయి. 2.20 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇచ్చాం. ఇందులో 60% మందికి మొదటి డోస్, 38% మందికి రెండు డోసులు ఇచ్చాం. జీహెచ్ఎంసీ పరిధిలో 97% ప్రజ లకు వ్యాక్సిన్లు ఇచ్చాం. 180 మొబైల్ వ్యాన్ల ద్వారా 10.07 లక్షల మందికి టీకాలు వేశాం. ఈ నెల 16 నుంచి స్పెషల్ డ్రైవ్ ద్వారా 25.10 లక్షల మందికి వ్యాక్సిన్లు ఇచ్చాం. ఈ నెల 1వ తేదీ నుంచి ఇప్పటివరకు విద్యాసంస్థల్లో 71 మందికి కరోనా వచ్చింది’’ అని వివరించారు. ఆర్టీపీసీఆర్ పరీక్షలు పెంచండి రాష్ట్రంలో కరోనా ఆర్టీపీసీఆర్ పరీక్షల సం ఖ్యను పెంచాలని హైకోర్టు సూచించింది. ‘‘ఈ నెల 1 నుంచి పాఠశాలలు, కళాశాలలు తెరిచా రు. గణేశ్ నిమజ్జనంలో భారీగా ప్రజలు పాలొ ్గన్నారు. త్వరలో దసరా, దీపావళి, క్రిస్మస్ పం డుగలు రానున్నాయి. గత 2 నెలల్లో ర్యాపిడ్ యాంటీ జెన్ పరీక్షలు దాదాపు 50లక్షలు చేయగా.. ఆర్టీపీసీఆర్ పరీక్షలు ఇందులో 10 శాతం లేవు. కచ్చితంగా ఫలితం వచ్చే ఆర్టీపీసీఆర్ పరీక్షల సంఖ్యను భారీగా పెంచండి. రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన వారందరికీ మూడు నెలల్లో.. రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి. విద్యాసంస్థల్లో బోధన, బోధనేతర సిబ్బందికి రెండు నెలల్లో వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి. ఈ నెల 30లోగా మూడో దశ కరోనా కట్టడికి కలర్ కోడెడ్ రెస్పాన్స్ కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి..’’ అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే నెల 4వ తేదీకి వాయిదా వేసింది. -
Covid-19: తొలగని థర్డ్ వేవ్ ముప్పు!
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తిపై ప్రజల్లో భయాందోళనలు పూర్తి తొలగిపోయే పరిస్థితి కనిపించట్లేదు. డెల్టా వేరియంట్లో ఇప్పటివరకు 25 మ్యాటేషన్లను నిపుణులు గుర్తించారు. భారత్లోనే కాకుండా, అమెరికా, యూరప్తో సహా అనేక దేశాలలో ఈ మ్యూటేషన్ పరివర్తన కొనసాగుతోంది. దీని కారణంగా వైరస్లో మరిన్ని మార్పులు సంభవిస్తాయని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. భారతదేశంలో డెల్టా–4 అనే కరోనా వేరియంట్తో థర్డ్ వేవ్ ప్రమాదం ఇంకా తొలగిపోలేదని బయో టెక్నాలజీ విభాగం శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వాస్తవానికి దేశంలో డెల్టా–4 వేరియంట్ వ్యాప్తి పెరుగుతోంది. దీనికి సంబంధించి శాస్త్రవేత్తల బృందం హెచ్చరికలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా సెకండ్ వేవ్ నుంచి డెల్టా వేరియంట్లో మ్యూటేషన్లు జరుగుతూనే ఉన్నాయని , ఈ నెల 13వ తేదీన బయోటెక్నాలజీ విభాగం బృందం కేంద్ర ప్రభుత్వానికి అందించిన ఒక నివేదికలో తెలిపింది. దేశవ్యాప్తంగా కరోనా వేరియంట్లలో మ్యూటేషన్లను గుర్తించేందుకు ఇప్పటివరకు 90,115 నమూనాల జన్యు శ్రేణి పూర్తయిందని, అందులో 62.9 శాతం నమూనాల్లో వైరస్కు సంబంధించిన తీవ్రమైన వేరియంట్స్ని గుర్తించామని నివేదికలో పేర్కొన్నారు. వీటిలో డెల్టా, ఆల్ఫా, గామా, బీటా, కప్ప వంటి వేరియంట్లు కోవిడ్–19కు సంబంధించిన ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని పెంచడమే కాకుండా, వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా సోకుతాయని గుర్తించారు. దేశంలో మ్యూటేషన్ సి.1.2 అనే వేరియంట్ కేసు ఇప్పటివరకు గుర్తించలేదని నివేదిక స్పష్టంగా పేర్కొంది. అయితే కరోనా వైరస్కు సంబంధించిన డెల్టా, డెల్టాకు సంబంధం ఉన్న ఇతర మ్యూటేషన్లు నిరంతరం జరుగుతున్నాయని తెలిపారు. దీని కారణంగా మహమ్మారి విషయంలో పరిస్థితి ఆందోళనకరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం పరీక్షిస్తున్న అనేక నమూనాల్లో డెల్టా–4 మ్యూటేషన్ను గుర్తిస్తున్నారు. డెల్టా–1 నుంచి డెల్టా–25 వరకు గుర్తించిన అన్ని మ్యూటేషన్లలో డెల్టా–4 అనే మ్యూటేషన్ చాలా వేగంగా ఉన్నట్లు నిపుణులు గుర్తించారు. ప్రస్తుతం అదే డెల్టా–4 మ్యూటేషన్ మహారాష్ట్ర, కేరళలలో వ్యాపిస్తోంది. రాబోయే రోజుల్లో కరోనా థర్డ్ వేవ్ వస్తే అందులో డెల్టాలో జరుగుతున్న ఈ మ్యూటేషన్లు కీలకంగా మారుతాయనే ఆందోళనన నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీకి చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ జినోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ (ఐజీఐబీ) ప్రకారం, గత నెలలో మహారాష్ట్రలో 44 శాతం మంది, కేరళలో సుమారు 30 శాతం మంది రోగులలో డెల్టా–4 వేరియంట్ కనుగొన్నారు. ప్రస్తుతం డెల్టా –4 వేరియంట్ను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఆందోళనకరమైనదిగా వర్గీకరించింది. అయితే వైరస్కు సంబంధించిన ఈ కొత్త మ్యూటేషన్లు కొత్త అంటు వ్యాధులకు కారణం అవుతాయని నిపుణులు భావిస్తున్నారు. యాక్టివ్ కేసులు 0.95% మాత్రమే దేశంలో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. కేంద్రం సోమవారం విడుదల చేసిన సమాచారం ప్రకారం దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 80.85 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోస్లను అందించారు. దేశంలో గతేడాది మార్చిలో కోవిడ్ కేసులు ప్రారంభమైన తర్వాత మొత్తం పాజిటివ్ కేసుల్లో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 0.95 శాతంతో అత్యల్పంగా ఉన్నాయి. దేశంలో గత 183 రోజుల్లో అతి తక్కువగా యాక్టివ్ కేసులు 3,18,181 కు చేరుకున్నాయి. కాగా గత 24 గంటల్లో 30,256 కొత్త కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో 295 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 4,45,133కు చేరుకుంది. -
థర్డ్ వేవ్ ముప్పు.. పండగలొస్తున్నాయ్ జాగ్రత్త
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో థర్డ్ వేవ్ ముప్పు ఇంక ఉండదని అందరూ ఊపిరి పీల్చుకుంటున్న వేళ కేంద్ర ప్రభుత్వం కొత్త హెచ్చరికలు చేసింది. అక్టోబర్, నవంబర్ నెలలే అత్యంత కీలకమని, ఆ రెండు నెలల్లో కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని నీతి ఆయోగ్ సభ్యుడు, కోవిడ్ టాస్్కఫోర్స్ చీఫ్ వి.కె.పాల్ తెలిపారు. దేశంలో కరోనా పరిస్థితులపై గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇది పండగల సీజన్ కావడంతో ప్రజలు గుంపులుగా తిరగడం పెరుగుతుందని తద్వారా కరోనా మళ్లీ విజృంభించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. చదవండి: అంతరిక్ష పర్యాటకంలో మరో ముందడుగు ఈ రెండు నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలని, స్థానిక యంత్రాంగం ఎలాంటి ముప్పునైనా ఎదుర్కోవడానికి సన్నద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. థర్డ్ వేవ్ అన్న మాట వాడకుండానే పాల్ కరోనా కేసులపై మాట్లాడారు. కోవిడ్ నిబంధనలు అందరూ పాటిస్తూ, అత్యవసరమైతేనే ప్రయాణాలు చేయాలని, అందరూ వ్యాక్సిన్ వేసుకోవాలని హితవు పలికారు. ‘అయితే దేశంలో పెద్దవాళ్లలో దాదాపుగా 62% మంది సింగిల్ డోసు వ్యాక్సిన్ పూర్తి చేసుకున్న నేపథ్యంలో కరోనా మొదటి, రెండు వేవ్ల స్థాయిలో తీవ్రంగా మూడో వేవ్ వచ్చే అవకాశాలు లేవు. కరోనా సోకితే తగిన జాగ్రత్తలు తీసుకుంటూ హోం క్వారంటైన్ అయ్యే అంశంలో ప్రజలకు తగినంత అవగాహన రావడంతో మళ్లీ కరోనా కేసులు విజృంభించినా అంత ప్రమాదమేమీ ఉండడు’ అని వీకే పాల్ ధైర్యం చెప్పారు. చదవండి: ఆరోగ్యానికి కేరాఫ్ పనస ప్రస్తుతానికి బూస్టర్ డోసు ఆలోచన లేదు కోవిడ్ బూస్టర్ డోసు ఇవ్వాలన్న ప్రతిపాదనలేవీ కేంద్ర ప్రభుత్వం వద్ద లేవని, ప్రజలందరికీ రెండు డోసులు ఇవ్వడానికే ప్రాధాన్యం ఇస్తున్నట్టుగా ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ చెప్పారు. కరోనా రెండు డోసులు ఇవ్వడాన్ని ఒక యజ్ఞంలా నిర్వహిస్తున్నామని, దానికి ఎలాంటి అడ్డంకులు ఉండకూడదని అన్నారు. బూస్టర్ డోసు గురించి కేంద్ర ప్రభుత్వం, శాస్త్రవేత్తలు, ప్రజారోగ్య వ్యవస్థలో ఎలాంటి చర్చ జరగడం లేదని ఆయన స్పష్టంచేశారు. -
Telangana High Court: ఇంత బాధ్యతారాహిత్యమా?
మూడో దశ పిల్లలపై ప్రభావం చూపించే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కళాశాలలు, బడులు తెరవడం, వినాయక నిమజ్జనంతో కరోనా కేసులు మరింత పెరిగే అవకాశముంది. అయినా ప్రభుత్వం ఇంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం ఏంటి ? పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకొని ఇప్పటికైనా తగిన ముందుజాగ్రత్త చర్యలు చేపట్టండి. సర్కారు స్పందించకపోతే మేమే జోక్యం చేసుకొని తగిన ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుంది. – హైకోర్టు సాక్షి, హైదరాబాద్: కరోనా మూడో దశ ముప్పు పొంచి ఉందని హైకోర్టు పేర్కొంది. ఆర్టీపీసీఆర్ పరీక్షల రిపోర్టుల ప్రకారం 1.79% పాజిటివ్ కేసులు వస్తున్నా కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం తగిన ప్రణాళికలు రూపొందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. చైనాలో ఇటీవల కేసుల సంఖ్య పెరిగి మళ్లీ లాక్డౌన్ విధించారని గుర్తు చేసింది. కరోనా నియంత్రణకు తగిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాలను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచందర్రావు, జస్టిస్ టి.వినోద్కుమార్లతో కూడిన ధర్మాసనం బుధవారం మరోసారి విచారించింది. విపత్తు నిర్వహణ చట్టం నిర్దేశించిన మేరకు జూలై 15న నిపుణుల కమిటీ సమావేశమైందని, మూడో దశ కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై అనేక సిఫారసులు చేసిందని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ నివేదించారు. ‘రెగ్యులర్గా ఫీవర్ సర్వే చేయాలి. సీరో సర్వైలెన్స్ చేపట్టాలి. కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య గణనీయంగా పెంచాలి. ఆసుపత్రుల్లో ఆక్సిజన్ నిల్వలు పెంచాలి. ఆక్సిజన్ నిల్వ చేసే సదుపాయాలు ఏర్పాటు చేసుకోవాలి. ఆక్సిజన్, ఐసీయూ పడకల సంఖ్య పెంచాలి. చిన్న పిల్లల చికిత్సలకు సంబంధించి తగిన ఏర్పాట్లు చేయాలి..’ అని కమిటీ సిఫారసు చేసినట్లు తెలి పారు. దీంతో ఆ సిఫారసు అమలుకు ఏం ప్రణాళి కలు రూపొందించారు? ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకున్నారో పేర్కొనలేదంటూ ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. 1.79 శాతం కేసులు అంటే అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రజారోగ్య విభాగం సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు నివేదించగా.. కేవలం ఆర్టీపీసీఆర్ పరీక్షల్లోనే 1.79 శాతం కేసులు వస్తుండడాన్ని తీవ్రంగానే పరిగణించాలని ధర్మాసనం పేర్కొంది. ఈనెల 22లోగా ప్రణాళికలతో నివేదిక సమర్పించాలంటూ విచారణను వాయిదా వేసింది. -
‘కరోనా థర్డ్ వేవ్ వచ్చేసిందని అనలేదు’: ముంబై మేయర్
ముంబై: మహమ్మారి కరోనా వైరస్ విజృంభణ మళ్లీ దేశంలో కలకలం రేపుతోంది. తాజాగా మహారాష్ట్రలో కూడా కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఆ రాష్ట్రంలోని ముంబై, నాగ్పూర్లో కేసుల నమోదు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రానికి చెందిన ఓ మంత్రి, ఓ మేయర్ థర్డ్ వేవ్ వచ్చేసిందని ప్రకటించారు. ఇదిగోండి మీ ఇళ్ల ముందే ఉందని పేర్కొన్నారు. వారిద్దరి ప్రకటనలు ఆ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఎలా ఉందనేది స్పష్టం చేస్తోంది. చదవండి: జైలులో అగ్నిప్రమాదం.. అగ్నికి ఆహుతైన ఖైదీలు ఆ రాష్ట్ర మంత్రి నితిన్ రౌత్ ‘నాగ్పూర్లో థర్డ్ వేవ్ వచ్చేసింది’ అని మంగళవారం తెలిపారు. తాజాగా ముంబై మేయర్ కిశోరీ పడ్నేకర్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. ‘మూడో దశ రావడం కాదు. వచ్చేసింది! మన ఇంటి ముందరే ముప్పు పొంచి ఉంది. జాగ్రత్తలు పాటించడం చాలా ముఖ్యం’ అని ఆమె తెలిపారు. ‘నాగ్పూర్లో వచ్చేసింది అని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ముంబైవాసులు జాగ్రత్తలు పాటించాలి’ అని సూచించారు. ‘గత రెండు దశల అనుభవంతో ఇప్పుడు మూడో దశ రాకుండా అడ్డుకునే అవకాశం మన చేతుల్లోనే ఉంది’ అని విలేకరుల సమావేశంలో ఆమె చెప్పారు. అయితే ఆ ప్రకటనపై ఆమె వివరణ ఇచ్చుకున్నారు. తాజాగా ఆమె బుధవారం మీడియా సమావేశం ఏర్పాటుచేసి ‘నేను అలా అనలేదు’ అని చెప్పారు. ముంబైలో థర్డ్ వేవ్ ఉందని తాను అనలేదని స్పష్టం చేశారు. మంత్రి నితిన్ రౌత్ థర్డ్ వేవ్ ఉన్నట్టు చెప్పడంతో థర్డ్ వేవ్ ఇంటి ముందరే ఉందని చెప్పినట్లు వివరణ ఇచ్చారు. జాగ్రత్తలు అవసరం అని మాత్రమే తాను చెప్పినట్లు వివరించారు. కరోనాపై మంత్రి ఆదిత్య ఠాక్రే కూడా స్పందించారు. కరోనా ఉందనే విషయాన్ని గుర్తించుకోవాలని సూచించారు. ‘12-18 ఏళ్ల వారికి ఇంకా వ్యాక్సిన్ రాలేదనే విషయాన్ని గుర్తించాలి. ముంబైతో పాటు మహారాష్ట్రలో మూడో దశ రాకుండా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాం. జాగ్రత్తలు పాటిస్తే థర్డ్ వేవ్ను అడ్డుకోగలం’ అని ఆదిత్య తెలిపారు. ప్రస్తుతం కరోనా వ్యాప్తి నేపథ్యంలో వినాయక చవితి వేడుకలపై కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. కరోనా జాగ్రత్తలు పాటిస్తూనే వేడుకలు చేసుకోవాలని సూచించింది. చదవండి: ఉత్తరాఖండ్ గవర్నర్ రాజీనామా -
ప్రజారోగ్యంపై నిరంతర పరిశీలన, పర్యవేక్షణ ఉండాలి: సీఎం జగన్
-
ఫ్యామిలీ హెల్త్ డాక్టర్ కాన్సెప్ట్పై ప్రత్యేక దృష్టి పెట్టాలి: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: వైద్య, ఆరోగ్య శాఖలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో బుధవారం జరిగిన ఈ సమావేశంలో కోవిడ్ –19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్పై అధికారులు సీఎం జగన్కు వివరాలందించారు. రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 14,452 ఉండగా.. రికవరీ రేటు 98.60 శాతంగా ఉందని తెలిపారు. 10,494 సచివాలయాల్లో యాక్టివ్ కేసులు నమోదు శాతం జీరో అని అధికారులు తెలిపారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారు 3,560 మంది కాగా.. కోవిడ్ కేర్ సెంటర్లలో చికిత్స పొందుతున్నవారు 926 మంది.. హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నవారు 9,966 మంది ఉన్నారని అధికారులు సీఎం జగన్కి తెలిపారు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందుతున్న బెడ్స్ 92.50 శాతం ఉండగా.. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందుతున్న బెడ్స్ 70.69 శాతం ఉన్నాయన్నారు. 104 కాల్ సెంటర్కు 684 ఇన్కమింగ్ కాల్స్ మాత్రమే వచ్చాయని తెలిపారు. 18 దఫాలుగా ఇప్పటివరకు ఫీవర్ సర్వే పూర్తి చేశామని అధికారులు సీఎం జగన్కి తెలిపారు. థర్డ్ వేవ్ సన్నద్ధతపై ప్రణాళిక సిద్ధం కోవిడ్ థర్డ్ వేవ్ను ఎదుర్కొనేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని అధికారులు సీఎం జగన్కి తెలిపారు. ప్రస్తుతానికి రాష్ట్రంలో 20,964 ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ అందుబాటులో ఉన్నాయని.. ఇంకా రావాల్సినవి 2493 ఉన్నాయన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆక్సిజన్ డి–టైప్ సిలిండర్లు 27,311 కాగా.. ఆక్సిజన్ పైప్లైన్ పనులు పూర్తైన ఆస్పత్రులు 108 అని అధికారులు సీఎం జగన్కి తెలిపారు. ఆక్సిజన్ జనరేషన్ (పీఎస్ఏ) ప్లాంట్లు 50 అంతకంటే ఎక్కువ బెడ్స్ ఉన్న ఆస్పత్రుల్లో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లు ఏర్పాటు చేశామని అధికారులు సీఎం జగన్కి వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 140 ఆస్పత్రులలో పీఎస్ఏ ప్లాంట్లు ఏర్పాటు చేశామని.. అక్టోబరు 6 నాటికి ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ల ఏర్పాటు పూర్తవుతుందని అధికారులు సీఎం జగన్కి తెలిపారు. వ్యాక్సినేషన్ రాష్ట్రంలో ఇప్పటివరకు వ్యాక్సినేషన్ చేయించుకున్నవారు 2,23,34,971 మంది ఉండగా.. వీరిలో సింగిల్ డోసు వ్యాక్సినేషన్ పూర్తైన వారు 1,31,62,815 మంది కాగా.. రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తైన వారు 91,72,156 మంది అని అధికారులు సీఎం జగన్కి తెలిపారు. ఇటీవల కేరళలో పర్యటించిన అధికారులు, వైద్యాధికారుల బృందం కోవిడ్తో పాటు ఇతర క్షేత్రస్థాయి పరిశీలనాంశాలను సీఎం జగన్కు వివరించారు. శిశు మరణాలు తగ్గించాలి.. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘‘శిశు మరణాలను తగ్గించాలి. దీనిపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. ఫ్యామిలీ హెల్త్ డాక్టర్ కాన్సెప్ట్పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. చక్కటి విధివిధానాలను ఖరారు చేయాలి. కొత్తగా నిర్మిస్తున్న మెడికల్ కాలేజీల్లో పీజీ కోర్సులు కూడా ప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకోవాలి. పారామెడికల్ సిబ్బందికీ మెడికల్ కాలేజీల్లో శిక్షణ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి. పబ్లిక్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్పై కోర్సులు దృష్టి పెట్టాలని’’ అధికారులను ఆదేశించారు. హెల్త్డేటాపై అన్నిరకాల చర్యలు తీసుకోవాలి.. ‘‘ప్రజారోగ్యంపై నిరంతర పరిశీలన, పర్యవేక్షణ ఉండాలి. రక్తం, నీరు, గాలి ఈ మూడింటిపైన పరీక్షలు జరగాలి. విలేజ్ క్లినిక్స్ స్థాయిలో ఈ పరీక్షలు అందుబాటులో ఉండాలి. అవసరమైన చోట సీహెచ్సీల్లో కూడా డయాలసిస్ యూనిట్లు అందుబాటులోకి తీసుకురావాలి. హెల్త్డేటాపై అన్నిరకాల చర్యలు తీసుకోవాలి. ఎక్కడ పరీక్షలు చేయించుకున్నా, ఎక్కడ చికిత్స తీసుకున్నా గుర్తింపు కార్డు ద్వారా ఆ వివరాలతో కూడిన డేటా అప్లోడ్ చేయాలి. ఒక వ్యక్తి వైద్యంకోసం ఎక్కడకు వెళ్లినా ఆ వివరాలు డాక్టర్కు వెంటనే అందుబాటులోకి వచ్చే విధానం ఉండాలి. ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లినా, విలేజ్ క్లినిక్ నుంచి టీచింగ్ ఆస్పత్రి వరకూ ఎక్కడికి వెళ్లినా... అక్కడ చేయించుకున్న పరీక్షల వివరాలు, చికిత్స వివరాల డేటా అప్లోడ్ కావాలి. దీనికి సంబంధించి మంచి సాఫ్ట్వేర్ను అందుబాటులోకి తీసుకురావాలని సీఎం జగన్ సూచించారు. థర్డ్వేవ్ సమాచారం నేపథ్యంలో కోవిడ్ నియంత్రణకు నూతన చికిత్సా విధానాలపై దృష్టి సారించాలన్న సీఎం.. కొత్త మందులు, మెరుగైన ఫలితాలు, తక్కువ దుష్ప్రభావాలు ఉన్నవాటి వినియోగంపై దృష్టిపెట్టి అన్నిరకాలుగా సిద్ధం కావాలని తెలిపారు. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్(నాని), సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, కోవిడ్ కమాండ్ కంట్రోల్ ఛైర్ పర్సన్ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, 104 కాల్ సెంటర్ ఇంఛార్జ్ ఎ బాబు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, ఆరోగ్యశ్రీ సీఈఓ వి వినయ్ చంద్, ఏపీఎంఎస్ఐడీసీ వీసీ అండ్ ఎండీ డి మురళీధర్ రెడ్డి, పరిశ్రమలశాఖ డైరెక్టర్ జే వి యన్ సుబ్రమణ్యం, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. చదవండి: ఇకపై ఏపీ ఈ-గెజిట్ ద్వారా ప్రభుత్వ ఉత్తర్వులు అయ్యో! వారి బతుకులు కరిగిపోతున్నాయ్ -
అప్పటికి మూడో వేవ్ ముగుస్తుంది: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: కోవిడ్–19 మహమ్మారితో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించడం, మరణ ధ్రువీకరణ పత్రాల మంజూరుకు మార్గదర్శకాలు రూపొందించడంలో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘కరోనా మరణాలకు సంబంధించిన మార్గదర్శకాలు రూపొందించాలని మేము గతంలోనే ఆదేశించాం. ఆ తర్వాత గడువును పొడిగించాం కూడా. మీరు మార్గదర్శకాలు రూపొందించే సమయానికి మూడో వేవ్ కూడా ముగిసిపోతుంది’’ అని జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ అనిరుధ్ బోస్లతో కూడిన సుప్రీం డివిజన్ బెంచ్ వ్యాఖ్యానించింది. శుక్రవారం ఈ కేసుని విచారిస్తూ మార్గదర్శకాలను ఈ నెల 11లోగా రూపొందించాలని కేంద్రాన్ని ఆదేశించింది. కరోనాతో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.4 లక్షలు ఎక్స్గ్రేషియా ఇస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ నష్టపరిహారం అసలైన వారికి చేరాలంటే కోవిడ్–19 డెత్ సర్టిఫికెట్ జారీకి కూడా కేంద్రం మార్గదర్శకాలను రూపొందించాల్సిన అవసరం ఉందంటూ కొందరు అడ్వకేట్లు గతంలోనే వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. వాటిని విచారించిన సుప్రీం కోర్టు ఇప్పటికే మార్గదర్శకాల రూపకల్పనకు రెండు సార్లు గడువు పొడిగించింది. ఇక మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించడంలోనూ తీవ్ర జాప్యం జరుగుతోంది. దీనిపై అత్యున్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. మరణ ధ్రువీకరణ పత్రం జారీకి సంబంధించి మార్గదర్శకాలను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించింది. కేంద్రం తరఫున కోర్టుకు హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కేంద్ర ప్రభుత్వం పరిశీలనలో ఈ అంశం ఉందని సుప్రీం దృష్టికి తీసుకువెళ్లారు. -
వ్యాపార పరిస్థితులు మెరుగుపడుతున్నాయ్
ముంబై: భారత్లో వ్యాపార క్రియాశీలత పురోగతి వేగంగా కొనసాగుతోందని జపాన్ బ్రోకరేజ్ దిగ్గజం– నోమురా పేర్కొంది. ఆగస్టు 29నాటికి వ్యాపార క్రియాశీలత కరోనా ముందస్తు స్థాయికి చేరుకుందని తెలిపింది. ఈ మేరకు విడుదల చేసిన నివేదికలో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ► నోమురా బిజినెస్ రిజంప్షన్ ఇండెక్స్ 2021 ఆగస్టు 29వ తేదీతో ముగిసిన వారంలో 102.7కు ఎగసింది. దేశంలో కరోనా ముందస్తు.. అంటే 2020 మార్చి తరువాత ఇండెక్స్ ఈ స్థాయిని చూడ్డం ఇదే తొలిసారి. అంతక్రితం ఆగస్టు 22వ తేదీతో ముగిసిన వారంలో ఇండెక్స్ 101.3 వద్ద ఉంది. మార్చి 2020 తర్వాత లాక్డౌన్లు, ఆంక్షల నేపథ్యంలో ఇండెక్స్ భారీగా పడిపోయింది. ► 2021 జూన్లో ఇండెక్స్ 15 శాతం పెరిగితే, జూలైలో ఈ వేగం 17.1 శాతంగా ఉంది. తొలి ఫలితాల ప్రకారం ఆగస్టు 29 నాటికి 5.6 శాతంగా నమోదయ్యింది. ► ఆగస్టు 29వ తేదీనాటికి గూగుల్ రిటైల్, రిక్రియేషన్ ఇండెక్స్ 0.6 శాతం పెరిగితే, యాపిల్ డ్రైవింగ్ ఇండిసీస్ 10 శాతం ఎగసింది. వర్క్ప్లేస్ మొబిలిటీ ఇండెక్స్ 3.7 శాతం పడిపోయినప్పటికీ, గూగుల్, యాపిల్ సంబంధిత ఇండెక్స్లు పెరగడం గమనార్హం. ► విద్యుత్ డిమాండ్ వారం వారీగా 10 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) పెరిగింది. ► ఇక కార్మికుల భాగస్వామ్య సూచీ 40 శాతం నుంచి 40.8 శాతానికి ఎగసింది. మూడవవేవ్ను తోసిపుచ్చలేం... కాగా రానున్నది పండుగల సీజన్ కావడంతో మూడవవేవ్ ముప్పును త్రోసిపుచ్చలేమని నోమురా హెచ్చరించడం గమనార్హం. ఆగస్టు 29వ తేదీతో ముగిసిన వారంలో 7 రోజుల సగటు (మూవింగ్ యావరేజ్) కేసులు 9,200 పెరిగి 41,000కు చేరినట్లు నోమురా పేర్కొంది. కేసులు పెరుగుతుండడంపై ఇంకా మిశ్రమ వార్తలు వస్తున్నాయని తెలుపుతూ, ఇది మూడవ వేవ్కు సంకేతం కావచ్చనీ విశ్లేషించింది. అలాగే ఇదే సమయంలో వ్యాక్సినేషన్ మూవింగ్ యావరేజ్ వారం వారీగా 47 లక్షల డోసుల నుంచి 71 డోసులకు పెరిగిందని పేర్కొంది. ఇదే ధోరణి కొనసాగితే 2021 డిసెంబర్ ముగిసే నాటికి భారత్లో దాదాపు 50 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తవుతుందని తెలిపింది. వ్యాక్సినేషన్ మరింత వేగవంతం కావాల్సి ఉందని పేర్కొంది. వృద్ధి 10.4 శాతం మూడవ వేవ్ సమస్యలు తలెత్తకపోతే సెప్టెంబర్ త్రైమాసికంలో భారత్ ఎకానమీ మరింత వేగం పుంజుకునే అవకాశం ఉందని అంచనావేసింది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 10.4 శాతంగా ఉంటుందని తన నివేదికలో నోమురా పేర్కొంది. -
భారత్లో కొత్త వేరియంట్ వస్తేనే థర్డ్వేవ్!
న్యూఢిల్లీ: ఇప్పుడున్న కరోనా వేరియంట్ల కన్నా డేంజర్ వేరియంట్ సెప్టెంబర్లో బయటపడితే దేశంలో కరోనా థర్డ్వేవ్ వస్తుందని ఐఐటీ కాన్పూర్ సైంటిస్టు మనీంద్ర అగర్వాల్ హెచ్చరించారు. ఒకవేళ అలా జరిగితే రాబోయే అక్టోబర్– నవంబర్ మధ్య కాలంలో దేశంలో కరోనా థర్డ్వేవ్ ఉధృతి కనిపిస్తుందని అంచనా వేశారు. అయితే ఎంత ప్రమాదకరమైన వేరియంట్తో థర్డ్వేవ్ వచ్చినా, దాని తీవ్రత సెకండ్ వేవ్ కన్నా చాలా తక్కువగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. కరోనా మేథమేటికల్ మోడలింగ్లో ఆయన నిపుణుడు. దేశంలో ఇన్ఫెక్షన్ల పెరుగుదలను అంచనా వేసే ముగ్గురు సభ్యుల బృందంలో ఆయన ఒకరు. సెప్టెంబర్ నాటికి కొత్త వేరియంట్ ఏదీ రాకపోతే మాత్రం ఎలాంటి థర్డ్ వేవ్ రాదని ఆయన వెల్లడించారు. థర్డ్వేవ్ ఉధృత దశలో దేశీయంగా రోజుకు లక్ష కేసులు బయటపడవచ్చని అంచనా వేశారు. సెకండ్వేవ్ ప్రబలిన సమయంలో దేశీయంగా రోజుకు 4 లక్షల కేసులు నమోదైన సంగతి తెలిసిందే! ‘‘న్యూ మ్యూటెంట్ రాకున్నా, కొత్త వేరియంట్ కనిపించకున్నా యథాతథ స్థితి ఉంటుంది. కొత్త వేరియంట్ సెప్టెంబర్ నాటికి బయటపడితే థర్డ్వేవ్ అవకాశాలుంటాయి.’’అని అగర్వాల్ తెలిపారు. కొత్త వేరియంట్, తద్వారా థర్డ్వేవ్ వచ్చే అవకాశాలు 1/33 వంతులని అంచనా వేశారు. ఇప్పటివరకు డెల్టాను మించిన ప్రమాదకరమైన వేరియంట్ ఇంకా బయటపడలేదు. డెల్టా కారణంగా థర్డ్వేవ్ ఆరంభమైనా, కొత్త వేరియంట్ పుట్టకపోవడంతో ఉధృతి కొనసాగడం లేదని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం దేశీయంగా నమోదైతున్న కేసులు కూడా చాలా వరకు తగ్గుముఖం పడుతున్నాయి. -
ఫ్లూ మాదిరిగా ఇకపై ఏటా కరోనా ప్రభావం
సాక్షి, హైదరాబాద్: ‘సాధారణ ఫ్లూ మాదిరిగానే కరోనా ఏటా మన తలుపులు తడుతుంది. ఇకపై కరోనా వైరస్తో సహజీవనం చేయాల్సిందే. ఫ్లూ, ఇతర సీజనల్ జబ్బులు కూడా పూర్తిగా నిర్మూలన కాకపోగా ఏటా వర్ష, చలికాలాల్లో వస్తూనే ఉన్నాయి. కోవిడ్ కూడా త్వరలోనే థర్డవేవ్ రూపంలో, ఆపై ఏటా వస్తూనే ఉంటుంది. మనం సంసిద్ధంగా ఉండాల్సిందే’అని నియోనాటల్, పీడియాట్రిక్ క్రిటికల్కేర్ నిపుణుడు, లిటిల్ స్టార్స్ హాస్పిటల్ డైరెక్టర్ డా.సతీశ్ ఘంటా స్పష్టం చేశారు. ‘సాక్షి’ప్రత్యేక ఇంటర్వ్యూలో కరోనా థర్డ్ వేవ్ తదితర అంశాల గురించి అభిప్రాయాలు వ్యక్తం చేశారు. లిటిల్ స్టార్స్ హాస్పిటల్ డైరెక్టర్ డా.సతీశ్ ఘంటా సాక్షి: థర్డ్వేవ్పై ఏమంటారు? డా.సతీశ్: వచ్చే నెలలో థర్డ్వేవ్ రావడం ఖా యం. అయితే ఫస్ట్, సెకండ్ వేవ్స్ ఉన్నంత గా ప్రభావం ఉండకపోవచ్చు. నవంబర్ వర కు దాని ప్రభావం కొనసాగే అవకాశాలున్నాయి. చదవండి: వర్క్ ఫ్రమ్ హోం: ఆఫీస్లకు శాశ్వతంగా గుడ్బై! సాక్షి: ఈ వేవ్ ఎలా ఉండబోతోంది? డా.సతీశ్: ఫస్ట్ వేవ్లో చాలా మందిపై ప్రభావం పడగా, సెకండ్వేవ్లో యువత, మధ్య వయస్కులపై అధిక ప్రభావం పడింది. చిన్నపిల్లలు, 18 ఏళ్ల లోపు వారు సైతం కొంతమేర ప్రభావితమయ్యారు. నేటికీ నెలల వయసు పిల్లల దగ్గర నుంచి 15, 16 ఏళ్ల వయసున్న వారి పాజిటివ్ కేసులొస్తున్నాయి. కానీ అంత సీరియస్గా మారట్లేదు. ఇప్పుడు ఏ వయసు పిల్లలు.. ఎలాంటి లక్షణాలతో బాధపడుతున్నారు.. వారికి ఎలాంటి చికిత్స అందించాలనే దానిపై స్పష్టమైన అవగాహన ఏర్పడటంతో సరైన చికిత్సకు అవకాశం కలిగింది. థర్డ్వేవ్ వచ్చేటప్పటికి వైరస్ తీవ్రత, ప్రభావం తక్కువగానే ఉండొచ్చునని నిపుణులు అంచనా వేస్తున్నారు. సాక్షి: స్కూళ్లు తెరవాలనే డిమాండ్ బాగా పెరుగుతోంది. తెరిస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? డా.సతీశ్: స్కూళ్లలో పనిచేసేవారంతా తప్పనిసరిగా టీకా తీసుకోవాలి. సిబ్బందికి కరోనా జాగ్రత్తలు, ఇతర చర్యలపై పూర్తి శిక్షణ ఇవ్వాలి. శానిటైజేషన్ ఇతర శుభ్రతా చర్యలు తీసుకోవాలి. పిల్లలు దూరంగా కూర్చునేలా సీటింగ్ అరేంజ్మెంట్ మార్చాలి. తరగతి గదుల్లో గాలి, వెలుతురు ఎక్కువగా ఉండేలా చూడాలి. టీచర్లు, సిబ్బంది, పిల్లల్లో ఎవరికి కరోనా లక్షణాలు కనిపించినా వెంటనే పరీక్షలు చేయాలి. మాస్కులు, ఇతర జాగ్రత్తలు కచి్చతంగా పాటిస్తూ స్కూళ్లు తెరిస్తే మంచిదే. సాక్షి: యాంటీబాడీస్, రోగనిరోధక శక్తి ఎలా ఉంటోంది? డా.సతీశ్: కోవిడ్ వచ్చి తగ్గాక ఏర్పడే యాంటీబాడీస్ కొందరిలో 3, 4 నెలల పాటే ఉంటున్నాయి. దీంతో వారు మళ్లీ వైరస్ బారినపడుతున్నారు. ఇలాంటి కేసులు కూడా ఇటీవల పెరుగుతున్నాయి. చిన్నప్పుడు అమ్మవారు, తట్టు వంటివి వచ్చి పోయాక మళ్లీ వచ్చేవి కావు. మన శరీరంలోని రోగనిరోధకశక్తి జీవితమంతా రక్షణ కలి్పస్తుండగా, కరోనా వైరస్ మాత్రం ఆ అవకాశం ఇవ్వట్లేదు. కోవిడ్ సోకాక ఏర్పడే యాంటీబాడీస్తో పాటు రోగనిరోధకశక్తి కొంతకాలం మాత్రమే ఉంటోంది. సాక్షి: ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి? డా.సతీశ్: దేశంలో దాదాపు 60 శాతం మందికి కరోనా వచ్చి పోయినట్లు తాజా సీరో పాజిటివిటీ సర్వేలో తేలింది. అయితే టీకాలు తీసుకోని 18 ఏళ్లలోపు పిల్లల జనాభా 25 నుంచి 30 శాతం దాకా ఉంటుంది. ఇంకా 20 శాతం వయోజనులు వ్యాక్సిన్ వేసుకోలేదు. ఇప్పుడు వారిపై థర్డ్వేవ్ ప్రభావం చూపే అవకాశాలున్నాయి. సెకండ్వేవ్లో లాక్డౌన్ ఉన్నప్పుడు కేసులు తగ్గినా ఇప్పుడు కూడా పాజిటివ్ కేసులు పూర్తిగా తగ్గలేదు. సాక్షి: ఇప్పుడు జాగ్రత్తలు పాటిస్తున్నారా? డా.సతీశ్: మాస్క్లు, భౌతిక దూరం, గుంపులుగా చేరకపోవడం, గాలి, వెలుతురు లేని చోట ఎక్కువ సేపు గడపకపోవడం వంటివి అందరూ పాటిస్తే స్కూళ్లు తెరవడంతో పాటు అన్ని కార్యకలాపాలు యథావిధిగా నిర్వహించుకోవచ్చు. సుదీర్ఘకాలం పాటు ఆంక్షలు, నిబంధనలతో అధిక శాతం ప్రజలు విసిగిపోయి ఉన్నారు. దాంతో జాగ్రత్తలు పాటించట్లేదు. టీచర్లందరికీ టీకాలు వేసి ఉంటే పిల్లల మధ్య తగిన దూరం పాటిస్తూ పాఠాలు కొనసాగించొచ్చు. -
బాబోయ్ బార్.. భయపడుతున్న యజమానులు
సాక్షి, సంగారెడ్డి: బార్షాప్ల లైసెన్స్లు పొందినవారు వాటిని ప్రారంభించేందుకు అంతగా ఆసక్తి చూపడం లేదు. కోవిడ్ మూడో వేవ్ భయం వెంటాడుతుండటం, బారులో కూర్చుని మద్యం సేవించేందుకు వచ్చేవారి సంఖ్య తగ్గుతుండడమే దీనికి ప్రధాన కారణం. జిల్లాకు మంజూరైన కొత్త బార్లలో కనీసం మూడో వంతు కూడా ఇంకా ప్రారంభం కాలేదు. కరోనా భయం వెంటాడుతోంది ► సంగారెడ్డి జిల్లాలో ప్రస్తుతం 22 బార్లు ఉన్నాయి. ఇవి కాకుండా ప్రభుత్వం మరో 12 బార్లను మంజూరు చేసింది. జనాభా ప్రాతిపధికన ఈ కొత్త బార్లకు ఎక్సైజ్శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి మద్యం వ్యాపారుల నుంచి దరఖాస్తులు తీసుకుని డ్రా ద్వారా ఎంపిక చేసింది. ► డ్రాలో గెలుపొందిన వ్యాపారులు బార్ను ఎస్టాబ్లిష్ చేసుకునేందుకు మూడు నెలలు గడువుంటుంది. అయితే కోవిడ్ మూడో వేవ్పై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ బార్ల లైసెన్సులు పొందిన వ్యాపారులు బార్లను ప్రారంభించడాన్ని వాయిదా వేసుకుంటున్నారు. ► బార్ల ఎస్టాబ్లిష్మెంట్ కోసం ఇచ్చిన మూడు నెలల గడువుకు తోడు మద్యం వ్యాపారులు మరో రెండు నెలల గడువు ఇవ్వాలని ఎక్సైజ్శాఖ కమిషనరేట్లో దరఖాస్తు చేసుకున్నారు. ఈ రెండు నెలల అదనపు గడువు కూడా మరో పక్షం రోజుల్లో ముగుస్తుందని ఎక్సైజ్ అధికారులు పేర్కొంటున్నారు. ► జిల్లాకు మంజూరైన కొత్త బార్లలో కనీసం మూడో వంతు బార్లు కూడా ప్రారంభం కాలేదు. సంగారెడ్డి ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో మొత్తం నాలుగు కొత్త బార్లకు లైసెన్స్ మంజూరు కాగా, ఇప్పటివరకు కేవలం ఒకే ఒక కొత్త బారు తెరిచింది. ► జీహెచ్ఎంసీ పరిధిలోని బార్ల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. డ్రాలో బార్ను దక్కించుకొని ఎక్సైజ్ ట్యాక్ను కట్టిన మద్యం వ్యాపారులు కొందరు తమ బార్ను తాము నిర్వహించకుండా, ఇతరులకు ఇచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారని ఎక్సైజ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ► జిల్లాలో కొత్తగా సంగారెడ్డి, సదాశివపేట్ పట్టణాల్లో రెండేసి చొప్పున బార్లు మంజూరయ్యాయి. జహీరాబాద్, నారాయణఖేడ్లలో ఒక్కో బార్ మంజూరైంది. జీహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చే అమీన్పూర్ పరిధిలో రెండు బార్లు, బొల్లారంలో నాలుగు బార్లుకు లైసెన్స్లు మంజూరు చేసింది. ► జిల్లాలో కొత్త బార్లలో ఇప్పటివరకు నాలుగు బార్లు ప్రారంభమయ్యాయని సంగారెడ్డి ఎక్సైజ్ సూపరిండెంట్ గాయత్రిదేవి “సాక్షి’తో పేర్కొన్నారు. ► మెదక్ జిల్లాలో కొత్తగా మూడు బార్లకు డ్రా తీయగా, ఇప్పటివరకు రెండు బార్లు మాత్రమే ప్రారంభించేందుకు సమాయత్తమవుతున్నాయి. రామాయంపేట్కు మంజూరైన బార్ ఇప్పట్లో ప్రారంభమయ్యే అవకాశాలు లేవని ఎక్సైజ్ అధికారులు పేర్కొంటున్నారు. చదవండి: Afghanistan: ‘శవాలపై కూడా అత్యాచారాలకు పాల్పడతారు’ -
త్వరలోనే థర్డ్ వేవ్!
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్ సెకండ్ వేవ్ దాదాపు ముగిసిపోయి, మహమ్మారి వ్యాప్తి ప్రస్తుతం కొంత నెమ్మదించినప్పటికీ థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. సెప్టెంబర్–అక్టోబర్ నెలల మధ్య ఎప్పుడైనా విరుచుకుపడే ప్రమాదం కనిపిస్తోందని వెల్లడించింది. థర్డ్ వేవ్ తీవ్రతను తగ్గించాలంటే కరోనా వ్యాక్సినేషన్ను వేగవంతం చేయాలని, సాధ్యమైనంత ఎక్కువ మందికి త్వరగా టీకా ఇవ్వాలని సూచించింది. కేంద్ర హోంశాఖ పరిధిలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్(ఎన్ఐడీఎం) ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ తాజాగా తన నివేదికను ప్రధానమంత్రి కార్యాలయానికి(పీఎంఓ) సమర్పించింది. మూడో వేవ్లో పెద్దలకు ఉన్నట్లే చిన్నారులకు సైతం కరోనా ముప్పు ఉంటుందని తెలిపింది. భారీ సంఖ్యలో పిల్లలు వైరస్ బారినపడితే చికిత్స అందించడానికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని పేర్కొంది.చదవండి: Andhra Pradesh: ఇళ్లకు సుముహూర్తం కొత్త వేరియంట్లతో ముప్పు జనాభాలో 67 శాతం మందిలో కరోనాను ఎదుర్కొనే రోగ నిరోధక శక్తి ఇన్ఫెక్షన్ లేదా వ్యాక్సినేషన్ ద్వారా యాంటీబాడీలు పెరిగితే హెర్డ్ ఇమ్యూనిటీ సాధించినట్లేనని నిపుణుల కమిటీ గతంలో అభిప్రాయపడింది. ప్రమాదకరమైన కొత్త వేరియంట్లు పుట్టుకొస్తే మాత్రం హెర్డ్ ఇమ్యూనిటీపై ఆశలు వదులుకోవాల్సిందేనని తాజాగా తెలిపింది. ఒకసారి సోకిన కరోనా ఇన్ఫెక్షన్ లేదా వ్యాక్సినేషన్ ద్వారా శరీరంలో పెరిగిన రోగ నిరోధక శక్తి నుంచి కొత్త వేరియంట్లు తప్పించుకొనే అవకాశం ఉంటుందని పేర్కొంది. కొత్త వేరియంట్ల ప్రభావం నుంచి కాపాడుకోవడానికి వీలుగా సామూహిక నిరోధకత సాధించడానికి జనాభాలో 80–90 శాతం మందికి వ్యాక్సిన్ ఇవ్వడాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించింది. కరోనా మూడో వేవ్ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు సన్నద్ధం కావాలని తెలిపింది. సామూహిక నిరోధకత సాధించేదాకా.. భారత్లో ఇప్పటిదాకా 7.6 శాతం మందికే (10.4 కోట్లు) పూర్తిస్థాయిలో కరోనా వ్యాక్సినేషన్ జరిగిందని నిపుణుల కమిటీ తెలిపింది. వ్యాక్సినేషన్లో వేగం పెంచకపోతే థర్డ్ వేవ్లో నిత్యం 6 లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యే అవకాశాలను కొట్టిపారేయలేమని తేల్చిచెప్పింది. ఇన్ఫెక్షన్ లేదా వ్యాక్సినేషన్ ద్వారా సామూహిక నిరోధకత (హెర్డ్ ఇమ్యూనిటీ) సాధించేదాకా కరోనాలో కొత్త వేవ్లు వస్తూనే ఉంటాయని వైద్య నిపుణులు అంచనా వేశారని గుర్తుచేసింది. కరోనా నియంత్రణ నిబంధనలను ఎత్తివేయడాన్ని బట్టి ఇండియాలో థర్డ్ వేవ్ మూడు రకాలుగా ఉండే అవకాశాలు ఉన్నాయని ఐఐటీ–కాన్పూర్ నిపుణులు గతంలో తెలిపారు. ఒకటి.. థర్డ్ వేవ్ అక్టోబర్లో గరిష్ట స్థాయికి చేరుతుంది. నిత్యం 3.2 పాజిటివ్ కేసులు వెలుగు చూస్తాయి. రెండోది.. అధిక తీవ్రత కలిగిన కొత్త వేరియంట్లు పుట్టుకురావడంతో థర్డ్ వేవ్ సెప్టెంబర్లో గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. ప్రతిరోజూ 5 లక్షల కేసులు బయటపడతాయి. ఇక మూడోది.. అక్టోబర్ మాసాంతంలో థర్డ్ వేవ్ గరిష్ట స్థాయికి చేరుతుంది. నిత్యం 2 లక్షల పాజిటివ్ కేసులు నమోదవుతాయి. వైరస్లో మార్పులు.. పిల్లలకు సవాలే థర్డ్ వేవ్లో పెద్దల కంటే పిల్లలే అధికంగా ప్రభావితం అవుతారని చెప్పడానికి ఇప్పటివరకైతే తగినంత సమాచారం లేదని నిపుణులు కమిటీ వివరించింది. కరోనా వైరస్లో క్రమంగా మార్పులు జరుగుతున్నాయి కాబట్టి అవి పిల్లలకు పెద్ద సవాలుగా మారే ప్రమాదం ఉందని పేర్కొంది. పిల్లల కోసం కరోనా వ్యాక్సిన్లు ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదని గుర్తుచేసింది. ఒకవేళ చిన్నారులకు కరోనా సోకినా అసలు లక్షణాలేవీ కనిపించకపోవడం, స్వల్పంగా కనిపించడం వంటివి ఉంటాయని వివరించింది. వారు అప్పటికే ఇతర వ్యాధులతో బాధపడుతున్నవారు లేదా ప్రత్యేక అవసరాలు ఉన్నవారైతే పరిస్థితి తీవ్రంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ గణాంకాల ప్రకారం.. కరోనా సోకి ఆసుపత్రిలో చేరిన చిన్నారుల్లో 60–70 శాతం మంది ఇతర వ్యాధులతో బాధపడుతున్నవారు లేదా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారే కావడం గమనార్హం. కరోనా నుంచి కోలుకున్న తర్వాత పిల్లల్లో అపాయకరమైన ఎంఐఎస్–సి(మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్) తలెత్తే అవకాశం ఉందని నిపుణుల కమిటీ తన నివేదికలో తెలియజేసింది. చదవండి:Andhra Pradesh: వెనకబాటు నుంచి వెన్నెముకగా..! ప్రమాదకరమైన వేరియంట్ పుట్టుకొస్తేనే థర్డ్ వేవ్ కరోనాలో డెల్టా కంటే ఎక్కువ తీవ్రత కలిగిన కొత్త వేరియంట్ ఉద్భవిస్తే థర్డ్ వేవ్ నవంబర్లో గరిష్ట స్థాయికి చేరే అవకాశం ఉందని ఐఐటీ–కాన్పూర్కు చెందిన ప్రముఖ సైంటిస్టు మహీంద్ర అగర్వాల్ సోమవారం చెప్పారు. ఇది సెప్టెంబర్ ఆఖరు నాటికి పూర్తి క్రియాశీలకంగా మారుతుందని అన్నారు. డెల్టా కంటే ప్రమాదకరమైన వేరియంట్ పుట్టుకురాకపోతే థర్డ్ వేవ్ దాదాపు రానట్లేనని అగర్వాల్ స్పష్టం చేశారు. ఒకవేళ ఇలాంటి కొత్త వేరియంట్ బయటపడితే మూడో వేవ్లో నిత్యం 1.5 లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. -
Covid-19: మూడో ప్రమాద హెచ్చరిక
మరోసారి ప్రమాదఘంటిక మోగింది. అప్రమత్తత అవసరాన్ని గుర్తు చేసింది. పెద్దల విషయంలోనే కాదు... పిల్లల కోసం కరోనాపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నామో సరిచూసుకొమ్మని పారా హుషార్ పలికింది. ఒక్కమాటలో, జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ (ఎన్ఐడీఎం) సారథ్యంలోని నిపుణుల కమిటీ తాజా నివేదిక కొత్త యుద్ధానికి సిద్ధం కమ్మని చెబుతోంది. వివిధ అధ్యయనాలు ఇప్పటికే చెప్పినట్టు కరోనా థర్డ్వేవ్ రావడం ఖాయమనీ, అది అక్టోబర్ ద్వితీయార్ధానికి తారస్థాయికి చేరుకోవచ్చనీ ఈ సంఘం ప్రధానమంత్రి కార్యాలయానికి తెలియజేసింది. ఈసారి పెద్దలతో సమానంగా పిల్లలకూ ముప్పుంది... పెద్ద సంఖ్యలో పిల్లలు కరోనాకు గురైతే, అవసరమైన వైద్య సిబ్బంది, వెంటిలేటర్లు, అంబులెన్సుల సహా వసతులే లేవని హెచ్చరించింది. ఇతర ఆరోగ్య సమస్యలున్న పిల్లలకూ, అంగవికలురకూ మున్ముందుగా టీకాలు వేయాలని సంఘం ప్రభుత్వానికి సూచించింది. ఇక, కరోనాతో సహజీవనంలో సరికొత్త సమరానికి సిద్ధం కావాల్సింది మనమే. ‘ప్రజలకు సంకల్పం, మోదీ మార్గదర్శనం ఉంటే చాలు... అసలు థర్డ్ వేవ్ రానే రాద’ని దేశ కొత్త ఆరోగ్య మంత్రి పార్లమెంట్ సాక్షిగా సహచరుల చప్పట్ల మధ్య ఇటీవలే ప్రకటించారు. దురదృష్టవశాత్తూ, శాస్త్రీయ అధ్యయనంతో నిపుణులిచ్చిన తాజా నివేదిక అందుకు విరుద్ధంగా ఉందన్నమాట. సాక్షాత్తూ కేంద్ర హోమ్ శాఖ ఉత్తర్వుల మేరకు డాక్టర్ గగన్దీప్ కాంగ్ లాంటి పలువురు ప్రముఖ నిపుణులతో ఏర్పాటైన సంఘం ఇది. ప్రభుత్వమే వేసిన అంతటి సంఘం ఇలాంటి నివేదిక ఇచ్చిందంటే – పాలకులు కచ్చితంగా ఆలోచించాల్సిందే! దేశంలోని వివిధ ప్రాంతాల్లో జూలై చివరి వారంలో కరోనా ‘ఆర్’ వ్యాల్యూ 0.96 నుంచి 1 పైగా పెరగడాన్ని బట్టి చూస్తే, థర్డ్వేవ్ ఇప్పటికే పడగ విప్పినట్టు అర్థమవుతోందని కూడా నిపుణుల నివేదిక పేర్కొనడం గమనార్హం. ఇప్పుడున్న టీకాల సత్తాను మించిన బలమైన, కొత్త వేరియంట్లు థర్డ్వేవ్లో వచ్చే ముప్పుందనేది నివేదిక సారాంశం. అయితే, కరోనా వచ్చినా ప్రాణాంతకం కాకుండా కాపాడే ఇప్పుడున్న టీకాలనైనా ఎంత వేగంగా వేస్తున్నాం? కరోనా పూర్తి కట్టడిలోకి వచ్చిందనుకున్న ఇజ్రాయెల్ లాంటి దేశాల్లోనూ కేసులు పెరుగుతున్నాయి. ఆ దేశం ఇప్పుడు బూస్టర్ డోస్గా మూడో డోస్ వేస్తుండడం గమనార్హం. మన దేశంలో 58.25 కోట్ల పైగా టీకా డోసులు వేశామని పాలకులు రొమ్ము విరుచుకుంటున్నారు. కానీ, అందులో 45.15 కోట్ల పైగా మొదటి డోసులే. మిగతా 13.10 కోట్లు రెండో డోసులు. దేశజనాభాలో 13.87 శాతం మందికే కరోనా టీకా రెండు డోసులూ వేయడం పూర్తయింది. అంటే, మన దేశంలో నూటికి 84 మందికి టీకాలు పూర్తిగా వేయనే లేదు. ఇది కేంద్ర ఆరోగ్యశాఖే చెప్పిన మాట. ఈ ఆగస్టులో తొలి పది రోజులతో పోలిస్తే, తరువాతి పది రోజుల్లో రోజువారీ వేస్తున్న టీకా డోసుల సంఖ్య 48.8 లక్షల నుంచి 57 లక్షలకు పెరిగింది. ఆ మేరకు సంతోషమే. కానీ, రోజుకు 98 లక్షల డోసులైనా వేస్తే తప్ప, ఈ ఏడాది చివరికి కనీసం వయోజనుల వరకైనా టీకాలేయడం పూర్తి కాదు. ఆ సంగతి పాలకులు గుర్తించి, టీకా ప్రక్రియ వేగం పెంచాల్సిందే. చిన్నారులకు ముప్పుందని తాజా నివేదిక మళ్ళీ చెబుతున్న నేపథ్యంలో వాస్తవ గణాంకాలు నిర్లక్ష్యం పనికి రాదని నిద్ర లేపుతున్నాయి. ప్రజారోగ్య రంగంలో గత పాలకుల నిర్లక్ష్యపు పాపం ఇప్పుడు శాపమైంది. దేశంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నేటికీ పిల్లల వైద్యులకు 82 శాతం కొరత ఉంది. ప్రజారోగ్య కేంద్రాల్లో 63 శాతం మేర టీకాల కొరత. ప్రజాసామ్యంలో అత్యున్నతమైన పార్లమెంట్ వేసిన ఓ స్థాయీ సంఘం వెల్లడించిన లెక్కలివి. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే, రేపు థర్డ్ వేవ్ వచ్చి భారీ సంఖ్యలో పిల్లలు కరోనా బారిన పడితే ప్రజారోగ్య రంగం కుప్పకూలడం ఖాయం. నిపుణుల ఆందోళన కూడా అదే! ఇదే సమయంలో నేటి ఏపీ సర్కారు కొంతకాలంగా ప్రజారోగ్యరంగంలో మౌలిక వసతులపై దృష్టిపెట్టి, మంచి ఫలితాలు చూపిస్తోంది. అదే ఇప్పుడు మిగతా దేశానికీ ఆదర్శం. అలాగే, గత వారం విరిసిన ఓ చిన్న వెలుగు రేఖ – 12 నుంచి 18 ఏళ్ళ లోపు పిల్లల కోసం మన దేశంలో తయారైన కొత్త టీకా. పిల్లలకు తగ్గట్టే సూది లేకుండా వేసే ఈ మూడు డోసుల ‘జైకోవ్–డి’ టీకాకు నిజానికి 66 శాతం మేర సామర్థ్యమే ఉంది. అయితేనేం, అత్యవసర వినియోగం కోసం భారత ఔషధ నియంత్రణ జనరల్ ఆమోదించింది. భారత్ బయోటెక్ తయారీ కోవ్యాగ్జిన్ తర్వాత ఈ కొత్త ‘జైడస్ క్యాడిలా’ మన దేశవాళీ రెండో టీకా. వచ్చేనెల పరిమితంగా అందుబాటులోకి వచ్చే ఈ టీకాతో పిల్లలకు కచ్చితంగా కొంత ఉపశమనమే. అయితే, దేశంలో 15 నుంచి 20 కోట్ల మేర ఉండే ఆ వయసు పిల్లల కోసం కేంద్ర సర్కారు సార్వత్రిక టీకా విధానంపై దృష్టి పెట్టడం అవసరం. ప్రైవేటుకే అంతా వదిలేస్తే కష్టం. ఈ కరోనా టీకాల బృహత్ కార్యక్రమం ప్రపంచం మొత్తానికీ ఉన్న బరువు, బాధ్యత. నిజానికి, బీద దేశాల్లో ఇప్పటికీ 2 శాతం జనాభాకే టీకాలు వేయగలిగారు. ఈ పరిస్థితుల్లో ఒకపక్క టీకాల ఉత్పత్తి, సరఫరా భారీగా పెంచాలి. మరోపక్క ఆ టీకాలు పరమౌషధంగా పనిచేసేలా చూసుకోవాలి. ఈ రెండూ పెను సవాళ్ళే. ఈ సవాళ్ళను భారత్ ఇప్పుడు అధిగమించాలి. దీపాలు వెలిగించి, పళ్ళాలతో చప్పుళ్ళు చేస్తే చాలు కరోనా పోతుందని చెప్పిన పాలకులున్న దేశంలో... తాజా నివేదిక మరోసారి ‘శాస్త్రీయ దృక్పథంతో’ ప్రజారోగ్య రంగంలో సన్నద్ధతకు పిలుపునివ్వడం కీలకం. భావిపౌరుల కోసం పాలకులు తక్షణ కార్యాచరణకు దిగితే మంచిది. ఎందుకంటే, ఆలస్యమ్... అమృతం విషం! -
Covid-19: భారత్లో అక్టోబర్లో థర్డ్వేవ్
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి కొనసాగుతూనే ఉంది. కొద్ది రోజుల నుంచి భారత్లో సెకండ్ వేవ్ ఉధృతి కొద్దిగా తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో భారీ తగ్గుదల కనిపిస్తుంది. అయితే కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదని.. త్వరలో థర్డ్ వేవ్ రానుందని నిపుణలు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో భారత్లో అక్టోబర్లో కోవిడ్ థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉన్నట్లు పీఎంవోకు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్ఐడీఎం) నిపుణుల కమిటీ నివేదిక అందజేసింది. ఇక థర్డ్వేవ్లో పిల్లలపై ఎక్కువ ప్రభావం ఉంటుందని ఎన్ఐడీఎం హెచ్చరించింది. (చదవండి: 4 నెలలు.. రూ.900 కోట్ల నష్టం) థర్డ్వేవ్ను దృష్టిలో పెట్టుకుని మెరుగైన వైద్యం కోసం సన్నద్ధం కావాలని ఎన్ఐడీఎం సూచించింది. థర్డ్వేవ్ సమయంలో ప్రస్తుతం ఉన్న వైద్య సదుపాయాలు సరిపోవని నివేదికలో వెల్లడించారు. ఇక చిన్న పిల్లలకు వైద్యం కోసం సిబ్బందిని పెంచాలని సూచించారు. వైద్య పరికరాలు, వెంటిలేటర్లు, అంబులెన్స్ల సంఖ్యను పెంచాలని తెలిపారు. దేశంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 82 శాతం శిశు వైద్యుల కొరత ఉండగా.. దేశవ్యాప్తంగా కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో 63 శాతం ఖాళీలు ఉన్నట్లు ఎన్ఐడీఎం నివేదిక తెలిపింది. థర్డ్వేవ్ ముప్పును దృష్టిలో పెట్టుకుని వైద్యుల కొరత, ఆరోగ్య కేంద్రాల్లో ఖాళీల భర్తీకి చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించింది. చదవండి: పిల్లలకూ కరోనా వ్యాక్సిన్ సిద్ధం.. ఎలా పనిచేస్తుంది? -
Corona Virus: మరో వేవ్ రాకపోవచ్చా?
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి కట్టడికి ప్రతీ ఒక్కరు తప్పనిసరిగా మాస్క్ ధరించడంతో పాటు, వ్యాక్సిన్ తీసుకోవాలని పుణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ డైరెక్టర్ ప్రియా అబ్రహం తెలిపారు. ప్రస్తుతం పిల్లలకు ఇచ్చే కోవాగ్జిన్ ట్రయల్ త్వరలోనే పూర్తవుతుందని, సెప్టెంబర్ నెలాఖరు కల్లా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బుధవారం కోవిడ్ –19 విషయంలో జరుగుతున్న శాస్త్రీయ పరిణామాలపై ఇండియా సైన్స్ అనే సంస్థతో ప్రియా అబ్రహం వర్చువల్గా మాట్లాడారు. పిల్లలపై కోవాక్సిన్ ట్రయల్ ఏ దశలో నడుస్తోంది. పిల్లలకు వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది? ప్రస్తుతం 2–18 సంవత్సరాల వయస్సు గల పిల్లల కోసం కోవాగ్జిన్ రెండో దశ, మూడో దశ ట్రయల్స్ జరుగుతున్నాయి. త్వరలో ఫలితాలు అందుబాటులోకి రానున్నాయి. రెగ్యులేటర్స్కు ఈ ఫలితాలు అందిస్తారు. కాబట్టి సెప్టెంబర్ నెలాఖరుకు లేదా ఆ తర్వాత కొన్ని రోజుల్లోనే పిల్లలకు కోవిడ్ –19 వ్యాక్సిన్లను అందించ గలుగుతాం. ఇది కాకుండా, జైడస్ క్యాడిలా వ్యాక్సిన్ ట్రయల్ కూడా జరుగుతోంది. ఇది పిల్లలకు సైతం ఉపయోగిం చవచ్చు. త్వరలో ఇది కూడా అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు ఏవైనా డెల్టా–ప్లస్ వేరియంట్పై ప్రభావవంతంగా ఉన్నాయా? డెల్టా వేరియంట్ కంటే డెల్టా–ప్లస్ వేరియంట్ వ్యాప్తి చెందే అవకాశం తక్కువ అనే విష యాన్ని గుర్తుంచుకోవాలి. ప్రధానంగా డెల్టా వేరియంట్ 130కి పైగా దేశాలలో ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. ప్రస్తుతం ఈ వేరియంట్ అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో మేము ఈ వేరియంట్ మీద అధ్యయనాలు చేశాం. మేము వ్యాక్సిన్లు వేసిన వ్యక్తుల శరీరాలలో ఉత్పత్తి అయిన యాంటీబాడీలను అధ్యయనం చేసిప్పుడు ఈ వేరియంట్కు వ్యతిరేకంగా యాంటీబాడీల సమర్థత కొంత తగ్గినట్లు కను గొన్నాం. అయినప్పటికీ వ్యాక్సిన్లు ఇప్పటికీ వేరి యంట్లను ఎదుర్కొనే విషయంలో రక్షణగా ఉన్నాయి. అవి కొంచెం తక్కువ సామర్థ్యాన్ని చూపించవచ్చు. కానీ ఇలాంటి మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి వ్యాక్సిన్లు చాలా ముఖ్యమైనవి. వ్యాక్సిన్ తీసుకోని ఎవరైనా వైరస్ బారిన పడి ఆసుపత్రిలో చేరడం, పరిస్థితి విషమంగా మారితే చనిపోయే అవకాశాలుం టాయి. కాబట్టి వేరియంట్ ఏౖదైనప్పటికీ ఇప్ప టివరకు డెల్టా వేరియంట్తో సహా అన్నింటి విషయంలో వ్యాక్సిన్ రక్షణగా ఉంటుంది. ఈ విషయంలో ఎలాంటి సంకోచం ఉండరాదు. రాబోయే కాలంలో మనకు బూస్టర్ డోస్లు అవసరమా? ఈ విషయంపై ఏదైనా అధ్యయనం జరుగుతోందా? బూస్టర్ డోస్లపై అధ్యయనాలు విదేశాలలో జరుగుతున్నాయి. బూస్టర్ డోస్ల కోసం కనీసం ఏడు వేర్వేరు వ్యాక్సిన్లను ప్రయత్నిం చారు. కానీ ప్రస్తుతం మరిన్ని దేశాలు వ్యాక్సిన్లు వేసే వరకు డబ్ల్యూహెచ్ఓ బూస్టర్లపై అధ్యయనాలను నిలిపివేసింది. ధనికదేశాలు బూస్టర్ డోసులు ఇవ్వడం ప్రారంభిస్తే పేదదేశాలకు వ్యాక్సిన్లు అందుబాటులోకి రావనే ఉద్దేశంతో డబ్ల్యూహెచ్ఓ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే భవిష్యత్తులో బూస్టర్ల కోసం సిఫార్సులు ఖచ్చితంగా వస్తాయి. వ్యాక్సిన్ల మిక్స్ అండ్ మ్యాచ్ వినియోగంపై అధ్యయనాలు జరుగుతున్నాయా? అది ఏ మేరకు ప్రయోజనకరంగా ఉంటుంది? మన దేశంలో పొరపాటున 2 డోసుల్లో రెండు వేర్వేరు కంపెనీల వ్యాక్పిన్లను కొందరికి ఇవ్వ డం జరిగింది. వీరిపై అధ్యయనం చేశాం. వేర్వే రు వ్యాక్సిన్లు తీసుకున్న రోగులు సురక్షితంగా ఉన్నారని మేము గుర్తించాం. వారిపై ఎటువంటి ప్రతికూల ప్రభావం కనిపించలేదు. వారిలో యాంటీబాడీలు కొద్దిగా మెరుగ్గా ఉన్నాయి. కాబట్టి ఇది కచ్చితంగా సురక్షితమే. మేము ఈ విషయంపై అధ్యయనం చేస్తున్నాం. బర్డ్–ఫ్లూ లేదా జికా వైరస్ సోకిన వ్యక్తులు కోవిడ్–19 సంక్రమణకు గురవుతారా? బర్డ్ ఫ్లూ, జికా వైరస్లు కరోనా వైరస్తో ఏమాత్రం సంబంధం లేనివి. కానీ బర్డ్ ఫ్లూ, స్వైన్ ఫ్లూ, కరోనా వైరస్లకు ఉండే సారూప్యత కారణంగా వాటి వ్యాప్తిని మాస్క్లు, భౌతిక దూరం, చేతుల శుభ్రత, ఇంటి కోవిడ్ పోటోకాల్స్ పాటించడం ద్వారా నిరోధిం చవచ్చు. ఈ వైరస్లు అన్నీ శ్వాస మార్గము ద్వారానే సంక్రమిస్తాయి. అయితే జికా వైరస్ దోమ కాటు ద్వారా వ్యాపిస్తుంది. మరో వేవ్ రాకపోవచ్చా? అలా ఏమీ ఉండదు. కొత్త వేరియంట్లు వస్తూనే ఉంటాయి. కానీ ప్రతీ ఒక్కరు మాస్క్లు ధరించడం, వీలైనంత త్వరగా వ్యాక్సిన్ వేసుకోమని ప్రోత్సహించాలి. అప్పుడు మరో వేవ్ వచ్చినా, అది అంత ప్రభావవంతంగా ఉండదు. -
Third Wave: మూడో వేవ్కు రెడీగా..
►1,119 మంది పీజీ మెడికల్ రెసిడెంట్లను కోవిడ్ మేనేజ్మెంట్ విధుల కోసం తాత్కాలిక పద్ధతిన నియమించుకోవాలి. నెలకు రూ.25 వేల రెమ్యునరేషన్ ఇవ్వాలి. ►200 మంది ఎంబీబీఎస్ ఫైనలియర్ విద్యార్థులను వచ్చే ఏడాది మార్చి వరకు తాత్కాలిక పద్ధతిన తీసుకోవాలి. వారికి రూ.22 వేల చొప్పున చెల్లించాలి. సాక్షి, హైదరాబాద్: కరోనా మూడో వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం ముందస్తు సన్నాహాలు మొదలుపెట్టింది. నిర్ధారణ పరీక్షల దగ్గరి నుంచి ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్ల వరకు ఏర్పాట్లపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా అత్యవసర కోవిడ్ రెస్పాన్స్ ప్యాకేజీ ఫేజ్–2 కింద తెలంగాణకు రూ.456 కోట్లు కేటాయించింది. ఇప్పటినుంచి వచ్చే ఏడాది మార్చి 31వరకు ఏయే పనులకు నిధులు అవసరమన్న దానిపై రాష్ట్రవైద్య, ఆరోగ్యశాఖ పంపిన ప్రతిపాదనలను ఆమోదించింది. ఆయా పనులు, కార్యకలాపాల కోసమే ఈ నిధులను ఖర్చు చేయాలని, ఇతర రంగాలకు మళ్లించవద్దని స్పష్టం చేసింది. నెలవారీ ఫైనాన్షియల్ రిపోర్టులు సమర్పించాలని ఆదేశించింది. ప్రస్తుతం కోవిడ్ అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడంపై దృష్టి సారించినా.. ప్రజా రోగ్య వ్యవస్థను బలోపేతం చేయాలనే లక్ష్యాన్ని మరిచిపోకూడదని స్పష్టం చేసింది. ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేసే రంగాలపై నిధులు ఖర్చు చేయవచ్చని సూచించింది. ఇందులో 60% కేంద్ర నిధులు, 40% రాష్ట్ర ప్రభుత్వ వాటా ఉండనున్నాయి. కేంద్ర వాటాను విడతల వారీగా విడుదల చేయనుంది. పిల్లల రక్షణపై ప్రత్యేక దృష్టి: ముందస్తు ఏర్పాట్ల ప్రతిపాదనల్లో.. వైద్యారోగ్యరంగంలో మౌలిక సదుపాయాలకు, ప్రధానంగా పీడియాట్రిక్ కేర్ యూనిట్లకు పెద్దపీట వేశారు. ఈ రంగాలకు రూ.270 కోట్లు కేటాయించగా.. ఇందులో పీడియాట్రిక్ కేర్ యూనిట్ల కోసమే రూ.86.90 కోట్లు ఇచ్చారు. పీడియాట్రిక్ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్గా హైదరాబాద్లోని నీలోఫర్ ఆస్పత్రిని అభివృద్ధి చేయాలని నిర్ణయించారుస్పీ ఆస్పత్రికి రూ.2.75 కోట్లు కేటాయించారు. ఆస్పత్రి రూపురేఖలు మార్చి, పిల్లల చికిత్సలో మోడల్గా ఉండేలా తీర్చిదిద్దనున్నారు. ఇక ప్రధాన ఆస్పత్రుల్లో ఐసీయూ పడకలను పెంచాలని, అందులో 20 పీడియాట్రిక్ బెడ్స్ ఉండేలా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. మూడో వేవ్లో కరోనా పిల్లలపై ప్రభావం చూపుతుందన్న అంచనాల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకోనున్నట్టు అధికారులు చెప్తున్నారు. భారీగా ఆర్టీపీసీఆర్, యాంటిజెన్ కిట్ల కొనుగోలు కరోనా మూడో వేవ్ మొదలైతే.. వెంటనే గుర్తించేలా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ఏకంగా 1.10 కోట్ల యాంటిజెన్ కిట్లను, 30.77 లక్షల ఆర్టీపీసీఆర్ కిట్లను కొనుగోలు చేయాలని నిర్ణయించారు. వీటికోసం కేంద్రం రూ.92.38 కోట్లు కేటాయించింది. ఆర్టీపీసీఆర్ ఒక్కో కిట్ ధర రూ.50, యాంటిజెన్ కిట్ ధర రూ.70గా నిర్ధారించింది. అలాగే ఆర్టీపీసీఆర్ లేబొరేటరీలను బలోపేతం చేసేందుకు రూ.5.10 కోట్లు.. అత్యవసర కోవిడ్ మందులు, డయాగ్నస్టిక్ సేవల కోసం రూ.130.48 కోట్లు కేటాయించారు. మరిన్ని ఏర్పాట్లు, చర్యలివీ.. ►270 మంది జీఎన్ఎం నర్సింగ్ ఫైనలియర్ విద్యార్థులను నెలకు రూ.18 వేలతో.. 380 మంది బీఎస్సీ నర్సింగ్ ఫైనలియర్ విద్యార్థులను రూ.20 వేల వేతనంతో తాత్కాలిక పద్ధతిన తీసుకోవాలి. ►మొత్తంగా మానవ వనరుల విస్తరణ కోసం రూ.40 కోట్లు ఖర్చు చేయవచ్చు. 27 చోట్ల 42 పడకలు, ఆరుచోట్ల 32 పడకలు ఉండే పీడియాట్రిక్ యూనిట్లు ఏర్పాటు చేయాలి. ►వచ్చే ఏడాది మార్చి నాటికి మెడికల్ కాలేజీల్లో 825 ఐసీయూ పడకలు, జిల్లా ఆస్పత్రుల్లో 90 ఐసీయూ పడకలను చిన్నపిల్లల కోసం ప్రత్యేకంగా కేటాయించాలి. ►451 రిఫరల్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థలను సిద్ధం చేయాలి. ►రూ.15 కోట్లతో హాస్పిటల్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ వ్యవస్థలను, రూ.26 కోట్లతో లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలి. -
Covid Third Wave: 2 శాతం పాజిటివిటీ దాటితే మళ్లీ లాక్డౌన్..?
సాక్షి, బెంగళూరు: కరోనా మూడో ఉధృతి వ్యాప్తి భయాలు విస్తరిస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ ఆంక్షల వైపు మొగ్గుచూపుతోంది. శనివారం సాయంత్రం ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అధ్యక్షతన నిపుణులు, అధికారులతో కీలక సమావేశం జరిగింది. థర్డ్ వేవ్ను అడ్డుకోవాలంటే లాక్డౌన్ తరహా ఆంక్షలను విధించక తప్పదని నిర్ణయించారు. కఠినతరం చేస్తాం: సీఎం.. సమావేశ అనంతరం సీఎం బొమ్మై మీడియాతో వివరాలు వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో లాక్డౌన్ అవసరం లేదు. కొత్త నిబంధనల బదులు ఉన్న వాటినే కఠినతరం చేస్తాం. కరోనా థర్డ్ వేవ్ చిన్నారులపై ప్రభావం చూపుతుందని అంటున్నారు కాబట్టి పిల్లలపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి అని తెలిపారు. తాజా నిబంధనలు అన్ని జిల్లాల్లో ఒకే విధంగా ఉండబోవని చెప్పారు. ఆంక్షలకే నిపుణుల సిఫార్సు.. కరోనా పాజిటివిటీ రేటు 2 శాతం దాటిన ప్రాంతాల్లో లాక్డౌన్ చేస్తే బాగుంటుంది. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి ప్రయాణాలను నిషేధించాల్సిందేనని ఈ సమావేశంలో నిపుణులు పేర్కొన్నారు. పాఠశాలలు, కళాశాలల ప్రారంభానికి సెప్టెంబరు వరకు వేచి ఉంటే మేలు అని అభిప్రాయపడ్డారు. లాక్డౌన్ బదులు వారాంతపు కర్ఫ్యూ అమలు చేయడం ఉత్తమం. పండుగలు, జాతరల్లో జన సమ్మర్దాన్ని నివారించాలి. ఇతర రాష్ట్రాలవారికి నెగిటివ్ రిపోర్టు వస్తేనే అనుమతించాలి. సరిహద్దు జిల్లాల్లో కరోనా పరీక్షలను పెంచడంతో పాటు అందరికీ టీకా అందేలా చూడాలి అని అభిప్రాయపడ్డారు. కరోనా తీవ్రత పెరిగిన చోట ఈ నిబంధనలు విధిస్తారు అంత్యక్రియలకు 10 మందే హాజరు కావాలి. పబ్లు, బార్లు, జిమ్లు, యోగా సెంటర్లు, రిసార్టులు, పర్యాటక ప్రాంతాల బంద్ దేవస్థానాల్లో భక్తుల ప్రవేశం నిషేధం. ర్యాలీ, బహిరంగ సమావేశాలకు అనుమతి లేదు. జన రద్దీ మార్కెట్లను తాత్కాలికంగా మూసేయాలి. ఉదయం 6 నుంచి 11 గంటల వరకు నిత్యావసరాల విక్రయాలు వారాంతపు కర్ఫ్యూ శుక్రవారం సాయంత్రం 7 నుంచి మొదలవుతుంది. కరోనా తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లో విద్యాసంస్థలకు అవకాశం. ఒకవేళ పాఠశాలల్లో కేసులు నిర్ధారణ అయితే వారం రోజుల పాటు బంద్ చేయాల్సి ఉంటుంది. బెంగళూరులో వారాంతపు కర్ఫ్యూ ఉండదు. పాజిటివిటీ రేటు 2 శాతం కంటే తక్కువగా ఉంది. దాటితే నిబంధనల్లో మార్పు ఉంటుంది. -
థర్డ్వేవ్: భయం గుప్పిట్లో బెంగళూరు
సాక్షి, బెంగళూరు: కోవిడ్ మహమ్మారి రెండో దశ బలహీనమై కేసుల సంఖ్య తగ్గుతున్న తరుణంలో రాష్ట్రంలో మూడోదశ మొదలైందనే వార్త ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా కరోనా వైరస్ పిల్లలపై పంజా విసురుతోంది. ఆరోగ్య శాఖ అధికారిక సమాచారం మేరకు... గత 11 రోజుల్లో 543 మంది పిల్లలకు కరోనా సోకింది. ఆగస్టు ఒకటి నుంచి 11 వరకు 0–9 ఏళ్లలోపు పిల్లలకు 210 మంది, 10–18 మధ్య 333 మంది వైరస్ బారినపడ్డారు. వీరిలో 270 మంది బాలికలు, 273 మంది బాలురు ఉన్నారు. ఇదిలా ఉండగా 6–15 ఏళ్ల వయసు మధ్య వారితోపాటు 20 ఏళ్లలోపు టీనేజర్లు, నవజాత శిశువుల పట్ల అప్రమత్తంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. 1,669 పాజిటివ్, 1,672 మంది డిశ్చార్జి రాష్ట్రంలో కరోనా పంజా విసురుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 1,669 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా 1,672 మంది డిశ్చార్జ్ అయ్యారు. మరో 22 మంది చనిపోయారు. మొత్తం కరోనా కేసుల సంఖ్య 29,26,401కు చేరుకోగా 28,66,739 మంది కోలుకున్నారు. 36,933 మంది మరణించారు. 22,703 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. పాజిటివిటీ రేటు 0.98 శాతానికి పెరిగింది. బెంగళూరులో 425 కేసులు, 424 డిశ్చార్జిలు, ఐదు మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసులు 12,32,220కి చేరుకోగా 12,08,097 మంది కోలుకున్నారు. 15,933 మంది మరణించారు. నగరంలో ప్రస్తుతం 8,189 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం 1,69,332 మందికి కరోనా పరీక్షలు చేశారు. 1,47,715 మందికి కరోనా టీకా పంపిణీ చేశారు. -
కరోనాతో పోరుకు ఏపీ సిద్ధం
-
బెంగళూరులో హై అలర్ట్.. హడలెత్తిపోతున్న తల్లిదండ్రులు, కారణం ఏంటంటే..?
బెంగళూరు: బెంగళూరు మహానగరంలో గడిచిన కొద్ది రోజుల్లో చిన్న పిల్లల్లో భారీ ఎత్తున కరోనా కేసులు బయటపడటంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. 6 రోజుల వ్యవధిలో 300 మందికి పైగా పిల్లలకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో నగరంలో హై అలర్ట్ ప్రకటించారు. ఆగస్టు 5 నుంచి 10వ తేదీ మధ్యలో 127 మంది పదేళ్ల లోపు పిల్లలకు కరోనా పాజిటివ్గా తేలగా, మరో 174 మంది 10 నుంచి 19 ఏళ్ల వయసు మధ్య పిల్లలు మహమ్మారి బారిన పడ్డారు. పిల్లల్లో ప్రమాదకర స్థాయిలో కరోనా కేసులు బయటపడుతుండటంతో బృహత్ బెంగళూరు మహానగర పాలిక, కర్ణాటక వైద్య ఆరోగ్యశాఖలు అప్రమత్తమై కరోనా కట్టడికి చర్యలు చేపడుతున్నాయి. మహమ్మారిని కట్టడి చేసేందుకు బెంగళూరు నగరంలో 144 సెక్షన్ ను విధించారు. పిల్లలకు కరోనా టీకాలు ఇవ్వడంపై ఇంకా స్పష్టత లేని సమయంలో కరోనా కేసులు భారీ స్థాయిలో వెలుగుచూస్తుండటంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉంటే, భారత్లో కరోనా థర్డ్ వేవ్ సమయంలో పిల్లలు కూడా వైరస్ బారిన పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరికొన్ని రోజుల్లో పిల్లల్లో కొవిడ్ కేసుల సంఖ్య మూడు రెట్లు పెరిగే ప్రమాదముందని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో పిల్లల్ని ఇళ్లలో నుంచి బయటికి రాకుండా కట్టడి చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని సూచిస్తున్నారు. -
థర్డ్వేవ్: పిల్లలపై ప్రభావం ఎలా ఉండొచ్చు?
పిల్లలపై ప్రభావం ఎలా ఉండొచ్చు? థర్డ్ వేవ్ పిల్లలపై ప్రభావం చూపుతుందని చాలా మంది భయపడ్డారు. అయితే అంత ఎక్కువగా ప్రభావం చూపకపోవచ్చు. పిల్లల్లోనూ యాంటీబాడీస్ ఏర్పడుతున్నాయి. పిల్లలకు వ్యాక్సిన్లపై ప్రయోగాలు జరుగుతున్నాయి. వారికి వ్యాక్సిన్లు వేస్తే సురక్షితంగా స్కూళ్లకు పంపొచ్చు. సాక్షి, హైదరాబాద్: ఆగస్టు చివరన లేదా సెప్టెంబర్ మొదటి వారంలో మైల్డ్గా కోవిడ్ థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలున్నాయని ప్రముఖ వైద్యుడు, ఏఐజీ ఆసుపత్రుల చైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వర్రెడ్డి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఇంకా సెకండ్ వేవ్ కేసులు పూర్తిగా తగ్గలేదని, థర్డ్ వేవ్ వచ్చినా తక్కువ తీవ్రతతోనే వచ్చే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. వచ్చే 3, 4 నెలల దాకా కరోనా జాగ్రత్తలు పాటిస్తూ, వ్యాక్సినేషన్ వేగం పెంచితే ఈ గండం నుంచి గట్టెక్కొచ్చని చెప్పారు. రాబోయే రోజుల్లో పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్ పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కరోనాకు సంబంధించి ప్రస్తుత పరిస్థితులపై డా.డి.నాగేశ్వర్రెడ్డితో ‘సాక్షి’ప్రత్యేక ఇంటర్వ్యూ.. ప్రశ్న: ప్రస్తుత కోవిడ్ పరిస్థితిపై మీ అంచనా? జవాబు: సెకండ్ వేవ్ పూర్తిగా తగ్గలేదు. దేశవ్యాప్తంగా కేసులు వస్తూనే ఉన్నాయి. థర్డ్ వేవ్ వచ్చినా మధ్యస్థంగానే ఉండొచ్చు. దేశవ్యాప్తంగా రోజుకు కోటి డోసుల లెక్కన వ్యాక్సిన్ వేస్తే.. డెల్టా వేరియేషన్ కూడా సమస్య కాకపోయేది. ప్రస్తుతం రోజుకు 40 లక్షల డోసులే వేస్తున్నారు. జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషన్ను బయోలాజికల్ ఇవాన్స్ మొదలుపెట్టనుంది. త్వరలోనే జైడస్కు కూడా అనుమతి వస్తే మరో నెల రోజుల్లో టీకా కార్యక్రమం వేగవంతం అవుతుంది. అప్పుడు థర్డ్ వేవ్ ప్రభావాన్ని మరింత తగ్గించొచ్చు. ప్రశ్న: ‘డెల్టా’ ఏ మేరకు వ్యాప్తిలో ఉంది? జవాబు: కోవిడ్ జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పెళ్లిళ్లు, ఫంక్షన్లలో వందలాది మంది చేరడం వంటి కారణాలతో ఇంకా కేసులు పెరుగుతున్నాయి. 80% మందికి ఇమ్యునిటీ వస్తేనే ‘హెర్డ్ ఇమ్యూనిటీ’ఏర్పడి డెల్టా వేరియెంట్ పూర్తిగా పోతుంది. కొత్త వేరియెంట్లు కూడా రావు. మన దగ్గర డెల్టా ప్లస్ ఎక్కువగా లేదు. యాంటీ బాడీస్ పెరిగిన వారిపై కరోనా ప్రభావం చూపట్లేదు. కొందరు టీకా తీసుకున్నా కూడా యాంటీబాడీస్ ఏర్పడట్లేదు. అలాంటి వారిలో ఈ వ్యాధి సీరియస్గా మారే అవకాశాలున్నాయి. ప్రశ్న: చికిత్సకు సంసిద్ధమై ఉన్నామా? జవాబు: సెకండ్ వేవ్ అంత సీరియస్గా థర్డ్ వేవ్ ఉండదనే అంచనాలున్నాయి. థర్డ్ వేవ్లో దేశవ్యాప్తంగా గరిష్టంగా రోజు లక్ష దాకా కేసులు రావొచ్చు. వచ్చే అక్టోబర్ చివరి నుంచి కరోనా కేసులు బాగా తగ్గిపోవచ్చనేది అంచనా. అయినా ప్రజలు నిర్లక్ష్యం వహించకుండా 3, 4 నెలలు అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగం పెంచితే సెప్టెంబర్లో మైల్డ్గా థర్డ్ వేవ్ వచ్చి వెళ్లిపోతుంది. మోనో క్లోనల్ యాంటీ బాడీస్ చికిత్స అందుబాటులో ఉంది. ఈ ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా ఇప్పటివరకు 375 మంది కోలుకున్నారు. ప్రశ్న: టీకాల ప్రభావశీలత ఎలా ఉంటోంది? జవాబు: రెండు డోసులు తీసుకున్న వారిలో వ్యాక్సిన్ల ప్రభావశీలత (ఎఫికసీ) 95 శాతానికి పైగానే ఉంటోంది. ఇందులో కూడా వ్యాధి రాకుండా నిరోధించడం 75 శాతంగా ఉండగా, మరణాలు సంభవించకుండా టీకాలు 99 శాతం దోహదపడుతున్నాయి. సెకండ్ డోసు తీసుకున్న 15 రోజుల తర్వాతే పూర్తి రక్షణ వస్తుంది. ఒక డోసు వేయించుకున్న వారు, తగిన జాగ్రత్తలు పాటించకపోతే వైరస్ సోకే అవకాశాలున్నాయి. సింగిల్ డోస్ తీసుకున్న వారిలో కోవాగ్జిన్, కోవీషీల్డ్లో కొంచెం అటుఇటుగా 60 నుంచి 65 శాతం రక్షణ లభిస్తోంది. మొదటి టీకా తీసుకున్న 12 నెలల తర్వాత బూస్టర్ డోస్ వేసుకుంటే మంచిది. కరోనా వచ్చిన వారు ఒక్కడోస్ వ్యాక్సిన్ వేసుకుంటే సరిపోతుంది. ప్రశ్న: ప్రజలు కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తున్నారా? జవాబు: ప్రధాన నగరాల్లో బాగానే ఉన్నా చిన్న పట్టణాల్లో కొంత నిర్లక్ష్యం కన్పిస్తోంది. బహిరంగ ప్రదేశాల్లో భౌతిక దూరం పాటించడం, గాలి బాగా ఆడే ప్రదేశాల్లో ఉండటం, మూసి ఉన్న ప్రదేశాల్లో గుంపులుగా చేరకపోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రశ్న: పండుగల సీజన్ వల్ల కేసులు పెరిగే అవకాశాలున్నాయా? జవాబు: అక్టోబర్, నవంబర్ దాకా వివిధ పండుగలు ఉన్నందున ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఈ ఏడాది దసరా, దీపావళి పండుగలు పరిమితంగా ఇళ్లలోనే చేసుకుంటే మంచిది. ప్రశ్న: సెకండ్ వేవ్ నుంచి పాఠాలు నేర్చుకున్నామా? జవాబు: ఈ వైరస్కు వేగంగా మ్యుటేషన్లు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వేగంగా టీకాలు వేసుకుని అందరిలో ఇమ్యూనిటీ ఏర్పడేలా చూసుకోవాలన్నది తెలిసొచ్చింది. కరోనా సోకిణ వంద మందిలో కనీసం 30 మందిలో జీనోమ్ టైపింగ్ క్రమం తప్పకుండా చేయాలి. వైరస్లో ఎలాంటి మార్పులు జరుగుతున్నాయో జాగ్రత్తగా గమనించాలి. గత అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలు, అందుబాటులో ఉన్న చికిత్స పద్ధతులు, ప్రోటోకాల్స్తో మరణాల సంఖ్య బాగా తగ్గించుకోగలిగాం. ప్రశ్న: కొత్త కేసులు నమోదవుతున్నాయా? జవాబు: ఇప్పుడు పరిమితంగా క్లస్టర్స్, పాకెట్స్గా పాజిటివ్ కేసులు వస్తున్నాయి. ప్రభుత్వపరంగా క్లస్టర్ కంటైన్మెంట్ చర్యలు తీసుకుంటున్నారు. నగరంలో లేదా ఏదో ఒక కాలనీ, ప్రాంతంలో కేసుల పెరుగుదల కనిపిస్తే ఆ పరిధి వరకు క్లస్టర్ కంటైన్మెంట్ చేస్తే వ్యాప్తిని నియంత్రించొచ్చు. ప్రశ్న: వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగం ఎందుకు పుంజుకోవట్లేదు? జవాబు: మనకు తగినంతగా టీకా నిల్వలు అందుబాటులో లేకపోవడం ఓ కారణం. ఇప్పుడు వీటి లభ్యత క్రమంగా పెరుగుతోంది. సోషల్ మీడియాలో టీకా వ్యతిరేక ప్రచారంతో నష్టం జరిగింది. ఎవరికి ఏ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటే అది తీసుకోవాలి. ప్రభుత్వాలు ఉచితంగా అందిస్తున్నా పెద్ద సంఖ్యలో వ్యాక్సిన్లు ఎందుకు తీసుకోవట్లేదో అర్థం కావట్లేదు. -
విశాఖపట్నం: ఐదులోపు చూసి వెళ్లిపోవల్సిందే..
ఆదివారం వచ్చిందంటే చాలు సిటిజనులు ఎక్కడున్నా బీచ్లో వాలిపోవాల్సిందే..కరోనా కారణంగా చాలా రోజులు బీచ్ మొఖం చూడడమే మానేశారు. ఇటీవల కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడం..పర్యాటక ప్రాంతాలు తెరుచుకోవడంతో మళ్లీ నగరవాసులు బీచ్కు క్యూ కడుతున్నారు. కోవిడ్ థర్డ్ వేవ్ నేపథ్యంలో వీకెండ్స్, సెలవు రోజుల్లో బీచ్లో ఆంక్షలు విధించారు. దీంతో సాయంత్రం 5 గంటల నుంచి బీచ్లో ఒక్కర్ని కూడా లేకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు బీచ్లో సందడి వాతావరణం నెలకుంది. ఆంక్షల సమయంలో బీచ్ను మొత్తం తమ ఆధీనంలోకి పోలీసులు తీసుకున్నారు. – బీచ్రోడ్డు (విశాఖ తూర్పు) (చదవండి: వైరల్: మేకను మింగిన కొండచిలువ)