Tollywood Stars
-
సంవత్సరమంతా జంట స్వరంగా...
కలసి పాడుదాం బతుకు పాట... కలసి సాగుదాం వెలుగు బాట... అన్నట్టు ప్రతి దంపతులు ఒకరికి ఒకరై ముందుకు సాగితే ఏ కాలమైనా మంచికాలంగానే ఉంటుంది. భార్య భర్త జీవననౌకకు ఉమ్మడి చుక్కానిగా మారాలి. కలతలు చిన్నవయ్యి ఆనందాలు పెద్దవవ్వాలి. కుటుంబం బాగుంటే సమాజం, దేశం బాగుంటాయి. మనకు తెలిసిన ఈ సెలబ్రిటీ జంటలు ఆ మాటే చెబుతున్నారు. నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నారు.మనవాళ్లెవ్వరో తెలిసింది→ ప్రభాకర్: మాకు పెళ్లై 25 ఏళ్లయింది. ఎవరి ఫ్యామిలీ లైఫ్ అయినా బాగుండాలంటే భార్య సహకారం, తను అర్థం చేసుకునే విధానం మీదనే ఆధారపడి ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఆ విషయంలో మా ఆవిడకి సహనం, ఓపిక చాలా ఎక్కువ. మమ్మల్ని చాలా బాగా కేర్ చేస్తుంది. జనరల్గా మగవాళ్లకి చాలా ప్రపంచాలుంటాయి. ప్రొఫెషన్, మదర్స్ ఫ్యామిలీ, బిజినెస్, కెరీర్... ఇలా. కానీ భార్యకు మాత్రం ఎప్పుడూ ఒకే ఒక ఆలోచన మా ఆయన తిన్నారా? నా పిల్లలు టైమ్కి తిన్నారా? అందర్నీ ఆరోగ్యంగా చూసుకుంటున్నానా? అని! ఆ విషయంలో మేము రియల్లీ బ్లెస్డ్. 2025కి నావి రెండు ప్రాజెక్ట్స్ స్టార్ట్ అయ్యాయి. ఆ రెండు సీరియల్స్తో నేను బిజీగా ఉన్నాను. ఒకటి ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ అనే సూపర్ సీరియల్ ఇప్పటికే లీడ్లో ఉంది. అలాగే ‘చామంతి’ అనే మరో సీరియల్లో చేస్తున్నాను. మా మలయజ కూడా 2024లో వెబ్ సిరీస్తో పాటు రెండు సినిమాల్లో నటించింది.మా అబ్బాయి చంద్రహాస్ ‘రామ్నగర్ బన్నీ’ కోసం చాలా ఎఫర్ట్స్ పెట్టి బాగా నటించాడు. అది మేం కళ్లారా చూశాం కాబట్టే మా స్థాయికి మించి ఆ సినిమా కోసం పెట్టుబడి పెట్టాం. మా అబ్బాయి సంతోషం కోసం ఆలస్యం చేయకుండా త్వరగా రిలీజ్ చేయాల్సి వచ్చింది. ఆప్రాసెస్లో డబ్బుల గురించి ఎక్కడా ఆలోచించలేదు. ‘రామ్నగర్ బన్నీ’తో చంద్రహాస్ తనని తాను నిరూపించుకున్నాడు. మా అమ్మాయి దివిజ ప్రస్తుతం డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. లండన్ వెళ్లి బిజినెస్ మేనేజ్మెంట్ కోర్స్ చేయాలని, ఒక వ్యాపారవేత్తగా ఉండాలన్నది తన కల. తను ఇప్పటికే బాల నటిగా నంది అవార్డు అందుకుంది. ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తోంది. ఈ రెండూ పూర్తయ్యాక తను ఎలా సెటిల్ అవ్వాలనుంటే అలా మేం సంతోషంగా సపోర్ట్ చేస్తాం. → మలయజ: 2024లో నేను నిర్మాతగా షూటింగ్ లొకేషన్కి రావటం, మా అబ్బాయి చంద్రహాస్ మూవీ (రామ్నగర్ బన్నీ) కోసం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అన్నీ చూసుకోవడం ఒక కొత్త అనుభవం అని చెప్పగలను. కానీ, ఈ ఏడాది చాలా నేర్చుకున్నాను మా అబ్బాయి మూవీ ‘రామ్నగర్ బన్నీ’ పోస్ట్ ప్రొడక్షన్ అవుతున్న సమయంలో డబ్బులు అయిపోయి, మేం ఎదుర్కొన్న సవాళ్లలో ఎవరు మనవాళ్లో, ఎవరు కాదో అనేది తెలుసుకున్నాం. మనకేదైనా అవసరం వస్తే మనకంటూ తోడుగా వీళ్లందరూ ఉన్నారని అని కొంతమంది గురించి ఒక తప్పుడు అంచనాలతో ఉంటాం. కానీ, అది నిజం కాదు. ఈ సంవత్సరం మేం నేర్చుకున్న గుణపాఠం ఇది. అయితే అదే సమయంలో మేం ఎక్స్పెక్ట్ చేయని విధంగా కొత్తవాళ్లు కొంతమంది సమయానికి సహాయం చేశారు. మా అబ్బాయి నటించిన ‘బరాబర్ ప్రేమిస్తా’ అనే సినిమా 2025లో రిలీజ్ అవుతుంది. అలాగే ఇంకో సినిమా షూటింగ్ చేస్తున్నాడు. అలాగే మా అమ్మాయి దివిజ కూడా రెండు సినిమాలు సైన్ చేసింది. చాలా మంచిప్రాజెక్ట్స్ అవి. వాటి షూటింగ్స్ కూడా జరుగుతున్నాయి. అందులో ఒకటి బ్రహ్మానందంగారి సినిమాలో ఆయన కూతురుగా, హీరో చెల్లెలిగా మంచి పాత్ర వచ్చింది. అలాగే ఇంకో సినిమాలో హీరోయిన్గా చేస్తోంది. అలా మా అమ్మాయి కెరీర్ పరంగా కూడా బీజం పడింది 2024లోనే. ‘మనుషులను’సంపాదించుకున్నాం→ రాకేష్: 2024 విషయానికి వస్తే ఈ సంవత్సరం మా ఇద్దరికీ చాలా బ్యూటిఫుల్ ఇయర్. మేం సొంతంగా సినిమా (‘కేసీఆర్’లో రాకేశ్ నటించి, నిర్మించారు) ఆరంభించాం. ఎన్నో సంవత్సరాలుగా నా డ్రీమ్ అది. 2023లోనే మేం ‘కేసిఆర్’ సినిమా అనుకొని షూటింగ్ స్టార్ట్ చేశాం. మేం తీసుకున్న మూవీ టైటిల్ కన్ఫర్మేషన్, కొన్ని కారణాల వల్ల అది మధ్యలోనే ఆగిపోవడం జరిగింది. ఇంత కష్టపడి,ప్రాణం పెట్టి చేసిన సినిమా ఎందుకు ఇలా ఆగిపోయిందో అని చాలా నిరుత్సాహంలో ఉన్న సంవత్సరం అది. కానీ 2024, ఆగస్ట్ 1న నా బంగారు తల్లి పుట్టింది. నిజంగానే మా అన్ని టెన్షన్లకీ, కష్టాలకీ ఫుల్స్టాప్ పడ్డట్లు, ప్రత్యక్షంగా లక్ష్మీదేవి మా జీవితాల్లో అడుగు పెట్టినట్లు అయింది. సినిమా రిలీజైంది. ‘దైవం మానుష రూపేణ’ అని నేను నమ్ముతాను. నా చుట్టూ ఉన్న మనుషులు నా కోసమే అనే భావనతో మనుషుల్ని సంపాదించుకుంటూ, వాళ్లని కాపాడుకునేందుకై కష్టపడుతున్నాను. దీపా ఆర్ట్స్ శ్రీనివాస్గారు ఈ సంవత్సరం ఆహాలో మా మూవీని రిలీజ్ చేసి ఈ సంవత్సరానికి మమ్మల్ని ఇంకో మెట్టు పైకి ఎక్కించి, ఈ ఇయర్ ఎండ్ గిఫ్ట్గా ఇచ్చారు.→ అంతా బాగుండి మనం నడుస్తున్నప్పుడు మన వెనక చాలామంది వస్తారు. ఒకసారి కిందపడితేనే తెలుస్తుంది మనకి చెయ్యి అందించి పైకి లేపేది ఎవరు, మనల్ని చూసి ఎగతాళిగా నవ్వేది ఎవరు అనేది క్లియర్గా తెలుసుకున్నాం. అన్నీ సక్రమంగా బ్యాలెన్స్ చేసుకుంటూ మూవీ రిలీజ్ అయ్యి, సక్సెస్ అయ్యి మంచి గుర్తింపుతో చాలా హ్యాపీగా ఉన్నాం. ఒక సమయంలో హెక్టిక్ అయిపోయి తట్టుకోలేక ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి సమయంలో మా సుజాత నన్ను బిడ్డలాగా తోడు నీడగా ఉండి చాలా స్ట్రెంత్ను ఇచ్చింది. 2025లో ఇంకో న్యూప్రాజెక్ట్తో రాబోతున్నాం. మా సుజాతది కూడా 2025లో ‘సేవ్ ది టైగర్–3’ వెబ్ సిరీస్ రాబోతోంది. వర్క్లో,ప్రొఫెషన్లో ఇంకా ఇంకా బిజీ అవ్వాలని కోరుకుంటున్నాం.→ సుజాత: నాకు 2023 డిసెంబర్లో ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయింది. 2024 జనవరి నుంచిప్రొఫెషన్ పరంగా ఎన్నో టెన్షన్స్తో ఉన్నా రాకేష్గారు నన్ను చాలా కేర్ తీసుకుంటూ, హాస్పిటల్కి తీసుకెళ్లి రెగ్యులర్ చెకప్లు చేయిస్తూ, చివరికి నా డెలివరీ రూమ్లో బేబీని తన చేతులలో బయటికి తీసి బొడ్డు కోసే వరకు, స్పెసిమెన్ శాంపిల్స్ కలెక్ట్ చేసే వరకు కూడా అన్నీ ఆయన చేతుల్లోనే జరిగాయి.మేము ముగ్గురం అక్కా, చెల్లెళ్ల్లం కాబట్టి నాకు బాబు పుడితే బాగుండు అని ఉంది. కానీ మా ఆయన మాత్రం ఎవరైనా ఒకటే అనేవారు. ఫైనల్గా మా పాపాయి ఇంట్లోకి అడుగు పెట్టింది. అప్పటివరకు ఆగిపోయిన సినిమాకు ఉన్న అడ్డంకులు అన్నీ వాటంతట అవే క్లీయర్ అయిపోయి, మూవీ రిలీజ్ అయిపోయింది. మా పాప పుట్టుకతో మా ఆయన పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చినట్లు మేము ఫీలవుతున్నాం. అందుకే మా పాప పేరు కూడా ‘ఖ్యాతిక’ అని పెట్టుకున్నాం. ఆ పేరు కూడా బాగా కలిసొచ్చింది. మా ఇంటికి లక్ష్మీదేవి వచ్చింది. మా రాకేష్ చాలా కష్టపడుతున్నాడు, మనవాడి కోసం మనం కూడా ఏదైనా చేయాలని స్వచ్ఛందంగా వచ్చి సినిమాలో పని చేసిన వాళ్లు ఎందరో ఉన్నారు. అందుకే మేం డబ్బు కంటే కూడా మనుషులను ఎక్కువగా సంపాదించుకున్నాం అనే తృప్తి 2024లో మాకు చాలా ఉంది.కామెంట్లు చేసినా కామ్గా ఎదిగాంఇంద్ర నీల్: ‘కాలచక్రం’ అనే సీరియల్లో మేఘన, నేను కలిసి నటించాం. మా ఫ్రెండ్షిప్తో కలిపి మా రిలేషన్షిప్కు 25 ఏళ్లు. మా పెళ్లి జరిగి 19 ఏళ్లవుతోంది. మా ఇద్దరి లైఫ్లో జరిగిన బెస్ట్ థింగ్ ఏంటి? అని చె΄్పాలంటే మా మ్యారేజ్ అనే చె΄్తాను. 2005 మే 26న ‘చక్రవాకం’ సీరియల్ చేస్తున్నప్పుడు నాకు అత్త రోల్ చేశారు మేఘన. ఆ సీరియల్లో అత్తను ప్రేమించే క్యారెక్టర్ నాది..సో... రియల్ లైఫ్లో కూడా తనని ప్రేమించి, పెళ్లి చేసుకున్నాను. చాలా కష్టపడి, పెద్దల్ని ఒప్పించి, పెళ్లికి వచ్చేలా చేసుకుని, మా ఇద్దరి డబ్బుల్తోనే జూబ్లీ హిల్స్ పెద్దమ్మ టెంపుల్లో పెళ్లి చేసుకున్నాం. అది మాకు ఎప్పటికీ తీయని గుర్తు. → నాకైతే 2024 గురించి చిన్న పశ్చాత్తాపం ఉంది. మా నాన్నకు మరీ మరీ జాగ్రత్తలు చెప్పి షోల కోసం అమెరికా వెళ్లాను. నేను వర్క్ చేయడానికి ఎక్కడికైనా వెళ్లి, కష్టపడుతుంటే నాన్నకు కూడా చాలా ఇష్టం. నేనున్నాను కదా... నువ్వు వెళ్లు అని ధైర్యం చెప్పి పంపారు. కానీ నేను ఇండియాకి తిరిగి వచ్చేసరికి, నా ధైర్యం అయిన ఆయనే మాకు దూరం అయిపోయారు. ఆ విషయంలో చాలా బాధపడుతున్నాను. ఈ రోజు ఆయన మాతో భౌతికంగా లేకపోవడం మాకు చాలా పెద్ద లాస్. ∙2025 పై మాకు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మా ఇద్దరికీ ఒక మంచి ΄్లాన్ కూడా ఉంది. మంచి బిజినెస్ ΄్లాన్స్తో పాటుగా కొన్ని సర్ప్రైజ్లు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు రివీల్ చేస్తే సర్ప్రైజ్ అంతా పోతుందని చెప్పడంలేదు.ట్రిప్స్ అయితే చాలానే ΄్లాన్ చేస్తున్నాం. మేం ఇద్దరం ఎక్కువగా రోడ్ ట్రిప్స్కి వెళ్లడానికే ఇష్టపడతాం. అయితే అన్నీ అన్΄్లాన్డ్ ట్రిప్సే ఉంటాయి. అప్పటికప్పుడు అనుకోవడం... వెళ్లిపోవడం. మేఘన రామి: జీవితంలో ఓ మంచి పార్టనర్ దొరకడం అనేది చాలా ముఖ్యం. అప్పుడున్న ఆ ఏజ్లో అది కరెక్టో, కాదో అనేది పక్కన పెడితే... ఇప్పుడు మా 19 సంవత్సరాల వైవాహిక జీవితం తర్వాత అనిపిస్తోంది.... అప్పుడు మేం తీసుకున్నది చాలా మంచి నిర్ణయమని. ‘ఏంటి, వాళ్లు ఇలా పెళ్లి చేసుకున్నారు?’ అని వ్యతిరేకంగా మాట్లాడుకున్నవాళ్లూ కూడా ఉన్నారు. కానీ మేం తీసుకున్న ఈ మంచి నిర్ణయం వల్ల మా లైఫ్ అప్పట్నుంచి చేంజ్ కావడం ఆరంభమైంది. ఇక నా ఫుడ్ బిజినెస్లో నీల్ సపోర్ట్ చాలా చాలా ఉంది. లేదంటే... ఈ రోజు ఈ బిజినెస్ ఇంత సక్సెస్ఫుల్గా ఇంత దూరం రానే రాదు. వైఫ్తో పచ్చళ్లు అమ్మిస్తున్నాడనీ, ఇండస్ట్రీలో వర్క్ లేక పచ్చళ్లు అమ్ముకుంటున్నారనీ, బతుకుతెరువు కోసం ఇలా చేస్తున్నారనీ చాలామంది నెగటివ్ కామెంట్స్ చేశారు. కానీ మేం ఇద్దరం చాలా చాలా మెమొరీస్ని బిల్డ్ చేసుకోగలిగాం. మంచి లైఫ్ని లీడ్ చేస్తూ, ఎంజాయ్ చేస్తున్నాం. ఇంకా 2025లో మా రిలేషన్షిప్కి సంబంధించి 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీని సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. ఇక 2025 రిజల్యూషన్స్ అంటే... ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ, చాలా ఆరోగ్యకరమైన పద్ధతిలో బరువు తగ్గించుకోవాలని ఫిక్స్ అయ్యాను. అందుకే న్యూ ఇయర్ రావడానికి రెండు వారాల ముందే యోగా సభ్యత్వం తీసుకున్నాను. అందరూ ఆరోగ్యంగా, సంతోషంగా, సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నాం. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఇంటర్వ్యూలు: శిరీష చల్లపల్లి -
మెగాస్టార్ తో యాక్షన్ మూవీ ప్లాన్ చేసిన శ్రీకాంత్ ఓదెల
-
ఫ్యాన్స్ కోసం వీళ్ళు పడే కష్టం.. నెక్స్ట్ లెవల్
-
ఓటేద్దాం.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం
-
Family Star Trailer HD Stills: విజయ్ చెంప చెళ్లుమనిపించిన మృణాల్.. ట్రైలర్ అదిరిపోయింది (ఫోటోలు)
-
నార్సింగి డ్రగ్స్ కేసులో కీలక పరిణామం
సాక్షి, హైదరాబాద్: నార్సింగిలో వెలుగు చూసిన డ్రగ్స్ వ్యవహారం కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం అయ్యింది. ఈ క్రమంలో అరెస్టైన నటి లావణ్య కస్టడీ కోరుతూ సైబరాబాద్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఐదు రోజులపాటు ఆమెను తమ కస్టడీకి ఇవ్వాలని ఉప్పర్పల్లి కోర్టులో పిటిషన్ వేశారు. ఇక ఈ కేసు రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు బయటపడ్డాయి. విజయవాడ నుంచి ఉన్నత చదవుల కోసం లావణ్య హైదరాబాద్కు వచ్చినట్లు తేలింది. కోకాపేటలో మ్యూజిక్ టీచర్గా పనిచేస్తూ సినిమాల్లో ఛాన్స్ల కోసం ప్రయత్నించినట్లు వెల్లడైంది. షార్ట్ ఫిలిం, పలు చిన్న సినిమాల్లో హీరోయిన్గా నటించిన ఆమె.. జల్సాలకు అలవాటు పడినట్లు తెలిసింది. కస్టడీ పిటిషన్లో పేర్కొన్న అంశాలు నార్సింగి డ్రగ్స్ కేసులో ఇద్దరు అరెస్ట్ యువతి , ఉనీత్ రెడ్డి లను అరెస్ట్ చేసిన పోలీసులు నిందితుల నుండి 4 గ్రాముల MDMA డ్రగ్ స్వాధీనం యువతి హ్యాండ్ బ్యాగ్ లభ్యమైన డ్రగ్ సంగీతం టీచర్ పని చేస్తున్న లావణ్య టాలీవుడ్ హీరోకు ప్రేయసిగా ఉన్న యువతి ఉనీత్ రెడ్డి తనకు డ్రగ్ ప్యాకెట్లు ఇచ్చినట్లు పోలీసులకు తెలిపిన లావణ్య కొద్దీ రోజుల క్రితం ఉనీత్ నుండి డ్రగ్స్ కొనుగోలు చేసిన లావణ్య పక్క సమాచారం తో లావణ్య ను తనిఖీ చేసి SOT పోలీసులు NDPS 22బీ, రెడ్ విత్ 8సి కింద కేసులు నమోదు చేసిన నార్సింగి పోలీసులు కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్కి నిందితులు ఓ టాలీవుడ్ హీరోకు పరిచయమైన లావణ్య.. అతనికి ప్రియురాలిగా మారినట్లు పోలీసుల దర్యాప్తులో వెలుగుచూసింది. మూడు నెలల క్రితం వరలక్ష్మి టిఫిన్స్ అధినేతపై నమోదైన డ్రగ్స్ కేసులోఅనుమానితురాలిగా ఉంది. ఉనీత్ రెడ్డి అనే వ్యక్తి ద్వారా గోవా నుంచి డ్రగ్స్ తెప్పించుకున్నట్లు తెలిసింది. దీంతో ఉనిత్ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిత్ర పరిశ్రమలో పలువురికి లావణ్య డ్రగ్స్ సరఫరా చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈమేరకు లావణ్య సోషల్ మీడియా అకౌంట్లతో పాటు వ్యక్తిగత చాట్ పరిశీలిస్తున్నారు. సినీ ఇండస్ట్రీలో చాలామంది వీఐపీలతో ఆమెకు పరిచయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక ఈ కేసులో A3గా ఉన్న ఇందూ కోసం పోలీసులు గాలిస్తున్నారు. చదవండి: సారీ, నేను ఓడిపోయాను..! అసలేం జరిగిందంటే.. కోకాపేటలోని ఓ అపార్ట్మెంట్లో నివసిస్తున్న యువతి వద్ద డ్రగ్స్ ఉన్నాయనే విశ్వసనీయ సమాచారం మేరకు నార్సింగి పోలీసులు సోదాలు నిర్వహించి ఆమె నుంచి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న విషయం విదితమే. నార్సింగి నుంచి కోకాపేటకు వెళ్లే దారిలో ఉన్న ఓ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో ఉంటున్న లావణ్య అనే యువతి వద్ద ఆదివారం తనిఖీలు చేయగా 4 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ రూ.50 వేల వరకు ఉండగా వాటితో పాటు ఓ సెల్ఫోన్, రెండు ట్యాబ్లను స్వాధీనం చేసుకున్నారు. ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా ఉనిత్ర ఎడ్డి అనే వ్యక్తి ద్వారా గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చినట్లు యువతి తెలిపింది. యువతిని అరెస్టు చేసి ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి 14 రోజులపాటు రిమాండ్కు పంపారు. -
వైభవంగా స్టార్ హీరో కుమార్తె రిసెప్షన్, సెలబ్రిటీల సందడి (ఫొటోలు)
-
ట్రాన్స్జెండర్గా సీజన్-7 బిగ్బాస్ కంటెస్టెంట్.. ఎవరో గుర్తుపట్టారా?
ఈ ఏడాది బిగ్బాస్ సీజన్-7 అభిమానుల ఆదరణ దక్కించుకుంది. ఈ సీజన్ విన్నర్గా రైతుబిడ్డగా ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ నిలిచాడు. అయితే ఈ సీజన్లో టాప్-3లో ప్రశాంత్, అమర్దీప్, శివాజీ నిలవగా.. యావర్, ప్రియాంక, అర్జున్ టాప్-6లో చోటు దక్కించుకున్నారు. అయితే ఈ షో ద్వారా ఎంతో మంది కంటెస్టెంట్స్ గుర్తింపు తెచ్చుకున్నారు. మరికొందరు ఫేమస్ కావడంతో పాటు సినిమాల్లో కూడా ఛాన్స్ కొట్టినవాళ్లు ఉన్నారు. అయితే బిగ్బాస్ కంటే ముందే ఓ సినిమాలో లీడ్ రోల్ పోషించిన నటుడు టాప్-6 కంటెస్టెంట్స్లో ఉన్నారు. ఆ విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఈ సీజన్లో వైల్డ్ కార్డ్ ద్వారా షో మధ్యలో ఐదుగురు ఎంట్రీ ఇచ్చారు. వారిలో నలుగురు ఎమిలినేట్ అవ్వగా.. కేవలం అర్జున్ అంబటి మాత్రమే టాప్-6లో నిలిచారు. అయితే అర్జున్ హౌస్లోకి రాకముందే పలు సినిమాల్లో నటించారు. చూడటానికి సాఫ్ట్గా కనిపించే అర్జున్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. విజయవాడలో పుట్టి పెరిగిన ఇతడు ఐటీలో రెండేళ్లపాటు సాఫ్ట్వేర్ డెవలపర్గా పని చేశాడు. (ఇది చదవండి: బిగ్ బాస్ అర్జున్కు సినిమా ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ బుచ్చిబాబు..!) ఆ తర్వాత మోడల్గా మొదలైన తన ప్రయాణం కాస్తా నటనవైపు పరుగులు తీసింది. అర్ధనారి, గీతోపదేశం, సుందరి వంటి పలు చిత్రాల్లో అతడు నటించాడు. గోపీచంద్ హీరోగా వచ్చిన సౌఖ్యంలో విలన్గా నటించారు. అగ్ని సాక్షి, దేవత వంటి సీరియల్స్తో ప్రేక్షకుల మనసుల్లో మంచి స్థానం సంపాదించుకున్నాడు. నటనపై మక్కువతోనే మళ్లీ మంచి కంబ్యాక్ ఇవ్వడానికి బిగ్బాస్ షోను ఎంచుకున్నారు. అర్ధనారిలో ట్రాన్స్జెండర్గా.. అర్ధనారి సినిమాలో అర్జున్ ట్రాన్స్జెండర్ పాత్రలో మెప్పించారు. చాలా అరుదైన పాత్రలో కనిపించిన అర్జున్ ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. భానుశంకర్ చౌదరి దర్శకత్వంలో ఎమ్.రవికుమార్ 2016లో నిర్మించిన చిత్రమే అర్ధనారి. ఈ చిత్రంలో అర్జున్ యజత్, మౌర్యాని జంటగా నటించారు. చాలా అరుదైన పాత్రలో నటించి మెప్పించిన అర్జున్ అంబటి ఈ ఏడాది బిగ్బాస్ సీజన్లో కనిపించి మరింత ఫేమస్ అయ్యారు. ఈ సీజన్లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చి టాప్-6లో నిలిచారు. అంతేకాకుండా బుచ్చిబాబు సనా తెరకెక్కించే రామ్ చరణ్ సినిమాలో ఛాన్స్ కొట్టేశాడు. ఉప్పెనతో తొలి ప్రయత్నంలోనే బుచ్చిబాబు. ఘన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. -
Mahesh Babu: మాస్ లుక్ అయిన క్లాస్ లుక్ అయిన మహేష్ బాబే..
-
పెద్ద హీరోలపై కోట శ్రీనివాస్ ఫన్నీ సెటైర్లు
-
ఆమె కోసం స్టార్ హీరోలే వెయిట్ చేసేవారు.. కానీ నిజ జీవితంలో మాత్రం!
Jaya Prada: సీనియర్ హీరోయిన్ జయప్రద పరిచయం అక్కర్లేని పేరు. ఏపీలోని రాజమండ్రిలో కృష్ణ, నీలవేణి దంపతులకు జన్మించింది. టాలీవుడ్తో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం చిత్రాల్లో నటించారు. దాదాపు 300కు పైగా సినిమాల్లో నటించిన ఆమె తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. జయప్రద అసలు పేరు లలితా రాణి. భూమి కోసం' సినిమాతో తన కెరీర్ను ప్రారంభించిన జయప్రద ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. అప్పటి ప్రముఖ తమిళ దర్శకుడు కె. బాలచందర్ తెరకెక్కించిన అంతులేని కథ చిత్రం ద్వారా ఆమె పేరు జయప్రదగా మారిపోయింది. అప్పట్లో జయప్రదకు తెలుగులో కంటే హిందీ చిత్రాల్లోనే ఎక్కువ అవకాశాలు వచ్చాయి. తెలుగు , హిందీ భాషల్లో రెండు దశాబ్దాల పాటు స్టార్ హీరోయిన్గా రాణించింది. తెలుగు నేలపై పుట్టి బాలీవుడ్లో తిరుగులేని క్రేజ్ సంపాదించుకుంది. జితేంద్ర, రిషీ కుమార్ వంటి అగ్ర హీరోలే అప్పట్లో ఆమె డేట్స్ కోసం వేయిట్ చేసే వారంటే ఆమె రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ లాంటి దిగ్గజాల సరసన నటించింది. ఆ తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేసి అక్కడ కూడా దిగ్విజయంగా విజయ యాత్రను కొనసాగించింది. దాదాపు అప్పటి స్టార్ హీరోలందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకున్న జయప్రద.. తన వైవాహిక జీవితంలో కష్టాలను అనుభవించింది. (ఇది చదవండి: సారీ చెప్పిన హీరో లారెన్స్.. ఆ గొడవపై కామెంట్స్!) నిర్మాత శ్రీకాంత్ నహతాతో ప్రేమ పెళ్లి జయప్రద ఫేమ్లో ఉన్నప్పుడే అప్పట్లో ప్రముఖ నిర్మాత శ్రీకాంత్ నహతాను ప్రేమించి పెళ్లి చేసుకుంది. 22 ఫిబ్రవరి 1986న ముంబైలోని ఒక ఫైవ్ స్టార్ హోటల్లో వీరి పెళ్లి జరిగింది. అయితే శ్రీకాంత్కు అప్పటికే పెళ్లై పిల్లలు కూడా ఉన్నారు. మొదటి భార్యతో విడాకులు తీసుకోకుండానే రెండో పెళ్లి చేసుకోవడంతో అప్పట్లో వీరి వివాహం వివాదానికి దారి తీసింది. జయప్రదను పెళ్లాడిన తర్వాత కూడా శ్రీకాంత్ తన మొదటి భార్యతోనే ఉంటున్నాడు. అంతే కాదు శ్రీకాంత్ రెండో పెళ్లి తర్వాత మొదటి భార్య మూడో బిడ్డకు జన్మనిచ్చింది. ఆత్మహత్యాయత్నం 1990లో జయప్రద విషం తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఆ సమయంలో ఆమె బెంగళూరులో నివాసముండేవారు. విషం తాగిన జయప్రదను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అప్పట్లో జయప్రదపై ఆత్మహత్యాయత్నం కేసు కూడా నమోదు చేశారు. శ్రీకాంత్తో వివాహమైన తర్వాత మొదటి భార్య చంద్ర తన భర్తను వదిలేయాలని జయప్రదపై ఒత్తిడి తెచ్చింది. అందుకే జయప్రద విషం మింగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిందన్న వార్త అప్పట్లో వైరలైంది. అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్నా జయప్రద తన భర్తతో సంతోషంగా జీవితాన్ని గడపలేకపోయింది. కొన్నిసార్లు కలిసినప్పటికీ మొదటి భార్యకు, కుటుంబానికి వారిద్దరూ భయపడేవారట. దీనికి తోడు జయప్రద, శ్రీకాంత్లకు సంతానం కలగలేదు. ఆ బాధతో పాటు జయప్రద సంతానం లేదని చాలా బాధపడేది. అందువల్లే తన సోదరి కొడుకు సిద్ధార్థ్ను ఆమె దత్తత తీసుకున్నారు. జీవితమంతా వివాదాలే.. అయితే ప్రస్తుతం జయప్రదకు సినిమాల కంటే రాజకీయాల్లోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది. గతంలో ఆమె ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉన్నారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా జయప్రద ఎన్నో వివాదాలను ఎదుర్కొన్నారు. ఆత్మహత్యాయత్నం జరిగిన కొన్నేళ్ల తర్వాత జయప్రదకు సంబంధించిన మార్ఫింగ్ చేసిన ఫోటోలు వైరల్ అయ్యాయి. అప్పుడు కూడా ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు జయప్రద ఇటీవల ఓ కార్యక్రమంలో చెప్పారు. అంతే కాకుండా సమాజ్వాదీ పార్టీకి చెందిన అమర్సింగ్తో జయప్రదకు రిలేషన్ ఉందంటూ రూమర్స్ కూడా వచ్చాయి. (ఇది చదవండి: పెళ్లికి ముందే పూజలు తెగ చేస్తున్న ఆ హీరోయిన్) 6 నెలల జైలు శిక్ష 2019లోక్సభ ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన కేసులో ఇటీవలే జయప్రదకు చెన్నైలోని ఎగ్మోర్ కోర్టు జయప్రదకు 6 నెలల జైలు శిక్ష విధించింది. జయప్రద తన సినిమా థియేటర్ల కార్మికుల జీతాల నుంచి ఈఎస్ఐ సొమ్మును ఇప్పటికీ చెల్లించలేదని కార్మికులు రాష్ట్ర కార్మిక బీమా శాఖకు ఫిర్యాదు చేశారు. జయప్రద సినీ జీవితంలో సక్సెస్ అయినప్పటికీ.. వ్యక్తిగత జీవితంలో మాత్రం ఫెయిల్యూర్ అవడం పట్ల ఆమె అభిమానులు బాధపడుతూనే ఉన్నారు. -
హాలీడే టూర్స్లో స్టార్స్ బిజీ బిజీ
స్టోరీ సిట్టింగ్స్, సినిమా షూటింగ్స్, ప్రమోషన్స్... ఇలా ఎప్పుడూ బిజీ బిజీగా ఉంటుంటారు సినిమా స్టార్స్. అందుకే అప్పుడప్పుడూ కాస్త రిలాక్స్ అవ్వాలనుకుంటారు. విహారం.. వినోదం కోసం కొంత టైమ్ కేటాయిస్తారు. ప్రస్తుతం అలా వెకేషన్ మోడ్లో ఏ స్టార్స్ ఎక్కడున్నారో తెలుసుకుందాం. మాల్దీవుల్లో మస్తీ వెకేషన్ స్పాట్ కోసం మాల్దీవులను ఎంచుకున్నారు రజనీకాంత్. వారం రోజుల క్రితం ఆయన మాల్దీవులకు వెళ్లిన సంగతి గుర్తుండే ఉంటుంది. అక్కడి బీచ్లో రజనీ నడుస్తున్న ఫొటోలు కూడా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇక వెకేషన్ నుంచి తిరిగొచ్చిన తర్వాత ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలోని సినిమా, లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్లోని సినిమాలతో రజనీకాంత్ బిజీ అవుతారు. విదేశాల్లో బర్త్ డే ఇటీవలి కాలంలో సినిమా షెడ్యూల్స్కి కాస్త గ్యాప్ రావడంతో మహేశ్బాబు హాలిడే మోడ్లో ఉంటున్నారు. ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి దుబాయ్ వెకేషన్లో ఉన్నారు మహేశ్బాబు. రెండు వారాలకు పైగానే ఈ వెకేషన్ను ΄్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఆగస్టు 9న మహేశ్ బర్త్ డే. ఈ పుట్టినరోజుని విదేశాల్లోనే ఫ్యామిలీతో కలిసి జరుపుకుంటారని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేశ్బాబు ‘గుంటూరు కారం’ సినిమా చేస్తున్నారు. వెకేషన్ కంటిన్యూ ఈ ఏడాది సంక్రాంతి సమయంలో విడుదలైన అజిత్ తమిళ చిత్రం ‘తునివు’ (తెలుగులో ‘తెగింపు’). ఆ సినిమా తర్వాత దాదాపు హాలిడే మూడ్లోనే ఉన్నారు అజిత్. తనకు ఇష్టమైన బైక్స్పై విదేశాల్లోని బ్యూటిఫుల్ లొకేషన్స్ను సందర్శించారు. కాగా అజిత్ తర్వాతి చిత్రం ‘విడా ముయర్చి’ ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కావడానికి మరికొంత సమయం ఉందట. దీంతో మరోసారి అజిత్ విదేశాలకు ప్రయాణమయ్యారని టాక్. షార్ట్ గ్యాప్ విజయ్ హీరోగా నటించిన ‘లియో’ చిత్రం ఈ దసరాకు విడుదల కానుంది. అలాగే విజయ్ నెక్ట్స్ ఫిల్మ్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఉంటుంది. ఈ చిత్రం ఆరంభం కావడానికి కాస్త టైమ్ ఉందట. ఈ షార్ట్ గ్యాప్లో విజయ్ విదేశాలకు వెళ్లారని కోలీవుడ్ సమాచారం. బాలీలో జాలీగా.. ఆరోగ్య, వ్యక్తిగత కారణాల దృష్ట్యా సినిమా చిత్రీకరణలకు కాస్త దూరంగా ఉండాలని సమంత నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సమంత వెకేషన్ కోసం బాలీ వెళ్లారు. అక్కడ ఐస్ బాత్ చేశారు సమంత (మెరుగైన ఆరోగ్యం కోసం ఓ ప్రక్రియ). మైనస్ 4 డిగ్రీల చలిలో ఆరు నిమిషాల ΄అటు ఐస్ బాత్ చేసినట్లుగా సోషల్ మీడియాలో షేర్ చేశారీ బ్యూటీ. ఇక సమంత హీరోయిన్గా నటించిన ‘ఖుషీ’ చిత్రం సెప్టెంబరు 1న విడుదల కానుంది. ఇందులో విజయ్ దేవరకొండ హీరో. అలాగే వరుణ్ ధావన్, సమంత లీడ్ రోల్స్లో నటించిన ‘సిటాడెల్’ ఇండియన్ వెర్షన్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ తేదీపై త్వరలోనే ఓ స్పష్టత రానుంది. దుబాయిలో హాయి హాయి.. గత నెల మాల్దీవుల్లో రకుల్ ప్రీత్ సింగ్ చాలా జోష్గా గడి΄ారు. ఈ హాలిడేని ఫుల్లుగా ఎంజాయ్ చేశారు. తాజాగా ఫ్యామిలీతో కలిసి దుబాయ్ రిసార్ట్స్లో ఫుల్ జోష్లో ఉన్నారు రకుల్. తన తల్లి బర్త్ డేను దుబాయ్లో గ్రాండ్గా సెలబ్రేట్ చేశారామె. ఇందుకోసమే రకుల్ అండ్ ఫ్యామిలీ దుబాయ్ వెళ్లారు. ‘భోళా శంకర్’ షూటింగ్ను పూర్తి చేసిన తర్వాత వెకేషన్కు వెళ్లొచ్చారు చిరంజీవి. ఇటీవలే హైదరాబాద్ తిరిగొచ్చిన చిరంజీవి ఆగస్టు 11న విడుదల కానున్న ‘భోళా శంకర్’ ప్రమోషన్స్తో బిజీ అవుతారని తెలుస్తోంది. ఇక ఇటీవలే ఆస్ట్రియా వెళ్లొచ్చారు వెంకటేశ్. అక్కడ కొంత క్వాలిటీ హాలి డే టైమ్ను స్పెండ్ చేసొచ్చారు. ప్రస్తుతం ‘సైంధవ్’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు వెంకటేశ్. ఈ చిత్రం డిసెంబరు 22న విడుదల కానుంది. మరోవైపు యాభై రోజులు యూఎస్లో స్పెండ్ చేసిన ప్రభాస్ హైదరాబాద్కు తిరిగి వచ్చారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోని ‘సలార్’, మారుతి దర్శకత్వంలోని ‘రాజా డీలక్స్’ (ప్రచారంలో ఉన్న ఓ టైటిల్) చిత్రాలతో ప్రభాస్ బిజీ అవుతారని తెలుస్తోంది. ఇటు దర్శకుల విషయానికి వస్తే... రాజమౌళి తమిళనాడులోని ఆధ్యాత్మిక లొకేషన్స్లో ఎక్కవ టైమ్ స్పెండ్ చేశారు. ఇలా వెకేషన్కి వెళ్లొచ్చిన హీరో హీరోయిన్లు, దర్శకులు మరికొందరు ఉన్నారు. -
సింగర్ సునీత.. బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలిసిపోయిందిగా!
సింగర్ సునీత టాలీవుడ్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. తన మధురమైన స్వరంతో సినీ ప్రేక్షకులను అలరించింది. టాలీవుడ్లో స్టార్ సింగర్గా పేరు సంపాదించుకున్నారు. పలు చిత్రాలకు పాటలు పాడిన సునీత తెలుగు వారి గుండెల్లో చోటు సంపాదించుకున్నారు. సునీత ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ అభిమానులతో టచ్లో ఉంటున్నారు. తాజాగా ఆమె తన ఇన్స్టా స్టోరీస్లో ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు. అది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. (ఇది చదవండి: హీరోగా సింగర్ సునీత కొడుకు.. ఫస్ట్ లుక్ రిలీజ్) ఆమె ఇన్స్టా స్టోరీస్లో బెస్ట్ ఫ్రెండ్ ఎవరో చెప్పేసింది. స్టార్ యాంకర్ సుమతో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. తన బెస్ట్ ఫ్రెండ్ యాంకర్ సుమ అంటూ ఆమెతో ఉన్న క్షణాలను గుర్తు చేసుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. కాగా.. సింగర్ సునీత కూమారుడు సినిమాల్లో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. 'సర్కారు నౌకరి' పేరుతో తీస్తున్న ఈ సినిమాతో ఆకాశ్ హీరోగా పరిచయమవుతున్నాడు. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు.. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గంగనమోని శేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. భావన అనే అమ్మాయి హీరోయిన్ గా నటిస్తోంది. (ఇది చదవండి: లైవ్లో సిగరెట్ తాగిన స్టార్ హీరో.. మండిపడుతున్న నెటిజన్స్!) -
ఇద్దరు ఇద్దరే.. అదిరిపోయే ప్లానింగ్ తో దూసుకుపోతున్న రామ్, తారక్
-
చరణ్,తారక్ల స్నేహానికి ఏమైంది? దూరంగా ఉండటానికి కారణం అదేనా?
-
ఇది అన్యాయం.. అప్పుడు చరణ్ తో, ఇప్పుడు హృతిక్ తో
-
ఊర మాస్ సినిమాలతో బాలీవుడ్ ఎంట్రీ..
-
70 డైలాగ్స్ రాసి ఇచ్చా.. సినిమాలు నీకేందుకయ్యా అన్నారు: పోసాని
టాలీవుడ్ విలక్షణ నటుల్లో పోసాని కృష్ణమురళిది ముందువరుసలో ఉంటారు. అభిమానుల గుండెల్లో అంతలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. కమెడియన్గా, నటుడిగా, దర్శకనిర్మాతగా, రచయితగా సత్తా చాటిన ఆయన తాజా ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన కెరీర్ ప్రారంభంలో ఎదురైన అనుభవాలను ఈ సందర్భంగా వివరించారు. ఆయనకు రైటర్గా తొలి అవకాశమిచ్చింది పరుచూరి బ్రదర్స్ అని వెల్లడించారు. పోసాని మాట్లాడుతూ..' నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చి 37 ఏళ్లు. ఇప్పటివరకు నా కెరీర్లో ఏ ఒక్క మిస్టేక్ చేయలేదు. ఎవరి దగ్గరైనా చిన్న తప్పు కూడా లేదు. నేను నిర్మాతగా చేసినప్పుడు ఇండస్ట్రీలో పెట్టినంతా మంచి భోజనం ఎవరు పెట్టలే. భోజనానికి మహా అయితే రూ.5 లక్షలవుతుంది. కానీ నేను రూ.30 లక్షలు ఖర్చు పెట్టా. నా కెరీర్ ప్రారంభంలో అవకాశాల కోసం ఫస్ట్ సత్యానంద్ దగ్గరికి వెళ్లా. నాలుగేళ్ల తర్వాత రమ్మన్నారు. ఆ తర్వాత మద్రాస్లోనే పరుచూరి బ్రదర్స్ దగ్గరికి వెళ్లా. మా దగ్గర ఖాళీ లేవు పోమ్మన్నారు. ఆ తర్వాత నేను గేటు దగ్గర నిలబడి ఉండగా గోపాలకృష్ణ అంబాసిడర్ కారు వచ్చింది. ఏం వోయ్ రేపు మార్నింగ్ 5.30 కి రా అని అన్నారు. అయితే 5.30కి ముందే వెళ్లా.' అని అన్నారు. ఆ తర్వాత మాట్లాడుతూ..' వెంకటేశ్వరరావు, గోపాలకృష్ణ ఇద్దరు వచ్చారు. బాగా చదువుకున్నట్లున్నావ్ ఏదైనా జాబ్ చేసుకోవచ్చుగా అన్నారు వెంకటేశ్వరరావు. అప్పుడు బీఎన్ ప్రసాద్ నిర్మాత. వెంకటేశ్వరరావు నాకు కొన్ని డైలాగ్స్ రాయమని చెప్పారు. అది పేకాట పిచ్చోడు అనే పాత్రకు. ఆయన వచ్చేలోగా 70 డైలాగ్స్ రాశా. అవీ చూసి 50 డైలాగ్స్కి టిక్ పెట్టారు. అందులో దాదాపు 35 వరకు సినిమాలో వాడుకున్నారు. డైలాగ్స్ బాగా రాశావ్ అన్నారు వెంకటేశ్వరరావు. ఆ తర్వాత ఎంఫిల్ ఫస్ట్క్లాస్లో పాసయ్యా. పీహెచ్డీ కూడా చేశా. ఫస్ట్ నాకు సినిమాల మీద ప్రేమ లేదు. రైటర్గా ఫస్ట్ ఫిల్మ్ వచ్చేదాకా నాకు నమ్మకం లేదు.'అని అన్నారు. -
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన యాంకర్ లాస్య
టాలీవుడ్ యాంకర్ లాస్య మరోసారి తల్లి కాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె తన ఇన్స్టా వేదికగా షేర్ చేశారు. హోలీ సందర్భంగా బిడ్డ పుట్టడంతో లాస్య కుటుంబం సంతోషంలో మునిగిపోయింది. చేతులకు రంగులు అద్దుకుని సెలబ్రేట్ చేసుకున్న ఓ వీడియోను షేర్ చేసింది. సోషల్ మీడియాలో ఇది చూసిన అభిమానులు లాస్యకు కంగ్రాట్స్ చెబుతున్నారు. గతంలో సోషల్ మీడియాలో పలుసార్లు ఫోటోలు, వీడియోలు పంచుకున్నారు. ఇటివలే ఆమెకు కుటుంబ సభ్యులు సీమంతం వేడుకను ఘనంగా నిర్వహించారు. ఒక రోజు ముందే బిడ్డ ఆమెను గందరగోళానికి గురి చేస్తున్నాడంటూ ఇన్స్టాగ్రామ్లో వీడియోను కూడా షేర్ చేసింది. కాగా.. చీమ ఏనుగు జోక్స్తో బాగా పాపులర్ అయిన లాస్య పలు టీవీ షోలకు యాంకర్గా వ్యవహరించింది. పెళ్లి తర్వాత కెరీర్కు కాస్త గ్యాప్ ఇచ్చిన లాస్య సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అప్డేట్స్ను ఫ్యాన్స్తో షేర్ చేస్తుంటుంది. View this post on Instagram A post shared by Lasya Chillale (@lasyamanjunath) -
ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసిన టాలీవుడ్ కొరియోగ్రాఫర్
టాలీవుడ్లో ప్రముఖ కొరియోగ్రాఫర్ ఆట సందీప్ పేరు తెలియనివారు ఉండరు. తాజాగా ఆయన హైదరాబాద్లో ఖరీదైన ఇంటిని కొనుగోలు చేశారు. ఈ విషయాన్ని తన అభిమానులతో పంచుకున్నారు. ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో 'ఆట' ద్వారా ఫేమ్ సంపాదించారు. అందువల్లే అతని పేరుతోనే ఆట సందీప్గా అభిమానుల్లో ముద్ర వేసుకున్నారు. ఇటీవలే ఇంటి రిజిస్ట్రేషన్ కూడా పూర్తయినట్లు సందీప్ తెలిపారు. అయితే కొవిడ్ తర్వాత చాలా ఇబ్బందులు పడినట్లు వారు తెలిపారు. ఇది తమ ఐదేళ్ల కష్టానికి దక్కిన ఫలితమని సంతోషం వ్యక్తం చేశారు. కరోనా టైంలో పడిన కష్టాలను వివరిస్తూ తన ఇన్స్టాలో ఓ వీడియోను పంచుకున్నారు. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు ఆట సందీప్, జ్యోతిరాజ్. ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో 'ఆట' మొదటి సీజన్లోనే విన్నర్గా నిలిచారు సందీప్. View this post on Instagram A post shared by 𝐀𝐚𝐭𝐚 𝐒𝐚𝐧𝐝𝐞𝐞𝐩 𝐃𝐚𝐧𝐜𝐞 𝐌𝐚𝐬𝐭𝐞𝐫🇮🇳 (@aata_sandeep) -
కొత్త సంవత్సరం.. కొత్త సినిమాలు
కొత్త సంవత్సరం వచ్చేసింది. కొత్త సినిమా అప్డేట్స్ కోసం సినీ లవర్స్ ఎదురు చూస్తుంటారు. అలాగే తమ అభిమాన స్టార్ ఏయే సినిమాలు చేస్తున్నారో తెలుసుకోవాలని ఫ్యాన్స్కు ఉంటుంది. ఆ విశేషాలు ‘స్టార్ క్యాలెండర్’లో తెలుసుకుందాం. చిరంజీవి: ఈ సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’గా జనవరి 13న రానున్నారు హీరో చిరంజీవి. ఇక చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘బోళా శంకర్’ ఏప్రిల్ 14న రిలీజ్ కానుంది. మరోవైపు చిరంజీవి హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుందనే ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. బాలకృష్ణ: ఈ సంక్రాంతికి ‘వీరసింహారెడ్డి’గా జనవరి 12న రానున్నారు బాలకృష్ణ. ఇక అనిల్æ రావిపూడి దర్శకత్వంలోని సినిమాతో బిజీగా ఉంటారు. వెంకటేశ్: కొన్ని కథలు విన్నప్పటికీ ఏప్రాజెక్ట్ ఫైనలైజ్ చేయలేదు. కానీ హిందీలో సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ‘కీసీ కా బాయ్.. కీసీ కా జాన్’లో వెంకీ కీ రోల్ చేశారు. ఈ మూవీ రంజాన్కి రిలీజ్ కానుంది. నాగార్జున: కొన్ని కథలు విన్నప్పటికీ ఇంకా ఏప్రాజెక్ట్కీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. మోహన్బాబు: కుమార్తె మంచు లక్ష్మీతో కలిసి ప్రతీక్ ప్రజోష్ దర్శకత్వంలో మోహన్బాబు ‘అగ్నినక్షత్రం’ సినిమాలో నటిస్తున్నారు. సమంత టైటిల్ రోల్ చేసిన ‘శాకుంతలం’లో మోహన్బాబు కీ రోల్ చేశారు. రవితేజ: ఈ ఏడాది రవితేజ ఫుల్ బిజీ. ఇప్పటికే రవితేజ హీరోగా ‘రావణాసుర’, ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాలు సెట్స్పై ఉన్నాయి. అలాగే ‘ఈగిల్’ అనే కొత్త సినిమా కమిట్ అయినట్లు వార్తలు ఉన్నాయి. సుధీర్వర్మ దర్శకత్వంలోని ‘రావణాసుర’ ఏప్రిల్లో రిలీజ్ కానుంది. ఇక ‘వాల్తేరు వీరయ్య’లో రవితేజ కీ రోల్ చేసిన విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్: క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’ చిత్రంలో హీరోగా టైటిల్ రోల్ చేస్తున్నారు పవన్ కల్యాణ్. అలాగే ‘గబ్బర్సింగ్’ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘ఉస్తాద్’ అనే సినిమా చేస్తున్నారు పవన్. యువ దర్శకుడు సుజిత్ తెరకెక్కించే సినిమాలో నటించనున్న సంగతి తెలిసిందే. గోపీచంద్: దర్శకుడు శ్రీవాస్తో ఓ మూవీ చేస్తున్నారు గోపీచంద్. దీనికి ‘లక్ష్యం 2’, ‘రామబాణం’ టైటిల్స్ తెరపైకి వచ్చాయి. రాజశేఖర్: పవన్ సాధినేని దర్శకత్వంలో గ్యాంగ్ స్టర్ ఫిల్మ్ ‘మాన్స్టర్’ చేస్తున్నారు రాజశేఖర్. ప్రభాస్: ప్రభాస్ ప్రస్తుతం నాగ్ అశ్విన్తోప్రాజెక్ట్ కె, ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్తో ‘సలార్’, మారుతితో ‘రాజా డీలక్స్’ (అధికారికంగా ప్రకటించాల్సి ఉంది) చిత్రాలు చేస్తున్నారు. అలాగే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ‘స్పిరిట్’ అనే చిత్రం తెరకెక్కనుంది. ఇక ప్రభాస్ టైటిల్ రోల్లో నటించిన ‘ఆదిపురుష్’ పూర్తయింది. ఓం రౌత్ ఈ సినిమాకు దర్శకుడు. ఈ చిత్రం జూన్ 16న రిలీజ్ కానుంది. ‘సలార్’ సెప్టెంబరు 28న రిలీజ్ కానుంది. మహేశ్బాబు: త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేశ్బాబు హీరోగా ఓ సినిమా రూపొందు తోంది. ఇది పూర్తి కాగానే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఇంటర్నేషనల్ లెవల్ ఫిల్మ్లో హీరోగా నటిస్తారు మహేశ్. ఎన్టీఆర్: కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా రూపుదిద్దుకోనున్న సినిమా సెట్స్పైకి వెళ్లాల్సి ఉంది. ఈ చిత్రం తర్వాత ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఎన్టీఆర్ హీరోగా ఓ సినిమా రూపొందనుంది. రామ్చరణ్: శంకర్ దర్శకత్వంలో రామ్చరణ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా తర్వాత ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సనతో ఓ సినిమా చేస్తారు చరణ్. అలాగే గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రామ్చరణ్ హీరోగా ఓ సినిమా ప్రకటన వచ్చింది. అల్లు అర్జున్: ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప 2’ చేస్తున్నారు అల్లు అర్జున్. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా రిలీజ్ కానున్నట్లుగా తెలుస్తోంది. కాగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా, వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘ఐకాన్’ సినిమా అల్లు అర్జున్ కమిట్ అయిన సంగతి తెలిసిందే. నాని: శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ‘దసరా’ చిత్రం చేస్తున్నారు నాని. మార్చి 30న రిలీజ్ కానుంది. అలాగే తన కొత్త చిత్రాన్ని నాని ఈ రోజు ప్రకటిస్తారు. రామ్: ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తు న్నారు రామ్. నాగచైతన్య: వెంకట్ ప్రభు డైరెక్షన్లో ‘కస్టడీ’ చిత్రం చేస్తున్నారు నాగచైతన్య. ఈ సినిమా మేలో రిలీజ్ కానుంది. ఇక పరశురామ్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా ఓ సినిమా ప్రకటన వచ్చిన విషయం గుర్తుండే ఉంటుంది. విజయ్ దేవరకొండ: ప్రస్తుతం ‘ఖుషి’ సినిమా చేస్తున్నారు విజయ్ దేవరకొండ. శివ నిర్వాణ దర్శకుడు. కాగా విజయ్ దేవరకొండ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా ఉంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ హీరోగా ‘జేజీఎమ్æ’ (జన గణ మన) షూటింగ్ ఆరంభమైంది. ఈ సినిమాపై మరో అప్డేట్ రావాల్సి ఉంది. నందమూరి కల్యాణ్రామ్: ప్రస్తుతం ‘అమిగోస్’, ‘డెవిల్’ చిత్రాలు చేస్తున్నారు కల్యాణ్రామ్. ఫిబ్రవరిలో విడుదల కానున్న ‘అమిగోస్’ చిత్రానికి రాజేంద్రరెడ్డి దర్శకుడు. ‘డెవిల్’ సినిమాకు నవీన్ మేడారం డైరెక్టర్. అలాగే కేవీ గుహన్తో ఓ సినిమా కమిట్ అయ్యారు. శర్వానంద్: కృష్ణచైతన్య దర్శకత్వంలో ఓ సినిమా కమిటయ్యారు శర్వానంద్. రానా దగ్గుబాటి: దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించనున్న మైథలాజికల్ ఫిల్మ్ ‘హిరణ్యకశ్యప’లో రానా టైటిల్ రోల్ చేయనున్నట్లు గతంలో ప్రకటించారు. అలాగే మిలింద్ రావ్ దర్శకత్వంలో రానా హీరోగా ఓ సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే. అల్లరి నరేశ్: ‘నాంది’ సినిమాతో తనకు మంచి హిట్ ఇచ్చిన దర్శకుడు విజయ్ కనకమేడల డైరెక్షన్లో అల్లరి నరేశ్ ‘ఉగ్రం’ అనే సినిమా చేస్తున్నారు. అలాగే ‘సభకు నమస్కారం’ అనే సినిమా కూడా కమిట్ అయ్యారు నరేశ్. ఈ చిత్రానికి సతీష్ దర్శకుడు. నితిన్: వక్కంతం వంశీ తెరకెక్కిస్తున్న గ్యాంగ్స్టర్ డ్రామా ఫిల్మ్ షూటింగ్లో నితిన్ పాల్గొంటున్నారు. వరుణ్ తేజ్: దర్శకుడు ప్రవీణ్ సత్తారుతో ఓ యాక్షన్ ఫిల్మ్, కొత్త దర్శకుడు శక్తి ప్రతాప్సింగ్తో ఎయిర్ఫోర్స్ యాక్షన్ బేస్డ్ ఫిల్మ్ చేస్తున్నారు వరుణ్ తేజ్. శక్తి ప్రతాప్తో చేస్తున్నది వరుణ్కి హిందీలో తొలి సినిమా. అఖిల్: సురేందర్రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఏజెంట్’తో బిజీగా ఉన్నారు అఖిల్. సుధీర్బాబు: ‘హంట్’, ‘మామా మశ్చీంద్ర’ సినిమాలు చేస్తున్నారు సుధీర్బాబు. జనవరి 26న విడుదల కానున్న ‘హంట్’ మూవీకి మహేశ్ సూరపనేని దర్శకత్వం వహించగా, ‘మామా మశ్చీంద్ర’ సినిమాకు హర్షవర్థన్ దర్శకుడు. అలాగే జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో ‘హరోం హర’ అనే సినిమా చేస్తున్నారు సుధీర్బాబు. నిఖిల్: ఎడిటర్ గ్యారీ బీహెచ్ మెగాఫోన్ పట్టి తెరకెక్కిస్తున్న ‘స్పై’ చిత్రంలో నటిస్తారు నిఖిల్. అలాగే దర్శకుడు సుధీర్ వర్మతోనూ నిఖిల్ ఓ సినిమా చేస్తున్నారు. సాయిధరమ్ తేజ్: సాయిధరమ్ తేజ్ తాజా చిత్రం ‘విరూపాక్ష’. కార్తిక్ దండు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్లో రిలీజ్ కానుంది. అదే విధంగా జయంత్ అనే కొత్త దర్శకుడితో కూడా ఓ సినిమా చేస్తున్నారు సాయిధరమ్ తేజ్. బెల్లంకొండ సాయి శ్రీనివాస్: ‘ఛత్రపతి’ హిందీ రీమేక్ షూటింగ్ను దాదాపు పూర్తి చేశారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. హిందీలో సాయి శ్రీనివాస్కు ఇది తొలి చిత్రం కాగా, ఈ చిత్రదర్శకుడు వీవీ వినాయక్కు కూడా అక్కడ దర్శకుడిగా ఇదే తొలి చిత్రం. వైష్ణవ్ తేజ్: కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఎన్. రెడ్డి తెరకెక్కిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీలో హీరోగా నటిస్తున్నారు వైష్ణవ్ తేజ్. అడివి శేష్: తన కెరీర్లో వన్నాది బెస్ట్ హిట్స్గా నిలిచిన ‘గూఢచారి’ సినిమా సీక్వెల్ ‘గూఢచారి 2’లో నటిస్తున్నారు అడివి శేష్. ఈ సినిమాకు వినయ్ కుమార్ దర్శకుడు. నాగశౌర్య: అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా చేసిన ‘ఫలానా అబ్బాయి... ఫలానా అమ్మాయి’ సినిమా విడుదలకు రెడీగా ఉంది. అలాగే ‘΄ోలీసువారి హెచ్చరిక’తో పాటు మరో సినిమా చేస్తున్నారు నాగశౌర్య. సందీప్ కిషన్: రంజిత్ జయకొడి దర్శకత్వంలో ‘మైఖేల్’, వీఐ ఆనంద్ దర్శకత్వంలో ‘ఊరిపేరు భైరవకోన’ సినిమాలు చేస్తున్నారు సందీప్ కిషన్. అలాగే ధనుష్ హీరోగా చేస్తున్న ‘కెప్టెన్ మిల్లర్’ చిత్రంలో ఓ కీ రోల్ చేస్తున్నారు. సిద్ధు జొన్నలగడ్డ: హిట్ ఫిల్మ్ ‘డీజే టిల్లు’ సీక్వెల్ ‘డీజే టిల్లు’ స్క్వైర్లో నటిస్తున్నారు సిద్ధు జొన్నలగడ్డ. మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది మార్చిలో రిలీజ్ కానుంది. నవీన్ పొలిశెట్టి: అనుష్కా శెట్టి, నవీన్ పొలిశెట్టి ప్రధాన పాత్రల్లో పి. మహేశ్బాబు ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. అలాగే నవీన్ హీరోగా నటిస్తున్న మరో చిత్రం ‘అనగనగా ఒక రాజు’ను కల్యాణ్ శంకర్ తెరకెక్కిస్తున్నారు. బెల్లంకొండ గణేష్: రాకేష్ ఉప్పలపాటి దర్శకత్వంలో బెల్లంకొండ గణేష్ చేసిన ‘నేను స్టూడెంట్ సర్’ చిత్రం రిలీజ్కు సిద్ధంగా ఉంది. వీరితోపాటు మరికొందరు హీరోలు ఆన్ సెట్స్లో బిజీగా ఉంటారు. -
ఆ రోజు రాత్రి నేను చూశాను.. ఆసక్తిగా ట్రైలర్
Matarani Mounamidi Movie Trailer Released: రుద్ర పిక్చర్స్, పిసిర్ గ్రూప్ సమర్పణలో శుక్ర దర్శకుడు సుకు పూర్వాజ్ రూపొందిస్తున్న సినిమా "మాటరాని మౌనమిది". మహేష్ దత్త, సోని శ్రీవాస్తవ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. లవ్ స్టొరి, థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో మల్టీ జోనర్ గా రూపొందింది ఈ సినిమా. తుది హంగులు అద్దుకుంటున్న "మాటరాని మౌనమిది" సినిమా ఆగస్టు 19న విడుదల కాబోతోంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. అయితే టాలీవుడ్ స్టార్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్, ప్రభాస్, అల్లు అర్జున్ ఫేస్ మాస్క్లతో ఉన్న వ్యక్తులు ఈ ట్రైలర్ను ఆవిష్కరించారు. దీంతో ఈ సినిమాకు టాలీవుడ్ స్టార్ హీరోల ఆశీర్వాదం ఉందని చిత్ర యూనిట్ తెలిపింది. "మాటరాని మౌనమిది" మూవీ ట్రైలర్ చూస్తే లవ్, మిస్టరీ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. స్నేహితుడిలా ఉండే బావ ఇంటికి వెళ్తాడు హీరో. అక్కడ అతనికి మాటలు రాని క్లాసికల్ డాన్సర్ పరిచయం అవుతుంది. ఆ అమ్మాయితో రిలేషన్ ఏర్పడుతుంది. ఒకరోజు హీరో బావ ఇంట్లో అనూహ్యమైన సంఘటనలు జరుగుతాయి. ఆ సంఘటనలు ఏంటి, అంతు చిక్కని అదృశ్య శక్తి ఏం చేసింది అనేది ట్రైలర్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, లిరికల్ పాటలకు మంచి స్పందన వస్తోంది. సినిమా కొత్తగా ఉంటుందనే అంచనాలు ఏర్పడుతున్నాయి. ఇప్పుడు ట్రైలర్ ఆ అంచనాలను మరింత పెంచెలా ఉంది. -
తెలుగు హీరోలతో సినిమాలు చేస్తున్న పర భాష డైరెక్టర్లు వీళ్లే..
ఇప్పుడు తెలుగు సినిమా తెలుగు సినిమా కాదు. మరి ఏంటీ అంటే.. ‘పాన్ ఇండియా సినిమా’ అయిపోయింది. ‘బాహుబలి’తో తెలుగు సినిమా రేంజ్ పెరిగిపోయింది. ఆ తర్వాత పాన్ ఇండియా సినిమాలు ఎక్కువయ్యాయి. ఇతర భాషల దర్శకుల చూపు కూడా మన హీరోలపై పడింది. తమిళం, కన్నడ, హిందీ భాషల దర్శకులు తెలుగు హీరోలతో పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. వణక్కమ్, నమస్కార, నమస్కార్ అంటూ మన హీరోలకు వాళ్ల భాషల్లో ‘నమస్కారం’ చెబుతున్నారు. ఇక ఆ డైరెక్టర్ల గురించి తెలుసుకుందాం. ‘బాహుబలి’తో పాన్ ఇండియా స్టార్ అయ్యారు ప్రభాస్. ఆ సినిమా తర్వాత ప్రభాస్ ఏ సినిమా చేసినా అది పాన్ ఇండియా రేంజ్ కావడం విశేషం. హిందీ దర్శకులు ప్రభాస్తో సినిమా చేయడానికి ఆసక్తి చూపగా దర్శకుడు ఓం రౌత్కి ముందుగా అవకాశం ఇచ్చారు. ప్రభాస్ హీరోగా ఓం రౌత్ తెరకెక్కించిన ‘ఆదిపురుష్’ వచ్చే ఏడాది జనవరి 12న విడుదల కానుంది. అలాగే హిందీ చిత్రం ‘వార్’ ఫేమ్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలోనూ ప్రభాస్ ఓ సినిమా చేయనున్నారనే టాక్ ఉంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం కన్నడ దర్శకుడు, ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్తో ప్రభాస్ ‘సలార్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవల విడుదలైన ‘ఆర్ఆర్ఆర్’తో పర భాషల్లో కూడా స్టార్డమ్ను పెంచుకున్న ఎన్టీఆర్, రామ్చరణ్లతో సినిమా చేయడానికి ‘ఆర్ఆర్ఆర్’ విడుదల కాకముందే ఇతర ఇండస్ట్రీ దర్శకులు ఆసక్తి చూపారు. ఆల్రెడీ దర్శకుడు ప్రశాంత్ నీల్తో ఎన్టీఆర్ హీరోగా ఓ సినిమా కన్ఫార్మ్ అయింది. దర్శకుడు కొరటాల శివతో చేయనున్న సినిమాను పూర్తి చేశాక ప్రశాంత్ నీల్ కథలోకి వెళ్తారు ఎన్టీఆర్. సేమ్ ఎన్టీఆర్లానే రామ్చరణ్ కూడా ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ కాక ముందే తమిళ దర్శకుడు శంకర్తో ఓ సినిమా కమిటయ్యారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ప్రశాంత్ నీల్తో కూడా రామ్చరణ్ కథా చర్చలు జరిపినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అలాగే ఓ ప్రముఖ ముంబై నిర్మాణ సంస్థ రామ్చరణ్తో సినిమా చేయాలని ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలిసింది. ఇటు నాగచైతన్య, రామ్ తమిళ దర్శకులతో సినిమాలు చేస్తున్నారు. ఈ మధ్య కోలీవుడ్లో ‘మానాడు’తో హిట్ సాధించిన దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కించనున్న ద్విభాషా (తెలుగు, తమిళం) చిత్రంలో నాగచైతన్య హీరోగా నటిస్తారు. ఇక ‘పందెంకోడి’తో హిట్ దర్శకుడిగా తెలుగు ప్రేక్షకుల్లో పేరు సంపాదించిన లింగుసామి ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో ఓ ద్విభాషా సినిమా చేస్తున్నారు. ‘ది వారియర్’ టైటిల్తో రూపొందుతున్న ఈ సినిమాలో రామ్ హీరో. ఈ చిత్రం జూలై 14న రిలీజ్ కానుంది. ఇంకా దర్శకుడు శ్రీ కార్తీక్తో హీరో శర్వానంద్ చేసిన ద్విభాషా (తెలుగు, తమిళం) చిత్రం ‘ఒకే ఒక జీవితం’ రిలీజ్కు రెడీగా ఉంది. తమిళ దర్శకుడు రంజిత్ జయకొడి దర్శకత్వంలో సందీప్ కిషన్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘మైఖేల్’ చేస్తున్నారు. మరికొందరు పరభాషా దర్శకులు తెలుగు హీరోల డేట్స్ కోసం ప్రయత్నిస్తున్నారు. సో.. మరికొన్ని కాంబినేషన్స్ సెట్ కావొచ్చు. కుదిరితే... వార్తల్లో ఉన్న ప్రకారం మరికొందరు తెలుగు హీరోలు కూడా వేరే భాషల దర్శక-నిర్మాతలతో సినిమాలు చేసే అవకాశం ఉంది. అన్నీ కుదిరితే ఆ చిత్రాలు కూడా పట్టాలెక్కుతాయి. నటుడు, దర్శకుడు సముద్ర ఖని తెరకెక్కించనున్న సినిమాలో పవన్ కల్యాణ్, సాయిధరమ్తేజ్లు నటిస్తారని, హీరో గోపీచంద్, తమిళ దర్శకుడు హరి కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనుందనే టాక్ వినిపిస్తోంది. ఇక ‘తగ్గేదే లే’ అంటూ.. ‘పుష్ప: ది రైజ్’ సినిమాతో బాలీవుడ్ మార్కెట్లోనూ సత్తా చాటిన అల్లు అర్జున్ ఇటీవల హిందీ దర్శకుడు సంజయ్లీలా భన్సాలీని కలిశారు. బాలీవుడ్లో బన్నీ చేయనున్న స్ట్రయిట్ సినిమా కోసమే ఈ మీటింగ్ అనే టాక్ వినిపిస్తోంది. అలాగే యంగ్ హీరోలు అఖిల్, విజయ్ దేవరకొండతో బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ సినిమాలు చేయడానికి రంగం సిద్ధం చేశారట. కీలక పాత్రల్లో... తెలుగు హీరోలను కీలక పాత్రలకు కూడా తీసుకుంటున్నారు బాలీవుడ్ దర్శకులు. రణ్బీర్ కపూర్ హీరోగా దర్శకుడు అయాన్ ముఖర్జీ తీసిన ‘బ్రహ్మాస్త్ర’ చిత్రంలో నాగార్జున ఓ లీడ్ రోల్ చేశారు. సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందనున్న ఓ చిత్రంలో వెంకటేశ్ ఓ లీడ్ రోల్ చేయనున్నారు. ఈ సినిమాకు ఫర్హాద్ సామ్జీ దర్శకుడు అని టాక్. అద్వైత్ చందన్ దర్శకత్వంలో ఆమిర్ ఖాన్ నటించిన ‘లాల్సింగ్ చద్దా’లో నాగచైతన్య ఓ కీలక పాత్ర చేశారు. అలాగే అభిషేక్ శర్మ దర్శకత్వంలో అక్షయ్కుమార్ హీరోగా నటించిన ‘రామసేతు’లో సత్యదేవ్ ఓ ముఖ్య పాత్ర చేశారు. -
డ్రగ్స్ కేసు నిందితుడు లక్ష్మీపతి కోసం గాలింపు ముమ్మరం
-
పబ్లతో తారల బంధం!
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పలు పబ్లతో టాలీవుడ్ తారలకు దశాబ్దంన్నర కిందటే బంధం ఏర్పడింది. ఓ టాలీవుడ్ అగ్రహీరో బంజారాహిల్స్లో టచ్ పబ్ని స్నేహితుడితో కలిసి ఏర్పాటు చేయగ అది సినీతారలతోపాటు ఇతర రంగాల సెలబ్రిటీల నైట్ లైఫ్కు చిరునామాగా వర్ధిల్లింది. అయితే ఇతరుల రాక వల్ల గోప్యతకు ఇబ్బందనే భావనతో దాని కవర్ చార్జీలు కూడా షాక్ కొట్టే రీతిలో నిర్ణయించారు. కానీ అర్ధరాత్రి దాటినా డ్యాన్సులంటూ ఆరోపణలు రావడం, పలుమార్లు పోలీసు దాడులు జరగడంతో ఆ స్టార్ హీరో పబ్ వ్యాపారం నుంచి తప్పుకున్నప్పటికీ.. అప్పటికే సెలబ్రిటీల కోసం ప్రత్యేకమైన పార్టీ ప్లేస్ ఒక అవసరంగా మారిపోయంది. ఆ తర్వాత అదే యువ తారలకు ఆకర్షణీయ వ్యాపార మార్గమైంది. ‘టచ్’కన్నా ముందే బేగంపేట్లోని బాటిల్స్ అండ్ చిమ్నీస్ ఓ సినీనటి ఆధ్వర్యంలో నడిచేది. టాలీవుడ్లో మంచి సంబంధాలు నడుపుతాడని పేరున్న ఓ యువ నటుడు నగర శివార్లలో బీపీఎం పేరిట ఓ పార్టీ ప్లేస్ని నిర్వహించాడు. అది కూడా టాలీవుడ్ తారలకు, ఇతర రంగాల సెలబ్రిటీలకు మాత్రమే ప్రత్యేకించిందిగా పేరొందింది. అక్కడి రహస్య కార్యకలాపాలపట్ల ఎక్సైజ్శాఖ పోలీసులు కన్నెర్ర చేయడంతో అది మూతపడింది. అదే తరహాలో మరో యువ నటుడు నగర శివార్లలో నెలకొల్పిన ఎఫ్ క్లబ్ కూడా కొంతకాలం సీక్రెట్ పార్టీలకు కేరాఫ్గా నడిచి మూతపడింది. గతంలో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన డ్రగ్స్ ఉదంతం, కెల్విన్ అనే డ్రగ్ డీలర్ దందాకు ఈ క్లబ్ వేదికైంది. జూబ్లీహిల్స్లో ఓ యువ హీరోకి వాటాలున్న హైలైఫ్ పబ్ కూడా అంతే. దానిపైనా లెక్కలేనన్నిసార్లు దాడులు జరిగాయి. విలన్ పాత్రలకు పేరొందిన ఓ టాప్ టాలీవుడ్ నటుడికి కూడా జూబ్లీహిల్స్లో ఓ పబ్ ఉంది. -
పబ్ వ్యవహారం: ‘జాబితా’పై హైడ్రామా!
సాక్షి, హైదరాబాద్: సినీ–వ్యాపార ప్రముఖులు, రాజకీయ నేతల పిల్లలు పట్టుబడిన ఫుడింగ్ అండ్ మింక్ పబ్ వ్యవహారంలో హైడ్రామా చోటు చేసుకుంది. పబ్లో పట్టుబడిన అందరినీ ఆదివారం తెల్లవారుజామునే బంజారాహిల్స్ పోలీస్స్టేషన్కు తరలించారు. సినీ నటుడు నాగబాబు కుమార్తె కొణిదెల నిహారిక, బిగ్బాస్ సీజన్–3 విజేత రాహుల్ సిప్లిగంజ్, తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు సిద్ధార్థ్తో పాటు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యాపార, పారిశ్రామిక, రాజకీయవేత్తల కుమారులు, కుమార్తెలు అందులో ఉన్నారు. పోలీసులు ఉదయం 8.30–9.00 గంటల మధ్య వీరందరికీ నోటీసులు జారీచేసి సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఉదయం 8.30 గంటల సమయంలో రాహుల్ సిప్లిగంజ్ స్టేషన్ నుంచి వెళ్లిపోయారు. అప్పటికే మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఇది చూసిన నిహారిక బయటికి రాకుండా మధ్యాహ్నం వరకు లోపలే ఉండిపోయారు. చివరికి 12 గంటల సమయంలో బయటికి వచ్చారు. మీడియా ప్రతినిధులు చుట్టుముట్టినా.. తనఫోన్లో మాట్లాడుకుంటూ కారు ఎక్కి వెళ్లిపోయారు. అయితే పోలీసులు పబ్లో 142 మందిని అదుపులోకి తీసుకున్నట్టుగా మధ్యాహ్నం అనధికారిక లిస్టును విడుదల చేశారు. అందులో నిహారిక పేరు లేకపోవడంతో.. ఆమెను తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనితో సాయంత్రం అనధికారికంగానే మరో ప్రకటన చేసిన పోలీసులు.. నిహారికతోపాటు మరో ఐదుగురి పేర్లను కూడా జోడించారు. దీనితో మొదట చెప్పిన జాబితా 142 నుంచి 148కి పెరిగింది. పబ్లో అదుపులోకి తీసుకున్నవారిలో ఓ పోలీసు ఉన్నతాధికారి కుమార్తె సైతం ఉన్నట్టు ప్రచారం జరిగింది. కానీ జాబితాలో ఆ పేరు కనిపించలేదు. కాగా.. పబ్ వ్యవహారంలో తనకేం సంబంధం లేకున్నా ఓ చానల్ వాళ్లు తన పేరును ప్రచారం చేస్తున్నారంటూ సినీ నటి హేమ బంజారాహిల్స్ పోలీసుస్టేషన్ వద్ద హల్చల్ చేశారు. -
డ్రగ్స్ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు: నటి హేమ
బంజారాహిల్స్లోని ర్యాడిసన్ బ్లూ హోటల్లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్లో డ్రగ్స్ బయటపడటం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఆదివారం రాత్రి ఈ పబ్పై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో పబ్ యజమానులతో సహా సుమారు 150 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పబ్లో డ్రగ్స్ (కొకైన్)ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, పోలీసుల రాకతో పబ్లోని యువతీ యువకులు డ్రగ్స్ను కిటికీ నుంచి కింద పడేశారు. కాగా, బయట పడేసిన మత్తుపదార్థాలను పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. ఈ కేసులో 145 మందిని పంపివేయగా పోలీసుల అదుపులో ప్రస్తుతం ఐదుగురు ఉన్నారు. అయితే ఈ కేసుతో తనకు సంబంధం లేకున్నా తన పేరును పలు ఛానళ్లలో ప్రసారం చేస్తున్నారని నటి హేమ మండిపడ్డారు. తన గురించి అవాస్తవాలు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సదరు మీడియా సంస్థలపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ఆదివారం మధ్యాహ్నం ఆమె బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు వచ్చారు. పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ముందు 'నేను అసలు పబ్కు వెళ్లలేదు. డ్రగ్స్ కేసు అనేది చిన్న విషయం కాదు. ఈ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు. కానీ కొందరు కావాలనే నా పేరును ప్రసారం చేస్తున్నారు. వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకే ఇక్కడికి వచ్చాను.' అని హేమ మీడియాతో తెలిపారు. కాగా పోలీసులు దాడులు నిర్వహించే సమయంలో పబ్లో ఉన్న ప్రముఖ సింగర్, బిగ్బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్, నిహారికతోపాటు పలువురు ప్రముఖుల పిల్లల్ని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. -
పబ్స్పై డ్రగ్స్ పడగ
Pudding And Mink Pub Raid, సాక్షి, హైదరాబాద్/బంజారాహిల్స్: గంజాయి నుంచి కొకైన్ దాకా.. రోడ్లపైనే డ్రగ్స్ అమ్మకాలు.. గోవాల్లో పార్టీలు.. యూట్యూబ్లో చూసి తయారుచేసి విక్రయాలు.. మితిమీరి వాడిన యువకుడు చనిపోవడం.. ఇలా కొద్దిరోజులుగా మాదకద్రవ్యాల వ్యవహారం ఆందోళన రేపుతుంటే.. ఇప్పుడు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున పబ్బులో డ్రగ్స్ గబ్బు బయటపడింది. అర్ధరాత్రి దాటినా యువతీ యువకులు ‘మత్తు’లో చిందేస్తున్న రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేయడం, అక్కడ పలువురు ప్రముఖుల పిల్లలు ఉండటం సంచలనంగా మారింది. హైదరాబాద్లోని బంజా రాహిల్స్ రోడ్ నం.6లో ఉన్న ర్యాడిసన్ బ్లూప్లాజా హోటల్కు చెందిన ఫుడింగ్ అండ్ మింక్ పబ్లో ఆదివారం తెల్లవారుజామున నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. పెద్ద మొత్తంలో డ్రగ్స్ను స్వాధీనం చేసుకుని.. పబ్ సిబ్బంది సహా 148 మందిని బంజారాహిల్స్ పోలీస్స్టేషన్కు తరలించారు. ఇందులో 90 మంది యువకులు, 38 మంది యువతులు, 18 మంది స్టాఫ్, ఇద్దరు నిర్వాహకులు ఉన్నారు. వీరిలో తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు గల్లా సిద్ధార్థ్, సినీనటుడు నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల, బిగ్బాస్ విజేత, గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ తదితరులు ఉన్నారు. పబ్బులో డ్రగ్స్ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్.. బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ పూసపాటి శివచంద్రను సస్పెండ్ చేశారు, ఆ ఏరియా ఏసీపీ మంత్రి సుదర్శన్కు చార్జ్మెమో జారీ చేశారు. 24 గంటల లిక్కర్ అనుమతి పేరిట.. ర్యాడిసన్ బ్లూప్లాజా స్టార్ హోటల్ కావడంతో దానిలోని బార్ అండ్ రెస్టారెంట్కు 24 గంటలూ మద్యం సరఫరా చేసే అనుమతి ఉంది. ఈ మేరకు జిల్లా ఎక్సైజ్ అధికారులు గత నెల 16న కాసిబట్ట అశోక్ పేరుతో రెన్యువల్ అనుమతి పత్రం జారీ చేశారు. ఇక్కడ ఏ సమయంలోనైనా మద్యం లభిస్తుంటుంది. ఈ క్రమంలోనే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్తోపాటు ఇతర ప్రాంతాలకు చెందిన వీఐపీలు, ప్రముఖులు, వారి సంతానం ఈ హోటల్కు క్యూ కడుతుంటారు. ఈ అనుమతిని అడ్డం పెట్టుకున్న హోటల్ నిర్వాహకులు.. అందులోని పబ్ను సైతం ఇష్టానుసారం నడిపిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. పోలీసు, ఎక్సైజ్ అధికారులెవరైనా తనిఖీలకు వస్తే.. తమకు 24 గంటలు లిక్కర్ సరఫరా చేసే అనుమతి ఉందంటూ చూపిస్తున్నారు. దాదాపు నాలుగేళ్లుగా ఈ పబ్లో ఈ దందా నడుస్తోంది. మెంబర్షిప్ ద్వారా వచ్చే యాక్సెస్ కార్డుతో మాత్రమే పబ్లోకి ప్రవేశించేందుకు అనుమతి ఇస్తుంటారు. దీనిని తమకు అనువుగా మార్చుకున్న కొందరు పెద్దలు, వారి పిల్లలు ఫుడింగ్ అండ్ మింక్ పబ్ను వారాంతాల్లో రేవ్ పార్టీలకు అడ్డాగా వాడుకుంటున్నారు. కోడ్ చెప్పిన వారికే ఎంట్రీ.. ఈ పబ్లో శనివారం అర్ధరాత్రి రేవ్ పార్టీ నిర్వహిస్తున్నట్టు రెండు, మూడు రోజుల ముందే ‘వీఐపీ సర్కిల్’కు సమాచారం వెళ్లింది. పబ్కు సంబంధించిన ప్రత్యేక యాప్ ద్వారా, ఎంపిక చేసుకున్న వాట్సాప్ గ్రూపుల ద్వారా.. ఓ బర్త్డే పార్టీ పేరిట ‘డ్రగ్ ఈవెంట్’ నిర్వాహకులు ‘కస్టమర్ల’కు ఆహ్వానం పంపారు, వారికి ప్రత్యేకంగా కోడ్వర్డ్స్ ఇచ్చారు. ఆ కోడ్ చెప్పినవారిని మాదకద్రవ్యాలతో వచ్చినా తనిఖీలు లేకుండా లోనికి పంపేలా ఏర్పాటు చేసుకున్నారు. ఇలా ఎల్ఎస్డీ, కొకైన్, గంజాయి పెద్ద ఎత్తున పబ్లోకి చేరింది. రాత్రి 9 గంటలకు మొదలైన హడావుడి అర్ధరాత్రి 12 గంటలకు జోరందుకుంది. అప్పటికే హోటల్లో బసచేసిన కొందరు బడాబాబులు పబ్లోకి చేరుకున్నారు. ఈ వ్యవహారంపై సమాచారం అందుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు.. శనివారం సాయంత్రం నుంచే నిఘా పెట్టారు. రేవ్ పార్టీ సమాచారాన్ని ధ్రువీకరించుకున్నారు. నార్త్, సెంట్రల్, వెస్ట్జోన్లకు చెందిన టాస్క్ఫోర్స్ బృందాలు.. దాదాపు 40 మంది సివిల్ పోలీసులతో కలిసి ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో పబ్పై దాడి చేశాయి. ఎక్కడిక్కడ డ్రగ్స్ను విసిరేసి.. పబ్లో పోలీసులు ప్రవేశించగానే.. నిర్వాహకులు, డ్రగ్స్ వాడుతున్నవారు అవాక్కయ్యారు. తమ వద్ద ఉన్న డ్రగ్స్ను పూలకుండీల్లో, స్ట్రాలు ఉంచే డబ్బాల్లో దాచేశారు. కొందరు బాత్రూమ్ల్లో పడేశారు. కిటికీల్లోంచి కొకైన్ షాట్స్, ఎల్ఎస్డీ బోల్ట్స్ను బయటికి విసిరేశారు. పోలీసులు ఆ మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. గల్లా సిద్ధార్థ్, రాహుల్ సిప్లిగంజ్, నిహారిక కొణిదెల సహా మొత్తం 148 మందిని బంజారాహిల్స్ పోలీసుస్టేషన్కు తరలించారు. పబ్ లీజుకు తీసుకొని నడిపిస్తున్న అభిషేక్ ఉప్పాల (39)తోపాటు మేనేజర్ మాదారం అనిల్కుమార్ (35)ను అరెస్టు చేశారు. ఈ పార్టీ నిర్వాహకుడిగా అనుమానిస్తున్న అర్జున్ వీరమాచినేని కోసం గాలిస్తున్నారు. ఈవెంట్ మేనేజర్గా ఉన్న కునాల్, డీజే శశిధర్రావులు రేవ్పార్టీ వ్యవహారంలో కీలకపాత్ర పోషించినట్టు ఆరోపణలు ఉన్నాయి. పార్టీలో పాల్గొన్నవారి నుంచి వివరాలు సేకరించిన పోలీసులు.. సొంత పూచీకత్తు ఆదివారం ఉదయం విడుదల చేశారు. కాగా.. దాడి సందర్భంగా క్లూస్టీమ్లు పబ్లోపల, చుట్టుపక్కల ప్రాంతాల్లో శాంపిల్స్ సేకరించాయి. వాటిని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కు పంపి విశ్లేషించనున్నారు. కోడ్వర్డ్స్తో సరఫరా.. పబ్లో జరిగిన పార్టీలో యువతీయువకులు కోడ్వర్డ్స్తో డ్రగ్స్ను పిలుచుకున్నట్టు పోలీసువర్గాలు గుర్తించాయి. మేనేజర్ అనిల్కుమార్ స్ట్రాలు ఉంచే డబ్బాల్లో కొకైన్ పెట్టి.. వినియోగదారులకు అందజేశాడని తెలిసింది. పోలీసులు దాడి చేసినప్పుడు అదేమిటని అడిగితే.. మాక్టైల్లో కలిపే షుగర్ అని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడని సమాచారం. డ్రగ్స్ తీసుకున్నది ఎవరెవరు? ఇటీవల డ్రగ్స్పై పోలీసుల నిఘా పెరగడంతో.. ఫుడింగ్ అండ్ మిక్ పబ్ డ్రగ్స్ వినియోగదారులు, విక్రేతలకు సేఫ్జోన్గా మారిందన్న ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో కొన్నాళ్లుగా తరచూ డ్రగ్స్, రేవ్ పార్టీలు జరుగుతున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇది తేల్చేందుకు పబ్లోని సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించాలని నిర్ణయించారు. ఆదివారం తెల్లవారుజామున దాడి సందర్భంగా సీసీ ఫుటేజీ ఉన్న డీవీఆర్ను స్వాధీనం చేసుకున్నారు. అందులోని వీడియోల ఆధారంగా డ్రగ్స్ను ఎవరెవరు తీసుకొచ్చారు. ఎంత మంది డ్రగ్స్ తీసుకున్నారు? సరఫరా చేసింది ఎవరన్నది తేలిపోతుందని పోలీసులు చెప్తున్నారు. సీఐ సస్పెండ్.. ఏసీపీకి మెమో ఫుడింగ్ అండ్ మింక్ పబ్ బంజారాహిల్స్ పోలీసుస్టేషన్కు కూతవేటు దూరంలోనే ఉంది. ఇంత జరుగుతున్నా స్థానిక పోలీసులు కనిపెట్టలేకపోయారా? లేక సహకరించారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఉన్నతాధికారులు పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు. మరోవైపు తక్షణ చర్య కింద బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ పూసపాటి శివచంద్రను సస్పెండ్ చేస్తూ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. ఆ బాధ్యతలను నార్త్జోన్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్రావుకు అప్పగించారు. పర్యవేక్షణ విధుల్లో నిర్లక్ష్యం వహించారంటూ బంజారాహిల్స్ డివిజన్ ఏసీపీ మంత్రి సుదర్శన్కు చార్జ్మెమో జారీ చేశారు. నిహారికకు సంబంధం లేదు: నాగబాబు సాక్షి, హైదరాబాద్: పబ్లో డ్రగ్స్ కేసుతో తన కుమార్తె నిహారికకు ఎలాంటి సంబంధం లేదని జనసేన నేత, సినీనటుడు నాగబాబు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు. ‘గత రాత్రి రాడిసన్ అండ్ బ్లూ పబ్లో జరిగిన సంఘటనపై నేను స్పందించడానికి కారణం.. నా కూతురు నిహారిక ఆ సమయానికి అక్కడ ఉండటమే. పబ్ వేళల పరిమితికి మించి నడపడం వల్ల పబ్పై పోలీసులు చర్యలు తీసుకున్నారు. నిహారికకు సంబంధించినంత వరకు అంతా క్లియర్.. నిహారిక విషయంలో ఎలాంటి తప్పు లేదని పోలీసులు చెప్పారు. సోషల్, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎలాంటి ఊహాగానాలకు తావివ్వకూడదని ఈ వీడియో రిలీజ్ చేస్తున్నాను. దయచేసి అవాస్తవాలు ప్రచారం చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నా’.. అని నాగబాబు ఆ వీడియోలో పేర్కొన్నారు. అనుమానితుల శాంపిల్స్ ఫోరెన్సిక్కు..! ► డ్రగ్స్ ఎవరెవరు వాడారనేది తేల్చడంపై పోలీసుల దృష్టి పబ్లో నిర్వాహకులు సహా మొత్తం 148 మంది పోలీసులకు చిక్కారు. పబ్ లోపల, బయట ప్రాంగణంలో తప్ప ఎవరి వద్దా నేరుగా డ్రగ్స్ లభించలేదు. సాధారణంగా మాదకద్రవ్యాల కేసులను ఎన్డీపీఎస్ యాక్ట్ కింద నమోదు చేస్తారు. దాని ప్రకారం డ్రగ్స్ కలిగి ఉన్న వారిని మాత్రమే అప్పటికప్పుడు అరెస్టు చేయవచ్చు. పబ్లో డ్రగ్స్ దొరికినా వాటిని ఎవరు వాడారన్నది ఇప్పుడే తేల్చలేని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పబ్లో పట్టుబడినవారి నుంచి రక్తం, వెంట్రుకలు, ఇతర నమూనాలు సేకరించి ఫోరెన్సిక్ పరీక్షలు చేయించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి కోర్టు అనుమతి అవసరంకావడంతో న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయనున్నారు. డ్రగ్స్ వినియోగించినవారి తల వెంట్రుకల్లో దాదాపు ఆరు నెలల పాటు ఆనవాళ్లు ఉంటాయని పోలీసులు చెప్తున్నారు. ఐదు ప్యాకెట్ల కొకైన్ లభించింది సీఎం ఆదేశాల మేరకు హైదరాబాద్ పోలీసు కమిషనర్ ‘హెచ్–న్యూ’విభాగాన్ని ఏర్పాటు చేశారు. దానితో పబ్బులపై ప్రత్యేక నిఘా పెట్టి, కొన్నిసార్లు డెకాయ్ ఆపరేషన్లు చేస్తున్నాం. ఫుడింగ్ అండ్ మింక్ పబ్లో డ్రగ్స్ వాడుతున్నారనే సమాచారంతో దాడి చేసి, 148 మందిని అదుపులోకి తీసుకున్నాం. ఐదు ప్యాకెట్ల కొకైన్ స్వాధీనం చేసుకున్నాం. ఈ పబ్ వాళ్లు తమకు 24 గంటలు కార్యకలాపాలు నిర్వహించే అనుమతి ఉందంటూ కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. విచారణ చేసి ఎవరెవరు డ్రగ్స్ వాడారో తేలుస్తాం. అనుమానం ఉన్న ప్రతి ఒక్కరినీ పిలిచి విచారిస్తాం. – జోయల్ డెవిస్, వెస్ట్జోన్ డీసీపీ పోలీసులే కస్టమర్లలా మారి.. ఫుడింగ్ అండ్ మింక్ పబ్లో డ్రగ్స్, రేవ్ పార్టీలు చాలాకాలంగా సాగుతున్నట్టు హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. దీనితో నిఘా పెట్టారు. ఈ పబ్ సభ్యత్వం కోసం ఏడాదికి రూ.5 లక్షల వరకు వసూలు చేస్తున్నట్టు సమాచారం. ప్రత్యేకంగా పామ్ (ఫుడింగ్ అండ్ మింక్) పేరుతో ఓ యాప్ నిర్వహిస్తున్నారు. పార్టీలకు రావాలని భావించే వారంతా దాన్ని డౌన్లోడ్ చేసుకుని, రిజిస్టర్ చేసుకోవాలి. పబ్లోకి ప్రవేశించే సమయంలో దానికి సంబంధించిన ఓటీపీని చెప్పాల్సి ఉంటుంది. పబ్ వ్యవహారం ఇంత పకడ్బందీగా సాగుతుండటంపై టాస్క్ఫోర్స్ పోలీసులకు అనుమానం వచ్చింది. దీనిని ఛేదించడానికి పది రోజుల కింద పక్కాగా డెకాయ్ ఆపరేషన్ చేపట్టారు. కొందరు పోలీసులు కస్టమర్లుగా రిజిస్టర్ చేసుకున్నారు. శనివారం రాత్రి యాప్, ఓటీపీల తతంగం పూర్తి చేసుకుని పబ్లోకి వెళ్లారు. అర్థరాత్రి సమయంలో డ్రగ్స్ వినియోగం మొదలవడాన్ని గమనించి అధికారులకు సమాచారమిచ్చారు. అప్పటికే కాపుకాసిన ప్రత్యేక బృందాలు పబ్పై దాడి చేసి.. రేవ్ పార్టీ గుట్టురట్టుచేశారు. -
సినీ తారల శుభాకాంక్షలు.. నెట్టింట ఉగాది సందడి
Cine Celebrities Wishes On Ugadi 2022: ఏప్రిల్ 2 శనివారం.. అంటే తెలుగువారికి కొత్త సంవత్సరం. ఈరోజు నుంచి 'శ్రీ శుభకృత్ నామ' తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది. తెలుగు రాష్ట్రాల ప్రజలు సాంప్రదాయకంగా భావించే ఈ ఉగాది పర్వదినాన్ని దక్షిణ భారతదేశంలో ఎక్కువగా జరుపుకుంటారు. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలలో న్యూ తెలుగు ఇయర్ ప్రారంభంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా సినీ తారలు సోషల్ మీడియా వేదికగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఉగాది శుభాకాంక్షలతో సోషల్ మీడియాలో పండుగ హడావిడి కనిపిస్తూ సందడిగా మారింది. 'శ్రీ శుభకృత్ నామ' సంవత్సరంలో ప్రతి ఒక్కరికీ అన్ని శుభాలే జరగాలని మెగాస్టార్ చిరంజీవి కోరుకున్నారు. సోషల్ మీడియా వేదికగా శనివారం ఉదయం అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవితోపాటు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, మహేశ్ బాబు, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మహానటి కీర్తి సురేష్, డైరెక్టర్ శ్రీనువైట్ల, యంగ్ హీరో సుధీర్ బాబు, బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ సహా పలువురు సినీ ప్రముఖులు నెట్టింట తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ శ్రీ శుభకృత్ నామ ఉగాది శుభాకాంక్షలు ! ఈ ఉగాది అందరికీ అన్ని శుభాలు కలిగించాలని, అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు వెల్లి విరియాలని కోరుకుంటున్నాను! 💐 pic.twitter.com/oFmh1H8IWQ — Chiranjeevi Konidela (@KChiruTweets) April 2, 2022 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, అంటే ఉగాది. ఈ ఉగాది నుంచైనా మనందరికీ మంచి జరగాలని భగవంతుడ్ని కోరుకుంటున్నాను. "శ్రీ శుభకృత్" నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!! మీ మోహన్ బాబు#HappyUgadi #ఉగాది pic.twitter.com/3deIDbWYns — Mohan Babu M (@themohanbabu) April 2, 2022 Wishing you all a very happy Ugadi! May this day usher in love, harmony and prosperity! 🙏 — Mahesh Babu (@urstrulyMahesh) April 2, 2022 మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. Wishing everyone a Happy Ugadi, Gudi Padwa and Chaitra Sukhladi. — Jr NTR (@tarak9999) April 2, 2022 I wish you all a very Happy Ugadi ♥️ May God bless us all with peace and positivity ♥️ — Sai Pallavi (@Sai_Pallavi92) April 2, 2022 శుభకృత నామ సంవత్సరం మన అందరికీ సకల శుభాలను చేకూర్చాలని కోరుకుంటూ ఉగాది శుభాకాంక్షలు 🪴🥭🌺🍃 May the New Year bring happiness , wisdom, health and prosperity!! pic.twitter.com/ks7NopD9fv — Sreenu Vaitla (@SreenuVaitla) April 2, 2022 ఈ కొత్త ఏడాది మీకు ఆనందాన్ని , ఆరోగ్యాన్ని అందించాలని కోరుకుంటున్నాను. అందరికి శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. — Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) April 2, 2022 అందరికి ఉగాది శుభాకాంక్షలు 😊🥭🌾 pic.twitter.com/uxjaFSbDnR — Ritu Varma (@riturv) April 2, 2022 వికారి, శార్వరి , దాటి ఆశలు మొలకెత్తించే ప్లవ నామంలోకి వచ్చి , ఇప్పుడు శుభాలు అందించే శుభకృత్ నామ వసంతంలోకి అడుగుపెట్టాము 😃ఈ శుభకృత్ మీకు మీ కుటుంబ సభ్యులకు సకల శుభాలు చెయ్యాలని కోరుకుంటూ , నూతన తెలుగు వత్సర శుభాకాంక్షలు 🌹 pic.twitter.com/7nnTO69XJL — Paruchuri GK (@GkParuchuri) April 2, 2022 Looking forward to another year of happiness, love and prosperity for all! Gudi Padwa aur Ugadi ki sabhi ko shubhkaamnayein ✨#happygudipadwa — Ajay Devgn (@ajaydevgn) April 2, 2022 -
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కొత్త ట్విస్ట్
Tollywood Drug Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసు కొత్త మలుపు తిరిగింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోర్టు ధిక్కరణ పిటిషన్తో ప్రభుత్వ అధికారులు ముందుకొచ్చారు. ఈడీ అడిగిన అన్ని వివరాలను ఎక్సైజ్ శాఖ ఇచ్చేసింది. డిజిటల్ రికార్డ్స్, కాల్ డేటా, ఎఫ్ఎస్ఎల్ నివేదికలను ఈడీకి అందజేశారు ప్రభుత్వ అధికారులు. ఈడీకి వివరాలు అందజేసినట్లు ప్రభుత్వం హైకోర్టులో మెమో దాఖలు చేసింది. దీంతో సీఎస్, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్పై హైకోర్టులో వేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్ను వెనక్కి తీసుకుంది. ఇక మళ్లీ టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ దూకుడు పెంచనుంది. ప్రభుత్వం, ఎక్సైజ్ శాఖ ఇచ్చిన డిజిటల్ రికార్డ్స్, కాల్ డేటా పరిశీలించనుంది. మరోసారి సినీ తారలను ఈడీ అధికారులు విచారించనున్నారు. డ్రగ్స్ లావాదేవీలు, డ్రగ్స్ కొనుగోళ్లు, మనీ లాండరింగ్పై కూపీ లాగనున్నారు. కాగా మాదక ద్రవ్యాల కేసుకు సంబంధించిన నిందితులు, సాక్షుల డిజిటల్ డేటా ఇవ్వాలని ఫిబ్రవరి 8న ఎక్సైజ్ శాఖకు ఈడీ లేఖ రాసింది. హైకోర్టు ఆదేశించినా డ్రగ్స్ కేసు డిజిటల్ డేటా ఇవ్వడం లేదని బుధవారం (మార్చి 23) ఈడీ పిటిషన్ వేసింది. వివరాలు లేకపోవడంతో కేసు దర్యాప్తుపై ప్రభావం చూపుతోందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరోపిస్తుంది. సోమేష్ కుమార్, సర్ఫరాజ్కు న్యాయవాది ద్వారా ఈనెల 13న నోటీసు ఇచ్చామని ఈడీ పేర్కొంది. -
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ కోర్టు ధిక్కరణ పిటిషన్..
ED Files Contempt Of Court Petition Against Telangana CS Excise Director: టాలీవుడ్ డ్రగ్స్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించిన నిందితులు, సాక్షుల డిజిటల్ డేటా ఇవ్వట్లేదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోర్టు ధిక్కరణ పిటిషన్ వేసింది. సీఎస్ సోమేష్ కుమార్, ఎక్సైజ్ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్పై పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఈ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోరిన వివరాలను ఈడీకి ఇవ్వాలని ఫిబ్రవరి 2న ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తర్వాత మాదక ద్రవ్యాల కేసుకు సంబంధించిన నిందితులు, సాక్షుల డిజిటల్ డేటా ఇవ్వాలని ఫిబ్రవరి 8న ఎక్సైజ్ శాఖకు ఈడీ లేఖ రాసింది. హైకోర్టు ఆదేశించినా డ్రగ్స్ కేసు డిజిటల్ డేటా ఇవ్వడం లేదని బుధవారం (మార్చి 23) ఈడీ పిటిషన్ వేసింది. వివరాలు లేకపోవడంతో కేసు దర్యాప్తుపై ప్రభావం చూపుతోందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరోపిస్తుంది. సోమేష్ కుమార్, సర్ఫరాజ్కు న్యాయవాది ద్వారా ఈనెల 13న నోటీసు ఇచ్చామని ఈడీ పేర్కొంది. -
శారీరకంగా, మానసికంగా కాస్త డిఫరెంట్గా..
‘శారీరకంగా, మానసికంగా కాస్త డిఫరెంట్గా కనిపించాలి.. ఓకేనా’ అంటే, మరో మాట మాట్లాడకుండా ‘ఓకే’ చెప్పేస్తారు కొందరు స్టార్స్. అలాంటి క్యారెక్టర్లను సవాల్గా తీసుకుని, తమలోని ఆర్టిస్ట్ని ప్రూవ్ చేసుకోవడానికి శాయశక్తులా కృషి చేస్తారు. కొందరు స్టార్స్ ఈ మధ్య అలా డిఫరెంట్గా కనిపించే మిషన్ మీద ఉన్నారు. కొంచెం ‘డిఫరెంట్’గా కనిపించే ఆ క్యారెక్టర్ల గురించి తెలుసుకుందాం. ఎంత డబ్బైనా ఆఫర్ చేయండి? ఎంతటి దావత్నైనా ప్లాన్ చేయండి? సాయంత్రం ఆరు దాటితే అడుగు బయటపెట్టేదే లే అంటున్నారు వెంకటేశ్. ఇటు వెంకటేశ్ వెండితెర కో బ్రదర్ వరుణ్ తేజ్ కూడా గలాగలా మాట్లాడమంటే కాస్త గ్యాప్ ఇచ్చి గ్యాప్ ఇచ్చి మాట్లాడుతున్నారు. ఈ కో బ్రదర్స్కు ఈ పరిస్థితి తెచ్చిపెట్టింది ‘ఎఫ్ 3’ చిత్రమే. ‘ఎఫ్ 2’ వంటి సక్సెస్ఫుల్ మూవీ తర్వాత వెంకటేశ్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్, రాజేంద్రప్రసాద్ ప్రధాన తారాగణంగా అనిల్ రావిపూడి ‘ఎఫ్ 3’ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. జీవితంలో డబ్బు ప్రధానమా లేక బంధాలు ముఖ్యమా? అనే పాయింట్ ఆఫ్ వ్యూలో సాగే ఈ చిత్రంలో రే చీకటి ఉన్న వ్యక్తి పాత్రలో వెంకటేశ్, నత్తితో ఇబ్బందిపడే వ్యక్తి పాత్రలో వరుణ్ తేజ్ కనిపిస్తారు. ఈ చిత్రంలో సునీల్, సోనాలీ చౌహాన్ కీలక పాత్రల్లో కనిపిస్తారు. ‘ఎఫ్ 3’ చిత్రం ఈ ఏడాది మే 27న విడుదల కానుంది. మరోవైపు మాటల్లేవ్ అంటున్నారు హీరో సూర్య. ప్రముఖ దర్శకుడు బాల దర్శకత్వంలో సూర్య హీరోగా ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఓ బధిర (చెవుడు, మూగ) వ్యక్తి పాత్రలో సూర్య నటిస్తారనే ప్రచారం సాగుతోంది. బాల దర్శకత్వంలో వచ్చిన ‘నంద’, ‘పితామగన్’ (తెలుగులో ‘శివపుత్రుడు’) తదితర చిత్రాల్లో నటించారు సూర్య. అలాగే బాల తెరకెక్కించిన ‘అవన్ ఇవన్’ (తెలుగులో వాడు–వీడు) చిత్రంలో అతిథి పాత్రలో నటించారు. తాజాగా బాల దర్శకత్వంలో సూర్య చేయనున్న సినిమా షూటింగ్ ఏప్రిల్లో ఆరంభం కానుంది. ఇంకోవైపు ప్రముఖ నటుడు బ్రహ్మానందం తనయుడు గౌతమ్ ఓ చిత్రంలో మోనోఫోబియాతో బాధపడుతున్న రచయిత పాత్ర చేస్తున్నారు. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ చిత్రం ద్వారా సుబ్బు చెరుకూరి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఒక ప్రమాదం ఓ రచయిత జీవితాన్ని ఎలా మార్చేసింది? అతను ఎదుర్కొంటున్న సమస్య మరో పెద్ద సమస్యకు కారణం అయితే దాన్ని ఎలా అధిగమించాడు? అనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇక అటు హిందీవైపు వెళితే చాలెంజింగ్ రోల్స్ చేస్తూ, దూసుకెళుతున్న తాప్సీ నటించిన తాజా చిత్రం ‘బ్లర్’. కంటి చూపుకి సంబంధించిన కథ ఇది అని టైటిలే చెప్పేస్తోంది. ఈ చిత్రకథ నచ్చి లీడ్ రోల్ చేయడానికి అంగీకరించడంతో పాటు తాప్సీ ఓ నిర్మాతగా కూడా వ్యవహరించారు. ‘జూలియాస్ ఐస్’ అనే స్పానిష్ చిత్రానికి రీమేక్గా రూపొందిన ఈ ‘బ్లర్’లో క్రమ క్రమంగా కంటిచూపు మందగించే పాత్ర చేశారు తాప్సీ. చూపు మెరుగుపడడానికి శస్త్ర చికిత్స చేయించుకుని, కళ్లకు బ్యాండేజ్తో తాప్సీ కనిపించే సన్నివేశాలు ఈ సినిమాలో ఉన్నాయి. ఈ సీన్లలో నటించే ముందు నిజంగానే తాప్సీ కళ్లకు బ్యాండేజ్ వేయించుకుని, ఓ పన్నెండు గంటల పాటు అలానే తన పనులు చేసుకున్నారట. క్యారెక్టర్లోకి పూర్తిగా ఒదిగిపోవాలనే ఇలా చేశారు. ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. అజయ్ బెహల్ ఈ చిత్రానికి దర్శకుడు. కొంచెం కొంచెంగా చూపు మందగించే పాత్రను తాప్సీ చేస్తే ‘బ్లైండ్’ చిత్రంలో సోనమ్ కపూర్ పూర్తిగా కళ్లు కనిపించని యువతిగా నటించారు. ఓ ప్రమాదంలో చూపు కోల్పోవడం, చేస్తున్న పోలీస్ జాబ్కు ఫుల్ స్టాప్ పడడం, ఆ తర్వాత ఏం జరిగింది? అనే కథాంశంతో ఈ చిత్రం సాగుతుంది. కొరియన్ సినిమా ‘బ్లైండ్’కి రీమేక్గా అదే టైటిల్తో ఈ చిత్రం రూపొందింది. షోమే మఖీజా దర్శకత్వం వహించిన ఈ చిత్రం షూటింగ్ గత ఏడాదే పూర్తయింది. త్వరలో ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదల చేసే ఆలోచనలో చిత్రబృందం ఉందని సమాచారం. ఇక్కడ పేర్కొన్న స్టార్స్ మాత్రమే కాదు.. మరికొందరు కూడా కొంచెం ‘డిఫరెంట్’ క్యారెక్టర్స్లో కనిపించనున్నారు. -
ఆర్ఆర్ఆర్ స్టార్స్ రెమ్యునరేషన్
-
అమ్మకు రెండో పెళ్లి చేయాలని ఉంది: సురేఖ వాణి కూతురు
-
స్టార్ స్టార్ సూపర్ స్టార్ - బహుముఖ ప్రజ్ఞాశాలి విజయ నిర్మల
-
Tollywood Drugs Case: కాల్ డేటా రికార్డింగ్స్ ఎక్కడ? ప్రశ్నించిన ఈడీ
-
సీఎం జగన్తో భేటీ తర్వాత టాలీవుడ్ పెద్దల స్పందన
-
చల్ చల్ చలో.. షూటింగ్ చేద్దాం చలో.. అంటున్న హీరోలు
కరోనా వ్యాప్తి కారణంగా ఆ మధ్య కొందరు స్టార్ల సినిమా షూట్కి బ్రేక్ పడింది. సంక్రాంతి పండగ బ్రేక్ కూడా తోడైంది. ఇప్పుడు బ్రేక్లు తీశారు.. మేకప్ వేద్దాం.. షూటింగ్ చేద్దాం.. చలో.. చలో అంటూ స్టార్స్ షూట్లో పాల్గొంటున్నారు. గత నెల చివర్లో చిరంజీవి కరోనా పాజిటివ్తో ఐసోలేషన్లో ఉన్నారు. స్వల్ప లక్షణాలతో కరోనా ఆయన్ను ఇబ్బందిపెట్టలేదు. త్వరగానే నెగటివ్ వచ్చేసింది. దాంతో ఒకవైపు మోహన్ రాజా దర్శకత్వంలో చేస్తున్న ‘గాడ్ ఫాదర్’, మరోవైపు మెహర్ రమేశ్ డైరెక్షన్లో చేస్తున్న ‘బోళా శంకర్’ చిత్రాల షూటింగ్స్లో పాల్గొనడానికి ప్లాన్ చేసుకున్నారు చిరంజీవి. శుక్రవారం ‘గాడ్ ఫాదర్’ షూట్లో ఉన్నారు. హైదరాబాద్లో ఈ షూటింగ్ జరుగుతోంది. మరో పది రోజుల్లో ‘బోళా శంకర్’ కూడా ఆరంభమవుతుందని తెలిసింది. అలాగే ప్రభాస్ కూడా హైదరాబాద్లోనే షూట్తో బిజీగా ఉన్నారు. ‘ఆదిపురుష్’ ‘సలార్’, ‘ప్రాజెక్ట్ కె’.. ఇవి ప్రభాస్ చేతిలో ఉన్న సినిమాలు. ‘ఆదిపురుష్’ పూర్తయింది. ‘సలార్’ కొన్ని షెడ్యూల్స్లో పాల్గొన్నారు. ఇటీవల వెకేషన్ నిమిత్తం యూరోప్ వెళ్లొచ్చిన ప్రభాస్ ప్రస్తుతం ‘సలార్’ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఇక రవితేజ అయితే ‘రామారావు: ఆన్ డ్యూటీ’, ‘రావణాసుర’, ‘ధమాకా’, ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రాలకు తన డైరీలో చోటిచ్చేశారు. ‘ఖిలాడీ’గా ఈ నెల 11న థియేటర్స్లోకి రానున్నారు. మిగతా చిత్రాల షూట్ని పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ‘రావణాసుర’ షూట్లో ఉన్నారు రవితేజ. సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. హైదరాబాద్లోనే షూట్తో బిజీగా ఉన్న మరో హీరో రామ్. లింగుస్వామి దర్శకత్వంలో రామ్ హీరోగా రూపొందుతున్న ‘ది వారియర్’ చిత్రీకరణ జరుగుతోంది. కొందరు స్టార్స్ హైదరాబాద్లో చిత్రీకరణతో బిజీగా ఉంటే నాగచైతన్య కొన్నాళ్లుగా రష్యాలో ఉన్నారు. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో ఈ హీరో నటిస్తోన్న ‘థ్యాంక్యూ’ షూటింగ్ శుక్రవారం వరకూ అక్కడ జరిగింది. ఈ షెడ్యూల్తో సినిమా పూర్తయింది. ఇక ముంబైలో ‘లైగర్’ చిత్రీకరణలో పాల్గొంటున్నారు విజయ్ దేవరకొండ. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం చివరి షెడ్యూల్ శుక్రవారం ముంబైలో ఆరంభమైంది. ఈ హీరోలే కాదు... మరికొందరు కూడా జోరుగా షూట్లో పాల్గొంటున్నారు. ఈ నెలలోనే పక్కా.. ఈ నెలలో మరో పదీ ఇరవై రోజుల్లో షూటింగ్లో పాల్గొననున్నారు బాలకృష్ణ, మహేశ్బాబు, రామ్చరణ్. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటించనున్న చిత్రం షూట్లో ఈ నెల మూడో వారం నుంచి బాలకృష్ణ పాల్గొంటారని తెలిసింది. పరశురామ్ దర్శకత్వంలో మహేశ్బాబు హీరోగా నటిస్తున్న ‘సర్కారువారి పాట’ షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. అయితే మహేశ్ పాల్గొనడంలేదు. మరో నాలుగు రోజుల్లో మహేశ్ ఈ షూట్లో అడుగుపెడతారు. శంకర్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా షూట్లో ఈ నెల 10 నుంచి రామ్చరణ్ పాల్గొంటారని తెలిసింది. తూర్పు గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో షెడ్యూల్ని ప్లాన్ చేశారట. -
ఎలన్ మస్క్కి టాలీవుడ్ ప్రముఖుల రిక్వెస్ట్
Tollywood Stars Welcome Elon Musk After KTR Tweet: తెలంగాణ పరిశ్రమల, వాణిజ్య శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చేసిన ట్వీట్ ఒకటి చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు. ప్రపంచ అపరకుబేరుడు, టెస్లా సీఈవో ఎలన్ మస్క్కు తెలంగాణ ఆహ్వానం పలుకుతోందంటూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ట్వీట్పై బీజేపీ నుంచి రాజకీయ విమర్శలు ఎదురవుతుండగా, మరోవైపు ప్రశంసలు సైతం కురుస్తున్నాయి. ప్రముఖ జర్నలిస్టులు, ఎంట్రప్రెన్యూర్లతో పాటు సినీ ప్రముఖులు సైతం కేటీఆర్కు మద్ధతు ట్వీట్లు చేస్తూ.. ఎలన్మస్క్కి ఆహ్వానం పలుకుతున్నారు. .@elonmusk - Come to Hyderabad - India!!! It will be epic to have you 🤍 The Government here in Telangana is terrific too.. — Vijay Deverakonda (@TheDeverakonda) January 15, 2022 Dear @elonmusk we would love to have @Tesla in Telangana ..as we have the best infrastructure and the leading business hub of India @KTRTRS https://t.co/MWa4L2sl2k — Gopichandh Malineni (@megopichand) January 15, 2022 Love this car so so much @elonmusk Feels like hope is around the corner @KTRTRS https://t.co/Ee5qVUz4FW — Genelia Deshmukh (@geneliad) January 15, 2022 Welcome to #Tesla 🚘 @elonmusk sir you have best land& infrastructure in Telangana🙏🏻of course best Minister & Administration @KTRTRS https://t.co/fmJYszN4PP — Meher Ramesh 🇮🇳 (@MeherRamesh) January 15, 2022 ఈమేరకు టాలీవుడ్ హీరోలు విజయ్ దేవరకొండ, నిఖిల్ సిద్ధార్థతో పాటు దర్శకుడు గోపిచంద్ మలినేని సైతం కేటీఆర్, తెలంగాణ ప్రభుత్వాల్ని ప్రశంసిస్తూనే.. టెస్లా సీఈవో ఎలన్ మస్క్కి స్వాగతం పలుకుతూ ట్వీట్లు చేశారు. What a Person ❤ Lets Get Tesla to Telangana anna ... @KTRTRS @elonmusk @TelanganaCMO https://t.co/E5yc1QYW5e — Nikhil Siddhartha (@actor_Nikhil) January 15, 2022 నటి జెనిలీయాతో పాటు దర్శకుడు మెహర్ రమేష్ కూడా ఇందులో ఉన్నారు. ఇక ప్రముఖ జర్నలిస్టులు పంకజ్ పంచౌరీ, సీనియర్ జర్నలిస్ట్ విక్రమ్ చంద్రా సైతం ఉన్నారు. సంబంధిత వార్త: హేయ్ ఎలన్మస్క్ .. వెల్కమ్ టూ తెలంగాణ: కేటీఆర్ -
అలరిస్తున్న అల్లూరి, గర్జిస్తున్న భీం.. ఆకట్టుకుంటున్న మేకింగ్ వీడియోలు
RRR Movie Making Videos: దర్శక ధీరుడు రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముగ్గురి కాంబినేషన్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్ (రౌద్రం.. రణం.. రుధిరం). భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ సినిమాలో కొమురమ్ భీమ్గా తారక్, అల్లూరి సీతారామరాజుగా చరణ్ పాత్రలు పోషిస్తున్నారు. చెర్రీకి జోడిగా బాలీవుడ్ క్యూటీ ఆలియాభట్, తారక్ సరసన హాలీవుడ్ నటి ఒలీవియా మోరీస్ నటించారు. పాన్ ఇండియా చిత్రంగా నిర్మితమైన ఈ చిత్రం (RRR Movie) సంక్రాంతి కానుకగా 2022 జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమాపై బడ్జెట్కు మించి హైప్ను క్రియేట్ చేశాయి. ఎంతగానో ఎదురుచూస్తున్న 'ఆర్ఆర్ఆర్' (RRR) చిత్రం విడుదలకు ఇంకా కొన్ని రోజులే మిగిలాయి. సినిమా రిలీజ్కు ముందు చిత్ర ప్రమోషన్స్ను కూడా భారీగా చెస్తున్నారు. ఇటీవల ముంబైలో గ్రాండ్గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు దర్శకనిర్మాతలు. అంతకుముందు అలియా భట్ సీతగా మారిన మేకింగ్ వీడియోను షేర్ చేసిన చిత్ర బృందం తాజాగా కొమురమ్ భీం, అల్లూరి సీతారామరాజు పాత్రల చిత్రీకరణను సోషల్మీడియా వేదికగా పంచుకుంది. కొమురం భీం, అల్లూరి సీతరామరాజులు చేసిన యాక్షన్ సీన్స్ మేకింగ్ వీడియోలను తారక్, చెర్రీ తమ ఇన్స్టా గ్రామ్ ఖాతాల్లో అభిమానులతో పంచుకున్నారు. అల్లూరి సీతరామరాజు మేకింగ్ వీడియోలో చెర్రీ ఓ వైపు నవ్వుతూ మరోవైపు పాత్రలోకి పరాకయ ప్రవేశం చేశాడు. క్యాజువల్ జీన్స్, షర్ట్తో ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ వెంటనే పోలీసు యూనిఫామ్ వేసుకొని నిలుచున్న విజువల్స్తో ప్రారంభమవుతుంది వీడియో. అందులో చరణ్ రిహాసల్స్, సీన్లో ఎమోషన్స్, బాక్సింగ్ ప్రాక్టీస్ అబ్బురపరిచాయి. అలియా భట్తో సీన్ గురించి నవ్వకుంటూ చర్చించుకోవడం కూడా వీడియోలో మనం చూడవచ్చు. View this post on Instagram A post shared by Ram Charan (@alwaysramcharan) ఇక కొమురం భీం పాత్రకు సంబంధించిన వీడియోలో ఎన్టీఆర్ను భీంగా తయారు చేయడం చూపించారు. యాక్షన్ సన్నివేశాలు, బైక్ రైడింగ్ ప్రాక్టీస్ చేయడం కనులవిందుగా ఉంది వీడియో. అక్కడక్కడ తారక్ నవ్వడం, మైక్లో ఏవో సూచనలు ఇవ్వడం, డైలాగ్లు ప్రాక్టీస్ చేయడం ఫ్యాన్స్ పండగ చేసుకునేలా ఉంది. వీడియో చివర్లో ఎన్టీఆర్ గర్జిస్తూ అడవిలో పరిగెత్తడం చూపించారు. ఈ వీడియోలను 'వీ ఆర్ ఇన్ ది మేకింగ్' అంటూ ఎండ్ చేశారు. View this post on Instagram A post shared by Jr NTR (@jrntr) -
'పుష్ప రాజ్'పై 'చిట్టిబాబు' రియాక్షన్.. ఏమన్నాడంటే ?
Ram Charan Reaction On Pushpa Movie In Twitter: ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం 'పుష్ప: ది రైజ్'. అల్లు అర్జున్ తొలిసారి పాన్ ఇండియా చిత్రం చేయడం.. దాన్ని సుకుమార్ డైరెక్షన్ లో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించటంతో సూపర్ బజ్ క్రియేట్ అయ్యింది. తానికి తోడు ప్రమోషన్స్ని అల్లు అర్జున్ దగ్గర ఉండి చూసుకోవడంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. కాగా గురువారం (డిసెంబర్ 16) యూఏఈ నుంచి సినిమాకు పాజిటివ్ రివ్యూలు రాగా రాత్రి అమెరికాలో ప్రీమియర్ షోలు నిర్వహించారు. తెలంగాణలో కొన్ని థియేటర్లలో పొద్దు పొద్దున్నే బెనిఫిట్ షోల్ పడ్డాయి. అలాగే ఆంధ్రప్రదేశ్లోనూ పలు థియేటర్లలో ముందస్తు షోలు నిర్వహించారు. ఈ క్రమంలో ప్రీమియర్ షోలు చూసిన ప్రేక్షకులు, సినీ ప్రముఖులు సోషల్ వేదికగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. తాజాగా పుష్ప చిత్రంపై చిట్టిబాబు (మెగా పవర్ స్టార్ రామ్ చరణ్) స్పందించారు. 'బన్నీ.. పుష్ప సినిమా సూపర్హిట్గా నిలవనుంది. ఈ సినిమా కోసం మీరెంతో కష్టపడ్డారు. సుకుమార్ మీ విజన్ మైండ్ బ్లోయింగ్. రష్మికతోపాటు ఈ చిత్రంలో భాగమైన వారందరికీ శుభాకాంక్షలు.' అని ట్విటర్ వేదికగా రాసుకొచ్చాడు రామ్ చరణ్. సినిమాలో దేవి శ్రీ అందించిన స్వరాలు సూపర్ హిట్ కాగా, సమంత తొలిసారిగా చేసిన ఐటమ్ సాంగ్ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచిందని టాక్ వినిపిస్తోంది. Bunny, #Puspha is going be spectacular! Your hardwork is unparalleled 🤗 Sukumar Garu, your vision is mind blowing 🙏 I wish Rashmika and the entire team all the very best for a spectacular release today ! @alluarjun @aryasukku @iamRashmika @MythriOfficial — Ram Charan (@AlwaysRamCharan) December 17, 2021 -
అన్స్టాపబుల్ షోలో సూపర్ స్టార్ సందడి.. ఫొటోలు వైరల్
Mahesh Babu In Unstoppable Talk Show: సినిమాలోతోనే కాకుండా హోస్ట్గా తనలోని మరో టాలెంట్ను బయటపెడుతూ దిగ్విజయంగా ముందుకు సాగుతున్నారు నందమూరి బాలకృష్ణ. తెలుగు ఓటీటీ ఆహా వేదికగా ప్రసారమవుతోన్న 'అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే' అనే షోలో బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ టాక్షోకు ప్రేక్షకుల నుంచి మంచి ఆధరణ లభిస్తుంది. ఓటీటీ చరిత్రలోనే అత్యధికి వ్యూస్తో ఈ షో సంచలనం సృష్టించినట్లు ఇటీవల 'ఆహా' అధికారికంగా ప్రకటించింది. ఈ షోలో ఇప్పటికే కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు లక్ష్మీ, నాచురల్ స్టార్ నాని, బ్రహ్మానందం, డైరెక్టర్ అనిల్ రావిపూడి వచ్చి ప్రోగ్రామ్ను విజయవంతం చేస్తున్నారు. అయితే తాజాగా ఈ షోకు సూపర్ స్టార్ మహేశ్ బాబు వచ్చి సందడి చేశారు. ఈ ఎపిసోడ్కు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయింది. ఈ ఇంటర్వ్యూ ఫొటోలు సోషల్ మీడియాలో అన్స్టాపబుల్ అంటూ దూసుకుపోతున్నాయి. బాలకృష్ణ, మహేశ్ బాబుతో ఎపిసోడ్ ఆద్యంతం సరదాగా గడిచిందని సమాచారం. నవ్వులు, ప్రేక్షకుల చప్పట్లతో షో సందడిగా మారిందట. ఈ సాయంత్రం బాలకృష్ణతో ఎంతో సరదాగా గడిచిందని మహేశ్ బాబు తన ఇన్స్టాలో స్టోరీ కూడా పెట్టారు. అయితే బాలకృష్ణ, మహేశ్ బాబు కలిసి ఓ టాక్షోలో కనిపించడం ఇదే మొదటిసారి. వీరిద్దరి మధ్య ఫన్ ఎలా ఉంటుంది అనేది చూడాలంటే పూర్తి ఎపిసోడ్ విడుదల అయ్యేవరకు ఆగాల్సిందే. మహేశ్ బాబు రాకతో 'అన్స్టాపబుల్' టాక్షో టీఆర్పీ రేటింగ్స్ ఓ రేంజ్లో పెరగే అవకాశాలు ఉన్నాయి. -
రాధేశ్యామ్ రెండో సాంగ్.. ఫ్లర్టేషన్షిప్ కోరుకుంటున్నాడట
Radheshyam Movie Second Song Aashique Aa Gayi Released: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న 'రాధేశ్యామ్' సినిమా నుంచి మరో సాంగ్ వచ్చేసింది. ముందుగా హిందీలో చిత్రీకరించిన ఆషికీ ఆ గయా సాంగ్ను బుధవారం (డిసెంబర్ 1) విడుదల చేశారు మేకర్స్. పాట ఆరంభంలో 'నిన్ను నువ్వు రోమియో అనుకుంటున్నావా ?' అని పూజా, ప్రభాస్ను అంటే.. 'అతడు ప్రేమ కోసం ప్రాణాలిచ్చాడు. నేను ఆ టైపు కాదు' అని ప్రభాస్ బదులిస్తాడు. దీనికి 'కానీ, నేను జూలియెట్. నన్ను ప్రేమిస్తే తప్పకుండా చచ్చిపోతావ్' అని పూజా రొమాంటిక్గా వార్నింగ్ ఇస్తుంది. దీంతో 'కానీ నేను మాత్రం ఫ్లర్టేషన్షిప్ కోరుకుంటున్నా' అంటూ ప్రభాస్, పూజను కిస్ చేయడంతో పాట మొదలవుతుంది. ఈ సాంగ్లో విజువల్స్ చాలా రిచ్గా ఉన్నాయి. ప్రభాస్, పూజాల లుక్స్ అభిమానులకు పండగలా అనిపిస్తాయి. ప్రస్తుతం హిందీలో విడుదలైన 'ఆషికీ ఆ గయా సాంగ్'ను తెలుగులో నగుమోము తారలేగా బుధవారం సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేయనున్నారు. ఈ పాటను సిద్ శ్రీరామ్ ఆలపించాడు. ఇటీవల విడుదలైన రాధేశ్యామ్ టీజర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో ప్రభాస్ పల్మానాలజిస్ట్గా ఆకట్టుకోబోతున్నాడు. ఈ సినిమా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. Love like there's no tomorrow. Presenting the first from #MusicalOfAges #Radheshyam, #AashiquiAaGayi by @mithoon11 & @arijitsinghhttps://t.co/lApuOeh2H5 Starring #Prabhas & @hegdepooja — T-Series (@TSeries) December 1, 2021 ఇది చదవండి: ‘రాధేశ్యామ్’ ఫస్ట్ సాంగ్ వచ్చేసింది -
'ఆర్ఆర్ఆర్' ట్రైలర్ వాయిదా.. ఎందుకో తెలుసా ?
RRR Movie Trailer Postponed And Here Is The Reasons: ధర్శక ధీరుడు రాజమౌళి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూ. ఎన్టీఆర్ కాంబినేషనల్లో తెరకెక్కిన బిగ్గెస్ట్ మల్టీసారర్ చిత్రం 'ఆర్ఆర్ఆర్'. ఈ సినిమా థియేటరికల్ ట్రైలర్ను వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ఇవాళ (డిసెంబర్ 1) ప్రకటించారు. అయితే డిసెంబర్ 3న ట్రైలర్ విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించినా ప్రముఖ సినీ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి అకాల మరణంతోపాటు పలు అనివార్య కారణాలతో వాయిదా వేస్తున్నట్లు బుధవారం ఉదయం చిత్రబృందం తెలిపింది. త్వరలో ట్రైలర్ రిలీజ్ డేట్ను ప్రకటిస్తామని వెల్లడించింది. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురం భీమ్గా తారక్ కనిపించనున్న ఈ సినిమాను సుమారు రూ. 450 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మించారు. ఈ చిత్రంతో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ టాలీవుడ్లోకి అరంగ్రేటం చేయనుంది. ఇందులో ఆమెకు రామ్ చరణ్ జోడిగా నటించనున్నారు. ఎన్టీఆర్కు జంటగా హాలీవుడ్ నటి ఒలీవియా మోరీస్ అలరించనుంది. కీరవాణి స్వరాలు అందిస్తున్న ఈ సినిమా భారీ అంచనాలతో జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది చదవండి: ఐటెం సాంగ్ అడిగిన నెటిజన్కు 'ఆర్ఆర్ఆర్' టీం రిప్లై.. -
'టక్కరి దొంగ' మహేశ్ బాబు గెలుచుకుంది ఎంత ?
Mahesh Babu In Evaru Meelo Koteeshwarudu: యంగ్ టైగర్ జూ. ఎన్టీఆర్ హోస్ట్గా వ్యవహరిస్తున్న షో 'ఎవరు మీలో కోటీశ్వరులు (EMK)'. ఈ రియాలిటీ షోలో సూపర్ స్టార్ మహేశ్ బాబు పాల్గొన్న సంగతి తెలిసిందే. తనదైన జోష్తో ఆకట్టుకుంటున్న ఎన్టీఆర్కు తోడుగా ప్రొగ్రామ్కు తన రాకతో మరింత గ్లామర్ యాడ్ చేశారు మహేశ్. ఇటీవల రిలీజైన ప్రొమో ప్రస్తుతం ప్రసారం అవుతోంది. ఆ ప్రోమోలు ఎన్టీఆర్, మహేశ్ ఇద్దరూ కలిసి ఎలా సందడి చేశారో చూశాం. ఇక మహేశ్ బాబు పాల్గొన్న ఎపిసోడ్ త్వరలో ప్రసారం కానుంది. ఈ క్రమంలో 'ఎవరు మీలో కోటీశ్వరులు' ప్రోగ్రామ్లో 'టక్కరి దొంగ' ఎంత గెలుచుకున్నాడో అని సినీ వర్గాల్లో చర్చ మొదలైంది. ఎన్టీఆర్ అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చి, నవ్వులు పంచి, తనదైనా డైలాగ్లతో ప్రేక్షకులను అలరించిన సూపర్ స్టార్ మహేశ్ బాబు రూ. 25 లక్షలు గెలుచుకున్నాడని ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా ఆ మొత్తాన్ని అంతా ఛారిటీ కోసం కేటాయించి తన మంచి మనసు చాటుకున్నాడట ఈ శ్రీమంతుడు. అయితే మహేశ్ బాబు ఎంత గెలుచుకున్నాడు ? ఎన్టీఆర్ అడిగినా ప్రశ్నలేంటి ? వాటికి 'పోకిరి' ఎలా సమాధానమిచ్చాడు ? అనేది ఈ గ్లామరస్ ఎపిసోడ్ ప్రసారం అయితే గానీ చెప్పలేం. ఇదీ చదవండి: మహేశ్ బాబు ఎంట్రీతో మరింత జోష్గా.. -
RRR Janani Song: ఆర్ఆర్ఆర్ 'జనని' సాంగ్ వచ్చేసింది..
Janani Song Out From RRR Movie: దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో యంగ్ టైగర్ జూ. ఎన్టీఆర్ కొమురం భీమ్గా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి వచ్చిన 'నాటు నాటు', 'దోస్తీ' పాటలు సినీ ప్రేక్షకులను, అభిమానులను ఎంతాగానో అలరించాయి. తాజాగా ఈ చిత్రం నుంచి జనని సాంగ్ను విడుదల చేశారు దర్శకనిర్మాతలు. దేశభక్తిని చాటేవిధంగా రూపొందింది ఈ పాట. 'జననీ.. ప్రియ భారత జననీ..’ అనే పాట ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి ఆత్మలాంటిదని ఎస్ఎస్ రాజమౌళి తెలిపారు. ఈ పాట కోసం పెద్దన్న (కీరవాణి) రెండు నెలలు శ్రమించారన్నారు. ఆయనే ఈ పాటకు లిరిక్స్ కూడా రాశారని పేర్కొన్నారు. ఈ పాటను ఒక్కరోజు ముందుగా గురువారం హైదరాబాద్లో విలేకరుల కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ సందర్భంగా రాజమౌళి ‘‘డిసెంబరు మొదటి వారంలో ట్రైలర్ విడుదల చేస్తాం. వరుసగా ప్రీ రిలీజ్ వేడుకలు ఏర్పాట్లు చేస్తున్నాం. ‘జనని..’ పాటలో కనిపించని భావోద్వేగాలుంటాయి. ఒక మణిహారంలో ఉన్న దారం ఎలాగైతే కనిపించదో.. అలానే సాఫ్ట్ ఎమోషన్ కనిపించదు. కానీ సినిమా సోల్ మొత్తం ఆ పాటలోని భావోద్వేగంలోనే దాగి ఉంటుంది’’ అని అన్నారు. -
మహేశ్ బాబు ఎంట్రీతో మరింత జోష్గా.. 'ఎవరు మీలో కోటీశ్వరులు'
Mahesh Babu In Evaru Meelo Koteeshwarulu: బిగ్బాస్తో పాటు బుల్లితెర ప్రేక్షకులను అలరించే రియాలిటీ షోలలో ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ఒకటి. దీనికి హోస్ట్గా చేస్తున్న యంగ్ టైగర్, జూనియర్ ఎన్టీఆర్ తనదైన స్టైల్తో ప్రేక్షకుల్లో ఫుల్ జోష్ నింపుతున్నాడు. ఎన్టీఆర్కు తోడుగా మరింత ఎంటర్టైన్మెంట్ ఇవ్వనున్నారు సూపర్ స్టార్ మహేశ్ బాబు. తాజాగా వీరిద్దరూ కలసి ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ స్టేజిపై సందడి చేశారు. మహేశ్ బాబు అతిథిగా వచ్చిన ఈ పోగ్రాం ప్రత్యేక ఎపిసోడ్ ప్రోమోను షో మేకర్స్ విడుదల చేశారు. ఈ ఇద్దరు హీరోలను చూసిన అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఈ ప్రోమోలో 'వెల్కమ్ మహేశ్ అన్న' అంటూ తారక్ ఇన్వైట్ చేస్తే.. 'అదిరిపోయింది' అని సూపర్ స్టార్ బదులిచ్చాడు. తర్వాత 'నా రాజా..' అంటూ ఎన్టీఆర్ తనదైన మ్యానరిజంతో జోష్ నింపారు. 'కరెక్ట్ ఆన్సర్నే అటూ, ఇటూ ఎందుకు తిప్పుతారు' అని మహేశ్ అడిగినా ప్రశ్నకు 'సరదా కోసం' అని ఎన్టీఆర్ సమాధానమిస్తారు. దీంతో కంప్యూటర్ను 'దీనికన్నా గురువు గారే బెటర్గా ఉన్నారు' అన్న మహేశ్ మాటకు షోలో నవ్వులు విరబూసాయి. ఇంతకుముందు ఈ షోకు రామ్ చరణ్, సమంత వచ్చి సందడి చేసి ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు సూపర్ స్టార్ మహేశ్ బాబు మరింత అలరించనున్నారు. -
బుల్లితెరపై మహేశ్ బాబు-ఎన్టీఆర్ సందడి.. ఫ్యాన్స్కి పూనకాలే..
Mahesh Babu And Ntr Participating In Evaru Meelo Koteeshwarulu: బిగ్బాస్తో పాటు బుల్లితెర ప్రేక్షకులను అలరించే మరో రియాలిటీ షో ‘ఎవరు మీలో కోటీశ్వరులు’. గత సీజన్లు స్టార్ మాలో ప్రసారమవగా దీనికి హోస్ట్గా కింగ్ నాగార్జున, చిరంజీవిలు వ్యవహరించారు. అయితే ఈ సారి ఈ రియాలిటీ షోకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. తనదైన మ్యానరిజం, చమత్కారంతో షోను ఆసక్తిగా మలుస్తున్నారు. ఈ షోకు రామ్ చరణ్, సమంత వచ్చి సందడి చేసి ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు సూపర్ స్టార్ మహేశ్ బాబు ఈ షోకు రానున్నారు. మహేశ్ బాబు-యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇద్దరు కలిసి షోలో మరింత సందడి చేయనున్నారు. దీనికి సంబంధించిన ఎపిసోడ్ త్వరలో ప్రారంభంకానుంది. ఈ షోలో ఇద్దరూ పాల్గొన్న ఓ పోస్టర్ను సదరు టీం పోస్ట్ చేసింది. దీనికి పూనకాల ఎపిసోడ్ లోడింగ్ అని టైటిల్ పెట్టింది. దీంతో నెటిజన్లు వేయిటింగ్ అని కామెంట్ చేస్త్నునారు. ఇక మహేశ్ బాబు-యంగ్ టైగర్ ఎన్టీఆర్తో ఈ షో ఎపిసోడ్ ప్రారంభమైతే ఈ ఇద్దరూ హీరోల ఫ్యాన్స్కి పండగే. ఈ ఒక్క ఎపిసోడ్తో 'ఎవరు మీలో కోటీశ్వరులు' షోకు రేటింగ్ భారీగా పెరిగే ఛాన్స్ ఉంది. Evaru Meelo Koteeswarulu | Gemini TV Get ready to watch the episode of the decade soon on Gemini TV. #PoonakaalaEpisodeLoading #EMKbyNTRonGeminiTV #EvaruMeeloKoteeswaruluOnGeminiTV #EvaruMeeloKoteeswarulu pic.twitter.com/xlrBgnwuLS — Gemini TV (@GeminiTV) November 20, 2021 చదవండి: రూ.కోటి గెలిచినా దక్కేది ఇంతేనా! -
Love Stories: ప్రేమ అదే ప్రాబ్లం వేరు
ఉన్నోళ్లు లేనోళ్లు... పట్నం పల్లె... ఆ మతం ఈ మతం... వెజ్ నాన్వెజ్... సమాజంలో సినిమాల్లో ప్రేమకు ప్రాబ్లమ్స్ సృష్టించాయి. ప్రేమ అలాగే ఉంది. ఇప్పుడు తెలుగు సినిమా ఇంకా సీరియస్ సమస్యలను చర్చిస్తోంది. మొన్నటి ‘ఉప్పెన’ నిన్నటి ‘శ్రీదేవి సోడా సెంటర్’ ఇవాళ్టి ‘లవ్స్టోరీ’ ఆ సంగతే చెబుతున్నాయి. కె.బాలచందర్ ‘మరో చరిత్ర’తో ప్రేక్షకులకు ప్రేమ అలల ప్రతాపం చూపించాడు. నిప్పులోన కాలదు నీటిలోన నానదు అని క్లయిమాక్స్ చేశాడు. మీరు ప్రేమికుల్ని నాశనం చేయగలరు... ప్రేమను కాదు అని చెప్పాడు. ఆ సినిమాలో హీరోయిన్ తెలుగు, హీరో తమిళం. పెద్దవాళ్లు వారిని ఎన్ని బాధలు పెట్టాలో అన్నీ పెట్టారు. చివరకు వాళ్లు ప్రాణం తీసుకునేదాకా ఊరుకోలేదు. శేఖర్ కమ్ముల ‘లవ్స్టోరీ’లో ‘పంచాయితీల్లో పడాలని ఎవరనుకుంటారు. ప్రేమ అయిపోతుంది. అంతే’ అనే డైలాగ్ ఉంది. నిజం. ప్రేమ అయిపోతుంది. ఆ వయసు, ఆ ఆకర్షణ, ఆ శక్తి, ఆ సహనం ప్రేమికుల్ని వివశుల్ని చేస్తాయి. ప్రేమను తెగించే స్థాయికి తీసుకెళతాయి. ప్రేమికులు మారలేదు. పెద్దలే ఒక సమస్యను వదిలి ఇంకో సమస్యను ముందుకు తెస్తూ వెళుతున్నారు. భారతీరాజా ‘సీతాకోకచిలుక’ కూడా భారీగా హిట్ అయ్యింది. దానిలో హిందూ క్రిస్టియన్ల మధ్య ప్రేమ. క్లయిమాక్స్లో ఊరే తగలబడే స్థాయికి వెళుతుంది. ఆర్థికంగా శక్తిమంతుడైన శరత్బాబు తన చెల్లెలు ముచ్చర్ల అరుణ ప్రేమను సంగీత పాఠాలు చెప్పుకునే ఇంటి కార్తీక్కు ఇవ్వడానికి ఇష్టపడడు. ఇక్కడ మతంతోపాటు ఆర్థిక స్థాయి కూడా విలన్ కావడాన్ని దర్శకుడు చూపిస్తాడు. అయితే ఆ కథ సుఖాంతం అవుతుంది. చదవండి: (చై-సామ్ విడాకులు: సమంతకు భరణం ఎన్ని కోట్లు ఉంటుందంటే..!) ‘కులం’ ప్రేమకు అడ్డం కారాదని, ప్రేమ అలాంటి సంకుచితాల కంటే ఉన్నతమైనదని కె.విశ్వనాథ్ ‘సప్తపది’ తీసినప్పుడు ఆయన నుంచి అలాంటి ప్రేమకథ చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. ఆయన చెప్పిన పద్ధతికి కన్విన్స్ అయ్యారు. సినిమాను హిట్ చేశారు. అందులో అగ్రహారం అమ్మాయి దళిత కుర్రాడిని ప్రేమిస్తుంది. ‘గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన’ పాట ఉంది ఇందులో. పశువు రంగుకీ పాల రంగుకీ సంబంధం లేదు. ఆరాధనకు వర్ణం లేదు. ప్రేమకు కులం లేదు. కలిసిన ఏ రెండు మనసులైనా సప్తపదికి అర్హమైనవే అని దర్శకుడు చెబుతాడు. ఆ తర్వాత చాలారోజులకు హిందీ ‘బాబీ’ స్ఫూర్తితో తేజ ‘నువ్వు నేను’ తీశాడు. ఇందుకు సాంస్కృతిక తారతమ్యం ప్రధానంగా విభేదం తెస్తుంది. డబ్బు రెండు వర్గాల దగ్గర ఉంది. కాని ఒకరు సూటూ బూటూ వేసే బంగళావాళ్లైతే మరొకరు పాడీ పశువూ యాస ఉన్నవారు. ‘మీపెద్దోళ్లున్నారే’ అని హీరో ఉదయ్కిరణ్ అన్నట్టు పెద్దోళ్ల లెక్కలు పెద్దోళ్లవి. పిల్లలకు ఆ లెక్కలు పట్టవు. వారి దృష్టిలో వాటి విలువ గుండుసున్నా. చదవండి: (సోషల్ మీడియా వేదికగా భావోద్వేగానికి లోనైన సమంత, పోస్ట్ వైరల్) కులపట్టింపు ప్రేమికులు పెళ్లి చేసుకున్నాక కూడా వెంటాడుతుందని తమిళంలో నుంచి తెలుగులోకి డబ్ అయిన ‘ప్రేమిస్తే’ చెప్పింది. అందులో పారిపోయిన ప్రేమికులను వెంటాడి విడదీస్తారు. మరాఠిలో ‘సైరా’ ఇదే పాయింట్ను పట్టుకుని పరువు హత్యను చూపించి భారీ విజయం నమోదు చేసింది. అందులో పారిపోయి పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నాక కూడా ఆ ప్రేమికులను కుల అహంభావులు చంపుతారు. ఇప్పుడు ఈ కుల అహంభావం తెలుగు సినిమాల్లో చర్చకు వస్తోంది. ‘మంచివాడే కానీ మనవాడు కాడు’ అనే డైలాగ్ ఉంది కరుణ కుమార్ తీసిన ‘శ్రీదేవి సోడా సెంటర్’ సినిమాలో. ఈ ‘మనవాడు’ కాకపోవడమే హీరోయిన్ తండ్రికి సమస్య. అతనిది సోడా వ్యాపారం. కాని కుల పట్టింపు విషయంలో రాజీ పడడు. చివరకు కన్నకూతురినే పరువు కోసం హత్య చేస్తాడు. ‘ఉప్పెన’లో కూడా అంతే. హీరోయిన్కు ఆస్తి ఉంది. కులం ఉంది. హీరో కులం వాళ్లకు ‘చాల్లేదు’. సముద్రం మీద సాహసంగా వెళ్లి వేట చేసే కుర్రాడు ఎంత యోగ్యుడైనా హీరోయిన్ తండ్రి అహానికి సరిపోడు. చివరకు హీరో మగతనానికే నష్టం కలిగించే స్థాయికి వెళతాడు. ‘లవ్స్టోరీ’లో హీరో కులం హీరోయిన్ ఇంటికి బయట చెప్పులు విడిచి వచ్చే స్థాయికి ‘నెట్టబడిన’ కులం. ఊళ్లో ఉన్న వివక్షను తట్టుకోలేక సిటీకి వచ్చి బతుకుతుంటే ప్రేమ విషయంలో పెళ్లి విషయంలో ఊరు హీరోను తరుముతూనే ఉంటుంది. చివరకు శ్మశానం కూడా అగ్రకులాలకు ఒకటి... అణగారిన కులాలకు ఒకటి. ‘తిరగబడి ప్రేమను సాధించుకుందాం’ అనుకుంటాడు హీరో. తిరగబడే తెగింపుకు నెడుతున్నది ఎవరు? సమాజం అయినా సినిమా అయినా ప్రేమను తప్పించుకోలేదు. సమాజం ప్రేమికులకు ఎన్నో సవాళ్లు విసురుతున్నా ప్రేమికులు ఓడిపోతుండవచ్చు కాని ప్రేమ ఓడిపోవడం లేదు. అది మళ్లీ మళ్లీ జన్మిస్తూనే ఉంది. ఇవాళ చాలా కుటుంబాల్లో ప్రేమ వివాహాలు జరుగుతున్నాయి. వాటిలో కులాంతరం, మతాంతరం, ఖండాంతరం ఉన్నాయి. ఒప్పుకునే మనసుంటే ఎంత పెద్ద సమస్యా సమస్య కాకుండా పోతుంది. ఒప్పుకోకపోతే చిన్న సమస్య కూడా సమస్యే. ప్రేమ పుట్టనే కూడదు. పుట్టాక దానిని సఫలం చేసుకోవడానికి ప్రేమికులు చేసే ప్రతి పోరాటం ఇక ముందు కూడా సినిమా కథే అవుతుంది. -
మాస్క్ లేకపోతే రిస్క్
ముసుగు వేయొద్దు మనసు మీద అంటారు.. అంటే.. మనసులో ఏం ఉంటే అది మాట్లాడాలని. ఇప్పుడు సీన్ రివర్స్... ముసుగు వేయాలి ముఖం మీద. అదేనండీ మాస్క్. అది లేకపోతే రిస్క్.. ఇక.. బ్యాగ్లో ఏం ఉన్నా లేకపోయినా.. శానిటైజర్ బాటిల్ ఉండాల్సిందే. పదే పదే చేతులు శుభ్రం చేసుకోవాలి. లేకపోతే రిస్క్. అంతా కరోనా తెచ్చిన తంటా. ఈ కరోనా కాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తాము ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో కొందరు కథానాయికలు చెప్పారు. ఆ విశేషాలు. ఇప్పుడు దూరమే మంచిది -పూజా హెగ్డే ► కరోనాకి సంబంధించి ముందు బేసిక్ పాయింట్స్ని ఒకసారి చెప్పుకుందాం ► తరచూ చేతులు కడుక్కోవాలి ► ఫేస్ మాస్క్ని మరచిపోకుండా వాడాలి ► ఏదైనా వస్తువు ముట్టుకున్నాక శానిటైజర్ వాడాలి ► ఇప్పుడు ఆవిరి పట్టడం చాలా ముఖ్యం. రోజుకి రెండుసార్లు ఆవిరి పడితే మంచిది. నేను తప్పనిసరిగా రోజుకి రెండుసార్లు ఆవిరి పడుతుంటాను ► వేడినీళ్లు ఎన్ని తాగితే అంత మంచిది. మనం ఎక్కువ నీళ్లు తాగడంవల్ల మన శరీరంలో ఇన్ఫెక్షన్ తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. నేను రోజుకి కనీసం మూడు లీటర్లు నీళ్లు తాగుతాను ► యోగా చాలా మంచిది... శరీరానికి, మనసుకి కూడా. నేను రోజూ చేస్తాను ► బత్తాయి, ఆరెంజ్ లాంటి సిట్రస్ ఫ్రూట్స్ మేలు చేస్తాయి. లేకపోతే విటమిన్ సి ట్యాబ్లెట్లు వాడాలి. డాక్టర్ సలహా మేరకు ట్యాబ్లెట్లు తీసుకోవాలండోయ్. నేను రోజూ ఎక్కువగా పండ్లు తింటాను ► షూటింగ్కి వెళ్లేటప్పుడు తప్పకుండా శానిటైజర్ తీసుకెళతాను. అలాగే అందరికీ దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తాను. అది నాకూ మంచిది. లొకేషన్లో ఉండేవాళ్లకీ మంచిది షూటింగ్ లొకేషన్లో ఉన్నప్పుడు కాటన్ రుమాలుని మాస్క్లా వాడతాను ► నేను ఉండే వ్యానిటీ వ్యాన్ బయట శానిటైజర్ ఉండేలా చూసుకుంటాను. వ్యాన్లోకి వచ్చేవాళ్లు చేతులను శానిటైజర్తో శుభ్రం చేసుకున్నాకే వస్తారు ► షూటింగ్ ముగించుకుని ఇంటికి రాగానే ఆవిరి తీసుకుంటాను. వేడి నీళ్లతో స్నానం చేస్తాను ∙ఒక నటిగా అన్ని సమయాల్లో మాస్క్ ధరించడం చాలా కష్టం. కెమెరా ముందుకు వెళ్లినప్పుడు మాస్క్ తీసేస్తాం. ► కరోనా వైరస్ వ్యాప్తిని నివారించడానికి అన్ని జాగ్రత్తలూ తీసుకునే, షూటింగ్స్ చేస్తున్నాం. ఆరోగ్యమే గొప్ప సంపద -రాశీ ఖన్నా ► ప్రస్తుతం నాగచైతన్యతో నటిస్తున్న ‘థ్యాంక్యూ’ సినిమా షూటింగ్ చేస్తూ ఇటలీలో ఉన్నాను ∙కోవిడ్ నిబంధనలను చాలా స్ట్రిక్ట్గా పాటిస్తున్నాం. మాస్కులు ధరించి షూటింగ్కి రావాలనే నిబంధనను అందరం ఫాలో అవుతున్నాం ► లొకేషన్లో వీలున్న చోటల్లా శానిటైజర్లు ఏర్పాటు చేశారు. అలాగే లొకేషన్ని తరచూ శానిటైజ్ చేయిస్తున్నారు ► ఎన్ని చేసినా కెమెరా ముందుకి వెళ్లగానే మేం ఆర్టిస్టులు మాస్కులు తీయాల్సిందే ► నా వ్యక్తిగత విషయానికొస్తే.. మొదట్నుంచీ నాకు ఆరోగ్యం మీద శ్రద్ధ ఎక్కువ. అందుకే ఇప్పుడు ప్రత్యేకంగా ఏమీ చేయడంలేదు ఇప్పుడనే కాదు.. ఎప్పట్నుంచో వేడి నీళ్లు తాగడం నా అలవాటు ► నేను శాకాహారిగా మారి, ఏడాదిన్నర అయింది. దానివల్ల చాలా హాయిగా ఉంది ► ఇప్పుడు అందరూ చేయాల్సిన పనేంటంటే.. ఫిట్గా ఉండటం. వైరస్ మనల్ని ఎటాక్ చేస్తే తట్టుకునేంత శక్తి మన దగ్గర ఉండాలి. మంచి ఆహారపుటలవాట్లు మన రోగ నిరోధక శక్తిని పెంచుతాయి ► పెద్ద పెద్ద వ్యాయామాలు చేయడానికి కుదరకపోతే రోజుకి కనీసం 20 నిమిషాలైనా నడవాలి ∙తప్పించలేని పనులుంటే బయటకు వెళ్లక తప్పదు. పని లేకపోతే వెళ్లొద్దు ► ఈ కరోనా వల్ల మనషుల మనుగడ ప్రశ్నార్థకం అయింది. ఈ పోటీ ప్రపంచంలో ఇన్నాళ్లూ పరుగులు పెట్టాం. ఇప్పుడు ఆగి, ఆలోచించాల్సిన అవసరం ఉంది. సంపాదనలోనే ఆనందం ఉందనే భ్రమను తొలగించుకుందాం. ఆరోగ్యమే గొప్ప సంపద అనే విషయాన్ని గ్రహిద్దాం ► ఇప్పటివరకూ ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని పాటించినవాళ్లు ఓకే. లేనివాళ్లు మాత్రం లైఫ్స్టయిల్ని మార్చుకోవాలి ► ఫైనల్గా ఒక మాట చెబుతాను. తప్పనిసరిగా మాస్క్ ధరించండి. మీరు క్షేమంగా ఉండండి. ఇతరులకూ అదే క్షేమం! ఆ ధోరణి మారాలి -నభా నటేష్ ► ప్రజలు కరోనా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది ► కచ్చితంగా మాస్క్లు ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులను శుభ్రంగా కడుక్కోవడం వంటి ప్రాథమిక నియమాలను అలవాటు చేసుకోవాలి ► కరోనా మహమ్మారి మనల్ని ఏడాదికి పైగా బాధపెడుతున్నా మనలోని కొందరు ఇంకా కరోనా జాగ్రత్తలను పాటించే విషయంలో నిర్లక్ష్యంగానే ఉన్నారు. ఆ ధోరణిని మార్చుకోవాలి ► ఈ కరోనా సమయంలోనూ నేను షూటింగ్లో పాల్గొంటున్నాను. అయితే అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను ► నేనే కాదు.. నా వ్యక్తిగత సిబ్బంది కూడా చాలా జాగ్రత్తగా ఉంటున్నారు ► షూటింగ్ లొకేషన్లో అందరూ మాస్కులు ధరిస్తున్నారు. భౌతిక దూరం పాటించే మాట్లాడుకుంటున్నాం ► షూటింగ్లో భాగంగా కొన్ని వస్తువులను తాకాల్సి వస్తుంది. సో.. ఎప్పటికప్పుడు చేతులను శానిటైజర్తో క్లీన్ చేసుకుంటున్నాను ► అందరూ రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోవాలి ► రోజులో కాస్త సమయం వ్యాయామానికి కేటాయించాలి ► నేను తప్పకుండా వ్యాయామం చేస్తాను, మంచి ఆహారం తీసుకుంటాను. మంచి అలవాట్ల వల్ల శక్తి అధికంగా ఉండే రోగాల నుంచి కాస్త దూరంగా ఉండొచ్చనేది నా భావన ► కరోనా వల్ల అన్ని రంగాలూ చాలా నష్టపోయాయి. ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు వస్తున్నాయనుకుంటే సెకండ్ వేవ్ రూపంలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. వైరస్తో ప్రయాణం చేస్తున్నామని మరచిపోకండి. జాగ్రత్తగా ఉండండి. -
అక్కడ ఇందిరాగాంధీ, ఇక్కడ వాణిశ్రీ
మగాళ్ళదే పెత్తనమైన రోజుల్లో... అదీ హీరోలదే రాజ్యమైన సినిమా రంగంలో... హీరోయిన్ ప్రాధాన్యంతో సినిమా వస్తే? అదీ ఓ అప్కమింగ్ తారతో? పైపెచ్చు, హీరోయిన్ ఓరియంటెడ్ టైటిల్తో..అదీ ఏ క్రైమ్ సినిమానో కాకుండా సాంఘికమైతే? ఇప్పుడంటే ఓకే కానీ, బ్లాక్ అండ్ వైట్ కాలంలో... యాభై ఏళ్ళ క్రితం ఇలాంటివి ఆర్థికంగానూ, ఆదరణ రీత్యా కష్టమే. కానీ, వాణిశ్రీ నాయికగా, శోభన్బాబుతో దర్శక–నిర్మాత గిడుతూరి సూర్యం చేసిన ప్రయత్నం 1971 మార్చి 25న రిలీజైన ‘కథానాయకురాలు’. ‘తనువా హరిచందనమే...’ లాంటి పాపులర్ పాటలు, విలక్షణమైన విలనీ డైలాగులతో ఆ సినిమా ఇప్పటికీ చాలామందికి గుర్తే. అభ్యుదయ భావాలతో, సామ్యవాదాన్ని ప్రబోధించే భావాలతో సాటి అభ్యుదయ కవులు, రచయితలైన శ్రీశ్రీ, సుంకర సత్యనారాయణ, ఏల్చూరి, రెంటాల గోపాలకృష్ణ తదితరుల సృజనాత్మక భాగస్వామ్యంతో గిడుతూరి చేసిన ఆ ప్రయోగానికి ఇప్పుడు 50 వసంతాలు. లేచింది... నిద్రలేచింది మహిళాలోకం! అది 1971. అప్పుడప్పుడే సమాజంలో మార్పు వస్తోంది. వివిధ రంగాలలో స్త్రీలకు ప్రాధాన్యం పెరుగుతోంది. ‘గరీబీ హఠావో’ నినాదంతో ఇందిరా గాంధీ సారథ్యంలో సరికొత్త కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది. 1966 జనవరిలోనే తొలిసారి దేశ ప్రధాని అయిన ఇందిరాగాంధీ, తాజాగా మధ్యంతర ఎన్నికలతో దేశానికి మూడోసారి ప్రధాని అయ్యారు. అప్పటికే ఆమె రాజభరణాల రద్దు, బ్యాంకుల జాతీయీకరణ లాంటి నిర్ణయాలతో నెహ్రూ మార్కు సోషలిజానికి తన దూకుడును జోడించారు. ఓ పెద్ద ప్రజాస్వామ్య దేశానికి ఒక మహిళ నాయకురాలై, ప్రతిపక్షాలను దీటుగా ఎదుర్కొంటున్న వేళ అది. సమాజంలోని మార్పులకు తగ్గట్టుగా సినిమాల్లో కథలు, స్త్రీ పాత్రలు మారాల్సిన సమయం వచ్చింది. స్త్రీలను చేతకానివాళ్ళుగా, వంటింటి కుందేళ్ళుగా చూపిస్తే ఇష్టపడరనే ఆలోచన మొదలైంది. సినీ విశ్లేషకుడు, సినీ పంపిణీ రంగ నిపుణుడు స్వర్గీయ కాట్రగడ్డ నరసయ్య మాటల్లో చెప్పాలంటే, ‘‘సమాజ అభివృద్ధిలో, సంఘంలోని కుళ్ళును కడిగేయడంలో ముఖ్యపాత్ర వహించేవారిగా స్త్రీలను చూపించాల్సిన అవసరం వచ్చింది. తెరపై వీరోచిత చర్యలను కథానాయకులు చేసినట్లే స్త్రీలే ప్రాముఖ్యం వహించే పాత్రలు అవసర’’మయ్యాయి. సరిగ్గా ఆ పరిస్థితుల్లో వచ్చినవే – భానుమతి నటించిన ‘మట్టిలో మాణిక్యం’. ఆ వెనువెంటనే వాణిశ్రీ ‘కథానాయకురాలు’. సూపర్హిట్ శోభన్బాబు– వాణిశ్రీ ఇందిరా గాంధీ మూడోసారి దేశ ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సరిగ్గా వారం రోజులకు వచ్చిన చిత్రం ‘కథానాయకురాలు’. సామ్యవాదాన్ని ప్రబోధిస్తూ, లేడీ ఓరియంటెడ్ టైటిల్తో అలా ఓ సినిమా రావడం అప్పట్లో విశేషం. గిడుతూరి కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం కూర్చి, నల్ల వెంకట్రావుతో కలసి ఈ చిత్రాన్ని నిర్మించారు. సాధారణంగా హీరోను విప్లవ నాయకుడిగా చూపించడం బాక్సాఫీస్ ఫార్ములా. కానీ, కార్మిక సంఘ నాయకురాలిగా హీరోయిన్ను చూపించడం, ఆమె ఓ ధనిక యజమానితో కార్మిక ప్రయోజనాల కోసం పోరాడడం వెరైటీ. ‘మనుషులు మారాలి’ (1969) లాంటి హిట్స్తో పేరు తెచ్చుకొని, హీరోగా స్థిరపడుతున్న రోజుల్లో శోభన్బాబు కథానుగుణమైన ఆ టైటిల్కి ఒప్పుకోవడం విశేషం. శోభన్–వాణిశ్రీ జంట తర్వాతి కాలంలో ‘చెల్లెలి కాపురం’, ‘జీవన తరంగాలు’, ‘ఖైదీ బాబాయ్’, ‘జీవనజ్యోతి’తో హిట్ పెయిర్గా నిలవడం గమనార్హం. ‘కథానాయకురాలు’ లాంటి హీరోయిన్ ఓరియంటెడ్ కథలో చేసిన శోభన్ ఆనక హీరోయిన్ల హీరోగా, హీరోలు సైతం అసూయపడే అందాల నటుడిగా ఇమేజ్ సాధించడం ఓ చరిత్ర. తారాపథానికి... ‘కథానాయకురాలు’ వాణిశ్రీ అనాథైన ఒక పేదపిల్ల చదువు – సంస్కారం అలవరచుకొని, నాయకురాలై, కార్మిక ఉద్యమాన్ని ఎలా జయప్రదంగా నడిపిందీ, సంఘవిద్రోహుల్ని ఎలా ఎదిరించిందీ కార్మిక విప్లవ ప్రబోధ చిత్రం ‘కథానాయకురాలు’ చూపెడుతుంది. కార్మికుల హక్కుల కోసం ప్రాణాలకు తెగించే హీరోయిన్, ధనికుల బిడ్డ అయినా తానెవరో చెప్పకుండా హీరోయిన్ పోరాటానికి అండగా నిలిచే హీరో, కార్మికలోకాన్ని అణచివేయాలనుకొనే మిల్లు నిర్వాహకుడు – ఈ 3 ప్రధాన పాత్రల చుట్టూ కథ తిరుగుతుంది. ఆ మూడు పాత్రల్లో వాణిశ్రీ, శోభన్బాబు, నాగభూషణం ఆకట్టుకుంటారు. ఇంకా అల్లు రామలింగయ్య, కాకరాల, ఛాయాదేవి, రామ్మోహన్, రావుగోపాలరావు, కామెడీకి రాజబాబు– ఇలా పేరున్న తారాగణమే ఉంది. ‘శంకరాభరణం’ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు చిన్న పాత్రలో నటించారు. అప్పటికే వాణిశ్రీ తారాపథానికి పరుగులు తీస్తున్నారు. ఎన్టీఆర్ ‘కోడలు దిద్దిన కాపురం’, అక్కినేని ‘దసరా బుల్లోడు’ హిట్స్ తరువాత ‘కథానాయకురాలు’ వస్తే, ఆ వెంటనే కృష్ణ ‘అత్తలూ – కోడళ్ళు’, ఆ ఏడాదే శోభన్తోనే ‘చెల్లెలి కాపురం’ – ఇలా హీరోలందరి పక్కనా వాణిశ్రీ మెరిశారు. అయితే, ఒక రకంగా ఈ సినిమా వాణిశ్రీ బహుముఖ నటనను తెరపై చూపే రకరకాల గెటప్పులకు అవకాశమిచ్చింది. కార్మికనేతగా, ప్రేయసిగా, హిరణ్యకశిపుడిగా, తమిళ యువతిగా – విభిన్న వేషాలలో ఆమె తన ప్రతిభను ప్రదర్శించారు. ఎన్టీఆర్ ‘సంగీతలక్ష్మి’ తీసిన సూర్యమే... దర్శకుడు గిడుతూరి సూర్యం పేరు చెప్పగానే ఎన్టీఆర్ – జమునల ‘సంగీతలక్ష్మి’, యస్వీఆర్ – రామకృష్ణల ‘విక్రమార్క విజయం’, కాంతారావు ‘రణభేరి’, విజయలలిత ‘పంచకల్యాణి– దొంగల రాణి’, మంజుభార్గవి ‘అమృతకలశం’ లాంటి వేర్వేరు కోవల సినిమాలు సినీ ప్రియులకు గుర్తుకొస్తాయి. ప్రసిద్ధ సినీ దర్శకులు కృష్ణన్ – పంజు, భీమ్సింగ్లకు ఆయన శిష్యుడు. లేఖా జర్నలిస్టుగా, రచయితగా జీవితం ప్రారంభించి సినిమాల్లో ఎదిగిన ఆయన ఆ తరం అభ్యుదయ కవి, రచయిత. విశ్వనాథ సత్యనారాయణ, అడివి బాపిరాజు, జంధ్యాల పాపయ్యశాస్త్రి, బలిజేపల్లి లక్ష్మీకాంతం, నాట్యాచార్యులు పసుమర్తి కృష్ణమూర్తి – డి. వేణుగోపాల్ల వద్ద కథారచన, చిత్రలేఖనం, కవిత్వం, నాటక రచన, నృత్యం – ఇలా అనేక కళలను నేర్చుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి. కళారాధనలో... కమ్యూనిస్టులు అభ్యుదయ కవులు బెల్లంకొండ రామదాసు, అనిసెట్టి సుబ్బారావు, ఏల్చూరిసుబ్రహ్మణ్యం,రెంటాల గోపాల కృష్ణ తదితరులు గిడుతూరికి మిత్రులు. గుంటూరు ఏ.సి. కాలేజీలో బి.ఏ చదివి, ‘ప్రజానాట్యమండలి’లో, ‘ఇండియన్ నేషనల్ ఆర్ట్ థియేటర్’లో గిడుతూరి నాటక రచన, దర్శకత్వం చేశారు. ఎన్నో పుస్తకాలు రాశారు. బలిజేపల్లి వద్ద నాటక, సినీ రచన నేర్చిన ఆయన రష్యా వెళ్ళి, అక్కడి మాస్కో మాస్ ఫిలిమ్ స్టూడియోలో శిక్షణ పొంది వచ్చాక, ఎన్టీఆర్ ‘సంగీత లక్ష్మి’ (1966)తో మొదలుపెట్టి పలు చిత్రాలను రూపొందించారు. ‘సంగీత లక్ష్మి’ అప్పట్లో మంచి పేరు తెచ్చుకుంది. నిజానికి, ‘సంగీత లక్ష్మి’, ‘కథానాయకురాలు’ రెండూ గిడుతూరి నవలల ఆధారంగా వచ్చిన సినిమాలే. భార్య సరస్వతీదేవి పేరిట ‘శ్రీ సరస్వతీ చిత్ర’ పతాకం నెలకొల్పి, ఆయన సినిమాలు తీశారు. ఏంచేసినా అభ్యుదయ భావాల్ని వదిలిపెట్టలేదు. సినిమాలతో సహా తన ప్రతి సృజనలోనూ వాటిని వీలైనంతగా జొప్పించేవారు. ‘కథానాయకురాలు’ కూడా ఆ నేపథ్యంలో రూపుదిద్దుకున్నదే. ఆ గీతాలన్నీ అభ్యుదయ రచయితలవే! అభ్యుదయ కవులు శ్రీశ్రీ,ఆరుద్ర,ఏల్చూరితో ‘కథానాయకురాలు’కి పాటలు రాయించారు గిడుతూరి. ‘‘సోషలిస్టు విధానాల కోసం మన ఇందిరాగాంధీ బడా నాయకుల్ని ఎదిరించి, ఘనవిజయం సాధించింది! కార్మిక సంక్షేమం కోసం మన కథానాయకురాలు దుష్టశక్తుల నెదిరించి, అపూర్వ విజయం సాధించింది!’’ అని ఈ సినిమా గురించి ఆ రోజుల్లో ప్రముఖంగా ప్రకటించారు. ‘అభినవ ప్రహ్లాద చరితం’ అంటూ దరిద్ర నారాయణుడే దేవుడిగా శ్రీశ్రీ రాసిన నాటకం హైలైట్. అలాగే, ‘మాభూమి’ నాటకకర్త సుంకర సత్యనారాయణ రాసిన బుర్రకథ మరో హైలైట్. తర్వాతి కాలంలో ‘ఆంధ్రభూమి’ వీక్లీ ఎడిటర్గా పాపులరైన సికరాజు కూడా సినిమాలో జ్యోతిలక్ష్మిపై వచ్చే ‘చూడు షరాబీ...’ అనే శృంగార గీతం రాశారు. సెక్సప్పీల్ వల్లే సక్సెస్లా? ‘‘ధనస్వామ్యమా, జనస్వామ్యమా? ఈనాడు దేశానికేది కావాలి?’’ అని కథానాయకురాలు ద్వారా దర్శక – నిర్మాత ప్రశ్న సంధించారు. ప్రముఖ పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ అందమైన లోగో, డిజైన్లతో ఉగాది కానుకగా, 1971 మార్చి 25న ఈ చిత్రం విడుదలైంది. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. నిజానికి, ఆ ఫిబ్రవరిలోనే గిడుతూరి దర్శకత్వంలోనే ‘విక్రమార్క విజయం’ వచ్చింది. సక్సెస్ అయింది. ఆ వెంటనే స్వీయ నిర్మాణమైన ఈ సాంఘికంతో పలకరించారు గిడుతూరి. దేశంలో సెక్స్, క్రైమ్ చిత్రాలకే తప్ప, చక్కనికథతో సినిమా తీస్తే, దానికి డబ్బు రావడం లేదని అప్పటికే ఆయన ఆవేదన చెందుతూ ఉండేవారు. అందుకు తగ్గట్టే ‘కథానాయకురాలు’ పేరు తెచ్చినంత, డబ్బు తేలేదు. కాకపోతే, బి, సి సెంటర్లలో రిపీట్ రన్లతో ఎంతో కొంత లాభమే తెచ్చింది. అప్పటికే ఆడుతున్న ‘దసరా బుల్లోడు’, ‘రాజకోట రహస్యం’ లాంటి వాణిజ్య సినిమాల మధ్య కార్మిక విప్లవం లాంటి ప్రబోధాలిచ్చిన ‘కథానాయకురాలు’ నలిగిపోయింది. అయితే ‘తనువా...’ లాంటి పాటలతో, మారిన పరిస్థితులకు అనుగుణంగా మహిళా నాయకత్వాన్ని చాటిన చిత్రంగా ‘కథానాయకురాలు’ ఇప్పటికీ ప్రత్యేకమే! ఆల్ టైమ్ క్లాసిక్ హిట్ సాంగ్! అన్ని రకాల పాటలున్న ‘కథానాయకురాలు’లో ‘తనువా హరిచందనమే...’ పాట మాత్రం ఇవాళ్టికీ హైలైట్. హీరో శోభన్ బాబు, హీరోయిన్ వాణిశ్రీల కెరీర్లో పాపులర్ క్లాసికల్ హిట్ సాంగ్ ఇది. ఈ సినిమా రిలీజుకు సరిగ్గా నాలుగు రోజుల ముందరే 1971 మార్చి 21న ఆలిండియా రేడియో హైదరాబాద్, విజయవాడల్లో వివిధ భారతి – వాణిజ్య ప్రసారాలను ప్రారంభించారు. రేడియోలో తరచూ సినీగీతాలు వినే సావకాశం తెలుగునాట దక్కింది. ఆ వెంటనే ఆ నెలాఖరునే వాణిశ్రీయే హీరోయిన్ గా నటించిన ఎన్టీఆర్ ‘జీవితచక్రం’తో తెలుగు సినిమాలకు రేడియో పబ్లిసిటీ కూడా తొలిసారిగా మొదలైంది. మొత్తానికి అప్పటి నుంచి ఇప్పటి దాకా ‘తనువా హరిచందనమే’ పాట ఎస్పీబీ, పి. సుశీల గళాల్లో రేడియోలో తరచూ వినిపిస్తూనే ఉంది. టీవీలో, యూ ట్యూబుల్లో కనిపిస్తూనే ఉంది. ప్రసిద్ధ సినీ గాయని చిత్ర సైతం ఇటీవలే ఓ టీవీ షోలో ఈ పాట పాడడం దీనికున్న పాపులారిటీకి తాజా నిదర్శనం. సినీ రంగంలో ఎ.ఎ. రాజ్ గా ప్రసిద్ధుడైన మ్యూజిక్ డైరెక్టర్ ఆకుల అప్పలరాజుకు ఇది కెరీర్ బెస్ట్ సాంగ్. గమ్మత్తేమిటంటే, తక్కువ పాటలే రాసినా, ఈ ఒక్క పాట సినీ గీత రచయితగా గోన విజయరత్నాన్ని చిరంజీవిని చేసింది. డైలాగుల్లో... విప్లవతత్వం! విలనీ!! గిడుతూరి సూర్యం తన ఆప్తమిత్రుల్లో ఒకరైన ప్రముఖ అభ్యుదయ కవి, రచయిత, నాటకకర్త రెంటాల గోపాలకృష్ణకు సినిమా సంభాషణల రచన బాధ్యత అప్పగించారు. అప్పటికే ‘ఆంధ్రప్రభ’ దినపత్రిక సంపాదక వర్గంలో కీలక బాధ్యతల్లో ఉన్న రెంటాల అనేక అనువాదాలు, రచనలు చేసిన సుప్రసిద్ధులు. సినీ రంగంతో అనుబంధం, సినీ విమర్శకుడిగా పేరూ ఉన్నవారు. రంగస్థలంపై పేరున్న రెంటాల అంతకు ముందు గిడుతూరి తీసిన జానపదం ‘పంచకల్యాణి – దొంగలరాణి’ (1969 ఆగస్టు 2)కి డైలాగ్స్ రాశారు. ప్రజానాట్యమండలిలో, బెజవాడ హనుమంతరాయ గ్రంథాలయం ఆంధ్ర ఆర్ట్ థియేటర్లో నటుడిగా, నాటకకర్తగా కృషిచేసిన రెంటాల సామ్యవాదాన్ని ప్రబోధించే సాంఘిక చిత్రం ‘కథానాయకురాలు’లోనూ తన కలం పదును మరోసారి చూపారు. యజమాని, కార్మికుల సంఘర్షణ ప్రధాన ఇతివృత్తమైన ఈ చిత్రానికి రెంటాల రాసిన సంభాషణలు ‘‘ఆయా సన్నివేశాలకు తగినట్టు భావస్ఫోరకంగా, విప్లవతత్వాన్ని వెదజల్లుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి’’ అని అప్పట్లో సినీ విమర్శకులు, సమీక్షకులు ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రత్యేకించి, ‘‘సత్యారావు పాత్ర ధరించిన నటుడు నాగభూషణానికి రాసిన డైలాగ్స్ ప్రేక్షకులను గిలిగింతలు పెడతాయి’’ అని పేర్కొన్నారు. రంగస్థలంపై మిత్రులు ఆచార్య ఆత్రేయ ‘విశ్వశాంతి’, అనిసెట్టి ‘గాలి మేడలు’ సహా అనేక నాటకాల్లో రెంటాల నటించారు. ఈ సినిమాలోనూ ఫ్యాక్టరీలో జీతాల పంపిణీ వేళ కార్మికుడు గోపయ్యగా కీలక ఘట్టంలో వెండితెరపైనా కనిపించడం విశేషం. బొంబాయి స్ఫూర్తితో... బెజవాడ దుర్గాకళామందిరం! 1920 జనవరి 17న ఏలూరులో సంపన్న చేనేత కుటుంబంలో జన్మించిన గిడుతూరి సూర్యంకి కళల పట్ల ఆసక్తి కలగడానికి ప్రేరణ ఒక రకంగా విజయవాడలోని ప్రసిద్ధ శ్రీదుర్గాకళామందిరం. బెజవాడలో నాటకశాలగా మొదలై 90 ఏళ్ళు దాటినా ఇప్పటికీ సినిమా హాలుగా నడుస్తున్న దుర్గాకళామందిరం నిర్మాణంలో గిడుతూరి తండ్రి బంగారు పాత్ర చాలా ఉంది. 1920లలో కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారి ఆజ్ఞపై బొంబాయి వెళ్ళి, నాటకాలు ప్రదర్శించే థియేటర్లు సందర్శించి వచ్చారు బంగారు. బొంబాయి థియేటర్ల సాంకేతిక పరిజ్ఞానాన్నీ, స్టేజీ ఏర్పాట్లనూ అనుసరిస్తూ, 1929 జూన్ ప్రాంతంలో పంతులు గారికి విజయవాడలో దుర్గాకళామందిరం నిర్మాణం చేశారు. ప్రదర్శకుల కోసం రొటేటింగ్ డిస్క్, వైర్ వర్క్స్, పాతాళంలోకి వెళ్ళేటట్టు స్టేజీ పైన అక్కడక్కడా పలకలు కిందకు తెరుచుకొనే ఏర్పాట్లు, ఇంకా అనేక టెక్నికల్ సదుపాయాలను కళామందిరంలో గిడుతూరి తండ్రి కల్పించారు. అనేక ప్రఖ్యాత నాటక సంస్థలు ఆయన కూర్చిన టెక్నికల్ సదుపాయాలతో అప్పట్లో అక్కడ అద్భుత ప్రదర్శనలిచ్చేవి. పంతులు గారి ప్రోత్సాహంతో దుర్గాకళామందిరంలో నిత్యం నాటకాలు, మూకీలు చూస్తూ కళల వైపు మొగ్గారు గిడుతూరి. అదే ఆయన సినీరంగ ప్రస్థానానికి బాటలు వేసింది. – రెంటాల జయదేవ చదవండి: హీట్ పెంచుతున్న కృతి.. సెగలు రేపుతున్న లక్ష్మీరాయ్ అవసరాల శ్రీనివాస్ బట్టతల వీడియో.. అసలు విషయం ఇదే! -
మేకప్ మాయ.. కొత్త లుక్లో సినీ తారలు
ముఖం మీద ముడతలు కావాలా? ఉందిగా మేకప్. తెల్లగా ఉన్నవాళ్లు నల్లగా కనబడాలా? మేకప్ ఉందిగా. వయసులో ఉన్నవాళ్లు వృద్ధులుగా కనబడాలా? మేకప్తో ఏదైనా సాధ్యమే. ప్రస్తుతం కొందరు తారలు వెరైటీగా కనబడే ప్రయత్నంలో ఉన్నారు. మేకప్ సహాయంతో నల్లబడుతున్నారు. ముసలివాళ్లవుతున్నారు. అంతా మేకప్ మాయ. అప్.. అప్.. మేకప్ అంటూ కొత్త లుక్లో కనపడబోతున్న తారల గురించి తెలుసుకుందాం. ఇప్పటివరకూ కనిపించని లుక్లో వెంకటేశ్ ‘నారప్ప’ సినిమాలో కనిపించనున్నారు. తమిళ చిత్రం ‘అసురన్’కి రీమేక్గా రూపొందుతోంది ‘నారప్ప’. ఇందులో రైతు పాత్రలో కనిపించనున్నారు. మామూలు రైతు కాదు.. అన్యాయాన్ని సహించలేని రైతు. కుటుంబానికి జరిగిన అన్యాయానికి ఎదురు తిరిగి, అక్రమార్కులను అంతం చేసే రైతు. ఈ పాత్రలో వెంకీ రఫ్గా కనిపిస్తారు. పైగా రైతు అంటే ఎండల్లో కష్టపడక తప్పదు కదా.. దానికి మ్యాచ్ అయ్యేట్లు ఆయన స్కిన్ టోన్ని కాస్త డల్ చేశారు. వెంకీ రైతు అయితే అల్లు అర్జున్ లారీ క్లీనర్. ‘పుష్ప’ సినిమాలో పుష్పరాజ్ అనే లారీ క్లీనర్గా కమిలిపోయిన చర్మంతో కనబడతారు. సరిగ్గా దువ్వని జుట్టు, ట్యాన్ అయిన స్కిన్, ఆయిల్ మరకలతో బట్టలు.. అల్లు అర్జునేనా? అన్నంతగా మారిపోయారు. ఇక బాబాయ్ వెంకటేశ్లానే అబ్బాయ్ రానా కూడా ట్యాన్ అయ్యారు. ఒక్క సినిమా కోసం కాదు.. రెండు సినిమాలకు. ఒకటి ‘అరణ్య’, ఇంకోటి ‘విరాటపర్వం’. 25ఏళ్లుగా అరణ్యంలో జీవిస్తూ వస్తున్న ఒక వ్యక్తి కథ ‘అరణ్య’. పర్యావరణం, అడవుల నరికివేత వంటి అంశాలతో సాగే ఈ సినిమాలో అడవిలో నివసించేవాళ్లు ఎలా ఉంటారో అలా కనబడతారు రానా. అలాగే నక్సలిజమ్ బ్యాక్డ్రాప్లో రూపొందుతున్న ‘విరాటపర్వం’లో రానా మాత్రమే కాదు కథానాయిక సాయిపల్లవి, కీలక పాత్రలు చేస్తున్న ప్రియమణి, నందితా దాస్ కూడా డల్ మేకప్లోనే కనబడతారు. అందరూ నిజమైన నక్సలైట్లను తలపించేలా మౌల్డ్ అయిపోయారు. ఇప్పటివరకూ మోడ్రన్ గాళ్లా కనిపించిన రకుల్ ప్రీత్సింగ్ అచ్చమైన పల్లెటూరి పిల్లలా కనిపించనున్నారు. ‘ఉప్పెన’ ఫేమ్ వైష్ణవ్ తేజ్ సరసన ఆమె ఓ సినిమాలో నటిస్తున్నారు. అడవి బ్యాక్డ్రాప్లో ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమా కోసం బిగుతైన జడ, లంగా, ఓణీ, తక్కువ మేకప్తో విలేజ్ గాళ్లా మారిపోయారు రకుల్. సవాల్ అనిపించే పాత్రలు వస్తే సై అంటారు నటీనటులు. వీళ్లందరికీ అలాంటి పాత్రలు వచ్చాయి. వెరైటీ క్యారెక్టర్స్లో కనిపించాలనే ఆకలితో ఉన్న వీళ్లందరూ లుక్ని మార్చుకోవడమే కాదు.. నటనపరంగా కూడా విజృంభిస్తున్నారు. వీళ్లే కాదు.. ఇలాంటి చాలెంజింగ్ రోల్స్లో కనిపించనున్న తారలు ఇంకా చాలామందే ఉన్నారు. దర్శకుడితో జోడీ ‘మహానటి’తో తనలో ఉత్తమ నటి ఉందని నిరూపించుకున్నారు కీర్తీ సురేశ్. తమిళ సినిమా ‘సాని కాయిదమ్’లో ఆమె నటన వేరే లెవల్లో ఉంటుందని తెలుస్తోంది. ‘7/జి బృందావన కాలనీ’ దర్శకుడు సెల్వరాఘవన్ ఈ చిత్రం ద్వారా నటుడిగా మారారు. సెల్వ, కీర్తీ జంటగా తమిళనాడులో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. సినిమా ఫస్ట్ పోస్టర్లో సెల్వ, కీర్తిల లుక్ చూసి క్రైమ్ బ్యాక్డ్రాప్లో సినిమా ఉంటుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. వృద్ధుని గానూ... ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన గోండు వీరుడు కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. స్వాతంత్య్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్చరణ్, కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నారు. చరిత్రలో ఎప్పుడూ కలవని కొమురం భీమ్, అల్లూరి సీతారామరాజు కలిస్తే ఏం జరుగుతుంది? అనే కాల్పనిక కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ వృద్ధునిగానూ కనిపించనున్నారని సమాచారం. అయితే కొమురం భీమ్ చిన్న వయసులోనే మరణించారు. ఇది కాల్పనిక కథ కాబట్టి ఎన్టీఆర్కి ఓల్డ్ గెటప్ కూడా పెట్టి ఉంటారనే ఊహాగానాలు ఉన్నాయి. ఈ పాత్ర కోసం ఎన్టీఆర్ ప్రోస్థెటిక్ మేకప్ వాడుతున్నారని టాక్. 90 ఏళ్ల వృద్ధునిగా వెరైటీ గెటప్పులు వేయడంలో కమల్హాసన్కి సాటి ఎవరూ రారంటే అతిశయోక్తి కాదు. అందుకు చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఒక్క ఉదాహరణ ‘భారతీయుడు’ (1996). అందులో యువకుడిగానే కాదు.. వృద్ధునిగానూ కమల్ కనిపించారు. తాజాగా ‘భారతీయుడు 2’ రూపొందుతోంది. ఇందులో 90 ఏళ్ల వృద్ధునిగా కమల్ కనిపిస్తారని తెలిసింది. హెవీ ప్రోస్థెటిక్ మేకప్తో కమల్ వృద్ధునిగా కనిపించనున్నారు. ఈ వృద్ధునికి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. ఆమె 85 ఏళ్ల వృద్ధురాలిగా కనబడతారని టాక్. -
సోషల్ హల్చల్: అవికా జోరు, జుట్టు విరబోసుకున్న కీర్తి..
► సూపర్ స్టార్ మహేశ్బాబు నటించిన 'మురారీ' చిత్ర విజయానికి 20 ఏళ్లు నిండాయి. ఈ సందర్భంగా నమ్రత శిరోద్కర్ మురారీ సెట్స్లోని అన్సీన్ ఫొటోను షేర్ చేసింది. ► తలా అజిత్ భార్యతో కలిసి దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు. ఆయన చెప్పినట్లుగానే ఇద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారు. ► ఎఫ్ 3 భామ మెహరీన్ పిర్జాదా త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న విషయం తెలిసిందే. కాబోయే భర్త భవ్య బిష్ణోయ్ పుట్టిన రోజును పురస్కరించుకుని మంగళవారం ఆమె ఇద్దరూ కలిసి ఉన్న ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఇద్దరూ ఏకాంతంగా కబుర్లు చెప్పుకుంటూ మనసారా నవ్వుకుంటున్నారు. ► గుడ్ హెయిర్ డే అంటూ జుట్టు విరబోసుకుంది హీరోయిన్ కీర్తి సురేశ్. ► కపటధారి, అక్షర సినిమాల్లో నటిస్తున్న నందిత శ్వేత శూన్యంలోకి తీక్షణంగా చూస్తున్న ఫొటో అభిమానులతో పంచుకుంది. ► ట్రెడిషినల్ లుక్లో అదరగొడుతున్న కృతీ శెట్టి. ► దియా మీర్జా, వైభవ్ రేఖీ పెళ్లి ఆల్బమ్ నుంచి ఓ బ్యూటిఫుల్ ఫొటో. ► నభా నటేశ్ బ్లాక్ అండ్ వైట్ ఫొటో ► కాసేపు కునుకు తీసిన పూజా హెగ్డే ► బంగారు వర్ణం డ్రెస్లో మెరిసిపోతున్న మంచు లక్ష్మి View this post on Instagram A post shared by Ajith Kumar 🔵 (@ajithkumar_official_) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Avika Gor (@avikagor) View this post on Instagram A post shared by Nanditaswetha (@nanditaswethaa) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Dia Mirza (@diamirzaofficial) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) -
హీరోయిన్ల చేతిలో ఎన్ని సినిమాలున్నాయి?
హీరోయిన్లు ఒకే సమయంలో నాలుగైదు సినిమాలు చేస్తుంటారు. ఆ సెట్ నుంచి ఈ సెట్కి.. ఈ సెట్ నుంచి ఆ సెట్కి వెళ్తూ బిజీబిజీగా ఉంటారు. లాక్డౌన్లో షూటింగ్స్ మాత్రమే ఆగిపోయాయి. కొత్త కథలు తయారవుతూనే ఉన్నాయి. కొత్త సినిమాలు కమిట్ అవుతూనే ఉన్నారు. ప్రస్తుతం హీరోయిన్ల చేతిలో ఎన్ని సినిమాలున్నాయి? సెట్స్లో ఉన్న, పూర్తయిన, విడుదలకు సిద్ధమైన చిత్రాలతో ఒక్కో స్టార్ డైరీ ఎలా ఉంది? ఓ లుక్కేద్దాం. తమన్నా: వెంకటేశ్తో ‘ఎఫ్ 3’, నితిన్తో ‘అంధా ధున్’ తెలుగు రీమేక్. గోపీచంద్తో ‘సీటీమార్’, సత్యదేవ్తో ‘గుర్తుందా శీతాకాలం’. కాజల్ అగర్వాల్: చిరంజీవితో ‘ఆచార్య’, కమల్హాసన్తో ‘భారతీయుడు 2’, మంచు విష్ణుతో ‘మోసగాళ్ళు’, దుల్క ర్తో ‘హే సినామిక’ (పూర్తయింది), తమిళంలో రెండు హారర్–కామెడీ చిత్రాలు కమిటయ్యారు. కీర్తీ సురేశ్: మహేశ్బాబుతో ‘సర్కారు వారి పాట’, రజనీకాంత్తో ‘అన్నాత్తే’, నితిన్తో ‘రంగ్ దే’, నితిన్తో ‘పవర్ పేట’, ఆదితో ‘గుడ్ లక్ సఖీ’ (పూర్తయింది), తమిళంలో సెల్వ రాఘవన్తో ‘సాని కాయిదమ్’. రకుల్ ప్రీత్ సింగ్: నితిన్తో ‘చెక్’ (పూర్తయింది). కమల్హాసన్తో ‘భారతీయుడు 2’, వైష్ణవ్ తేజ్తో ఓ సినిమా, హిందీలో ‘సర్దార్ అండ్ గ్రాండ్ సన్’, ‘మే డే’, ‘థ్యాంక్ గాడ్’. తమిళంలో శివకార్తికేయన్తో ‘అయలాన్’. సాయి పల్లవి: రానాతో ‘విరాట పర్వం’, నాగచైతన్యతో ‘లవ్స్టోరీ’ (పూర్తయింది), నానీతో ‘శ్యామ్ సింగరాయ్’. లావణ్యా త్రిపాఠి: సందీప్ కిషన్తో ‘ఏ1 ఎక్స్ప్రెస్’, కార్తికేయతో ‘చావు కబురు చల్లగా’. శ్రుతీహాసన్: ‘క్రాక్’ (రేపే విడుదల). పవన్ కల్యాణ్తో ‘వకీల్ సాబ్’, తమిళంలో విజయ్ సేతుపతితో ‘లాభం’ నిత్యా మీనన్: సత్యదేవ్తో ‘స్కై ల్యాబ్’ చిత్రం, అశోక్ సెల్వన్తో ‘నిన్నిలా నిన్నిలా’, మలయాళంలో ‘కులంబీ’. నిధీ అగర్వాల్: గల్లా అశోక్తో ఓ తెలుగు సినిమా, తమిళంలో శింబుతో ‘ఈశ్వరన్’, ‘జయం’ రవితో ‘భూమి’ సినిమాలు పూర్తయ్యాయి. నివేదా థామస్: ‘వకీల్ సాబ్’, సుధీర్ వర్మ దర్శకత్వంలో ఓ లేడీ ఓరియంటెడ్ సినిమా. సమంత: గుణశేఖర్ దర్శకత్వంలో ‘శాకుం తలం’, తమిళంలో విజయ్ సేతుపతితో ‘కాదువాక్కుల రెండు కాదల్’ చేస్తున్నవి. అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో ఓ తమిళ సినిమా కమిటయ్యారని టాక్. రష్మికా మందన్నా: అల్లు అర్జున్తో ‘పుష్ప’, శర్వానంద్తో ‘ఆడాళ్లు మీకు జోహార్లు’, కార్తీతో ‘సుల్తాన్’ (పూర్తయింది), హిందీలో సిద్ధార్థ్ మల్హోత్రాతో ’మిషన్ మజ్ను’, అమితాబ్తో ‘డెడ్లీ’. కన్నడంలో ‘పొగరు’ (పూర్తయింది). పూజా హెగ్డే: ప్రభాస్తో ‘రాధే శ్యామ్’, అఖిల్తో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’, దుల్కర్–హను రాఘవపూడి సినిమా, హిందీలో సల్మాన్ ఖాన్తో ‘కభీ ఈద్ కభీ దీపావళి’, రణ్వీర్తో ‘సర్కస్’. రాశీ ఖన్నా: తమిళంలో విజయ్ సేతుపతితో ‘తుగ్లక్ దర్బార్’, ఆర్యతో ‘అరణ్మణై’. షాహిద్తో హిందీలో ఓ వెబ్ సిరీస్. తమిళంలో విక్రమ్తో ఓ సినిమా కమిటయ్యారట. నయనతార: తమిళంలో రజనీకాంత్తో ‘అన్నాత్తే’, విజయ్ సేతుపతితో ‘కాదువాక్కుల రెండు కాదల్, నెట్రిక్కన్’, మలయాళంలో ‘నిళల్, పాట్టు’. రీతూ వర్మ: నానీతో ‘టక్ జగదీష్’, శర్వానంద్తో ఓ ద్విభాషా చిత్రం, నాగ శౌర్యతో ‘వరుడు కావలెను’, అశోక్ సెల్వన్తో ‘నిన్నిలా నిన్నిలా, తమిళంలో విక్రమ్తో ‘ధృవ నక్షత్రం’. నభా నటేశ్: నితిన్తో ‘అంధా ధున్’ తెలుగు రీమేక్, ‘అల్లుడు అదుర్స్’ (సంక్రాంతికి విడుదల కానుంది). పాయల్ రాజ్పుత్: తెలుగులో లేడీ ఓరియంటెడ్ ‘5డబ్ల్యూస్’, తమిళంలో ‘ఏంజెల్’. ప్రియమణి: ‘నారప్ప, కొటేషన్ గ్యాంగ్’. అంజలి: పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’. రెజీనా: విశాల్తో ‘చక్ర’, ‘నేనేనా’, అరవింద్ స్వామితో ‘కల్లాపాట్’. అదితీ రావ్ హైదరీ: శర్వానంద్తో ‘మహా సముద్రం’, తమిళంలో దుల్కర్ సల్మాన్తో ‘హే సినామిక’ (పూర్తయింది), హిందీలో ‘సర్దార్ అండ్ గ్రాండ్ సన్’. అనుపమా పరమేశ్వరన్: నిఖిల్తో ‘18 పేజెస్’ మెహరీన్: ‘ఎఫ్ 3’. నివేదా పేతురాజ్: సాయిధరమ్–దేవా కట్టా సినిమా. ఈషా రెబ్బా: ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’, తమిళ సినిమా ‘ఆయిరమ్ జన్మంగళ్’. శ్రద్ధా శ్రీనాథ్: సిద్ధు జొన్నలగడ్డతో ‘నరుడి బ్రతుకు నటన’, విశాల్తో ‘చక్ర’ (పూర్తయింది) ఐశ్వర్యా రాజేష్: నానీతో ‘టక్ జగదీష్’. -
వెల్కమ్ 2021
కొత్త ఏడాదిని ప్రేమతో స్వాగతించారు స్టార్స్. 2020కి గుడ్బై చెబుతూ, 2021కి స్వాగతం పలికారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు కొందరు. లేడీ సూపర్ స్టార్ నయనతార, తన బాయ్ఫ్రెండ్ విఘ్నేష్ శివన్తో దిగిన ఫోటో షేర్ చేశారు. కాజల్ అగర్వాల్, గౌతమ్ దంపతులు, నిఖిల్, పల్లవి వర్మ దంపతులు మంచు కొండల్లో న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నారు. సమంత–నాగచైతన్య గోవాలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. -
కొత్త ఏడాది, కొత్త పోస్టర్స్
కొత్త ఏడాదిని సరికొత్తగా స్వాగతించాలి. అందుకే నూతన సంవత్సరంలో సినీ అభిమానులకు, ప్రేక్షకులకు కొత్త లుక్స్తో, కొత్త పోస్టర్స్తో స్వాగతం చెప్పాయి కొన్ని సినిమాలు.. ఆ వివరాలేంటో చూసేద్దాం. ♦ ప్రభాస్ తాజా చిత్రం ‘రాధే శ్యామ్’ నుంచి ప్రభాస్ స్టిల్ విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో పూజా హెగ్డే కథానాయిక. సంక్రాంతికి టీజర్ ఉంటుందని సమాచారం ♦ ‘ఎఫ్ 2’తో సందడి చేశారు కో బ్రదర్స్ వెంకటేశ్, వరుణ్ తేజ్. ఇప్పుడు డబుల్ ఫన్తో ‘ఎఫ్ 3’తో తిరిగొస్తున్నారు ♦ పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’లో పవన్, శృతీ హాసన్ బైక్పై వెళుతున్న పోస్టర్ను రిలీజ్ చేశారు. సంక్రాంతికి టీజర్ రిలీజ్ చేస్తారు ♦ రమేశ్ వర్మ దర్శకత్వంలో రవితేజ చేస్తున్న చిత్రం ‘ఖిలాడీ’. ఇందులో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నారు ♦ ‘సీటీమార్’ కోసం కబడ్డీ కోచ్గా మారారు గోపీచంద్. ఫుల్ జోష్తో సీటీ కొడుతున్న స్టిల్ రిలీజ్ చేశారు ♦ శర్వానంద్ రైతు పాత్రలో నటిస్తున్న సినిమా ‘శ్రీకారం’. ఇందులో ఆయన లుక్ను విడుదల చేశారు. ♦ సంక్రాంతికి సందడి చేయడానికి ‘అల్లుడు అదుర్స్’తో వస్తున్నారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఈ చిత్రం నుంచి కొత్త పోస్టర్ను రిలీజ్ చేశారు ♦ నాగశౌర్య హీరోగా తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా ‘లక్ష్య’, రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘వరుడు కావలెను’ పోస్టర్స్ విడుదలయ్యాయి. ‘లక్ష్య’ లో అథ్లెట్లా రఫ్గా కనిపిస్తున్నారు నాగశౌర్య ♦ సుమంత్ ‘కపటధారి, సాయితేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ‘ఉప్పెన’, అలీ, నరేష్ ముఖ్య పాత్రల్లో చేస్తున్న ‘అందరూ బావుండాలి అందులో మనముండాలి’, వశిష్ట సింహ, హెబ్బా పటేల్ ‘ఓదెల రైల్వేస్టేషన్’, సప్తగిరి హీరోగా చేస్తున్న ‘ఎయిట్’, ‘కలర్ ఫోటో’ ఫేమ్ సుహాస్ ‘రైటర్ పద్మభూషణ్’, ‘ఆకాశవాణి’, ‘మోహన్కృష్ణ గ్యాంగ్లీడర్’ చిత్రాలు న్యూ ఇయర్కి న్యూ లుక్స్తో Ðð ల్కమ్ అన్నాయి. -
మాస్టార్లు వాళ్లే!
తప్పొప్పులు తెలియాలంటే ముందు తప్పేదో ఒప్పేదో తెలియాలి. వెళ్లే దారి సరైందో లేదో తెలియాలంటే గమ్యం మీద అవగాహన ఉండాలి. ఒక సబ్టెక్ట్ను ఇష్టంగా చదువుతున్నామంటే అందులో ఆసక్తి కలిగించే విషయాలుండాలి. లేదా ఆసక్తికరంగా బోధించే గురువు ఉండాలి. మనం సక్రమంగా ఉన్నామంటే దాని వెనక కచ్చితంగా ఓ గురువు ఉంటాడు. సమాజానికి ఉపయోగపడుతున్నాం అంటే దాని వెనక ఓ గొప్ప ఉపాధ్యాయుడుంటాడు. నేడు ఉపాధ్యాయుల దినోత్సవం. మనందర్నీ తీర్చిదిద్దిన గురువులందర్నీ గుర్తు చేసుకుందాం. మేం స్టార్స్ కావచ్చు. కానీ మా–స్టార్లు వాళ్లే అని తమ అభిమాన టీచర్స్ గురించి కొందరు స్టార్స్ చెప్పారు. ఆ విశేషాలు. నా గురువు సుహాస్ లిమయే ఇటీవలే మరణించారు. సార్.. మీరు నా అభిమాన గురువు. మీతో గడిపిన ప్రతి క్షణాన్ని ఆస్వాదించాను. నాకు అన్నీ తెలుసు అనుకోకుండా ఎప్పుడూ విద్యార్థిలాంటి ఉత్సాహం, నేర్చుకున్న ప్రతీది నేర్పించాలి అనే మీ ఆలోచనా నాకు ఎంతో నచ్చేవి. అందుకే అంత గొప్ప మాస్టారు మీరు. మీతో గడిపిన నాలుగేళ్లు నా మదిలో ఎప్పటికీ మధుర జ్ఞాపకంగా నిలిచిపోతాయి. మీరు నాకు మరాఠీ మాత్రమే కాదు. దానికి మించి ఎన్నో విషయాలను బోధించారు. – ఆమిర్ ఖాన్ నేను ఈరోజు ఇలా ఉన్నానంటే ముఖ్య కారణం మా టీచర్సే. స్కూల్లో నా ఫేవరెట్ సబ్జెక్ట్ ఇంగ్లిష్. దానికి కారణం మా ఇంగ్లిష్ టీచరే. నన్ను చాలా సపోర్ట్ చేశారామె. ఆమె ప్రోత్సాహంతోనే ఇంగ్లిష్లో అనర్గళంగా మాట్లాడం అలవాటయింది. అలాగే పబ్లిక్లోనూ చురుకుగా మాట్లాడగలిగే టెక్నిక్స్ చాలా నేర్పారామె. మా స్కూల్లో (భారతీ పబ్లిక్ స్కూల్) టీచర్ నుంచి స్కూల్ ప్రిన్సిపాల్గా ఆమెకు ప్రమోషన్ వచ్చిందని తెలిసి చాలా సంతోషించాను. ఆమె ప్రిన్సిపాల్గా ఇన్చార్జ్ తీసుకునే రోజు ఆమెను స్కూల్కి వెళ్లి కలవడం నాకో మంచి జ్ఞాపకం. – తాప్సీ సాధారణ టీచర్లు కేవలం పాఠం వరకూ చెప్పి వెళ్లిపోతారు. కానీ గొప్ప టీచర్లు మనకు అర్థమయిందా లేదా? అని చూస్తారు. ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం నేర్పిస్తారు. మన జీవితంలో టీచర్స్ చాలా కీలకమైన పాత్ర పోషిస్తారు. కానీ వాళ్ల పాత్రకు చాలా తక్కువ అభినందన వస్తుంటుంది. వాళ్ల ప్రభావం మన మీద ఎంత ఉంటుందో ఆ ఉపాధ్యాయులు కూడా ఉహించలేరు. నిస్వార్థంగా మనల్ని తీర్చిదిద్దుతారు. ఆ ఘనత గురించి చెప్పుకోరు. అది వాళ్ల గొప్పతనం. – లావణ్యా త్రిపాఠి -
ఆత్మహత్యలపై టాలీవుడ్ ఉద్యమం
మనిషిలో మానసిక ఒత్తిడి, ఇతరులకు దూరంగా ఉండటం ప్రధానంగా ఆత్మహత్యలకు దారి తీస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య చేసుకోవడంతో ఈ విషయం మరోసారి హాట్ టాపిక్గా మారింది. ఒత్తిడి, ఒంటరితనంతో బాధపడేవారికి సరైన సమయంలో సాయం అందించడం ద్వారా ఆత్మహత్యలను కొంతమేర నివారించవచ్చని నిపుణులు చెప్తున్నారు. ఆత్మహత్య చేసుకోవాలని భావించేవారిని ఆ ఆలోచనల నుంచి బయటకి తీసుకురావడానికి సాయం అందించే హెల్ప్ లైన్ నంబర్లు కూడా అందుబాటులో ఉన్నాయని వారు అంటున్నారు. అయితే దీనిపై చాలా మందికి సరైన అవగాహన లేకపోవడం కూడా ఆత్మహత్యలకు దారితీస్తుంది. ఈ క్రమంలోనే పలువురు టాలీవుడ్ ప్రముఖులు ఈ హెల్ప్లైన్ నంబర్లపై విస్తృత ప్రచారం కల్పించేందుకు ముందుకువచ్చారు. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ట్వీట్ చేయడమే కాకుండా.. మరో ఇద్దరు దీనిని రీ-పోస్ట్ చేయాలని కోరుతున్నారు. ప్రస్తుతం వారి ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇప్పటికే టాలీవుడ్ ప్రముఖులు సాయిధరమ్తేజ్, లావణ్య త్రిపాఠి, వెన్నెల కిషోర్, అడవి శేషు, రకుల్ ప్రీత్ సింగ్, రానా దగ్గుబాటి, ఈషా రెబ్బా, రీతూ వర్మ, నిహారిక కొణిదెల, రాహుల్ రవీంద్రన్, దేవకట్టా.. ఇలా పలువురు ప్రముఖులు ట్విటర్లో ఈ సందేశాన్ని షేర్ చేశారు. Requesting @Samanthaprabhu2 & @ShraddhaSrinath to copy & post, tagging a couple of friends in order to demonstrate that someone is always listening.#Suicide Awareness: For US: 1-800-273-8255 #Suicide Awareness: For India: 09152987821 https://t.co/GLgEVROKX5 — Rana Daggubati (@RanaDaggubati) June 25, 2020 Requesting @IamNiharikaK & @actor_Nikhil to copy & post, tagging a couple of friends in order to demonstrate that someone is always listening.#Suicide Awareness: For US: 1-800-273-8255 #Suicide Awareness: For India: 09152987821 https://t.co/MldOd3ZZgj — Ritu Varma (@riturv) June 25, 2020 -
కరోనాపై సినీ తారల పాట
-
సంక్రాంతి సంబరాలు
తెలుగు, తమిళ, కన్నడ సినీ తారల సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. తమ ఆనందపు జ్ఞాపకాల క్షణాలను ఫొటోల్లో భద్రపరచి అభిమానుల కోసం వాటిని సోషల్ మీడియాలో షేర్ చేశారు. అవే ఇక్కడున్న ఫొటోలు. కుమార్తె సౌందర్య, అల్లుడు విశగన్లతో రజనీకాంత్, లత చిరంజీవితో అల్లు శిరీష్, అల్లు అర్జున్, కల్యాణ్దేవ్, వైష్ణవ్తేజ్, రామ్చరణ్, వరుణ్తేజ్, సాయిధరమ్తేజ్ తదితరులు పిల్లలు అరియానా, వివియానా, అవ్రామ్ భక్త, ఆరాలతో మంచు విష్ణు, వెరోనికా దంపతులు భార్య రాధికా పండిట్తో ‘కేజీయఫ్’ ఫేమ్ యశ్ తండ్రి సురేశ్కుమార్తో కీర్తీసురేశ్ -
టాలీవుడ్ సెలబ్రిటీల భోగి సందడి..
తెలుగు రాష్ట్రాలు సంక్రాంతి శోభను సంతరించుకున్నాయి. మూడు రోజుల పండుగలో తొలి రోజైనా భోగి నాడు.. భోగి మంటలు వేసి, వాకిళ్లను రంగురంగుల ముగ్గులతో అలకరించారు. పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా భోగిని ఘనంగా జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటున్నారు. ప్రతి ఏడాదిలాగే ఈ సారి కూడా మెగా ఫ్యామిలీ మొత్తం ఒకచోట చేరి సంక్రాంతిని జరుపుకుంటున్నారు. ఈ సంబరాల్లో చిరంజీవి, రామ్చరణ్, వరుణ్ తేజ్, సాయిధరమ్తేజ్, కల్యాణ్దేవ్, నిహారిక, సుష్మిత.. ఇతర కుటుంబసభ్యులు పాల్గొన్నారు. నిహారిక దోశ వేస్తున్న ఫొటోను సుష్మిత.. దోశ స్టెప్పు అని పేర్కొన్నారు. మరోవైపు కలెక్షన్ కింగ్ మోహన్బాబు కుటుంబం శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజ్లో భోగి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా భోగి శుభాకాంక్షలు తెలిపిన మంచు లక్ష్మి, విష్ణు, మనోజ్లు పలు ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. ‘ కొత్తగా ప్రారంభించడానికి ఒక శుభ దినం, భోగ భాగ్యాలను అందించే పర్వదినం. మీ కుటుంబం సిరిసంపదలతో సుసంపన్నంగా విరాజిల్లాలని ఆకాంక్షిస్తూ భోగి శుభాకాంక్షలు’ అని లక్ష్మి పేర్కొన్నారు. అలాగే విక్టరీ వెంకటేశ్ కూడా భోగి శుభాకాంక్షలు చెప్పారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ ఈషా రెబ్బా.. తెలుగు ప్రజలకు భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. -
పార్టీ మూడ్
న్యూ ఇయర్కు గ్రాండ్ వెల్కమ్ చెప్పడానికి తారలందరూ తమకు ఇష్టమైన ప్రాంతాలకు వెళ్లేందుకు అంతా సెట్ చేసుకున్నారు. ఫుల్ జోష్తో దిల్ ఖుష్ అయ్యేలా రెగ్యులర్ షూటింగ్కు బ్రేక్ ఇచ్చి పార్టీ మూడ్లోకి వెళ్లిపోయారు. టాలీవుడ్లో ఎక్కువమంది తారలు గోవా తీరంలో సేద తీరడానికి ఇష్టపడుతున్నట్లు తెలిసింది. స్టార్ హీరో మహేశ్బాబు కుటుంబ సమేతంగా ముంబైలో ఉన్నారు. రామ్చరణ్ గోవాలో ల్యాండ్ అయ్యారు. అల్లు అర్జున్ బ్యాంకాంక్లో వాలిపోయారు. తన శ్రీమతి సమంతతో కలిసి రెండు రోజులు ముందుగానే గోవా వెళ్లారు నాగచైతన్య. ఇంకా సాయిధరమ్తేజ్, వరుణ్ తేజ్, లక్ష్మీమంచు కూడా 2020 సెలబ్రేషన్స్కు గోవానే ఎంచుకున్నారని తెలిసింది. ఇక హీరోయిన్ పూజా హెగ్డే ఆ్రస్టియాలో అడుగుపెట్టారు. తన బెస్ట్ ఫ్రెండ్, హీరోయిన్ వాణీకపూర్తో కలిసి లండన్లో మస్తీ చేస్తున్నారు రాశీఖన్నా. ఆకాంక్షాసింగ్ న్యూయార్క్ వీధుల్లో విహరిస్తున్నారు. మేఘా ఆకాష్ స్పెయిన్ తీరంలోని చల్లగాలులను ఆస్వాదిస్తున్నారు. బ్యాగ్ సర్దుకుని శ్రీలంకకు వెళ్లారు ఐశ్వర్యారాజేష్. హిమాచల్ ప్రదేశ్లో ఉన్నారు పాయల్ రాజ్పుత్. ఇక ఏడాదిలో తొలిరోజును షూటింగ్ లొకేషన్లో గడపనున్నారు నిధీ అగర్వాల్. అంతేకాదు.. ఈ ఏడాది రెండు స్వచ్ఛంద సేవా సంస్థలకు తన వంతు సాయం అందించాలనుకుంటున్నారు నిధి. ఆ్రస్టియాలో పరిణీతిచోప్రా, స్విట్జర్లాండ్లో అనుష్కాశర్మలతో పాటు మరికొందరు తమ తమ ఫేవరెట్ లొకేషన్స్కు వెళ్లి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ను జరుపుకోనున్నారు. -
క్రిస్మస్ విషెస్ తెలిపిన టాలీవుడ్ స్టార్స్
సెలబ్రిటీలు ఏది చేసినా సెన్సేషనే.. అలాంటిది పండగ వచ్చిందంటే మన సెలబ్రిటీలు చేసే హంగామా మామూలుగా ఉండదు. పండగ సందర్భంగా పలువురు సినీనటులు ఫొటోలు షేర్ చేస్తూ అభిమానులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘ఈ పండగకు ఇచ్చిపుచ్చుకోవడంలో ఉన్న ప్రేమను, అనుభూతిని ఆస్వాదించండి, నచ్చినవారితో కలిసి పండగను ఎంజాయ్ చేయండి. వీలైనన్ని జ్ఞాపకాలను కూడగట్టుకోండి’ అని టాలీవుడ్ సూపర్స్టార్ మహేశ్బాబు అభిమానులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపాడు. ఇక మెగాస్టార్ చిరంజీవి తన మనవరాళ్లతో కలిసి విషెస్ క్రిస్మస్తోపాటు నూతన సంవత్సర విషెస్ తెలిపాడు. హీరో రామ్చరణ్ కూడా తన తండ్రి చిరుతో కలిసి పండగ వేడుకల్లో పాల్గొన్నాడు. హీరోయిన్ సమంత ప్రత్యుష ఫౌండేషన్ పిల్లలతో కలిసి క్రిస్మస్ వేడుకలు జరుపుకుంది. ‘ఎవరైతే తమ జీవితాల్లో వెలుగు కోసం ఎదురుచూస్తారో వారితో కలిసి క్రిస్మస్ను సెలబ్రేట్ చేసుకున్నప్పుడే ఆ పండగకు పూర్తి అర్థం ఉంటుంద’ని ఆమె పేర్కొంది. మరో నటి కేథరిన్ పిజ్జాతో క్రిస్మస్ను సెలబ్రేట్ చేసుకుంది. సాంటాక్లాజ్లా రెడీ అయిన హీరోయిన్ రెజీనా.. తనకు డిసెంబర్ నెల ఎంతో ప్రత్యేకమని చెప్పుకొచ్చింది. తన పుట్టినరోజు(డిసెంబర్ 13), క్రిస్మస్, రానున్న కొత్తసంవత్సరం కోసం ప్రారంభమయ్యే వేడుకలు అన్నీ ఈ నెలలోనే జరుగుతాయని, అందుకే ఈ నెల తనకెంతో ఇష్టమని పేర్కొంది. అయితే ఈ సంవత్సరం ఎంతో బిజీగా ఉన్నా పండగ జరుపుకోవడం మాననంటోంది. ‘ఈ క్రిస్మస్ మీకు, మీ కుటుంబ సభ్యులకు ఎన్నో సంతోషాలను, ప్రేమను, అదృష్టాలను అందించాలని కోరుకుంటున్నాను’ అని మంచు మనోజ్ విషెస్ తెలిపాడు. నిర్మాత, నటి మంచు లక్ష్మీ అభిమానులకు క్రిస్మస్ పండగ శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబంతో కలిసి ఈ పండగను ఆస్వాదించండన్నారు. ఇక జూ. ఎన్టీఆర్, ఎనర్జిటిక్ స్టార్ రామ్, కాజల్ అగర్వాల్ పలువురు నటీనటులు క్రిస్మస్ పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. -
తారోద్వేగం
కొన్ని రోజుల క్రితం దిశకు జరిగిన అన్యాయం చూసి మన తారలు ఆగ్రహానికి గురయ్యారు. తమ భావావేశాన్ని ట్వీటర్లో ట్వీట్స్ ద్వారా తెలిపారు. నిందితులపై శుక్రవారం జరిగిన ‘ఎన్కౌంటర్’ చూసి న్యాయం జరిగినట్టు హర్షించారు. వారి స్పందన ఇలా ఉంది. దిశ సంఘటనలో నిందితులు పోలీసుల కాల్పుల్లో మతి చెందారన్న వార్తను ఉదయం చూడగానే నిజంగా ఇది సత్వర న్యాయం, సహజ న్యాయం అని నేను భావించాను. కామంతో కళ్లు మూసుకుపోయి ఇలాంటి నేరాలు, ఘోరాలు చేసే ఎవరికైనా ఇది కనువిప్పు కలిగించాల్సిందే. – చిరంజీవి ఈ వార్తతోనే నిద్రలేచాను. న్యాయం జరిగింది. – నాగార్జున ఆ భగవంతుడే పోలీసుల రూపంలో ఈ రోజు నిందితులకు సరైన శిక్ష విధించడం జరిగింది. మరోసారి ఎవ్వరూ కూడా ఇంటి దారుణాలకు పాల్పడకుండా, ఇలాంటి ఆలోచన మొలకెత్తనీయకుండా వారిని ఎన్కౌంటర్ చేయడం జరిగింది. అందరికీ కూడా ఇదొక గుణపాఠం కావాలి. – బాలకృష్ణ దిశకు న్యాయం చేయడం ఇక్కడితో పూర్తి కాలేదు. ఇక్కడితో మొదలవ్వాలి. చిన్నప్పటినుంచే విద్య, సాధికారత, జ్ఞానం అందించడం వల్లే ఇది సాధ్యం అవుతుంది. జైహింద్. – రవితేజ న్యాయం చేకూరింది. దిశ ఆత్మకు శాంతి లభిస్తుంది. – ఎన్టీఆర్ మేం ఏం చేసినా నిన్ను తిరిగి తీసుకురాలేం. కానీ ఇవాళ జరిగింది నీకు, నీ కుటుంబానికి శాంతిని తీసుకొస్తుందని భావిస్తున్నాం. – రామ్చరణ్ న్యాయం చేకూరింది. – అల్లు అర్జున్ ‘ఊరికి ఒక్కడే రౌడీ ఉండాలి. వాడు పోలీసోడు అయ్యుండాలి’ – నాని ఆ బుల్లెట్ దాచుకోవాలనుంది. ఆ తుపాకులకు దండం పెట్టాలని ఉంది. ఆ పోలీసుల కాళ్లు మొక్కాలనుంది. నలుగురు చచ్చారు అనే వార్తలో ఇంత కిక్కు ఉందా? ఈ రోజునే నీ ఆత్మ దేవుడిని చేరింది చెల్లెమ్మా – మంచు మనోజ్ న్యాయం చేకూరింది. హైదరాబాద్ పోలీసులకు హ్యాట్సాఫ్. – గోపీచంద్ నువ్వు బ్యాడ్ అయితే.. సిచ్యుయేషన్స్ కూడా వెరీ బ్యాడ్. హైదరాబాద్ పోలీసులు నిజమైన హీరోలు. – రామ్ ఇలాంటి దారుణాలకు పాల్పడాలన్న ఆలోచన వచ్చిన వారికి ఇదో హెచ్చరికలా ఉంటుంది అనుకుంటున్నాను. దిశ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను. – నితిన్ చెల్లెమ్మా, నిన్ను కాపాడుకోలేకపోయాం. కానీ న్యాయం జరిగేలా చూశాం. – సాయిధరమ్ తేజ్ మన పని అప్పుడే పూర్తవ్వలేదు. మన చెల్లెళ్లందరికీ సురక్షితమైన సమాజాన్ని అందించడం మనందరి బాధ్యత. – కార్తికేయ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్కి చేతులెత్తి మొక్కుతున్నాను. యూ ఆర్ ది రియల్ హీరోస్. నేను ఒక్క విషయం నమ్ముతాను.. మనకు కష్టం వచ్చినా, కన్నీళ్లు వచ్చినా పోలీసోడే వస్తాడు. నువ్వే దిక్కు రక్షించాలని దేవుడికి మొక్కినా ఆ దేవుడు కూడా పంపించేది పోలీసోడినే. – పూరి జగన్నాథ్ పొల్యూషన్ నుంచి తప్పించుకోవచ్చు కానీ పోలీస్ నుంచి తప్పించుకోలేరు. – బోయపాటి శ్రీను ఐ లవ్ తెలంగాణ. భయమే నిజమైన పరిష్కారం. కొన్నిసార్లు అదొక్కటే పరిష్కారం. – సమంత హైదరాబాద్ పోలీసులకు పెద్ద సెల్యూట్. – రాశీ ఖన్నా ఇలాంటి పాపం చేసి ఎంతదూరం పరిగెడదాం అనుకున్నారు? థ్యాంక్యూ తెలంగాణ పోలీస్. – రకుల్ప్రీత్ సింగ్ నీ ఆత్మ శాంతించి ఉంటుందని అనుకుంటున్నాను. – రష్మికా మందన్నా తెలంగాణ పోలీసులు శభాష్.. వారికి శుభాకాంక్షలు – రిషికపూర్ తెలంగాణ సీఎమ్ఓ, సైబరాబాద్ పోలీస్, వీసీ సజ్జనార్ స్వీట్ అండ్ స్ట్రాంగ్గా నిజమైన న్యాయం చేశారు. వ్యవస్థ వెనకాల దాక్కొని ఉన్న ఇలాంటి రాక్షసులకు ఇది ఓ సందేశం. ఇలాంటి రాక్షసులు అందరూ ఇప్పుడు భయంతో వణికిపోతుంటారు – వివేక్ ఒబెరాయ్ తెలంగాణ పోలీసులకు జయహో – అనుపమ్ ఖేర్ -
ఎన్కౌంటర్పై టాలీవుడ్ స్పందన
దిశ హత్యోందంతం అందరి మనసులను కలిచివేసింది. దిశపై అత్యాచారానికి ఒడిగట్టి అతి కిరాతకంగా హతమార్చిన నిందితులకు ప్రాణాలతో బతికే అర్హత లేదంటూ సమస్త ప్రజానీకం గొంతెత్తి నినదించింది. ఈ క్రమంలో పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున నలుగురు నిందితులను ఎన్కౌంటర్ చేయడంపై టాలీవుడ్ నటీనటులు హర్షం వ్యక్తం చేశారు. దిశకు న్యాయం చేకూరిందని కింగ్ నాగార్జున, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అల్లు శిరీష్, అఖిల్, రవితేజ, నిఖిల్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఘటనతో నేడు దిశ ఆత్మ శాంతిస్తుందని హీరో ఎన్టీఆర్ అభిప్రాయపడ్డాడు. ‘ఊరికి ఒక్కడే రౌడీ ఉండాలి.. వాడు పోలీసు అయ్యుండాలి’ అంటూ నాని ఎన్కౌంటర్ను స్వాగతించాడు. ఈ ఘటనపై టాలీవుడ్ బ్యూటీ సమంత స్పందిస్తూ కొన్నింటికి భయపెట్టడమే సరైన సమాధానం అని చెప్పుకొచ్చింది. దానివల్లైనా నేరాలు జరగకుండా ఉండేందుకు అవకాశముందని అభిప్రాయపడింది. ఇందువల్లే తెలంగాణ అంటే తనకెంతో ఇష్టమని తెలిపింది. అత్యాచారం వంటి ఘోర నేరాలు చేసిన నిందితులు తప్పించుకుని పారిపోలేరంటూ రకుల్ ప్రీత్సింగ్ స్పందించింది. ఈ సందర్భంగా నిందితులను ఎన్కౌంటర్ చేసిన పోలీసులకు కృతజ్ఞతలు తెలిపింది. నిందితులను తగిన శిక్ష పడినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నానంటూ ప్రముఖ యాంకర్ అనసూయ పేర్కొంది. దిశకు సరైన న్యాయం జరిగిందని హీరోయిన్లు లావణ్య త్రిపాఠి, సమంత అక్కినేని, విశాల్ తదితరులు స్పందించారు. చదవండి: దిశ నిందితుల ఎన్కౌంటర్ దిశను చంపిన దగ్గరే ఎన్కౌంటర్.. మా బిడ్డకు న్యాయం జరిగింది: దిశ తల్లిదండ్రులు -
ఘనంగా జర్నలిస్ట్ ప్రభు కూతురి వివాహం
-
తారాగ్రహం
ప్రియాంకారెడ్డి దారుణ మృతి దేశమంతా ప్రతిస్పందనలను వినిపిస్తూనే ఉంది. నిందితులను అప్పజెప్తే ప్రజాకోర్టులో శిక్షిస్తామని ప్రజలు పోలీస్ స్టేషన్ను ముట్టడిస్తున్నారు. సమాజంలోని అన్ని వర్గాల నుంచే కాకుండా టాలీవుడ్, బాలీవుడ్ నుంచి కూడా తారలు తమ ఆగ్రహాన్ని తెలియజేస్తున్నారు. ఇక్కడ కొందరి ట్వీట్స్ ఇస్తున్నాం. ప్రియాంక ఘటన నన్ను బాధించింది. ఆమె ఎంత బాధను అనుభవించిందో అనే ఆలోచనే కష్టంగా ఉంది. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే పోలీసులను సంప్రదించా ల్సిందిగా నా అక్కాచెల్లెళ్లను వేడుకుంటున్నాను. – నటుడు మంచు మనోజ్ ఇలాంటి ఆలోచన వస్తే భయం వేసేలా ఒక్క తీర్పు రావాలి. అప్పుడే నేరాలు చేయాలనుకునేవారిలో మార్పు వస్తుంది. – నటుడు రామ్ ప్రియాంక హత్యను ఖండించడానికి దారుణం, కిరాతకం వంటి మాటలు సరిపోవు. ఆడపిల్లలను కాపాడుకోలేకపోతే మనకు భవిష్యత్తు ఉండదు. – నటుడు ‘అల్లరి’ నరేశ్ ప్రియాంక ఘటన షాక్కు గురి చేసింది. చాలా కోపం వచ్చింది. ఈ ఘటన జరిగి ఉండాల్సింది కాదు. – నటుడు సుశాంత్ ప్రియాంక ఘటన విని చాలా కలత చెందాను. మహిళలపై అఘాయిత్యాలకు ఫుల్స్టాప్ పడాలి. మన మహిళలు సురక్షితంగా ఉండే వాతావరణం రావాలి – నటుడు అఖిల్ ఆపద సమయంలో పోలీసుల సహాయం తీసుకోవాలి. లైవ్ లొకేషన్ యాప్స్, అత్యవసర ఫోన్ కాల్ ఆప్షన్స్ తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. ప్రియాంక ఆత్మకు శాంతి కలగాలి. – నటుడు సుధీర్బాబు దోషులకు మరణశిక్ష విధించినప్పుడే ఇలాంటి భయంకర ఘటనలు ఆగుతాయి. నీకు (ప్రియాంక) ఇలా జరిగినందుకు సమాజం సిగ్గుపడాలి. – నటుడు నిఖిల్ ప్రియాంక హత్య వినగానే బాధ, కోపం, నిస్సహాయత వంటి భావోద్వేగాలు కలిగాయి. మనందరి ఆగ్రహం ఆమెకు న్యాయం జరగడానికి తోడ్పడాలి. మహిళలు కూడా భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలి. – నటుడు అల్లు శిరీష్ ప్రియాంకకు జరిగినదానికి ఏ విధంగా న్యాయం చేయగలం? మహిళలకు ఈ ప్రపంచంలో రక్షణ ఎప్పుడు లభిస్తుందో? – నభా నటేష్ ప్రియాంక ఘటనలో దోషులకు జీవిత ఖైదు సరిపోదు. రేపిస్టులను కఠినంగా శిక్షించినప్పుడు ఇలాంటివి ఆగుతాయి. లేకపోతే ఆగవేమో అనిపిస్తోంది. మహిళా చట్టాలు మరింత బలంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – నటి, నిర్మాత చార్మీ అసలు మహిళలకు రక్షణ ఉందా? అనిపిస్తోంది. మీరు (స్త్రీ) అపాయంలో ఉన్నప్పుడు సహాయం అడగటానికి వెనకాడకండి. అలాగే మరొకరు ఆపదలో ఉన్నారన్నప్పుడు సహాయం చేయకుండా ఉండకండి. – నటి రష్మికా మందన్నా ప్రియాంక ఘటన బాధించింది. ఇది మనకు తెలిసిన ఘటన. ఇలాంటి తెలియని çఘటనలు ఇంకా ఎన్ని ఉన్నాయో? దోషులకు శిక్ష పడాలి. – నిధీ అగర్వాల్ చట్టాలు మారే లోపు ఇంకెంతమంది అమాయక మహిళలు చనిపోవాలి? దేశంలోని మహిళలకు సరైన న్యాయం ఎప్పుడు? స్త్రీలకు సురక్షిత వాతావరణం ఎప్పుడొస్తుంది? ప్రియాంక ఘటనలో మానవత్వం చనిపోయిందనిపిస్తోంది. – నటుడు అనిల్ కపూర్ హైదరాబాద్లో ప్రియాంక, తమిళనాడులో రోజా, రాంచీలో లా స్టూడెంట్... ఇలా మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉండటం విచారకరం. సమాజంలో నైతిక విలువలు తగ్గిపోతున్నాయి. నిర్భయ చట్టం వచ్చి ఏడేళ్లు పూర్తవుతున్నప్పటికీ ఇలాంటి భయంకర ఘటనలు ఆగడం లేదు. మన చట్టాలు ఇంకా కఠినంగా ఉండాలి. – నటుడు అక్షయ్ కుమార్ ప్రియాంక ఘటన నన్ను బాధిస్తోంది. మానవ రూపంలో ఉన్న సైతాన్లు వాళ్లు. నిర్భయ, ప్రియాంక వంటి అమాయకులు మన మధ్యలోనే ఉన్న కొందరు సైతాన్ల వల్ల చనిపోతున్నారు. మరో అమాయకురాలు ఇలాంటి ఘటన బారిన పడకుండా మనం అందరం చేతులు కలపాలి. ఇలాంటి సంఘటనలను ఆపాలి. – నటుడు సల్మాన్ ఖాన్ మహిళలపై ఆత్యాచారాలు జరగకుండా దేశం అంతా సంఘటితం కావాల్సిన తరుణం ఇది. అంత సులభంగా మహిళలపై అఘాయిత్యాలకు ఎలా పాల్పడుతున్నారు? ఆ రాక్షసులు చట్టానికి ఎందుకు భయపడటం లేదు? ప్రియాంకకు, ఆమె కుటుంబానికి న్యాయం జరిగేలా మనం పోరాడాలి. – నటుడు వరుణ్ ధావన్ -
రీమేకుకింగ్
మనుషులంతా ఒక్కటే అయినట్టు ప్రేక్షకులంతా కూడా ఒక్కటే. తమిళంలో అయినా తెలుగులో అయినా నవ్వినా ఏడ్చినా కన్నీళ్లే వస్తాయి. అక్కడ అయినా ఇక్కడ అయినా పొయ్యి వెలిగించే వంట చెయ్యాలి. అక్కడ ఉడికిన కథ ఇక్కడా ఉడుకుతుంది. అందుకే ఇప్పుడు రీమేక్ల పాకం పండుతోంది. త్వరలో వడ్డిస్తారు. మెస్ టికెట్ కొనుక్కోండి. రీమేకుక్స్ను కలవండి. రైతు కుటుంబం ‘చంటి, చినరాయుడు, సుందరకాండ, అబ్బాయిగారు, ఇంట్లో ఇల్లాలు.. వంటింట్లో ప్రియురాలు, సూర్య వంశం, రాజా’... తెలుగులో హిట్గా నిలిచిన ఈ చిత్రాలు తమిళ చిత్రాలకు రీమేక్. మన తెలుగులో ఎక్కువగా రీమేక్ చిత్రాల్లో నటించిన హీరో ఎవరంటే వెంకటేశ్ ముందు వరుసలో ఉంటారు. తాజాగా వెంకీ మరో తమిళ చిత్రం ‘అసురన్’ తెలుగు రీమేక్లో నటించనున్నారు. ధనుష్ హీరోగా వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఇది. ఊరికి కాస్త దూరంగా కుటుంబంతో కలిసి హాయిగా ఉంటున్న ఓ రైతు భూమిని ఆ గ్రామంలోని ఓ పెద్ద మనిషి సొంతం చేసుకోవాలనుకుంటాడు. ఆ పెద్దమనిషికి రైతు కుటుంబం ఎలా బుద్ధి చెప్పిందన్నదే ‘అసురన్’ కథ. ముగ్గురమ్మాయిల కథ అమితాబ్ బచ్చన్, తాప్సీ నటించిన హిందీ చిత్రం ‘పింక్’ సూపర్హిట్ సాధించింది. అనిరు«ద్ రాయ్ దర్శకుడు. ఈ చిత్రాన్ని అజిత్తో ‘నేర్కొండ పార్వై’గా తమిళంలో రీమేక్ చేశారు బోనీ కపూర్. ఇప్పుడు ‘పింక్’ని ‘దిల్’ రాజుతో కలిసి తెలుగులో రీమేక్ చేయనున్నారు బోనీ కపూరే. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించనున్నారు. అమితాబ్ పాత్రలో పవన్కల్యాణ్ నటించనున్నారని టాక్. ముగ్గురు అమ్మాయిలు ఓ ‘రాక్ కాన్సెర్ట్’కు వెళతారు. అక్కడ అబ్బాయిలతో కలిసి మద్యం సేవిస్తారు. ఆ తర్వాత ఈ ముగ్గురు అమ్మాయిలకు బెదిరింపులు మొదలవుతాయి. అకస్మాత్తుగా ఈ ముగ్గురిలో ఒకర్ని హత్యాయత్నం నేరారోపణపై పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఈ విషయాలన్నింటినీ గమనిస్తుంటాడు ఓ రిటైర్డ్ లాయర్. ఈ ముగ్గురు అమ్మాయిలకు ఈ అతను ఎలా సహాయం చేశాడు? ఈ అమ్మాయిలపై పోలీసులకు ఫిర్యాదు చేసిందెవరు? అనే అంశాల సమాహారమే ‘పింక్’ కథ. పోలీస్ వర్సెస్ గ్యాంగ్స్టర్ విజయ్ సేతుపతి, మాధవన్ ప్రధాన పాత్రధారులుగా తమిళంలో మంచి విజయం సాధించిన చిత్రం ‘విక్రమ్ వేదా’. దర్శక ద్వయం పుష్కర్–గాయత్రి తెరకెక్కించారు. సుధీర్ వర్మ దర్శకత్వంలో ఈ చిత్రం తెలుగు రీమేక్ తెరకెక్కనుందని సమాచారం. ఒక హీరోగా రవితేజ నటిస్తారు. మరో హీరో ఫైనలైజ్ కావాల్సి ఉందని తెలిసింది. ఇక ‘విక్రమ్ వేదా’ కథ విషయానికి వస్తే... ఓ ఎన్కౌంటర్ స్పెషలిస్టుకు, గ్యాంగ్స్టర్కు మధ్య జరిగే మైండ్ గేమే ఈ చిత్రం. పోలీసులు ప్లాన్ చేసిన ఓ ఎన్కౌంటర్ వీరిద్దరి జీవితాలను ఎలా ప్రభావితం చేసిందన్నదే కథ. సొంత పరిశోధన క్రైమ్ డిపార్ట్మెంట్కు మారాలనుకున్న ఓ యువ ట్రాఫిక్ పోలీసాఫీసర్ ఓ క్రైమ్ కేసుపై ఆసక్తి పెంచుకుని పై అధికారులకు తెలియకుండా పరిశోధన మొదలు పెడతాడు. చివరికి ఈ కేసు గురించి అతనికి తెలిసిన నిజాలు ఏంటి? ఈ యువ పోలీసాఫీసర్కు ఓ రిటైర్డ్ పోలీసాఫీసర్, ఓ పాత్రికేయుడు ఎలా సహాయం చేశారు? అన్నదే కన్నడ మూవీ ‘కవలుదారి’(2019) కథాంశం. ఇందులో అనంతనాగ్ హీరోగా నటించారు. ఈ సినిమా తెలుగు రీమేక్లో సుమంత్ హీరోగా నటిస్తారు. ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వం వహిస్తారు. ఛాలెంజ్ దాదాపు రెండేళ్ల క్రితం విడుదలైన కన్నడ చిత్రం ‘కాలేజ్ కుమార్’కు మంచి ప్రేక్షకాదరణ దక్కింది. తండ్రీ కొడుకుల చాలెంజే ఈ సినిమా కథ. ప్యూన్గా పని చేసే ఓ తండ్రి తన కొడుకుని పెద్ద స్థాయి ఉద్యోగిగా చూడాలనుకుంటాడు. కానీ కొడుకేమో పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తున్నట్లు దొంగ ఆధారాలు చూపిస్తుంటాడు. ఓ రోజు తండ్రికి నిజం తెలుస్తుంది. ఆ సమయంలో ఒకరికొకరు సవాల్ విసురుకుంటారు. ఈ సినిమా ‘కాలేజ్ కుమార్’ టైటిల్తోనే తెలుగులో రీమేక్ అవుతోంది. మాతృకకు దర్శకత్వం వహించిన హరి సంతోషే తెలుగుకూ దర్శకత్వం వహిస్తున్నారు. రాహుల్ విజయ్ హీరోగా నటిస్తున్నారు. తండ్రి పాత్రను ప్రభు చేస్తారని తెలిసింది. ముక్కుసూటితనం తెలుగులో కృష్ణవంశీ డైరెక్షన్ స్టైల్కు ప్రత్యేక అభిమానులు ఉన్నారు. గతంలో ఆయన తెరకెకెక్కించిన ‘నిన్నేపెళ్లాడతా, సిందూరం, అంతఃపురం, ఖడ్గం, చందమామ’ చిత్రాలు సాధించిన విజయాలు అలాంటివి. తాజాగా కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ‘రంగమార్తాండ’. మరాఠీ చిత్రం ‘నటసామ్రాట్’కి రీమేక్ ఇది. ఈ చిత్రంలో రమ్యకృష్ణ కీలక పాత్ర పోషించనున్నారు. ముక్కుసూటి మనస్తత్వం ఉన్న ఓ సీనియర్ థియేటర్ ఆర్టిస్టు జీవితంలోని ఎత్తుపల్లాల సంఘటనల సమాహారమే ‘నట సామ్రాట్’. మరాఠీ నటసామ్రాట్గా నానా పటేకర్ అభినయించారు. తెలుగు రీమేక్లో రమ్యకృష్ణ, ప్రకాశ్ రాజ్ నటించనున్నారు. ప్రతీకారం ‘కేరాఫ్ కంచెరపాలెం’ వంటి భిన్నమైన ప్రయత్నంతో దర్శకుడిగా మంచి మార్కులు వేయించుకున్నారు వెంకటేష్ మహా. ఇప్పుడు జాతీయ అవార్డు సాధించిన మలయాళ హిట్ ‘మహేషింటే ప్రతీకారం’ చిత్రాన్ని వెంకటేష్ మహా తెలుగులో రీమేక్ చేస్తున్నారని తెలిసింది. మలయాళంలో ఫాహద్ ఫాజల్ పోషించిన పాత్రను తెలుగులో సత్యదేవ్ చేస్తున్నారు. ఊరందరి ముందు జరిగే ఓ కోట్లాటలో ఓ ఫొటోగ్రాఫర్ ఓడిపోతాడు. తనకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు ఆ ఫొటోగ్రాఫర్. తాను ఓడిపోయిన వ్యక్తి చేతిలో తిరిగి గెలిచేంత వరకు చెప్పులు వేసుకోనని శపథం చేస్తాడు. ఆ ఫొటోగ్రాఫర్ శపథంతో పాటు, ఓ అమ్మాయి మనసును కూడా ఎలా గెల్చుకున్నాడు అన్న అంశాల నేపథ్యంలో ఈ సినిమా కథ ఉంటుంది. – శివాంజనేయులు ముసిమి ఆన్ ద వే రాజకీయ వారసత్వ నేపథ్యంలో సాగే మలయాళ హిట్ ‘లూసిఫర్’ సినిమా తెలుగు రీమేక్స్ హక్కులను దక్కించుకున్నారు రామ్చరణ్. ‘లూసిఫర్’లో మోహన్లాల్ చేసిన పాత్రలో చిరంజీవి నటిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇక బాలీవుడ్లో అజయ్దేవగన్ నటించిన ‘దే దే ప్యార్దే’ తెలుగు హక్కులను డి. సురేష్బాబు దక్కించుకున్నారు. ఈ సినిమా తెలుగు రీమేక్లో వెంకటేశ్ నటిస్తారట. పెళ్లైన తర్వాత భార్య ఉండగానే ఓ యువతి ప్రేమ కోసం తాపత్రయపడే మధ్య వయస్కుడి కథే ఈ చిత్రం. బాలీవుడ్ యువనటుడు ఆయుష్మాన్ ఖురానా నటించిన హిందీ చిత్రం ‘బదాయి హో’ బాక్సాఫీస్ వద్ద బంపర్ కలెక్షన్స్ను రాబట్టింది. తెలుగులో ఈ చిత్రాన్ని బోనీ కపూర్, ‘దిల్’ రాజు నిర్మించనున్నారు. ఓ ఉమ్మడి కుటుంబంలో పెళ్లి కావాల్సిన కొడుకు ఉన్న ఓ తల్లి మరో బిడ్డకు జన్మనివ్వబోతోందని తెలుస్తుంది. అప్పుడు ఆ కొడుకుని పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయి ఏ షరతులు పెట్టింది... అన్నదే ‘బదాయి హో’ కథాంశం. ఇంకా... తమిళంలో విజయ్ నటించిన ‘తేరీ’, మలయాళ హిట్ ‘ఇష్క్’ చిత్రాలు తెలుగులో రీమేక్ కానున్నాయని సమాచారం. చిరంజీవి రిలీజ్కి సిద్ధం తమిళ హిట్ ‘96’ చిత్రాన్ని ‘దిల్’ రాజు తెలుగులో రీమేక్ చేశారు. శర్వానంద్, సమంత నటించిన ఈ సినిమా రిలీజ్కు ముస్తాబవుతోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేయనున్నారు. మరో తమిళ చిత్రం ‘కణితన్’ తెలుగులో ‘అర్జున్ సురవరం’గా ప్రేక్షకుల ముందుకు రానుంది. నిఖిల్ నటించారు. ఈ నెల 29న ఈ చిత్రం విడుదల కానుంది. హిందీలో కంగనా రనౌత్ నటించిన ‘క్వీన్’ చిత్రం తెలుగు రీమేక్ ‘దటీజ్ మహాలక్ష్మీ’లో తమన్నా నటించారు. ఈ సినిమా రిలీజ్కి రెడీ అయింది. -
కాకర పువ్వొత్తుల రంగుపూలు
కాకర పువ్వొత్తులు రంగుపూలు పూశాయి. చిచ్చుబుడ్లు మెరుపులు విరజిమ్మాయి. లక్ష్మీ పూజ ఘనంగా జరిగింది. లడ్డూలు ఇష్టంగా లాగించారు. దీపావళిని అందరూ ఘనంగా జరుపుకొని ఉంటారు. సినిమా తారలు కూడా ఘనంగా జరుపుకున్నారు. పూజ విశేషాలను, పండగ సంబరాలను ఎవరెవరు ఎలా జరుపుకున్నారో తెలుసుకుందాం. దీపావళి ముందు రోజు రాత్రి మోహన్బాబువాళ్ల ఇంట్లో దీపావళి సంబరాలు జరిగాయని తెలిసింది. ఈ వేడుకలకు పలువురు సినీ ప్రముఖులను మంచు కుటుంబం ఆహ్వానించింది. కృష్ణంరాజు, చిరంజీవి, ప్రభాస్, రచయిత సత్యానంద్, దర్శకుడు రాఘవేంద్రరావు, రచయితలు బీవీఎస్ఎన్ రవి, గోపీ మోహన్, హీరో రాజ్ తరుణ్.. ఇలా పలువురు తారలు మంచు ఇంటి విందుకి హాజరయ్యారు. ఆ వేడుక విశేషాలను పక్కన ఫొటోల్లో గమనించవచ్చు. విష్ణు చిన్న కుమార్తె ఐరా విద్యా మంచుని చిరంజీవి ఆప్యాయంగా ఎత్తుకున్న ఫొటోతో పాటు ఈ విందుకి సంబంధించిన పలు ఫొటోలు బయటికొచ్చాయి. కృష్ణంరాజు, రాఘవేంద్రరావు, సత్యానంద్, చిరంజీవి, మోహన్బాబు ఇక కొత్తగా రీమోడలింగ్ చేయించిన ఇంట్లో దీపావళిని జరుపుకున్నారు చిరంజీవి కుటుంబ సభ్యులు. చిరంజీవి, నాగబాబు, పవన్కల్యాణ్.. ఇలా మొత్తం కుటుంబసభ్యులు పండగ చేసుకున్నారు. దీపావళిని అక్కినేని ఫ్యామిలీ కూడా గ్రాండ్గానే చేసుకుంది. ఈ సందర్భంగా దిగిన ఫ్యామిలీ ఫొటోను సమంత షేర్ చేశారు. పెదనాన్న కృష్ణంరాజుతో కలసి దీపావళిని ఎంజాయ్ చేశారు ప్రభాస్. అలాగే అల్లు అర్జున్ ఫ్యామిలీ ఫొటోను పక్కన చూడవచ్చు. ఒక్కసారి బాలీవుడ్ సైడ్ వెళ్తే బోనీకపూర్ ఫ్యామిలీ మొత్తం దీపావళి సాయంత్రాన్ని ఎంజాయ్ చేశారు. దీపావళి ఈవెంట్ను అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ నిర్వహించింది. ఆ వేడుకకు పలువురు తారలు హాజరయ్యారు. ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ధర్మా ప్రొడక్షన్స్ ఆఫీస్లో ఫెస్టివల్ను ఎంజాయ్ చేశారు స్టార్స్. ఫ్యామిలీతో తాప్సీ దీపావళిని జరుపుకున్నారు. తమన్నా, శ్రుతీహాసన్ సెల్ఫీను షేర్ చేశారు. రంగోలీతో పూజా హెగ్డే ఫొటో పంచుకున్నారు. ఇలా దీపావళి కాంతిని ఫేస్బుక్, ట్వీటర్ల ద్వారా అభిమానులకు కూడా షేర్ చేశారు స్టార్స్. రాజారవీంద్ర, చిరంజీవి, ఐరా విద్య, విరానికా, విష్ణు నాగార్జున, అమల, సమంత, నాగచైతన్య, అఖిల్ విష్ణు,విరానికా, ప్రభాస్, అక్కాచెల్లెళ్లు, స్నేహితులతో వరుణ్తేజ్ శ్యామల, కృష్ణంరాజు, ప్రభాస్ అల్లు అర్జున్, స్నేహ, రామ్చరణ్, ఉపాసన, అర్జున్కపూర్, జాన్వీకపుర్ -
స్పోర్ట్స్ స్టార్స్
‘ఆట గదరా శివా’... అని జీవుడు దేవుడు గురించి అనుకోవచ్చు. హీరో హీరోయిన్లు ఆటాడుకుందాంరా అని డైరెక్టర్తో అంటున్నారు. కొందరు కబడ్డీ ఆడుతున్నారు..కొందరు బాక్సింగ్ గ్లవ్స్ తొడుక్కుంటున్నారు..కొందరు ట్రాక్ మీద బుల్లెట్ సౌండ్ వినగానే పరుగు తీయడానికి రెడీ అవుతున్నారు..మరికొందరు కుస్తీ గోదాలో తొడగొడుతున్నారు. కథలిప్పుడు ఆట ఆటగా ఉన్నాయి. ప్రేక్షకుల చేత కలెక్షన్లనే పాయింట్లు కోరుతున్నాయి. గెలిచిన వారికే సక్సెస్ కప్! టాలీవుడ్ను స్పోర్ట్స్ ఫీవర్ పట్టుకున్నట్లుంది. బాక్సింగ్, రన్నింగ్, హాకీ... ఇలా ఏ ఆటలో మంచి కథ దొరికితే ఆ క్రీడాకారులుగా మారిపోయి మైదానంలోకి అడుగుపెడుతున్నారు నటీనటులు. ఇండస్ట్రీ గ్రౌండ్లో వెండితెర వేదికపై సూపర్ హిట్ కప్పు కొట్టాలనే కసితో ఆటకు రెడీ అయ్యారు. స్టోర్స్ స్టార్స్గా ప్రేక్షకుల నుంచి రికార్డు వసూళ్లు అందుకోవాలనే సంకల్పంతో టాలీవుడ్ బాక్సాఫీస్ టోర్నీకి సిద్ధమవుతున్న సినిమా స్టార్స్ గురించి తెలుసుకుందాం. స్వారీకి సై ‘గురు’ సినిమాలో బాక్సర్గా బాక్సాఫీస్కు ఫటా ఫట్ పంచ్లు ఇచ్చిన వెంకటేశ్ మరో స్పోర్ట్స్ మూవీ కోసం గుర్రపు స్వారీకి సై అన్నారని సమాచారం. ఈ స్పోర్ట్స్ సినిమాకు ‘పెళ్ళిచూపులు’ ఫేమ్ తరుణ్భాస్కర్ దర్శకత్వం వహించనున్నారని తెలిసింది. హైదరాబాద్లోని మలక్పేట రేస్ క్లబ్ నేపథ్యంలో ఈ సినిమా కథాంశం ఉండబోతుందని టాక్. ప్రస్తుతం స్క్రిప్ట్కు ఫినిషింగ్ టచ్ ఇస్తున్నారట తరుణ్ భాస్కర్. కబడ్డీ... కబడ్డీ.. కబడ్డీలాంటి ఆటలకు గోపీచంద్లాంటి కటౌట్ ఉన్న హీరోలు బాగా సూట్ అవుతారు. త్వరలో గోపీచంద్ కబడ్డీ కోర్టులోకి అడుగుపెట్టనున్నారు. కానీ ఆటగాడిగా కాదు.. కోచ్గా. కోర్టులోకి దిగి తన జట్టు సభ్యులకు శిక్షణ ఇచ్చి గెలుపు మంత్రం చెప్పబోతున్నారు. ఆంధ్రా కబడ్డీ జట్టు కోచ్గా గోపీచంద్ నటించనున్న ఈ చిత్రానికి సంపత్ నంది దర్శకుడు. ఈ చిత్రంలో తెలంగాణ జట్టు కబడ్డీ కోచ్గా తమన్నా నటిస్తారు. గెలుపు గోల్ మ్యాచ్లో తన సహచర ఆటగాడు అందించిన పాస్ అందుకుని హాకీ స్టిక్తో బంతిని ఎక్స్ప్రెస్ వేగంతో గోల్ పోస్ట్ వైపు తీసుకెళ్తున్నారు సందీప్ కిషన్. మ్యాచ్ని మలుపు తిప్పే ఓ గోల్ కోసం గోల్పోస్ట్లోకి షాట్ కొట్టారు. ఆ నెక్ట్స్ ఏమైందో ఇప్పుడే చెబితే ఎలా? ఆటను, ఆ షాట్ను వెండితెరపై చూస్తేనే కదా అసలు మజా. ప్రేక్షకులకు ఆ కిక్ను అందించడానికే ‘ఏ1 ఎక్స్ప్రెస్’ సినిమాలో హాకీ ప్లేయర్ అవతారం ఎత్తారు సందీప్ కిషన్. డెన్నిస్ జీవన్ కనుకొలను ఈ చిత్రానికి దర్శకుడు. వచ్చే నెలలో చిత్రీకరణ ప్రారంభం కానుంది. కలల పరుగు 400 మీటర్స్ స్ప్రింటర్గా సరికొత్త ట్రాక్ రికార్డును క్రియేట్ చేయాలనుకునే కలలవైపు పరుగులు పెడుతున్నారు ఆది పినిశెట్టి. పృథ్వీ ఆదిత్య దర్శకత్వంలో ఆది పినిశెట్టి హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘క్లాప్’. ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్న ఆకాంక్షా సింగ్ హాకీ క్రీడాకారిణిగా కనిపిస్తారు. అథ్లెట్ విష్ణు పాత్రలో నటిస్తున్నారు ఆది పినిశెట్టి. ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందిస్తుండటం విశేషం. గురి పెట్టాడు బాణం చేతపట్టి హిట్ మూవీపై గురి పెట్టారు నాగశౌర్య. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా ఓ స్పోర్ట్స్ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ ఆర్చరీ నేపథ్యంలో తెరకెక్కనుందని సమాచారం. ఈ ఏడాదిలోనే ఈ సినిమా షూటింగ్ ఆరంభం కానుంది. ఈలోపు ఆర్చరీ (విలు విద్య)లో ప్రత్యేక్ష శిక్షణ తీసుకునే పనిలో బిజీగా ఉంటారట నాగశౌర్య. డబుల్ ధమాకా బాక్సర్గా... రేసర్గా.. ఒకేసారి రెండు ఆటలు ఆడటానికి రెడీ అవుతున్నారట విజయ్ దేవరకొండ. ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘ఫైటర్’. ఈ చిత్రం కిక్ బాక్సింగ్ నేపథ్యంలో సాగుతుందని, విజయ్ బాక్సర్గా నటిస్తారని టాక్. మరోవైపు ‘హీరో’ చిత్రం కోసం రేసర్గా ట్రాక్లో పడ్డారు విజయ్. బైక్ రేసింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాకు ఆనంద్ అన్నామళై దర్శకుడు. ఈ సంగతి ఇలా ఉంచితే... ‘అర్జున్రెడ్డి’ సినిమాలో ఫుట్బాల్ గోల్ కీపర్గా విజయ్ దేవరకొండ కనిపించిన సంగతి తెలిసిందే. మరికొన్ని... ఆల్రెడీ కొంతమంది హీరోలు క్రీడాకారులుగా సాధన మొదలుపెట్టేశారు. ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ బయోపిక్ తెరకెక్కనుంది. ఇందులో గోపీచంద్ పాత్రలో సుధీర్ బాబు నటించనున్నారు. సుధీర్బాబు ఆల్రెడీ బ్యాడ్మింటన్ ప్లేయర్ అనే విషయం తెలిసిందే. దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఈ బయోపిక్ను తెరకెక్కిస్తారు. ‘గద్దలకొండ గణేష్’ తర్వాత చేయబోతున్న చిత్రంలో వరుణ్ తేజ్ బాక్సర్గా కనిపించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంతో కిరణ్ కొర్రపాటి దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఇక ప్రముఖ మల్లయోధుడు కోడి రామ్మూర్తి బయోపిక్లో రానా నటిస్తారని అప్పట్లో వార్తలు వచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. అలాగే కీర్తీ సురేశ్ ప్రధాన పాత్రధారిగా నగేష్ కుకునూరు దర్శకత్వంలో స్పోర్ట్స్ కామెడీ నేపథ్యంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ‘కౌశల్య కృష్ణమూర్తి: ది క్రికెటర్’ సినిమాలో క్రికెటర్గా కనిపించిన ఐశ్వర్యా రాజేష్ ‘మిస్ మ్యాచ్’ సినిమాలో రెజ్లర్గా నటించారు. ఎన్.వి. నిర్మల్కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఉదయ్ శంకర్ హీరోగా నటించారు. ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. – ముసిమి శివాంజనేయులు -
డ్రగ్స్ కేసులో కానరాని సెలబ్రెటీల పేర్లు
-
క్యాన్సర్ ఎవేర్నెస్ కోసం టాలీవుడ్ స్టార్ క్రికెట్
హైదరాబాద్ తల్వార్స్, టిసిఎ(తెలుగు సినిమా అకాడమీ) టీమ్లు ఇండో ఆఫ్రికా మీడియా కంపెనీ ఆధ్వర్యంలో క్రికెట్ ఆడనున్నారు. ఈ మ్యాచ్లో మన తెలుగుస్టార్స్ సౌత్ ఆఫ్రికాలో ఉన్న తెలుగువాళ్ళతో కలిసి ఆడబోతున్నారు. మొత్తం రెండు మ్యాచ్లు జరుగనున్నాయి. మే17,18న మ్యాచ్లు జరుగుతాయి. 19న సాంస్కృతిక కార్యక్రమం జరుగుతుంది. అక్కడి ప్రజల్లో క్యాన్సర్ ఎవేర్నెస్ కలిగించటం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో వచ్చిన నిధులను ఆఫ్రికాలో ఉన్న చైల్డ్ హుడ్ క్యాన్సర్ అసోసియేషన్కు అందించనున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లెమన్ట్రీ హోటల్లో విలేకరుల సమావేశంలో చైర్మెన్ రమేష్ మాట్లాడుతూ...ఇంత మంచి పని కోసం ముందుకు వచ్చిన టాలీవుడ్ స్టార్స్కి ప్రత్యేక కృతజ్ఞతలు. క్యాన్సర్ నుంచి బ్రతికిద్దాం అన్న ఆలోచనే ఈ క్రికెట్ టాలీవుడ్ అసోసియేషన్ యొక్కముఖ్య ఉద్దేశం. బిజీ షెడ్యూల్ని కూడా పక్కన పెట్టి రావడం గ్రేట్. ఇప్పటి వరకు ఎప్పుడూ సౌత్ ఆఫ్రికాలో ఇలాంటి కార్యక్రమాలు జరగలేదు. మొట్ట మొదటి సారి వీళ్ళు సౌత్ ఆఫ్రికా వచ్చి మన సంస్కృతిని వాళ్ళకు పరిచయం చేసి వాళ్ళ సంస్కృతి గురించి మనం తెలుసుకోవడం కోసం ఒక సాంస్కృతిక కార్యక్రమం లో హాజరు కాబోతున్నందుకు ఆనందంగా ఉంది అన్నారు. హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ...నేను ఒక్కడినే కెప్టెన్ కాదు నాతోపాటు ఇక్కడున్న వారందరూ కెప్టెన్సే. మొదటిసారి సౌత్ ఆఫ్రికాలో మ్యాచ్ ఆడటం అంటే అసలు జరుగుద్దో లేదో అనుకున్నా. కాని వాళ్ళ కాన్ఫిడెంట్ చూసి ముందుకు వెళుతున్నాం. క్రికెట్ ఆడటం ముందు స్టార్ట్ చేసిందే మా టాలీవుడ్ హీరోలు. చిరంజీవి, నాగార్జున వాళ్ళందరూ ముందు మొదలు పెట్టారు. ఇది కమర్షియల్గా ఆడే ఆట కాదు. ఒక మంచి పని కోసం ఈ కార్యక్రమానికి మేమందరం గ్రూప్ అయ్యాం. మే 16-17 దర్బార్లో దిగుతాం. 18న గేమ్ ఉంటుంది. 19న ఒక కల్చరల్ ప్రోగ్రాం ఉంటుంది. మీరందరూ మాకు తప్పకుండా సపోర్ట్ చెయ్యాలన్నారు. హీరో తరుణ్ మాట్లాడుతూ... మొత్తం టీమ్ అందరికీ ముందుగా నా కృతజ్ఞతలు. ఇది మొదలు పెట్టి 3 ఏళ్ళు అయింది. ప్రతి ఆట ఒక మంచి పని కోసం ఆడతాం. సౌత్ ఆఫ్రికాలో మొట్టమొదటిసారి ఆడుతున్నాం. టిసిఎ, తల్వార్స్ కలిసి ఆడబోతున్నాం. సౌత్ ఆఫ్రికాని కూడా మనం గెలిచివద్దాం అన్నారు. ఈ ఈవెంట్ మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నా అన్నారు. అల్లరి నరేష్ మాట్లాడుతూ... ఇప్పటి వరకు ఎన్నో మ్యాచ్లు ఆడాం కాని ఈ మ్యాచ్లో విశేషం ఏమిటంటే నేను సునీల్ ఓపెన్సర్స్గా ఆడుతున్నాం. మాకు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి చాలా ఆనందంగా ఉంది. రమేష్గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు. సునీల్ మాట్లాడుతూ... ఇండో ఆఫ్రికా నిర్వహిస్తున్న ఫస్ట్ డెబ్యూ మ్యాచ్ లో కష్టపడి మంచి పేరు తెచ్చుకుంటాను. టిసిఎ, తల్వార్స్ కలిసి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉంది. అదే విధంగా ఆఫ్రికాలో ఏదైనా మూవీస్లో అవకాశం వస్తే నేను అక్కడే ఉంటాను అంటూ చమత్కారంగా మాట్లాడుతూ ముగించారు. హీరో నిఖిల్ మాట్లాడుతూ... ముందుగా ఇంత మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన టిసిఎకి నా ప్రత్యేక అభినందనలు. ఈ సంస్థ 16 ఏళ్ళనుంచి ఉంది. ఇది ఎంతో మంచి సాంస్కృతిక కార్యక్రమం. ఈ కార్యక్రమం లైవ్ కూడా ఉంటుంది. మీరందరూ చూసి ఆదరించగలరని కోరుకుంటున్నాను అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రిన్స్, భూపాల్, శ్రీనివాస్ , కిషోర్ , సింగర్ కౌశల్య తదితరులు పాల్గొన్నారు. -
ఎవరి సంపాదన ఎక్కువ?
‘షారుక్ఖాన్ సినిమాకు ఇన్ని కోట్లు తీసుకుంటారట, సల్మాన్ అయితే ‘బిగ్ బాస్’ ఒక్క ఎపిసోడ్కే అన్ని కోట్లు పుచ్చుకుంటారట!’ అని మాట్లాడుకుంటూనే ఉంటాం. సామాన్యుల్లో స్టార్స్ సంపాదన ఎప్పుడూ ఓ హాట్ టాపిక్కే. ఇదే సంభాషణలకు సర్వే రూపం ఇచ్చి ఓ జాబితాను ప్రతి ఏడాదీ రిలీజ్ చేస్తుంటుంది ఫోర్బ్స్ మేగజైన్. సినిమా తారలు, క్రికెటర్స్ ఆ ఏడాది (సర్వే నిర్వహించే కాలం)లో ఎంత సంపాదిస్తున్నారో లెక్క కట్టి ఏడాది చివర్లో ఓ లిస్ట్ను రిలీజ్ చేస్తుంది. ఈ ఏడాది కూడా తన టాప్ 100 జాబితాను విడుదల చేసింది. 2017 అక్టోబర్ 1 నుంచి సెప్టెబర్ 30, 2018 వరకూ తారల సినిమాల రిలీజ్లు, చేసిన బ్రాండ్ ప్రమోషన్స్ అన్నింటినీ లెక్కకట్టి ఎక్కువగా సంపాదించే వంద మంది ఇండియన్ సెలబ్రిటీల లిస్ట్ ఇచ్చింది. ఈ ఏడాది అత్యంత సంపాదించిన వాళ్లలో సల్మాన్ ఖాన్ నిలిచారు. వరుసగా మూడోసారి ఈ లిస్ట్లో టాప్లో నిలిచారు సల్మాన్ ఖాన్. ఈ కండలవీరుడు సుమారు 253 కోట్ల రూపాయలను ఆర్జిస్తున్నట్టు పేర్కొంది ఫోర్బ్స్. మూడో స్థానంలో అక్షయ్ కుమార్ (185 కోట్లు) ఉన్నారు. ఈ జాబితాలో సౌత్ హీరోల్లో రజనీకాంత్ టాప్లో ఉన్నారు. 50 కోట్లు సంపాదిస్తూ 14వ పొజిషన్లో నిలిచారు రజనీ. ఆ తర్వాత 31కోట్ల సంపాదనతో పవన్ కల్యాణ్ 24వ పొజిషన్లో నిలిచారు. 28 కోట్లు సంపాదిస్తూ ఎన్టీఆర్ 28వ స్థానంలో నిలిచారు. 33, 34, 36 స్థానాల్లో మహేశ్బాబు (24.33 కోట్లు), సూర్య (23. 67 కోట్లు), నాగార్జున (22.25 కోట్లు) నిలిచారు. బ్లాక్బస్టర్ సినిమాల దర్శకుడు కొరటాల శివ కూడా ఈ లిస్ట్లో చోటు సంపాదించుకున్నారు.20 కోట్ల సంపాదనతో 39వ స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత అల్లు అర్జున్ (15.67 కోట్లు), రామ్చరణ్ (14 కోట్లు), లేటెస్ట్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ (14 కోట్లు) 64,72, 72 స్థానాల్లో ఉన్నారు. గతేడాది రెండో స్థానంలో నిలిచిన షారుక్ ఈ ఏడాది 13వ స్థానంలోకి వెళ్లారు. ఈ ఏడాది ఒక్క సినిమా రిలీజ్ కూడా లేకపోవడమే దానికి కారణం. అలాగే గతేడాది 7వ స్థానంలో నిలిచిన ప్రియాంక ఈ సంవత్సరం 49వ స్థానానికి చేరుకున్నారు. దీపికా రికార్డ్.. నయన కూడా! 112.8 కోట్లతో దీపికా పదుకోన్ నాలుగో స్థానంలో నిలిచారు. 2012 నుంచి ఫోర్బ్స్ విడుదల చేస్తున్న ఈ జాబితాలో టాప్ 5లో చోటు సంపాదించుకున్న తొలి మహిళగా దీపికా పదుకోన్ రికార్డ్ సృష్టించారు. ‘పద్మావత్’ లో హీరోల కంటే కూడా ఎక్కువ రెమ్యునరేషన్ అందుకోవడం, అలాగే తను చేసే బ్రాండ్ ప్రమోషన్స్ కూడా ఆమెను టాప్ 5లో నిలిచేలా చేశాయని ఊహించవచ్చు. సౌత్ నుంచి హీరోయిన్స్లో నయనతార మాత్రమే ఈ లిస్ట్లో నిలవడం విశేషం. 15.17 కోట్లు సంపాదించి 69వ స్థానంలో నిలిచారు నయన్.