vaka manjula reddy
-
Health: ఈ సమస్యలు.. కొనితెచ్చుకుంటున్నారా?
డెర్మోరెక్సియా... ఈ పదంలో డెర్మో ఉంది, కానీ ఇది చర్మ సమస్య కాదు. మానసిక సమస్య. ఒకరకంగా అనెరొక్సియా వంటిదే. సాధారణ బరువుతో ఉన్నప్పటికీ లావుగా ఉన్నామనే భ్రాంతికి లోనవుతూ సన్నబడాలనే ఆకాంక్షతో ఆహారం తినకుండా దేహాన్ని క్షీణింపచేసుకోవడమే అనెరొక్సియా. ఇక డెర్మోరెక్సియా అనేది చర్మం అందంగా, యవ్వనంగా, కాంతులీనుతూ ఉండాలనే కోరికతో విపరీతంగా క్రీములు వాడుతూ చర్మ ఆరోగ్యాన్ని దెబ్బతీసుకోవడమే డెర్మోరెక్సియా. ఇటీవల మధ్య వయసు మహిళల్లో ఎక్కువగా కనిపిస్తోంది.ఆత్మవిశ్వాసానికి అందం కొలమానం కాదు! ‘అందం ఆత్మవిశ్వాసాన్ని పెం΄÷ందిస్తుంది’ అనే ప్రచారమే పెద్ద మాయ. సౌందర్య సాధనాల మార్కెట్ మహిళల మీద విసిరిన ఈ వల దశాబ్దాలుగా సజీవంగా ఉంది, ్రపాసంగిక అంశంగానే కొనసాగుతోంది. ఈ తరం మధ్య వయసు మహిళ ఈ మాయలో పూర్తిగా మునిగి΄ోయిందనే చె΄్పాలి. వార్ధక్య లక్షణాలను వాయిదా వేయడానికి, ముఖం మీద వార్ధక్య ఛాయలను కనిపించకుండా జాగ్రత్తపడడానికి యాంటీ ఏజింగ్ క్రీములను ఆశ్రయించడం ఎక్కువైంది. ఒక రకం క్రీము వాడుతూండగానే మరోరకం క్రీమ్ గురించి తెలిస్తే వెంటనే ఆ క్రీమ్కు మారి΄ోతున్నారు. వీటి కోసం ఆన్లైన్లో విపరీతంగా సెర్చ్ చేస్తున్నారు. క్రమంగా ఇది కూడా ఒక మానసిక సమస్యగా పరిణమిస్తోందని చెబుతున్నారు లండన్ వైద్యులు.క్రీమ్ల వాడకం తగ్గాలి! లుకింగ్ యూత్ఫుల్, ఫ్లాలెస్ స్కిన్ కోసం, గ్లాసీ స్కిన్ కోసం అంటూ ప్రచారం చేసుకునే క్రీమ్లను విచక్షణ రహితంగా వాడుతూ యాక్నే, ఎగ్జిమా, డర్మటైటిస్, సోరియాసిస్ వంటి చర్మ సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు. గాఢత ఎక్కువగా ఉన్న గ్లైకోలిక్ యాసిడ్, నియాసినామైడ్, రెటినాల్, సాలిసైలిక్ యాసిడ్, అల్ఫా హైడ్రాక్స్ యాసిడ్స్ చర్మానికి హాని కలిగిస్తున్నాయి. అలాగే చర్మం మీద మృతకణాలను తొలగించడానికి చేసే ఎక్స్ఫోలియేషన్ విపరీతంగా చేయడం వల్ల చర్మం మరీ సున్నితమై΄ోతోంది. కళ్లచుట్టూ ఉండే చర్మం మీద ఈ క్రీమ్లను దట్టంగా పట్టించడం వల్ల ఆర్బిటల్ ఏరియాలో ఉండే సన్నని సున్నితమైన రక్తనాళాలు పలుచబడి వ్యాప్తి చెందుతాయి. దాంతో కళ్ల కింద చర్మం ఉబ్బెత్తుగా మారుతుంది. డెర్మోరెక్సియాను గుర్తించే ఒక లక్షణం ఇది. డెర్మోరెక్సియాను నిర్ధారించే మరికొన్ని లక్షణాలిలా ఉంటాయి. – చర్మం దురదగా ఉండడం, మంటగా అనిపించడం, ఎండకు వెళ్తే భరించలేక΄ోవడం – తరచూ చర్మ వ్యాధి నిపుణులను కలవాల్సి రావడం, ఎన్ని రకాల చికిత్సలు తీసుకున్నప్పటికీ సంతృప్తి కలగక΄ోవడం. – చర్మం ఆరోగ్యంగా ఉన్నప్పటికీ తరచూ అద్దంలో చూసుకుంటూ అసంతృప్తికి లోనవడం. తళతళ మెరిసే గ్లాసీ స్కిన్ కోసం చర్మం మీద ప్రయోగాలు చేయడం – షెల్ఫ్లో అవసరానికి మించి రకరకాల బ్యూటీ ్ర΄ోడక్ట్స్ ఉన్నాయంటే డెర్మోరెక్సియాకు దారితీస్తోందని గ్రహించాలి. మధ్య వయసు మహిళలే కాదు టీనేజ్ పిల్లల విషయంలో కూడా ఈ లక్షణం కనిపించవచ్చు. పేరెంట్స్ గమనించి పిల్లలకు జాగ్రత్తలు చె΄్పాలి.ఓసీడీగా మారకూడదు..శరీరం అందంగా కనిపించట్లేదనే అసంతృప్తి వెంటాడుతూనే ఉండడం బాడీ డిస్మార్ఫోఫోబియా అనే మానసిక వ్యాధి లక్షణం. ముఖం క్లియర్గా, కాంతిమంతంగా కనిపించాలనే కోరిక మంచిదే. కానీ అది అబ్సెషన్గా మారడం ఏ మాత్రం హర్షణీయం కాదు. ఇది ఎంత తీవ్రమవుతుందంటే... అందంగా కనిపించడానికి రకరకాల ట్రీట్మెంట్లు తీసుకోవడం, ఏ ట్రీట్మెంట్ తీసుకున్నప్పటికీ, ఆ ట్రీట్మెంట్లో ఎంత మంచి ఫలితం వచ్చినప్పటికీ సంతృప్తి చెందక΄ోవడం, తీవ్రమైన అసంతృప్తితో, ఎప్పుడూ అదే ఆలోచనలతో మానసిక ఒత్తిడికి లోనుకావడం వంటి పరిణామాలకు దారి తీస్తుంది. మెదడు ఇదే ఆలోచనలతో నిండి΄ోయినట్లయితే కొంతకాలానికి ఆ సమస్యకు వైద్యం చేయాల్సి వస్తుంది. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధిఆ గీతను అర్థం చేసుకోవాలి..ఒక మనిషితో మాట్లాడుతున్నప్పుడు, ఆ సంభాషణ తాలూకు విషయమే ముఖ్యం. అంతే తప్ప వారి ముఖం ఎలా ఉంది అనేది పట్టించుకునే అంశం ఏ మాత్రం కాదు. అందం– ఆత్మవిశ్వాసం ఒకదానితో ఒకటి ముడివడి ఉంటాయనేది కొంతవరకే. ఆత్మవిశ్వాసానికి అందం గీటురాయి కానేకాదు. ఈ సన్నని గీతను అర్థం చేసుకోవాలి. సాధారణంగా వయసుతోపాటు దేహంలో మార్పు వస్తుంటుంది. ఆ మార్పు ప్రభావం చర్మం మీద కనిపిస్తుంటుంది. ఈ మార్పును స్వీకరించాల్సిందే. చర్మం కాంతిమంతంగా ఉండడం కోసం రసాయన క్రీములను ఆశ్రయించడం కంటే మంచి ఆహారం, వ్యాయామం, ఒత్తిడి లేని జీవనశైలి, మంచి నిద్ర ఉండేటట్లు చూసుకోవాలి. – ప్రొఫెసర్ శ్రీనివాస్ ఎస్ఆర్ఆర్వై, హెచ్వోడీ, సైకియాట్రీ విభాగం, కాకతీయ మెడికల్ కాలేజ్ఇవి చదవండి: Lathika Sudhan: రేకులు విప్పిన కలువ.. కొలనైంది! -
Teacher's Day Special: నా బెస్ట్ టీచర్..
ఈ ఏడాది జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకుంటున్నారు డాక్టర్ ఎన్. మృదుల. హైదరాబాద్, బేగంపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో తెలుగు అసోసియేట్ ప్రొఫెసర్. ఉపాధ్యాయురాలిగా 34 ఏళ్లలో ఆమె దగ్గర పదివేల మంది విద్యార్థులు తెలుగు నేర్చుకున్నారు. తనను బోధనరంగం వైపు నడిపించింది సికింద్రాబాద్, ప్యాట్నీలోని తాను చదువుకున్న స్కూలు, ఆ స్కూల్ తెలుగు టీచర్ భువనేశ్వరి గారేనన్నారు డాక్టర్ మృదుల. అంటే ఈ బెస్ట్ టీచర్ మెచ్చుకున్న తన బెస్ట్ టీచర్ భువనేశ్వరి.అంతా ఆ టీచర్ ప్రభావమే..‘భువనేశ్వరి టీచర్ పద్యంలోని ప్రతి పదానికి అర్థం చెప్పడంతో పాటు, దానికి వ్యుత్పత్తి, ఆ పదాన్ని ప్రయోగించడం వెనుక కవి ఉద్దేశం చెప్పేవారు. కవితలు, కథలు రాయించేవారు. సభా నిర్వహణ చేయించేవారు. ఆమె ప్రభావంతోనే తెలుగు భాష మీద మక్కువ పెరిగింది. ఆ ప్రోత్సాహమే ఇప్పటికీ మయూఖ, తరుణి మ్యాగజైన్లలో కాలమిస్టుగా వ్యాసాలు రాయిస్తోంది. పాఠం చెప్పడంలో కూడా ఆమె బాటనే అనుసరిస్తున్నాను’ అంటారు మృదుల.నిత్యం విద్యార్థినే!‘నా విద్యార్థులకు నేను అసైన్మెంట్లు ఇచ్చినప్పుడు వాళ్లు కచ్చితంగా గడువులోపే పూర్తి చేయాలని కోరుకుంటాను. అలాగే అధికారుల నుంచి మాకు వచ్చే అసైన్మెంట్లను కూడా గడువులోపు పూర్తి చేసేదాన్ని. పనిని శ్రద్ధగా అంకితభావంతో చేయాలనుకుంటాను. మా కుటుంబంలో టీచర్లు లేరు. నేను టీచింగ్లోకి వచ్చినందుకు అమ్మానాన్న చాలా సంతోషించారు. కోవిడ్లో ఆన్లైన్ క్లాసులు చెప్పడానికి సాంకేతికపరంగా అవసరమైన సహాయం మా పిల్లలు చేసేవాళ్లు. కోవిడ్ తర్వాత కూడా అవసరాన్ని బట్టి ఆన్లైన్ క్లాసులను కొనసాగించాను. క్లాసులో పూర్తి కాని పాఠాలను ఇంటికి వచ్చిన తర్వాత ఆన్లైన్లో చెప్తున్నాను. టీచర్గా ‘బెస్ట్ ఆన్లైన టీచర్, బెస్ట్ హెచ్ఓడీ, బెస్ట్ ఫ్యాకల్టీ’ గౌరవాలందాయి. ఉపాధ్యాయురాలిగా ప్రభుత్వం నుంచి పురస్కారం అందుకోవడం ఇదే మొదటిసారి’’ అని తన ఉపాధ్యాయ ప్రస్థానాన్ని వివరించారు డాక్టర్ మృదుల. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఈ రోజు ఢిల్లీలోని విజ్ఞానభవన్లో రాష్ట్రపతి చేతుల మీదుగా ఆమె ‘ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు’నందుకోనున్నారు.సీతమ్మబడి..మా స్కూల్ పేరు ‘పరోపకారి బాలికోన్నత పాఠశాల’. సీతమ్మ అనే మహిళ కట్టించిన స్కూల్ కావడంతో సీతమ్మబడి అంటారు. కవితలు రాయడంతోపాటు స్కూల్లో జరిగే సభలు, సమావేశాల్లో చురుగ్గా ఉండేదాన్ని. చక్కటి తెలుగుతో వక్తలను వేదిక మీదక ఆహ్వానించేదాన్ని. పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పుడు ఆకాశవాణిలోని యువవాణి కార్యక్రమంలో ప్రయోక్తగా ప్రముఖులను ఇంటర్వ్యూ చేశాను. అనౌన్స్మెంట్లు, వ్యాసాలు కధానికలు చదవడం... ఇలా కలం, గళం కలిసి కొనసాగాయి. ఇక బోధనరంగంలోకి వచ్చిన తర్వాత ప్రతిరోజూ ఇష్టమైన రోజుగానే గడిచింది. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
Dr Anita Shah: ఆధ్యాత్మిక కళకూ.. ఒక చరిత్ర ఉంది!
ఆమెది హైదరాబాద్లో స్థిరపడిన గుజరాతీ కుటుంబం. ఆమె వృత్తీ, ప్రవృత్తీ రెండూ కళలను అధ్యయనం చేయడమే కావడం వల్ల భారతీయ చిత్రరీతుల మీద విస్తృతంగా పరిశోధన చేస్తున్నారు. మనదేశంలో విలసిల్లిన కళారూపాలు ఏయే దేశాల మ్యూజియాల్లో ఉన్నాయో తెలుసుకుని ప్రతి విషయాన్నీ గ్రంథస్తం చేస్తున్నారు. ఆమే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ చేసిన డాక్టర్ అనితా షా, చిత్రకళల పరిశోధకురాలు.ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ మ్యూజియమ్స్ (ఐసీఓఎమ్)లో కీలక సభ్యురాలిగా ప్రపంచదేశాల్లో పర్యటిస్తూ మ్యూజియాలజీ విద్యార్థులకు గెస్ట్ ఫ్యాకల్టీగా బోధిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె మనదేశంలో విస్తరించిన వైవిధ్యభరితమైన చిత్రకళారూపాల గురించిన సమగ్రమైన వివరాలతో ‘కలర్స్ ఆఫ్ డివోషన్’ పేరుతో ఆవిష్కరించారు. అమెరికా, ఇండియాల్లోని వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తూ చిత్రకళ మీద సదస్సులు నిర్వహిస్తున్న అనితా షా గతంలో ఆమె భర్త భరత్ షాతో కలిసి ‘త్రెడ్స్ ఆఫ్ డివోషన్’ పేరుతో రాజస్థాన్, గుజరాత్లోని కచ్లో అభివృద్ధి చెందిన ఎంబ్రాయిడరీలతో ప్రదర్శన నిర్వహించారు.రాస్తే కావ్యం... గీస్తే చిత్రం..‘‘చిత్రం అంటే సాహిత్యాన్ని కంటితో చూపించే ప్రక్రియ. నిరక్షరాస్యులకు ఒక గ్రంథసారాన్ని బొమ్మల్లో చూపించవచ్చు. చిత్రకారులు కాలానుగుణంగా మార్పులను జోడించుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో దక్కనీ– హైదరాబారీ ఆర్టిస్టులు సంయుక్తంగా కృషి చేసి గోల్డెన్ కలంకారీ పెయింటింగ్స్కు రూపకల్పన చేశారు. ఇది పద్దెనిమిదవ శతాబ్దపు చివరి రోజుల్లో అభివృద్ధి చెందింది. కళాకారుల కళానైపుణ్యం అంతా కృష్ణుడు, గోపికల రూపాలను తీర్చిదిద్దడంలో కనిపిస్తుంది. నేను శ్రీవల్లభాచార్య వల్లభ సంప్రదాయ తత్వం పుష్టిమార్గం మీద ఎక్కువగా పని చేశాను.వల్లభాచార్య తత్వం శుద్ధ అద్వైతం, కృష్ణతత్వంతో ఉంటుంది. శైవం ప్రభావం కొన్ని చిత్రాల్లో కనిపిస్తుంది. ఇందులో తాత్విక చింతన, పురాణాల అవలోకనమే ప్రధానంగా సాగుతుంటుంది. సద్గురువుల ప్రవచనాలు, ప్రబోధాల వల్ల అనేక ఊహాచిత్రాలకు రూపం వచ్చింది. సామాన్యులకు ఆరోగ్యకరమైన, ఆచరణీయమైన దైనందిన జీవనశైలిని కూడా పౌరాణిక కథల ద్వారానే వివరించేవారు. తల్లి బిడ్డను లాలనగా నిద్రలేపడం, బిడ్డకు స్నానం చేయించి దుస్తులు ధరింపచేసి చక్కగా అలంకరించడం వంటివన్నీ కృష్ణుడు, యశోద పాత్రల ద్వారా బొమ్మల్లో రూపుదిద్దుకున్నాయి.చిత్రకళలో కృష్ణతత్వం..మన చిత్రకళ, శిల్ప కళ అన్నీ చరిత్ర, పురాణేతిహాసాల ఆధారంగానే అభివృద్ధి చెందాయి. సామాజిక మార్పులను ఇముడ్చుకుంటూ ముందుకు సాగుతుంటాయి. భాగవత పురాణాల ప్రభావం ఉత్తరాదిలో ఎక్కువ. కాబట్టి ఉత్తరాది చిత్రకళలు ఎక్కువగా కృష్ణతత్వాన్ని ప్రతిబింబిస్తుంటాయి. కృష్ణుడు ప్రతి ఇంట్లోనూ కుటుంబ సభ్యుడే. ప్రతి సంఘటనను కృష్ణుడితో అన్వయించుకుంటారు.ముస్లిం ఆర్టిస్టులు హిందూచిత్రాలు..నా తాజా రచన కలర్స్ ఆఫ్ డివోషన్ పుస్తకం వెనుక ఏడేళ్ల శ్రమ ఉంది. ఇది పాఠకుల సాంస్కృతిక, సామాజిక దృష్టి కోణాన్ని విస్తృతపరుస్తుందని చెప్పగలను. హిందూ పురాణాల ఆధారంగా చిత్రాలకు రూపకల్పన చేసిన వారిలో ముస్లిం చిత్రకారులున్నారు. ఆదిల్ షా స్వయంగా సరస్వతీ మాతను పూజించాడు. ఇలాంటి అనేక సామరస్య సహజీవన ఆధారాలు మనప్రాచీన చిత్రాల్లో దొరుకుతాయి. భారతీయ చిత్రకళలో సాంస్కృతికప్రాముఖ్యతను తెలియచేశాను.గతంలో ‘విజిటర్స్ టూ సౌత్ ఇండియన్ మ్యూజియమ్స్– మ్యూజియోలాజికల్ కాంటెక్ట్స్ అండ్ విజిటర్ స్టడీ’ పేరుతో పుస్తకం తెచ్చాను. చిత్రకళారీతులతోపాటు వాటిని చిత్రించిన వస్త్రనైపుణ్యాన్ని కూడా ప్రత్యేకంగా గుర్తించాలి. మన చిత్రకళారీతులన్నీ ఒకచోట గుదిగుచ్చి లేక΄ోవడం దురదృష్టకరం. ఒక్కొక్కటి ఒక్కోచోట ఉండడంతో ఒక సమగ్రమైన స్వరూపం రావడం లేదు. అందుకే మ్యూజియాల్లో ప్రదర్శనలో ఉన్న కళాఖండాల ఫొటోలు, వివరాలతో రచనలు చేస్తున్నాను. ఇదే నా పని’’ అని వివరించారు డా. అనితాషా. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
అరుదైన ఆహ్వానం: 12 ఏళ్లు.. 15 లైబ్రరీలు..
ఈ ఏడాది స్వాతంత్య్ర వేడుకలకు ప్రత్యేక ఆహ్వానం అందుకున్నఇరవై మందిలో విద్యార్థులు ఆరుగురు. వారిలో అమ్మాయి ఒకే ఒక్కరు. ఆ సరస్వతి పుత్రిక పేరు ఆకర్షణ. లైబ్రరీలు స్థాపిస్తూ సాహిత్యాన్ని సామాన్యులకు దగ్గర చేస్తున్న ఆమె అక్షరసేవకు జాతీయ స్థాయిలో అందిన గుర్తింపు ఇది. ‘‘హైదరాబాద్ హెడ్ పోస్ట్ ఆఫీస్ పోస్ట్మాస్టర్ నుంచి 12వ తేదీన నాన్నకు ఫోన్ వచ్చింది. స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా 15వ తేదీన ఢిల్లీలో జరిగే వేడుకలకు హాజరుకావలసిందిగా మీ అమ్మాయి ఆకర్షణకు ఆహ్వానం వచ్చిందని చెబుతూ అభినందనలు తెలియచేశారు’’ అంటూ తాను లైబ్రరీ వ్యవస్థాపకురాలిగా మారిన వివరాలను సాక్షి ఫ్యామిలీతో పంచుకున్నారు ఆకర్షణ సతీష్.కోవిడ్ వచ్చినప్పుడు..‘‘హైదరాబాద్లో స్థిరపడిన తమిళ కుటుంబం మాది. నాన్న సతీశ్ క్యాన్సర్ ఎక్విప్మెంట్ తయారీ కంపెనీ ఉద్యోగి. నేను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఎనిమిదవ తరగతి చదువుతున్నాను. పుస్తక పఠనం నా హాబీ కావడంతో వెయ్యికి పైగా పుస్తకాలతో ఇంట్లోనే నాకు సొంత లైబ్రరీ ఉంది. ఇతరుల కోసం లైబ్రరీ స్థాపించాలనే ఆలోచన కోవిడ్ సమయంలో వచ్చింది.తొలి లైబ్రరీ క్యాన్సర్ హాస్పిటల్లో..నాన్న ఉద్యోగరీత్యా క్యాన్సర్ హాస్పిటళ్లకు టచ్లో ఉంటారు. కోవిడ్ సమయంలో ఎమ్ఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ వాళ్లు ‘కోవిడ్ కారణంగా వంటవాళ్లు డ్యూటీకి రావడం లేదు. పేషెంట్లకు ఆహారం అందించడానికి ప్రత్యామ్నాయ ప్రయత్నాలు చేసి పెట్టవలసింది’గా కోరడంతో నాన్న వాళ్ల కోసం రోజూ భోజనం వండించి తీసుకెళ్లి ఇచ్చేవారు. నాకు స్కూల్ లేకపోవడంతో రోజూ నాన్నతోపాటు హాస్పిటల్కి వెళ్లేదాన్ని. అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్న పేషెంట్లలో నా ఏజ్ గ్రూప్ వాళ్లతో స్నేహం ఏర్పడింది. వాళ్లు కొంతమంది చదువుకోవడానికి పుస్తకాలు తెచ్చిపెట్టమని అడిగారు. రోజూ నా పుస్తకాలు కొన్ని తీసుకెళ్లి ఇస్తూ ఉన్నప్పుడు హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ జయలత గారు... ‘హాస్పిటల్కి చికిత్స కోసం ఎప్పుడూ కొత్తవాళ్లు వస్తుంటారు. హాస్పిటల్లోనే లైబ్రరీ ఉంటే బావుంటుంది’ అన్నారు. వారి ఆలోచనే నా లైబ్రరీ ఉద్యమానికి నాంది. నా పుస్తకాలతోపాటు మా స్కూల్, అపార్ట్మెంట్ స్నేహితుల నుంచి సేకరించిన వెయ్యికి పైగా పుస్తకాలతో తొలి లైబ్రరీ అలా మొదలైంది. ఇప్పటికి 9,836 పుస్తకాలతో 15 లైబ్రరీలు ఏర్పాటు చేయగలిగాను.పదకొండు వేల పుస్తకాలు..నాలుగేళ్లలో పదకొండు వేల పుస్తకాలు సేకరించాను. అందులో రెండు వేల పుస్తకాలు ప్రధాని నరేంద్రమోదీగారిచ్చారు. ఈ ఏడాది మార్చి 18న కోయంబత్తూరులో ఆయనను కలిసే అవకాశం వచ్చింది. ఆ సందర్భంగా ఆయన 25 లైబ్రరీలు స్థాపించమని, 25 లైబ్రరీ స్థాపనకు స్వయంగా హాజరవుతానని చె΄్పారు. భారత రాష్ట్రపతి గత ఏడాది శీతాకాల విడిది కోసం హైదరాబాద్కి వచ్చినప్పుడు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో కలిశాను.అప్పుడామె ‘ప్రజల్లో రీడింగ్ హ్యాబిట్ తగ్గుతోంది, పుస్తక పఠనాన్ని ్రపోత్సహించడానికి దోహదం చేస్తున్న ఈ ప్రయత్నాన్ని కొనసాగించ’మని చెప్పి ఆమే స్వయంగా 74 పుస్తకాలిచ్చారు. ఈ ఏడాది ఢిల్లీ, కర్తవ్య పథ్లో జరిగిన 75వ రిపబ్లిక్ డే ఉత్సవాలకు ప్రభుత్వ ప్రత్యేక ఆహ్వానం మేరకు హాజరయ్యాను. ఇదే ఏడాది స్వాతంత్య్రదినోత్సవం వేడుకలకు కూడా హాజరయ్యే అవకాశం కలగడం సంతోషంగా ఉంది’’ అంటూ 25 లైబ్రరీల లక్ష్యాన్ని పూర్తి చేస్తానని చెప్పింది ఆకర్షణ సతీశ్. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
ఒలింపిక్స్ క్రీడాకారులు.. ఏం తినాలి! ఎంత తినాలి!!
ఒలింపిక్స్ క్రీడాకారుల ఆహారం చాలా నిశితమైన పరిశీలనతో డిజైన్ చేస్తారు. వాళ్ల ఆరోగ్యం, సంబంధిత క్రీడకు అవసరమైన మోతాదులో ΄ోషకాలు సమృద్ధిగా అందేలా ఆహారం ఉంటుంది. కేలరీలు, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, ఫ్యాట్స్ వంటి మ్యాక్రో న్యూట్రియెంట్స్, ఐరన్, క్యాల్షియం, విటమిన్ డీ, మెగ్నీషియం, ఎలక్ట్రోలైట్స్ (సోడియం, పొటాషియం, క్లోరైడ్) వంటి మైక్రో న్యూట్రియెంట్లు అందాలి. క్రీడాకారుల డైట్లో దేహానికి ఒక రోజుకు అవసరమైన కేలరీలలో 55–65 శాతం కార్బోహైడ్రేట్ల రూపంలోనే ఉంటుంది. శ్రమను బట్టి రోజుకు 2 వేల నుంచి 10 వేల కేలరీల వరకు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రోటీన్లు దేహం బరువును బట్టి కేజీకి 1.2 నుంచి 2 గ్రాములు అందాలి. ఆరోగ్యకరమైన ఫ్యాట్ శక్తినివ్వడంతోపాటు హార్మోన్ ఉత్పత్తికి దోహదం చేస్తుంది. దేహానికి అందాల్సిన కేలరీల్లో 20 నుంచి 30 శాతం ఫ్యాట్ రూపంలో ఉండాలి. మారథాన్, స్విమ్మింగ్కి శిక్షణ నిడివి ఎక్కువ ఉంటుంది. క్రీడను బట్టి కూడా ΄ోషకాల అవసరం మారుతుంది.ఎప్పుడు తినాలి? ఎలా తినాలి?ఆహారంతోపాటు హైడ్రేషన్, మీల్ టైమింగ్, వర్కవుట్కు రెండు – మూడు గంటల ముందు తీసుకోవాల్సిన ఆహారం, వర్కవుట్ సమయం గంటకు మించినప్పుడు మధ్యలో తీసుకోవాల్సిన తక్షణ శక్తినిచ్చే ఆహారం, వర్కవుట్ తర్వాత కండరాల పునర్నిర్మాణం కోసం తీసుకోవాల్సిన ఆహారం మోతాదులు స్పష్టంగా నిర్దేశితమై ఉంటాయి. అయితే బాడీ కం΄ోజిషన్, మెటబాలిక్ రెస్పాన్స్, ఫుడ్ ఇన్టాలరెన్స్ వ్యక్తికీ వ్యక్తికీ మారుతుంటాయి. కాబట్టి సాధారణ నియమావళిని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్క స్పోర్ట్స్పర్సన్కి వ్యక్తిగత డైట్ ΄్లాన్ సిద్ధం చేయాలి. అలాగే వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్, వీగన్ వంటి వారి వ్యక్తిగత ఆహార విశ్వాసాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.– ఐరన్: రెడ్ మీట్, ఆకు కూరలు, ధాన్యాల ద్వారా శక్తితోపాటు దేహభాగాలకు ఆక్సిజన్ సమర్థంగా అందుతుంది.– క్యాల్షియమ్: వెన్న తీయని పాలు, పాల ఉత్పత్తులు, ఆకుకూరలు ఎముకల పటుత్వానికి దోహదం చేస్తాయి. – విటమిన్–డి: కొవ్వుతో కూడిన చేపలు, తృణధాన్యాలు, సూర్యరశ్మి ద్వారా ఎముకల పటుత్వంతోపాటు వ్యాధినిరోధకత మెరుగవుతుంది. – మెగ్నీషియం: నట్స్, సీడ్స్, పొట్టుతీయని ధాన్యాలు, ఆకుకూరలు శక్తిని పెంచడంతోపాటు కండరాల సంకోచవ్యాకోచాలను సులువు చేస్తాయి. – ఎలక్ట్రోలైట్స్: పండ్లు, కూరగాయలు, పాలు, పాల ఉత్పత్తులు, స్పోర్ట్స్ డ్రింక్లు దేహంలో ద్రవాల స్థాయులను క్రమబద్ధీకరించడంతోపాటు కండరాల పనితీరును మెరుగుపరుస్తాయి.హెల్దీ డైట్..వంద గ్రాములు... మనదేశానికి ఒక బంగారు పతకాన్ని దూరం చేసింది. బంగారు పతకంతోపాటు బంగారంలాంటి క్రీడాకారిణి మనోధైర్యాన్ని దెబ్బతీసింది. బరువు లెక్కలు ఇంత కచ్చితంగా పాటించే ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులు తీసుకునే ఆహారం ఎలా ఉండాలనే వివరాలను అందించారు న్యూట్రిషనిస్ట్, వెల్నెస్ కోచ్ డాక్టర్ కరుణ.– డాక్టర్ కరుణ, న్యూట్రిషనిస్ట్ అండ్ వెల్నెస్ కోచ్హార్మోన్ల సమతుల్యత! వీటన్నింటితోపాటు నిద్ర, ఒత్తిడి చాలా కీలకమైన పాత్ర ΄ోషిస్తాయి. క్రీడాకారిణులకు ఎనిమిది గంటల మంచినిద్ర తప్పనిసరి. నిద్రలేనప్పుడు హార్మోన్ల సమతుల్యత లోపించడం, ఒత్తిడి, బరువు మీద ప్రభావం చూపిస్తుంది. ఒత్తిడిని ఎదుర్కోవడంలో మగవాళ్లకు మహిళలకు మధ్య తేడా ఉంటుంది. మానసికమైన ఒత్తిడి, భావోద్వేగాలు వారి సమర్థమైన ప్రదర్శన మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ పరిస్థితిని అధిగమించడానికి మెడిటేషన్, బ్రీత్ ఎక్సర్సైజ్, కృతజ్ఞత, క్షమ, పరిస్థితిని యథాతథంగా స్వీకరించడం వంటివి సాధన చేయాలి. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
'నా ఎదుగుదల మూలాలు మా ఊరిలోనే..' రైతుబడి మాస్టారు!
'దేశరాజధాని నగరం న్యూఢిల్లీలోని ట్రిపుల్ఐటీ సంస్థ. ఇంద్రప్రస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వేదిక మీద దేశవిదేశీ ప్రముఖుల సమక్షంలో ప్రసంగించవలసిందిగా ఆహ్వానం అందుకున్నాడు మన తెలుగు యువకుడు. నేడు జరగనున్న ఎంటర్ ప్రెన్యూర్షిప్ సమ్మిట్–2024లో వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలలో యువతకున్న వ్యాపార అవకాశాల గురించి ప్రసంగించే అవకాశాన్నందుకున్న జూలకంటి రాజేందర్రెడ్డి ఈ సందర్భంగా ‘సాక్షి’తో తన ప్రస్థానాన్ని పంచుకున్నారు.' ‘‘న్యూఢిల్లీ వేదికగా అది కూడా అత్యున్నత స్థాయి విద్యాసంస్థలో ప్రసంగించే అవకాశం నన్ను వెతుక్కుంటూ వచ్చింది. అంతకుముందు జాతీయ స్థాయిలో ‘ద నేషనల్ క్రియేటర్స్ అవార్డు’కు సంబంధించిన ‘మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ అగ్రి క్రియేటర్’ కేటగిరీలో 36 శాతానికి పైగా ఓట్లు సాధించి రైతుబడి చానెల్ ప్రథమస్థానంలో నిలిచింది. ఇందుకు అసలైన కార్యక్షేత్రం మా నల్గొండ జిల్లా, మాడ్గుల పల్లి మండలంలోని మాచనపల్లి గ్రామం. నా ఎదుగుదల మూలాలు మా ఊరిలోనే ఉన్నాయి. మాది వ్యవసాయ కుటుంబం. కానీ నేనెప్పుడూ పొలం పని చేయలేదు. నన్ను బాగా చదివించి మంచి ఉద్యోగం చేస్తుంటే చూడాలని కలలు కన్నారు అమ్మా నాన్న. పనుల ఒత్తిడి ఉంటే సీజన్లో కూడా నాకు పొలం పనులు కాదు కదా, పశువుల దగ్గర సహాయానికి కూడా రానిచ్చేవారు కాదు. అలాంటిది ఇప్పుడు నా కెరీర్ వ్యవసాయ భూమిలోనే వేళ్లూనుకు΄ోయింది. పలక.. పేపర్! అమ్మానాన్న కోరుకున్నట్లే చదువుకున్నాను. బీఈడీ చేసిన తర్వాత స్కూల్లో పలక మీద పిల్లలకు అక్షరాలు దిద్దించాల్సిన వాడిని, అనుకోకుండా కొత్తదారిలో అడుగుపెట్టాను. రోజూ పేపర్ చదివే అలవాటు ఉండడంతో ఓ రోజు జర్నలిజం కోర్సు ప్రవేశ పరీక్ష ప్రకటన నా కంటపడింది. ఉత్సాహం కొద్దీ పరీక్ష రాశాను. సెలెక్ట్ అయ్యాను. కానీ అక్కడ శిక్షణ పూర్తి చేయలేదు. కానీ 2008లో ఓ ప్రైవేట్ టీవీ చానెల్తో జర్నలిస్టుగా నా ప్రయాణం మొదలైంది. టీవీ చానెల్స్ మారుతూ కొంతకాలం హైదరాబాద్లో, మరికొంత కాలం జిల్లాల్లో ఉద్యోగం చేశాను. వార్తలకే పరిమితం కాకుండా ఫీచర్ స్టోరీల కోసం అన్వేషించేవాడిని. నా అన్వేషణలో కెమెరా కంటికి చిక్కిన ఓ వాస్తవం ఎంత ఆసక్తికరమైందో ఊహించగలరా!? కాకతీయుల వారసులు ఇప్పటికీ ఉన్నారు. ఎక్కడ ఉన్నారంటే... చత్తీస్గడ్ రాష్ట్రం, జగదల్పూర్లో. ‘కమల్ చంద్ర భంజ్ దేవ్ కాకతీయ’ అక్కడ రాజు హోదాలో ఉన్నారు. వివరాలు సేకరిస్తూ వాళ్లను వెతుక్కుంటూ వెళ్లి షూట్ చేయడంలో కలిగిన జాబ్ శాటిస్ఫాక్షన్ ఇంత అని చెప్పలేను. ఇలా ఆరేళ్లు గడిచింది, అనుకోకుండా ఎలక్ట్రానిక్ మీడియా నుంచి ప్రింట్ మీడియాకి మారాను. అక్కడ ఆరేళ్లు పని చేశాను. ఉద్యోగం చేస్తున్నాను కానీ సంతృప్తి స్థాయి క్రమంగా తగ్గి΄ోసాగింది. ఎన్నాళ్లో... ఎన్నేళ్లో ఉద్యోగిగా నీ పయనం... అని నా ఆవేదనను ఫేస్బుక్లో రాసుకునేవాడిని. కరోనా వచ్చింది.. లాక్డౌన్ తెచ్చింది! అది 2020, ప్రపంచానికి గుర్తొచ్చేది కరోనా, లాక్డౌన్. నాకు గుర్తొచ్చే అపురూపమైన ఘట్టం రైతుబడి ఆవిర్భావం. ఆ ఏడాది జనవరిలోనే రైతుబడి మొదలుపెట్టేశాను. ఉద్యోగం మానేయాలనే నిర్ణయానికి వచ్చాను. మేలో మానేశాను. ఆశ్చర్యం ఏమిటంటే... ఉద్యోగంలో అందుకున్న జీతానికి సమానమైన రాబడిని జూన్లోనే చూశాను. రైతులకు ఉపయోగపడే అంశాల మీదనే ఉంటాయి నా వీడియోలన్నీ. ఒకే పంట వేస్తున్న రైతులకు రకరకాల పంటలు వేయమని మాటలతో చెప్పడం వల్ల ప్రభావితం చేయలేం. ఏకకాలంలో రకరకాల పంటలు పండిస్తున్న రైతు అనుభవాలను వారి మాటల్లో వింటే సాటి రైతులు త్వరగా ప్రభావితమవుతారు. ఇదే నా సక్సెస్ ఫార్ములా. వ్యవసాయరంగ పరిశోధకులు, అధికారుల ద్వారా కూడా కొన్ని విషయాలు చెప్పించాను. కానీ రైతులు చెప్పిన విషయాలనే సాటి రైతులు గుర్తు పెట్టుకుంటున్నారు, ఆచరణలో పెడుతున్నారు. రైతులు కొందరు వ్యవసాయ పరికరాలను సొంతంగా తయారు చేసుకుంటారు, ఉన్న పరికరాలను తమ అవసరాలకు అనుగుణంగా మలుచుకుంటూ ఉంటారు. అలాంటి వాటిని కూడా బాగా చూపించేవాడిని. పంటలను, రైతులను వెతుక్కుంటూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్రల్లో పర్యటించాను. లక్షకు పైగా కిలోమీటర్లు ప్రయాణించాను. పదమూడు వందలకు పైగా వీడియోలు చేశాను. నా రైతుబడికి పదమూడు లక్షలకు పైగా సబ్స్క్రైబర్లున్నారు. ఇప్పటి వరకు వన్ మ్యాన్ ఆర్మీలాగ నేనొక్కడినే పొలాలకు వెళ్లి కెమెరా ఆన్ చేసి రైతుతో మాట్లాడేవాడిని. ఆ ఫుటేజ్ని మా మంజుల (భార్య) ఇంట్లో ఎడిట్ చేసిచ్చేది. ఈ మధ్యనే ఒక టీమ్ను తయారు చేసుకున్నాను. నా విజయగాధ నేనే రాసుకున్నాను! "నాలో ఎడతెగని ఆలోచన మొదలైంది. ఎంతోమంది సక్సెస్ స్టోరీలు రాశాను. నా సక్సెస్ స్టోరీని నేను రాసుకోలేనా అనిపించింది. నాలుగు సంస్థల్లో పని చేశాను. సంస్థ పేరు నా ఇంటిపేరుగా నా పేరుకు ముందు చేరుతోంది. కానీ నా పేరే సంస్థ పేరు కాలేదా? ఆ మధనంలో నుంచి పుట్టుకొచ్చిందే రైతుబడి. రైతుబడి అనే అమృతం పుట్టడానికి ముందు నా మదిమధనంలో అనేక గరళాలు కూడా కోరలు సాచాయి. సూపర్మార్కెట్, ‘రైతు పంట’ పేరుతో రైతుల ఉత్పత్తుల విక్రయం, ఇన్ షాట్ తరహాలో ‘లోకల్ న్యూస్ యాప్’ పేరుతో ఓ న్యూస్ యాప్, అదే పేరుతో ఓ యూ ట్యూబ్ చానెల్... వీటిలో కొన్ని భారీ వైఫల్యాలు, మరికొన్ని పాక్షిక విజయాలనిచ్చాయి. ఆ తర్వాత మరో నాలుగు యూ ట్యూబ్ చానెళ్లు కూడా పెట్టాను. అవి విజయవంతం కాలేదు, కానీ నన్ను విజయపథంలో నడిపించే మార్గదర్శకాలయ్యాయి." – జూలకంటి రాజేందర్ రెడ్డి, సోషల్ ఇన్ఫ్లుయెన్సర్, రైతుబడి యూట్యూబ్ చానెల్ గుర్తు పడుతున్నారు! ‘నాకు గుర్తింపు వచ్చింది’ అనే పెద్ద మాట చెప్పను. కానీ ఇప్పుడు ఏ ఊరికి వెళ్లినా నన్ను గుర్తు పడుతున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో వ్యవసాయం కోసం పని చేస్తున్న చానెళ్లలో రైతుబడి పెద్దది. ఇప్పుడు ఢిల్లీలో ప్రసంగించడానికి ట్రిపుల్ ఐటీ నుంచి ఆహ్వానం రావడానికి కారణం ఈ యూ ట్యూబ్ చానెలే. నేననుకున్నట్లే నా సంస్థపేరు నా పేరు కలిసి ‘రైతుబడి రాజేందర్’నయ్యాను. ఇది కాకుండా నేను చేరాల్సిన లక్ష్యాలు రెండున్నాయి. ఒకటి... వ్యవసాయంలో అనుభవాలు పంచుతున్న రైతుబడి తరహాలోనే మరో వేదిక ద్వారా వ్యాపార అనుభవాలను యువతకు చేర్చడం, కొత్త ఎంటర్ప్రెన్యూర్లను తయారు చేయడం. ఇప్పటికే బిజినెస్ బుక్ పేరుతో ఆ ప్రయత్నం మొదలైంది. మరొకటి వ్యవసాయ భూమిని కొనుక్కోవడం. నేను డిగ్రీలో ఉన్నప్పుడు నాన్న ΄ోయారు. అనివార్యమైన పరిస్థితుల్లో మా పొలాన్ని అమ్ముకున్నాం. కొద్దిగానైనా వ్యవసాయభూమిని కొని మా అమ్మకు బహుమతిగా ఇవ్వాలి. రైతు కుటుంబంలో పుట్టిన వాళ్లం భూమితో బంధాన్ని తెంచుకోలేం’’ అన్నారు రాజేందర్రెడ్డి. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఇవి చదవండి: నారి వారియర్! -
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో! అమెరికా బతుకమ్మ ఉయ్యాలో!!
‘‘ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ... ఏమేమి కాయొప్పునే గౌరమ్మ! తంగేడు పువ్వులో... తంగేడు కాయలో... ఆట చిలుకలు రెండు... పాట చిలుకలు రెండు...’’ ‘‘చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దులగుమ్మ బంగారు బొమ్మ దొరికేనమ్మా ఈ వాడలోన...’’ ‘‘ఇలా ఒకటా... రెండా... లెక్కలేనన్ని బతుకమ్మ పాటలు మా నాలుకల మీద నాట్యమాడుతుంటాయి. గ్రామాల్లో గడిచిన బాల్యం జీవితాన్ని నేర్పుతుంది. తెలంగాణ గ్రామాల్లో బాల్యం బతుకమ్మ పాటల రూపంలో సమాజంలో జీవించడాన్ని నేర్పుతుంది. నిరక్షరాస్యులు కూడా ఈ పాటలను లయబద్ధంగా పాడతారు. బతుకమ్మ పాటల సాహిత్యం వాళ్ల నాలుకల మీద ఒదిగిపోయింది. తమకు తెలిసిన చిన్న చిన్న పదాలతో జీవితాన్ని అల్లేశారు గ్రామీణ మహిళలు. మా నాన్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఇంజనీర్. మా అమ్మమ్మ గారి ఊరు జగిత్యాల జిల్లా, వెలుగుమాట్ల. నా చదువు పుట్టపర్తిలో, సెలవులు అమ్మమ్మ ఊరిలో. దసరా సెలవులు వస్తున్నాయంటే సంతోషం అంతా ఇంతా కాదు. దేశమంతా దేవీ నవరాత్రులు జరుపుకుంటూ ఉంటే మేము బతుకమ్మ వేడుకలు చేసుకుంటాం. గౌరమ్మ అందరి మనసుల్లో కొలువుంటుంది, మాట, పాట, ఆట అన్నీ గౌరమ్మ కోసమే అన్నట్లు ఉంటుందీ వేడుక. ఇంత గొప్ప వేడుకకు దూరమయ్యానని అమెరికా వెళ్లిన తర్వాత కానీ తెలియలేదు. అందుకే అమెరికాలో బతుకమ్మను పేర్చాను’’ అన్నారు దీప్తి మామిడి... కాదు, కాదు, బతుకమ్మ దీప్తి. ‘‘నేను 2007లో యూఎస్కి వెళ్లాను. న్యూజెర్సీలో ఉండేవాళ్లం. పెళ్లయి, ఒక బిడ్డకు తల్లిని. భర్త, పాప, ప్రొఫెషన్తో రోజులు బిజీగా గడిచిపోయేవి. డబ్బు కూడా బాగా కనిపించేది. కొద్ది నెలల్లోనే... ఏదో మిస్సవుతున్నామనే బెంగ మొదలైంది. వ్యాక్యూమ్ ఏమిటనేది స్పష్టంగా తెలియలేదు, కానీ బాల్యం, సెలవుల్లో బతుకమ్మ వేడుక మరీ మరీ గుర్తుకు వస్తుండేది. బతుకమ్మ కోసం ఇండియాకి రావడం కుదరకపోతే నేనున్న చోటే బతుకమ్మ వేడుక చేసుకోవచ్చు కదా! అనిపించింది. అలా అక్కడున్న తెలుగువాళ్లను ఆహ్వానించి బతుకమ్మ వేడుక చేశాను. మొదటి ఏడాది పదిహేను మందికి లోపే... పదేళ్లు దాటేసరికి ఆ నంబరు ఐదారు వందలకు చేరింది. అందరికీ భోజనాలు మా ఇంట్లోనే. ఏటా ఒక పెళ్లి చేసినట్లు ఉండేది. ఇండియా నుంచి తెలంగాణ పిండివంటలను తెప్పించుకోవడం, ఆ రోజు వండుకోవాల్సినవన్నీ మా ఇంట్లోనే వండడం, ఆ వంటల కోసం దినుసులను సేకరించడం, స్నేహితులందరినీ ఆహ్వానించడం, పూలు తెచ్చుకుని ఒక్కొక్కటీ పేర్చడం... ఇలా ప్రతి ఘట్టాన్నీ ఎంజాయ్ చేసేదాన్ని. ‘ఏటా అంతంత ఖర్చు ఎందుకు’ అని స్నేహితులు అనేవాళ్లే కానీ మా వారు ఒక్కసారి కూడా అడగలేదు. నా సంతోషం కోసం చేసుకుంటున్న ఖర్చు అని అర్థం చేసుకునేవారు. ఎప్పుడూ అన్నం ఉంటుంది! యూఎస్లో మా ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద ఎప్పుడూ అన్నం, కూరలుండేవి. మా కన్సల్టెన్సీకి వచ్చిన వాళ్లు, ముఖ్యంగా బ్యాచిలర్స్ కోసం ఈ ఏర్పాటు. మేము యూఎస్లో అడుగుపెట్టిన కొన్నాళ్లకే రెసిషన్ వచ్చింది. అప్పుడు పడిన ఇబ్బందులు నాకిప్పటికీ గుర్తే. అందుకే యూఎస్కి వచ్చిన కుర్రాళ్లు మన తెలుగింటి రుచులతో భోజనం చేస్తారు కదా! అనుకునేదాన్ని. షడ్రసోపేతమైన భోజనం అని కాదు కానీ కనీసం పప్పుచారయినా ఉండేది. ఈ అలవాటుకు బీజం పడింది కూడా అమ్మమ్మ దగ్గరే. అమ్మమ్మ పెద్ద పాత్రలో అంబలి చేయించి ఇంటి ముందు పెట్టేది. చాలామంది పొలం పనులకు వెళ్తూ దారిలో మా ఇంటి ముందాగి అంబలి తాగి, ఆవకాయ ముక్క చప్పరించుకుంటూ వెళ్లేవాళ్లు. ఆకలి తీర్చడంలో, అవసరమైన వాళ్లకు సహాయం చేయడంలో ఉండే సంతృప్తి మరి దేనిలోనూ ఉండదు. మా డ్రైవర్ ఇతర పనివాళ్ల పిల్లల చదువు కోసం ఫీజులు కట్టినప్పుడు మరొకరి జీవితానికి మనవంతు సహాయం చేస్తున్నామనే భావన సంతృప్తినిస్తుంది. అవకాశం లేనప్పుడు ఎలాగూ చేయలేం, వెసులుబాటు ఉన్నప్పుడయినా చేసి తీరాలి. మన ఎదుగుదల కోసం సమాజం నుంచి మనం తీసుకుంటాం, మనం ఎదిగిన తరవాత మరొకరి ఎదుగుదల కోసం ఆపన్న హస్తాన్ని అందించి తీరాలనేది పుట్టపర్తి స్కూల్ నేర్పించిన వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్. మా అమ్మ ఫ్రెండ్ లీలా ఆంటీ కూడా బతుకమ్మ పండుగను బాగా చేసేవారు. ఆమె ఎన్విరాన్మెంట్ యాక్టివిస్ట్. గునుగుపూలు వాటర్బాడీస్ని శుద్ధి చేస్తాయని చెప్తూ ఈ పండుగ వెనుక ఉన్న పర్యావరణ పరిరక్షణను వివరించేవారు. ఇవన్నీ మైండ్లో ఒక్కటొక్కటిగా అల్లుకుంటూ ఇలా దండ కూర్చుకున్నాయి. బతుకమ్మ దీప్తినయ్యాను! యూఎస్ జీవితం నాకు చాలా నేర్పించిందనే చెప్పాలి. అక్కడ అన్నీ ఉంటాయి కానీ ఏదో లేదనే వెలితి. రొటీన్ లైఫ్ని జాయ్ఫుల్గా మలుచుకోవడానికి నాకు బతుకమ్మ ఒక దారి చూపించింది. అప్పట్లో యూఎస్ ఇంతగా ఇండియనైజ్ కాలేదు. ఇప్పుడైతే న్యూజెర్సీ, డాలస్తోపాటు కొన్ని నగరాలు పూర్తిగా భారతీయలవే అన్నట్లు, తెలుగువాళ్ల ఊళ్లే అన్నట్లయిపోయాయి. మన పండుగలు ఇప్పుడు అందరూ చేసుకుంటున్నారు. నేను మొదలుపెట్టడంతో నేను బతుకమ్మ దీప్తినయ్యాను. ‘దీప్తి మామిడి’గా అమెరికాలో అడుగుపెట్టాను. మూడేళ్ల కిందట తిరిగి వచ్చేటప్పటికి నా పేరు ‘బతుకమ్మ దీప్తి’గా మారింది. బతుకమ్మ పాటకు మ్యూజిక్ మొదలైతే చాలు... ఒళ్లు పులకించిపోతుంది. పూనకం వచ్చినట్లే ఉంటుంది. మీతో మాట్లాడుతున్నా సరే... బతుకమ్మ ఫీల్ వచ్చేస్తుంది. చూడండి గూజ్బంప్స్ వచ్చేశాయి’’ అని చేతులను చూపించారు బతుకమ్మ దీప్తి. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
పట్టుదారంతో జీవితాన్ని అల్లుకుంది
నేనేంటి? నాకంటూ చెప్పుకోవడానికి ఏమీ లేదా? ఈ ప్రశ్నలు పావనిని వెంటాడాయి... వేధించాయి. చదువుంది... పెద్ద ఉద్యోగం చేయాలనే ఆకాంక్ష ఉంది. అబ్దుల్ కలామ్ చెప్పినట్లు పెద్ద కలలు కన్నదామె. ఆ కలలను నిజం చేసుకోవడానికి తగినట్లు శ్రమించింది కూడా. జీవితం మాత్రం... ఆమె చదవని సిలబస్తో పరీక్ష పెట్టింది. ఆ పరీక్షను సహనంతో ఎదుర్కొన్నది... ఉత్తీర్ణత సాధించింది. ఇక... తనను తాను నిరూపించుకోవాలనుంది. క్రియేటివిటీ ఆమెకు తోడుగా వచ్చి వెంట నిలిచింది. ఆమె ఇప్పుడు పట్టుదారంతో చక్కటి ఆభరణాలల్లుతోంది. పావని కోరెం... వరంగల్ జిల్లా, హన్మకొండలో పుట్టింది. బయో టెక్నాలజీలో గ్రాడ్యుయేషన్ చేసింది. ఇంకా చదవాలని, మంచి ఉద్యోగం తెచ్చుకోవాలని అనుకుంది. ఆమె ఆలోచనలకు భర్త అండగా నిలిచారు. పెళ్లి తర్వాత హైదరాబాద్లో కాపురం, ఉస్మానియాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్లో చేరింది. బయో ఇన్ఫర్మాటిక్స్లో పీజీ పూర్తయింది. పోటీ పరీక్షల కోసం భార్యాభర్తలిద్దరూ కలిసి కోచింగ్కెళ్లారు. పరీక్షలకు సిద్ధమయ్యేలోపు జీవితం మరో పరీక్ష పెట్టింది. కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి చిన్న సందేహం. ఆ సందేహాన్ని నిజం చేయడానికా అన్నట్టు పుట్టగానే బిడ్డ ఏడవలేదు. నెలరోజులు హాస్పిటల్లోనే ఉంచి చికిత్స చేయించుకుని ఇంటికి వచ్చారు. స్పెషల్ కిడ్ కావచ్చనే మరో సందేహం. క్షణక్షణం బిడ్డ సంరక్షణలోనే గడిచిపోయింది. అనుక్షణం బిడ్డ ఎదుగుదల కోసం శ్రమించింది. తల్లిగా కఠోరయజ్ఞమే చేసింది. ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీలతో బాబుని మెయిన్స్ట్రీమ్లోకి తీసుకు రాగలిగింది. ఈ ఒత్తిడి నుంచి బయటపడడానికి తాను ఆశ్రయించిన ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ నుంచి తనను తాను తీర్చిదిద్దుకుంది. తనను తాను నిరూపించుకోవాలనే తపనతో పని చేసింది. ఇప్పుడామె తన సృజనాత్మకతతో గుర్తింపు పొందుతోంది. తన జీవితంలో దశాబ్దంపా టు సాగిన కీలక పరిణామాలను ఆమె సాక్షితో పంచుకున్నారు. ఊహించని శరాఘాతం! ‘‘మా పెళ్లి 2009లో జరిగింది. బాబు ఏడీహెచ్డీ (అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్) సమస్య ఉందని తెలిసింది. బోర్లా పడడం, పా కడం, కూర్చోవడం, నడవడం వంటివన్నీ కొంత ఆలస్యంగా చేశాడు. నార్మల్ కిడ్ చేయాల్సిన సమయానికంటే ఎంత ఆలస్యమవుతోందా అని క్యాలెండర్ చెక్ చేసుకుంటూ... కంటికి రెప్పలా కాపా డుకుంటూ వచ్చాను. ఇప్పుడు దాదాపుగా నార్మల్ కిడ్ అయ్యాడు. కానీ చిన్నప్పుడు రోజూ ఆందోళనే. బరువు తక్కువగా పుట్టడంతో ఇమ్యూనిటీ తక్కువగా ఉండేది. తరచూ జలుబు, జ్వరం వస్తుండేవి. అప్పట్లో మా వారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూరులో ఉద్యోగం. కర్నాటకలో ఓ చిన్న గ్రామంలో పోస్టింగ్. అక్కడ వైద్య సదుపా యాలు తక్కువ. ప్రతినిత్యం భయంభయంగా గడిచేది. రెండున్నరేళ్లకే బాబుకి హెర్నియా ఆపరేషన్ చేయించాల్సి వచ్చింది. స్టేట్ బ్యాంకుకు అనేక అనుబంధ బ్యాంకుల్ని అనుసంధానం చేయడం కూడా అప్పుడే జరిగింది. ఎస్బీఐకి మారి హైదరాబాద్కి వచ్చేశాం. మన ్రపా ంతానికి వచ్చిన తర్వాత నన్ను వెంటాడిన భయం వదిలిపోయింది. బాబుకి మంచి వైద్యం చేయించగలమనే ధైర్యం వచ్చింది. ట్రీట్మెంట్ థెరపీలు జరిగేకొద్దీ బాబులో మెరుగుదల స్పష్టంగా కనిపిస్తుండేది. డిప్రెషన్ నుంచి మెల్లగా బయటపడ్డాను. రోజులు ఆశాజనకంగా గడుస్తున్నప్పటికీ నాలో ఏదో వెలితి ఉండేది. సృజనతో సాంత్వన నన్ను నేను ఏదో ఒక వ్యాపకంలో నిమగ్నం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండేదాన్ని. యూ ట్యూబ్ చూసి నేర్చుకున్న పేపర్ క్విల్లింగ్ మంచి సాంత్వననిచ్చింది. బాబుకి ఫిజియోథెరపీ చేయించే ట్రైనర్ నేను క్విల్లింగ్లో చేసిన పూలు, బొమ్మలను చూసి, చాలా బాగున్నాయని తీసుకెళ్లారు. వాటిని ఆ రోజే వాళ్ల హాస్టల్ స్టూడెంట్స్ కొనుక్కున్నారు. అప్పుడే మా ఫ్రెండ్ పట్టు దారంతో ఆభరణాలు తయారు చేయమని చెప్పింది. అలా నా లైఫ్ కొత్త మలుపు తీసుకుంది. హాబీగా మొదలు పెట్టిన యాక్టివిటీ కాస్తా నాకు ఒక ప్రత్యేకమైన గుర్తింపునిచ్చింది. తెలిసిన వాళ్ల నుంచి నా సృజనాత్మకత ఎల్లలు దాటింది. దుబాయ్, యూఎస్, యూకే, చైనా ల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. ఫేస్బుక్ బిజినెస్ పేజ్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, జస్ట్ డయల్, మీ షోలలో నా అల్లికలు విపరీతంగా అమ్ముడవుతున్నాయి. రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వడానికి బల్క్ ఆర్డర్లు వస్తుంటాయి. అలాంటప్పుడు రాత్రంతా పని చేస్తుంటాను. ముగ్గురు అమ్మాయిలకు ఎంప్లాయ్మెంట్ ఇచ్చాను. మేము తయారు చేసిన ఉత్పత్తులను పికప్ బాయ్స్ వచ్చి తీసుకెళ్తారు. బాబును చూసుకుంటూ నా యాక్టివిటీని కొనసాగిస్తున్నాను. మొదట్లో అయితే మెటీరియల్ కోసం వెతుక్కుంటూ బాబును బండి మీద కూర్చోబెట్టుకుని బేగం పేట నుంచి బేగం బజార్కు వెళ్లేదాన్ని. ఇప్పుడైనా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తే వస్తుంది. కానీ బాబుకు ఇంకా నా అవసరం ఉంది. నేను దగ్గరుండి చూసుకుంటే మెరుగ్గా ఉంటుందనే ఉద్దేశంతో ఇప్పుడిలా కొనసాగిస్తున్నాను. నాకు నిజంగా ఆశ్యర్యమే! నా లైఫ్ జర్నీలో నాకు ఆశ్చర్యం, సంతోషం కలిగించే విషయం ఏమిటంటే... నన్ను రోల్మోడల్గా చూస్తూ నా నుంచి స్ఫూర్తి ΄ పొందుతున్న వాళ్లు ఉన్నారనే విషయం. అంతా బాగున్న వాళ్లు చాలామంది ఏమీ చేయకుండా ఉంటున్నారు. ఏదైనా సమస్య రాగానే దిగాలు పడిపోయి జీవితాన్ని నాలుగ్గోడలకు పరిమితం చేసుకునే వాళ్లున్నారు. కానీ... ‘సమస్యకు పరిష్కారం వెతుక్కుని, తనకు ఒక గుర్తింపును తెచ్చుకుంది’ అని ప్రశంసిస్తున్నారు. మా వాళ్లు మాత్రం మొదట్లో ‘నీకు ఇప్పుడు ఇవన్నీ ఎందుకు, పిల్లాడిని చూసుకుంటూ ప్రశాంతంగా ఉండు. ఇన్ని ఒత్తిడులు పెట్టుకోవద్ద’ని కోప్పడ్డారు. కానీ ఈ పని నాకు ఒత్తిడిని తగ్గిస్తోందని తెలిసి మా వాళ్లు కూడా సంతోషంగా ఉన్నారు. నేను ఎంతో సంపా దిస్తున్నానని కాదు, కానీ నేను ఎటువంటి ఉనికి లేకుండా లక్షల్లో ఒకరిలా ఉండిపోకుండా, ఈ పనివల్ల వందల్లో ఒకరిగా ఓ గుర్తింపు తెచ్చుకోగలిగాను’’ అంటున్నప్పుడు పా వని కళ్లలో ఆనందం వెల్లివిరిసింది. – వాకా మంజులారెడ్డి , సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
ప్రాణం నిలిపే రక్తపు బొట్టు
రక్తపు బొట్టు... ప్రాణాన్ని నిలబెడుతుంది. ఆ రక్తం సమయానికి అందకపోతే... ప్రాణాన్ని నిలపగలిగే డాక్టర్ కూడా అచేతనం కావాల్సిందే. శిబి చక్రవర్తిలా దేహాన్ని కోసి ఇవ్వాల్సిన పనిలేదు. కొంత రక్తాన్ని పంచి మరొక ప్రాణాన్ని నిలబెట్టవచ్చు. రక్తదానానికి మగవాళ్లతోపాటు మహిళలూ ముందుకొస్తున్నారు. మహిళలు రక్తదానం చేయరాదనే అపోహను తుడిచేస్తున్నారు. రక్తదానం చేస్తూ... సమాజాన్ని చైతన్యవంతం చేస్తూ ఉన్న ఓ మెడికో... ఓ సోషల్ యాక్టివిస్ట్ల పరిచయం ఇది. నాన్న మాట... యాభై సార్లు రక్తదానం చేయాలనే సంకల్పం కూడా మా నాన్న చెప్పిన మాటే. రక్తదానం చేయగలిగింది ఇరవై నుంచి అరవై ఏళ్ల మధ్యలోనే. అరవై తర్వాత రక్తదానం చేయడానికి ఆరోగ్యరీత్యా నిబంధనలు ఒప్పుకోవు. వీటికి తోడు ఆడవాళ్లకు ప్రసవాలు, పిల్లల పెంపకంలో మరో పదేళ్లు గడిచిపోతాయి. 35 నుంచి విధిగా రక్తదానం చేస్తూ యాభై సార్లు రక్తం ఇవ్వాలనే నియమాన్ని పెట్టుకోవాలనేవారు. ఆ లక్ష్యంతోనే యాభై రక్తదానాలు పూర్తి చేశాను. ఆ తర్వాత మా అమ్మకోసం మా తమ్ముడితోపాటు నేనూ రక్తం ఇచ్చాను కానీ దానిని ఈ లెక్కలో చెప్పుకోను. అమ్మరుణం ఏమిచ్చినా తీరేది కాదు. – గొట్టిపాటి నిర్మలమ్మ, రక్తదాత మా పుట్టిల్లు నెల్లూరు నగరం (ఆంధ్రప్రదేశ్). మా చిన్నాన్న జయరామనాయుడు డాక్టర్. ‘రక్తం అంది ఉంటే ప్రాణాన్ని కాపాడగలిగేవాళ్లం’ అని అనేకసార్లు ఆవేదన చెందేవారు. ఇంట్లో అందరినీ రక్తదానం పట్ల చైతన్యవంతం చేశారాయన. దాంతో మా నాన్న నెల్లూరులో రెడ్క్రాస్, బ్లడ్బ్యాంకు స్థాపించారు. ఇంట్లో అందరం రక్తదానం చేశాం. అలా నేను తొలిసారి బ్లడ్ డొనేట్ చేసినప్పటికి నా వయసు 20. మామగారి ప్రోత్సాహం పెళ్లికి ముందు నెల్లూరులో మొదలైన రక్తదాన ఉద్యమాన్ని పెళ్లయి అత్తగారింటికి నెల్లూరు జిల్లా, కావలి పట్టణానికి వెళ్లిన తర్వాత కూడా కొనసాగించాను. నలభై ఏళ్ల కిందట కావలి రక్తదాతల్లో మహిళలు దాదాపు పదిహేను మంది ఉండేవారు. రెడ్క్రాస్ సమావేశాలు మా ఇంట్లోనే జరిగేవి. అనేక క్యాంపులు కూడా నిర్వహించేవాళ్లం. కాలేజ్ స్టూడెంట్స్ ఉత్సాహంగా ముందుకు వచ్చేవాళ్లు. కానీ అలా ముందుకొచ్చిన అమ్మాయిల్లో బ్లడ్ తగినంత ఉంటే కదా! వందమంది ఆడపిల్లలు వస్తే రక్తదానం చేయగలిగిన ఎలిజిబులిటీ ఉన్న వాళ్లు ఆరేడుకు మించేవాళ్లు కాదు. అండర్ వెయిట్, హిమోగ్లోబిన్ శాతం తగినంత లేకపోవడం ఎక్కువగా కనిపించేది. అరుదైన గ్రూపుల వాళ్ల నుంచి కూడా బ్లడ్ క్యాంపుల్లో సేకరించేవాళ్లం కాదు. వాళ్లకు పరీక్షలు చేసి లిస్ట్ తయారు చేసుకుని ఎమర్జెన్సీ కండిషన్లో పిలుస్తామని చెప్పేవాళ్లం. అప్పట్లో బ్యాంకుల్లేవు నా వయసు 63. ఈ వయసులో కూడా ఇంత చురుగ్గా, ఆరోగ్యంగా ఉండగలుగుతున్నానంటే అందుకు రక్తదానమే కారణం. ఇప్పుడు బ్లడ్ డొనేషన్కు సౌకర్యాలు బాగున్నాయి. కానీ మొదట్లో బ్యాంకులు ఉండేవి కాదు. మా మామగారు మాజీ ఎమ్మెల్యే సుబ్బానాయుడు ప్రోత్సాహంతో మా బంధువులు ముందుకొచ్చి కావలి హాస్పిటల్లో రక్తదానం కోసం ఒక గది కట్టించారు. యాక్సిడెంట్ కేస్ రాగానే హాస్పిటల్ నుంచి మాకు ఫోన్ వచ్చేది. అప్పటికప్పుడు మా డోనర్స్లో పేషెంట్ బ్లడ్ గ్రూపుతో మ్యాచ్ అయ్యే డోనర్ ఎవరు అందుబాటులో ఉంటే వాళ్లు వెళ్లి రక్తం ఇచ్చేవాళ్లం. బ్లడ్ డోనర్స్ అంతా ఆరోగ్యంగా, అంటువ్యాధుల పట్ల విచక్షణతో ఉండాలి. చిన్నపాటి అనారోగ్యాలు వచ్చినా నిర్లక్ష్యం చేయకుండా పరీక్షలన్నీ చేయించుకుని రక్తదానం చేయడానికి సిద్ధంగా ఉండాలి. అవసరాన్ని బట్టి ఏడాదికి మూడు–నాలుగుసార్లు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. మా అమ్మాయి దగ్గరకు యూఎస్కి వెళ్లినప్పుడు అక్కడ కూడా ఓ సారి బ్లడ్ డొనేట్ చేశాను. అది అత్యవసర స్థితి కాదు, కేవలం యూఎస్లోనూ రక్తమిచ్చాననే సరదా కోసం చేసిన పని. మొత్తానికి అరవై ఏళ్లు నిండేలోపు యాభైసార్లు రక్తం ఇచ్చి మా నాన్న మాటను నెగ్గించాను. ఈ క్రమంలో ఎక్కువసార్లు రక్తదానం చేసిన మహిళగా గుర్తింపు వచ్చింది. గవర్నర్ అభినందించారు అప్పటి గవర్నర్ రంగరాజన్, ఆయన సతీమణి హరిప్రియా రంగరాజన్ దంపతులు 2000వ సంవత్సరంలో కావలికి వచ్చారు. ఆమె రెడ్క్రాస్లో చురుకైన సభ్యురాలు కూడా. రాజ్భవన్లో జరిగిన రెడ్క్రాస్ కార్యక్రమాల్లో కూడా నేను పాల్గొన్నాను. నన్ను కావలిలో చూసి ‘ఈ పురస్కారం అందుకుంటున్న నిర్మలవి నువ్వేనా’ అని ఆత్మీయంగా పలకరించారు. మహిళలకు మార్గదర్శి అంటూ గవర్నర్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ జ్ఞాపకాలన్నీ నా మనసులో ఉన్నాయి కానీ జ్ఞాపికలుగా దాచుకోవాలనే ఆలోచన కూడా ఉండేది కాదు. నా జీవితం అంతా ఎదురీతలోనే గడిచింది. ఆ ఎదురీతల్లో ఇవేవీ ప్రాధాన్యతాంశాలుగా కనిపించలేదప్పట్లో. మొత్తానికి మా చిన్నాన్న, నాన్న, మామగారు అందరూ బ్లడ్ డొనేషన్ పట్ల చైతన్యవంతంగా ఉండడంతో నాకు ఇంతకాలం ఈ సర్వీస్లో కొనసాగడం సాధ్యమైంది. ఇది నాకు సంతోషాన్నిచ్చే కార్యక్రమం కావడంతో ఇంట్లో ఎవరూ అడ్డుచెప్పేవాళ్లు కాదు’’ అని తన రక్తదాన ప్రస్థానాన్ని వివరించారు సోషల్ యాక్టివిస్ట్ నిర్మలమ్మ. రక్తదానం చేద్దాం! – శృతి కోట, రక్తదాత, వైద్యవిద్యార్థిని నేను పద్దెనిమిదేళ్ల వయసు నుంచి బ్లడ్ డొనేట్ చేస్తున్నాను. నా హిమోగ్లోబిన్ శాతాన్ని పరీక్షించుకుంటూ మూడు – నాలుగు నెలలకోసారి ఇచ్చేటట్లు చూసుకుంటున్నాను. ఈ మధ్య హెపటైటిస్ వ్యాక్సిన్ కారణంగా కొంత విరామం వచ్చింది. మా నాన్న సంపత్కుమార్ బ్లడ్ డోనర్ కావడంతో నాకు చిన్నప్పటి నుంచి ఆసక్తి ఉండేది. రక్తదానానికి మహిళలు, మగవాళ్లు అనే తేడా పాటించక్కర్లేదు. అయితే భారతీయ మహిళల్లో రక్తహీనత ఎక్కువ మందిలో ఉంటోంది కాబట్టి కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటూ రక్తదానం చేయవచ్చు. హిమోగ్లోబిన్ పన్నెండు శాతానికి తగ్గకూడదు. డయాబెటిస్, పీసీఓడీ, థైరాయిడ్ సమస్యలతోపాటు లాస్ట్ పీరియడ్లో రక్తస్రావం స్థాయులను దృష్టిలో ఉంచుకుని రక్తదానం చేయవచ్చు. పాలిచ్చే తల్లులు రక్తదానం చేయకూడదు. మెనోపాజ్ దశలో ఉన్న వాళ్లు డాక్టర్ సూచన మేరకు ఇవ్వవచ్చు. ఇక మహిళలు, మగవాళ్లు అందరూ రక్తదానం చేయడానికి ముందు చెక్లిస్ట్ ప్రకారం అన్ని పరీక్షలు చేయించుకుని ఆరోగ్యంగా ఉన్నట్లు ధ్రువీకరించుకోవాలి. ఎయిడ్స్, హెపటైటిస్, మలేరియా, సమీప గతంలో ఏవైనా ఇన్ఫెక్షన్లకు గురవడం, వ్యాక్సిన్లు వేయించుకోవడం, ఇతర అనారోగ్య సమస్యలకు మందులు వాడుతూ ఉండడం వంటి కండిషన్స్కు స్క్రీనింగ్ జరిగిన తర్వాత మాత్రమే రక్తాన్ని సేకరిస్తారు. రక్తం ఇవ్వాలనే ఉత్సాహం ఉన్నప్పటికీ తమ దేహ సామర్థ్యాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. బ్లడ్ డోనార్స్ మంచి ఆహారం, తగినంత నీరు తీసుకోవడంతోపాటు, క్రమం తప్పకుండా వ్యాయామం కూడా చేస్తుండాలి. రక్తదానం చేస్తుంటే ఎప్పటికప్పుడు కొత్త కణాలు పుట్టుకొస్తూ దేహం ఆరోగ్యంగా ఉంటుంది. ‘రక్తాన్ని ఇవ్వండి, ప్రాణాన్ని కాపాడండి’ అనేదే మెడికోగా నా సందేశం. ప్రమాదంలో గాయపడిన తొలి గంటను గోల్డెన్ అవర్ అంటాం. ఆ గంటలో వైద్య చికిత్స జరగడం ఎంత అవసరమో వైద్యానికి రక్తం అందుబాటులో ఉండడమూ అంతే అవసరం. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
అవకాశాలను సృష్టించుకోవాలి!
‘డ్రీమ్ బిగ్, ఫాలో యువర్ పాషన్, వర్క్ హార్డ్, వర్క్ స్మార్ట్’... నాలుగు మాటలు. ఈ నాలుగు మాటలే వీణాగుండవెల్లిని విజేతగా నిలబెట్టాయి. ‘ఇలా ముందుకెళ్లమని నాకెవ్వరూ చెప్పలేదు. స్వీయశోధన తో తెలుసుకున్న సత్యాలివి. కొత్తతరానికి నేను చెప్పగలిగిన సూచన ఇది. నేను ఆచరించిన మార్గమే నా సందేశం’ అన్నారామె. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ చేసిన వీణ ఆ తర్వాత యూఎస్ వెళ్లి శాంటాక్లారా యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ ఇంజనీరింగ్లో మాస్టర్స్ చేశారు. యూఎస్లోని సిలికాన్ వ్యాలీ కేంద్రంగా ఇమాజియా సాఫ్ట్వేర్ కంపెనీని నిర్వహిస్తున్న వీణ ఇటీవల హైదరాబాద్కి వచ్చినప్పుడు సాంకేతిక రంగంలో విజయవంతమైన తన జర్నీని ఆమె ‘సాక్షి’తో పంచుకున్నారు. ‘‘యూఎస్లో నేను కానన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, సిస్కో సిస్టమ్స్లో పని చేసిన తర్వాత టెక్నాలజీ రంగంలో సొంత కంపెనీ ప్రారంభించాను. ఇంటర్నెట్ మొదలైన రోజులు, అలాగే వైటూకే క్రైసిస్ ఎదురైన రోజులు కూడా. ఆ సమస్యలను అధిగమిస్తూ ఇంటర్నెట్ ఆధారిత ఫైనాన్స్ అప్లికేషన్స్ సర్వీసులందించింది మా సంస్థ. ఈ టెక్నాలజీకి భవిష్యత్తు ఉందని నమ్మాను, నా నమ్మకమే పునాదిగా ముందుకెళ్లాను. ఒక దశ తరవాత కంపెనీ కార్యకలాపా లను విస్తరించాలనే ఉద్దేశంతో వెంచర్ క్యాపిటల్ ద్వారా ఫండ్ రైజింగ్ మొదలుపెట్టాను. మా కంపెనీ సేవల పట్ల నమ్మకం కలిగినప్పటికీ పెట్టుబడులు పెట్టడానికి చాలామంది ముందడుగు వేయలేక΄ోయారు. అందుకు కారణం మహిళను కావడమే. నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది, నేను కాన్ఫిడెంట్గా ముందుకెళ్తున్నాను. ఆ మేరకు పెట్టుబడి పెట్టేవాళ్లలో విశ్వాసం కలిగించడం కొంచెం కష్టమైందనే చెప్పాలి. కష్టం అని వదిలిన వాళ్ల వెంట సక్సెస్ రాదు. కష్టాన్ని జయించడమే విజయానికి తొలిమెట్టు. మొత్తానికి నాకున్న సాంకేతిక పరిజ్ఞానం పట్ల విశ్వాసం కలిగిన తరవాత పెట్టుబడులు పెట్టారు. కానీ ఆ తర్వాత ‘మీ కంపెనీలో మా ప్రతినిధి సీఈవో హోదాలో ఉంటారు. మీరు టెక్నాలజీ పా ర్ట్ చూసుకోండి’ అన్నారు. ఆ షరతును అంగీకరించాల్సి వచ్చింది. కానీ ఆ ప్రయత్నం విజయవంతం కాలేదు. టాప్లో ఉన్న మా కంపెనీ ఒడిదొడుకులకు లోనయింది. తిరిగి టాప్లో నిలపడానికి నేను చాలా కష్టపడాల్సి వచ్చింది. ముందుచూపు ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ వినియోగం ఇప్పుడు బాగా ఎక్కువైంది. మేము 2015లోప్రోడక్ట్ బిల్డ్ చేశాం. సాంకేతిక రంగానికి ఏఐని పరిచయం చేశామని చెప్పాలి. ఆ తర్వాత మూడేళ్లకు కృత్రిమ మేధ ఆధారిత ఆర్థిక సహకారాన్ని డిజిటల్గా అందించడం మొదలుపెట్టాం. మరో రెండేళ్లలో ఫైనాన్షియల్ డాక్యుమెంట్లను చదివి, ప్రాజెస్ చేయగలిగిన తొలి ఏఐ ఇంజన్ను తీసుకొచ్చాం. ఈ రంగంలో మేమిచ్చిన డైరెక్షన్ను ముందుచూపున్న కంపెనీలు అందుకున్నాయి. మేము ఏఐ ఆధారిత డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నాం. ఆర్థిక లావాదేవీలు వేగంగా జరుగుతుంటే వ్యాపా రం కూడా అంతే వేగంగా జరుగుతుంది. ఓటూసీ (ఆర్డర్ టూ కస్టమర్) ్రపా సెస్ని మా కంపెనీ చేస్తుంది. తొంభై దేశాల్లో, 25 భాషల్లో మా సేవలందింస్తున్నాం. భవిష్యత్తు దర్శనం విజేత కావాలంటే భవిష్యత్తును దర్శించగలగాలి. ఆలోచనను ఆచరణలో పెట్టడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుకడుగు వేయకూడదు. అలాగే అవకాశాలను అందిపుచ్చుకోవడమనేది పా త మాట. అవకాశాలను సృష్టించుకోవాలనేది ఈ జనరేషన్ అనుసరించాల్సిన ఫార్ములా. హెన్రీ ఫోర్డ్ ఒక ఇంజనీర్గా మిగిలిపోలేదు. తన ఆలోచనతో రవాణాకు యంత్రంతో నడిచే కారు అనే వాహనానికి రూపకల్పన చేసి పా రిశ్రామికవేత్త అయ్యాడు. గుర్రం మీద ప్రయాణించే కాలాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లాడు. మన ఆలోచన సమాజానికంటే ముందుండాలి. అది శతాబ్దం కావచ్చు, దశాబ్దం కావచ్చు. ఆ సమయానికి సమాజం మన ఆలోచనను స్వాగతించవచ్చు లేదా విమర్శించనూ వచ్చు. కానీ దానిని నిరూపించిన తరవాత మన వెంట నడిచి తీరుతుంది’’ అన్నారు వీణా గుండవెల్లి. ఆమె తన విజయాలనే పా ఠ్యాంశాలుగా కాలిఫోర్నియా యూనివర్సిటీలో బోధిస్తున్నారు. అల్పాదాయ వర్గాల వారికి సహాయం చేయడానికి టచ్ ఏ లైఫ్ పేరుతో ఒక ఫౌండేషన్ ద్వారా సేవలందిస్తున్నారు. అలాగే పర్యావరణ పరిరక్షణ, సామాజిక ప్రయోజనం చేకూరే స్టార్టప్లతో ముందుకు వచ్చే యువతకు చేయూతనిస్తున్నారు. ఈ ప్రయాణంలో ఆమెను వరించిన అవార్డుల ప్రస్తావనకు ఆమె ‘ఎన్నని చెప్పాలి, అయినా ఆ లెక్క ఇప్పుడెందుకు’ అన్నారు నవ్వుతూ. – వాకా మంజులారెడ్డి -
గుస్సాడి గుండెచప్పుడు పద్మశ్రీ కనకరాజు
నెమలీకల టోపీ ధరించి కోలాహలంగా ఆడతారు. రేలా... రే... రేలా అంటూ గొంతు కలిపి పా డతారు. ప్రకృతి గురువు నేర్పిన పా ఠాలకు ఆనవాళ్లు వారు. మొన్నటి వరకు అడవి తల్లి ఒడిలో దాగిన కళారూపా లివన్నీ. నేడవి అడవి గోడలు దాటి నగరాన్ని ఉర్రూతలూగిస్తున్నాయి. దేశం ఎల్లలు కూడా దాటే వరకు గుస్సాడి ఆడాలంటున్నారు... పద్మశ్రీ కనకరాజు. కనకరాజు పేరులో ఇంటి పేరు కనక, ఆయన పేరు రాజు. ఇన్ని వివరాలు మాకక్కర్లేదు, గుస్సాడి నృత్యం చేస్తాడు, మా అందరి చేత అడుగు వేయిస్తాడు కాబట్టి ఆయన మాకు ‘గుస్సాడి రాజు’ అంటారు స్థానికులు. ఆయన పద్మశ్రీ అందుకున్నప్పటి నుంచి నాగరక ప్రపంచం ఆయన మీద దృష్టి కేంద్రీకరించింది. కనకరాజు అని ఇంటిపేరుతో కలిసి వ్యవహారంలోకి వచ్చారు. అయినప్పటికీ వారి గూడేలకు వెళ్లి కనకరాజు అని అడిగితే వెంటనే గుర్తుపట్టరు. గుస్సాడి కనకరాజు అంటే టక్కున చెప్పేస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మర్హలి ఆయన ఊరు. ప్రస్తుతం కుమ్రుం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా, అంతేకాదు, కుమ్రుం భీమ్ వారసులు కూడా. ఆదిలాబాద్లో విస్తరించిన గోంద్ తెగకు చెందిన వాళ్లందరూ భీమ్ వారసులుగా గర్వంగా భావిస్తారు. ఎనభై ఏళ్ల కనకరాజు... తండ్రి చెప్పిన మాట కోసం గుస్సాడి నృత్యం పరిరక్షణకు జీవితాన్ని అంకితం చేశారు. గుస్సాడితో మమేకమైన తన జీవితానుభవాలను సాక్షితో పంచుకున్నారాయన. ఆట... పా ట... జీవితం! ‘‘మా ఆదివాసీల జీవనంలో ప్రకృతి, నృత్యం, గానం కలగలిసి పోయి ఉంటాయి. బిడ్డ పుడితే పా ట, పెళ్లి వేడుకకీ పా ట, అంతేకాదు... మనిషి పోయినా పా ట రూపంలో ఆ వ్యక్తితో మా అనుబంధాన్ని గుర్తు చేసుకుంటాం. దండారీ ఉత్సవాలంటే మాకు ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది. మగపిల్లలకు నృత్యం, ఆడపిల్లలకు రేలా పా ట చిన్నప్పటి నుంచే నేర్పిస్తాం. గుస్సాడి నృత్యంలో అడుగులు వేయడం ఎప్పుడు మొదలైందో నాకు గుర్తు లేదు. కానీ మా నాన్న ఒక మాట చెప్పేవారు. ‘ఈ నృత్యమే మనకు దైవం. ‘ఈ నృత్యాన్ని మరువద్దు. తరతరాలుగా మోసుకొస్తున్నాం. దీన్ని కాపా డుకుంటేనే దేవుడు మనల్ని కాపా డుతాడు’ అని చెప్పేవాడు. ఆ మాట నాలో నాటుకుపోయింది. నాకు వయసొచ్చినప్పటి నుంచి నృత్యంలో తొలి ఆటగాడిగా అడుగులు వేస్తుండేవాణ్ని. ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీలు నివసించే రెండువేల గూడేలకూ నేను తెలిసిపోయాను. గణతంత్ర వేడుక గణతంత్ర వేడుకల్లో మా ప్రాచీన వారసత్వ కళ అయిన గుస్సాడి నృత్యాన్ని ప్రదర్శించే అవకాశం నాకు 1982లో వచ్చింది. అప్పుడు ప్రధానమంత్రి ఇందిరాగాంధీకి మా గుస్సాడి టోపీ పెట్టించి, గజ్జెలు కట్టించాం. ఆమె మాతో అడుగులు వేసింది. ఆ తర్వాత ఓసారి అబ్దుల్ కలామ్ కూడా మాతో అడుగులు వేశారు. హైదరాబాద్లో ఎన్ని ప్రదర్శనలిచ్చామో లెక్కేలేదు. ఢిల్లీలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో కూడా మా గుస్సాడిని ప్రదర్శించాం. మరో పది దఫాలు యువతతో చేయించాం. నాయన మాట మీద గుస్సాడి కోసం బతికినందుకే మా దేవుడు మెచ్చి గొప్ప వాళ్లకిచ్చే పద్మశ్రీని ఇప్పించాడనుకుంటున్నా. నెమలీకల టోపీ మా నృత్యం సాధన చేయడమే కాదు, టోపీ, దుస్తులు, గజ్జెలు అన్నీ ప్రత్యేకమే. వాటిని తయారు చేయడానికి చాలా నైపుణ్యం ఉండాలి. పెద్ద టోపీకి రెండు వేల పింఛాలుంటాయి. మా ఇళ్లలో వాటిని భద్రపరుచుకోవడం పెద్ద పని. మా ముత్తాతలు ధరించిన టోపీ ఇంకా నేను ధరిస్తూనే ఉన్నాను. కొత్తవాళ్ల కోసం టోపీలు తయారు చేస్తున్నాం. పెద్ద టోపీ, దుస్తులతోపా టు మొత్తం వేషానికి ఇరవై వేల రూపా యలవుతాయి. మా ఆదివాసీ వ్యక్తి తుకారామ్ సాబ్ కలెక్టర్ అయిన తరవాత ఈ నృత్యానికి ఇంకా కొన్ని చేర్పులు చేసి బాగా మంచిగా చేశారు. పద్మశ్రీ వచ్చిన తర్వాత ఐటీడీఏ ఆఫీసర్లు గుస్సాడి నృత్యం నేర్పించడానికి వందకు పైగా బడులు పెట్టారు. ఒక్కో బడిలో రెండు– మూడు వందల మంది నేర్చుకుంటున్నారు. నేను పెద్ద మాస్టర్ (చీఫ్ డాన్స్ మాస్టర్)ని. గుస్సాడి, రేలా పా ట నేర్పించడానికి 30 మందిని ప్రత్యేకంగా తయారు చేశాను. మరో రెండు వందల మందికి సంపూర్ణంగా శిక్షణనిచ్చాను. ఇంక మామూలుగా నేర్చుకుని ఆడే వాళ్లు ఎన్ని వేల మంది ఉన్నారో నేను ఎప్పుడూ లెక్క చెప్పుకోలేదు. అడవి తల్లికి అందరూ ఒక్కటే! మా ఆదివాసీల్లో మగపిల్లాడు ఎక్కువ, ఆడపిల్ల తక్కువనే ఆలోచనే ఉండదు. బిడ్డలంతా సమమే. పెళ్లిలో కట్నకానుకలు ఉండవు. ఆడబిడ్డ పుట్టిందని చింతపడడం మాకు తెలియదు. నాకు ఎనిమిది మంది కూతుళ్లు, ముగ్గురు కొడుకులు. బతకడానికి ఆశ్రమ పా ఠశాలలో రోజు కూలీగా పని చేస్తూ కూడా అందరికీ చదువు చెప్పించాను. తొమ్మిది– పది తరగతుల వరకు అందరూ చదువుకున్నారు. రెండో కొడుకు వెంకటేశ్ మాత్రం డిగ్రీ చదివి టీచర్ ఉద్యోగం చేస్తున్నాడు. తరతరాలుగా అడవులకే పరిమితమైపోయిన గుస్సాడి నృత్యాన్ని నేను దేశానికి తెలియ చెప్పా ను. మీరు మన ఆట, పా టలను ఇతర దేశాలకు తీసుకెళ్లాలని నా పిల్లలు, శిష్యులకు చెబుతున్నాను’’ అని తన ఆకాంక్షను వ్యక్తం చేశారు గుస్సాడి కనకరాజు. – వాకా మంజులారెడ్డి -
Chintala Posavva: దివ్య సంకల్పం
జీవితానికి పరీక్షలు అందరికీ ఉంటాయి. బతుకు పరీక్షాపత్రం అందరికీ ఒకలా ఉండదు. ప్రతి ఒక్కరికీ ఒక్కో పత్రాన్ని నిర్దేశిస్తుంది ఎవరి పరీక్ష వారిదే... ఎవరి ఉత్తీర్ణత వారిదే. ఆ పరీక్షలో పోశవ్వకి నూటికి నూరు మార్కులు. తన ఉత్తీర్ణతే కాదు... తనలాంటి వారి ఉత్తీర్ణత కోసం... ఆమె నిర్విరామంగా సాగిస్తున్న దివ్యమైన సేవ ఇది. ‘ఒకటే జననం... ఒకటే మరణం. ఒకటే గమనం... ఒకటే గమ్యం’ చింతల పోశవ్వ కోసం ఫోన్ చేస్తే ఆమె రింగ్టోన్ ఆమె జీవితలక్ష్యం ఎంత ఉన్నతంగా ఉందో చెబుతుంది. తెలంగాణ, కామారెడ్డి జిల్లా కేంద్రంలో నివసించే పోశవ్వ ఓ ధీర. జీవితం విసిరిన చాలెంజ్ని స్వీకరించింది. ‘అష్టావక్రుడు ఎనిమిది అవకరాలతో ఉండి కూడా ఏ మాత్రం ఆత్మస్థయిర్యం కోల్పోలేదు. పైగా రాజ్యాన్ని ఏలే చక్రవర్తికి గురువయ్యాడు. నాకున్నది ఒక్క వైకల్యమే. నేనెందుకు అనుకున్నది సాధించలేను’ అనుకుంది. ఇప్పుడామె తన కాళ్ల మీద తాను నిలబడడమే కాక, తనలాంటి వాళ్లకు ఉపాధికల్పిస్తోంది. పోరాటం చేస్తున్న వాళ్లకు ఆసరా అవుతోంది. తన జీవితాన్ని సమాజహితానికి అంకితం చేయాలనే సంకల్పంతో పని చేస్తున్న పోశవ్వ సాక్షితో తన జీవనగమనాన్ని పంచుకున్నది. నాన్న వైద్యం... నానమ్మ మొక్కు! ‘‘విధి నిర్ణయాన్ని మార్చలేమనుకుంటాను. ఎందుకంటే మా నాన్న ఆర్ఎంపీ డాక్టర్ అయి ఉండీ నేను పోలియో బారిన పడ్డాను. ఆ తర్వాత నాన్న ఆయుర్వేద వైద్యం నేర్చుకుని నాకు వైద్యం చేశారు. నానమ్మ నన్ను గ్రామ దేవత పోచమ్మ ఒడిలో పెట్టి ‘నీ పేరే పెట్టుకుంటా, బిడ్డను బాగు చేయ’మని మొక్కింది. మెడ కింద అచేతనంగా ఉండిపోయిన నాకు ఒక కాలు మినహా మిగిలిన దేహమంతా బాగయిపోయింది. కష్టంగానైనా నాకు నేనుగా నడవగలుగుతున్నాను. నాకు జీవితంలో ఒకరి మీద ఆధారపడే పరిస్థితి రాకూడదని ఎం.ఏ., బీఈడీ చదివించారు. చదువు పూర్తయిన తర్వాత మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ స్కీమ్లో అడిషనల్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగం ఎక్కువ కాలం చేయలేదు. ఫీల్డు మీదకు వెళ్లాల్సిన ఉద్యోగం అది. నేను పనిని పరిశీలించడానికి పని జరిగే ప్రదేశానికి వెళ్లి తీరాలి. నేను వెళ్లడానికి సిద్ధమైనప్పటికీ కొన్ని చోట్లకు మామూలు మనుషులు వెళ్లడం కూడా కష్టమే. ఇతర అధికారులు, ఉద్యోగులు ‘మీరు రాకపోయినా ఫర్వాలేదు’ అంటారు. అయినా ఏదో అసంతృప్తి. ఉద్యోగాన్ని అలా చేయడం నాకు నచ్చలేదు. నెలకు ముప్ఫై వేల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలేశాను. హైదరాబాద్లోని ఎన్ఐఆర్డీలో సర్ఫ్, ఫినాయిల్, ఫ్లోర్ క్లీనర్, సబీనా తయారీలో శిక్షణ, చిన్న ఇండస్ట్రీతో బతుకు పుస్తకంలో కొత్త పాఠం మొదలైంది. కోవిడ్తో కొత్త మలుపు నేను మార్కెట్లో నిలదొక్కుకునే లోపే కోవిడ్ వచ్చింది. మా ఉత్పత్తులు అలాగే ఉండిపోయాయి. దాంతోపాటు వాటి ఉత్పత్తి సమయంలో ఎదురైన సమస్యలు కూడా నన్ను పునరాలోచనలో పడేశాయి. క్లీనింగ్ మెటీరియల్ తయారీలో నీటి వృథా ఎక్కువ, అలాగే అవి జారుడు గుణం కలిగి ఉంటాయి కాబట్టి పని చేసేటప్పుడు దివ్యాంగులకు ప్రమాదాలు పొంచి ఉన్నట్లే. అందుకే నీటితో పని లేకుండా తయారు చేసే ఉత్పత్తుల వైపు కొత్త మలుపు తీసుకున్నాను. అవే ఎకో ఫ్రెండ్లీ రాఖీలు. ఆ ప్రయత్నం నేను ఊహించనంతగా విజయవంతం అయింది. ఆ తర్వాత గోమయ గణపతి నుంచి ఇప్పుడు పదకొండు రకాల ఉత్పత్తులను చేస్తున్నాం. అందరూ దివ్యాంగులే. ఇక మీదట ఒంటరి మహిళలకు కూడా అవకాశం కల్పించాలనుకుంటున్నాను. కన్యాదాతనయ్యాను! మా జిల్లాలో ఎవరికి వీల్ చైర్ కావాలన్నా, ట్రై సైకిల్, వినికిడి సాధనాలు, పెన్షన్ అందకపోవడం వంటి సమస్యల గురించి నాకే ఫోన్ చేస్తారు. ఎన్జీవోలు, డీఆర్డీఏ అధికారులను సంప్రదించి ఆ పనులు జరిగేటట్లు చూస్తున్నాను. దివ్యాంగులకు, మామూలు వాళ్లకు కలిపి మొత్తం పన్నెండు జంటలకు పెళ్లిళ్లు చేశాను. వాళ్లలో ఇద్దరికి మాత్రం అమ్మాయి తరఫున పెళ్లి పెద్ద బాధ్యత వహించాల్సి వచ్చింది. నాకు అమ్మాయిల్లేరు, ముగ్గరబ్బాయిలు. ఈ రకంగా అవకాశం వచ్చిందని సంతోషించాను. సంకల్పం గొప్పది! నేను నా ట్రస్ట్ ద్వారా సమాజానికి అందించిన సహాయం ఎంతో గొప్ప అని చెప్పను. ఎంతో మంది ఇంకా విస్తృతంగా చేస్తున్నారు. కానీ నాకు ఉన్నంతలో నేను చేయగలుగుతున్నాను. నా లక్ష్యం గొప్పదని మాత్రం ధీమాగా చెప్పగలను. ఆదాయం కోసం పర్యావరణానికి హాని కలిగించడానికి వెనుకాడని ఈ రోజుల్లో, పర్యావరణ హితమైన మార్గంలో ఉపాధిని వెతుక్కుంటున్న మా ప్రయత్నాన్ని ఎన్నో సంస్థలతోపాటు ప్రభుత్వం కూడా గుర్తించింది. నాకు గత ఏడాది మహిళాదినోత్సవం సందర్భంగా సత్కరించింది. నా కుటుంబ పోషణకు నా భర్త ఉద్యోగం ఉంది. నా దివ్యహస్తం ట్రస్ట్ ద్వారా చేస్తున్న సర్వీస్ అంతా పర్యావరణ పరిరక్షణ, సమాజహితం, దివ్యాంగుల ప్రయోజనం కోసమే’’ అన్నారు. ‘ఉన్నది ఒకటే జననం... అంటూ... గెలుపు పొందే వరకు... అలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు... గెలుపు కొరకే బతుకు’ అనేదే ఆమె తొలిమాట... మలిమాట కూడా. ఆదాయం కోసం పర్యావరణానికి హాని కలిగించడానికి వెనుకాడని ఈ రోజుల్లో, పర్యావరణ హితమైన మార్గంలో ఉపాధిని వెతుక్కుంటున్న మా ప్రయత్నాన్ని ఎన్నో సంస్థలతోపాటు ప్రభుత్వం కూడా గుర్తించింది. – వాకా మంజులారెడ్డి -
అంతరంగచిత్రం
హంస ముఖంలో ముఖం పెట్టి మురిపెంగా చూస్తున్న అమ్మాయి.నెమలి పింఛాన్ని ఆసక్తిగా చూస్తున్న బుట్టగౌను పాపాయి.ఏనుగు తొండాన్ని ఆత్మీయంగా నిమురుతున్న యువతి.ప్రకృతి... పక్షులు... సరస్సులు... పువ్వులు కళ్ల ముందే.థీమ్ ఏదయినా సరే... ఓ అమ్మాయి రూపం తప్పనిసరి.ఆర్టిస్ట్ ఆషా రాధిక బొమ్మల్లో కనిపించే ఆర్ద్రత ఇది. ఆషా రాధిక పుట్టింది, పెరిగింది, చదువు, ఉద్యోగం అంతా హైదరాబాద్లోనే. ఆమె బొమ్మల్లో హైదరాబాద్ సంస్కృతితోపాటు హైదరాబాద్లో కనిపించని జీవనశైలి కూడా ద్యోతకమవుతుంటుంది. ఆమె 24 సోలో ఆర్ట్ ఎగ్జిబిషన్లు పెట్టారు. హైదరాబాద్ సాలార్జంగ్ మ్యూజియంలో హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ, తెలంగాణ ఆర్టిస్ట్ ఫోరమ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘ఆర్ట్ ఆఫ్ ద హార్ట్’ చిత్రలేఖన ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన చిత్రకళా ప్రస్థానాన్ని ‘సాక్షిఫ్యామిలీ’తో పంచుకున్నారు. కుంచె నేర్పింది! ‘‘నాకు పెయింటింగ్ హాబీగా మారడానికి కారణం మా అమ్మనాన్న. అమ్మ ఎంబ్రాయిడరీ చేసేది. దారంతో వస్త్రం మీద ఒక రూపం తీసుకురావాలంటే గంటల సేపు పని చేయాలి. బ్రష్తో అయితే నిమిషంలో వచ్చేస్తుంది. అలా సరదాగా మొదలుపెట్టాను. స్కూల్లో కాంపిటీషన్లలో ప్రైజులు వస్తుంటే ఆ ఉత్సాహంతో మరికొన్ని బొమ్మలు వేసేదాన్ని. ఇక నాన్నగారు మహాసంప్రదాయవాది. ఆడపిల్లలు స్కూలుకి వెళ్లడం, ఇంటికి రావడం తప్ప ఇక దేనికీ బయటకు వెళ్లరాదన్నంత నియమం ఆయనది. ఖాళీ సమయం అంతా ఇంట్లోనే ఉండాల్సి రావడంతో పెయింటింగ్స్లో ప్రయోగాలతో కాలక్షేపం చేయడం అలవాటైపోయింది. అలా కుంచే నాకు గురువైంది. సెవెన్త్ క్లాస్లో సమ్మర్ కోచింగ్ తప్ప పెయింటింగ్స్లో ప్రత్యేకమైన శిక్షణ ఏదీ లేకనే చాలా బొమ్మలు వేశాను. పెద్దయిన తర్వాత టెంపూరా ఆన్ పేపర్ కళను తెలుగు యూనివర్సిటీ, పెయింటింగ్ అండ్ స్కల్ప్చర్ డిపార్ట్మెంట్ హెడ్ శ్రీనివాసాచారి గారి దగ్గర నేర్చుకున్నాను. కాన్వాస్లాగానే మైండ్ కూడా నా కుంచె గర్ల్ చైల్డ్ ప్రధానంగా జాలువారుతుంది. నేచర్, పక్షులు, పూలు ఆహ్లాదాన్నిస్తాయి. ప్రసిద్ధ చిత్రకారుల చిత్రాలను చూసినప్పుడు తప్పనిసరిగా ప్రభావితమవుతాం. అయితే అది అనుకరణ కోసం కాదు. ఒక గమనింపు మనలో ఉంటుంది. ఆ చిత్రకారుల గీతను నిశితంగా గమనిస్తుంది మన మేధ. జగదీశ్ మిట్టల్ గారి కలెక్షన్స్లో 14వ శతాబ్దం నాటి చిత్రాలు కూడా ఉన్నాయి. ఆ మీనియేచర్ ఆర్ట్ నా మెదడు మీద అలా ముద్రించుకుపోయింది. రామ్కుమార్, ప్రభాకర్ కోల్టే వేసే ఆబ్స్ట్రాక్ట్లు చాలా ఇష్టం. ఎన్ని చిత్రాలను చూసి, ఎన్నింటి నుంచి స్ఫూర్తి పొందినా మన మెదడు కాన్వాస్ మీద తనకు తానుగా ఓ కొత్త రూపాన్ని ఆవిష్కరిస్తుంది. నేను బొమ్మ వేయడానికి కాన్వాస్ ముందు కూర్చునేటప్పుడు ఫలానా రూపం రావాలనే ఆలోచన ఉండదు. కాన్వాస్లాగానే మెదడు కూడా క్లియర్గా ఉంటుంది. రంగులు ఒక్కొక్క లేయర్ వేస్తూ ఉంటే కొంత సేపటికి రూపం వస్తుంది. ఆ చిత్రంలో ఒక అమ్మాయి తప్పనిసరిగా ఉంటుంది. ఇక థీమ్ అంటే ‘హర్ అబ్జర్వేషన్’ అని చెప్పవచ్చు. ఒక అమ్మాయి ప్రకృతిని, తన పరిసరాలను గమనించడంతోపాటు మమేకం కావడం నా బొమ్మల్లో ఉంటుంది. ఒక అమ్మాయిగా బాల్యంలో నేను చూసినవి, ఊహించినవి, పెద్దయిన తర్వాత నా గమనింపుకు వచ్చినవి, ఒక అమ్మాయికి తల్లిగా ప్రేమానుబంధం నా బొమ్మల్లో ఆవిష్కారమవుతుంటుంది. ఇంట్లోనే ఆర్ట్ స్టూడియో ఏర్పాటు చేసుకున్నాను. నాలుగు వేల బొమ్మలు వేసి ఉంటాను. సోలో ప్రదర్శనలను గుర్తు పెట్టుకుంటాను, కానీ గ్రూప్ ప్రదర్శనల లెక్క ప్రత్యేకంగా గణనలోకి తీసుకోలేదు. అమెరికాలో నాలుగు రాష్ట్రాల్లోనూ నావి సోలో ప్రదర్శనలే. చిత్రలేఖనం పట్ల ఎంత ఇష్టం ఉన్నప్పటికీ చదువు ప్రాధాన్యం తగ్గనివ్వలేదు. ఎస్బీఐలో 1992లో ఉద్యోగంలో చేరాను. ఇప్పుడు శంకరపల్లి బ్రాంచ్ మేనేజర్ని. ‘ఆర్ట్ ఆఫ్ ద హార్ట్’లో పాల్గొన్నాను. సోలో ఎగ్జిబిషన్లు 2001 నుంచి మొదలుపెట్టాను. ఇప్పుడు 25వ ఎగ్జిబిషన్ నా చిత్రలేఖనం కెరీర్లో ఓ మైలురాయిగా నిలవాలనే ఆకాంక్షతో సిద్ధం చేస్తున్నాను’’ అని తన అంతరంగాన్ని ఆవిష్కరించారు ఆర్టిస్ట్ ఆషా రాధిక. – వాకా మంజులారెడ్డి -
ఆమె చూపిన బడిబాట
తహానున్నిసా బేగంకి బీఎస్సీ నర్సింగ్ పూర్తయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం గద్వాల్ జిల్లా, మాన΄ాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో స్టాప్ నర్సుగా ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత కమిషన్ ఆన్ గ్రాడ్యుయేట్స్ ఆఫ్ ఫారిన్ నర్సింగ్ స్కూల్స్ (సీజీఎఫ్ఎన్ఎస్) కోర్సు చేసింది. అమెరికా వెళ్లడానికి ఐల్ట్స్ కూడా మంచి స్కోర్తో పూర్తి చేసినా అక్కడికి వెళ్లడం కుదరకపోవడంతో ఎమ్ఎస్సీ నర్సింగ్ సైకియాట్రీ కోర్సులో చేరింది. ఏడాది పూర్తయ్యేసరికి పునరాలోచనలో పడి కుటుంబ అవసరాల కోసం గృహిణిగా ఇంటికే పరిమితం అయింది. కొడుకుకి తిరుపతి ఎస్వీ మెడికల్ కాలేజ్లో సీటు రావడంతో మకాం తిరుపతికి మారింది. చదువు మీదున్న ఆసక్తిని సేవా కార్యక్రమాల వైపు మళ్లించి ఎందరికో ఆదర్శంగా నిలిచింది. సావిత్రీ పూలే అవార్డును అందుకుంది. తన సేవా ప్రస్థానం ఆమె మాటల్లోనే... అమ్మమ్మ... అమ్మ స్ఫూర్తితో... ‘‘మాది తెలంగాణలోని వనపర్తి. మా అమ్మ సైన్స్ టీచర్, నాన్న డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్గా లెప్రసీ విభాగంలో పని చేశారు. ఆ స్ఫూర్తితోనే నేను నర్సింగ్ కోర్సు చేశాను. సర్వీస్ మా ఇంటి వాతావరణంలోనే ఉంది. రంజాన్ మాసంలో జకాత్ ఇవ్వడంతో సరిపెట్టే వాళ్లు కాదు. రోజూ ఆకలి తీర్చేవాళ్లు. మా అమ్మమ్మ రోజూ జొన్న రొట్టెలు చేసి రెండు తీసి పక్కన పెట్టి ఆ తర్వాత మాకు తినడానికి పెట్టేది. పక్కన తీసి పెట్టిన రొట్టెలు ఆ రోజు ఆకలితో ఎవరు వస్తే వారికిచ్చేది. మా అమ్మ కూడా తన నెల జీతంలో కొంత భాగం పేద వారికి ఇవ్వడం కోసమే తీసి పక్కన పెట్టేది. అవి చూస్తూ పెరిగాను, నాకు ఉద్యోగం రాగానే ఎక్కడ లేని ఉత్సాహం వచ్చింది. ఆకాశమే హద్దు అన్నంతగా సమాజానికి వైద్యసేవ చేయాలనుకున్నాను. అక్కడి పరిస్థితుల్లో ఎంతో కాలం ఇమడలేకపోయాను. నా దృష్టికి వచ్చిన వాళ్లకి చేతనైన సహాయం చేయడంతోనే కొన్నేళ్లు జరిగిపోయాయి. తిరుపతికి వచ్చిన తర్వాత కరోనా సమయంలో నాకు ఒక దారి దొరికింది. నా అసలైన అవసరం ఎక్కడ ఉందో తెలిసింది. మా వారు డాక్టర్, కొడుకు ఎంబీబీఎస్ పూర్తి చేసి కోవిడ్ మెడికల్ ఆఫీసర్గా సర్విస్ మొదలు పెట్టేశాడు. వాళ్లిద్దరూ సర్వీస్ ఇస్తున్నారు. నాకు మెడికల్ నాలెడ్జ్ ఉంది కాబట్టి సర్విస్ చేస్తానంటే మా వారు, అబ్బాయి ఇద్దరూ నా ఆరోగ్యరీత్యా వద్దన్నారు. అప్పుడు నేను ఆహారం పెట్టడం అయినా చేయాలని మొదలు పెట్టాను. ఒక పూట అన్నానికి కూడా భరోసా లేని కాలనీలను చూశాను. వాళ్లకు రోజూ అన్నం పెట్టడం, ఆ పిల్లల బాగోగులు అడిగి తెలుసుకుంటూ ఉంటే ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి. బ్రష్, పేస్ట్, సబ్బు కూడా తెలియని బాల్యం వాళ్లది. వాళ్లకు స్కూల్లో పేరుంటుంది, కానీ వాళ్లు స్కూలుకి పోరు. తర్వాత క్లాస్కి ప్రమోట్ కాలేరు. ఏం చదువుతున్నారని అడిగితే ఏదో ఓ క్లాసు చెప్తారు, ఎక్కడ ఆపేశారో కూడా వాళ్లకు గుర్తుండదు. ఇంకా ఇలాంటి జీవితాలున్నాయేంటి... అని బాధ కలిగింది. ఈ స్థితిని చూసిన తర్వాత ‘వియ్ సపోర్ట్’ అంటూ చారిటబుల్ ట్రస్ట్ను స్థాపించి పూర్తి స్థాయిలో పని మొదలు పెట్టాను. అన్నింటా రాణిస్తున్నారు! అలాంటి పిల్లలు ఈ మూడేళ్లలో ఎంతగా మారిపోయారంటే... వక్తృత్వ, వ్యాసరచన పోటీల్లో బహుమతులందుకున్నారు. త్రోబాల్, వంద మీటర్ల పరుగు, ఖోఖో వంటి ఆటల్లో ముందుంటున్నారు. తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో నృత్య ప్రదర్శన ఇచ్చారు. నా పిల్లల నంబరు ఏడాదికేడాదీ పెరుగుతోంది. ఇంకో విషయం... వీళ్లు మేడమ్, టీచర్ అనే పదాలంటేనే భయపడేవాళ్లు. ‘ఆంటీ’ అని పిలిపించుకోవడం అలవాటు చేశాం. దాంతో బాగా మాలిమి అయ్యారు. ఇంకా ఇలాంటి వారిని వెతికి మరీ బడిబాట పట్టించాలి. అదే పనిలో ఉన్నాను’’ అన్నారు తహానున్నిసా బేగం. స్నేహితులు వచ్చారు! మొదట అన్నారావు సర్కిల్ దగ్గరున్న ఎస్టీ కాలనీతో మొదలు పెట్టాను. రోజూ కాలనీకి వెళ్లడం పిల్లలందరినీ బ్రష్ చేయమని, స్నానం చేసి రమ్మని చెప్పడం నుంచి సంస్కరణ మొదలు పెట్టాను. పాఠాలను కంఠతా పట్టడం, ఆ తర్వాత చదవడం, రాయడం నేర్పించాను. ఆ తర్వాత వాళ్లు చదవగలిగిన క్లాసులో చేర్పిస్తున్నాను. ఈ యజ్ఞంలో నన్ను చూసి నా స్నేహితులు ముందుకు వచ్చి పాఠాలు చెప్తున్నారు. కొంతమంది పుస్తకాలు, బ్యాగులు సహాయం చేశారు. వీళ్లు స్కూల్ డ్రాపవుట్స్ కావడంతో ప్రభుత్వం ఇచ్చే పథకం వర్తించదు. అలాంటి పిల్లలను ఒక దారిలో పెట్టిన తరవాత టీటీడీ ఓరియెంటల్ స్కూల్లో చేర్పిస్తున్నాం. – వాకా మంజులారెడ్డి ఫొటోలు : మహమ్మద్ రఫీ, తిరుపతి -
ప్లాస్టిక్ కాలుష్యానికి చెక్ ఇంట్లోనే మొదలవ్వాలి
మీకు తెలుసా? ప్రపంచ వ్యాప్తంగా తయారవుతున్న ప్యాకింగ్ మెటీరియల్లో మూడింట రెండు వంతులు ఆహార పదార్థాలను ప్యాక్ చేయడానికే ఖర్చవుతోంది. ఈ ప్యాకింగ్ మెటీరియల్లో పేపర్, పేపర్ బోర్డ్, కార్డ్బోర్డ్, వ్యాక్స్, ఉడ్, ప్లాస్టిక్లు, మోనో కార్టన్లు... ఇంకా రకరకాలవి ఉపయోగిస్తారు. మిగిలిన అన్నిటికన్నా ప్యాకింగ్ మెటీరియల్ లో ఉపయోగించే ప్లాస్టిక్ శాతం తక్కువే. కానీ మట్టిలో కలిసిపోకుండా పల్లపు ప్రదేశాలకు కొట్టుకుపోతూన్న ప్లాస్టిక్ తోనే సమస్య. క్లైమేట్ చేంజ్, పర్యావరణానికి ఎదురవుతున్న ఇబ్బందుల మీద చర్చించిన ఐక్యరాజ్య సమితి... నదులు, సముద్రాలను ముంచెత్తుతోన్న కాలుష్యాన్ని ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సంక్షోభంగా పేర్కొంది. మారుతున్న జీవనశైలి, ఆర్థిక వ్యవస్థ సృష్టిస్తున్న ఈ సమస్యకు మన వంతుగా చెక్ పెట్టడం ఎంతవరకు సాధ్యమో చూద్దాం. ఫ్యామిలీ ఆడిట్ ప్యాకింగ్ మెటీరియల్ని తిరిగి ఉపయోగించడం పట్ల శ్రద్ధ చూపించకపోవడం కూడా ప్రధానమైన కారణం. ‘స్వీడన్ వంటి కొన్ని దేశాల్లో ఒక్కశాతం కంటే ఎక్కువ ప్యాకింగ్ మెటీరియల్ చెత్త లోకి వెళ్లదు. అంటే అక్కడ 99 శాతం మళ్లీ వాడకంలోకి వస్తోంది. అదే మనదేశంలో రీయూజ్ 22 శాతానికి మించడం లేద’ని బెంగళూరుకు చెందిన పర్యావరణవేత్త నరేశ్ హెగ్డే చెప్పా రు. ‘‘మన దేశంలో ముఖ్యంగా పెద్ద నగరాల్లో ఒక్కో కుటుంబం నుంచి ఉదయంపాలప్యాకెట్తో మొదలయ్యే ప్యాకింగ్ అవసరం రాత్రి పడుకునే ముందు ఇంటి బయట పెట్టే చెత్త కవర్ల వరకు సగటున రెండు నుంచి మూడు కిలోల ప్యాకింగ్ వేస్ట్ ఉత్పత్తి అవుతోంది. ఫుడ్ ఆర్డర్ల ద్వారా వచ్చే ప్యాకెట్లది సింహభాగం. ఈ సమస్య సంపన్న కుటుంబాల్లోనే ఎక్కువ. కానీ ఈ విషయంలో ప్రతి కుటుంబం ఆడిట్ చేసుకోవాలి. వ్యర్థాల ఉత్పత్తిని ఎంత మేర నిలువరించవచ్చు అని విశ్లేషించుకుని అమలు చేయాలి’’ అని చెబుతున్నారు పర్యావరణవేత్తలు. రీ యూజ్ ‘‘మనం ఇప్పుడిప్పుడు ఇళ్లలో తడిచెత్త, పొడిచెత్తలను వేరు చేయడం వరకు అలవరుచుకుంటున్నాం. ఇకపై ఈ రెండింటితోపాటు రీ యూజబుల్ మెటీరియల్ను వేరు చేయడం కూడా అలవాటు చేసుకోవాలి. ఒక ప్లాస్టిక్ బ్యాగ్ ఒకసారి వాడిపారేయకుండా వీలైనన్ని ఎక్కువ దఫాలు వాడడం ఒక సూచన. ఇక కొన్నింటిని వాడిపారేయాల్సిందే, తిరిగి వాడడానికి వీలుకాదు. ఉదాహరణకు షాంపూ ప్యాకెట్లు, కాస్మటిక్ ఉత్పత్తులు ఈ కోవలోకి వస్తాయి. చైతన్యం ఉన్నప్పటికీ ఎలా డిస్పోజ్ చేయాలో తెలియకపోవడం ఒక కారణం. ప్లాస్టిక్ని సరైన విధానంలో రీ సైకిల్ చేయడం, పరిహరించడం మనకు మనంగా చేయగలిగిన పని కాదు. తయారు చేసిన కంపెనీలకే ఆ బాధ్యతను అప్పగిస్తూ ప్రభుత్వాలు చట్టాలు చేయాలని పలు సందర్భాల్లో సూచించాం. ఇదెలాగంటే... సౌందర్యసాధనాలు, షాంపూ, వాషింగ్పౌ డర్, క్లీనింగ్ ఉత్పత్తులను వాడేసిన తర్వాత ప్యాకెట్లను ఏ దుకాణంలో కొన్నామో అదే దుకాణంలో తిరిగి డిపాజిట్ చేయడం అన్నమాట. ఒక వస్తువు ఉత్పత్తి చేసిన కంపెనీ నుంచి కిరాణా దుకాణం వరకు సరఫరా అయినట్లే ఖాళీ ప్యాకెట్లు కూడా సప్లయ్ బ్యాక్ సిస్టమ్ ద్వారా తయారీ స్థానానికి తిరిగి చేరాలి. ఈ నియమాన్నిపాటించగలిగితే ఈ సంక్షోభానికి అడ్డుకట్ట వేయవచ్చు’’ అంటారు పర్యావరణ విశ్లేషకులు దొంతి నరసింహారెడ్డి. నిజానికి భారతీయుల జీవనశైలిలో సింగిల్ యూజ్ కంటే ముందు రీ యూజ్ ఉండేది.పాళీతో రాసే ఇంకు పెన్నుల నుంచి కాటన్ చేతి సంచీ వరకు ప్రతి వనరునీ వీలైనన్ని ఎక్కువసార్లు ఉపయోగించేవాళ్లం. యూజ్ అండ్ త్రో, సింగిల్ యూజ్ మాటలుపాశ్చాత్యదేశాల నుంచి నేర్చుకున్న అపభ్రంశమే. కానీ ఇప్పుడు ఆయా దేశాలు రీ యూజ్ వైపు మరలుతూ ఇండియాను వేలెత్తి చూపిస్తున్నాయి. మనం వీలైనంత త్వరగా మనదైన రీ యూజ్ విధానాన్ని తిరిగి మొదలుపెడదాం. ఇంటి వాతావరణాన్ని మార్చుకోగలిగితే అది పర్యావరణ సమతుల్యత సాధనలో తొలి అడుగు అవుతుంది. ప్రత్యామ్నాయాలున్నాయి! ► బర్త్డేపార్టీలో ధర్మాకోల్ బాల్స్, ప్లాస్టిక్ చమ్కీలను వాడుతుంటారు. అవి లేకుండా వేడుకను ఎకో ఫ్రెండ్లీగా చేసుకోవాలి. ► పెళ్ళిళ్లు ఎకో ఫ్రెండ్లీ వాతావరణంలో చేసుకోవాలి. ► ఇంట్లో ప్లాస్టిక్ని అవసరమైన వరకు మాత్రమే ఉపయోగించాలని, తప్పనిసరిగా రీయూజ్ చేయాలనే నియమాలను పెట్టుకోవాలి. ఆ నినాదాన్ని ఇంటి గోడ మీద రాసుకుంటే మనల్ని చూసి మరికొంత మంది ప్రభావితమవుతారు. ► పేపర్ బ్యాగ్, కాటన్ బ్యాగ్, మొక్కజొన్న పిండితో తయారవుతున్న క్యారీ బ్యాగ్ల వంటి ప్రత్యామ్నాయాలను వాడవచ్చు. – వాకా మంజులారెడ్డి -
మంచుఖండం మనసైన సాహసం
అంటార్కిటికా విహారం తెర మీద చూసినంత సౌకర్యంగా ఉండదు. కానీ మాటల్లో చెప్పలేనంత ఆహ్లాదంగా ఉంటుంది జర్నీ. అంటార్కిటికా గురించి తెలుసుకోవాలంటే స్వయంగా పర్యటించాల్సిందే అనుకున్నాడు హైదరాబాద్ కుర్రాడు హసన్ అరుణ్. లండన్, కింగ్స్ కాలేజ్లో ఎకనమిక్స్ చదువుతున్న అరుణ్ గత డిసెంబర్లో అంటార్కిటికా సాహసయాత్రను విజయవంతంగా పూర్తి చేశారు. విశేషాలను లండన్ నుంచి సాక్షితో పంచుకున్నాడు. మూడు సముద్రాల కలయిక ‘‘అంటార్కిటికా గురించి తెలుసుకోవాలని ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఇంటర్నెట్లో ఉన్న సమాచారం నాకు సంతృప్తినివ్వలేదు. స్వయంగా ఎక్స్ప్లోర్ చేయాల్సిందే అనుకున్నాను. ఆ అడ్వెంచర్ని ఎంజాయ్ చేయాలని కూడా. హైదరాబాద్ నుంచి గత డిసెంబర్ 21వ తేదీ బయలుదేరి దాదాపుగా ఒక రోజంతా ప్రయాణం చేసిన తర్వాత బ్రెజిల్ లోని ‘రియో డీ జెనీరో’మీదుగా అర్జెంటీనా రాజధాని ‘బ్యూనోస్ ఎయిరిజ్’కి చేరాను. అక్కడ మూడు రోజులున్నాను. ప్రపంచం అంచు అని చెప్పే ‘ఉషుయాయియా’ ను చూశాను. అంటార్కిటికా క్రూయిజ్ అక్కడి నుంచే మొదలవుతుంది. ఉషుయాయియా నుంచి 26వ తేదీ ఉదయం క్రూయిజ్ ప్రయాణం మొదలైంది. బీగెల్ చానెల్లో సాగుతుంది క్రూయిజ్ ప్రయాణం. డ్రేక్ ప్యాసేజ్ మీదుగా ఒకటిన్నర రోజు ప్రయాణించాలి. ఈ జర్నీలో అత్యంత క్లిష్టమైన ప్రదేశం ఇదే. అట్లాంటిక్, పసిఫిక్, సదరన్ ఓషన్ ఈ మూడు సముద్రాలు కలిసే ప్రదేశం ఇది. అలలు నాలుగు మీటర్ల నుంచి పదకొండు మీటర్ల ఎత్తు లేస్తుంటాయి. సీ సిక్నెస్ వచ్చేది ఇప్పుడే. తల తిరగడం, వాంతులతో ఇబ్బంది పడతారు. సిక్నెస్ తగ్గడానికి మందులు, సీ బ్యాండేజ్ ఇస్తారు. ఈ స్థితిలో నిద్ర సమయం కూడా పెరుగుతుంది. ఉష్ణోగ్రత మైనస్ రెండు ఉంటుంది. క్రూయిజ్ లోపల ఏసీ ఉంటుంది, కాబట్టి ఇబ్బంది ఉండదు. ఓపెన్ ప్లేస్లో నాలుగైదు నిమిషాలకంటే ఎక్కువసేపు ఉండలేం. అలలు పైకి లేచినప్పుడు అంత భారీ క్రూయిజ్ కూడా నీటి తాకిడికి కదిలిపోతుంటుంది. అలలు ఆరు మీటర్ల ఎత్తు వస్తున్నంత వరకు ప్రయాణాన్ని కొనసాగించవచ్చు. అంతకు మించితే మాత్రం క్రూయిజ్ ఆగాల్సిందే. లంగరు వేసి వాతావరణం నెమ్మదించిన తర్వాత కదులుతుంది. మా జర్నీలో నాలుగు మీటర్లకు మించలేదు, కాబట్టి ఆగాల్సిన అవసరం రాలేదు. నేలను పలకరిస్తూ నీటిలో ప్రయాణం వెడెల్ సీలోకి ప్రవేశించామంటే అంటార్కిటికా ఖండంలోకి అడుగుపెట్టినట్లే. వెడెల్ సీ లో దాదాపు సగం రోజు సాగుతుంది ప్రయాణం. గ్లేసియర్లు, ఐస్బెర్గ్లు, పర్వతాలు, పెంగ్విన్ కాలనీలు, వేల్స్, సీల్స్ కనిపిస్తుంటాయి. అంటార్కిటికా చేరిన తర్వాత ఆరు రోజుల పా టు రోజుకు రెండు దీవులు లేదా ద్వీపకల్పాల మీద ల్యాండ్ అవుతూ ఆరు రోజుల్లో పన్నెండింటిని కవర్ చేశాను. జనవరి రెండవ తేదీ తిరుగు ప్రయాణం. ‘బ్యూనోస్ ఎయిరిజ్’ నుంచి నేను లండన్కి వచ్చేశాను. రోజంతా పగలే! అంటార్కిటికాలో రోజంతా నింగికీ నేలకూ మధ్యనే గడిపినప్పటికీ ఆ వారం రోజులూ సూర్యాస్తమయాన్ని చూడలేకపోయాను. సూర్యుడు చండప్రచండంగా ఉదయించే ఉన్నాడు. ఇది అద్భుతమైన అనుభూతి. కాలుష్యం అంటే ఏమిటో తెలియని స్వచ్ఛమైన నీరు, లెక్కకు మించిన హిమనీనదాలు, గుంపుల కొద్దీ పెంగ్విన్ లు, సహజమైన దారుల్లో ట్రెకింగ్ నాకు మరిచిపోలేని జ్ఞాపకాలు. నేను అడ్వెంచర్స్ని బాగా ఇష్టపడతాను, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్లో కూడా ట్రెకింగ్ చేశాను. కానీ అంటార్కిటికా ట్రెకింగ్ సహజత్వం ఒడిలో సాగిన సాహసం అనిపించింది’’. మనిషి వల్లే హాని అంటార్కిటికా గురించి ప్రయాణంలోనే ఎక్కువ తెలుసుకోగలిగాను. క్రూయిజ్లో మెరైన్ ఇంజనీర్లు, సైంటిస్ట్లు, నేచరిస్ట్లు కూడా ఉంటారు. ఒక ప్రదేశానికి వెళ్లడానికి ముందు ఆ ప్రదేశం వివరాలు, అక్కడ మెలగాల్సిన విధానం కూడా చెప్తారు . పెంగ్విన్ లకు కనీసం ఐదు మీటర్ల దూరంగా ఉండాలని, మనుషుల నుంచి వాటికి ఇన్ఫెక్షన్ సోకితే ఏకంగా వేలకొద్దీ ఉన్న కాలనీలే తుడిచిపెట్టుకుపోతాయని తెలిసింది. మనిషి ఎంత హానికారకుడో, ప్రకృతికి ఎంత పెద్ద శత్రువో మొదటిసారి తెలిసింది. వాళ్లు పర్యాటకులను ఆహ్వానిస్తూనే మంచుఖండం పర్యావరణ సమతుల్యతను పరిరక్షించుకుంటున్నారు. ఇక్కడ పర్యటించడానికి డిసెంబర్ రెండవ వారం నుంచి జనవరి మొదటి వారం వరకు అనుకూలమైన సమయం. – హసన్ అరుణ్, సాహస యాత్రికుడు -- ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి -
చిగురించే శుభలేఖ.. మీ ఇంటికి వచ్చిన తులసి.. ఆరోగ్యదాయిని!
ఒకప్పడు శుభలేఖ అంటే... పసుపు సుగంధాలతో అందే ఆహ్వానం. డిజిటల్ యుగంలో వాట్సాప్లోనే ఆహ్వానం. పెళ్లయ్యాక డిలీట్ చేయకపోతే మెమరీ చాలదు. ఆ తర్వాత ఆ పత్రిక మన మెమరీలోనూ ఉండదు. కానీ... ఈ శుభలేఖ ఎప్పటికీ నిలిచి ఉండే ఓ జ్ఞాపకం. మంచాల వారి పరిణయ ఆహ్వానం... ఏటా మనింటికి ఎన్నో పెళ్లిపత్రికలు వస్తూ ఉంటాయి. ‘అరె! నా పెళ్లిలో పట్టుపరికిణితో బుట్టబొమ్మలా తిరిగిన ఆ చిన్నమ్మాయికి పెళ్లా! కాలం ఎంత వేగంగా పరుగులు తీస్తోందో? అనుకుంటూ పెళ్లి కార్డును మురిపెంగా చూస్తాం. పెళ్లయిన తర్వాత ఆ కార్డునుపాత పేపర్లలో వేసేయడానికి మనసొప్పదు. శుభలేఖను గౌరవించాలి, ఆ జంట వైవాహిక జీవితం కలకాలం లక్షణంగా సాగాలంటే పెళ్లికార్డును అగౌరవపరచకూడదనే సెంటిమెంట్ మనది. ఈ సెంటిమెంట్కు కొత్త నిర్వచనం చెప్తోంది డాక్టర్ శరణ్య. ఆహ్వాన పత్రిక ముద్రించిన పేపర్ను తులసి గింజలను కలిపి తయారు చేయించింది. ‘‘నా పెళ్లి తర్వాత ఈ కార్డును మట్టి కుండీలో వేసి నీరు పోయండి. నాలుగు రోజుల్లో కార్డు కరిగిపోతుంది, మరో నాలుగు రోజులకు పచ్చగా జీవం పోసుకున్న తులసి మొక్క మనల్ని పలకరిస్తుంది. మీ ఇంటికి వచ్చిన తులసి, మీ ఇంటి ఆరోగ్యదాయిని. భూమాతకు కొత్త ఊపిరినిచ్చే ఆరోగ్యలక్ష్మిని చూస్తూ మీ ముఖంలో విరిసే చిరునవ్వే మాకు మీరిచ్చే ఆశీర్వాదం’’ అంటోంది. శుక్రవారమే పెళ్లి! డాక్టర్ శరణ్యది తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్. ఎంఎస్ ఆఫ్తాల్మాలజీ చేస్తోంది. ఈ నెల 24వ తేదీన పెళ్లి పీటల మీద కూర్చోనున్న శరణ్య తన వివాహాన్ని ఇలా పర్యావరణహితంగా మార్చేసింది. ఆ వివరాలను సాక్షితో పంచుకుంది. ‘‘నేచర్ ఫ్రెండ్లీ లైఫ్ స్టయిల్ నాకిష్టం. నా పెళ్లి కూడా అలాగే జరిగితే బావుణ్ణనిపించి అదే మాట నాన్నతో చెప్పాను. పెళ్లి వేదిక అలంకరణ నుంచి భోజనాల వరకు మొత్తం ప్లాస్టిక్ రహితంగా ఉండాలని కూడా అనుకున్నాం. అది పెద్ద కష్టం కాలేదు. ప్రతిదానికీ ప్రత్యామ్నాయం దొరికింది. కార్డుల కోసం చాలా ప్రయత్నం చేయాల్సి వచ్చింది. ‘ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ కార్డ్స్’ కోసం నేను ఇంటర్నెట్లో, నాన్న తన బిజినెస్ కాంటాక్ట్స్తో ప్రయత్నించాం. నాన్నకు తెలిసిన వాళ్ల ద్వారా అహ్మదాబాద్లో హ్యాండ్మేడ్ పేపర్ తయారీతో పాటు మనం కోరిన స్పెసిఫికేషన్లన్నీ వచ్చేటట్లు కస్టమైజ్డ్గా ప్రింట్ చేసిస్తారని తెలిసింది. మూడు నెలల ముందుగా ఆర్డర్ చేయాలి, ఈ ఎకో ఫ్రెండ్లీ ఆహ్వానపత్రికల ఆలోచన తెలిసి మా అత్తగారింట్లో కూడా అందరూ సంతోషించారు. భూమాత పరిరక్షణ కోసం చేస్తున్న ప్రయత్నాలు నా పెళ్లికార్డుతో ఇంతమందికి తెలిశాయి. దీనికి మూలకారణం మా నాన్నే. ప్లాస్టిక్ ఫ్రీ సొసైటీ కోసం చైతన్య సదస్సులు నిర్వహిస్తారు. మా చెల్లికి పక్షులంటే ఇష్టం. వేసవిలో పక్షుల కోసం ఒకపాత్రలో నీరు, గింజలు పెడుతుండేది. పక్షుల సంరక్షణలో అందరూ భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతో రెండు వేల బర్డ్ ఫీడర్ బాక్సులు పంచింది. మా ముత్తాత రాజేశం గారు ఫ్రీడమ్ ఫైటర్. మా తాత శంకరయ్య కూడా సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా ఉండేవారు. అదే వారసత్వంతో నాన్న కూడా వేసవిలో నగరంలో వాటర్ ట్యాంకులతో నీటి పంపిణీ వంటి అనేక సేవాకార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. బతుకమ్మ వేడుక కోసం గునుగుపువ్వు సేకరించి శుద్ధి చేసి పంచడం కూడా చాలా ఇష్టంగా చేస్తాం. మనం మన సంస్కృతికి వారసులం మాత్రమే కాదు వారధులం కూడా. ప్రతి సంప్రదాయాన్నీ ఇలా సృజనాత్మకంగా మలుచుకోగలిగితే మనం చేసిన పని మనకు ప్రత్యేకతను ఇస్తుంది. సాంస్కృతిక వారధులుగా సంతోషమూ కలుగుతుంది. పెళ్లి పత్రిక మీద దేవుడి బొమ్మలు, వధూవరుల ఫొటోలు ఉంటాయి. వాటినిపారేయలేక ఇంట్లోనే పెట్టుకుంటే దొంతర పెరిగిపోతూ ఉంటుంది. మా పెళ్లి పత్రిక మాత్రం తులసి మొక్కగా మీ కళ్ల ముందు ఉంటుంది, మీకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది ’’ అని సంతోషంగా వివరించింది డాక్టర్ శరణ్య. – వాకా మంజులారెడ్డి -
Sunitha Krishnan: దయచేసి మారండి!
మహిళల అక్రమ రవాణా... ప్రభుత్వాలకు పెద్ద సవాల్. సమాజానికి తలవంపులు. బాధిత మహిళకు విషమ పరీక్ష. మహిళల రక్షణ ఆమె ఆకాంక్ష. తనకు తెలిసిన మార్గం పోరాటమే. పోరాటం... పోరాటం... పోరాటం. అసాంఘిక శక్తులతో పోరాటం. సామాజిక పరిస్థితులతో పోరాటం. మనసు మారితే సమాజం మారుతుంది. ఇప్పుడు ఆ మార్పు కోసం అభ్యర్థిస్తోంది. సునీతాకృష్ణన్ ‘నా బంగారు తల్లి’ సినిమా తీసి దాదాపుగా దశాబ్దమవుతోంది. మహిళలను మోసగించి అక్రమ రవాణాకు పాల్పడే దుర్మార్గాన్ని ఆ సినిమాలో కళ్లకు కట్టారు సునీతా కృష్ణన్, ఆమె భర్త రాజేశ్ టచ్రివర్. ప్రతి సన్నివేశమూ వాస్తవానికి అద్దం పట్టింది. సినిమా క్లైమాక్స్ దృశ్యాలు కన్నీటి పర్యంతం చేస్తాయి, మనసు ద్రవించిపోతుంది. సమాజంలో మహిళ ఎదుర్కొనే దాష్టీకాలకు మౌనంగా రోదిస్తూ బయటకు వస్తారు ప్రేక్షకులు. వాస్తవ సంఘటన ఆధారంగా తెరకెక్కిన చిత్రం అది. ఆ సందర్భంగా నిర్మాత సునీతా కృష్ణన్ మాట్లాడుతూ ‘‘1996లో ప్రజ్వల ఫౌండేషన్ ప్రారంభించినప్పటి నుంచి పోరాడుతున్నాను. అంతకంటే ముందు ప్రజ్వల వంటి ఫౌండేషన్ అవసరం ఉందని గ్రహించే వరకు నేను గుర్తించిన సామాజికాంశాలన్నింటి మీదా పోరాడాను. ‘స్త్రీ అంగడి సరుకు కాదు, దేహం మీద దాడి చేస్తే ఆమె మనసు ఎంతగా రోదిస్తుందో ఆలోచించండి’ అని గొంతుచించుకుని చెప్తున్నాను. నా ఉద్యమం సమాజంలో ప్రతి ఒక్కరినీ చేరాలంటే, ఏకకాలంలో ఎక్కువమందిని సెన్సిటైజ్ చేయాలంటే ప్రభావవంతమైన మాధ్యమం అవసరం అనిపించింది. అందుకే సినిమా తీశాను. ఈ చిత్రాన్ని చూసిన తర్వాత ఎవరైనా కనీసం ఒక్క క్షణమైనా ఆలోచించకపోతారా, స్త్రీ దేహాన్ని మాత్రమే కాంక్షించే మగవాళ్లకు తమ ఇళ్లలో ఉండే ఆడబిడ్డలు కళ్ల ముందు మెదలకపోతారా’ అనేది మా ఆశ. నేను యాక్టివిస్ట్ని, నా భర్త సినిమా దర్శకుడు కావడంతో మా ఆలోచన అనుకున్నది అనుకున్నట్లే కార్యరూపం దాల్చింది. ఎటువంటి సినిమాటిక్ లిబర్టీ తీసుకోకుండా, కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా చిత్రించాం’’ అని చెప్పారామె. ఆమె సామాజిక సేవను గుర్తించిన భారత ప్రభుత్వం 2016లో పద్మశ్రీతో సత్కరించింది. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్సార్ లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు (మహిళాసాధికారత విభాగం)కు ఎంపిక చేసింది. ఈ సందర్భంగా ఆమె సాక్షితో పంచుకున్న అనుభవాలివి. ఎక్కడ ఉన్నా పోరాటమే! ‘‘నేను బెంగళూరులో పుట్టిన మలయాళీని. నేను పుట్టిన నెలరోజులకే మా నాన్నకు హైదరాబాద్కు బదిలీ అయింది. నా బాల్యం మూడేళ్లు ఇక్కడే గడిచింది. నేను మహిళల కోసం పని చేయడానికి హైదరాబాద్ను ఎంచుకోవడం అనుకోకుండా జరిగింది. బెంగళూరులో స్టూడెంట్గా నేను ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొనేదాన్ని. స్త్రీ దేహం కాస్మటిక్ కంపెనీల నిబంధనల చట్రంలో ఇమడాలనే భావనను వ్యతిరేకించాను. స్త్రీ దేహం ఫలానా కొలతల్లో ఉంటేనే అందం అని ఒకరు నిర్ణయించడమేంటి, ఆ మాయలో చిక్కుకుని అమ్మాయిలు తమ దేహాన్ని నియంత్రించుకోవడానికి తంటాలు పడడం ఏమిటి? అని... స్త్రీ దేహాన్ని మార్కెట్ వస్తువుగా పరిగణించే ధోరణిని నిరసిస్తూ అందాల పోటీల నిర్వహణను అడ్డుకుని రెండు నెలలు జైల్లో ఉన్నాను. అప్పుడు నాకు ఇరవై రెండేళ్లు. నేను ఉద్యమించి జైలుకెళ్లడాన్ని మా ఇంట్లో సమ్మతించలేకపోయారు. అలా ఇల్లు వదిలి వచ్చేశాను. ఎక్కడికెళ్లాలో తెలియదు. రైల్వే స్టేషన్కెళ్లి కౌంటర్లో ఎటువెళ్లే రైళ్లున్నాయని అడిగాను. వాళ్లు చెప్పిన పేర్లలో ‘హైదరాబాద్’ వినిపించగానే ‘టికెట్ ఇవ్వండి’ అనేశాను. అలా హైదరాబాద్, చాదర్ఘాట్లో నివసిస్తున్న ఓ మిత్రురాలింటికి వచ్చాను. ఇక్కడ కూడా ఉద్యమించాల్సిన అవసరం వచ్చింది. అప్పుడు మూసీ నది తీరాన్ని ‘నందనవనం’గా మార్చాలని ప్రభుత్వం అక్కడి ఇళ్లను ఖాళీ చేయించాలని నిర్ణయం తీసుకుంది. ‘పునరావాసం కల్పించిన తర్వాత మాత్రమే మా ఇళ్లను కూలగొట్టండి’ అంటూ రోడ్డెక్కాను. ఆ తర్వాత హైదరాబాద్లో ‘మెహబూబ్ కీ మెహందీ’లో నివసిస్తున్న వారిని తొలగించే ప్రయత్నం జరిగింది. ఆ మహిళల కోసం ఏదైనా చేయాలని పూర్తిస్థాయిలో రంగంలోకి దిగాను. లైంగికహింస, అక్రమ రవాణాలకు గురయ్యి జైళ్లు, హోమ్లలో ఉన్న మహిళలను కలిశాను. వాళ్లలో చాలామంది తమ పిల్లలకు భవిష్యత్తు ఇవ్వమని కోరారు. అలా ఐదుగురు పిల్లలతో స్కూలు ప్రారంభించాను. ఆ తర్వాత పదిమంది పిల్లలతో షెల్టర్ హోమ్ పెట్టాను. అలా మొదలైన చిన్న ప్రయత్నం ఇప్పుడు పదిహేడు ట్రాన్సిషన్ సెంటర్లలో ఏడు వందల మంది పిల్లలు చదువుకునేంతగా పరిణమించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు పన్నెండు వేల మంది చదువుకుని గౌరవప్రదమైన జీవితాల్లో స్థిరపడ్డారు. ఈ ఫౌండేషన్ అవసరం ఉండకూడదు! ఆడపిల్లల అక్రమ రవాణాదారులు ఒక అమ్మాయిని తీసుకువచ్చినట్లు సమాచారం అందగానే దూకుడుగా వెళ్లిపోయేదాన్ని. అడ్డువచ్చిన వాళ్లతో బాహాబాహీకి దిగి మరీ ఆడపిల్లలను బయటకు తీసుకువచ్చేదాన్ని. అలా లెక్కలేనన్నిసార్లు నా మీద దాడులు జరిగాయి. చెవి మీద తగిలిన దెబ్బ కారణంగా వినికిడి కూడా తగ్గింది. ఆ దాడులను పట్టించుకోలేదు. కానీ నా అనుచరుడిని హత్య చేశారు. అప్పుడు నా పంథా మార్చుకుని పోలీస్, మహిళా సంక్షేమశాఖల వంటి ప్రభుత్వ వ్యవస్థలతో కలిసి పని చేయడం మొదలుపెట్టాను. ఇప్పటికి 96 వేల మంది బాలికలు, యువతులు, మహిళలను రక్షించగలిగాను. ఆ నంబరు ఇంత పెద్దదిగా ఉన్నందుకు గర్వపడడం కాదు మనం సిగ్గుపడాలి. స్త్రీల రక్షణ కోసం ప్రజ్వల ఫౌండేషన్ ప్రారంభించాను. సమాజంలో స్త్రీల అక్రమ రవాణా పూర్తిగా అంతరించిపోవాలి. నేను బతికి ఉండగానే ఈ ఫౌండేషన్ను మూసివేయాలనేది నా ఆకాంక్ష. సమాజంలో సున్నితత్వం పెరిగి, మంచి మార్పు రావాలని అందరం ఆశిద్దాం. – సునీతాకృష్ణన్, సామాజిక ఉద్యమకారిణి మగవాళ్లకు చెప్పాలి! నా బంగారు తల్లి సినిమాతో సమాజాన్ని ఆలోచింపచేయగలిగాను. ఆ సినిమాకి మూడు నేషనల్ అవార్డులు వచ్చాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీ నాలుగు నంది అవార్డులు ప్రకటించింది. ఇప్పుడు మగవారి మీద దృష్టి పెట్టాను. ఆడవాళ్ల మీద జరిగే దాడులను, మోసాలను అరికట్టడానికి భుజబలం ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనం కంటే మగవాళ్లను చైతన్యవంతం చేయడం వల్ల మంచి ఫలితాలు సాధించవచ్చనిపించింది. అందుకే ఇప్పుడు ‘మ్యాన్ అగెనెస్ట్ డిమాండ్ (మ్యాడ్)’ నినాదంతో ముందుకు వెళ్తున్నాను. ‘మీ లైంగిక అవసరాలకు ఇతర స్త్రీలను కోరుకోవడం మానేయండి, మీలో ఈ మార్పు వస్తే స్త్రీల అక్రమ రవాణా మాఫియా దానంతట అదే అంతరించిపోతుంది’ అని అభ్యర్థిస్తున్నాను. మనిషిలో సహజంగానే సున్నితత్వం ఉంటుంది. ఆ సున్నితత్వాన్ని పురుషాహంకారంతో అణచివేయకుండా ఉంటే చాలు. మార్పు వచ్చి తీరుతుంది’’ అని తన ఆకాంక్షను వ్యక్తం చేశారు సునీతా కృష్ణన్. ఇరవై ఆరేళ్ల తన పోరాటంలో తిరస్కారాలు తప్ప పురస్కారాలు అందలేదని, తన సొంతరాష్ట్రం కేరళలో ప్రభుత్వ పురస్కారం తర్వాత తెలుగు రాష్ట్రాల్లో దక్కిన తొలి గౌరవం ‘వైఎస్సార్ లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు’ అని సంతోషం వ్యక్తం చేశారామె. – వాకా మంజులారెడ్డి -
సంగీతమే నా ప్రయారిటీ.. లెజెండరీ ఎస్పీ బాలు అడుగుజాడల్లో
యువ గాయని జాహ్నవి... టీవీ చూస్తూ పాట నేర్చుకుంది. టీవీలో పాడుతూ పెరిగి పెద్దదైంది. టీవీ తెర మీద మురిపించిన పాట... ఇప్పుడు సినిమా తెర వెనుక వినిపిస్తోంది. ఎస్పీ బాలు నేర్పించిన మెళకువలే పాదముద్రలు. ఇంట్లో టీవీ ఉంటే పిల్లలు మాటలు త్వరగా నేర్చుకుంటారు. ఆ ఇంటి వాతావరణంలో నేర్పని మాటలు కూడా పిల్లల నాలుక మీద అవలీలగా దొర్లిపోతుంటాయి. ఈ అమ్మాయి టీవీ చూస్తూ మాటలతోపాటు పాటలు కూడా నేర్చుకుంది. ఆటల్లో ఆటగా సీరియల్ టైటిల్ సాంగ్స్ పాడేది. సంగీత నేపథ్యం ఉన్న కుటుంబం కాదు. కానీ సంగీతం దేవుడిచ్చిన వరంలా ఒంటపట్టింది. పాటల పట్ల పాపాయికి ఉన్న ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు ఆమెను సంగీతం టీచర్ దగ్గరకు తీసుకెళ్లారు. ఎవరూ పెద్దగా ప్రయాస పడింది లేదు. త్వరగానే గ్రహిస్తోందని సంగీతం టీచరు కామాక్షిగారు నోటిమాటతోనే ప్రశంసాపూర్వకమైన సర్టిఫికేట్ ఇచ్చేశారు. ఆ తర్వాత స్వరసుధ అనే మ్యూజిక్ అకాడమీలో చేరి సంగీత సాధన చేసింది. ఇదంతా జాహ్నవి వరంగల్లోనే. టెన్త్క్లాస్ తర్వాత ఇంటర్ కి జాహ్నవి హైదరాబాద్కు మారింది. ఆమె సంగీత ప్రపంచం మరింత విస్తృతమైంది. శ్రీనిధి, రామాచారి వంటి ప్రముఖ గురువుల దగ్గర సంగీతం నేర్చుకునే అవకాశం వచ్చింది. టీవీ రియాలిటీ షోల తో మొదలైన ఆమె సరిగమల ప్రయాణం ప్రముఖ నేపథ్య గాయకులు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంతో కలిసి పాడే అవకాశాన్నిచ్చింది. ఎస్పీబీ దగ్గర పాడడానికి ముందు జాహ్నవి పాటకు, ఆ తర్వాత జాహ్నవి పాటకు మధ్య స్పష్టమైన తేడా వచ్చిందని చెబుతోందీ యువగాయని. నేర్చుకున్న వారికి నేర్చుకున్నంత.. ‘‘రియాలిటీ షోలో నేను పద్యాన్ని పాడుతున్నాను. ఫైనల్ రౌండ్కు వెళ్లాలంటే ఆ రౌండ్ దాటాలి. అప్పుడు పద్యం పాడడంలో అనుసరించాల్సిన మెళకువ చెప్పారాయన’’ అంటూ ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం తనకు తొలిసారిగా నేర్పించిన సంగీతపాఠాన్ని గుర్తు చేసుకున్నది జాహ్నవి. ‘‘బాలు సర్తో 30కి పైగా ఎపిసోడ్లు చేశాను. పాట పాడేటప్పుడు ఆయన ఎంత కచ్చితంగా ఉంటారో ఆయన నొటేషన్ రాసుకోవడం చూసి తెలుసుకున్నాను. వేలాది పాటలు పాడిన అనుభవం ఉన్నప్పటికీ ప్రతి పాటనూ అదే ప్రారంభం అన్నంత శ్రద్ధగా ప్రిపేరవుతారు. ఒక అక్షరం పైన ‘నవ్వు’ అని రాసుకున్నారు. అలా రాసుకోవడం చూసిన తర్వాత ఆయన ఆ పాట పాడడాన్ని కూడా నిశితంగా గమనించాను. కచ్చితంగా ఆ అక్షరం రాగానే గొంతులో నవ్వును పలికించారు. ఆయన టీమ్లో కోరస్ పాడడం అనేది చిన్న అవకాశం కాదు. నేర్చుకునే వాళ్లకు నేర్చుకున్నంత జ్ఞానం అబ్బుతుంది. స్వరాలను పలకడంలో పాటించాల్సిన నిబంధనలను, పాట అవసరాన్ని బట్టి గొంతులో పలకాల్సిన రసాలను చెప్పేవారు. మొదట కుతూహలం కొద్దీ ఆయనను గమనించడం మొదలుపెట్టాను. అలా ఆయన చెప్పినవి కొన్ని, చూసి నేర్చుకున్నవి కొన్ని. ఒక్కొక్కటి నేర్చుకుంటున్న కొద్దీ... ఆశ్చర్యంగా నా పాటలో మార్పు నాకే స్పష్టంగా తెలియసాగింది. గాయనిగా గుర్తింపు తెచ్చుకోవాలనే లక్ష్యానికి స్ఫూర్తి ఎస్పీబీ సారే. పాటల పాఠాలు బీటెక్ పూర్తి చేసి సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. కానీ సంగీతమే నా తొలి ప్రయారిటీ. గాయనిగా అన్ని రకాల పాటలూ పాడగలననే గుర్తింపు తెచ్చుకోవాలి. మ్యూజిక్లో సర్టిఫికేట్ కోర్సు చేశాను. ఇప్పుడు డిప్లమో కోర్సు చేస్తున్నాను. క్లాసికల్, మెలోడీ, జానపదం, ఫాస్ట్బీట్... అన్నింటినీ పాడగలిగినప్పుడే సమగ్రత వస్తుంది. ఇక గాయనిగా నాకు సంతోషాన్నిచ్చిన సందర్భాలంటే... పాడుతా తీయగా సీజన్ 16లో రన్నర్ అప్గా నిలవడం. అదే ప్రోగ్రామ్లో విన్నర్ మా చెల్లి అక్షయసాయి. అలాగే ఎస్వీబీసీలో అన్నమాచార్య కీర్తనలు పాడే అవకాశం వచ్చింది. అది కూడా అత్యంత సంతోషం కలిగించింది. ఎన్టీఆర్ బయోపిక్, అఖండ, బీమ్లానాయక్, రాధేశ్యామ్ సినిమాల్లో గొప్ప సంగీత దర్శకుల ఆధ్వర్యంలో పాడాను. స్టేజ్ ప్రోగ్రామ్లలో పాడాలనే ఆసక్తి ఉన్నప్పటికీ ఎక్కువ కార్యక్రమాలు చేయలేకపోతున్నాను. బాలు గారి జయంతి సందర్భంగా నాలుగవ తేదీ ఉదయం పది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు రవీంద్రభారతిలో సంస్మరణ కార్యక్రమం జరుగుతోంది. సినీ మ్యూజిక్ యూనియన్ నిర్వహించే ఈ కార్యక్రమంలో వందమంది గాయనీగాయకులు, సంగీతకారులు పాల్గొంటున్నారు. అందులో పాట పాడడం నాకు మరువలేని జ్ఞాపకం అవుతుంది. ఆయన పాదముద్రల్లో నడిచి వచ్చిన గాయనిని. అది ఆ మహోన్నత గురువుకి నేను అందించే స్వర నివాళి’’ అని చెబుతున్నప్పుడు జాహ్నవి గొంతులో బాలుగారి పట్ల గౌరవపూర్వకమైన అభిమానం తొణికిసలాడింది. – వాకా మంజులారెడ్డి -
చట్టం ఉంది... కమిటీలేవి?
కేరళ హైకోర్టు ఈ నెల 17వ తేదీన ఓ కేసులో తీర్పునిస్తూ సినిమా రంగానికి ఒక ఆదేశం జారీ చేసింది. ఆ ఆదేశం ప్రకారం ప్రతి మూవీ ప్రొడక్షన్ హౌస్లోనూ తప్పనిసరిగా ఇంటర్నల్ కంప్లయింట్స్ కమిటీ ఉండి తీరాలి. అక్కడి సినిమారంగంలో ఉన్న మహిళల సమాఖ్య ‘ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్’ చేసిన న్యాయపోరాటంలో భాగంగా ఈ ఆదేశాన్ని జారీ చేసింది హైకోర్టు. మహిళా చైతన్యం మెండుగా ఉన్న కేరళ రాష్ట్రంలో మహిళలు న్యాయపోరాటంతో సాధించుకున్న విజయం అనే చెప్పాలి. సాధికారత సాధనలో పరుగులు తీస్తున్న మహిళలు ఇంకా జెండర్ వివక్ష నుంచి తప్పించుకోవడానికి పెనుగులాడాల్సిన పరిస్థితి. లైంగిక వేధింపుల నిరోధక చట్టం ఉంది. కానీ చట్టం అమలుకు ఇంకా ఎన్నాళ్లు? ఓ మూడున్నర దశాబ్దాల వెనక్కి, ఈ చట్టం లేని రోజుల్లోకి వెళ్తే... ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక ఐపీఎస్ ఆఫీసర్ల కేసు గుర్తుకు వచ్చి తీరుతుంది. ∙∙ రూపన్ డియోల్ బజాజ్, ఐఏఎస్ ఆఫీసర్. ఒక మహిళ ఎంత పెద్ద ఆఫీసర్ అయినప్పటికీ పితృస్వామ్య సమాజంలో కేవలం మహిళ మాత్రమేనా! అని సమాజం నివ్వెర పోయిన సంఘటన ఆమె జీవితంలో ఎదురైంది. ఐపీఎస్ ఆఫీసర్ కేపీఎస్ గిల్ నుంచి లైంగికవేధింపును ఎదుర్కోవాల్సి వచ్చిందామె. లైంగిక వేధింపుకు గురయ్యానంటూ న్యాయం చేయమంటూ మనదేశంలో చట్టాన్ని ఆశ్రయించిన తొలి మహిళాధికారి ఆమె. అత్యున్నత స్థాయి అధికారి కావడం వల్లనే ఆమె కనీసం చట్టాన్ని ఆశ్రయించడం అనే సాహసమైనా చేయగలిగారు. అంతకు ముందు ఎంతో మంది చిన్న ఉద్యోగినులు సాటి పురుష ఉద్యోగుల నుంచి వేధింపులు ఎదుర్కొంటూ కూడా నోరు మెదపడానికి ధైర్యం లేని స్థితిలో నలిగిపోయారు. నోరు విప్పిన వాళ్లకు కెరీర్ ప్రశ్నార్థకంగా మారుతూనే వచ్చింది. ఈ నేపథ్యంలో స్త్రీలు ఎదుర్కొంటున్న ఈ వేధింపులకు అడ్డుకట్ట వేయడానికి 2013లో ‘సెక్సువల్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ యట్ వర్క్ ప్లేస్ (ప్రివెన్షన్, ప్రొహిబిషన్ అండ్ రిడ్రెసల్) యాక్ట్, 2013’ వచ్చింది. ఈ చట్టం ప్రకారం పదిమంది ఉద్యోగులు పని చేస్తున్న పని ప్రదేశంలో వారిలో కనీసం ఒక్క మహిళ ఉన్నా సరే... ఈ చట్టం ప్రకారం ఒక కమిటీ ఉండాలి. సంఘటిత రంగాల్లోనే కాక అసంఘటిత రంగాల్లో కూడా ఇలాంటి కమిటీల ఏర్పాటుకు చట్టాలు ఉన్నాయని, సినిమా రంగం గ్లామర్ ఫీల్డ్ కాబట్టి ఇందులో తప్పనిసరి... చెబుతున్నారు ప్రముఖ న్యాయవాది పార్వతి. ∙∙∙ ఇదే విషయం మీద ప్రముఖ నటి, గతంలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్లో క్రియాశీలకంగా బాధ్యతలు నిర్వర్తించిన జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ ‘‘మీటూ ఉద్యమ సమయంలో ప్రభుత్వం చొరవ తీసుకుని ఒక కమిటీ వేసింది. పోలీసు ఉన్నతాధికారులు, యాక్టివిస్టులు, సినిమా ఇండస్ట్రీ నుంచి కొంతమందితో రూపొందిన కమిటీ అది. ఈ కమిటీ విస్తృతి చాలా పెద్దది. లైంగిక వేధింపుల నివారణ మాత్రమే కాదు. ఆడవాళ్లు పని చేసే చోట వాళ్లకు అనువైన వాతావరణం ఉండేటట్లు చూడడం కూడా కమిటీ బాధ్యతే. పెద్ద ఆర్టిస్టులకు సొంత కారవాన్ వంటి ఏర్పాట్లు ఉంటాయి. జూనియర్ ఆర్టిస్టులకు అలాంటివేవీ ఉండవు. వాళ్లు షూటింగ్ సెట్లో దుస్తులు మార్చుకోవడానికి గదులు, టాయిలెట్ వసతుల వంటివి ఉండేటట్లు చూడాలి. ఆడిషన్ జరిగేటప్పుడు కెమెరా ఉండి తీరాలి. ఈ చట్టం చెప్పిన నియమాలను ఒక చార్ట్ మీద రాసి ప్రొడక్షన్ హౌస్లో తగిలించాలి. మొత్తానికి ఉమెన్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ కల్పించడం ఈ చట్టం ఉద్దేశం. అయితే మీటూ సమయంలో పెద్ద కదలిక వచ్చింది. కానీ ఆ తర్వాత కరోనా కారణంగా షూటింగ్లు జరగకపోవడం వంటి అనేక కారణాలతో ఈ నియమావళి ప్రాధాన్యం కొంత తగ్గిందనే చెప్పాలి. అయితే ‘మా’ నుంచి నేను ఒక మహిళగా నా దృష్టికి వచ్చిన అనేక కేసులను పరిష్కరించాను. అలాగే ఫిలిమ్ చాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ కూడా తమ దృష్టికి వచ్చిన వాటిని పరిష్కరిస్తుంటాయి’’ అన్నారు. సమాజం అభివృద్ధి చెందుతోంది. ఆలోచన స్థాయులు ఆకాశాన్ని అంటుతున్నాయి. మహిళ విషయంలో... మహిళ అయిన కారణంగా ఆమె ఎదుర్కొంటున్న వేధింపులకు అడ్డుకట్ట వేయడానికి చట్టాలు రూపొందుతున్నాయి. అయితే మనిషి ఆలోచనలను మార్చడంలో వీటి పాత్ర పరిమితంగానే ఉంటోంది. నిజంగా మారాల్సింది మనిషి ఆలోచన. చట్టం వచ్చి దశాబ్దకాలమవుతోంది. ఇంకా కమిటీల నిర్మాణమే పూర్తిస్థాయిలో జరగలేదు. ‘అణచివేత’ అనే దురాలోచనను రూపుమాపగలిగిన సమాజం రావాలి. అది వివేచనతోనే సాధ్యం. కమిటీ ఉంటే కెమెరా ఉన్నట్లే! సర్వేలియన్స్ కెమెరా నిఘాలో ఉన్నామని తెలిస్తే మనిషి ఎంత బాధ్యతగా వ్యవహరిస్తాడో... పని ప్రదేశంలో ఇంటర్నల్ కంప్లయింట్ కమిటీ ఉన్నప్పుడు కూడా అంతే బాధ్యతగా వ్యవహరిస్తాడు. ప్రొడక్షన్ హౌస్లో ఈ కమిటీ ఉంటే... అది మహిళలకు భరోసానిస్తుంది. కమిటీ ఉందనే ధైర్యం మహిళలకు ఉంటుంది, కమిటీ ఉందనే భయం మగవాళ్లలో ఉంటుంది. – జీవిత రాజశేఖర్, సీనియర్ నటి ఇంకా విస్తరించాలి! పని ప్రదేశంలో మహిళల భద్రత కోసం రూపొందిన ఈ చట్టం ఇంకా విస్తరించాల్సి ఉంది. ఆఫీసుల్లో కొంతవరకు ఉన్నాయి. సినిమా రంగం కూడా దీని అవసరాన్ని గుర్తించింది. అలాగే ఇళ్లలో పని చేసే డొమెస్టిక్ వర్కర్లు కూడా ఈ చట్టం పరిధిలోకి వస్తారు. వాళ్లు ‘లోకల్ కంప్లయింట్స్ కమిటీ’లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇందులో కలెక్టర్, ఆర్డీవో స్థాయి అధికారులుండాలి. ఇవి ఇంకా పూర్తి స్థాయిలో ఏర్పడలేదు. అలాగే చట్టసభల మహిళాసభ్యులు ఈ చట్టం పరిధిలోకి రావడం లేదు. వాళ్లు ఐపీసీననుసరించి పోలీస్ స్టేషన్లో కంప్లయింట్ చేయాల్సిందే. ఈ చట్టాన్ని వాళ్లకు కూడా వర్తింప చేస్తూ అసెంబ్లీలో ఇంటర్నల్ కంప్లయింట్ కమిటీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. – ఇ. పార్వతి, సీనియర్ న్యాయవాది – వాకా మంజులారెడ్డి -
పెద్ద అచీవ్మెంట్.. మాటల్లో చెప్పలేను: షణ్ముఖప్రియ
‘ప్రతి ఒక్కరూ ఎవరికి వాళ్లు ప్రత్యేకత ఉన్న వాళ్లే. ఫైనల్లో గెలవగలిగిన టాలెంట్ అందరిలోనూ ఉంది’ ఇది షణ్ముఖ ప్రియ జవాబు. ‘ఫైనల్లో ఎవరు గెలుస్తున్నారనుకుంటున్నార’ని ఓ వారం కిందట జాతీయ మీడియా అడిగిన ప్రశ్నకు ప్రియ ఇచ్చిన ఈ సమాధానంలో ఎంతో పరిణతి ఉంది. ‘ఈ వేదిక నుంచి ఇంటికి వెళ్తూ ఏమి తీసుకెళ్లబోతున్నార’నే ప్రశ్నకు కూడా... ‘అనేక జ్ఞాపకాలను, నేర్చుకున్న పాఠాలను’ అని స్థితప్రజ్ఞతతో బదులిచ్చింది ఈ పద్దెనిమిదేళ్ల గడుసమ్మాయి. వైజాగ్లో పుట్టి టీవీ తెర మీద తెలుగు ప్రేక్షకుల కళ్ల ముందే పెరిగిన షణ్ముఖ ప్రియ గొంతు ప్రతి తెలుగింటిలోనూ వినిపించింది. పదమూడేళ్లుగా ప్రతి తెలుగింటికీ ఇంటి బిడ్డగా మారిపోయింది. అంతటి ప్రేమ ఆప్యాయతలను అందుకుంటోంది. ఒక ‘సారేగమప లిటిల్స్, మరో ‘పాడుతా తీయగా’, సూపర్సాంగ్స్, ద వాయిస్ ఇండియా కిడ్స్తో సెలయేరులా సాగిన రాగప్రవాహం ఇండియన్ ఐడల్ 12 రియాలిటీ షో వేదికను చేరింది. ఫైనల్స్లో ఆరవస్థానంలో నిలిచిన షణ్ముఖప్రియ ముంబయి నుంచి సాక్షితో పంచుకున్న అనుభవాలు. ఈ షో మలుపు తిప్పింది. ‘‘నాకు చిన్నప్పటి నుంచి ఇండియన్ ఐడల్లో పాడాలనే కోరిక ఉండేది. ఆ లక్ష్యాన్ని చేరుకున్నాను. ఫైనల్ వరకు రావడమే పెద్ద అచీవ్మెంట్. దానిని సాధించగలిగాను. సంగీతంతో మమేకమైన నా జీవితంలో ఈ షో చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈ షో ద్వారా నేను ఎంతమంది సంగీతప్రియుల మనసుకు దగ్గరయ్యానో మాటల్లో చెప్పలేను. ప్రతి పాటలోనూ నా వంతుగా నూటికి నూరుశాతం ఇచ్చాను. మై లెవెల్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చానని చెప్పడానికి సందేహించడం లేదు. ఇక గెలుపు ఓటముల విషయం అంటారా? ఇక్కడ గెలుపును ఆన్లైన్ ఓటింగ్ కూడా ప్రభావితం చేస్తుంది. కాబట్టి నా పార్టిసిపేషన్ మాత్రమే నాకు ముఖ్యం. ఫలితం మీద నాకు ఎటువంటి అసంతృప్తి లేదు. పైగా ఈ షో నా జీవితంలో గొప్ప మలుపు కాబోతోంది. జావేద్ అక్తర్తోపాటు అనేకమంది బాలీవుడ్ ప్రముఖులు నన్ను ఈ షో ద్వారానే గుర్తించారు. నన్ను అంతర్జాతీయ ప్రముఖులు జస్టిన్ బీబర్, షకీరాలతో పోల్చారు. నాకది ఎంతో సంతోషంగా ఉంది. రెండు వేలుగా ఉన్న నా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య ఏకంగా రెండు లక్షల ఎనభై వేలకు చేరింది కూడా ఇప్పుడే. ఈ సమయంలో కొత్త ప్రాజెక్టులు కూడా సైన్ చేశాను. ఇరవై పాటలతో విడుదలవుతున్న ఓ ప్రైవేట్ ఆల్బమ్ కోసం ముగ్గురిని సెలెక్ట్ చేసుకున్నారు. అందులో నేను కూడా ఉన్నాను. నేను గెలవాలని ఇంతమంది వీక్షకులు కోరుకోవడమే పెద్ద విజయం’’ అని చెప్పింది షణ్ముఖ ప్రియ. అలాగే ఈ ఇండియన్ ఐడల్ 12 రియాలిటీ షో సందర్భంగా ప్రియ మరో ముఖ్యమైన నిర్ణయాన్ని కూడా ప్రకటించేసింది. అదేంటంటే... ‘ఇదే నా ఆఖరి రియాలిటీ షో. ఇకపై సంగీత ప్రపంచంలో నా ప్రయాణం కొత్తదారిలో సాగుతుంది’ అని చెప్పింది. – వాకా మంజులారెడ్డి -
గ్రేట్ జర్నీ... మానస చిత్రం
గిగిల్స్... లిల్లీపుట్ ల్యాండ్ పేరు పైన రెండు బుజ్జి పాదాలు. లోపలికి వెళ్తే ఓ గదిలో పదకొండు నెలల బాబు విహాస్ పియానో ముందు కూర్చుని కీ బోర్డుని పరీక్షగా చూస్తున్నాడు. ఆ బాబు దృష్టి తన వైపు మరల్చుకోవడానికి ప్రయత్నిస్తోందామె. ఇంగ్లిష్ రైమ్ మొదలు పెట్టగానే బాబు ఆమె వైపే చూడసాగాడు. ఓ అరనిమిషం పాటు అలాగే చూసి నోరంతా తెరిచి నవ్వాడు. అప్పుడు క్లిక్ మన్నది ఆమె చేతిలోని కెమెరా. ఆమె పేరు మానస అల్లాడి. కెమెరామన్ అనే మాటను సవరిస్తూ కెమెరా పర్సన్ అనే పదాన్ని నిర్ధారించేశారు. అందుకు మహిళలు వేసిన ఓ ముందడుగే కారణం. ఫొటోగ్రాఫర్గా మగవాళ్లు మాత్రమే ఉన్న రోజుల్లో నిర్ధారణ అయిన పదానికి జెండర్ స్పెసిఫికేషన్ను తుడిచేస్తున్నారు మహిళలు. ఫొటోగ్రాఫర్గా మహిళలు అరుదుగానే అయినా కనిపిస్తున్నారు. వాళ్లు కూడా ఫొటో జర్నలిస్టులు. ప్రైవేట్ ఫొటోగ్రాఫర్ల విషయానికి వస్తే... ఇంకా మహిళల ప్రస్థానం ఊపందుకోలేదు. అలాంటి సమయంలో ఓ సాహసం చేసింది మానస అల్లాడి. విహాస్ను ఫొటో తీస్తున్న ఉమన్ ఫొటోగ్రాఫర్ మానస ఫొటోగ్రఫీ మీద ఇష్టంతో కోర్సు చేయడంతోపాటు సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగాన్ని వదిలి సొంతంగా ఫొటో స్టూడియో పెట్టింది. మరో ఐదుగురు ఫొటోగ్రాఫర్లకు, ఐదుగురు ఎడిటర్లకు ఉద్యోగం ఇచ్చింది. సొంత స్టూడియో ఆలోచనకు దారి తీసిన కారణం తనలోని తల్లి మనసేనంటోంది. తన పిల్లలను రకరకాల పోజుల్లో చూడాలని ముచ్చటపడింది. డెలివరీ అయిన ఐదో రోజున నిద్రలో నవ్వుతున్న తన బాబుని ఫొటో తీయాలనుకుంది. ఆ క్షణంలో తాను కదల్లేదు. ఫొటోలు తీయడానికి ఫొటోగ్రాఫర్లు అందుబాటులో లేరు. అలా ఆ కోరిక తీరకపోవడం వల్ల ఆ పని తానే మొదలు పెట్టింది. సొంతంగా డిజైన్ కరీంనగర్లో పుట్టి పెరిగిన మానస, ఇంజనీరింగ్ వరకు అక్కడే చదివింది. బీటెక్ పట్టాతో హైదరాబాద్కి వచ్చి ఇన్ఫోసిస్లో ఉద్యోగంలో చేరింది. ఏడేళ్లు ఉద్యోగం ఇవ్వని సంతృప్తి మూడేళ్ల ఫొటోగ్రఫీ ఇచ్చింది. ఉద్యోగం చేస్తూనే ఒక ప్రైవేట్ ఫొటోగ్రఫీ ఇన్స్టిట్యూట్లో చేరి డిప్లమో కోర్సు చేసింది. సీనియర్ దగ్గర మెళకువలు నేర్చుకుంది. అప్పటికి స్టూడియో పెట్టే ఆలోచన లేదు. కేవలం ఇష్టంతో మాత్రమే నేర్చుకున్నది. ‘‘మా అబ్బాయి ఐదు రోజుల బిడ్డగా ఉన్నప్పుడు ఫొటో తీయడానికి బేబీ ఫొటోగ్రఫీ ప్రొఫెషనల్స్ ఎవరూ అందుబాటులో లేకపోవడంతో చాలా నిరుత్సాహం కలిగింది. నేను లేవగలిగినప్పటి నుంచి బాబుకి నేనే ఫొటోలు తీసుకున్నాను. ప్రతినెలా పుట్టినరోజు చేస్తూ ఒక్కో నెల డ్రెస్కి ఒక్కో థీమ్తో కుట్టించి మరీ ఫొటోలు తీశాను. రెండవసారి మెటర్నిటీ లీవ్లో ఉన్నప్పుడు సీరియెస్గా ఆలోచించాను. నేనే స్టూడియో పెడతాను. బేబీ ప్రతి మూమెంట్ని, రకరకాల నేపథ్యాలలో కెమెరాలో దాస్తానని ఇంట్లో చెప్పాను. ఇంట్లో ఎవరూ అడ్డు చెప్పలేదు. ‘ఏ ప్రయోగం చేయాలన్నా ఇదే సరైన వయసు’ అని ప్రోత్సహించారు. ఇక నేను ఏయే థీమ్స్తో పిల్లల్ని ఫొటో తీయాలని ముచ్చటపడ్డానో అన్ని సెట్టింగులూ చేయించుకున్నాను. మా స్టూడియోలో ఉన్నవేవీ మార్కెట్లో రెడీమేడ్గా దొరికేవి కాదు. ప్రతిదీ నేనే డ్రాయింగ్ వేసి కార్పెంటర్కి వివరించి చేయించుకున్నాను. మొత్తం ముప్పై నేపథ్యాలతో గదులు సిద్ధమయ్యాయి. అన్నీ త్రీ డైమన్షన్ సెటప్లే. ఇండియాలో పెద్ద బేబీ ఫొటో స్టూడియో ఇదే. ఈ ఏడాది మా కరీంనగర్లో కూడా ఓ స్టూడియో పెట్టాను. పిల్లలు మాలిమి అవుతారు ఉద్యోగం చేసినప్పుడు మిగుల్చుకున్న డబ్బు పదిలక్షలతో 2017లో హైదరాబాద్, బోయిన్పల్లిలో స్టూడియో పెట్టాను. అప్పటికి హైదరాబాద్లో న్యూ బార్న్ బేబీ స్టూడియో ఉంది. కానీ మహిళలు ఈ ప్రయత్నం చేయలేదు. నాకు అడ్వాంటేజ్ ఏమిటంటే... చిన్న పిల్లలు మగవాళ్ల కంటే ఆడవాళ్లకే త్వరగా మాలిమి అవుతారు. పిల్లలతో ఓ అరగంట గడిపితే ఆ బేబీకి ఏమిష్టమో అర్థమవుతుంది. అదే సమయంలో పిల్లలకు నేను అలవాటవుతాను. ఒక్కో పిల్లలు రైమ్స్ ఇష్టపడతారు, కొందరు బొమ్మలను ఇష్టపడతారు. ఇక షూట్ చేసేటప్పుడు వాళ్లకు ఇష్టమైనవి చేస్తూ ఉండాలన్నమాట. మగవాళ్లకు పిల్లలు ఎందుకు ఏడుస్తున్నారో అర్థం కాదు. ఏం చేస్తే వాళ్ల ఏడుపును ఆపవచ్చనేది కూడా వెంటనే స్ఫురించదు. కాబట్టి ఈ ప్రొఫెషన్లో ముఖ్యంగా బేబీ ఫోటోగ్రఫీలో మహిళలకు మంచి అవకాశాలుంటాయి. హాబీగా నేర్చుకున్న వాళ్లు అక్కడితో ఆగిపోకుండా దీనిని ప్రొఫెషన్గా తీసుకోవచ్చు’’ అన్నది మానస. ఒక తొలి అడుగు మరికొన్ని అడుగులకు స్ఫూర్తి అవుతుంది. మానస ఇష్టంగా క్లిక్ మనిపించుకున్న జీవిత చిత్రమిది. ఈ దారిలో మరికొంతమంది యువతులు ఫొటోగ్రాఫర్లుగా ఎదగాలని ఆశిద్దాం. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు : మోహనాచారి -
గ్రేట్ జర్నీ..పత్తి రైతుల కాగడా..
ఆమె ఓ ఉద్యమజ్యోతి. తాను వెలుగుతూ... పదిమందికి వెలుగులు పంచే కాగడా. ‘ఏ ఫ్రేడ్ హిస్టరీ – ద జర్నీ ఆఫ్ కాటన్ ఇన్ ఇండియా’లో వత్తిలా కాలిపోతున్న పత్తి రైతు జీవితాన్ని రాశారు. ఇంగ్లిష్ లిటరేచర్ చదివిన ఓ యువతి సామాజిక కార్యకర్తగా, మల్కా పరిరక్షకురాలిగా రూపాంతరం చెందడానికి దారి తీసిన పరిస్థితులను వివరిస్తుందా పుస్తకం. డెబ్బై ఐదేళ్లు దాటిన ఉజ్రమ్మ లైఫ్ జర్నీతోపాటు పెట్టుబడిదారుల గుత్తాధిపత్యానికి వ్యతిరేకంగా ఆమె తన ఉద్యమాన్ని మౌనంగా విస్తరింపచేస్తున్న వైనం కనిపిస్తుంది. అభ్యుదయ హైదరాబాదీ ఉజ్రమ్మ హైదరాబాద్లో అభ్యుదయ కుటుంబంలో పుట్టారు. నానమ్మ ఉద్యమస్ఫూర్తి వల్ల తమ కుటుంబంలో ఆడపిల్లల చదువుకు మార్గం సుగమమైందని చెప్పారామె. చిన్నాన్న సజ్జత్ జహీర్ కమ్యూనిస్ట్ భావాల ప్రభావం తన మీద ఉందంటారామె. సామాజికాంశాల మీద స్పందించే తత్వం చిన్నాన్న నుంచే వచ్చిందని చెప్పే వజ్రమ్మ ఉద్యమపోరు బ్రిటిష్ కాలంలోనే మొదలైంది. విదేశాల స్పిన్నింగ్ మిల్లులు సూచించిన పత్తి వంగడంతో మనదేశంలో పంట పండించడం మొదలైననాడే ఆమె పత్తి రైతుల ఆత్మహత్యలను ఊహించగలిగారు. ఆ దోపిడీ పత్తితో ఆగదని, దానికి అనుబంధ రంగమైన చేనేతకు కూడా ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు. కష్టం మనది... లాభం వాళ్లది ‘‘మనదేశంలో రకరకాల వాతావరణం, భౌగోళిక వైవిధ్యతల కారణంగా ప్రాంతానికి ఒక రకం పత్తి పండుతుంది. ఆ పత్తి నుంచి వచ్చే దారం, ఆ దారంతో నేసే దుస్తులలోనూ భిన్నత్వం ఉంటుంది. ఇంతటి వైవిధ్యతను కాలరాసింది ఒక్క స్పిన్నింగ్ యంత్రం. విదేశాల్లో ఏర్పాటైన వస్త్ర పరిశ్రమలకు ముడిసరుకు కావాలి. ఆ ముడిసరుకు వాళ్లు తయారు చేసుకున్న యంత్రాలకు అనుగుణంగా ఉండాలి. అందుకోసం మన రైతులకు పత్తి గింజలనిచ్చి... ‘పంట పండించండి, ఉత్పత్తిని మేమే కొంటాం’ అని చెప్పారు. అలా పత్తి గింజ వాళ్లదైంది, దారం వాళ్లదే అయింది. దారం ధరను నిర్ణయించే అధికారమూ వాళ్లదే అయింది. దాంతో చేనేత రంగం ముడిసరుకు సమస్యలో పడిపోయింది. మనది కాని వంగడం తో తెగుళ్లు ఎక్కువ. దాంతో పత్తిని పండించే రైతు బతుకుకు లాభాలు వస్తాయనే భరోసా లేదు. దారం ధర నిర్ణయించేది వాళ్లే... దాంతో చేనేత మగ్గం అంధకారంలో మగ్గిపోయింది. లాభాలు మాత్రం స్పిన్నింగ్ మిల్లులవి. లాభాలను బట్టే సమాజంలో గౌరవాల స్థాయిలో కూడా ఎంతో తేడా. పత్తి రైతు, చేనేతకారుడు ఈ విషవలయం నుంచి బయటపడి ఆర్థికంగా బలపడాలి. దేశంలో అనేక ప్రాంతాల్లో పత్తి రైతులను, చేనేత పరిశ్రమలను స్వయంగా చూశాను. చేనేతకారులు తమ ఉత్పత్తులు మార్కెట్ చేసుకోవడానికి ‘దస్తకార్ ఆంధ్ర’ రూపకల్పనలో పనిచేశాను. పదమూడేళ్లు గా మల్కా పరిరక్షణ మీద దృష్టి పెట్టాను. మల్కా అంటే ఖాదీ వంటి ఒక వస్త్ర విశేషం. ఇలాంటిది ప్రపంచంలో మరెక్కడా ఉండదు. సిరిసిల్లలో డెబ్బై కుటుంబాలు మల్కా పరిరక్షణలో పని చేస్తున్నాయి. యూరప్, యూఎస్లు తాము అనుసరిస్తున్న సైన్స్కి మోడరన్ సైన్స్ అని ఒక ముద్ర వేసుకుని, థర్డ్ వరల్డ్ కంట్రీస్ని తమ గుత్తాధిపత్యంలోకి తెచ్చుకోవడానికి కుట్ర పన్నాయి. మన యువతకు చెప్పేది ఒక్కటే. విదేశాల మీద ఆధారపడే పరిస్థితి నుంచి మనం బయట పడాలి. మన పత్తి నుంచి దారం తీయడానికి అధునాతన యంత్రాలను కనిపెట్టండి. మన పత్తి, మన దారం, మన నేత... వీటన్నింటికీ మనమే ధర నిర్ణయించగలిగిన వాళ్లమవుతాం’’ అంటారామె. సెలబ్రిటీల సెలబ్రిటీ ఉజ్రమ్మ నిరాడంబరంగా ఉంటారు. సెలబ్రిటీలు ఆమెతో ఫొటో తీసుకోవాలని ముచ్చటపడతారు. చేనేత అనగానే ముఖం చిట్లించే వారి చేత ‘ఐ లైక్ హ్యాండ్ వీవెన్ ఇండియన్ కాటన్’ అని స్టైలిష్గా పలికిస్తున్నారామె. పత్తి రైతు బతుకుకు కొరివి పెడుతున్న కంపెనీల బారి నుంచి రైతు జీవితానికి కాగడా పట్టే ప్రయత్నం చేస్తున్నారు. తన ఉద్యమానికి వారసులుగా కొత్తతరం చేనేతకారులను తయారు చేస్తున్నారు. వారి కోసం మెహిదీపట్నంలో మల్కా మార్కెటింగ్ ట్రస్ట్ ద్వారా మార్కెటింగ్ మెళకువలు నేర్పిస్తున్నారు ఉజ్రమ్మ. – వాకా మంజులారెడ్డి -
అక్కున చేర్చుకుందాం
మూడున్నర కోట్లకు పైగా వీథికుక్కలున్నాయి మనదేశంలో. పెంపుడు కుక్కలకు ఉన్నట్లు వాటి పొట్టను చూసి ఆకలి తీర్చే పెట్ పేరెంట్స్ ఎవరూ వీథి కుక్కలకు ఉండరు. వాటి ఆహారాన్ని అవి సొంతంగా సంపాదించుకుంటాయి. అది ప్రకృతి నియమం కూడా. అయితే... వాటికి ఎదురయ్యే ప్రధాన కష్టం ఆరోగ్యరక్షణ లేకపోవడమే. ‘‘ప్రతి పాణికీ జీవించే హక్కు ఉంది. వీథికుక్కలు అయినంత మాత్రాన వాటి జీవించే హక్కును కాలరాసే అధికారం మనిషికి ఉండదు. చేతనైతే వాటిని పరిరక్షించడానికి ముందుకు రండి’’ అంటున్నారు ఎన్ఆర్ఐ ఉజ్వల చింతల. ఇందుకోసం ఆమె ‘స్ట్రే యానిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా’ ను స్థాపించి అమెరికాలో ఉద్యోగం చేస్తూ ఇండియాలోని వీథికుక్కల కోసం పని చేస్తున్నారు. మాది మహేశ్వరం ఉజ్వల చింతల 2019లో యూఎస్, ఫ్లోరిడాలో ‘స్ట్రే యానిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా’ సంస్థను స్థాపించారు. అంతకు ముందు కొన్నేళ్లుగా ఆమె వీథి కుక్కల కోసం పని చేస్తూనే ఉన్నారు. ‘‘మాది హైదరాబాద్ సమీపంలోని మహేశ్వరం. నాన్న నిర్వహిస్తున్న గురుకుల విద్యాలయంలోనే చదివాను. బాండింగ్ నా బలం, బలహీనత కూడా. ఇంటర్కి విజయవాడలోని మేరీస్టెల్లా కాలేజ్లో చేరిస్తే అమ్మానాన్నలకు దూరంగా ఉండలేక, మూడు నెలల్లో వెనక్కి వచ్చేశాను. డిగ్రీ హన్మకొండ, ఎంబీఏ బెంగళూరులో చేసిన తర్వాత పెళ్లితో యూఎస్ వెళ్లాల్సి వచ్చింది. యూఎస్లో కంప్యూటర్స్ కోర్సులు చేసి ఉద్యోగంలో చేరాను. పేరెంట్స్ మీద బెంగ తో తరచూ ఇండియాకి వస్తూనే ఉంటాను. అలా రావడమే ఈ సేవాపథంలో నడిపించింది. పాలు తాగే పిల్లల్ని విసిరేశారు 2013లో ఇండియా వచ్చినప్పుడు ఒక ఇంటి వాళ్లు చిన్న కుక్కపిల్లల్ని పాలుతాగే పిల్లలని కూడా చూడకుండా నిర్దాక్షిణ్యంగా బయటపడేయడం నా కంట పడింది. అప్పుడు తల్లి కుక్క పడిన ఆరాటం, ఆవేదన వర్ణించడానికి మాటలు చాలవు. మరోసారి పెళ్లిలో భోజనాల దగ్గర... పదార్థాలన్నీ పారవేస్తున్నారు. ఆ ప్లేట్ల కుప్ప మీదకు కుక్కలు ఎగబడుతున్నాయి. ఓ వ్యక్తి కర్ర తీసుకుని వాటిని విచక్షణరహితంగా కొడుతున్నాడు. అలాంటిదే మరోటి... ఓ కుక్కకు వెనుక కాళ్లు రెండూ విరిగిపోయాయి. దేహాన్ని నేల మీద ఈడ్చుకుంటూ పోతోంది. దానికి ట్రీట్మెంట్ చేయించడానికి ప్రయత్నిస్తే సాధ్యం కాలేదు. పర్మిషన్ తీసుకుని నాతోపాటు మూడు కుక్కలను యూఎస్ తీసుకెళ్లాను. అక్కడ చికిత్స చేయించి కోలుకున్న తర్వాత పెంచుకునే వాళ్లకు దత్తత ఇచ్చాను. అప్పటి నుంచి స్ట్రే యానిమల్స్ కోసం పని చేస్తున్నాను. అమెరికాలో లడ్డూ హౌస్ హైదరాబాద్, అమీన్పూర్లో షెడ్ వేసి, ముగ్గురు ఉద్యోగులతో ఓ సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించాను. ఇప్పడు తొంభై ఉన్నాయి. నెలనెలా వాటి పోషణ, ట్రీట్మెంట్ కోసం డబ్బు పంపిస్తున్నాను. నా జీతం నుంచి కొంత భాగం, నా లడ్డూ హౌస్ రాబడితో వాటిని సంరక్షిస్తున్నాను. లడ్డూ హౌస్ బ్రాండ్ మీద నేను ఆర్గానిక్ ప్రోడక్ట్స్తో తినుబండారాలు తయారు చేసి, ఆదివారం ‘స్ట్రే యానిమల్స్ కోసం’ అని బోర్డు పెట్టి సేల్ చేస్తున్నాను. యూఎస్లో చారిటీ కోసం సేల్స్ చేసినప్పుడు... ఒక వస్తువు ధరను ఆ పదార్థానికి ఆపాదించి చూడరు, చారిటీ కోసం ధారాళంగా ఖర్చు చేస్తారు. మేము ప్రధానంగా గాయపడిన కుక్కలకు వైద్యం చేయించడం, కోలుకున్న తర్వాత పెంపకానికి ఇచ్చేయడం లేదా స్వేచ్ఛగా వదిలేయడం మీద దృష్టి పెట్టాం. ముసలితనం వల్ల ఎటూ పోలేని కుక్కలకైతే జీవితకాలపు సంరక్షణ బాధ్యత మాదే. ఇక కుక్కలకు స్టెరిలైజేషన్ వంటి కొన్ని సహకారాలను బ్లూ క్రాస్ నుంచి తీసుకుంటాం’’ అని చెప్పారు ఉజ్వల. భారతీయ సమాజాన్ని ఆమె కోరుకునేది ఒక్కటే... మనం మనుషులం, మానవీయంగా మసలుకుందాం. కుక్క అనగానే తక్కువగా చూడవద్దు. వాటి జీవితం మన అధికారం ప్రదర్శించవద్దు. మనవి ‘ప్రాణాలను హరించే చేతులు కావద్దు, రక్షించే చేతులు కావాలి’ అన్నారు. – వాకా మంజులారెడ్డి -
ఇది ధైర్యం కాదు... భయం లేకపోవడం!
ఎమ్మెస్సీ కంప్యూటర్స్, ఎకనమిక్స్లో ఎంఫిల్ చేసిన కవిత యాగ బుగ్గన యూఎస్లో సాఫ్ట్వేర్ నిపుణులుగా, ఇండియాలో డెవలప్మెంటల్ ఎకనమిస్ట్గా చేశారు. ట్రావెల్, ఫిక్షన్, నాన్ఫిక్షన్ రైటర్. రిషివ్యాలీ స్కూల్ ఆమెకు ప్రపంచాన్ని చదవడం నేర్పించింది. సునిశితంగా విశ్లేషించి, ప్రశ్నించగలిగిన నైపుణ్యాన్ని అలవరిచింది. ‘‘వీటన్నింటి నేపథ్యంలో నాకు తెలిసిందేమిటంటే... ఆధ్యాత్మికత అంటే జీవితాన్ని నిస్సారంగా గడపడం కాదు, సమాజం నుంచి దూరంగా వెళ్లిపోవడమూ కాదు. సమాజంలో జీవిస్తూ, వృత్తి ఉద్యోగాలలో కరుణపూరితంగా వ్యవహరించగలగడం’ అంటారామె. ఆ నీటిలో విషం లేదు! కవిత విస్తృతంగా పర్యటనలు చేస్తారు. అవి సాహసానికి లోతైన నిర్వచనాన్ని తెలియచేస్తుంటాయి. అవన్నీ జీవితాలను అర్థం చేసుకోవడానికే అయి ఉంటాయి. మూఢనమ్మకాలను తుడిచేయడానికి సాహసాలు చేశారు. మన్సరోవర్ సమీపంలోని రాక్షస్తాల్ ను స్థానికులు విషపు నీటి మడుగు అంటారు. రావణాసురుడు ఆ మడుగు దగ్గర తపస్సు చేసిన కారణంగా అవి విషపూరితమయ్యాయనే కథనంతో ఆ సరస్సు సామాజిక బహిష్కరణుకు గురైంది. కవిత తన పర్యటన సందర్భంగా ఆ నీటిని తాగి ‘నేను తాగాను, ఏమైంది’ అని ప్రశ్నించారు. కొంచెం ఉప్పగా ఉన్న కారణంగా ఆ నీటిని తాగవద్దు అని చెప్పడానికి ఇంత పెద్ద ట్యాగ్ తగిలించడం ఏమిటనేది ఆమె ప్రశ్న. అందరూ తీర్పరులే! ప్రయాణం అంటే ప్రదేశాలను చూసే వ్యాపకం కాదు, జీవితాలను చదివే సాధనం అంటారు కవిత. గుంటూరు జిల్లాలోని స్టూవర్ట్పురం మీదుగా ఎంతోమంది ఎన్నోసార్లు ప్రయాణించి ఉంటారు. స్టేషన్ పేరు విని ఆ పేరు రావడానికి కారణాలు తెలుసుకుని, ఆ గ్రామాన్ని ఏర్పాటు చేయడానికి దారి తీసిన పరిస్థితులను అన్వేషించారు కవిత. కులవ్యవస్థ మన సమాజంలో అభివృద్ధి నిరోధకంగా ఉన్న పెద్ద అడ్డంకి. అయితే ఏకంగా ఒక సామాజిక వర్గం మొత్తాన్ని దొంగలుగా ముద్ర వేయడాన్ని తీవ్రంగా నిరసించారామె. ‘‘ఒక వ్యక్తి గుణగణాలు ఆ వ్యక్తికే పరిమితం. ఒక వ్యక్తి దుర్గుణాలను ఆ కుటుంబం మొత్తానికి ఆపాదించడమే పెద్ద తప్పు, అలాంటిది ఆ కులమంతటికీ ఆపాదించడం ఏమిటి? సంస్కరణ పేరుతో వారిని బలవంతం గా ఒకచోటకు తరలించి, ఇక్కడే నివసించాలనే నిర్దేశించడం శిక్షార్హమైన నేరం’’ అంటారు కవిత. మన సమాజంలో అగ్రవర్ణాలుగా చలామణిలో ఉన్న వాళ్ల విషయంలో ఇలాగే చేసేవారా... అంటూ అప్పటి బ్రిటిష్ పాలకుల విధానాన్ని నిరసించారు. తన ప్రయాణ పరిశోధనలన్నింటినీ అక్షరబద్ధం చేస్తారామె. మన సమాజంలో ఉన్న పెద్ద అవలక్షణం... ఇతరుల జీవితానికి ప్రతి ఒక్కరూ తీర్పరులుగా మారిపోవడమే అంటారు కవిత. పాశ్చాత్య జీవనశైలిని మన జీవితాల్లోకి స్వాగతించినంత బేషరతుగా వారి ఆలోచన ధోరణిని అలవరుచుకోవడం లేదంటారామె. హిందూ, రివర్ టీత్, తెహల్కా, జాగరీ లిట్ వంటి వార్తాపత్రికలు, ఫిక్షన్– నాన్ ఫిక్షన్ జర్నల్స్లో ప్రచురితమైన రచనల్లో ఆమె తెలుగు నేల మీద విస్తరించిన బ్రిటిష్ కాలనీ బిట్రగుంటను కూడా ప్రస్తావించారు. చైనా పాలనలో టిబెట్ వాసుల అసంతృప్తినీ, నేపాల్లోని హమ్లా వ్యాలీ ప్రజల పేదరికాన్నీ రాశారు. అసలైన తాత్వికత శ్రీలంక, నేపాల్, టిబెట్, లెబనాన్, రుమేనియా, ఇటలీ, ఫ్రాన్స్, యూకే, యూఎస్, కెనడా,స్పెయిన్, చైనా, జపాన్, కాంబోడియా, మయన్మార్, థాయ్ల్యాండ్, టాంజానియావంటి అనేక దేశాల్లో పర్యటించిన కవిత అసలైన తాత్విక జీవనం సాగిస్తున్నది సంచార జాతులేనంటారు. ‘‘ఆదివాసీలు, అందులోనూ సంచార జాతుల ఫిలాసఫీ చాలా గొప్పది. ఎక్స్పెక్టేషన్స్ ఉండవు, అందుకే ఈర్ష్య, అసూయ, వైషమ్యాలు ఉండవు. జీవితాన్ని యథాతథంగా స్వీకరిస్తారు. అడవుల్లో జీవించే వాళ్లు ప్రకృతి ఏమి ఇస్తే దాంతోనే జీవితం అనుకుంటారు, ప్రకృతికి హాని కలిగించరు. ప్రభుత్వాలు అడవి మీద ఆధిపత్యాన్ని హస్తగతం చేసుకోవడంతో వారి జీవితాల్లో ఒడిదొడుకులు మొదలయ్యాయ’’ంటారు కవిత. మగవాళ్లు సాహసించని ప్రదేశాలకు కూడా ఆమె చొరవగా వెళ్లిపోతారు, అక్కడి విషయాలను అంతే ధైర్యంగా రాస్తారు. అదే విషయాన్ని ఆమె ‘ఇది ధైర్యం కాదు, భయం లేకపోవడం’ అంటారు. జీవితం పట్ల ఆందోళన, భయం లేనప్పుడు ఏదీ భయపెట్టద’ని రిషీవ్యాలీ స్కూల్ నేర్పించిన ఫిలాసఫీని మరోసారి గుర్తు చేశారు. – వాకా మంజులారెడ్డి -
చేతన సామ్రాజ్యాన్ని తానే నిర్మించుకుంది
చేతనాజైన్... ఆర్కిటెక్ట్. యాభై మంది ఉద్యోగులున్న తన సొంత సంస్థకు ఆమె సీఈవో. తండ్రి స్థాపించిన సంస్థను వారసత్వంగా అందిపుచ్చుకున్న మహిళ కాదామె. తన జీవితాన్ని తానే నిర్మించుకున్న ఓ ట్రెండ్సెట్టర్. ఆర్కిటెక్చర్ రంగంలో మహిళలు లెక్కలేనంత మంది ఉన్న మాట నిజమే. కానీ ఎక్కువ మంది మగవాళ్లు స్థాపించిన సంస్థలో ఉద్యోగి గా ఉండడానికే ఇష్టపడుతుంటారు. మరికొందరు ఇంటీరియర్ డిజైనింగ్ వైపు మరలిపోతుంటారు. అలాంటి సమయంలో ఇరవై రెండేళ్ల కిందట సొంత సంస్థను స్థాపించి, నిర్మాణరంగంలో తనదైన పాదముద్రలు వేసిన మహిళ చేతనా జైన్. అమ్మ అనుసరించిన సూత్రమే.... హైదరాబాద్లో పుట్టి పెరిగిన చేతనాజైన్ ది గుజరాతీ వ్యాపార కుటుంబం. ఆర్కిటెక్ట్గా తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రైవేటు ప్రాజెక్టులను విస్తృతంగా చేస్తున్నారామె. కార్పొరేట్ కంపెనీల యాజమాన్యం నుంచి తాపీ మేస్త్రీల వరకు అందరితోనూ మాట్లాడాల్సి ఉంటుంది. ఏ నేల మీద ఉంటే ఆ భాష నేర్చుకుని తీరాలనే తన తల్లి అనుసరించిన సూత్రమే తన విజయానికి పునాది అన్నారు చేతనాజైన్. ‘‘ఏ నేల మనకు జీవితాన్నిస్తుందో ఆ నేలను, అక్కడి భాష ను గౌరవించాలనేది మా అమ్మ. కనీసం బస్సుల మీద పేర్లు చదవగలగాలి కదా అనేది. అలా సెకండ్ లాంగ్వేజ్ తెలుగు చదివాను. ఇక ఇంజనీరింగ్ కౌన్సెలింగ్లో నా వంతు వచ్చేటప్పటికి జేఎన్టీయూలో సివిల్ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్ లో మాత్రమే ఖాళీలున్నాయి. ఆర్కిటెక్ట్ ఏం పని చేయాల్సి ఉంటుందని అడిగి తెలుసుకుంది మా అమ్మ. ‘పెళ్లయిన తర్వాత ఇంట్లో ఉండి కూడా పని చేసుకోవచ్చు’ అని ఆర్కిటెక్చర్లో చేర్చేసింది. ఆర్కిటెక్చర్లో గ్రాడ్యుయేషన్ తర్వాత జెమ్షెడ్పూర్లో ఎంబీఏ చేశాను. స్వయంగా ఇన్వాల్వ్ అయినప్పుడే... ఎన్ఆర్ అసోసియేషన్స్లో మల్లికార్జునరావుగారి దగ్గర జూనియర్గా ఒకటిన్నర ఏడాది పని నేర్చుకున్నాను. కాలేజ్లో కాన్సెప్ట్ మాత్రమే తెలుసుకుంటాం. అసలైన పని వచ్చేది ఉద్యోగంలో చేరిన తర్వాత మాత్రమే. ‘ఒక బిల్డింగ్ పునాది నుంచి పూర్తయే వరకు ప్రతి పనిలోనూ స్వయం గా ఇన్వాల్వ్ అయినప్పుడే పనిలో నైపుణ్యం వస్తుంది’ అని ఆయన చెప్పిన మాటే నా కెరీర్ నిర్మాణానికి పునాది. చేతిలో పని లేకపోతే పాత డిజైన్లను తీసి చూస్తుంటే.. అదే స్థలంలో ఇంకా చక్కని డిజైన్ వేయడానికి ఉన్న అవకాశాలు అవగతమవుతాయని చెప్పారు. హైదరాబాద్, మొజంజాహి మార్కెట్ రెస్టోరేషన్ విజయవంతంగా చేయగలిగానంటే అప్పట్లో ఆయన దగ్గర నేర్చుకున్న పాఠాలే కారణం. ఆయన పోయిన తర్వాత ఇక ఉద్యోగం చేయలేదు. సొంత ఫర్మ్ పెట్టాను. భవనం జెండర్ చూడదు ‘‘నువ్వు కట్టే భవనం నువ్వు స్త్రీవా, పురుషుడివా అని చూడదు. ఇక్కడ పనిచేసేది జెండర్ కాదు మన మెదడు మాత్రమే. ఆడవాళ్లం కాబట్టి ఆఫీస్కే పరిమితం అనుకుంటే ఎప్పటికీ ఏమీ సాధించలేరు. మీరు వేసిన డిజైన్ను సైట్లో భవన రూపంలోకి తెచ్చే పనిలో కూడా భాగస్వాములయి తీరాలి. అప్పుడే ఆచరణలో ఎదురయ్యే సవాళ్లు అర్థమవుతాయి. అవసరమైతే సైట్లో ఆ క్షణంలోనే డిజైన్ని మార్చి ఇవ్వగలిగే నైపుణ్యాన్ని పెంచుకోవాలి. మహిళలుగా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేతప్ప మహిళని కదా అని పని లో వెసులుబాటు వెతుక్కోకూడదు’’ అంటారు ఈ రంగంలో కొత్తగా చేరే స్త్రీలతో చేతనాజైన్. నిజానికి ప్రతి రంగమూ అందరిదీ. ఆడవాళ్లు అడుగు పెట్టనంత వరకే అది మగవాళ్ల సామ్రాజ్యంగా ఒక ముద్ర వేసుకుని ఉంటుంది. కొన్ని కనిపించని పరిధులు విధించుకుని ఉంటుంది. ఆ సరిహద్దు గీతను తుడిచేస్తున్న మహిళల్లో చేతనాజైన్ కూడా ఒకరు. కెరీర్కి కిరీటం వారసత్వ హోదా ఉన్న కట్టడాన్ని పునరుద్ధరించాలంటే నైపుణ్యం కంటే ఎక్కువగా అంకితభావం ఉండాలి. మొజంజాహి మార్కెట్ పునరుద్ధరణ పనిని 2016 చివర్లో మొదలుపెట్టాం. ఆ నిర్మాణం తొలిరూపాన్ని అర్థం చేసుకోవడానికి ఆరునెలలకు పైగా పట్టింది. హబ్సిగూడలో ఉన్న స్టేట్ ఆర్కైవ్స్ డిపార్ట్మెంట్లో ఈ భవనానికి సంబంధించిన ప్రతి ఆధారమూ ఉంది. నిజాం నవాబు 1935లో ఈ భవనం కోసం విడుదల చేసిన తొలి మొత్తం 30 రూపాయల డాక్యుమెంట్తో సహా ఉన్నాయి. దుకాణదారులు ఎవరికి వాళ్లు తమకు కావల్సినట్లు కరెంట్ లైన్లు, వాటర్ పైప్ లైన్లు, ఫ్లోరింగ్ వేసుకున్నారు. దుకాణదారులతో మాట్లాడి వాళ్ల అవసరాలు నెరవేరేటట్లు చూస్తూనే, భవనం అసలు స్వరూపాన్ని పరిరక్షించగలిగాం. ఇందుకోసం మా టీమ్ రెండేళ్లు పని చేసింది. కమర్షియల్గా అయితే రెండేళ్లలో సమాంతరంగా అనేక ప్రాజెక్టులు చేయగలుగుతాం. కానీ ఇలాంటివి చేయడం కెరీర్కి గర్వకారణం. – చేతనాజైన్, సీఈవో, ధ్రుమతారు కన్సల్టెంట్స్ – వాకా మంజులారెడ్డి -
TATTOO: పచ్చని ప్రేమ బొట్టు
‘‘పచ్చబొట్టు ఆదివాసీలకే అబ్బిన విద్య. మన దగ్గర మా బిరుద్ గోందులు మాత్రమే పచ్చబొట్టు వేస్తారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీస్గఢ్ రాష్ట్రాల్లో మా తెగ ఆడవాళ్లు మాత్రమే పచ్చబొట్టు వేస్తారు’’ అని చెప్పింది సుగుణాబాయ్. ఆమెది ఆదిలాబాద్ జిల్లా, తోషం గ్రామం. పచ్చబొట్టు వేయడానికి ఉపయోగించే కిట్ ఈ మహిళల దగ్గర ఎప్పుడూ ఉంటుంది. పచ్చబొట్టు వేయడానికి ఉపయోగించే సూదులు, అడవిలో సేకరించిన మూలికలతో చేసిన పసర్లు కూడా చిన్న సీసాల్లో ఉంటాయి. బిరుద్ గోందు మహిళల నుదుటి మీద కూడా పచ్చబొట్టు ఉంటుంది. అన్నిరకాల బొట్టుల కంటే ఇది తొలి బొట్టు అని చెబుతారు. పెళ్లికి ముందే పచ్చబొట్టు వేయాలని చెబుతారు. ఇందుకు వాళ్లు చెప్పే కారణం వింతగా ఉన్నప్పటికీ కొంత తార్కికత ఉందనే అనిపిస్తుంది. పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాల్సిన యువతికి మానసిక దారుఢ్యం ఉండాలి. నొప్పిని భరించేది దేహమే అయినప్పటికీ మనసు గట్టిగా ఉంటేనే శారీరక బాధను తట్టుకోగలుగుతారని, పచ్చబొట్టు నొప్పి ని భరించిన తరవాత ధైర్యం వస్తుందని, ఆ తర్వాత అడవుల్లో సంచరించేటప్పుడు ఏ గాయం తగిలినా అధైర్యపడరని చెప్పిందామె. బంగారు నగల్లో ఉండే నైపుణ్యం పచ్చబొట్టును అందంగా వేయడం ఒక కళ. ఆ కళలో ప్రతి బిరుద్ గోంద్ మహిళా ఆరితేరి ఉంటుంది. అరచేతి నుంచి మోచేతుల వరకు మెహందీ పెట్టుకున్నట్లు సన్నటి లతలు తీగల డిజైన్ను సూదులతో వేస్తారు. మెడ చుట్టూ కంఠాభరణం, ముక్కుపుడక, కాళ్ల పట్టీలు, వంకీలు... అన్నిరకాల ఆభరణాలూ పచ్చబొట్టు వేసుకుంటారు. బంగారు ఆభరణాలలో ఉండే నైపుణ్యం పచ్చబొట్టులోనూ ఉంటుంది’’ అంటోంది సుగుణాబాయి. పచ్చని బంధానికి బొట్టు మన కవులకు పచ్చబొట్టు చక్కటి కథాంశం. ప్రేమికుల మధ్య బంధానికి చెరగని ముద్రగా పచ్చబొట్టు చుట్టూనే కథను అల్లేయడం మన చిత్రసీమ నైపుణ్యం. అయితే, పచ్చబొట్టు ప్రేమికులకు మాత్రమే కాదు, దంపతుల మధ్య ప్రేమను కూడా పెంచుతుందని చెబుతుంది సుగుణాబాయి. ఆడవాళ్లు ఎక్కువగా కృష్ణుడి పింఛాన్ని పచ్చబొట్టుగా వేసుకోవడానికి ఇష్టపడతారని చెప్పింది సుగుణాబాయ్. ఆమె పచ్చబొట్టు వేయడం కోసమే ఆదివాసీల నివాస ప్రదేశాలు, మైదాన ప్రాంతాలు, నగరాల్లోనూ పర్యటించింది. పచ్చబొట్టుమనిషికి – మనసుకు మధ్య ముడివడే అందమైన బంధం అంటుందామె. భార్య పట్ల ప్రేమ ఉన్న మగవాళ్లు భార్య ఎప్పుడూ చల్లగా ఉండాలని కోరుకుంటూ చందమామ బొమ్మ వేసుకుంటారని, భర్తకు ఏ ఆపదా రాకూడదని ఆడవాళ్లు సుదర్శన చక్రాన్ని, కలువ పువ్వు వేయించుకుంటారని చెప్పింది. కానీ, నిజానికి పచ్చబొట్టు వేయించుకునే వాళ్ల మైండ్ను ఆ రకంగా మలిచేది పచ్చబొట్టు వేసే మహిళల మాటల చాతుర్యమే. ఈ బాడీ ఆర్డ్ని అరుణాచల్ప్రదేశ్, నాగాలాండ్, జార్ఖండ్, ఒడిషాల్లో స్థానిక ఆదివాసీలు వేస్తారు. మన తెలుగు రాష్ట్రాలకు మాత్రం చత్తీస్గఢ్, కచ్చర్ గఢ్ నుంచి విస్తరించింది. మాఘ పున్నమి జాతర సుగుణాబాయ్... తమ మూలాలను వివరిస్తూ ‘‘కచ్చర్గఢ్ గుహలు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్ సరిహద్దులో విస్తరించాయి. ఇది మాకే కాదు, అనేక ఆదివాసీ తెగలకు పవిత్రమైన ప్రదేశం. ఏటా ఇక్కడ మాఘపౌర్ణమి నుంచి నాలుగు రోజుల పాటు వేడుకలు జరుగుతాయి. జంగుబాయి, లింగుబాబా జాతర చేసుకుంటాం. జంగుబాయి కచ్చర్గఢ్ లో సంచరించిన కథను పాటలుగా పాడుకుంటాం. పచ్చబొట్టు పసరు ఔషధం కూడా అక్కడే దొరుకుతుంది. మాకు రాయడం రాదు. మా పిల్లలకు మా పూర్వికుల గురించి చెప్పుకునేది పాటలతోనే. పచ్చబొట్టు వేయడానికి వెళ్లిన ప్రతి తావునా మా పాట పాడి వినిపిస్తాం. మా పాటలను మేము రికార్డు చేసుకుని దాచుకుంటున్నాం’’ అని పచ్చబొట్టు అందమైన చరిత్ర చెప్పింది సుగుణాబాయి. – వాకా మంజులారెడ్డి -
Ifrah Fatima, Mounika Wadiwala: ఇద్దరు వందయ్యారు
డాక్టర్ ఇఫ్రాహ్ ఫాతిమా, ఉస్మానియా హాస్పిటల్లో ఎంబీబీఎస్ చేసింది. ఆమె స్నేహితురాలు డాక్టర్ మౌనిక వడియాల. తను కూడా ఎంబీబీఎస్ పూర్తి చేసి పీజీ కోసం అమెరికా వెళ్లే ప్రయత్నంలో ఉంది. అప్పుడొచ్చింది కరోనా. ప్రపంచం మొత్తం భయవిహ్వలమై పోయింది. ఒంట్లో ఏ రకమైన నలత వచ్చినా ‘ఇది కరోనా లక్షణమేమో’ లని బెంబేలు పడిపోతున్నారు జనం. మొదటి వేవ్ కంటే రెండో వేవ్ ఉధృతంగా ఉంది. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఫ్యామిలీ డాక్టర్ల క్లినిక్లు, నర్సింగ్హోమ్లు కిటకిటలాడిపోతున్నాయి. డాక్టర్ అపాయింట్మెంట్ దొరక్క ఒక హాస్పిటల్ నుంచి మరో హాస్పిటల్కు పరుగులు తీస్తున్నారు పేషెంట్లు. తేలికపాటి లక్షణాలున్న పేషెంట్లకు నర్సింగ్ స్టాఫ్తో సర్వీస్ ఇప్పిస్తే పేషెంట్లకు సంతృప్తి ఉండడం లేదు. ఇది ఇలాగే కొనసాగితే డాక్టర్లకు ప్రజలకు మధ్య పెద్ద దూరం పెరుగుతుందనిపించింది. ఆ దూరాన్ని తగ్గించడానికి ఒక వారధిగా పనిచేయాలనుకున్నారు. ఈ యువ డాక్టర్లిద్దరికీ అప్పుడు వచ్చిందో ఆలోచన. వెంటనే ఆన్లైన్ వైద్యానికి శ్రీకారం చుట్టారు. ఈ వైద్యానికి ఫీజు లేదు! ఇఫ్రాహ్, మౌనికలు తమ ఆలోచనను స్నేహితులందరికీ చెప్పారు. విన్నవాళ్లలో దాదాపుగా అందరూ కరోనా పేషెంట్లకు ఉచితంగా వైద్యం చేయడానికి ముందుకు వచ్చారు. మొదటగా ఏప్రిల్ నెలలో 24 మంది డాక్టర్లతో ఒక బృందం తయారైంది. ఉదయం తొమ్మిది నుంచి రాత్రి తొమ్మిది వరకు సమయాన్ని ఒక్కొక్క స్లాట్ రెండు గంటల చొప్పున ఆరు స్లాట్లుగా విభజించుకున్నారు. ప్రతి టైమ్ స్లాట్లో నలుగురు డాక్టర్లు అందుబాటులో ఉండేటట్లు చూసుకున్నారు. డాక్టర్ల పేర్లు, ఫోన్ నంబర్లు, ఏ సమయంలో ఏ డాక్టర్లను సంప్రదించాలి... వంటి వివరాలతో ఒక పట్టిక తయారు చేశారు. ఈ పట్టికను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అనూహ్యమైన స్పందన వచ్చింది. రెండు గంటల స్లాట్లో యాభై నుంచి అరవై ఫోన్ కాల్స్ మాట్లాడేటంతటి రష్. డాక్టర్లు ఇచ్చిన సర్వీస్ చాలా సులువైనదే. అయితే హాస్పిటల్లో డాక్టర్ అపాయింట్మెంట్ దొరకని క్లిష్టమైన సమయంలో వీరి సేవ పేషెంట్లను సేదదీర్చే చల్లని చిరుజల్లయింది. పేషెంట్లు చెప్పిన లక్షణాల ఆధారంగా కరోనా తీవ్రతను గ్రహించి అవసరమైన మందులను, ఆహారాన్ని సూచించేవారు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను చెప్పేవారు. తేలికపాటి లక్షణాలకు హాస్పిటల్లో అడ్మిట్ కావాల్సిన అవసరం లేదని, హోమ్ క్వారంటైన్ పాటించమని ధైర్యం చెప్పేవారు. అలాగే ఎలాంటి లక్షణాలు కనిపిస్తే డాక్టర్ ను స్వయంగా సంప్రదించాల్సి ఉంటుందో కూడా వివరించారు. ఈ సర్వీస్లో కొంతమంది డాక్టర్లు ఫోన్లో మాట్లాడితే మరికొంతమంది వాట్సప్ చాట్ ద్వారా పేషెంట్లకు ట్రీట్మెంట్ ఇచ్చారు, ఇప్పుడు కూడా ఇస్తున్నారు. వందమందికి చేరింది! ఇఫ్రాహ్, మౌనిక ప్రారంభించిన ఫ్రీ మెడికల్ సర్వీస్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీళ్ల పోస్టులను ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీ, బాలీవుడ్ నటి కొంకణాసేన్లు కూడా షేర్ చేశారు. దేశం నలుమూలల నుంచి ఫోన్ కాల్స్ రావడం మొదలైంది. దాంతో డాక్టర్ల సంఖ్యను 24 నుంచి యాభైకి, మే ఒకటి నాటికి యాభై నుంచి వందమందికి పెంచుకున్నారు. ఒక్కో స్లాట్లో ఎనిమిది నుంచి పది మంది డాక్టర్లు అందుబాటులో ఉండేలా చూసుకున్నారు. మొత్తంగా ఈ మెడికల్ సర్వీస్ నెట్వర్క్లో దేశవిదేశాల్లో ఉన్న డాక్టర్ మిత్రులందరినీ భాగస్వాములను చేయగలిగారు ఇఫ్రాహ్, మౌనిక. అలాగే సర్వీస్ టైమ్ కూడా ఉదయం ఎనిమిది నుంచి అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు విస్తరించారు. రాను రాను కరోనా భయం శారీరకం నుంచి మానసిక సమస్యలకు దారి తీయడాన్ని గమనించి... హైదరాబాద్, ఎర్రగడ్డ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ డాక్టర్లు కూడా ఈ మెడికల్ సర్వీస్లో పాలుపంచుకున్నారు. ఇండియాలో ఉన్న తల్లిదండ్రుల కోసం యూఎస్, జర్మనీ, ఆస్ట్రేలియా, దుబాయ్లో ఉంటున్న వాళ్లు కూడా ఫోన్ చేస్తున్నారు. డాక్టర్ ఒక్క ఫోన్ కాల్ దూరంలోనే! నిజంగా అవసరమైన టెస్టులేవో, అవసరం లేని టెస్టులేవో పేషెంట్లకు తెలియదు. కార్పొరేట్ హాస్పిటల్ సిబ్బంది ఒక లిస్ట్ ఇచ్చి ‘ఈ పరీక్షలు చేయించుకుని రండి’ అని మాత్రమే చెప్తారు. మరోమాట మాట్లాడడానికి కూడా ఇష్టపడరు. ఒక తుమ్ము వచ్చినా, చిన్నపాటి దగ్గు వచ్చినా, ఒళ్లు వెచ్చబడినా భయంతో వణికిపోవాల్సిన దుస్థితి రాజ్యమేలుతున్న సమయంలో, డాక్టర్ల మీద ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతున్న తరుణంలో ఈ యువ డాక్టర్లు చేస్తున్న మంచిపని వైద్యరంగం మీద గౌరవాన్ని పెంచుతోంది. ఒక్కొక్కరికి రెండు వేల ఫోన్ కాల్స్! మాకు రెండు గంటల స్లాట్లో యాభై నుంచి అరవై ఫోన్ కాల్స్ వచ్చేవి. ఈ యాభై రోజుల్లో మా టీమ్ డాక్టర్లు సరాసరిన ఒక్కొక్కరు రెండు వేల మందికి కౌన్సెలింగ్ ఇచ్చి ఉంటారు. మా ప్రయత్నంలో ప్రధానమైన ఉద్దేశం మా తోటి వైద్యుల మీద పెరుగుతున్న ఒత్తిడి తగ్గించడానికి మా వంతు సహకారం అందించడం. పేషెంట్లతో అనునయంగా మాట్లాడి, ‘ఏం ఫర్వాలేదు, ఈ రోగాన్ని జయించగలం’ అనే ధైర్యాన్ని కల్పించడం. అదేవిధంగా అవసరం ఉన్నా లేకపోయినా హాస్పిటల్కు వెళ్లడాన్ని నివారించడం కూడా. తేలికపాటి లక్షణాలున్న పేషెంట్లు హాస్పిటల్కు వెళ్తే అక్కడ తీవ్ర లక్షణాలున్న పేషెంట్లతో మెలగడం ద్వారా వీరిలో కూడా వ్యాధి తీవ్రత పెరిగే ప్రమాదం ఎక్కువ. అలాంటి అనర్థాలను నివారించడానికి మా వంతుగా కృషి చేశాం. ఈ ప్రయత్నంలో కలిసి వచ్చిన డాక్టర్లందరూ తొలిరోజు నుంచి ఇప్పటి వరకు అదే అంకితభావంతో పని చేస్తున్నారు. వారందరికీ కృతజ్ఞత లు. ఇప్పుడు కేసులు తగ్గుముఖం పట్టడంతో మాకు ఫోన్ కాల్స్ కూడా బాగా తగ్గాయి. – డాక్టర్ ఇఫ్రాహ్ ఫాతిమా, డాక్టర్ మౌనిక వడియాల – వాకా మంజులారెడ్డి -
జ్ఞానదక్షిణ.. గ్రేట్ జర్నీ
‘భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. నేను నా దేశమును ప్రేమించుచున్నాను...’ మనం అందరమూ ఈ ప్రతిజ్ఞ చేసినవాళ్లమే. పెద్దయ్యి చదువులలోని సారమెల్ల గ్రహించడంతోపాటు బతుకు పాఠాలు నేర్చుకోవడంలో మునిగిపోయిన క్షణం నుంచి ప్రతినబూనడానికి బిగించిన పిడికిలి ఎప్పుడు సడలిందో మనకు గమనింపు కూడా ఉండదు. దేశాన్ని ప్రేమించడం, దేశం లో అందరినీ సహోదరులుగా భావించడం... ఈ రెండూ జీవితపు సోపానపటంలో ఇమడని అంశాలుగా మారిపోతున్నాయి కూడా. అభ్యున్నతి బాటలో ఎదగడం కోసం మన మనసు పరిధిని కుదించుకుంటూ పోతున్నాం. మనం ఇలా ఉంటే... చదువుకోవడానికి మనదేశానికి వచ్చిన వియత్నాం మహిళ తనదేశంతో సమానంగా మనదేశాన్ని కూడా ప్రేమిస్తోంది. పేదవాళ్లకు ఆహారధాన్యాలను, ఆత్మీయతను పంచుతోంది. ‘‘కోవిడ్ 19తో ప్రపంచం కుదేలయిపోతోంది. మా దేశంలో మేమంతా సంఘటితమై కరోనాతో పోరాడుతున్నాం. భారతదేశం చేస్తున్న పోరాటంలో మా వంతుగా ఓ చిన్న సహాయం మాత్రమే’’ అన్నారు ఫామ్ థి లెన్. ఆమె గుంటూరు జిల్లా, ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో పీహెచ్డీ చేస్తున్నారు. భారతదేశానికి సహాయం చేయడానికి ముందుకు వచ్చిన వియత్నాం వాసులను అనుసంధానం చేస్తున్నారీమె. ప్రేమ... పంచితే పెరుగుతుంది ‘‘మాకు చదువు చెప్పిన దేశం మాకు పరాయి దేశం ఎలా అవుతుంది? ఈ దేశంలో ఉన్న పేదలు, వృద్ధులు, దివ్యాంగులు, అసహాయ మహిళలకు కరోనా పోరాటంలో అండగా నిలవాల్సిన బాధ్యత కూడా మా మీద ఉందనుకుంటున్నాం. కరుణ, పరస్పర ప్రేమ స్ఫూర్తితో ఈ పని మొదలు పెట్టాం. ప్రభుత్వాలు ఆదుకుంటూనే ఉన్నాయి. అయినప్పటికీ మాకు చేతనైనంత మందిని కలిసి ‘భయపడవద్దు. కరోనాను జయించగలుగుతాం’ అని ధైర్యం చెప్తున్నాం. వృద్ధులు, పేదవాళ్లు మేము ఆత్మీయంగా చెప్పే మాట కోసమే ఎక్కువ ఆర్తిగా ఉంటున్నారు. మా ఈ చిన్న సహాయం మనుషుల మధ్య బంధాన్ని బలపరుస్తుంది. సంఘీభావాన్ని పెంచుతుంది. ఈ బంధం కొనసాగాలి. మనిషి జీవన ప్రయాణంలో ఇలాంటి ఎన్ని మహమ్మారులు ఎదురైనా ఎదుర్కోగలిగిన మనోధైర్యాన్ని కలిగి ఉండాలి. ఈ కష్టం నుంచి ఇండియా త్వరగా గట్టెక్కాలని మా వియత్నాం ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. పూర్వ విద్యార్థుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించగలుగుతున్నాం. కోవిడ్ రాక ముందు కూడా నిరుపేదలకు ఆహార ధాన్యాలు, దుప్పట్లు ఇచ్చేవాళ్లం. ఇప్పుడు మరింత ఎక్కువగా దృష్టి పెడుతున్నాం. నార్త్ ఇండియాలో గవర్నమెంట్ హాస్పిటల్లో సౌకర్యాల కల్పన, బుద్ధగయ దగ్గర ఆహారధాన్యాల పంపిణీ వంటి పనులను సమన్వయం చేస్తున్నాం. నాకు జ్ఞానమిచ్చిన దేశానికి చెల్లించుకుంటున్న గురుదక్షిణ ఇది’’ అన్నారు ఫామ్ థి లెన్. మహమ్మారితో పోరాటం పీహెచ్డీ తర్వాత పుస్తకాలు రాయడం మీద దృష్టిపెడతానని చెప్తున్న ఫామ్ థి లెన్... ఆధ్యాత్మికత నిండిన శాంతికాముక ప్రపంచసాధన కోసం శాంతి బోధనకు అంకితమవుతానని చెప్పారు. వీలయినంత మందిని కలిసి బాధల నుంచి విముక్తి పొందడానికి అవసరమైన మనోధైర్యాన్ని నింపాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. ‘‘మానవత్వంతో చేతులు కలిపితే మహమ్మారిని జయించగలుగుతాం. శాంతి సంతోషాలతో జీవించగలుగుతాం’’ అన్నారు ఫామ్ థి లెన్. నాగార్జునుడు నడిచిన నేల ఫామ్ థి లెన్ 1973 జూన్లో సౌత్ వియత్నాంలోని బీయిన్ హోవా పట్టణలో పుట్టారు, ఏడుగురు సంతానంలో ఆమె ఆరవ వారు. ఆమె తండ్రి సైనికుడు. వియత్నాం స్వేచ్ఛకోసం యుద్ధం చేశారు. తల్లి కుటుంబ బాధ్యతలు చూసుకుంటూ సమాజంలోని పీడిత మహిళల కోసం సేవలందించేవారు. ఫామ్ థి లెన్ 24 ఏళ్ల వయసు లో సన్యాసినిగా మారారు. ఐదేళ్ల కిందట పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం ఆమె ఇండియాకి వచ్చారు. విదేశాల్లో చదువుకునే అవకాశం వచ్చినప్పుడు ఇండియానే ఎంచుకోవడానికి బలమైన కారణమే ఉందన్నారామె. ‘ఇది అహింసను పాటించిన గాంధీజీ దేశం. శూన్యవాదాన్ని బోధించిన నాగార్జునుడు నడిచిన నేల. అంతకంటే ప్రధానంగా సర్వ మానవాళి స్వేచ్ఛ, శాంతికోసం పాటుపడిన బుద్ధుడి ప్రదేశం’ అన్నారామె. – వాకా మంజులారెడ్డి -
రికార్డు కోసం కాదు నా పిల్లల కోసం..
అనిత పుట్టింది పెరిగింది కరీంనగర్లో. ఎనిమిదవ తరగతి నుంచి హైదరాబాద్లో అమ్మమ్మగారింట్లో ఉండి చదువుకుంది. ఐటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి, ఆరేళ్ల పాటు ఉద్యోగం చేసింది. రెండవ బిడ్డ పుట్టినప్పుడు కెరీర్లో కొంత విరామం. ఇప్పుడు సొంత గ్యారేజ్ తో కొత్త కెరీర్లో అడుగుపెట్టింది. గ్యారేజ్ అనగానే టైర్లు, రెంచ్లు, గ్రీజు అంటిన దుస్తులతో మగవాళ్లు కళ్లముందు మెదలుతారు. మహిళలు ప్రవేశించని రంగం అనడం కంటే మహిళలు పెద్దగా ఇష్టపడని రంగం అనే చెప్పాలి. భుజబలంతో చేసే పనులు ఎక్కువగా ఉంటాయి. భౌతిక శక్తి సామర్థ్యాలకు పరీక్ష పెట్టే ఈ రంగంలో అడుగుపెట్టడం నిజంగా ఒక సాహసమే. ఆ సాహసాన్ని ఒక సవాల్గా స్వీకరించింది అనిత వ్యాల. ఇల్లు అమ్మేశాం! ‘‘విక్టరీ 4 వీల్స్ గ్యారేజ్ని 2018లో తమ్ముడు, నేను కలిసి మొదలుపెట్టాం. ఇప్పుడు నేను ఒక్కదాన్నే చూసుకుంటున్నాను. యాభై లక్షలతో పూర్తవుతుందని దిగాం. కానీ మేము అనుకున్న స్వరూపం వచ్చేటప్పటికి 90 లక్షలైంది. లోన్ కోసం నెలలపాటు బ్యాంకు చుట్టూ తిరిగి చివరికి మా ఫ్లాట్స్ అమ్మేసి గ్యారేజ్ పెట్టాం. నలుగురు ఉద్యోగులతో మొదలైన గ్యారేజ్లో ఇప్పుడు నాతో కలిసి పన్నెండు మందిమి పని చేస్తున్నాం. మహిళ అయిన కారణంగా ఎదురయ్యే ఇబ్బందులేమీ లేవు. కానీ వర్కర్స్ జాప్యం చేస్తున్నట్లు, మహిళను కావడంతోనే పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నారేమో అనిపించేది. అయితే వాళ్ల సమాధానం విన్న తర్వాత పని ఆలస్యం కావడానికి కారణం సహేతుకంగానే అనిపించేది. పాప లక్ష్యం మెడిసిన్ పిల్లల కోసం సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసిన తరవాత గ్యారేజ్ పెట్టడానికి మధ్య కొంతకాలం ట్యూషన్లు చెప్పాను. ట్యూషన్లతో వచ్చే రాబడితో హాయిగానే ఉండేది. అయితే మా పాప లక్ష్యం మెడిసిన్. సీటు తెచ్చుకోవడం ఆమె లక్ష్యం. ఫీజులు కట్టడానికి తగినట్లు నా ఇన్కమ్ను పెంచుకోవడం నా లక్ష్యం అయింది. అందుకే పని చేయగలిగిన వయసులోనే కన్స్ట్రక్టివ్గా ఏదో ఒక బిజినెస్లోకి అడుగుపెట్టి స్థిరపడాలనుకున్నాను. అంతే తప్ప నేను రికార్డు సాధించడం కోసం పిల్లల భవిష్యత్తు మీద ప్రయోగం చేసే పరిస్థితి కాదు. తమ్ముడి సూచన మా తమ్ముడికి టాటా డీలర్షిప్ వర్క్షాపులో పదహారేళ్ల అనుభవం ఉంది. మల్టీ బ్రాండ్ కార్ సర్వీసింగ్ సెంటర్‡గురించి చెప్పాడు. అలా ఈ రంగంలోకి వచ్చాను. ఇందులో ప్రతిదీ పనిలోకి దిగిన తర్వాత నేర్చుకున్నదే. కారు డీప్ ఇంటీరియర్ క్లీనింగ్, ఇన్సైడ్ వ్యాక్యూమింగ్, కెమికల్ క్లీనింగ్, ఫోమ్ వాషింగ్, ఫాగ్ మెషీన్ శానిటైజేషన్ వంటి పనులన్నీ చేస్తాను. సమస్యలుంటాయని చెప్పడానికి... ‘దిగితేనే లోతు తెలుస్తుంది’ అంటారు. నేనయితే ‘దిగితే ఈత దానంతట అదే వస్తుంది’ అంటాను. ఇందులో పదిమందికి ఉపాధి కల్పించగలుగుతున్నాను. ఒకసారి మా గ్యారేజ్కి వచ్చిన కస్టమర్లు ఆ తర్వాత నుంచి కొనసాగుతున్నారు. సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకునే మహిళల విషయంలో కారు సర్వీస్కి కూడా వాళ్లే రావాల్సి ఉంటుంది. మగవాళ్లు నిర్వహించే గ్యారేజ్లో కంటే మా దగ్గర సౌకర్యంగా ఫీలవుతున్నారు మహిళలు. నేను ఉదయం పది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు గ్యారేజ్లో ఉంటాను. ఒక్కోసారి అర్జంట్గా పని పూర్తి చేసి ఇవ్వాల్సి ఉంటుంది. అలాంటప్పుడు పన్నెండు గంటల వరకు కూడా గ్యారేజ్లో ఉండాల్సి వస్తుంది. అమ్మాయిలూ రెంచ్ పట్టుకోండి! ఒకప్పుడు మెకానిక్ అంటే సమాజం తక్కువ గా చూసేది. అలా చూడడం వల్లనే కావచ్చు ఇప్పుడు ఈ రంగంలో నిపుణుల కొరత ఉంది. పైగా ఇప్పుడు మెకానిక్ వృత్తికి గౌరవం పెరిగింది కూడా. కాబట్టి అమ్మాయిలకు ఇది మంచి అవకాశం. ఈ రంగంలో కెరీర్ డెవలప్ చేసుకోవాలనుకునే అమ్మాయిలకు శిక్షణ ఇచ్చి నిపుణులుగా తయారు చేస్తాను. ఈ కాలంలో టూ వీలర్ నడిపే అమ్మాయిలు, కారు నడిపే మహిళల సంఖ్య బాగా పెరిగింది. వాళ్లు గ్యారేజ్కి వచ్చినప్పుడు గ్యారేజ్లో పని చేసే వాళ్లలో అమ్మాయిలు కనిపిస్తే భరోసాగా ఫీలవుతారు. ఇది మంచి కెరీర్ ఆప్షన్. ఎప్పటికీ ఆదరణ తగ్గని మంచి రంగం అవుతుంది’’ అన్నది అనిత. కష్టం... వద్దన్నా వచ్చే అతిథి సింగిల్æమదర్ల మీద ఉండే బాధ్యతల బరువు నాకు తెలుసు. అందుకే సింగిల్ మదర్లు ఈ పని నేర్చుకోవడానికి ముందుకొస్తే వారికి సహకరిస్తాను.ఎవరూ కోరి కష్టాలు తెచ్చుకోరు. అనుకోని అతిథిలా కష్టం దానంతట అదే వచ్చి తిష్టవేస్తుంది. కష్టం వచ్చిందని భయపడి పిల్లలతోపాటు ఆత్మహత్యలకు పాల్పడే తల్లుల గురించి తెలిసినప్పుడు బాధ కలుగుతుంటుంది. ఒక్క క్షణం ఆలోచించండి. పరిస్థితులకు మనం బాధితులమైనప్పటికీ మన పిల్లలను బాధితులను చేయకూడదు. అలాగని అమ్మానాన్నల మీద వాలిపోకూడదు. వాళ్లు కష్టకాలంలో అండగా భుజాన్ని ఇవ్వగలుగుతారు. కానీ బరువు మోసే శక్తి వాళ్లకు ఉండదు. మీకు వచ్చిన పని చేయండి, నచ్చిన పనిని నేర్చుకోండి. – అనిత వ్యాల, ఎం.డీ. ఆమె తాను ఎంచుకున్న రంగంతో మహిళలకు స్ఫూర్తినివ్వడంతోపాటు కొత్తతరానికి స్వాగతం పలుకుతోంది కూడా. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
ఇది మన గౌరవం!.. కాపాడుకుందాం!!
పింగళే అనూరాధారెడ్డి... అంటే గుర్తు పట్టడం కష్టమే. ఇన్టాక్తో మూడున్నర దశాబ్దాల అనుబంధం ఆమెను ఇన్టాక్ అనూరాధారెడ్డిగా మార్చేసింది. మరాఠ్వాడా మూలాల నుంచి తెలంగాణలో స్థిరపడిన కుటుంబం. తెలంగాణ సంస్కృతి, దక్కన్ వారసత్వం మీద ఆమెకున్న మమకారమే... ఆమెను వారసత్వ పరిరక్షణ కోసం పని చేయడానికి పురికొల్పింది. ‘హైదరాబాద్ నగరం అనేక గ్రంథాలకు సమానం’ అంటారు అనూరాధ. ‘‘చిన్నప్పటి నుంచి దేశంలోని వివిధ ప్రదేశాలను, పెద్దయిన తర్వాత వివిధ దేశాల్లోనూ విస్తృతంగా పర్యటించడంతో మనదేశంలో ఉన్న వారసత్వం, సంస్కృతి, సంప్రదాయాలు, భవన నిర్మాణ వైవిధ్యతను తెలుసుకోగలిగాను. దక్కన్ ప్రాంతం శతాబ్దాల కాలంలో అనేక రకాల పాలకులను చూసింది. ప్రతి పాలకులూ తర్వాతి తరాలకు తమ పాదముద్రలను వదిలి వెళ్లారు. వాళ్ల పాలనకాలాల్లో వేర్వేరు ప్రాంతాల నుంచి రకరకాల వృత్తుల వాళ్లు వచ్చి స్థిరపడ్డారు. అలా రకరకాల ఆహారవిహారాలు, రకరకాల నిర్మాణ వైశిష్ట్యాలు పరిచయమయ్యాయి. అంత గొప్ప వారసత్వం ఉన్న నేల మనది. అలాంటి విలువైన నేపథ్యాన్ని మన చేతులతో మనమే కాలరాసుకుంటూ పోతే భవిష్యత్తు తరాలకు ‘ఇదీ మన చరిత్ర’ అని చెప్పుకోవడానికి ఏం మిగులుతుంది? ఇందుకోసం ఎవరో ఒకరు ముందుకు రాకపోతే మన వారసత్వం ఆనవాళ్లకు కూడా మిగలకుండా కాలగర్భంలో కలిసిపోతుంది. ఆ విపత్తును అరికట్టాలన్నదే మా ఇన్టాక్ ప్రయత్నం’’ అన్నారామె. కూల్చకండి! కాపాడండి!! క్రమం తప్పకుండా వారసత్వ నిర్మాణాల నిర్వహణ తీరును పరిశీలించడం, శిథిలావస్థలో ఉన్న వాటిని గుర్తించడం, వాటి నిర్మాణంలో ఉపయోగించిన సున్నం, రాళ్లు, ఇతర మెటీరియల్ను స్టడీ చేసి ఆ మెటీరియల్ ఇప్పుడు ఎక్కడ దొరుకుతుందో అన్వేషించడం, ఇంజనీర్ల సహాయంతో నిర్మాణాలను పునరుద్ధరించడం... వంటివి ఇన్టాక్ చేస్తుంటుంది. అలాంటప్పుడు లక్షణంగా ఉన్న వారసత్వ నిర్మాణాలను పనిగట్టుకుని కూల్చేస్తామంటే ఏం చేయాలి? ‘‘సున్నితంగా పని చేసుకుపోతుండే మాలాంటి వాళ్లం కూడా ఇప్పుడు మా గొంతును పెద్దగా వినిపించాల్సి వస్తోంది. ప్రభుత్వాలకు మేము చెప్పేదొక్కటే... ప్రభుత్వ కార్యాలయాల కోసం కొత్త భవనాలు కావాలంటే కట్టుకోండి. అందుకోసం వారసత్వ కట్టడాలను కూల్చి వేయవద్దు’’ అని అనూరాధ ఆవేదనగా అన్నారు. మంచి ఖర్చు! పురాతన భవనాలు, చారిత్రక నిర్మాణాలు, హెరిటేజ్ సైట్లలో సాధారణంగా మగవాళ్లే కనిపిస్తుంటారు. వృత్తిపరంగా కానీ ప్రవృత్తి పరంగా కానీ మహిళల ఎంపికలో లేని రంగం ఇది. అలాంటి అరుదైన రంగంలో పని చేయడం, అది కూడా డెబ్బై ఏళ్లు నిండిన ఈ వయసులో కూడా శక్తిమంతంగా, సమర్థంగా పని చేయడం గురించి చెబుతూ అనూరాధ తన బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు. ‘‘ప్రతి ఆదివారం పుస్తకాల దుకాణానికి తీసుకెళ్లి పుస్తకాలు కొనిచ్చేది మా అమ్మ. ఒక్కో పుస్తకం యాభై పైసలు, రూపాయి ఉండేది. అప్పుడు ఒక కెమెరా నా కంట పడింది. అది ఇరవై రూపాయలు. వద్దని ఇంటికి తీసుకొచ్చేసింది అమ్మ. మా తాతయ్య దగ్గర బుంగమూతి పెట్టాను. ఆయన ఆ కెమెరా కొనిచ్చి, ఎలా వాడా లో నేర్పించారు. అప్పుడు అమ్మతో తాత ‘నేర్చుకోవడానికి పెట్టే ఖర్చు ఎప్పుడూ వృథా కాదు’ అన్నారు. ఆయన ఆరోజు అన్న ఆ మాట ఏ కాలానికైనా వర్తిస్తుంది. నాకు నేర్చుకోవడానికి అంతటి స్వేచ్ఛనిచ్చారు. చిన్నప్పుడు హైదరాబాద్ రోడ్ల మీద సైకిల్ తొక్కాను. ఆడపిల్ల కాబట్టి ఇవి మాత్రమే నేర్చుకోవాలనే ఆంక్షలేవీ లేవు. మంచి పని అంటే ముందుకు అడుగు వేయడం, మంచిది కాదు అనుకుంటే కట్టడి చేయడం... అమ్మాయిలకైనా, అబ్బాయిలకైనా ఇదే ఫార్ములా. ఇక నా ఆలోచనలకు ‘నేను మహిళను కాబట్టి’ అనే పరిధులు ఎందుకు అడ్డువస్తాయి’’ అని చిరునవ్వుతో ప్రశ్నించారామె. వారసత్వ పరిరక్షణ ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ (ఐఎన్టీఏసీహెచ్– ఇన్టాక్) ... ఇది మన వారసత్వం పట్ల సమాజాన్ని చైతన్యవంతం చేయడం, వారసత్వాన్ని పరిరక్షించడం’ అనే ఉద్దేశంతో 1984లో స్థాపితమైన సంస్థ. న్యూ ఢిల్లీ కేంద్రంగా పని చేస్తున్న ఈ సంస్థ ఈ ముప్పై ఆరేళ్లలో 190 విభాగాలతో విస్తరించింది. మీతో నడుస్తాం! ఒకసారి ఒక స్కూల్ వార్షికోత్సవానికి గెస్ట్గా వెళ్లాను. పిల్లలను వారాంతంలో ‘హెరిటేజ్ వాక్’కు తీసుకెళ్లడం గురించి ప్రస్తావించాను. హెరిటేజ్ వాక్లో పాల్గొనడానికి పిల్లలకంటే ముందుగా పిల్లల తల్లిదండ్రులు స్పందించారు. ఇప్పటి వరకు ఇలాంటి వేదికల గురించి తెలియలేదన్నారు. అప్పటి నుంచి స్కూలు పిల్లలతోపాటు పేరెంట్స్ని కూడా హెరిటేజ్ వాక్కు తీసుకెళ్తున్నాం. స్కూళ్లకు వెళ్లి ఇన్టాక్ క్విజ్లు నిర్వహిస్తున్నాం. ఈ కరోనా సమయంలో పిల్లలు ఆన్లైన్ క్లాసులు, గది నాలుగ్గోడల మధ్యనే ఇరవైనాలుగ్గంటలూ గడపాల్సి రావడంతో విసుగెత్తి పోతున్నారు. అందుకే కరోనా జాగ్రత్తలు పాటిస్తూ హెరిటేజ్సైట్లకు తీసుకెళ్లాం. మావంతుగా కొన్ని తొలి అడుగులు వేశాం. మా ప్రయాణంలో మరికొంతమంది వచ్చి కలిశారు. – అనూరాధారెడ్డి, కన్వీనర్, ఇన్టాక్, హైదరాబాద్ చాప్టర్ కాలేజ్ పిల్లలతో కుతుబ్ షాహీ టూంబ్స్ వాక్ – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
గిరి పుత్రిక.. గ్రేట్ జర్నీ
కన్నిబాయి... అచ్చమైన ఆదివాసీ అమ్మాయి. ప్రకృతి ఒడిలో పుట్టింది. ప్రకృతితో కలిసిపోయి పెరిగింది. చెట్లెక్కడం, కొమ్మలను చేత్తో గట్టిగా పట్టుకుని ఊయలూగడం, ఒక్క పరుగులో కొండ శిఖరాన్ని చేరడమే ఆమెకు తెలిసిన ఆటలు. అవి ఒట్టి ఆటలు కాదు, సాహస క్రీడలు అని తెలిసి ఆశ్చర్యపోయింది. వాటికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీలు జరుగుతాయని తెలిసినప్పుడు కలిగిన అబ్బురం అంతా ఇంతా కాదు. పోటీలో పాల్గొనాలని సరదా పడింది. తీరా అక్కడికి వెళ్లిన తర్వాత తెలిసింది... వచ్చిన వాళ్లంతా అత్యున్నత స్థాయి శిక్షణ పొందిన వాళ్లని. వాళ్ల భాష నాగరకం గా ఉంది. తానందుకున్న జ్ఞాపికలు... అవార్డులు... పతకాలతో కన్నిబాయి వాళ్లు ఉపయోగించే పదాలు కొత్తగా ఉన్నాయి. కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టినట్లనిపించింది. పోటీలు మొదలయ్యాయి. అత్యంత సులువుగా, అలవోకగా లక్ష్యాలను సాధించింది. ‘మీ కోచ్ ఎవరు? ఎంత కాలం నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు’ అని అడిగినప్పుడు ఆమె ఒక్క మాటలో ‘‘ఈ పోటీలు ఉంటాయని పేపర్లో చూసి తెలుసుకున్నాను. శిక్షణ ఇస్తారని ఇక్కడికి వచ్చే వరకు నాకు తెలియదు. మమ్మల్ని కడుపులో పెట్టుకుని బతికించుకునే అడవి తల్లే నాకు శిక్షణ ఇచ్చింది’’ అని సమాధానం చెప్పింది. ఇంతకీ కన్నిబాయి ఎవరు? ఆమె ఆడిన ఆటలేంటి? ఆ పోటీలు ఎక్కడ జరిగాయి? ఆమె గెలుచుకున్న పతకాలెన్ని? ఆమె అధిరోహించిన విజయ శిఖరాలేవి? ∙∙ కన్నిబాయిది కుమ్రుం భీము ఆసిఫాబాద్ జిల్లా, కెరమెరి మండలం, భీమన్ గొంది గ్రామం. కోలామ్ ఆదివాసీ కుటుంబంలో చిన్నమ్మాయి. తండ్రి పోడు వ్యవసాయం చేసేవాడు. తల్లి ఆదివాసీ గురుకుల ఆశ్రమ పాఠశాలలో వంట చేసేది. తల్లితోపాటు స్కూలుకు వెళ్లడంతో ఆ ఇంట్లో తొలి విద్యావంతురాలు పుట్టింది. అలా కన్నిబాయి పదవ తరగతి వరకు ఆశ్రమ పాఠశాలలో, ఇంటర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో చదివింది. తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం (టీఏజీఎస్) ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సహాయ కార్యదర్శి, ఉపాధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించింది. కన్నిబాయి అప్పుడు పేపర్లో తెలంగాణ అడ్వెంచర్ క్లబ్, నెహ్రూ యువజన కేంద్రం ఇచ్చిన ప్రకటనను చూసింది. పోటీలకు దరఖాస్తు చేసింది. ఆ పోటీలో మొత్తం పదహారు కేటగిరీలున్నాయి, అన్నీ సాహసక్రీడలే. ఎనిమిదింటిలో తొలిస్థానంలో నిలిచింది. ఆ ఆటలేవీ నేల మీద ఆడేవి కాదు. కొండ కోనల నుంచి లోయలోకి దిగాలి, లోయలో నుంచి కొండ మీదకు ఎక్కాలి. రాపెల్లింగ్ రెండు రకాలు, క్లైంబింగ్, జంపింగ్, బోటింగ్, జుమ్మరింగ్, బ్లైండ్ఫోల్, పారాషూటింగ్... అన్నింటిలోనూ పాల్గొన్నది. ఎనిమిదింటిలో తొలి స్థానంలో నిలిచిన జిల్లాస్థాయి పోటీలవి. రాష్ట్రస్థాయి పోటీల్లోనూ తొలిస్థానమే ఆమెది. ఇది ఐదేళ్లనాటి మాట. పతకాల పంట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూరిజం డిపార్ట్మెంట్, రాష్ట్ర అడ్వెంచర్ క్లబ్ సంయుక్తంగా 2019లో నిర్వహించిన పోటీల్లో పద్దెనిమిది దేశాల నుంచి వందకు పైగా సుశిక్షితులైన క్రీడాకారులు పాల్గొన్నారు. అరకులోయ దగ్గరున్న 350 అడుగుల కటికి జలపాతం రాపెల్లింగ్ పోటీల్లో వరల్డ్ కప్లో కన్నిబాయికి కాంస్య పతకం వచ్చింది. ఆగస్టు 15వ తేదీ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసాపత్రాన్ని అందుకుని అదే ఉత్సాహంతో 2020లో జరిగిన సెకండ్ వరల్డ్ వాటర్ఫాట్ రాపెల్లింగ్ వరల్డ్ కప్ పోటీల్లో ఒక బంగారు, వెండి, రెండు కాంస్యం... మొత్తం నాలుగు పతకాలను సాధించింది. ఆ పోటీలకు తెలంగాణ రాష్ట్రానికి ఆమె బ్రాండ్ అంబాసిడర్ కూడా. ఈ యంగ్ అచీవర్... అదే ఏడాది ఆగస్టు లో వాటర్ఫాల్ రాపెల్లింగ్ వరల్డ్ కప్ ఆర్గనైజింగ్ కమిటీకి వైస్ ప్రెసిడెంట్గా నియమితమైంది. భగీరథ ప్రయత్నం ఇంటర్ తర్వాత చదువులో కొంత విరామం తీసుకున్న కన్నిబాయి ఇప్పుడు ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ చదువుతోంది. ఆమె ఆటలపోటీలతోపాటు పర్వతారోహణలో కూడా ఓ మైలురాయిని చేరుకుంది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో 6,512 మీటర్ల ఎత్తులో ఉన్న మౌంట్ భగీరథ శిఖరాన్ని అధిరోహించి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది. పద్దెనిమిది రోజులపాటు సాగిన ఆ సాహసయాత్ర అనుభవాలను ఆమె గుర్తు చేసుకుంటూ పోరాడే మొండితనమే తనను గెలిపించిందని చెప్పింది కన్నిబాయి. సాహస యాత్ర కూడా పోరాటం వంటిదే. ఈ పోరాటం లో లక్ష్యం తప్ప మరేమీ గుర్తుండ కూడదు, ఇతరత్రా ఏం గుర్తుకు వచ్చినా పోరాటాన్ని మధ్యలోనే ఆపేస్తాం. అందుకే మరేమీ గుర్తు తెచ్చుకోకూడదు అని సందేశాత్మక జీవిత సత్యాన్ని కూడా చెప్పిందీ పాతికేళ్ల అమ్మాయి. భవిష్యత్తులో ఎవరెస్టును అధిరోహించాలనేది తన కల అని చెప్పిన కన్నిబాయి ప్రస్తుతం పాంచులీ పర్వతారోహణకు సిద్ధమైంది. ఈ నెల తొమ్మిదో తేదీన మొదలయ్యే ఆమె గ్రేట్ జర్నీకి ఆల్ ది బెస్ట్. పోరుబిడ్డ ఆదివాసీ బిడ్డను, ఆదివాసీలకు అన్యాయం జరిగితే ఊరుకోను అని చెప్పే కన్నిబాయి పోరాట యోధ కూడా, నాయ క్పోడు తెగకు చెందిన అమ్మాయిలు ట్రాఫికింగ్కు గురయినప్పుడు కన్నెర్ర చేసింది. పోలీసులు ఆ అమ్మాయిలను వెతికి తీసుకువచ్చే డెబ్బయ్ మంది ఆదివాసీలతో పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేసింది. ఆశ్రమ పాఠశాలలో ఓ విద్యార్థిని మరణించినప్పుడు ‘ఆమె మరణానికి అనారోగ్యమే కారణం’ అని కేసు ముగించడానికి సిద్ధమవుతున్న అధికారుల ప్రయత్నాన్ని అడ్డుకుని పార్థివ దేహాన్ని కదలనివ్వకుండా అడ్డుపడి, దర్యాప్తుకోసం పట్టుపట్టింది. కుమ్రుం భీము మొదలుపెట్టిన ఆదివాసీల భూమి హక్కు పోరాటాన్ని ఈ తరంలో కన్నిబాయి కొనసాగిస్తోంది. కొంతమందికి పట్టాలిప్పించింది. కరెంటు లేని ఆదివాసీ గ్రామాలకు ఐటీడీఏ అధికారుల దృష్టికి తీసుకు వెళ్లి సోలార్ లైట్లు శాంక్షన్ చేయించి స్వయంగా మోసుకెళ్లి లైట్లు వేయించిన ధీర కన్నిబాయి. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
ఆవిష్కార మేఘం
డాక్టర్ మేఘన చేపట్టిన శోధనల్లో కత్తిగాటు లేని సర్జరీ ఉంది. కంటి చూపు లేని వారికి సులువైన టైప్ రైటర్ ఉంది. పేపర్ పరిశ్రమ కోసం చేపట్టిన ప్రయోగమూ ఉంది. ఒక మహా వృక్షాన్ని పరిరక్షించగలిగితే... అది వంద మొక్కలను పెంచడంతో సమానం అని నమ్ముతారు మేఘన.ఆమె ప్రయత్నానికి మెచ్చిన ఎకనమిక్ టైమ్స్... ‘ఎకనమిక్ టైమ్స్ ఇన్నోవేషన్ అవార్డు 2020’తో ప్రోత్సహించింది. డాక్టర్ మేఘన పుట్టింది, పెరిగింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వాపురంలో. ఆమె తండ్రి కేంద్రప్రభుత్వ ఉద్యోగి. సీబీఎస్సీ టెన్త్ క్లాస్లో 94.8 శాతం మార్కులు, ఎంసెట్లో 231వ ర్యాంకు, హైదరాబాద్లోని గాంధీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్లో గోల్డ్ మెడల్. ఈ తర్వాత ఏం చేయాలి? సాధారణంగా ఎవరైనా మెడిసిన్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తారు లేదా ఆ పట్టాతోనే ప్రాక్టీస్ మొదలు పెడతారు. మేఘన మాత్రం వైద్యరంగానికి వైద్యం చేయాలనుకున్నారు. మెడిసిన్లో ఉండగా మొదలు పెట్టిన పరిశోధనలను కొనసాగించారు. 90 శాతం ఆసియా... ఆఫ్రికాల్లోనే ‘‘సాంకేతిక పరంగా సొసైటీ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. కానీ విజువల్లీ చాలెంజ్డ్ పీపుల్ కోసం మాత్రం ఏ ప్రయోగమూ జరగడం లేదు. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న అంధుల్లో తొంభై శాతం ఆసియా, ఆఫ్రికా ఖండాల్లోనే ఉన్నారు. దాంతో అగ్ర రాజ్యాల పరిశోధకుల దృష్టి అంధుల మీదకు మళ్లనే లేదు. విజువల్లీ చాలెంజ్డ్ పీపుల్ ఉపయోగించే బ్రెయిలీ టైప్ రైటర్ అరవై నాటిది. అందులో ఆరు వందల విడిభాగాలుంటాయి, ఐదు కిలోల బరువుంటుంది. ధర కూడా అరవై వేల వరకు ఉంటుంది. దాన్ని ఒక చోట నుంచి మరో చోటకు తీసుకెళ్లడం కూడా వాళ్లకు అంత సులభమేమీ కాదు. కేవలం 28 విడిభాగాలతో ఒకటిన్నర కిలోల బరువుతో పదివేలలో వచ్చే న్యూ జనరేషన్ బ్రెయిలీ టైప్ రైటర్ రూపొందించాను. బాలమేధావిగా అప్పటికే పాతికకు పైగా ఆవిష్కరణలు చేసిన ప్రవీణ్తో కలిసి ఈ ప్రాజెక్ట్ చేశాను. ఆ టైప్ రైటర్ డిజైన్ని కొనుగోలు చేయడానికి పెద్ద కంపెనీలు ముందుకొచ్చాయి. కానీ నేను ఆ ప్రాజెక్టును డబ్బు కోసం అమ్మదలుచుకోలేదు. అదే జరిగితే ఆ కంపెనీలు బ్రెయిలీ టైప్ రైటర్ ధరను అమాంతం పెంచేస్తాయి. అంత డబ్బు పెట్టి కొనలేని వాళ్లకు అది ఎప్పటికీ అందుబాటులోకి రాదు. విలాసవంతమైన మోడల్గా సంపన్నులకే పరిమితమవుతుంది. పేదవాళ్లు కూడా కొనుక్కోగలగాలంటే ధర పెరగకూడదు. అందుకే ఆఫ్రికాలో ఉన్న కిలిమంజరో బ్లైండ్ ట్రస్ట్కి ఇవ్వాలని పట్టుపట్టాను’’ అని చెప్పారు డాక్టర్ మేఘన. ఆమె ఆశించినట్లుగానే కిలిమంజరో ట్రస్ట్ కొత్తతరం టైప్ రైటర్ను తక్కువ ధరలో అందుబాటులోకి తెచ్చింది. ఇంజక్షన్ చాలు ‘‘అరిగిన వెన్నుపూసకు చేసే సర్జరీ అత్యంత నైపుణ్యంతో కూడినది. ఏ మాత్రం తేడా వచ్చినా అనుబంధ సమస్యలు జీవితాంతం వేధిస్తాయి. ఆ సర్జరీకి ప్రత్యామ్నాయంగా ఓ ఇంజక్షన్ ద్వారా సరిచేయవచ్చని ప్రయోగాత్మకంగా చూపించాం. అది క్లినికల్ ట్రయల్స్ దశలో ఉంది. ఆ తర్వాత క్రాఫ్ట్ పేపర్లో ప్రయోగాలు చేశాం’’ అని చెబుతూ కాలుష్యభరితమైన కాగితం పరిశ్రమను కాలుష్యరహితంగా మార్చడానికి ప్రయోగాలను కొనసాగిస్తానని చెప్పారు డాక్టర్ మేఘన. రెండేళ్లలో కంపెనీ నెట్వర్క్ని 18 రాష్ట్రాలకు విస్తరించారామె. ఎకనమిక్ టైమ్స్ ఇన్నోవేషన్ అవార్డు కోసం 950 కంపెనీల నుంచి వచ్చిన 1,250 నామినేషన్ల పరిశీలన బాధ్యతను మహింద్ర అండ్ మహింద్ర, టీసీఎస్, సన్ ఫార్మా వంటి ప్రముఖ వ్యాపార దిగ్గజాల ప్రతినిధులు, ఐఐటీ ముంబయి ప్రొఫెసర్ చేపట్టారు. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి మగవాళ్ల సామ్రాజ్యం రెండేళ్ల కిందటి వరకు మా ప్రయోగాలను అవుట్సోర్సింగ్ ద్వారా ఇతర కంపెనీలకు ఇచ్చేశాం. కానీ ప్యాకేజింగ్ పేపర్లో జీఎఫ్పీ ప్రయోగాన్ని ఎవరికీ ఇవ్వలేదు. ‘ఫై ఫ్యాక్టరీ’ పేరుతో సొంతంగా పరిశ్రమ స్థాపించాం. ఇప్పటి వరకు ఈ రంగంలో మహిళలు లేరు. తొలి సీఈవోను నేనే. పేపర్ ఇండస్ట్రీ జాతీయ సదస్సుల్లో గుజరాత్కు చెందిన ఇద్దరు మహిళలను చూశాను. అయితే వాళ్లు వారసత్వంగా వచ్చిన పరిశ్రమను నిర్వహిస్తున్నారు, పరిశ్రమ స్థాపకులు కాదు. మా ప్రయోగం ద్వారా క్రాఫ్ట్ పేపర్ను బరువు తక్కువగా, ధర తక్కువగా, మరింత దృఢంగా రూపొందించాం. మా స్లోగన్ కూడా ‘లైటర్, స్ట్రాంగర్ అండ్ చీపర్’ అనేదే. ఈ ప్రయోగంతో చెట్ల నరికివేతను తగ్గించగలుతున్నాం. ఒక టన్ను పేపర్ తయారీకి పదిహేడు వృక్షాలను నరకాల్సి ఉంటుంది. మేము కనిపెట్టిన టెక్నాలజీతో పద్నాలుగు వృక్షాలు సరిపోతాయి. మా కంపెనీ ద్వారా 2,500 మెట్రిక్ టన్నుల క్రాఫ్ట్ పేపర్ను వాడుకలోకి తేగలిగాం. అంటే ఏడు వేల ఐదు వందల వృక్షాలను సంరక్షించిన వాళ్లమయ్యాం. మాకు వచ్చిన పురస్కారం కూడా పర్యావరణ పరిరక్షణ, నిరంతర ప్రకృతి సంరక్షణకు సంబంధించిన విభాగంలోనే. కాగితం పరిశ్రమలన్నీ ఈ కొత్త టెక్నాలజీని అనుసరిస్తే పర్యావరణహితంగా ఉంటుంది. – మేఘనా జాలె, మెడికల్, ఎకలాజికల్ సైంటిస్ట్, సీఈవో ‘ఫై ఫ్యాక్టరీ’ -
వాడల్లోకి వచ్చిన.. రాజుగారి అమ్మాయి
విజయనగరం, పూసపాటి రాజవంశం అమ్మాయి సంచయిత. గ్రామగ్రామం తిరుగుతోంది. ‘‘ఆడపిల్లల్ని బడికి పంపించండి’’ అని తల్లుల్ని కోరుతోంది. ఆడపిల్లల బాల్యాన్ని, చదువును నీళ్లు మోయడం కోసం బలి చేయవద్దని వేడుకుంటోంది. ‘‘నీళ్లు లేకపోవడం వల్లనే.. కేవలం నీళ్లు మోయడానికే ఆడపిల్లల్ని బడి మాన్పిస్తున్నట్లయితే... ఆ నీళ్లేదో నేనే ఇస్తాను’’ అంటోంది.. అనడమే కాదు స్కూళ్లలో సోలార్ పలకలు అమర్చి, నీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ వేసవిలో మరికొన్నింటిని చేయబోతోంది. ఇదంతా ఆడపిల్లల్ని చదివించడానికే. ‘‘బడికి వచ్చి చదువుకోండి. ఇంటికి వెళ్లేటప్పుడు ఈ క్యాన్ నిండా మంచినీటిని మీ ఇంటికి పట్టుకువెళ్లండి’’ అని ఐదు లీటర్ల నీటి క్యాన్లను అమ్మాయిల చేతికి ఇస్తున్నారు సంచయిత. రాజు గారమ్మాయి తమ వాడల్లోకి వచ్చి ఇంత ఆపేక్షగా చెబుతుంటే ఏ తల్లిదండ్రులు మాత్రం అమ్మాయిల్ని బడికి పంపించకుండా ఉండగలరు? ఆమె చూపించిన ఆత్మీయతే ఆడపిల్లల్లో అక్షరాస్యత పెంచాలన్న ఆమె పనిని సులువుగా మార్చేస్తోంది. ప్యాలెస్లో పుట్టినా..! ‘‘నేను ప్యాలెస్లో పెరగలేదు, ప్రజల మధ్య పెరిగాను. మా తాత విజయరామ గజపతి రాజుగారు అభ్యుదయవాది. ఆడపిల్లలు చదువుకోవాలని, ప్రజాజీవితంలో క్రియాశీలకంగా ఉండాలని చెప్పేవారు. నా చదువంతా ఢిల్లీలోనే సాగింది. మా అమ్మ లోక్సభ సభ్యురాలిగా (రాణి ఉమాగజపతిరాజు) ఉన్నప్పుడు నేను చాలా చిన్నదాన్ని. ఓ సారి నా స్కూల్కి నెల రోజులు సెలవు పెట్టించి మరీ తనతోపాటు గ్రామాలన్నీ తిప్పి చూపించింది. ప్యాలెస్కి పరిమితం కాకుండా ప్రజా జీవితంలోకి వచ్చి పని చేయాలని అమ్మ చెప్పేది’’ అని చిన్ననాటి రోజుల్ని గుర్తు చేసుకున్నారు సంచయిత. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి పొలిటికల్ సైన్స్ ఆనర్స్, తర్వాత లా కోర్సు చేసి ఢిల్లీ బార్ కౌన్సిల్లో ఎన్రోల్ అయ్యారు సంచయిత. లాయర్గా ప్రాక్టీస్ చేయడం ఆమెకంటూ ఒక ఉపాధి కోసం మాత్రమే. చుట్టుపక్కల గ్రామాల్లో బాలికల విద్య కోసం పని చేయడం ఆమెకో సంతృప్తి. ‘ఆస్తులు వస్తుంటాయి, పోతుంటాయి. మనం చదువుకున్న చదువు మనతోపాటే ఉంటుంది. చదువుతోపాటు వచ్చిన జ్ఞానం మనల్ని నడిపిస్తుంది’ అనేవారు అమ్మ. ఆ మాటలనే నేను పని చేస్తున్న విశాఖ జిల్లాలో అమ్మాయిలకు చెప్తున్నాను’’ అన్నారు సంచయిత. మహిళల సహకారం ‘‘ఇంట్లో ఇల్లాలు సౌకర్యంగా ఉంటే ఆ ఇల్లు సంతోషంగా ఉంటుంది. సామాన్య కుటుంబాల్లో అమ్మాయిల చదువు కోసం ఏం చేయాలి? ఎలా మొదలు పెట్టాలి? అనే ప్రశ్న నాలో మొదలైంది. విశాఖ జిల్లా కలెక్టర్ దగ్గరకు వెళ్లి నా ఆలోచనను చెప్పాను. జిల్లా విద్యాధికారి, మండల అభివృద్ధి అధికారుల ద్వారా స్కూళ్ల వివరాలు, గ్రామాలలో మౌలిక వసతుల లేమి పట్ల స్పష్టత వచ్చింది. మహిళలు సర్పంచ్గా ఉన్న గ్రామాలను ఎంపిక చేసుకుని వాళ్లను స్వయంగా కలిశాను. వాళ్ల మాటల్లో కూడా మంచి నీళ్లే మొదటి ప్రాధాన్యంలో ఉన్నాయి. మంచినీటి కోసం నేను ఏర్పాటు చేయాలనుకున్న పనులకు వాళ్ల సహకారం తీసుకున్నాను. వాటర్ ప్లాంట్లు, సోలార్ ప్యానల్స్, ఎనర్జీ జనరేషన్ ఎక్విప్మెంట్ వంటి వాటిని ఏర్పాటు చేయగలిగాను. ఆ గ్రామాల్లోనే ఉన్న మహిళలకు యంత్రాల నిర్వహణ పనులు నేర్పిస్తే నేర్చుకోగలిగిన వాళ్లకు శిక్షణనిచ్చి సోలార్ ప్లాంట్, వాటర్ ప్లాంట్ నిర్వహణ బాధ్యత అప్పగించాం. ‘ఒక పనిని బాధ్యతగా చేయడానికి ఆడ–మగ అనే తేడా ఉండదు. అవకాశం వస్తే ప్రతి ఒక్కరూ చేయగలరు’ అని నిరూపించాలనేదే నా ఆశయం. పైగా ఆడవాళ్లయితేనే ప్లాంటును తమ ఇంటిని ఉంచుకున్నంత శుభ్రంగా ఉంచుతారు. అందుకే ఆడవాళ్లనే నియమించమని చెబుతుంటాను’’ అని తెలిపారు ఆమె. ఒక న్యాయవాది దృష్టి సామాజిక స్థితిగతుల మీదకు మళ్లితే సమాజానికి న్యాయం జరుగుతుంది. అదే సామాజిక న్యాయం. స్త్రీ–పురుషుల మధ్య వివక్షను రూపుమాపడానికి ఉద్యమించి విజయం సాధిస్తే అదే సమన్యాయం. సంచయిత శ్రమ... సామాజిక న్యాయం, సమన్యాయ సాధన కోసమే. విశాఖ అమ్మాయినే ‘‘విజయనగరంలో పుట్టాను. అమ్మమ్మ గారిల్లు మద్రాసు (చెన్నై)తో అనుబంధం పెంచుకున్నాను. అమ్మ సొంతూరు కేరళలోని పాల్ఘాట్. కానీ వాళ్ల కుటుంబం మద్రాసులో సెటిల్ అయింది. అమ్మ చదువు కూడా మద్రాసులోనే, స్టెల్లా మారిస్ స్టూడెంట్ ఆమె. ఢిల్లీలో ఉంటున్నాం. ఇన్ని ప్రాంతాలు, ఇన్ని రాష్ట్రాలతో మమేకమై సాగుతున్న నా జీవితంలో ప్రథమ స్థానం మాత్రం విశాఖదే’’ అన్నారు సంచయిత. చురుకైన కొత్త తరం నేను దత్తత తీసుకున్న స్కూళ్లలో అమ్మాయిలతో మాట్లాడుతూ ‘పెద్దయిన తర్వాత నువ్వు ఏమవుతావు’ అని అడుగుతుంటాను. ఒకమ్మాయి ‘సోలార్ ఇంజనీర్ అవుతా’ అని చెప్పింది. అది విని నాకు చాలా ముచ్చటేసింది. ఇంజనీరింగ్ అంటే అది అబ్బాయిల కోర్సు అనే అపోహ తొలగిపోయినందుకు రిలీఫ్ కలిగింది. అమ్మతో పాటు పాతిక–ముప్పయ్ ఏళ్ల కిందట చూసిన పరిస్థితులు గ్రామాల్లో ఇప్పుడు లేవు. ఎనిమిదేళ్ల కిందట నేను సన (సోషల్ అవేర్నెస్ న్యూయర్ ఆల్టర్నేటివ్స్) సంస్థ నిర్వహకురాలిగా గ్రామాల్లో అడుగుపెట్టినప్పుడు కూడా మహిళల్లో ఈ మాత్రపు చొరవను చూడలేదు. – సంచయితా గజపతి రాజు ఇప్పటికి ఇరవై గ్రామాలు సంచయిత.. 2013లో గూగుల్ గ్లోబల్ ఇంపాక్ట్ చాలెంజ్ అవార్డు అందుకున్నారు. తాగునీరు, పారిశుద్ధ్యం రంగాల్లో విశిష్ట సేవలందించిన సంస్థకు ఇచ్చే అవార్డు ఇది. ఆ అవార్డుతో వచ్చిన మూడు కోట్ల నగదు తన కార్యాచరణకు ఉపయోగపడుతోందని చెప్పారామె. మంచినీరు, పారిశుద్ధ్య నిర్వహణ, రెన్యూవబుల్ ఎనర్జీ, వ్యవసాయ రంగాల మీద ప్రత్యేక దృష్టి పెట్టిన సంచయిత ఇప్పటివరకు ఇరవై గ్రామాలు, మరో ఇరవైకి పైగా స్కూళ్లలో మంచినీరు, పారిశుద్ధ్య వసతులు కల్పించారు. ‘సన సూర్య సుజల ధార, హరిత బయో టాయిలెట్స్’ కార్యక్రమంలో భాగంగా విశాఖపట్టణం జిల్లాలోని చినగందిల మండలం, పరదేశిపాలెంలో ఉన్న సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్, గాజువాక మండలం నెలిముక్కులో ఉన్న సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్లో నిర్మించిన ప్లాంట్లను మార్చి మొదటి వారంలో విద్యార్థినులకు అంకితం చేస్తున్నారు. – వాకా మంజులారెడ్డి -
కొండవీటి కోటలో ఓ రోజు
అది 1990, ‘జగదేక వీరుడు– అతిలోక సుందరి’ సినిమా రిలీజైంది. శ్రీదేవిని తెలుగు తెర మీద చూసి అప్పటికి చాలా రోజులైంది. దేవకన్యగా శ్రీదేవిని చూడాలని సినిమాకి వెళ్లాను. శ్రీదేవికంటే ముందు గొప్ప పర్యాటక ప్రదేశంగా కొండవీడు కోట ఫ్రేమ్లోకి వచ్చింది. గైడ్ రాజు పాత్రలో చిరంజీవి ప్రేక్షకుల కళ్లకు కట్టిన కొండవీటి చరిత్రలో ప్రతి దృశ్యమూ ఇప్పటికీ తడి ఆరని జ్ఞాపకంగానే ఉంది. ఆ జ్ఞాపకాల ఒరలోకి స్వయంగా ప్రవేశించే అవకాశం అక్టోబర్ 12వ తేదీన కలిగింది. ఆ రోజు గుంటూరు జిల్లా, ఫిరంగిపురం మండలం, హౌస్ గణేశ్ గ్రామంలో ‘రెడ్డి రాజుల వారసత్వ ప్రదర్శన శాల’ ప్రారంభోత్సవం. ఆ మ్యూజియం మూడంతస్తుల భవనం, 30 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో పల్నాటి నాగమ్మ విభాగం, ప్రోలయ వేమారెడ్డి విభాగం, రేచర్ల రుద్రారెడ్డి విభాగం, శిల్ప విభాగం, గ్రంథాలయం ఉన్నాయి. మ్యూజియం ఎదురుగా 15వ శతాబ్దం నాటి నంది విగ్రహం పర్యాటకులకు స్వాగతం పలుకుతోంది. మ్యూజియంలో 70 విగ్రహాలు, పురాతన నాణేలు, తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి. 14వ శతాబ్దం నాటి ఘనమైన తెలుగు వారి చరిత్రకు ఆనవాలు ఈ మ్యూజియం. మ్యూజియంలో ఉన్న కొండవీడు కోట నమూనాను క్షుణ్నంగా పరిశీలించిన తరవాత కొండవీడు కోటకు వెళ్తే టూర్ని బాగా ఎంజాయ్ చేయవచ్చు. కొండ మీద కోట వీడు అంటే నివాస ప్రదేశం. కొండవీడుకి ఆ పేరు కొండలున్న ప్రదేశం అనే అర్థంలోనే వచ్చింది. కోట ఉన్న కొండ సముద్ర మట్టానికి 1700 అడుగుల ఎత్తులో ఉంది. కొండ కింద నుంచి కొండ మీద కోట వరకు చక్కటి రోడ్లో సాగింది ప్రయాణం. కొండమీదకు వెళ్లడానికి పన్నెండు వందల మెట్లతో మెట్లదారి కూడా ఉంది. ఈ ప్రదేశాన్ని కాకతీయుల తర్వాత రెడ్డిరాజులు పాలించారు. ప్రోలయ వేమారెడ్డి అద్దంకిలో రాజ్యస్థాపన చేశాడు. అతడి వారసుడు అనపోతా రెడ్డి రాజధానిని కొండవీడుకి మార్చి కోటను పటిష్టం చేశాడు. కోట రక్షణ కోసం పహారా కాయడానికి బురుజులున్నాయి. జెట్టి బురుజు, నెమళ్ల బురుజు, సజ్జా మహల్ బురుజు, బి. ఖిల్లా బురుజు, మిరియాల చట్టు బురుజు, ఆళ్లవారి బురుజు, ఎ. రమణాల్బురుజు, గుర్రం నాడా బురుజు, బుంగబావి, రెడ్డి వారి భోజనశాల, తారా బురుజు ఉన్నాయి. తారా బురుజును స్థానికులు చుక్కల కొండ బురుజని పిలుస్తారు. ఈ పక్కనే ఉన్న మండపం పేరు తీర్పుల మండపం. యోగివేమన మండపం అని కూడా అంటారు. ఆళ్ల వారి బురుజు శిథిలమై పోయి ఆనవాళ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. మొత్తంగా కోట గోడ 20 కిలోమీటర్లు ఉంటుందని అంచనా. చెరువుల కొండ కొండమీద వెదుళ్ల చెరువు, పుట్టలమ్మ చెరువు, ముత్యాలమ్మ చెరువుతోపాటు ఒక కోనేరు కూడా ఉంది. వెదుళ్ల చెరువులో ఏడాది పొడవునా నీళ్లుంటాయి. ఆ చెరువు పచ్చగా కనిపించింది, కానీ నీటిని చేతిలోకి తీసుకుంటే స్వచ్ఛంగా ఉన్నాయి. అంత ఎత్తులో కోటల నిర్మాణమే ఆశ్చర్యచకితమైతే, చెరువుల తవ్వకం నీటి పారుదల కాలువల ఏర్పాటు... ఊహకు అందలేదు. టూరిజం డిపార్ట్మెంట్ కోటలోపల ఉన్న మూడు చెరువులను, శిథిలమైన నిర్మాణాలను పునరుద్ధరిస్తోంది. రాజుల కాలం నాటి రాజమందిరాన్ని బ్రిటిష్ వాళ్లు బంగ్లాగా మార్చారు. ఇప్పుడది కూడా శిథిలావస్థలోనే ఉంది. రెడ్డిరాజులు శైవాన్ని ఆచరించినప్పటికీ వైష్ణవాన్ని కూడా బాగా ఆదరించారు. కోటలోపల శివాలయంతోపాటు లక్ష్మీ నరసింహాలయం, గంగాధర రామేశ్వరాలయం కూడా ఉన్నాయి. ముత్యాలమ్మ చెరువు పక్కన దర్గా, మరో రెండు మసీదులను కుతుబ్షాహీలు కట్టించారు. గుర్రపుశాలలు, వరహాల కొట్టు, నేతికొట్టు ఉన్నాయి. రాత్రిళ్లు దివిటీలు వెలిగించడానికి అవసరమైన నెయ్యిని ఈ నేతికొట్టులో నిల్వ చేసేవారని చెబుతారు. గుప్తనిధుల కోసం దుండగులు విచక్షణారహితంగా తవ్విపోయడంతో కళ తప్పింది కోట. ఒకప్పటి రాజధాని ఇప్పుడు ఒక గ్రామంగా తన ఉనికిని నిలుపుకునే ప్రయత్నంలో ఉంది. నాటి ఆర్కిటెక్చర్లోనే ఇప్పుడు కొత్త నిర్మాణాలు రూపుదిద్దుకుంటున్నాయి. మహిళల దార్శనికత మ్యూజియంలోని ఆడియో విజువల్ థియేటర్లో కొండవీటి రెడ్డిరాజుల పాలన డాక్యుమెంటరీ ప్రదర్శన ఆద్యంతం ఆసక్తిగా సాగింది. మహాభారతాన్ని తెలుగీకరించిన కవిత్రయంలో మూడవ వాడు ఎర్రాప్రగడ ఇక్కడి వాడే, కవి సార్వభౌముడు శ్రీనాథుడు ఈ ఆస్థానంలోని వాడే. హలం వదిలి కత్తి పట్టిన రెడ్డిరాజులు, కత్తితోపాటు కలంతోనూ స్వైర విహారం చేసిన వైనానికి నిదర్శనమే కొండవీటి కోట. రాజుల గొప్పదనాలు ఒక ఎత్తయితే, ఇక్కడి రాజవంశ మహిళల సామాజిక చైతన్యం మరొక ఎత్తు. పెదకోమటి వేమారెడ్డి భార్య సూరాంబిక కొండవీడు దగ్గర సంతాన సాగరం అనే చెరువు తవ్వించింది. రెడ్డి రాజుల కాలంలో మహిళలకు నిర్ణయాధికారం ఉండేది. విత్త నిర్వహణలో చొరవ ఉండేది. పెరిగే జనాభాకు అనుగుణంగా ఆహార ధాన్యాలను పండించాల్సిన అవసరాన్ని గుర్తించారు వాళ్లు. నేలను చదును చేసి సాగుభూమిని విస్తరింపచేయడం నుంచి, నీటి లభ్యత కోసం చెరువులు తవ్వించడంలో కూడా ముందుండే వాళ్లు. ‘దేవతల రాజధాని అమరావతికి తీసిపోని నగరం’ అని కొండవీడు కోటను శ్రీనాథుడు చాటుపద్యాల్లో వర్ణించినట్లు చెప్పారు స్థపతి ఈమని శివనాగిరెడ్డి. అలాగే మరో ఆశ్చర్యకరమైన సంగతి కూడా తెలిసింది... రక్షణ బాధ్యతలో ఉన్న ఉద్యోగి దొంగను పట్టుకుని సొమ్మును తిరిగి ఖజానాకు జమ చేయడంలో విఫలమైతే అతడు నష్టపరిహారం చెల్లించాల్సిందే. నాటి సమాజానికి దర్పణం మ్యూజియంలో మోటుపల్లి రేవు చిత్రంలో అప్పటి రవాణా విధానాలన్నింటినీ పొందుపరిచారు. ఒక్క చిత్రం పది వాక్యాల పెట్టు అనేది నానుడి అయితే... ఈ చిత్రం ఏకంగా అప్పటి సమాజాన్ని, వృత్తి పనివాళ్ల జీవితాన్ని, వర్తక వాణిజ్యాన్ని ప్రతిబింబిస్తోంది. పద్నాలుగవ శతాబ్దంలో మహిళలు, మగవాళ్లు దుస్తులను మోకాళ్ల వరకు ధరించేవాళ్లని చెప్తున్నాయి ఈ చిత్రాలు. మ్యూజియంలో తిరుగుతుంటే టైమ్ మెషీన్లో పద్నాలుగవ శతాబ్దంలోకి ప్రయాణించినట్లు ఉంటుంది. గోపీనాథ ఆలయం నిర్మాణంలో పెద్దదే, కానీ గర్భగుడిలో దేవుడి విగ్రహ ప్రతిష్ఠ జరగనే లేదు. దీనిని కత్తుల బావి అంటారు. కొండవీడు అనగానే లకుమాదేవి కూడా గుర్తుకు వస్తుంది. ఆమె కుమారగిరి ఆస్థానంలో నర్తకి. మ్యూజియంలో ఆమె చిత్రం కూడా ఉంది. అక్కడికి రాగానే ‘జగదేక వీరుడు– అతిలోక సుందరి’లో లకుమాదేవిగా నాట్యం చేసిన బేబీ షాలిని కళ్ల ముందు మెదిలింది. కోటకు కొత్త కళ చరిత్రను అక్షరబద్ధం చేయకపోతే కాలగర్భంలో కలిసిపోతుంది. ఆనవాలుకు కూడా దొరకకుండా అంతరించిపోవడానికి సిద్ధంగా ఉన్న శిథిలాలను పునరుద్ధరిస్తోంది కొండవీడు కోట డెవలప్మెంట్ కమిటీ. ఆ కమిటీ కన్వీనర్ శివారెడ్డి ఒక అలుపెరుగని సైనికుడు. ఆయన ఇంటర్ చదివే రోజుల్లో కొండవీడును చూడడానికి వచ్చి, శిథిలాల నుంచి ఊడిపడిన ఒక రాయిని తీసుకెళ్లి ట్రంకుపెట్టెలో దాచుకున్నట్లు ‘కొండవీడు’ పుస్తకంలో రాసుకున్నారు. శివారెడ్డి పదిహేనేళ్ల శ్రమ, భక్తప్రియ వంటి ఓ యాభై– అరవై మంది సైనికుల అకుంఠిత దీక్షతో కొండవీడు కొత్త కళను సంతరించుకుంటోంది. ‘అఖిల భారత రెడ్ల సంక్షేమ సమాఖ్య– శ్రీశైలం’ వాళ్లు మ్యూజియం కోసం పడిన శ్రమను చూసినప్పుడు... చరిత్రను సృష్టించడం కంటే చరిత్రను పరిరక్షించడమే పెద్ద పని అనిపించింది. – వాకా మంజులారెడ్డి,ఫొటోలు: గజ్జెల రామ్గోపాల్ రెడ్డి కొండవీడు సమీపంలోని అమీనాబాద్ గ్రామంలో మూలాంకురేశ్వరి ఆలయం ఉంది. ఈ అమ్మవారు కొండవీడు రెడ్డిరాజుల కులదైవం. రాజకుటుంబీకులు అమ్మవారి నిత్యపూజల్లో పాల్గొనేవారు. రోజూ అమ్మవారికి నైవేద్యం సమర్పించేటప్పుడు మోగే గంటారవం వినిపించిన తరవాత మాత్రమే రాజకుటుంబీకులు ముద్దముట్టేవాళ్లని చెప్పారు స్థానికులు. అమీనాబాద్ చెరువు దగ్గర ఒక రెస్ట్హౌస్ ఉంది. అంతఃపుర మహిళలు చెరువు స్నానానికి వచ్చినప్పుడు దుస్తులు మార్చుకోవడానికి, సేదదీరడానికి ఈ రెస్ట్హౌస్ను ఉపయోగించేవారు. -
'ఆడు'వారు
‘ఆడపిల్లకు ఆ ఆటలేంటి?’ అన్నారు నాన్న. ‘బడికి వెళ్లావా వచ్చావా అన్నది కూడా మరో కంటికి తెలియకూడదు’ అన్నట్లుండేది ఆయన పెంపకం. సాయంత్రం నాలుగు దాటితే, ఒకసారి బడి నుంచి ఇంటికొస్తే మళ్లీ అడుగు బయటపెట్టేది మర్నాడు బడికెళ్లడానికే. ఆ తండ్రి సంప్రదాయ పెంపకంలో కనిపించని లక్ష్మణరేఖలుండేవి. తండ్రి చెప్పినట్లే కామ్గా చదువుకుని బీకామ్ పూర్తి చేశారు విజయలక్ష్మి. సింగరేణి కాలరీస్లో ఉద్యోగం వచ్చింది. ‘మనింటి ఆడపిల్లలు ఇలాంటి ఉద్యోగాలు చేయడం చూశావా’ అన్నారాయన. మరో నెలకు ఆంధ్రాబ్యాంకులో ఉద్యోగం వచ్చింది.‘అలాంటి ఉద్యోగం, ఇలాంటి అనే చర్చలే వద్దు, అసలు ఉద్యోగాలే వద్దు’ అని పెళ్లి చేశాడు. కాళ్ల పారాణితో తూర్పుగోదావరి జిల్లా నారాయణపురం నుంచి భీమవరం దగ్గర కోపల్లెకు వెళ్లారు. అత్తింటి వారు అంతకంటే సంప్రదాయబద్ధులు. ఆడవాళ్లు బయటకెళ్లాలంటే గుర్రపు బగ్గీకి పరదాలు కట్టుకుని ప్రయాణిస్తారు. భర్త మద్యానికి బానిస. ఆ విషయాన్ని దాచిపెట్టి పెళ్లి చేశారు. అతడిని దారిలో పెట్టడానికి చేసిన ప్రయత్నాలు ఫలితాన్నివ్వలేదు. పది నెలల పాపాయినెత్తుకుని భర్త చేతిని పట్టుకుని 1989లో హైదరాబాద్లో అడుగుపెట్టారామె. అత్తగారింట్లో అడుగుపెట్టేటప్పుడు అతడి చేతిని పట్టుకుని వేసిన అడుగుల్లో... భర్త తనను నడిపిస్తాడనే భరోసా ఉండేది. హైదరాబాద్కు అడుగులు వేసినçప్పుడు మాత్రం... తనే అతడిని నడిపించక తప్పని పరిస్థితి ఆమెది. మంచి తల్లినైనా కావాలి భర్త దారిలో లేకపోతే తప్పంతా భార్యదే అన్నట్లు చూసే సమాజం మనది. జీవితంలో అప్పటికామెకు కనిపిస్తున్న చిరుదీపం కూతురు హారిక. ఆమె మంచి స్టూడెంట్. వీణ చక్కగా మీటుతుంది. డ్రాయింగ్ కాంపిటీషన్లలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బహుమతులు గెలుచుకుంది. తండ్రి తనకు పెట్టిన ఆంక్షలేవీ తాను కూతురికి పెట్టకుండా పెంచారు విజయలక్ష్మి. అది 2006, మార్చి ఎనిమిది. అడ్వెంచర్ క్లబ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో మహిళాదినోత్సవం వేడుకలలో అమ్మాయిలకు డ్రాయింగ్ పోటీలు. కూతుర్ని తీసుకుని వెళ్లారు విజయలక్ష్మి. ఆ క్లబ్లో ఉన్న క్లైంబింగ్ వాల్ను చూడగానే బాల్యం గుర్తొచ్చింది. సంప్రదాయపు ఆంక్షలతో చచ్చిపోయిందనుకున్న క్రీడాకారిణి అప్పుడు నిద్రలేచింది. పేరు రిజిస్టర్ చేసుకుని పోటీల్లో పాల్గొన్న మహిళలకంటే తక్కువ టైమ్లో క్లైంబింగ్ పూర్తి చేశారు విజయలక్ష్మి. అప్పటికామె వయసు 42. పిల్లలను... ఒకరి మీద ఆధారపడకుండా తమ పనులు తాము చేసుకునేటట్లు పెంచాలి. అలాగే... ‘ఆటల్లో ఓడినప్పుడు మరోసారి గెలిచి తీరుతామనే ధైర్యంతో తలెత్తుకుని రావాలి. గెలిచినప్పుడు ఓడిన వారిని గుర్తు పెట్టుకోవాలి’ అని చెప్పాలి. ఆడుకోనివ్వాలి పిల్లల్లో సమస్యను ఎదుర్కొనే ధైర్యం లోపించడానికి తల్లిదండ్రుల అతిజాగ్రత్త కూడా కారణమే. ఇప్పుడు స్పోర్ట్స్ని కెరీర్గా తీసుకోవాలనుకున్న పిల్లలే ఆటలు ఆడుతున్నారు. ఆ పిల్లలనే ఆడనిస్తున్నారు పేరెంట్స్. పిల్లల చేత ఆడిస్తున్నారు తప్ప, పిల్లలను ఆడుకోనివ్వడం లేదు. కెరీర్గా ఎంచుకోవడం కోసమే కాదు. ప్రతి ఒక్కరూ ఆటలు ఆడి తీరాలి. పిల్లల్లో క్రీడాస్ఫూర్తిని పెంచడానికి ఇచ్ఛాపురం నుంచి తడ వరకు సైకిల్ మీద ప్రయాణించాను. మారుమూల గ్రామాల్లోని స్కూళ్లు, కాలేజీలకు వెళ్లాను. వేలాది మంది పిల్లలతో నేను ఆడాను. ఆడుకునేటట్లు వాళ్లను చైతన్యవంతం చేశాను. ఆ క్రీడాస్ఫూర్తి వాళ్లలో అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. జిల్లా కలెక్టర్లను కలసి క్రీడా ప్రాంగణాలలో అడ్వెంచర్ స్పోర్ట్స్కి కూడా సౌకర్యాలు కల్పించమని కోరాను. నా ప్రతిపాదనను చాలామంది స్వాగతించారు. – ఇందుకూరు విజయలక్ష్మి, అడ్వెంచర్ స్పోర్ట్స్పర్సన్, మోటివేషనల్ స్పీకర్ బతుకు పోరాటం హైదరాబాద్కి వచ్చిన తర్వాత దూరపుబంధువుల కంపెనీలో భర్తను ఉద్యోగంలో చేర్చారు విజయలక్ష్మి. తాను ఇంట్లోనే ఉండి పాపను చూసుకుంటూ టైలరింగ్తోపాటు ట్యూషన్లు కూడా చెప్పారు. పాప పెద్దయ్యాక పార్ట్టైమ్జాబ్లు, ఫుల్టైమ్ జాబ్లు... దొరికిన ఉద్యోగం చిన్నదా పెద్దదా అని చూడకుండా చేయగలిగినంత పని చేశారు. భర్త ఉద్యోగం చేసినా ఇంటికి రూపాయి కూడా రాదని తెలుసు. అయితే ఆయన తాగుడుకి డబ్బుల కోసం తనను వేధించకపోతే చాలనుకున్నారు. ఆఫీస్ నుంచి మద్యం షాపుకెళ్లి, ఇంటికి వచ్చే దారిలోనే రోడ్డు మీద పడిపోతే అతడిని లేపి భుజాన వేసుకుని ఇంటికి వచ్చేవారామె. కాలనీ వాళ్ల ఎగతాళి చూపులు, జాలి చూపులు ఆయన పోయే వరకు ఆమెకి తప్పలేదు. టర్నింగ్ పాయింట్ అడ్వెంచర్ క్లబ్తో అలా ఏర్పడిన అనుబంధం ఆమెను ఇప్పటికీ నడిపిస్తూనే ఉంది. రాపెల్డౌన్ స్పోర్ట్లో ఆమె ఎక్స్పర్ట్. భువనగిరి కోట పై నుంచి కిందకు ఆరువందల అడుగులకు పైగా రాపెల్ డౌన్ చేశారు. అరకు సమీపంలో ఉన్న కటిక జలపాతం నాలుగు వందల అడుగులకు పైగా ఉంటుంది. తాడు పట్టుకుని కొండ మీద నుంచి ఆ జలపాతం నీటిలో తడుస్తూ కిందికి దిగారు. సరదాగా చేసిన అడ్వెంచర్ అది. ఆ తర్వాత తెలిసింది అది ప్రపంచ రికార్డ్ అని. దాంతో ఎక్కడ లేని ధైర్యం వచ్చింది. కులుమనాలిలో ఆరువేల అడుగుల ఎత్తు కొండ మీదకు మౌంటనీయరింగ్ చేశారు. లిమ్కా బుక్ ఆఫ్ రికార్ట్స్తోపాటు మరో ఎనిమిది వరల్డ్ రికార్డ్లు, మరో మూడు గ్రూప్ రికార్డులు బ్రేక్ చేశారామె. స్పోర్ట్స్తో మమేకమైనప్పటి నుంచి ‘జీవితాన్ని చూసే దృష్టి కోణం పూర్తిగా మారిపోయిందం’టారు విజయలక్ష్మి. ‘స్పోర్ట్స్ జీవితంలో భాగమైతే జీవితాన్ని స్పోర్టివ్గా తీసుకోవడం అలవడుతుంది. ఆటల్లో... ముఖ్యంగా అడ్వెంచరస్ స్పోర్ట్స్లో టీమ్ వర్క్ తప్పనిసరి. కలివిడిగా ఉండడం, సమాచారాన్ని సులభంగా త్వరగా చెప్పడం, ఒకరికొకరు సహాయంగా ఉండడం వస్తుంది. ఒక మనిషి కంప్లీట్ పర్సన్గా మారతారు. కొండ దిగేటప్పడు తాడును... జీవితంలో ధైర్యాన్ని వీడరాదు ఇప్పుడు యువతలో సంపూర్ణత్వం, సమగ్రతత్వం లోపిస్తున్నట్లనిపించింది. చిన్న సమస్య వచ్చినా దానిని ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఆందోళనకు గురికావడం, ఆత్మహత్యలకు పాల్పడడం చూస్తున్నాం. అందుకే నాకు తెలిసిన విధానంలో పిల్లల్ని చైతన్యవంతం చేస్తున్నాను. మెరిట్ స్టూడెంట్ అయినా సరే సరైన గాడిలో పెట్టేవాళ్లు లేకపోతే, మానసిక స్థయిర్యం లోపిస్తే బతుకు నిర్వీర్యం అయిపోతుందనడానికి మా వారే పెద్ద ఉదాహరణ. అతడు ఇంటర్లో ఉండగా తండ్రి పోవడంతో, ఐఏఎస్ లక్ష్యంతో ఉన్న మెరిట్ స్టూడెంట్ కాస్తా ఒక్కసారిగా నిరాశకు లోనయ్యారు. ఆ వయసులో అతడిని గాడిలో పెట్టేవాళ్లు లేకపోవడంతో మద్యానికి బానిసయ్యాడు. మరెవరి జీవితమూ అలా కాకూడదు. ఒక జీవితం అలా మోడువారిపోతే, అతడిని అల్లుకున్న జీవితాలు కూడా ఆధారం లేక నేలరాలిపోతాయి. అందుకే సమాజాన్ని చైతన్యవంతం చేయడానికే జీవితాన్ని అంకితం చేయాలనుకున్నాను. అమ్మాయి బ్యాంకు ఉద్యోగంలో స్థిరపడింది, పెళ్లి చేశాను. తల్లిగా బాధ్యత పూర్తయింది. ఇక నాకు మిగిలింది సామాజిక బాధ్యతే’ అంటున్నారీ స్పోర్ట్స్ మోటివేటర్. రాపెల్డౌన్ సాహసం చేసేటప్పుడు పాటించాల్సిన సూత్రం ఒకటే. కాళ్ల కింద నేల ఎంత జారుడుగా ఉన్నా, దేహం రాళ్లకు కొట్టుకుంటున్నా సరే, చేతులు మాత్రం తాడును వదలకూడదు. అలాగే జీవితం కూడా. ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా ధైర్యాన్ని వదలకుండా లైఫ్ స్పోర్ట్లో గెలవాలి. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
విశ్వభాషలందు తెలుగు లెస్స
‘‘మన తెలంగాణ ఓ రాష్ట్రంగా ఏర్పడటం ఆనందమే, కానీ సముద్రం లేని లోటు కలిచివేస్తోంది. తెలంగాణ తల్లీ.. మేం సముద్రాన్ని ఈ గడ్డ మీద చూడలేమా..?’ ఓ సగటు తెలంగాణ వ్యక్తి ఆవేదన. ఇంతలో కళ్లు మిరుమిట్లు గొలిపే కాంతిలో తెలంగాణ తల్లి సరస్వతీ దేవి రుపంలో ప్రత్యక్షమైంది. ఈ నేల ఘన చరిత్ర తెలియక ఇలా చింతించటం తగదు. ఓసారి వాస్తవాన్ని గుర్తించు. ప్రపంచ సాహిత్యానికి అమూల్య సేవలందిస్తున్న నీ తేనెలూరు తెలుగు భాష ఔన్నత్యం గ్రహించు. మరే భాషలో లేని సాహితీ ప్రక్రియలకు నెలవైన ఆ మధురభాషకు నీ గడ్డే నెలవు. పద్యం, గద్యం, ప్రబంధం, వచనం, అవధానం, కావ్యం, గ్రంథం... ఇలా తెలుగు తొలి ప్రక్రియ పురుడుపోసుకుంది తెలంగాణ గడ్డమీదే. ఇంత గొప్ప సాహితీసంద్రం ఉండగా సముద్రం వెలితి కనిపిస్తోందా’ అనేసరికి ఆ భాషాభిమానిలో అవధులు లేని ఆనందం...’ ప్రపంచ తెలుగు మహాసభల్లో ఈ గా«థ తెలంగాణ తెలుగు వైభవాన్ని చాటింది. ‘మీది అసలైన తెలుగు కాదు, అంతా సంక్రమణే...’ అన్న ఈసడింపులు చెవుల్లో మార్మోగుతుండగా... అసలు తెలుగు, అచ్చమైన తెలుగు పురుడు పోసుకున్నది ఈ మట్టిలోనే అన్న నిజం ఆధారసహితంగా అక్షరమే చాటింపువేసి చూపింది. మధ్యలో నిజాం నిరంకుశపాలనలో తెలుగు కాస్త మసకబారిందంతే. దానికే మాకు తెలుగు తెలియదంటారా... ఇప్పుడు చూడండి, అసలైన తెలుగు వైభవం పరిఢవిల్లిందిక్కడే అనటానికి సాక్ష్యాలివిగో... సగటు తెలంగాణ తెలుగు భాషాభిమాని ఆనందభరిత తాండవం. ఇంత అద్భుత చరిత్ర ఉన్న ఈ భాషనా అంతరించే తావులో ఉంది... అదెలా సాధ్యం. ఇప్పటి వరకు మేం ‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అని పాడుకున్నాం, నినాదంగా వాడుకున్నాం. కానీ... ఇదిగో ఇప్పుడే చెప్తున్నాం ఈ ‘ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్’ లెక్క.... ఇక ‘విశ్వభాషలందు తెలుగు లెస్స’ ఇది భాగ్యనగర వీధిలో ఎక్కడ చూసినా వినిపించిన, కనిపించిన తెలుగు పండగ తెచ్చిన కొత్త ఉత్సాహం. ఐదు వేదికలపై అద్భుత సాహిత్య ఝరి జాలువారింది. ఎటు చూసినా వర్ణమాల అక్షరాలు తీరొక్క రకంగా నర్తించాయి. సాహితీ సభలు, అవధానాలు, కవి సమ్మేళనాలు, బాల, మహిళా ప్రత్యేక భాషా గోష్టులు, సాంస్కృతిక విన్యాసాలు. దేశంలో హిందీ తర్వాత ఎక్కువ మంది నోట పలికేది మా భాషనే, ఇప్పటికే ఖండాంతరాలు దాటి తన ప్రాభవానికి ఎల్లలే లేవని నిరూపించిన తెలుగు భాష ఇక విశ్వవిపణిలో కొత్త వెల్లువై ఎగిసి పడుతుందని ఊరుఊరంతా నినదించింది. గతంలో ఎన్నడూ లేని తరహాలో ప్రపంచ తెలుగు మహాసభలు అత్యద్భుతంగా జరిగాయి. ఐదు రోజులపాటు గడపగడపా పండగే తరహాలో సాహితీ వేడుక కొనసాగింది. కేవలం ఉత్సవంలా నిర్వహించుకోవటానికే పరిమితం కాకుండా, వెయ్యేళ్ల చరిత్ర ఉన్న ఈ మధుర భాష మరికొన్ని తరాలపాటు తెలుగు వారింట నాట్యం చేసే దిశగా అడుగులు పడ్డాయి. సభల నిర్వహణకు కొద్ది రోజుల ముందే... ఒకటి నుంచి పన్నెండు తరగతుల వరకు తెలుగు తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయించగా, ఇప్పుడు ప్రతి ఏటా రెండు రోజుల పాటు తెలుగు మహాసభలు నిర్వహిస్తామని సీఎం ప్రకటించారు. వందల సంఖ్యలో సూచనలు అందినందున వాటిపై భాషావేత్తలతో చర్చించి జనవరిలో విధాన నిర్ణయాలు ప్రకటì స్తాన ని వెల్లడించారు. వెరసి భవిష్యత్తులో ఈ భాషకు తిరుగుండదనే శుభ సంకేతాలు వెలువడటంతో భాషాభిమానులంతా ఉత్సాహంతో సభలకు ముగింపు పలికారు. – గౌరీభట్ల నరసింహమూర్తి ►16 వేల మంది ప్రతినిధులు సభలకు హాజరయ్యారు. 1500 మంది కవులు, 500 మంది రచయితలు ఐదురోజుల పండగలో భాగస్వాములయ్యారు. ►100 సదస్సులు జరిగాయి. 20 సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటయ్యాయి. 250 కొత్త పుస్తకాలు, భాషలోని వివిధ అంశాలకు సంబంధించి 10 సీడీలు , ►10 సంచికలు ఆవిష్కరించారు. అక్షరాలు అక్కరకొచ్చాయ్! 1975 తొలి ప్రపంచ తెలుగు మహాసభలు.. ఎల్బీ స్టేడియం వేదిక.. నిర్మల్ సమీపంలోని దిలావర్పూర్కు చెందిన ఐదో తరగతి విద్యార్థి వీరాభిమన్యు ఏకపాత్రాభినయానికి సిద్ధమయ్యాడు. పద్యాలు రాగయుక్తంగా కంఠస్తం పట్టాడు. కానీ ఆ కార్యక్రమం రద్దు కావటంతో నిరుత్సాహానికి గురయ్యాడు. 2017.. తెలంగాణలో తొలి ప్రపంచ మహాసభలు.. అదే ఎల్బీ స్టేడియం.. పోతన వేదిక.. పాల్కురికి ఖ్యాతి, పోతన భాగవతంలో తేట తెలుగు ప్రయోగం, సుద్దాల హన్మంతు పల్లె సాహిత్యం, గోరటి వెంకన్న దుమ్మురేపే పాటలు.. ఒకటేమిటి భాషను తన నాలికపై ఆడిస్తున్న ఆయన తీరుకు ప్రేక్షకులు, అతిథులు మంత్రముగ్ధులయ్యారు! అప్పుడు ఏకపాత్రాభినయం చేయలేక ఢీలా పడ్డ ఆ బాలుడే ఇప్పుడు అదే వేదికపై తన భాషా ప్రాభవాన్ని సగర్వంగా ఆవిష్కరించాడు. ఆయనే మడిపల్లి దక్షిణామూర్తి! ఎక్కడ సాహితీ గోష్టి జరిగినా, ప్రభుత్వం నిర్వహించే సభలైనా, అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభ వేడుకలైనా ఆయన గొంతు వినిపించాల్సిందే. ఆ సభలను తనదైన వ్యాఖ్యానంతో రక్తి కట్టించటం ఆయన ప్రత్యేకత. ప్రస్తుతం ఆయన ఆకాశవాణిలో సీనియర్ వ్యాఖ్యాతగా ఉన్నారు. భాషపై అంత పట్టు ఎలా సాధించారో ఆయన మాటల్లోనే... సాహితీ అభిలాషే గుర్తింపు తెచ్చింది: చిన్నప్పట్నుంచి తెలుగు సాహిత్యంపై మక్కువ పెంచుకుని కొంత అవగాహన తెచ్చుకున్నా. మూడో తరగతి నుంచే ఏకపాత్రాభినయం, పుస్తక పఠనం.. ఇలా భాషపై మమకారం పెంచుకున్నా. సహజ కవి అయిన మా తండ్రిగారు, కవి అయిన మా అన్నయ్య, మేనమామల ప్రభావంతో భాషా సాంగత్యం అబ్బింది. సైన్స్ విద్యార్థిగా చదువు పూర్తి చేసినా తెలుగు భాషపై అభిమానాన్ని వదులుకోలేదు. వీలైనన్ని పుస్తకాలు, పద్యాలు చదవటంతో తెలుగులో అనర్గళంగా మాట్లాడటం, తప్పుల్లేకుండా చెప్పగలగటం, ఆశువుగా వివిధ అంశాలను వివరించటం అబ్బింది. అందుకే ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తిని వదిలి ఆకాశవాణి వైపు మళ్లాను. ఓసారి అమెరికాలో ఆటా సభల్లో ఉన్నా. ఇంతలో సీఎం కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది. ‘మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ప్రధాని మోదీ వస్తున్నందున వ్యాఖ్యాతగా మీరే రావాలి’ అని ఆ ఫోన్ సారాంశం. దీంతో అమెరికా నుంచి మధ్యలోనే వచ్చేశా. ఇప్పుడు తెలుగు మహాసభల్లో కూడా స్వయంగా సీఎం నా పేరు సూచించారని అధికారులు చెప్పటం సంతోషమనిపించింది. మడిపల్లి దక్షిణామూర్తి ప్రపంచ తెలుగు మహాసభల తళుకులు ఐదు రోజులపాటు అత్యంత వైభవంగా సాగిన ప్రపంచ తెలుగు మహాసభలు మంగళవారం ఎల్బీస్టేడియంలో కన్నుల పండువగా ముగిశాయి. సాయంత్రం 6.45 గంటలకు సభ ప్రారంభమైనా సకాలంలోనే వేడుకలను ముగించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, గవర్నర్ నరసింహన్ ప్రసంగించారు. అయితే ఈ మహాసభల ముగింపు సందర్భంగా ఎలాంటి తీర్మానాలు చేయకపోవడం సాహితీప్రియులను ఒకింత అసంతృప్తికి గురి చేసింది. ఇక నుంచి ఏటా ప్రతి డిసెంబర్లో రెండు రోజుల పాటు తెలుగు మహాసభలను నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించడం కొంత మేరకు ఊరట కలిగించింది. ఇక రాష్ట్రపతి రామ్నాథ్ ప్రసంగంలో అక్కడక్కడా దొర్లిన తెలుగు పదాలు, తెలంగాణ జన జీవితాన్ని ప్రతిబింబించిన మాటలు ప్రేక్షకులను ఉత్సాహపరిచాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం ఉత్సాహంగా సాగింది. నవ్వులపై వినిపించిన పద్యం హాయిగా నవ్వించింది. ఇదీ ముగింపు సభ తీరు ►సాయంత్రం వరకే ఎల్బీస్టేడియం జనంతో నిండిపోయింది. అన్ని వైపులా గ్యాలరీలు, ప్రధాన ఆడిటోరియం కిక్కిరిసిపోయాయి. ►సాయంత్రం 5.11 గంటల నుంచి 5.28 వరకు దీపికారెడ్డి బృందం ‘తెలంగాణ వైభవం’ నృత్యప్రదర్శన సాగింది. జనం మంత్రముగ్ధులయ్యారు. ►అనంతరం దీపికారెడ్డితో పాటు, ప్రధాన వేదిక, తోరణాలు రూపొందించిన ప్రముఖ చిత్రకారుడు అంబాజీని, ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలంగాణలో 1700 కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేసిన నాగరాజును, వ్యాఖ్యాత మడిపల్లి దక్షిణామూర్తిని సత్కరించారు. ►సాయంత్రం 5.45 గంటల నుంచి లఘుచిత్రాల ప్రదర్శన ప్రారంభమైంది. ►సాయంత్రం 6.11 గంటలకు మంగళవాయిద్యాలు, వేదమంత్రో చ్ఛారణలు, పూర్ణకుంభంతో రాష్ట్రపతిని ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ నరసింహన్ సాదరంగా వేదిక వద్దకు తోడ్కొని వచ్చారు. ఆకట్టుకున్న కేసీఆర్ పద్యం... ►సీఎం కేసీఆర్ నవ్వుపై వినిపించిన పద్యం సభలో నవ్వుల పువ్వులు పూయించింది. ►‘నవ్వవు జంతువుల్... నరుడు నవ్వున్.. నవ్వులు చిత్తవృత్తికిన్ దివ్వెలు... కొన్ని నవ్వులెటూ తేలవు...కొన్ని విషపూరితముల్..’ అంటూ పద్యంతో ప్రసంగం ముగించారు. ► రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ’సోదర సోదరీమణులారా..’ అంటూ తెలుగులో ప్రసంగం ప్రారంభించారు. తెలంగాణ మహామహులను ఆయన గుర్తుచేసినప్పుడు జనం సంతోషంతో చప్పట్లు కొట్టారు. కేరింతలు వేశారు. ►హైదరాబాద్ పేరు వినగానే బిర్యానీ, బ్యాడ్మింటన్, బాహుబలి సినిమా గుర్తుకు వస్తాయని రాష్ట్రపతి చెప్పగానే అందరూ సంతోషంతో చప్పట్లు కొట్టారు. తేట తెలుగుల వెలుగు అమ్మభాషను ఎలుగెత్తి చాటిన బృహత్ కవి సమ్మేళనం నాదో తీరని కోరిక.. తీరిక లేని లోకంలో నాదో తీరని కోరిక.. అంతు తెలియని అన్వేషణలో నాదో తీరని కోరికనాతోనే నువ్వు ఉండాలని.. నేనే ఒక సామ్రాజ్యాన్ని సృష్టించాలని... ప్రపంచాన్ని శాసించే నువ్వే డబ్బువై, డాలర్వై నాతోనే ఉండాలి నాదో తీరని కోరిక... .. డబ్బుపై మనిషికున్న అంతులేని ఆశ.. డాలర్ కోసం జనం వెంపర్లాడుతున్న తీరుకు అక్షర రూపం ఇస్తూ సంతోష్రెడ్డి అనే యువ కవి రాసిన ఈ కవిత సభికులను ఆకర్షించింది. నాలుగు రోజుల తెలుగు భాష పండుగలో వచన కవులు జనం ఇష్టాలను, కష్టాలను, కన్నీళ్లను, అమ్మ భాషలోని మాధుర్యాన్ని కవితలుగా మలిచి వినిపించారు. మంగళవారం ఐదోరోజు ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియంలో బృహత్ కవి సమ్మేళన సమావేశాలు ముగిశాయి. ఐదు రోజులపాటు సాగిన ఈ సమావేశాల్లో 31 సదస్సులు జరిగాయి. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన దాదాపు 700 మంది వచన కవితా పండితులు తమ రచనలు వినిపించారు. వానమామలై వేదికపై పప్పుల రాజిరెడ్డి అధ్యక్షతన మొదలైన తొలి సమావేశం సాయంత్రం బెల్లి యాదయ్య అధ్యక్షతన జరిగిన చివరి సమావేశంతో ముగిసింది. ‘హృదయంతో చూడగలిన రాజు తప్పిపోయిన సూర్యున్ని నట్ట నడివాకిట్లో నిలబెట్టిండు... గంగానదిలో ప్రవహిస్తున్న ఆర్వత్వాన్ని హిందూ నదిలోకి మలిపిండు... పాత పునాదులపై కొత్త దేశాన్ని నిర్మించిండు.. ఒక్క సూర్యున్ని అడ్డగిస్తే వేల సూర్యుళ్లు పుడతారని నిరూపించిండు’ అంటూ అశోక చక్రవర్తి గొప్పతనాన్ని వివరించారో కవి. ‘తరతరాల సిరితత్వ వేద వేదిది నా తెలుగు భాష... స్వరంబు సురిచిరంబును సుందరబింబంబిది నా తెలుగు భాష... గడియార గమనాల గమకంమిది కనమిది కందాల అందాల సంపదల... సదస్సులకు ఉషస్సిది నా తెలుగు భాష’ అంటూ అమ్మభాషలోని పద విన్యాస మాధుర్య రుచిని సభికులకు చూపించాడు మరో కవి! ‘అమ్మ భాష కమ్మనైన భాష .. తెలుగు భాషను బతికిద్దాం’ అని వానమామలై వేదిక సాక్షిగా వందలాది మంది కవులు ప్రతినపూనారు. – వర్ధెల్లి వెంకటేశ్వర్లు నక్షత్రాల్లో ఒదిగిన విందు భోజనం ప్రపంచ తెలుగు మహాసభల్లో భాగంగా ఏర్పాటైన జి.ఎం.రామశర్మ శతావధాన కార్యక్రమంలో చివరిరోజున అవధాని ముందుగా దత్తపదులను ధారణ చేశారు. పెరుంబుదూరు శ్రీరంగాచార్యులు సంధానకర్తగానూ, కసిరెడ్డి వెంకటరెడ్డి అధ్యక్షులుగానూ వ్యవహరించారు. ముఖ్య అతిథిగా నందిని సిధారెడ్డి హాజరయ్యారు. సరస్వతి ప్రార్థనతో కార్యక్రమం ప్రారంభమైంది. దత్తపదులలో అధిక భాగం తెలుగు వైభవాన్ని కీర్తించేవి ఉన్నాయి. షడ్రసోపేతమైన విందు భోజనాన్ని హస్త చిత్త స్వాతి మూల పదాలు ఒదిగిపోయేలా అందంగా పూరించారిలా. సుమధుర హస్త భోజనము సూరి వరేణ్యుల పద్యమట్లుగన్/ సురసుమ చిత్తవంతులకు శుభ్ర రుచులు పచరించుచుండగా/ అమరిన స్వాతి ముత్యమనునట్టి మన్సున నిచ్చు విందులే/ అమృతము కన్న మిన్న యగునాత్మకు మూలకారణ శక్తికిన్. అన్నము పప్పు కూర చారు పదాలను ఉపయోగించి రామాయణం వివరించమని అడిగినప్పుడు– అన్న ముందర నేనెంత చిన్నవాడ/ పప్పురుద్దగా రాముడు వలపునడిగె/ చుప్పనాతిని నిను చూసి ఒప్పుకోడ/ చారు రూపంబు నీదయ్యె సరసుడెవడే అంటూ అన్నము అనే పదాన్ని విడదీసి అన్న ముందర అని చెప్పడంతో ప్రేక్షకుల చప్పట్లతో సభ మార్మోగింది. మరో పృచ్ఛకుడు జింక లంక ఢంక బింక పదాలతో భారతార్థం వచ్చేలా పూరించమన్నారు. అందుకు అవధాని, రామాయణంలోని ‘లంకను, జింకను’ భారతంలోకి తీసుకురావాలి అని చమత్కరించి, సుయోధనుడి గురించి వివరించారు. విశిష్ట అతిథిగా విచ్చేసిన రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు జూలూరి గౌరీ శంకర్ నలుపు తెలుపు మలుపు గెలుపు పదాలు ఉపయోగించి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని భారత కథతో అనుసంధానించమని అడిగారు. నలుపు మనసుల కౌరవుల్ బలము గలిగి/ యుద్ధ వీరత తెలుపుట యోగ్యమగునె/ తెలుపు మనసుల పాండవుల్ ధీరులైరి/ గెలుపు ధర్మనికయ్యె ఓ మలుపు తిరిగె అని ఆఖరి దత్తపదిని పూరించారు అవధాని. ఇక్కడ గెలుపు ధర్మనికయ్యె అనే మాట దత్తపదులు విజయవంతంగా పూరించిన అవధానికి కూడా వర్తిస్తుందని కసిరెడ్డి వెంకటరెడ్డి హాస్యపు జల్లులు కురిపించారు. – డా. వైజయంతి గెలుపు ధర్మానికై... మలుపు తిరిగె! ప్రపంచ తెలుగు మహాసభల్లో భాగంగా బొగ్గులకుంటలోని తెలంగాణ సారస్వత పరిషత్ సభాభవనం, మరిగంటి సింగరాచార్యుల ప్రాంగణం, శతావధాని కోరుట్ల కృష్ణమాచార్య వేదికపై నిరాçఘాటంగా సాగిన శతావధానం మంగళవారం ముగిసింది. వందమంది పృచ్ఛకులు అడిగిన దత్తపది, సమస్య, వర్ణం, ఆశువులకు సరైన రీతిలో శతావధాని డాక్టర్ జీఎం రామశర్మ సమాధానం ఇచ్చి అందర్నీ పులకింపజేశారు. తెలంగాణ ఉద్యమాన్ని భారతంలోని యుద్ధపర్వంగా పొలుస్తూ ... నలుపు, తెలుపు, గెలుపు, మలుపు పదాలతో వర్ణించమని సభలో పాల్గొన్న బీసీ కమిషన్ సభ్యుడు జూలూరి గౌరీశంకర్ కోరారు. దత్తపది శైలిలో శతావధానికి డాక్టర్ జీఎం రామశర్మ స్పందిస్తూ.. ‘నలుపు మనసుల కౌరవుల్ బలము కల్గి ‘‘ యుద్ధ వీరట తెలుపునట యోగ్యమగునే, తెలుపు మనస్సుల పాండవుల్ ధీరులైరి ‘‘ గెలుపు ధర్మానికై ఓ మలుపు తిరిగె’’. అంటూ పద్యం చెప్పి సభలో నవ్వులు పూయించారు. కౌరవులు అజ్ఞానంతో వ్యవహరించారని రామశర్మ అన్నారు. అక్కడ గెలుపు ధర్మానికై ములుపు తిరిగినట్లుగా .. ఇక్కడ కేసీఆర్ సారథ్యంలో సకలజనులతో గెలుపు ధర్మం వైపు మలుపు తిరిగిందని పేర్కొన్నారు. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన పృచ్ఛకులు డాక్టర్ కె.బాలస్వామి తెలంగాణ సాహిత్య వైభవం వర్ణించమని రామశర్మని కోరారు. ‘‘ పద్యముల్ గేయములున్ ‘‘ సద్యోవచనైక గేయ సాహిత్యంబున్,విద్యాగంథమ యంబై ‘‘ విద్యా నైవేద్యమయ్యె విస్ఫూర్తియయెన్’’అని కందపద్యం రూపంలో రామశర్మ సమాధానం చెప్పారు. అనంతరం శతావధాని డాక్టర్ గౌరీభట్ల మెట్టు రామశర్మను పృచ్ఛకులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్, సాహిత్య అకాడమీ చైర్మన్ నందినీ సిధారెడ్డి, డాక్టర్ పెరుంబుదూరు శ్రీరంగాచార్య, డాక్టర్ కసిరెడ్డి వెంకటరెడ్డి, సీఎం కేసీఆర్ గురువు వేలేటి మృత్యుంజయశర్మ తదితరులు పాల్గొన్నారు. – కోన సుధాకర్ రెడ్డి తెలంగాణ పదపదాన పదనిసలు తెలంగాణ పదపదాన పదనిసలు దాగి ఉన్నాయని, శ్రామిక గేయాల్లో భాషా సౌందర్యం ఒదిగిపోయిందని వక్తలు కొనియాడారు. బతుకమ్మ, పల్లెపదం, సంస్కృతి అద్భుతమన్నారు. మంగళవారం తెలుగు విశ్వవిద్యాలయం బిరుదరాజు రామరాజు ప్రాంగణంలో ఆచార్య లక్ష్మణ మూర్తి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి మంత్రి జగదీశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గౌరవ అతిథిగా ఆచార్య ఆర్.వి.ఎస్.సుందరం, ప్రముఖ పండితులు ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య పాల్గొన్నారు. ఐదు రోజులపాటు కావ్య, కథా, నవలా, కవితా లోకాలను తరచిచూసిన సామలసదాశివ వేదిక తెలుగు భాషపై విçస్తృతంగా చర్చించింది. ఈ సభలు తెలంగాణకు నూతనోత్తేజాన్ని ఇచ్చాయని మంత్రి జగదీశ్వర్ రెడ్డి అన్నారు. తెలంగాణ తెలుగు భాషా వైశిష్ట్యంపై డాక్టర్.కె.ముత్యం మాట్లాడుతూ.. పల్లె ప్రజలు ఉపయోగించే వ్యావహారిక భాషలో అంతులేని సంగీత సౌందర్యం ఉందన్నారు. లయబద్ధమైన తెలంగాణ పదాలు అర్థవంతంగా ముగుస్తాయనీ, ఆత్మీయ సంబంధాల గుండెతడిని వ్యక్తీకరిస్తాయని తెలిపారు. సామల రమేశ్ బాబు భాష–వర్తమాన స్థితిపై మాట్లాడుతూ.. తెలుగు అభివృద్ధికి చంద్రబాబు దోహదపడతారన్న నమ్మకం పోయిందనీ, కేసీఆర్పైనే విశ్వాసం ఉంచామని అన్నారు. ఇంటర్ వరకు తెలుగుని తప్పనిసరి భాషగా బోధించే నిర్ణయాన్ని కొనసాగిస్తూనే, మాతృభాషలోనే ప్రాథమిక విద్యా బోధన ఉండేలా చూడాలని సూచించారు. తెలుగుకు ప్రామాణిక గ్రంథం, భాషాభివృద్ధికి కొత్త నిఘంటువులు తయారు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. శ్రామిక గేయాలు మొదలు విప్లవ, జానపద గేయాలన్నింటా శ్రామికజన ఘోష ఉందని మాష్టార్జీ చెప్పారు. ‘నేనేమి సేతు, నా సేనెట్ల గాతు’, ఏటికేతం బట్టి ఎయిపుట్లు పండిస్తే ఎన్నడూ మెతుకెరుగరన్న, నేను గంజిలో మెతుకెరుగ రన్న’, ‘పాలబుగ్గలా జీతగాడా’ వంటి పాటలన్నీ అలాంటి కోవలోనివేనన్నారు. జానపద సాహిత్యాన్ని పరిపూర్ణం చేసింది పాటేనని బండారు సుజాత శేఖర్ చెప్పారు. – అత్తలూరి అరుణ చరిత్రను కొత్తగా రాసుకుందాం! ‘ఒక సమాజం అర్థం కావాలంటే అక్కడి సాహిత్యాన్ని అర్థం చేసుకోవాలి. ఆ సాహిత్యం జన జీవితం నుంచి వచ్చి ఉండాలి. అలాకాకుండా రజాకార్ల ఉద్యమం, సాయుధ పోరాటం ఆధారంగా మాత్రమే చరిత్రను అల్లుకుంటే కచ్చితమైన స్వరూపం రాదు. తెలంగాణలో చరిత్రను తిరిగి రాసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది’ అని తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి అన్నారు. ఆయన అధ్యక్షతన ‘తెలంగాణ చరిత్ర’ సదస్సు మంగళవారం రవీంద్రభారతిలో జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, గౌరవ అతిథిగా పురాతత్వ పరిశోధకులు ఈమని శివనాగిరెడ్డి హాజరయ్యారు. తెలంగాణ నాణేల గురించి డాక్టర్ రాజారెడ్డి, అసఫ్జాహీల కాలంలో తెలుగు భాష మీద అడపా సత్యనారాయణ, తెలంగాణలో బౌద్ధం అంశాన్ని మల్లెపల్లి లక్ష్మయ్య, తెలంగాణ సంస్థానాల చరిత్రను ద్యావనపల్లి సత్యనారాయణ, ఆధునిక చరిత్ర గురించి కుర్రా జితేంద్రబాబు ప్రసంగించారు. వాటి సారాంశం క్లుప్తంగా... కాస్మోపాలిటన్ సంస్కృతి: తెలంగాణ మూలాలెక్కడ? అని శోధిస్తే ఇక్కడి తెలుగువారిని నైజాం ఆంధ్రులు అని వ్యవహరించిన ఆధారాలు కనిపిస్తాయి. షోడశమహాజనపథాలలో అస్మైక జనపథం మనదే. కోసల నుంచి అస్మైక జనపథానికి జరిగిన రాకపోకల వివరాలున్నాయి. ఉర్దూ అధికార భాష అయినా...: అసఫ్జాహీల కాలంలో అధికార భాష ఉర్దూ. అయినప్పటికీ భాగ్యరెడ్డి వర్మ వంటి దళిత ఉద్యమ పితామహుడు స్థాపించి ఆర్థిక సమస్యలతో కొనసాగించలేకపోయిన దాదాపు నలభై పాఠశాలలను ప్రభుత్వం దత్తత తీసుకుంది. ఐదవ శతాబ్దంలోనే!: ఐదవ శతాబ్ది నాటికే తెలంగాణలో మాత్రాచంధస్సుతో గ్రంథాలున్నాయి. సింధునాగరికతలో బయటపడిన పశుపతి శివుడి రూపమే రాచకొండ పెయింటింగ్స్లో కనిపిస్తుంది. – వాకా మంజులారెడ్డి -
నాట్యానికి ఆధారం అక్షరమే!
32 ఏళ్ల తెలుగు యూనివర్సిటీ చరిత్రలో ఆమెది ఒక శుభారంభం.మహిళగా అందుకున్న తొలి అవకాశం అది.27 ఏళ్ల తన అనుభవాన్ని లలిత కళా పీఠానికి వన్నె తేవడానికే అంకితం చేస్తానంటున్నారు.తొలి మహిళా రిజిస్ట్రార్ అలేఖ్య పుంజలతో ముఖాముఖి... నాకు సినారె రాసిన కర్పూర వసంతరాయలు చాలా నచ్చింది. రెడ్డిరాజుల కాలం, నర్తకీమణి లకుమాదేవి జీవితాన్ని ఆయన కళ్లకు కట్టిన తీరు అద్భుతం. ఆ రచన నన్ను ఎంతగానో ప్రభావితం చేసింది. భారతీయ సాహిత్యంలో తెలుగు ప్రత్యేకత? తెలుగు భాష ఎంతటి మహోన్నతమైనదో తెలుగు సాహిత్యం అంతకంటే విస్తృతమైంది. దాన్ని ఈదాలంటే జీవితకాలం సరిపోదు. సాంస్కృతిక, కళారంగాల్లో మహిళలు ఎక్కువగా కనిపిస్తారు, మరి సాహిత్యరంగంలో ? సంస్కృతి పరిరక్షణలో మహిళలు ఎప్పుడూ ముందుంటారు. సంస్కృతి కలకాలం మనగలగాలంటే సాహిత్యం, కళలు రెండూ అవసరం. మేం ప్రదర్శిస్తున్న నాట్యరూపాలకు ఆధారం సాహిత్యమే. గతంలో సాహిత్యంలో మహిళలు తక్కువగా కనిపించేవారు. అప్పట్లో మహిళల అభిప్రాయాల వ్యక్తీకరణకు స్వేచ్ఛ తక్కువ. ఇప్పుడది పెరిగింది. ప్రస్తుతం తెలుగు సభల్లో రచయితల పట్ల గౌరవ సూచకంగా ద్వారాలకు పేర్లు కనిపిస్తున్నాయి. మరో పదేళ్ల తర్వాత రచయిత్రుల పేరుతో ద్వారాలను చూడవచ్చా? తప్పకుండా... మరో పదేళ్లకు జరిగే తెలుగు మహాసభల్లో రచయిత్రుల పేరుతో స్వాగత ద్వారాలు ఉంటాయి. ఎందుకంటే భావ వ్యక్తీకరణలో నేటి రచయిత్రులు చాలా చురుగ్గా ఉంటున్నారు. స్వాగతించాల్సిన మరో విషయమేమిటంటే.. రచయిత్రులు రాస్తున్నది రొమాంటిక్ పొయెట్రీ కాదు. సామాజిక స్పృహతో, హేతువాద దృక్పథంతో, మహిళాభ్యుదయం ఇతివృత్తంతో వారి రచనలు సాగుతున్నాయి. తెలుగులో కూడా మరో దశాబ్దానికి గొప్ప రచయిత్రులు తెర మీదకు వస్తారనడంలో సందేహం లేదు. మీకు ఎలాంటి రచనలు ఇష్టం? ప్రబంధాల రచనలే నాకిష్టం. ఏ కళాకారిణికైనా పారిజాతాపహరణ వంటి ప్రబంధాలే పంచప్రాణాలుగా ఉంటాయి. ఒక్కొక్క సన్నివేశంలో రచయిత ఊహాశక్తి ద్వారా పాఠకులను అత్యున్నత స్థాయికి చేరుస్తారు. దానిని ఒడిసిపట్టుకుంటే మేము అదే భావాన్ని నాట్యంలో ప్రదర్శించగలుగుతాం. నాట్యం ద్వారా ఆ సన్నివేశాన్ని మరికొంత ఎత్తుకి తీసుకెళ్లడం సాధ్యమవుతుంది. ఆ తర్వాత నన్ను అంతగా ప్రభావితం చేసిన మరొక స్త్రీ పాత్ర రాణి రుద్రమదేవి ..: వాకా మంజులారెడ్డి -
ఆ దేవుడు కోరుకునేదీ అదేనని నా నమ్మకం!
మండలి బుద్ధప్రసాద్... మానవతామూర్తి, స్నేహశీలి, అజాతశత్రువు, నిరాడంబరతకు ప్రతిరూపం... ఒక వ్యక్తిలో ఇన్ని విశేషాలు రూపుదిద్దుకోవడానికి కారణం? ‘గాంధీజీని పలుమార్లు చదవడమే’ అంటారాయన! గాంధీజీని చదివి, ‘గాంధీక్షేత్రం’ పత్రిక నడిపిన అనుభవంతో గాంధేయవాదిగా మారిన ఆయన మనోగత వీక్షణం ‘సాక్షి’ పాఠకుల కోసం... అంతర్వీక్షణం: మండలి బుద్ధప్రసాద్ ♦ నిరాడంబరతకు స్ఫూర్తి... మొదట గాంధీజీ, తర్వాత మా నాన్న వెంకట కృష్ణారావు. నిరాడంబరత మనిషిని అవినీతికి దూరంగా ఉంచుతుంది. ఆర్థిక స్థాయికి మించిన జీవనశైలికి అలవాటు పడినప్పుడు అవినీతికి పాల్పడడమే సులువైన మార్గంగా అనిపిస్తుంది. ♦ ఆడంబరంగా జరిగే వేడుకలకు హాజరవుతున్నప్పుడు... అక్కడి దుబారా చూస్తే బాధేస్తుంది. ఒక పెళ్లిలో అయ్యే వృథా ఖర్చుతో ఎంతోమందిని చదివించవచ్చు. ♦ విమర్శలను తీసుకొనే విషయంలో... సద్విమర్శను స్వీకరిస్తాను. ఆరోపణ కోసమే విమర్శిస్తే బాధేస్తుంది. ♦ మీలో మీకు నచ్చే లక్షణం... నేను ఎవరినీ విమర్శించను. ఎప్పుడైనా అంశాన్ని, సిద్ధాంతపరంగా విమర్శిస్తాను తప్ప వ్యక్తితో విభేదించను. అయితే అది నచ్చే లక్షణం అని చెప్పలేను. అది నా అలవాటు! ♦ ఎదుటి వ్యక్తిని చూసే కోణం... రాజకీయాల్లో చాలామంది పరిచయమవుతుంటారు. ఎవరినీ సునిశితంగా పరిశీలించను. అందరినీ నమ్మాలనే తత్వం నాది. అలాగే నమ్ముతాను కూడా. ♦ దూరంగా ఉండాలనుకొనే వ్యక్తులు... పితూరీలు చెప్పేవారంటే నాకిష్టం ఉండదు. నాకు కోపం వచ్చేది కూడా అప్పుడే. నా ప్రత్యర్థి గురించి పితూరీలు మోసుకొచ్చినా సరే... సమర్థించను. ♦ తప్పనిసరిగా పాటించే సిద్ధాంతం... స్వదేశీ వస్తువులను మాత్రమే వాడటాన్ని చాలాకాలం పాటించాను. ఇప్పుడు విదేశీ కంపెనీల ఉత్పత్తులను వాడక తప్పడం లేదు. ఖరీదైన వస్తువుల జోలికి మాత్రం వెళ్లను. ♦ పూలదండలు వేయించుకున్నప్పుడు కలిగే భావన... ఆ డబ్బుతో ఏదైనా పుస్తకాన్ని కొని బహూకరించమని చాలాసార్లు చెప్పి చూశాను. చివరికి పుస్తకావిష్కరణ సభల్లో కూడా పూలదండలు వేస్తుంటారు. ♦ మీ బలం, బలహీనత? బలం ఏమిటో తెలియదు, బలహీనత మాత్రం క్షణికావేశంతో కేకలెయ్యడం. ♦ దేవుణ్ణి కోరుకునేది... మంచిబుద్ధిని ప్రసాదించమని కోరుకుంటా. సాటి మనిషికి సేవ చేస్తే దేవుడు మెచ్చు కుంటాడు. ఆ దేవుడు కోరుకునేదీ అదేననీ, కేవలం పూజలు చేసి, మొక్కడాన్ని ఇష్టపడడనీ నా నమ్మకం. ♦ కృష్ణాజిల్లా పులిగడ్డ - గుంటూరు జిల్లా పెనుమూడి గ్రామాల మధ్య కృష్ణానదిపై వంతెన నిర్మాణం అత్యంత సంతోషాన్నిచ్చింది. అది మా నాన్న కోరిక. చనిపోయే ముందు కూడా దాని గురించే అడిగారు. ఆ వంతెన కోసం చివరకు పెద్దయెత్తున ప్రజాపోరాటం చేయాల్సి వచ్చింది. ♦ దేవుడు మంచి బుద్ధిని ప్రసాదించినట్లే అనిపిస్తోంది! ఆ పేరు వెనక ఉన్న కథ... నేను 1956 మే 26వ తేదీన పుట్టాను. బుద్ధజయంతి సందర్భంగా పుట్టానని ఆ పేరు పెట్టారు. ♦ బుద్ధుడు, బౌద్ధం పట్ల అభిప్రాయం... బౌద్ధధర్మం చాలా ఇష్టం. దలైలామాను కలిశాను కూడా. ♦ ఇష్టమైన వ్యక్తులు... మదర్ థెరిస్సా, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ (సరిహద్దు గాంధీ). వీరినీ కలిశాను. ♦ తెలుగు భాష కోసం ఉద్యమించారు. తెలుగు గురించి ఉన్న కోరికలు... తెలుగుకి ప్రపంచ భాషగా గుర్తింపు తీసుకురావాలి. ఇటీవల అమెరికాలో పర్యటించినప్పుడు గూగుల్ సంస్థ ప్రతినిధులతో చర్చించాను. మన తెలుగు ఫాంట్స్ని తీసుకుని, ఆంగ్లంలో ఉన్న విషయం తెలుగులోకి అనువాదం చేయడానికి తగిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. ♦ ఆచరణలో గాంధేయవాదం... ఒకప్పుడు పూర్తిగా ఆచరించేవాడిని. మద్యం సేవించే వారితో మాట్లాడడానికి కూడా ఇష్టపడేవాడిని కాదు. ఇప్పుడు సమాజంలో ఎక్కువ శాతం వారే. మాట్లాడకపోతే కుదరదు. దాంతో గాంధీజీని తరచూ ప్రస్తావించే అలవాటును తగ్గించుకున్నాను. ♦ అత్యంత బాధ కలిగిన సందర్భం... తెలుగు జాతి రెండుగా విడిపోవడం. రాష్ట్రాలు రెండైనా తెలుగు వాళ్లంతా మానసికంగా కలిసి ఉండాలని, సవాళ్లను దీటుగా ఎదుర్కొన్న జాతిగా నిలవాలనేది నా కోరిక. ♦ ప్రజాస్వామ్య భారతంలో గమనించిన మార్పు! సామాన్యులు చట్టం చేసే అవకాశానికి దూరమవుతున్నారు. సామాన్య ఉపాధ్యాయుడైన మా నాన్న మంత్రయ్యారు. ఇప్పుడలా లేదు. దురదృష్టం ఏంటంటే... ప్రజలు కూడా ధనవంతుడు పోటీలో ఉంటే బావుణ్ణనుకుంటున్నారు. ఇక సేవ చేస్తానని ముందుకు వచ్చే వారిని ఆదరించేదెవరు?! - వాకా మంజులారెడ్డి -
నాన్న వారసత్వం ఆయన కోరిక కలిస్తే... నేను
స్వర వీణాపాణి... సంగీతసాహిత్యాలను పేరులోనే ఇముడ్చుకున్న సరస్వతీపుత్రుడు. తండ్రి కోరిక తనకు దివిటీగా మారి మార్గదర్శనం చేసిందంటారాయన. ఆ వెలుగులో పయనించి గమ్యాన్ని చేరిన సంగీతదర్శకులు స్వరవీణాపాణి అంతర్వీక్షణం. మీరు ఎప్పుడు పుట్టారు? ఎక్కడ పుట్టారు? డిసెంబర్ ఒకటిన. గుంటూరు జిల్లా రావెలలో. అమ్మానాన్నలు, అక్కచెల్లెళ్లు, అన్నదమ్ములు... లక్ష్మీ నరసింహశాస్త్రి, సీతా అన్నపూర్ణ. అన్నయ్య రామకృష్ణ, చెల్లెళ్లు పద్మ, శైలజ, వరలక్ష్మి. నేను సంగీతంలో నాన్న వారసత్వాన్ని కొనసాగించాను. అన్నయ్య ఎంఆర్ఓ, చెల్లెళ్లు అందరూ గృహిణులు. మీ తొలి గురువు? మా నాన్నగారే. మీరు సినిమా రంగంలోకి రావడానికి స్ఫూర్తి... అదీ నాన్నగారి ప్రోత్సాహంతోనే. ఆయన సంగీతకారుడిగా సినీరంగంలోకి ప్రవేశించాలని కొన్నాళ్లు మద్రాసులో ఉండి వెనక్కు వచ్చేశారు. ఆయన కోరిక, ప్రోత్సాహం వల్లనే నేను సినీరంగం లోకి వచ్చాను. ఈ రంగంలోకి రాకపోయి ఉంటే... లాయర్గా కొనసాగేవాడినేమో... గాయకుడిగా మీ తొలి వేదిక... గుంటూరులో ఆంజనేయస్వామి గుడి. పాట నుంచి స్వరకర్తగా మారడానికి కారణం... నాన్న మంచి కంపోజర్. ఆయన్ని అనుకరించాను. త్రిపాత్రాభినయం అనవచ్చా? పాట రాసి, స్వరపరిచి పాడడం... ఈ మూడూ అంతర్లీనంగా ఒకదానితో ఒకటి ముడివడిన పనులే. ఒక ప్రవాహంలా అలా జరిగిపోతుంటాయి వీణాపాణి అని నామకరణం ఎవరు చేశారు? తనికెళ్ల భరణిగారు వీణాపాణి అని పెట్టారు. జనార్దన మహర్షి దానికి ‘స్వర’ను జోడించారు. అలా, స్వరవీణాపాణినయ్యాను. నా అసలు పేరు రమణమూర్తి... అది మా తాతయ్య పేరు. మీ తొలి సంపాదన? సుశీల గారి నుంచి అందుకున్నాను. ఆవిడ నిర్మాతగా, గాయనిగా రూపొందించిన ‘సత్యసాయి భక్తిమాల ప్రాజెక్టు’కి పని చేశాను. సినిమాల్లో అవకాశాలు ఎలా అందిపుచ్చుకున్నారు? సుశీలమ్మ చలవే. వాళ్ల ఇంట్లో ఓ గదిలో ఉండే వాడిని. నన్ను అమ్మలాగా అన్నం పెట్టి మద్రాసులో ప్రముఖులకు పరిచయం చేశారు. దాంతో నా సినిమా కష్టాలు తొలగిపోయాయి. రమణమూర్తి వీణాపాణిగా మారిందెప్పుడు? పాటల ఆల్బమ్లు ఓగేటి రమణమూర్తి పేరుతోనే వచ్చాయి. నా తొలి సినిమా ‘పట్టుకోండి చూద్దాం’ లో టైటిల్ వీణాపాణి. మీకు ఏ టైటిల్ ఎక్కువ సంతోషం? ఓగేటి పేరు నాకు పరవశం. సినిమా టైటిల్ నాన్నగారి కోరిక తీరిందనే పులకింత. కొడుకుగా తండ్రి రుణం తీర్చుకున్న భావన కలిగిందా? ఎంత చేసినా, ఏం చేసినా ఆయన రుణం తీరదు. మీ బలం, బలహీనతలు... సంగీతం, సాహిత్యం. గీత రచయితలు, గాయకులు, స్వరకర్తలకు సందేశం! నమ్మిన సత్యం కోసం ప్రయాణాన్ని కొనసాగిస్తే గమ్యం చేరుతాం. ఒడుదొడుకులకు వెనుకడుగు వేయకూడదు. నిజంగా నమ్మాలి. నమ్మినట్లు నటిస్తే విజయం కూడా భ్రమింపచేస్తుంది. దేవుడు ప్రత్యక్షమై వరం అడిగితే... మంచి కుటుంబాన్ని, సంగీత సాహితీ సేవ చేసే అదృష్టాన్నిచ్చావు. ఎన్నిజన్మలైనా ఇలాగే కావాలని! మీ కుటుంబం గురించి... నా భార్య శ్రీలక్ష్మీనరస. ఇద్దరమ్మాయిలు సాయి లక్ష్మి, పూర్ణ స్వరమంజరి. మీ ఆవిడ మీ మీద తరచూ చేసే ఆరోపణ... మంచి దుస్తులు వేసుకోనని... మీ కోసం కూడా కొంత సమయం కేటాయించుకోండి... అని కోప్పడుతుంటుంది. మీ విజయరహస్యం? ప్రతి మగాడి విజయరహస్యం తల్లి, భార్య ఇద్దరూనూ. భార్యలో ఓ మూల తల్లి దాగి ఉంటుంది. అవసరమైనప్పుడు హెచ్చరిస్తూనే, తల్లిలా ఆదరిస్తుంది. మీరు ఇంతవరకు బయటపెట్టని కోరిక ఏదైనా ఉందా? నా భార్యను ఎప్పుడూ సంతోషంగా ఉంచడం. నా భార్యతో కలిసి ఇంటర్వ్యూ ఇవ్వడం. - వాకా మంజులారెడ్డి -
మనసు పెట్టి రాస్తే జీవకళ! మెదడు పెట్టి రాస్తే సమగ్రత!!
అంతర్వీక్షణం వి. హనుమంతరావు, సీనియర్ జర్నలిస్ట్... అంటే ఆయన సంతోషిస్తారు. ప్రొఫెసర్ హనుమంతరావు, ఆర్థికవేత్త హనుమంతరావు అనే మకుటాలు నాకొద్దంటూ నిక్కచ్చిగా చెప్పేస్తారు. గడచిన ఆగస్టు 30వ తేదీతో 90వ సంవత్సరంలోకి అడుగుపెట్టారాయన. ఆయన జర్నలిస్టు జీవితానికి అరవై దాటాయి. ఈ సందర్భంగా ఇది ఆయన అంతర్వీక్షణం. పాత్రికేయ వృత్తి గురించి ఒక్కమాటలో..! అత్యంత బాధ్యతాయుతమైనది, పవిత్రమైనది. మీ రోజుల్లో శిక్షణ ఉండేదా? అప్పట్లో జర్నలిజం కోర్సుల్లేవు. ఎస్ఎస్ఎల్సి సర్టిఫికేట్, టైపింగ్, షార్ట్హ్యాండ్ అర్హతలతో ఈ వృత్తిలోకి వచ్చాను. ఓనమాల నుంచి పనిచేస్తూనే నేర్చుకున్నాను. తప్పులు చేస్తూ... సీనియర్లు దిద్దిన కాపీ చూసి నేర్చుకున్న తరం మాది. మీ తొలి ఉద్యోగం... పోస్టల్ టెలిగ్రాఫ్ డిపార్ట్మెంట్లో స్టెనోగ్రాఫర్. మరి పత్రికారంగంలోకి ఎలా వచ్చారు? ప్రజాశక్తిలో పుచ్చలపల్లి సుందరయ్యకు సహాయకుడిగా టైప్, షార్ట్ హ్యాండ్ వచ్చిన వ్యక్తి కావాలని స్నేహితులు చెప్పడంతో చేరాను. ఆ తర్వాత పార్లమెంటు కార్యకలాపాలను నోట్స్ రాసుకుని కథనాలు తయారు చేయడానికి షార్ట్ హ్యాండ్ వచ్చు అనే అర్హతతోనే నన్ను ఢిల్లీకి పంపారు. అప్పట్లో పత్రికల మధ్య అక్షరయుద్ధం సాగేదా? 1955 మధ్యంతర ఎన్నికల సమయంలో ఆంధ్రప్రభ (నార్ల వెంకటేశ్వరరావు) - విశాలాంధ్ర (రాంభట్ల కృష్ణమూర్తి) పత్రికల మధ్య కార్టూన్ల యుద్ధం తీవ్రంగా సాగింది. పాత్రికేయునిగా మిమ్మల్ని మీరు నిలబెట్టుకోవాల్సిన అవసరం ఎప్పుడైనా వచ్చిందా? యుఎన్ఐలో పనిచేస్తున్నప్పుడు మాకు పిటిఐతో పోటీ. జాతీయపత్రికల్లో హైదరాబాద్ కనిపించాలంటే దేశవ్యాప్తంగా ఆసక్తి కలిగించే వార్తాకథనాలు రాయాలి. రాజేంద్రనగర్, తార్నాకల్లోని అఖిలభారత సైన్సు, సాంకేతిక సంస్థల్లో నాకు మంచి విషయాలు దొరికేవి. మీరు కాలరెగరేసుకుని చెప్పగలిగిన రిపోర్టింగ్? బంగ్లాదేశ్ యుద్ధం సమయంలో విమాన వాహక నౌక ‘ఐ.ఎన్.ఎస్. విక్రాంత్’ నుంచి యుద్ధవార్తలు పంపడం. అప్పటికి ఆంధ్రప్రదేశ్ నుంచి నేనొక్కడినే. మీరు ఇప్పటి వరకు ఎన్ని పుస్తకాలు రాశారు? ఇరవై వరకు ఉంటాయి. ‘ఎపి యట్ 50’ ఆంధ్రప్రదేశ్ మీద సమగ్ర సమీక్ష సమాచారంతో ఇంగ్లిష్లో ప్రచురించిన తొలి పుస్తకానికి సంపాదకత్వం వహించాను. నేను స్థాపించిన డిఎన్ఎఫ్ (డేటా న్యూస్ ఫీచర్స్) అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తొలి న్యూస్ ఏజెన్సీ. విలేఖరిగా మీరు ఊహించని హఠాత్పరిణామం ఏదైనా ఉందా? విశాఖపట్నంలో జరిగింది. పాకిస్తాన్ సబ్మెరైన్ విశాఖ తీరంలో మునిగిపోయింది. పాక్ జలాంతర్గామిని పేల్చివేసిన శబ్దాన్ని విశాఖ నగరం మొత్తం విన్నది. వైస్ అడ్మిరల్ ఆ విషయాన్ని పత్రికాసమావేశంలో వెల్లడించి మేమున్న గది తలుపులు వేయించాడు. ఎందుకలా!... పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఆ వార్తను ప్రభుత్వం ప్రకటించకముందు పత్రికల్లో రాకూడదని. వ్యక్తికి - విలేఖరికి తేడా!... వ్యక్తి తప్పు చేస్తే దాని దుష్ర్పభావాన్ని వారు మాత్రమే భరిస్తారు. జర్నలిస్టు తప్పు రాస్తే ఒక వాస్తవం మరుగున పడి, అవాస్తవం సమాజం మీద ప్రభావం చూపిస్తుంది. జర్నలిజానికి కేంద్రబిందువు రాజకీయాలేనా? కాదు, ప్రజలు. ప్రజలే కేంద్రబిందువుగా సాగే వార్తలకు, వార్తా కథనాలకు కట్టుబడి ఉండడమే విలేఖరి తనకు తాను గీసుకోవాల్సిన లక్ష్మణరేఖ. జర్నలిస్టుకు మీరిచ్చే సందేశం? ఈ వృత్తిలో కొనసాగుతున్నది జీతం కోసమే, అయినా ‘మనసు పెట్టి పని చేస్తే రాష్ట్రానికీ, దేశానికీ, ప్రజలకు సేవ చేయవచ్చు’ అనే తలంపు ఉండాలి. అప్పుడే వార్తకు జీవకళ వస్తుంది. మెదడుకు పని చెప్పి మేధస్సు జోడిస్తే వార్తకు సమగ్రత వస్తుంది. - వాకా మంజులారెడ్డి -
నాన్నా! నన్ను క్షమించు!!
అంతర వీక్షణం! యండమూరి వీరేంద్రనాథ్ పరిచయం అక్కర్లేని ప్రముఖులు. నవలా రచయితగా తెలుగు పాఠకులను అక్షర నీహారికతో గిలిగింతలు పెట్టిన రచయిత. ఆయన వ్యక్తిత్వాన్ని, జీవితానుభవాన్ని క్లుప్తంగా తెలియచేసే ప్రయత్నమే ఈ అంతరవీక్షణం. మీ గురించి మీరు ఒక్కమాటలో... నా కృషే నా బలం. పెద్దగా తెలివితేటలు లేకపోయినా కృషితో ఎదిగాను. మీలో మీకు నచ్చే లక్షణం, అలాగే నచ్చని లక్షణం... నచ్చే లక్షణం... అనుకున్న పని పూర్తి చేయడానికి అవసరమైనంత కష్టపడడం, రాజీ పడకపోవడం. నచ్చని లక్షణం... ప్రపంచం పట్ల చిరాకు. ఎదుటి వారిని చూసే దృష్టి కోణం ఎలా ఉంటుంది ? వీరికి జీవితం పట్ల ప్రేమ (జీవితేచ్ఛ) ఉందా లేదా అని చూస్తాను. ఎలాంటి వ్యక్తులను ఇష్టపడతారు ? చేస్తున్న పని, ఉద్యోగాన్ని... సిన్సియర్గా చేసేవారిని. మీరు సృష్టించి మలిచిన పాత్రల్లో ఏ పాత్ర అంటే ఎక్కువ ఇష్టం? ఆనందోబ్రహ్మ నవలలో మందాకిని పాత్ర. ఎక్కడ స్థిరపడాలనుకున్నారు? ఎక్కడ స్థిరపడ్డారు? (రంగం, ప్రదేశం) ఉద్యోగం వస్తే చాలనుకున్నాను, రచయితనయ్యాను. ఇక ప్రదేశం విషయానికి వస్తే ఇప్పుడు కాకినాడలో స్థిరపడితే బావుణ్ణనిపిస్తోంది. మీరు ఎక్కువగా ఇష్టపడే వ్యక్తి ఎవరు ? తండ్రి, అలాగే నన్ను అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తి కూడా ఆయనే. మిమ్మల్ని కెరీర్ దిశగా ప్రభావితం చేసిన సందర్భం, సంఘటన... ఎం.కామ్ చదవడానికి డబ్బుల్లేక సి.ఎలో చేరడం. తొలి సంపాదన ? ఏడవ తరగతిలో... ట్యూషన్ చెప్పడం ద్వారా. పెద్ద మొత్తం అందుకున్న సందర్భం? బెంగళూరులో ఒక గంట ప్రసంగానికి జిఎమ్ఆర్ (గ్రంథి మల్లికార్జునరావు) లక్ష రూపాయల చెక్కు ఇచ్చారు. అది నేను ఊహించని మొత్తం. మిమ్మల్ని అత్యంత బాధ పెట్టే విషయాలు? అర్థంపర్థం లేని విమర్శలు. విమర్శ ఎప్పుడూ కన్స్ట్రక్టివ్గా ఉండాలి. అలా చేసి ఉండాల్సింది కాదని పదే పదే అనుకున్న సందర్భం... నాన్న చివరి రోజుల్లో ఆయన దగ్గర గడిపి ఉంటే బావుండేదని చాలాసార్లు అనిపిస్తుంటుంది. మీరు ఎవరికైనా క్షమాపణ చెప్పుకోవాల్సి ఉందా? మా నాన్నకే. ‘నా నుంచి సహాయం పొంది నాకే ద్రోహం చేశార’నే ఆరోపణ ఉందా? ఒక మంచి స్నేహితుడు డబ్బు అప్పుగా తీసుకుని ముఖం చాటేశాడు. అతడు డబ్బు ఇవ్వలేనని చెప్పినా ఇంత బాధపడేవాడిని కాదేమో. భాగస్వామికి తగినంత సమయం కేటాయిస్తున్నానని అనుకుంటున్నారా? లేదు. చాలా అన్యాయమే చేశాననిపిస్తుంటుంది. జీవితంలో అట్టడుగు నుంచి పెకైదిగిన వారందరి పరిస్థితి ఇలాగే ఉంటుందనుకుంటాను. జీవితంలో ఆనందపడిన క్షణాలు... చిన్న విషయానికే ఆనందపడిపోతాను. ఒక మంచి వాక్యం రాస్తే ఆ రోజంతా సంతోషంగా ఉంటాను. వంట బాగా కుదిరినప్పుడు కూడా. మిమ్మల్ని భయపెట్టే విషయాలేంటి? నన్ను ఏ విషయమూ భయపెట్టదు. భవబంధాలకు అతీతుణ్ని. ఒక్క రోజు మిగిలి ఉంటే ఏం చేస్తారు? ఆ రోజును ఎలా గడుపుతారు? ఆర్థిక విషయాలను, అసంపూర్తిగా ఉన్న స్క్రిప్టును పరిష్కరిస్తాను. ఎప్పుడైనా అబద్ధం చెప్పారా? చాలాసార్లు. ఎక్కువ అబద్ధాలు మా ఆవిడ అనుగీతతోనే. ఆమె సంతోషించే చిన్న అబద్ధాలనే చెప్తాను. నా ప్రయోజనం కోసం కాదు. దేవుడు ప్రత్యక్షమైతే ఏం కోరుకుంటారు? నేనసలు దేవుడినే నమ్మను. అద్దంలో చూసుకున్నప్పుడు ఏమనుకుంటారు? గుడ్... వృద్ధాప్యం రాలేదు. ఇంకా ఎన్ని ప్రోగ్రామ్లైనా చేయవచ్చు. సమాజానికి ఏం చెప్తారు? రేపటి మరింత ఆనందం కోసం ఈ రోజు బాగా పని చేయాలి. - వాకా మంజులారెడ్డి -
వివరం: స్ఫూర్తి శిఖరాలు
శిఖరం కన్న సంకల్పబలం ఎత్తైదని నిరూపించిన భారతీయ మహిళలు వీరంతా! బచేంద్రీపాల్ మొదలు... ఒంటికాలితో ఎవరెస్టును ఎక్కిన అరుణిమ సిన్హా వరకు ఒక్కొక్కరిదీ ఒక్కో ప్రత్యేకత. అందరిదీ ఒకే పట్టుదల. అందుకే వీరు స్ఫూర్తి శిఖరాలయ్యారు. ప్రపంచంలోకెల్లా ఎత్తయిన శిఖరం ఏది? ప్రశ్న పూర్తయే లోపు ‘ఎవరెస్టు’ అనే సమాధానం వస్తుంది. 29,029 అడుగుల ఎత్తయిన హిమాలయ పర్వతాల్లో మహలాంగుర్ సెక్షన్లో ఉంది ఎవరెస్టు శిఖరం. దీనిని నేపాలీయులు ‘సాగర్మాత’ అనీ, టిబెట్ వాసులు చోమోలుంగ్మా అనీ పిలుచుకుంటారు. ఎవరు ఎలా పిలుచుకున్నా... శిఖరం ఎప్పుడూ గొప్పదే. ఎవరికీ అందనంత ఎత్తులో ఉండడమే దాని గొప్పదనం. అయితే, ‘ఆ గొప్పదనమేంటో మేమూ చూస్తాం’ అంటూ ఎగబాకుతారు సాహసికులు. ఎవరెస్టును అధిరోహించిన సాహసికుల్లో... ఏడడుగులే కాదు, శిఖరయానం కూడా కలిసే అంటూ ఎవరెస్టునెక్కిన దంపతులు మరీజా, ఆమె భర్త యాండ్రెజ్ స్ట్రెమ్ఫెల్జ్... అరవైలలో ఒకసారి, డెబ్బైలలో మరోసారి ఎవరెస్టు ఎక్కిన రికార్డు నాది అంటూ టేమీ వాటనబుల్... ఇప్పటికి ఇరవైసార్లకు పైగా ఎక్కాను తెలుసా అంటూ అపా షెర్పా... ఇలా ప్రపంచదేశాల నుంచి లెక్కలేనంత మంది ఎవరెస్టును అధిరోహించి తమ కీర్తిని శిఖర స్థాయికి చేర్చుకున్నారు. ఈ అధిరోహణలో భారతీయుల స్థానం కూడా తక్కువేం కాదు. ఈ పరంపరకు తొలి అడుగు బచేంద్రిపాల్. ఆ తర్వాత తండోపతండాల్! ఆ మహిళల అడుగులే ఈవారం మన ‘వివరం’. బచేంద్రిపాల్: ఎవరెస్టును అధిరోహించిన తొలి భారతీయ మహిళ బచేంద్రిపాల్. ఆమె 1984 మే నెల 23న ఎవరెస్టు శిఖరాన్ని చేరుకున్నారు. బచేంద్రిపాల్ భారతీయ మహిళా పర్వతారోహకులకు స్ఫూర్తి ప్రదాత. ఆమె తర్వాత ఎవరెస్టును అధిరోహణకు పూనుకున్న ప్రతి పర్వతారోహకులూ ఒక్కసారైనా ఆమెను కలవాలనీ, సూచనలను తీసుకోవాలనీ, ఆమెతో ఫొటో తీసుకోవాలనీ ఉవ్విళ్లూరినవారే. బచేంద్రిపాల్ 1954 మే నెల 24వ తేదీన జన్మించారు. అంటే నిన్నటికి అరవై ఏళ్ల కిందట అన్నమాట. విశేషం ఏమిటంటే... ఆమె ఎవరెస్టును అధిరోహించింది 1984 మే నెలలోనే తన పుట్టినరోజుకు సరిగ్గా ఒక రోజు ముందే. అంటే ఆమెకు 30 ఏళ్లు నిండిన సందర్భంగా ఆమె కీర్తి ఎవరెస్టు శిఖరానికి చేరింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు గడచిన ముప్ఫై ఏళ్లుగా ఆమె కీర్తి అలాగే శిఖరస్థాయిలో కొనసాగుతోంది. నేషనల్ అడ్వెంచర్ ఫౌండేషన్ ద్వారా ఆమె చాలాకాలంగా పర్వతారోహణలో మహిళలకు (పురుషులకు కూడా) శిక్షణనిస్తున్నారు. టాటా స్టీల్ అడ్వెంచర్ ఫౌండేషన్కు అధినేతగా వ్యవహరిస్తున్నారు. ఈ రికార్డులకంటే ముందు ఆమె సాధించిన మరో రికార్డు కూడా ఉంది. నకురి గ్రామంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తొలి అమ్మాయి బచేంద్రిపాల్. ఆ తర్వాత ఆమె సంస్కృతంలో పోస్ట్గ్రాడ్యుయేషన్ చేశారు. ఆమె తొలిసారి పర్వతారోహణ చేసింది పన్నెండేళ్ల వయసులో. స్కూలు విద్యార్థులతోపాటు పిక్నిక్లో భాగంగా 13, 123 అడుగుల పర్వతాన్ని అధిరోహించారు. సంతోష్యాదవ్: ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన రెండవ భారతీయ మహిళ సంతోష్ యాదవ్. ఆమె 1992, 1993లలో మే నెలలో ఎవరెస్టును అధిరోహించారు. అలా ఏడాది వ్యవధిలో రెండుసార్లు ఎవరెస్టును అధిరోహించారు. సంతోష్ యాదవ్1967 అక్టోబర్ 10న జన్మించారు. ఆమెది హర్యానా రాష్ట్రం, రెవారీ జిల్లాలో జోనియావాస్ గ్రామం. జైపూర్లోని మహారాణి కాలేజ్లో చదివారు. ఉత్తరకాశిలోని కస్తూర్బా హాస్టల్లో ఉంటూ ‘నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటనియరింగ్’ సంస్థలో శిక్షణ పొందారు. ఆమె ఇండియన్ సివిల్ సర్వీసు పరీక్షలకు చదువుతూనే పర్వతారోహణలో శిక్షణ తీసుకున్నారు. ఇరవై ఐదేళ్ల వయసులోనే ఆమె ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. ప్రస్తుతం ఆమె ఇండో- టిబెట్ సరిహద్దు పోలీస్ అధికారి. ఆమె సేవలకు గాను భారత ప్రభుత్వం 2000 సంవత్సరానికి పద్మశ్రీ అవార్డును ప్రదానం చేసింది. కల్పనా దాస్: 2008, మే 21వ తేదీన ఎవరెస్టు శిఖరాన్ని చేరారు. అది ఆమెకు మూడవ ప్రయత్నం. ప్రతికూలమైన వాతావరణపరిస్థితులు, ఆరోగ్యం సహకరించకపోవడం వంటి కారణాల వల్ల ఈమె 2004, 2006లలో రెండుసార్లు విఫలమయ్యారు. మొదటిసారి 7,300 మీటర్లు, రెండవసారి 8, 048 మీటర్ల వరకు మాత్రమే వెళ్లగలిగారు. మూడవ ప్రయత్నానికి ముందు బచేంద్రిపాల్ను కలిసి సలహా తీసుకున్నట్లు ఆమె చెప్తారు. కల్పనాదాస్ 1966 జూలై 7వ తేదీన ఒరిస్సా రాష్ట్రం థేన్కానల్ జిల్లా సరియాపారా గ్రామంలో జన్మించారు. ఆమె వృత్తి రీత్యా న్యాయవాది. ఎవరెస్టును అధిరోహించిన సందర్భంగా మాట్లాడుతూ ‘దేవుడి దయ వల్ల, మా కుటుంబ సభ్యుల ఆశీస్సుల వల్ల అత్యంత ఎత్తై శిఖరాన్ని అధిరోహించి రికార్డు సాధించగలిగాను. విఘ్నాలను అధిగమిస్తూ శిఖరాన్ని చేరడంతోపాటు అంతే క్షేమంగా వెనక్కు రాగలిగాను. ఆ శిఖరాన్ని మళ్లీ మళ్లీ అధిరోహించాలనుంది’’ అన్నారామె. ప్రస్తుతం ఆమె థేన్కానల్ పట్టణంలో నివసిస్తున్నారు. ప్రేమలతా అగర్వాల్: 2011, మే నెల 20వ తేదీన ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించారు. ఈ రికార్డుతోపాటు ఆమెకు ‘ఎవరెస్టును అధిరోహించిన భారతీయ మహిళల్లో పెద్ద వయస్కురాలిగా’ మరో రికార్డు కూడా ఉంది. ఎవరెస్టు ఎక్కేనాటికి ఆమె వయసు 45 ఏళ్లు. ఆమెకి ఇద్దరు కుమార్తెలు. ఆమె ఎవరెస్టు ఎక్కే నాటికే పెద్దమ్మాయికి వివాహమైంది కూడ. జార్ఖండ్కు చెందిన ప్రేమలత గృహిణి. ఆమె భర్త విమల్ అగర్వాల్ సీనియర్ పాత్రికేయులు. ఎవరెస్టు ఆరోహణకు ముందు ఆమె 40 రోజుల పాటు ఎడారిలో పర్యటించారు. థార్ డెజర్ట్ ఎక్స్పిడిషన్లో భాగంగా ఆమె గుజరాత్ లోని భుజ్ ప్రాంతం నుంచి పంజాబ్లోని అట్టారి (వాఘా బోర్డరు) వరకు ఒంటె మీద సవారీ చేసి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్సులో నమోదయ్యారు. ప్రపంచంలోని ఏడు శిఖరాలను అధిరోహించాలనే సంకల్పంతో ఆఫ్రికాలో ఎత్తై శిఖరం కిలిమంజరో అగ్నిపర్వత శిఖరాన్నీ, అర్జెంటీనాలోని మౌంట్ అకాంగువా శిఖరాన్నీ అధిరోహించారు. ఆమె తన పెద్ద కూతురు ప్రియాన్ష తోపాటు టాటా స్టీల్ అడ్వెంచర్ ఇన్స్ట్యూట్లో బచేంద్రిపాల్ దగ్గర శిక్షణ తీసుకున్నారు. విద్యాపతీ దేవి: 2013, మే 17వ తేదీన ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించారు. పూర్తిపేరు నింగ్తోజమ్ విద్యాపతీదేవి. ఆ ఏడాది ఏప్రిల్ ఐదవ తేదీన ఆమె ఎవరెస్టు బేస్ క్యాంపుకు చేరారు. అక్కడి నుంచి హిమాలయ పర్వతాల ఆరోహణ మొదలు పెట్టిన వీరి బృందం ఏప్రిల్ నెలాఖరుకు 24,000 అడుగుల ఎత్తులో ఉన్న మూడవ క్యాంపుకు చేరింది. ఆ సమయంలో ఆ ప్రదేశంలో గంటకు వంద కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తోంది. ఆ వాతావరణంలో కొనసాగుతూ మే నెల 17వ తేదీకి శిఖరాన్ని చేరారు. విద్యాపతీదేవి 2004లో ఉత్తరకాశిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటనియరింగ్ లో పర్వతారోహణలో శిక్షణ పొందారు. దీనితోపాటు సియాచిన్ గ్లేసియర్లో వింటర్ ట్రైనింగ్ కోర్సు కూడా చేశారు. లైజన్ ఆఫీసర్ కోర్సు, సెర్చ్ అండ్ రెస్క్యూ, ఆల్పైన్ కోర్సు, మెథడ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ కోర్సులు కూడా చేశారు. ప్రస్తుతం ఆమె మణిపూర్ మౌంటనియరింగ్ ట్రెకింగ్ అసోసియేషన్లో అడ్వెంచర్ ఇన్స్ట్రక్టర్గా కొనసాగుతున్నారు. విద్యాపతీదేవి ఎవరెస్టు ఎక్స్పెడిషన్ని మణిపూర్లోని ‘మణిపూర్ మౌంటనియరింగ్ అండ్ ట్రెక్కింగ్ అసోసియేషన్’ నిర్వహించారు. ఈ బృందంలో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అన్షు జామ్సెన్పా కూడా ఉన్నారు. వాన్షుక్ మిర్తాంగ్: ఈమె మేఘాలయకు చెందిన ఆర్మ్డ్ పోలీసు కానిస్టేబుల్. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన 16 మంది పర్వతారోహకుల బృందంతోపాటు ఈమె 2013 మే నెల 17వ తేదీన ఎవరెస్టును అధిరోహించారు. వీరు బృందాలుగా విడిపోయి ఆరోహణ కొనసాగించారు. మొదటి బృందంలో విద్యాపతీదేవితోపాటు మరో ఇద్దరు ఉన్నారు. ఆరుగురితో కూడిన రెండవ బృందంలో వాన్షుక్ ఉన్నారు. వాన్షుక్ ‘నార్త్ ఈస్ట్ జోన్ స్పోర్ట్స్ క్లైంబింగ్ కమిటీ’ నిర్వహించిన పోటీల్లో రెండు బంగారు పతకాలు, ఒక రజత పతకాన్ని సొంతం చేసుకున్నారు. 2006లలో మేఘాలయ పోలీస్ శాఖలో చేరిన వాన్షుక్ ఉత్తరాఖండ్ రాష్ట్రం ‘ఔలి’ లో ఉన్న మౌంటనియరింగ్ అండ్ స్కీయింగ్ ఇన్స్టిట్యూట్లో పర్వతారోహణలో శిక్షణ తీసుకున్నారు. చందా గయేన్: 2013, మే నెల 18వ తేదీన ఎవరెస్టును అధిరోహించారు. హౌరాలో నివసిస్తున్న చందా ఈ రికార్డును సాధించిన బెంగాలీ మహిళ. డార్జిలింగ్లోని ‘హిమాలయన్ మౌంటనియరింగ్ ఇన్స్టిట్యూట్’లో ఆమె శిక్షణ పొందారు. ఎవరెస్టు అరోహణకు ముందు ఆమె గర్వాల్ జిల్లాలోని జోగిన్ శిఖరాలను, హిమాచల్ ప్రదేశ్లోని మనిరంగ్ శిఖరాన్ని అధిరోహించారు. కరాటే వంటి యుద్ధకళల్లో ప్రావీణ్యత సాధించిన చందా గయేన్ ఆత్మరక్షణ మెళకువలు నేర్పించే ఉపాధ్యాయిని. తన తల్లి జయా గయేన్ నుంచి స్ఫూర్తి పొందారు. జయాగయేన్కు ట్రెకింగ్ హాబీ. చందాగయేన్ రాక్ క్లైంబింగ్, ట్రెకింగ్, మౌంటనియరింగ్లలో శిక్షణ పొందారు. చందా డార్జిలింగ్లో హిమాలయన్ మౌంటనియరింగ్ ఇన్స్టిట్యూట్, నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటనియరింగ్ లో పర్వతారోహణ సాధన చేశారు. దీంతోపాటు హిమాలయన్ నేచర్ అండ్ అడ్వెంచర్ ఫౌండేషన్ నిర్వహించిన అడ్వెంచర్ ట్రెకింగ్ క్యాంపులో పాల్గొన్నారు. ఆమె స్విమ్మింగ్, కబడీ, ఎన్సిసి, మార్షల్ ఆర్ట్స్, మౌంటనియరింగ్, అడ్వెంచర్ స్పోర్ట్స్తోపాటుగా పాటలు పాడడంలో కూడా సుశిక్షితురాలు. జిల్లాస్థాయి స్విమ్మింగ్ పోటీల్లో బంగారు పతకం, రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో చాంపియన్షిప్, కరాటే చాంపియన్షిప్లు సాధించారు. తాషి మాలిక్, నాంగ్షి మాలిక్: ఈ అక్కాచెల్లెళ్లు ఎవరెస్టును అధిరోహించిన తొలి కవలలు. వీరు 2013 మే 19వ తేదీన శిఖరాన్ని చేరారు. అప్పటికి వారి వయసు 21 ఏళ్లు. వీరిది హర్యానాలోని సోనీపత్ జిల్లా. వీరి తండ్రి కల్నల్ వీరేంద్రసింగ్ మాలిక్ మిలటరీలో ఉద్యోగం చేసి డెహ్రాడూన్లో రిటైరవడంతో కుటుంబం అక్కడే స్థిరపడింది. వీరు 2010లో ఉత్తరకాశిలోని నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటనియరింగ్, జమ్ము-కాశ్మీర్ రాష్ట్రం, గుల్మార్గ్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కీయింగ్ అండ్ మౌంటనియరింగ్లో శిక్షణ పొందారు. పాఠశాల స్థాయి నుంచి ఆటల్లో, సాహస క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొన్న నేపథ్యం వీరిది. జర్నలిజం- మాస్ కమ్యూనికేషన్లో గ్రాడ్యుయేషన్ చేశారు. ఏడు శిఖరాల అధిరోహణలో భాగంగా ఇప్పటికి ఆసియా, ఆఫ్రికా, ఐరోపా, దక్షిణ అమెరికా ఖండాలలోని శిఖరాలను అధిరోహించారు. ఇండోనేసియా, యుఎస్, అంటార్కిటికాలలోని శిఖరాలను ఎక్కే ప్రయత్నంలో ఉన్నారు. అరుణిమా సిన్హా : 2013, మే 22వ తేదీన శిఖరాన్ని చేరారు. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన భారతీయ మహిళల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన వ్యక్తి అరుణిమా సిన్హా. ప్రమాదవశాత్తూ ఒక కాలిని కోల్పోయిన తర్వాత అందరూ తన మీద చూపించే సానుభూతికి సమాధానంగా ఆమె ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించారు. ఉత్తరప్రదేశ్కు చెందిన అరుణిమ జాతీయస్థాయి వాలీబాల్ క్రీడాకారిణి. మూడేళ్ల కిందట ఒకసారి అరుణిమ రైలో ప్రయాణిస్తుండగా దొంగలు ఆమె పర్సును లాక్కునే ప్రయత్నం చేశారు. ఆ ప్రతిఘటనలో దొంగలు ఆమెను కదులుతున్న రైల్లోంచి బయటకు తోసేశారు. ఆ ప్రమాదంలో ఆమె ఎడమకాలు నుజ్జనుజ్జయింది. ఆమెను బతికించాలంటే ఆ కాలిని తీసేయడమే మార్గం అని తేల్చేశారు డాక్టర్లు. ఆమె ఎవరెస్టును అధిరోహించిన సందర్భంగా మాట్లాడుతూ... ‘కాలు పోతే జీవితాన్ని కోల్పోయినట్లు కాదు...’ అని నిరూపించడానికే ఈ సాహసం చేశానన్నారు. తన సాహసయాత్రను ‘టాటా స్టీల్ అడ్వెంచర్ ఫౌండేషన్’ స్పాన్సర్ చేసింది. వ్యక్తిగతంగా వీళ్లే కాకుండా, 2005లో అంతా మహిళలే ఉండే ‘ఆల్ ఉమెన్ ఆర్మీ ఎక్స్పెడిషన్’ జరిగింది. భారతీయ సైనిక రంగానికి చెందిన మహిళల బృందం ఎవరెస్టును అధిరోహించి వచ్చింది. ఇక ఈ ఏడాది (2014) ఏప్రిల్ 18వ తేదీన శిఖరం మీద జరిగిన ప్రకృతి వైపరీత్యం కారణంగా 16 మంది పర్వతారోహకులు మరణించారు. ఈ ఘటన కారణంగా ఈ ఏడాది ఎవరెస్టు శిఖరారోహణను నిషేధించారు. అలా జరగకపోయి ఉంటే ఈ మే నెల మరికొంత మంది మహిళలను ఎవరెస్టు శిఖరంపై ఖాయంగా నిలబెట్టి ఉండేదే.ఎవరెస్టు శిఖరం అన్నిటి కన్నా ఎత్తయినది కావచ్చు. అయితే మహిళల సంకల్పబలం ఎవరెస్టును మించినదని ఈ పది మంది మహిళా పర్వతారోహకులు నిరూపించారు. - వాకా మంజులారెడ్డి -
చక్కని చేనేతకు సురయ్యా చేయూత
ఆమె పేరు సురయ్యా హసన్ బోస్...వారిది స్వాతంత్య్ర సమర యోధుల కుటుంబం.ఇంట్లో అందరూ ఖాదీప్రియులే... గాంధేయవాదులే హస్తకళలకు వేదిక వేసిన నేత ఆమె తండ్రి. అదే స్ఫూర్తి... అదే చైతన్యంతో ముందుకు నడిచారామె. ఢిల్లీ, లండన్లలో హస్తకళలు, చేనేతలలో అధ్యయనం చేశారు. సంప్రదాయరీతుల మనుగడకే జీవితాన్ని అంకితం చేశారు. ఆ సేవ కొనియాడదగినది అని గుర్తించిన యుధ్వీర్ ఫౌండేషన్ ప్రతిష్ఠాత్మక ‘యుధ్వీర్ అవార్డు’ను ప్రకటించింది. సురయ్యా ఈ రోజు ఆ అవార్డును అందుకుంటున్న సందర్భంగా... ముప్పై ఏళ్లుగా ఆమె చేస్తున్న కృషి... వివరాల సుమాహారం!! స్వదేశీ ఉద్యమం నాడు పట్టిన చరఖా... స్వదేశీ ఉద్యమంలో మా కుటుంబం మొత్తం పాల్గొన్నది. నాకు ఊహ తెలిసే నాటికి మా ఇంట్లో అందరూ చరఖాతో నూలు వడుకుతుండేవారు. ఖాదీనే ధరించేవారు. అందరూ స్వాతంత్య్రపోరాటంలో పాల్గొన్నారు. మా చిన్నాన్న అబిద్ హుస్సేన్ సఫ్రానీ సుభాష్ చంద్రబోస్తో పనిచేశారు. వారి స్ఫూర్తితో నేను ఇప్పటికీ చరఖాను వదల్లేదు. - సురయ్యా హసన్ బోస్, చేనేత పరిశ్రమ నిర్వాహకురాలు హైదరాబాద్లో ఉస్మానియా కాలనీ రోడ్, దర్గా హుస్సేన్ షా వలి... సురయ్యా హసన్ బోస్ ఇల్లు. విశాలమైన ప్రాంగణంలో ఓ వైపు సఫ్రానీ- అరబిందోబోస్ ఇంగ్లిష్ మీడియం స్కూలు, అనేకరకాల చెట్లు, పూల మొక్కలు, పంజరంలో రామచిలుక, తెల్లపావురాలు, స్వేచ్ఛగా తిరుగుతున్న నాటుకోళ్లు. వాటిని దాటి ముందుకెళ్తే సురయ్యా నడుపుతున్న చేనేత కేంద్రం, మరో వైపు తన చిన్నాన్న పిల్లలతో కలిసి నివసిస్తున్న ఇల్లు, ఒక పక్కగా ఆఫీసు. వేటికవి విడిగా చిన్న చిన్న కట్టడాలు. ఇది సురయ్యా ప్రపంచం. ఎనభై ఆరేళ్ల వయసులో కూడా ఉదయం ఐదు గంటలకు నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పదింటి వరకు ఆమె ఈ ప్రాంగణం అంతా తిరుగుతూనే ఉంటారు. ఆమెను కదిలిస్తే ఎన్నెన్నో జ్ఞాపకాలు... ‘‘మా నాన్న సయ్యద్ బద్రుల్ హుస్సేన్ గొప్ప దార్శనికుడు. నేను నాలుగైదేళ్ల వయసులో ఉన్నప్పుడే ఆయన పోయారు. స్వదేశీ ఉద్యమంలో ఆయన కీలకభాగస్వామి. ఆ ఉద్యమంలో భాగంగా హైదరాబాద్లో విదేశీ వస్తువులను, వస్త్రాలను తగలబెట్టింది ఆబిడ్సలోని మా ఇంటి ముందే. హైదరాబాద్లో తొలి పుస్తకాల దుకాణం ‘హైదరాబాద్ బుక్ డిపో’ ఆయన స్థాపించినదే. ఖాదీ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని కరీంనగర్లో చేనేతకారులతో ఖాదీ కుటీర పరిశ్రమలు, హైదరాబాద్లో హస్తకళల పరిశ్రమను స్థాపించారు. నేను నాన్నను చూసింది ఈ సేవలోనే. అందుకే నాకు ఇవంటే అంత మమకారం. కోఠీ ఉమెన్స్ కాలేజ్లో ఇంటర్ కాగానే నాన్న స్థాపించిన హాండీక్రాఫ్ట్స్ ఇండస్ట్రీలో ఉద్యోగంలో చేరాను. అప్పటికే అది ప్రభుత్వ అధీనంలో నడుస్తోంది. పాడి- పంట- ఓ మగ్గం!: పదెకరాల వ్యవసాయ క్షేత్రంలో ఆవులు, గేదెలతోపాటు కోళ్ల పరిశ్రమ చూసుకున్నాను. 30 ఏళ్ల కిందట ఒక్క మగ్గంతో చేనేత కేంద్రాన్ని స్థాపించాను. చేనేతను కాపాడాలంటే... వారసత్వంగా ఆ పని చేసే కుటుంబాలకే పరిమితం కాకుండా నేర్చుకోవాలనే తపన ఉన్న ప్రతి ఒక్కరికీ విస్తరించాలి. భర్తను కోల్పోయి, బతుకుతెరువు లేక ఇబ్బంది పడుతున్న వారిని సమీకరించి నేత పని నేర్పించాను. నేను నేర్చుకున్న పర్షియా నేత కళ హిమ్రూ, కచ్ చేనేత మష్రూ, కాశ్మీర్ చేనేతశైలి జమావరీలలో శిక్షణ ఇచ్చాను’’ అన్నారు సురయ్యా. హైదరాబాద్కు హిమ్రూ! హిమ్రూ అంటే పర్షియన్ బ్రొకేడ్ (పూలు, లతల డిజైన్ను జరీతో నేయడం). హిమ్రూ నేతకారులు నిజాం నవాబుల కాలంలో ఔరంగాబాద్ పరిసరాల్లో జీవించేవారు. ఈ కళను హైదరాబాద్కు తెచ్చారు సురయ్యా. ‘‘మన చేనేత విధానంలో హిమ్రూని మిళితం చేసి డిజైన్లు రూపొందించాను. ఇలాంటి ప్రక్రియ దేశంలోనే కాదు ప్రపంచంలో మరెక్కడా లేదు. నేను హిమ్రూ, పైథానీ, జమావరి, ఇకత్ వంటి నేత ప్రక్రియలను నేర్చుకోవడంతో ఈ ప్రయోగాలు సాధ్యమయ్యాయి. ఇప్పుడు పది మగ్గాలతో ఇరవైమంది నేతకారులతో నడుస్తోంది ఈ కేంద్రం. దీనికి సమాంతరంగా గద్వాల్, నారాయణ్పేట, ఉప్పాడ, పోచంపల్లి వంటి ప్రతి చోటా ఇద్దరు ముగ్గురు నిపుణులైన చేనేతకారులు ఈ కేంద్రానికి పనిచేస్తున్నారు. వారికి కొత్త డిజైన్లు ఇచ్చి, ఆ డిజైన్లో అవసరమైన చేనేత విధానాలను ఎలా మిళితం చేయాలో నేర్పిస్తాను’’ అని వివరించారామె. వరంగల్ నేతకారుల తివాచీలకు కలంకారీ అద్దకం చేయించడం వంటి ప్రయోగాలు చేశారామె. ఏటికొప్పాక కొయ్య బొమ్మలు చేసేవారు, ఒరిస్సా నుంచి బ్రాస్ బొమ్మల తయారీదారులు కూడా ఈ కేంద్రానికి పనిచేస్తున్నారు. చదువు- సంస్కారం! చేనేత కేంద్రానికి అనుబంధంగా పాఠశాల స్థాపన గురించి ‘‘చిన్నాన్నకు, మా వారు అరబిందో బోస్కు పిల్లల చదువంటే చాలా ఇష్టం. చదువుతోనే చైతన్యం వస్తుందని, ఇంగ్లిష్ భాష వస్తే పరిధి విస్తరిస్తుందనేవారు. వారిపేరుతో ఇంగ్లిష్ మీడియం స్కూలు స్థాపించాను. దీనిని మా పెద్ద చిన్నాన్న ఖుర్షీద్ హసన్ కూతురు మేరీ చింతారా నడుపుతోంది. నా చేనేత కేంద్రంలో పనిచేసే కుటుంబాల పిల్లలు ఇందులోనే చదువుకుంటారు. ఆ తల్లిదండ్రులకు పిల్లలకు మంచిచెడు, పద్ధతులు చెప్పే తీరిక ఉండదు. పిల్లలకు చదువుతోపాటు సంస్కారం కూడా ఇక్కడే నేర్పాలి. టెన్త పరీక్షలో మా పిల్లలందరూ ఫస్ట్ క్లాసులో పాసయ్యారు. కొందరు ఉన్నత విద్య కోసం విదేశాలకు కూడా వెళ్లారు. నాకు పిల్లల్లేరు, మా స్కూల్లో చదువుతున్న 550 మంది నా పిల్లలే’’ అంటారామె. గుర్తించారనడానికి ఓ సంకేతం! యుధ్వీర్ స్మారక అవార్డుకు ఎంపిక కావడం సంతోషంగానే కాదు గర్వంగా కూడా ఉందంటారు సురయ్యా. ‘‘ఇది చేనేతకు నేను చేసిన శ్రమకు గుర్తింపు. నాకు తోచినట్లు, నాకు నచ్చినట్లు చేస్తూ వచ్చాను. సమాజం గుర్తించింది అనడానికి ఇది ఓ సంకేతం అంతే. మా వారు అరబిందో బోస్... సుభాష్ చంద్రబోస్ పెద్దన్నయ్య కొడుకు. ఆయన ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్స్ ప్రెసిడెంట్గా దేశంలో ఎక్కడ కార్మికుల హక్కులకు భంగం వాటిల్లినా అక్కడ ఉండేవారు. ఆయన సేవలు ఉత్తరాదిలోనే ఎక్కువగా ఉండేవి. నా పరిశ్రమ దక్షిణాదిలో విస్తరించింది. ఆయన బెంగాలీగా ఉత్తరాది రుణం తీర్చుకున్నారు, నేను హైదరాబాదీగా దక్షిణాదిలో పనిచేస్తున్నాను’’ అంటారు. చెట్టు మీది కాయ - సముద్రంలో ఉప్పు! తోటమాలికి మామిడి చెట్టును పెంచి కాయను కోయడమే తెలుస్తుంది. సముద్రతీరంలో ఉప్పు పండించే వారికి ఉప్పు రాశులు పోయడమే తెలుసు. పొలం సాగు చేసే రైతు... మిరపనారు పోసి ఎర్రటి మిరపకాయల దిగుబడి సాధించడంలో నేర్పరి. ఈ మూడింటినీ తూకంగా కలిపి నోరూరించే ఆవకాయ చేసేది అమ్మ. సురయ్యాబోస్ చేయి కూడా అలాంటిదే. కాశ్మీరీ జమావరీ, పర్షియా హిమ్రూ, దక్షిణాది ఇకత్ను కలుపుతూ మన సంప్రదాయ రీతులను కాపాడుతున్నారు. - వాకా మంజులారెడ్డి, ఫొటోలు: ఎస్ఎస్ ఠాకూర్ -
వివరం: వికసించేది వేసవిలోనే!
మొక్కలకు సూర్యరశ్మి ఎలాగో... చిన్నారులకు వేసవి సెలవులు అలాగ! సూర్యరశ్మి మొక్కలకు బలాన్ని, జీవాన్ని, పచ్చటి మెరుపును ఇస్తుంది. వేసవి సెలవులు చిన్నారులకు వికాసాన్ని, వినోదాన్ని, మానసిక ఎదుగుదలను ఇస్తాయి! ఏడాదంతా కష్టపడి చదివిన ఫలితం... మార్కుల లిస్టులో ప్రతిబింబిస్తే, ఈ ఒకటిన్నర నెల సెలవుల్లో నేర్చుకున్నది... స్కూళ్లు తెరిచాక పిల్లల ముఖంలో ప్రతిఫలిస్తుంది! పిల్లలంతా వేసవి సెలవుల తర్వాత సడెన్గా ఎదిగినట్లు, ఏ కొత్త ప్రపంచం నుంచో వచ్చినట్లు మెరిసిపోతూ కనిపిస్తారు! అంతా... ఆడిన ఆట మహిమ, పాడిన పాట మహిమ, చేసిన అల్లరి మహిమ. చూసిన ప్రపంచం మహిమ! మరి మీరు మీ పిల్లల్ని ఈ సెలవుల్లో సరదా సరదాగా ఎలా సాన పట్టబోతున్నారు? ఈవారం ‘వివరం’ చదవండి. లేలేత సూర్యకిరణాలు ముఖం మీద పడుతుంటే కళ్లు నులుముకుంటూ నిద్రలేచే బాల్యం ఇప్పుడు ఎక్కడికెళ్లిందో తెలియడం లేదు. అలారం పెట్టుకుని అమ్మ నిద్ర లేచి ఇంటి పనులు చేసుకుంటూ ఓ కంట గోడగడియారాన్ని గమనిస్తూ వంటగదిలో నుంచి ‘ఏడవుతోంది, ఆటో అంకుల్ వచ్చేస్తారు’ అంటుంటే విసుగ్గా నిద్రలేచే బాల్యమే ఈ తరానికి మిగిలింది. ఏడాదంతా ఇలా గడిచిపోతే... వాళ్లు పెద్దయిన తర్వాత ‘మా చిన్నప్పుడు...’ అని వాళ్ల పిల్లలకు చెప్పుకోవడానికి ఏం మిగులుతాయి? ఒక కోతికొమ్మచ్చి లేదు, ఒక వైకుంఠపాళీ లేదు. మరెలా? మరిచిపోయిన మన ఆటలను గుర్తు చేసుకుని మరీ నేర్పించాలి. అలమరల్లో దాగిన పంచతంత్రం పుస్తకాన్ని తీసిచ్చి చదవడం అలవాటు చేయాలి. చదివిన కథను తిరిగి చెప్పడమూ అలవాటు చేయాలి. బొమ్మ గీయడానికి ప్రయత్నించమని ఒక సూచన చేసి వాళ్లు చేసే హడావిడిని చూస్తూ ఊరుకోవాలి. ఇలా చేస్తే పిల్లలకు ఈ వేసవి సెలవులు అందమైన బహుమతి అవుతాయి. అందమైన జ్ఞాపకాలే కాదు వారిలో దాగిన సృజనాత్మకత బయటకు వస్తుంది. ఆ సృజనాత్మకతే రేపటి రోజున వాళ్లు కళల్లో రాణించడానికి నాంది కావచ్చు. వృత్తిని నిర్ణయించుకునే మాధ్యమం కావచ్చు. సంస్కృతి- సంప్రదాయం ఒకటి ఒకటి ఒప్పుల కుప్ప... రెండు రెండు రెక్కల పిట్ట మూడు మూడు ముక్కాలి పీట... నాలుగు నాలుగు మా ఆవు కాళ్లు... ఐదు ఐదు నా అరచేతి వేళ్లు!! ఐదు వాక్యాల బాలగేయంలో ఏమేమి నేర్చుకున్నామో ఒక్కసారి పరిశీలించండి. ఒప్పులన్నీ ఒక చోట రాశిపోస్తే ఆ మనిషి మంచిగుణాల సుమహారమని చెప్తోంది. పక్షికి రెండు రెక్కలుంటాయని, ఆవుకు నాలుగు కాళ్లుంటాయని పశుపక్ష్యాదులను పరిచయం చేస్తోంది. ముక్కాలి పీటకు మూడు కాళ్లుంటాయని రోజువారీ ఉపయోగించే వస్తువులనూ, చేతికి వేళ్లు ఐదని శరీర నిర్మాణాన్ని పరిచయం చేస్తూనే పిల్లలకు ఐదు అంకెలను నేర్పింది. ఇవన్నీ బడి గుమ్మం ఎక్కకముందే ఇంట్లో నేర్చుకునేవాళ్లు. అలాగే చిట్టి చిలకమ్మా అమ్మ కొట్టిందా!... ఉడతా ఉడతా ఊచ్ ఎక్కడికెడతావ్ ఊచ్!... చేతవెన్నముద్ద చెంగల్వపూదండ... ఈ గేయం నేర్చుకుంటే మనిషి ఆహారం, ఆహార్యం అర్థమయ్యేవి. ఇదంతా చదువు చెబుతున్నట్లు కాకుండా నేర్చుకోవడం. మన సంస్కృతీసంప్రదాయాలను తెలియచేయడానికి ఈ వేసవిలో ఒక ప్రయత్నం చేస్తే చాలు... వీటితో మరో ప్రయోజనం తెలుగుభాషలో అనేక పదాలు తెలుస్తాయి. అన్ని అక్షరాలనూ చక్కగా పలకడం వస్తుంది. టెక్నాలజీ! సాంకేతిక పరిజ్ఞానం రోజుకోరకంగా కొత్త పుంతలు తొక్కుతోంది. అయితే ఫేస్బుక్, ఆర్కుట్, గూగుల్ప్లస్ వంటి సామాజిక సంబంధాల వెబ్సైట్లలో అంతిమంగా చాటింగ్ తప్ప చిన్నారులకు మరో వినోదం ఉండదు. ఖాళీ సమయాల్లో ఇంటర్నెట్తో గడిపే అవకాశం, ఆసక్తి ఉన్న వారికి యూట్యూబ్ అంతులేని వినోదాన్ని, విజ్ఞానాన్ని పంచుతోంది. తరచి చూడాలే కానీ వీడియోల రూపంలో ఉన్న అద్భుతమైన విజ్ఞానవాహిని ఈ వెబ్సైట్. చిన్నారులను ఈ ఛానల్స్తో కనెక్ట్ చేయగలిగితే అందులో విహారం మొదలుపెడతారు. యూట్యూబ్లో తెలుగు పాటలు, బాలగేయాల మొదలుకొని బీబీసీ డాక్యుమెంటరీల వరకూ వినోద విజ్ఞాన వీడియోలు అందుబాటులో ఉంటాయి. యానిమేషన్ బొమ్మలతో రూపొందించిన వీడియోలు ఉంటాయి. ఇక ఇంగ్లిష్ రైమ్స్కు లెక్కేలేదు! పెద్ద పిల్లలను యానిమల్ ప్లానెట్, డిస్కవరీ ఛానల్ వాళ్ల వీడియోలు సహజంగానే ఆకర్షిస్తాయి. ఇంగ్లిష్ గ్రామర్ పాఠాల వీడియోలు ఇంగ్లిష్ పై పట్టు సంపాదించడానికి పనికి వస్తాయి. సమకాలీన అంశాలపై బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ రూపొందించిన డాక్యుమెంటరీలు కూడా యూట్యూబ్లో ఉంటాయి. చక్కటి విశ్లేషణలతో ఉండే విజువలైజ్డ్ డాక్యుమెంటరీలను వీక్షించడం అంటే ప్రపంచాన్ని అధ్యయనం చేయడమే. ప్రయాణాలు - ఆరోగ్యం! వేసవి సెలవుల్లో ప్రయాణాలు పెట్టుకోవడం సహజం. టూర్ప్లాన్లో ముందుగా ఎక్కడికి వెళ్తున్నాం, అక్కడి వాతావరణం ఎలా ఉంటుంది... వంటి వివరాలు తెలుసుకుని అందుకు అనువైన దుస్తులు పెట్టుకోవాలి. దీంతోపాటు కొన్ని ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణానికి ముందే పూర్తి స్థాయి సాధారణ పరీక్షలు చేయించుకోవాలి. మనం వెళ్లాలనుకున్న చోట ఏవైనా అంటువ్యాధులు ప్రబలి ఉంటే నివారణ చర్యగా వ్యాక్సిన్లు తీసుకోవాలి. కొన్ని మందులు మీరు వెళ్లే ప్రదేశాల్లో దొరకకపోవచ్చు. పైగా కొత్తచోట మెడికల్ షాపులు వెతుక్కోవడం కొంచెం కష్టం. అందుకే వాంతులు, విరేచనాలు, జలుబు, దగ్గు, జ్వరం వంటి ప్రదేశం మారితే వచ్చే కొన్ని సాధారణ జబ్బులకు మందులు దగ్గర ఉంటే మంచిది. డయాబెటిస్, బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధుల మందులు వాడేవారు వాటిని టూర్ వెళ్లి తిరిగి ఇంటికి వచ్చే వరకు సరిపడినన్ని సిద్ధం చేసుకుని పెట్టుకోవాలి. విమాన ప్రయాణాలు చేసేవారు నీరు ఎక్కువగా తాగాలి. రైల్లో దూర ప్రాంతాల ప్రయాణంలో అదేపనిగా సీట్లో కూర్చోకుండా అప్పుడప్పుడూ లేచి అటూ ఇటూ నడవాలి. ప్రయాణం ముందు రోజు కంటి నిండా నిద్రపోవాలి. మర్యాద - మన్నన ఎంత చదువుకున్నా, ఎన్ని నేర్చుకున్నా సరే... మర్యాద-మన్నన నేర్చుకోకపోతే కష్టమే కాదు నష్టం కూడ. అలాంటి వారిని సమాజం గౌరవించదు. అందుకే చిన్నప్పుడే పద్ధతులు నేర్పించాలి. ఇవి చిన్నవే అయినా పెద్ద ఫలితాన్నిస్తాయి. - అకస్మాత్తుగా తలుపులు తోసుకొని వెళ్లకుండా ‘లోపలికి రావచ్చా’ అని అనుమతి తీసుకోవాలి. - బంధువులు, స్నేహితుల ఇళ్లకు వెళ్లినప్పుడు దుస్తులు, పుస్తకాలు తిరిగి శుభ్రంగా సర్దుకోవడం, ఎక్కడి వస్తువులు అక్కడ ఉంచడం అలవాటు చేయాలి. - ఇంటికి వచ్చిన వారిని పలకరించి వారికి ఏం కావాలో చూడడం నేర్పించాలి. అతిథులకు భోజనాలు వడ్డించకముందే తమకు ముందుగా పెట్టమని మారాం చేయకూడదని చెప్పాలి. అతిథిని గౌరవించడం, ఆదరించడం నేర్పాలి. మన దగ్గర లేని పుస్తకం మరొకరి దగ్గర తీసుకుని చదవడం తప్పుకాదు, అయితే వీలయినంత త్వరగా చదివి ఆ పుస్తకాన్ని తిరిగి అదే స్థితిలో ఇవ్వడం చాలా ముఖ్యమని చెప్పాలి. - ఇతరుల ఇంటికి వెళ్లినప్పుడు అల్మారాలు, ర్యాక్లలో ఏమేమి ఉన్నాయోనని వెతకడం భావ్యం కాదని చెప్పాలి. - అతిథులు వెళ్లేటప్పుడు గుమ్మం వరకు వచ్చి సాగనంపాలి. వీటిని చిన్నప్పుడు అలవాటు చేయకపోతే పెద్దయ్యాక ఒంటపట్టడం కష్టం. అనుబంధం- ఆత్మీయత మేనత్త, మేనమామ పిల్లలు, బాబాయ్ కొడుకు, పెద్దనాన్న కూతురును ఏమని పిలవాలో తెలియని తరం ఇది. ఆ తప్పు ఈ బాల తరానిది కాకపోవచ్చు, అంతలా దూరం పెంచిన పెద్దతరానిదే. ఈ వేసవితో ఆ దూరాన్ని చెరిపేసి అనుబంధాలు- ఆత్మీయతలను పటిష్టం చేయడానికి ఒక ప్రయత్నం చేస్తే ఎలా ఉంటుంది? సెలవులలో పిల్లలు బంధువుల ఇళ్లకు వెళ్లడం, బంధువుల పిల్లలు మన ఇంటికి వచ్చి కొన్ని రోజులపాటు ఉండడాన్ని ప్రోత్సహించాలి. బంధుత్వం కలకాలం నిలవాలంటే బంధువుల మధ్య చుట్టరికాన్ని మించిన బంధం ఏదో ఉండాలి, అదే స్నేహం. - బంధుమిత్రుల ఇళ్లకు వెళ్లి రావడంలో పిల్లల్లో టీమ్ స్పిరిట్ పెరుగుతుంది. శారీరక, మానసిక స్థైర్యం కలుగుతుంది. - బంధువుల ఇంటికి వెళ్లేటప్పుడు చిన్న చిన్న కానుకలు (స్వయంగా చేసిన పెయింటింగ్, పువ్వుల వంటి క్రాఫ్ట్స్) తీసుకెళ్తే, వాటిని అందుకున్నవారు ఎంతో సంతోషిస్తారు. - బంధువులను పిన్నీ, బాబాయి, అత్తమామ, అన్న, అక్క, వదిన, బావ... ఇలా వరసలు పెట్టి పిలిస్తే ఆప్యాయతపెరుగుతుంది. ఆర్థికపరమైన అసమానతలు దూరం అవుతాయి. వారు-నేను అనే తేడా పోయి ‘మనం’ అనే భావన కలుగుతుంది. ఆధ్యాత్మికం - వ్యక్తిత్వవికాసం మన పురాణాలను, ఇతిహాసాలలోని ప్రతి పాత్ర కూడా పరిణతి చెందిన వ్యక్తిత్వంతో వ్యవహరిస్తుంది. పురాణాలు చదవడం ఆధ్యాత్మిక చింతనతోపాటు వ్యక్తిత్వాన్ని నేర్చుకోవడానికి కూడ. దేవతలను పూజించడం అంటే వారు ప్రదర్శించిన దైవత్వాన్ని అర్థం చేసుకోవడమే. నిశితంగా గమనిస్తే పూజా విధానాలలో ఉన్న ప్రతి క్రతువు వెనుకా మేధోవికాస ప్రయత్నమే ఉంటుంది. రాముని పరిణతిని తెలుసుకోవడానికి రామాయణాన్ని తెలుసుకోవాలి. పాండవులు- కౌరవులు వ్యవహరించి వ్యూహాత్మకత ద్వారా రాజనీతి తెలుస్తుంది. వీరంతా కృష్ణుడుని కొలవడం... చూస్తే ఎంతటి అధికారమైనా సరే దైవత్వం ముందు తలవంచుతుందనే సత్యాన్ని తెలియచేస్తుంది. ప్రతి పురాణ పాత్రా... తల్లిదండ్రులకు బిడ్డగా, భార్యకు భర్తగా, పిల్లలకు తండ్రిగా, రాజ్యానికి రాజుగా, గురువుకు శిష్యునిగా... అనేక బంధాలను, బాంధవ్యాలను కలిగి ఉంటుంది. ఈ బంధాలను, కర్తవ్యాలను సమతూకంగా నిర్వహించాలంటే గొప్ప వ్యక్తిత్వం ఉండాలి. పరిణతి చెందిన మేధాసంపత్తితోనే అది సాధ్యం. పిల్లలకు ఆధ్యాత్మిక విషయాలను బోధిస్తూ అందులోని సూకా్ష్మలను వివరించాలి. అప్పుడు పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. నానమ్మకు కథ చెబుదాం! మీకు తాబేలు-కుందేలు కథ తెలుసా? పులుసురాయి కథ తెలుసా? భలే ఉంటుందిలే. ఘుమఘుమలాడే కుండెడు పులుసు చేస్తాడు ఒకాయన, ఉత్తి రాయితోనే! పోనీ ఉల్లిగడ్డ పొట్టోడి గురించి విన్నారా? వాడు వానింటికి తాటికాయంత తాళం వేస్తాడు. కనీసం ఇవైనా చెప్పండి. బాగా తిన్నాక గాడిద ఏం చేస్తుంది? బడాయికి పోయిన నక్కకు ఏం జరుగుతుంది? రెండు కోతుల తగువును పిల్లి ఎలా తీర్చింది? పావురం కథ? ఒంటె కథ? రాకుమారి కథ?... ప్చ్! మీరు అర్జెంటుగా ఈ వేసవి సెలవుల్లో ఇలాంటి బోల్డన్ని కథలు తెలుసుకోవాలి. కానీ ఎలా? అమ్మ నాన్ననడగుమంటుంది. నాన్నేమో అమ్మనడగమంటాడు. ఒక అనుమానం: వీళ్లిద్దరికీ కథలు వచ్చా. ఊళ్లో ఉన్న నానమ్మేనా మనకు ఆధారం! ఒక పనిచేద్దాం. పాతకాలంలో దేశదేశాల్లోని తాతయ్యలు ఆరుబయట వెన్నెల్లో కూర్చుని పిల్లల కోసం కథలల్లిపెట్టారు. ఇంకా, పంచతంత్రం, అరేబియన్ నైట్స్, ఈసప్ కథలు, చిట్టిరాజా, బుడుగు... ఇలా మంచిమంచి కథలు రాసిపెట్టారు. ఇవన్నీ పుస్తకాలుగా దొరుకుతున్నాయి. ఎంచక్కా మనమే చదువుకుంటే! అప్పుడు మనమే నానమ్మకు కథ చెప్పొచ్చు. నానమ్మ ఎంత సంబరపడుతుందో! ఎలా ఉంది ఐడియా! సేవాదృక్పథం పిల్లలకు ఇవ్వడంలో ఉన్న ఆనందం అనుభవంలోకి రావాలంటే ‘వాళ్లతోనే ఇప్పించాలి’. ఇంటి ముందుకు వచ్చిన భిక్షగాడికి దోసెడు బియ్యం వేయడం, ఆకలితో ఉన్న వారికి ఒక పండు ఇవ్వడం నుంచి తనకు చిన్నవైన దుస్తులను పేద పిల్లలకు ఇవ్వడం, క్లాసు అయిపోయిన పుస్తకాలను చిన్నపిల్లలకు ఇవ్వడం వంటివన్నీ అలవాటు చేయాలి. వేసవి సెలవుల్లో ఒక ఆదివారం అనాథాశ్రమానికి తీసుకెళ్లి అక్కడి పిల్లల అవసరాలను తెలియచేస్తే వాళ్లలో ఆలోచన మొదలవుతుంది. ఇంటికి వచ్చి తన పాత బొమ్మలు, దుస్తులను జమచేసి మరో ఆదివారం వెళ్లడానికి సిద్ధమైపోతారు. అలాగే వాళ్లు దాచుకున్న డబ్బుతో అనాథాశ్రమంలో పిల్లలకు ఒక పూట భోజనం లేదా కనీసం ఒక స్వీట్ అయినా ఇప్పిస్తే... అవసరంలో ఉన్న వారికి చేయూతనివ్వడం నేర్చుకుంటారు. ప్రమాదంలో ఉన్న వారిని కాపాడడం నేర్పితే సామాజిక సేవలో చురుగ్గా పాల్గొంటూ తమవంతు సామాజిక బాధ్యత నిర్వహించడంలో ముందుంటారు. సమాజానికి సేవ చేసే రెడ్క్రాస్, రోటరీ క్లబ్ వంటి సంస్థల వివరాలను పరిచయం చేసి, అవి నిర్వహిస్తున్న కార్యక్రమాల వివరాలను తెలియచేస్తే చాలు. ఇవన్నీ చిన్ని మెదళ్లలో ఒక పక్కన నిక్షిప్తమైపోతాయి. అవసరమైనప్పుడు వెంటనే ‘నేనూ చేస్తా’నంటూ ముందడుగు వేస్తారు. ఆటలు...ఆనందం... సెలవుల్లో పిల్లల అల్లరికి అంతుండదు. ఎంత సేపూ ఈ గోల ఏమిటి...బయటికి వెళ్లి ఆడుకోండర్రా...అనే మాటలు వినిపిస్తూనే ఉంటాయి. ఆడుకోమని చెప్పి వదిలేస్తే ఎలా? ఎక్కడ ఆడుకోవాలో, ఎలా ఆడుకోవాలో చెప్తే ఈ వేసవిలో కొత్త క్రీడాకారులు తయారవుతారు. వేసవి సెలవుల్లో క్రీడల కోసం.... నగరాలు, పట్టణాల్లో ప్రైవేట్ అకాడమీల్లో సమ్మర్ కోచింగ్ లభిస్తుంది. స్విమ్మింగ్కి ప్రవేశం పొందే ముందు పరిశుభ్రత, భద్రత విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ఏటా వేసవిలో నామమాత్రపు ఫీజులో ప్రతి జిల్లాలో సమ్మర్ క్యాంప్లు నిర్వహిస్తుంది. దాదాపు 30కు పైగా క్రీడాంశాల్లో శిక్షణ ఇస్తారు. ప్రతి జిల్లాలో ఉండే డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ (డీఎస్డీఏ)కార్యాలయం నుంచి మరిన్ని వివరాలు పొందవచ్చు. హైదరాబాద్లోని ప్రధాన కార్యాలయం ఫోన్ నంబరు : 040 - 23240247. హైదరాబాద్లో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో 40 రకాల క్రీడాంశాల్లో వందకు పైగా మైదానాల్లో సమ్మర్ స్పెషల్ కోచింగ్ క్యాంప్లు జరుగుతాయి. ఆటలు, వాటి కేంద్రాల వివరాలు పత్రికలో కూడా అందుబాటులో ఉంటాయి. మనకు ఇష్టమైన ఆటను, అనువైన కేంద్రాన్ని ఎంచుకొని చేరవచ్చు. సరదాగా... నేర్చుకుందాం! పుస్తకాలు, పాఠాలు, బ్లాక్బోర్డు, నోట్పుస్తకాల ఊసే లేకుండా నేర్చుకునేవి ఏముంటాయి? సమ్మర్ క్యాంపులకెళ్తే చాలా కనిపిస్తాయి. పిల్లలకు మట్టితో కుండలు చేసి రంగులేయడం, మొక్కలు నాటి నీరు పోసి పాదులు చేయడం, కథలు చెప్పడం, చెప్పించడం, సంగీతం పాడడం, అడుగులు కదిపి నాట్యం చేయడం వంటివన్నీ నేర్చుకోవచ్చు. ఇంట్లో ఇవన్నీ నేర్పించే సమయం లేని తల్లిదండ్రులు పిల్లలను ఈ క్యాంపుల్లో చేర్చడం సౌకర్యమే. వీటితోపాటు...పూలకుండీ కొనిపెట్టి మొక్క నాటించి రోజూ నీరుపోయడం నేర్పిస్తే ప్రకృతిని ప్రేమించడం అలవాటవుతుంది. అలాగే మంచి సినిమాలను ఎంపిక చేసి చూడమని చెప్తే చాలు... ఒద్దిగ్గా చెప్పినమాట వింటారు. ఈ సందర్భంగా పెద్దలకో మాట... ఆధునిక విద్యావంతులైన తల్లిదండ్రులు ఏడు తాటిచెట్ల ఎత్తుండే రాక్షసుడు అని కథలో రాగానే ఇది తర్క విరుద్ధం అనుకోకూడదు. దేన్నయినా ప్రతీకగా చెప్పడం సాహిత్యం లక్షణం! వినోదంలోనూ అంతే. రాకుమారుడు ఒక్కగెంతులో నదులు దూకడానికీ, చిలకలో ప్రాణం పెట్టడానికీ మంచి ఊహలు ఉండాలి. ఇవన్నీ పిల్లలకు బాల్యంలో ఇవ్వగలిగే అపురూపమైన కానుకలు. - వాకా మంజులారెడ్డి -
ఒక్క ఫోన్ కాల్... జీవితాన్ని నిలబెడుతుంది!
మనదేశం 2012లో 1,35, 445 ఆత్మహత్యలను చూసింది. డబ్ల్యుహెచ్ఓ నివేదిక ప్రకారం గడచిన 45 ఏళ్లలో ప్రపంచంలో ఆత్మహత్యలు 60 శాతం పెరిగాయి. అవి కూడా 15-44ఏళ్ల మధ్య వయస్కుల్లోనే ఎక్కువగా ఉంటున్నాయి. ప్రపంచంలో ఆత్మహత్య చేసుకున్న వారిలో 20 శాతం భారతీయులే. ఆత్మహత్యల్లో మనదేశం మొదటిస్థానంలో ఉందని గణాంకాలు చెబుతుంటే భావిభారతాన్ని ఎలా ఊహించుకోవాలి? ఇది ఇలా ఉంటే... ఒకరోజు రాత్రి ఎనిమిది గంటల సమయం. సికింద్రాబాద్లోని సింధ్ కాలనీ, రోష్నీ హెల్ప్లైన్ ఆఫీసుకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఒక అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి... తనకు జీవితం మీద విరక్తి కలుగుతోందంటూ తన బాధలను చెప్పుకుంటున్నాడు. ప్రేమలో విఫలం కావడం, ఆఫీసులో పని మీద మనసు పెట్టలేకపోవడం, తరచూ తప్పులు చేయడం, గతంలో చేసిన పనే అయినా ఇప్పుడు చేయలేనంత ఒత్తిడిగా అనిపించడం వంటి సమస్యలను ఏకరువు పెట్టాడు. ‘నా సమస్య అందరికీ నవ్వులాటగా ఉంటోంది. కనీసం విని ఓదార్చేవారు లేరు. నేను మా కొలీగ్నే ప్రేమించాను. ఆ అమ్మాయి నన్ను ప్రేమించలేదు, సరికదా మరో కొలీగ్తో సన్నిహితంగా ఉంటోంది. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పుకోలేకపోతున్నాను. ఆఫీసులో పనిచేతగాని వాడిలాగ ముద్ర పడింది. నేను ఎవరికీ అక్కరలేదు, అలాంటప్పుడు బతికి సాధించేదేమీ ఉండదు. చనిపోవాలని ఉంది’ అని భోరుమన్నాడు. ఈ సమస్య ఈ కుర్రాడిదే కాదు. ఇటీవల ఇలాంటివి ఎక్కువయ్యాయి. ‘సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య, ప్రేమలో విఫలమై ఆత్మహత్య చేసుకున్న యువతి’ వంటి వార్తలు తరచూ వినిపిస్తున్నాయి. పని ఒత్తిడి ఎక్కువైతే, ఆఫీసులో డెడ్లైన్ అందుకోలేకపోతే దానికి ఆత్మహత్య పరిష్కారమా? ఆత్మహత్యతో ప్రేమ సఫలమవుతుందా? జీవితం అంటే... నల్లేరు మీద బండి నడకలా హాయిగా సాగిపోయే అందమైన సినిమా అని రంగుల కల కనడమే ఇందుకు కారణమా? ఒక చిన్న కష్టం ఎదురవగానే కుంగిపోతే ఇక సాధించేదేంటి? ప్రయాణంలో మలుపు! ‘రోడ్డు మీద వెళ్తుంటే మలుపు వస్తుంది, దూరం నుంచి చూస్తే రోడ్డు అక్కడితో ఆగిపోయినట్లు, ముందుకు వెళ్లడానికి దారి లేనట్లు అనిపిస్తుంది. కానీ దగ్గరకు వెళ్లి చూస్తే అది ముగింపు కాదు మలుపు మాత్రమే అని తెలుస్తుంది. అక్కడ మలుపు తీసుకుంటే ప్రయాణం సాఫీగా ముందుకు సాగిపోతుంది. ఒకవేళ అది మలుపు కాక ముగింపు అయితే ‘యు టర్న్’ తీసుకుని మరోదారి కోసం అన్వేషిస్తాం తప్ప గమ్యాన్ని చేరకుండా ప్రయాణాన్ని అర్ధంతరంగా ఆపివేయరు ఎవరూ. జీవితమూ అంతే. ఒక కష్టం వచ్చిందని జీవితాన్ని అంతం చేసుకోరాదు. అలా అంతం చేసుకుంటూ పోతే ఇప్పటికి ప్రపంచంలో ఎవ్వరూ మిగిలి ఉండరు. ప్రతి మనిషికీ జీవితంలో ఏదో ఒక సమయంలో ‘ఈ జీవితం వద్దు, చనిపోతే బావుణ్ణు’ అనిపిస్తుందంటారు మనస్తత్వ విశ్లేషకులు. అలా అనిపించిన ప్రతి ఒక్కరూ అనిపించిన వెంటనే ప్రాణాలు తీసుకుంటూ పోతే భూమ్మీద మనుషులే ఉండరు. అది ఓ ఆర్తనాదం! ‘ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడ్డారంటే అర్థం మరణించడానికి సిద్ధపడినట్లు కాదు, అది సహాయం కోసం చేసే ఆర్తనాదం’ అంటారు రోష్నీ హెల్ప్లైన్ నిర్వాహకురాలు సుచరిత. యుక్త వయసు వచ్చిన తర్వాత కలిగే ఆకర్షణలతో ప్రేమ కలగడం సహజమే. అయితే మనకు కలిగిన భావమే ఎదుటి వారికీ కలగాలని లేదు. ఈ చిన్న తర్కాన్ని మరిచిపోవడం చాలా ఆత్మహత్యలకు కారణమవుతోంది. అలాగే ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక నైపుణ్యం ఉంటుంది. ఒక ఉద్యోగంలో రాణించలేకపోతే తాను రాణించగలిగిన మరో ఉద్యోగం ఏదో ఉండే ఉంటుంది. దానిని వెతుక్కోవాలి తప్ప, జీవితాన్ని వదులుకోకూడదు. జీవితాన్ని అంతం చేసుకోవాలనే కఠినమైన నిర్ణయం తీసుకోవడానికి ముందు ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే. తాను ప్రేమించిన వ్యక్తి వారికి ఇష్టమైన మరో వ్యక్తితో జీవితాన్ని హాయిగా కొనసాగిస్తారు. అలాగే ఉద్యోగం ఇచ్చిన యాజమాన్యం ఆ స్థానంలో మరొకరిని నియమించుకుంటుంది. సదరు ఆత్మహత్య చేసుకున్న వారు చనిపోతే ఆ స్థానం మరొకరితో చాలా సులభంగా భర్తీ అవుతుంది. మరి కన్న తల్లిదండ్రులకు? వారికి ఆ స్థానం ఎప్పటికీ భర్తీ కాదు. అలాగే పెళ్లయిన వారు ఆత్మహత్యకు పాల్పడితే జీవితభాగస్వామికి జరిగే లోటును పూడ్చేదెవరు? ఆ పిల్లలకు అమ్మానాన్నల ప్రేమ అందేదెలా? ఆత్మహత్య చేసుకోవడం ద్వారా జరిగే నష్టాలను, కోల్పోయే అనుబంధాలను గుర్తు చేసుకుంటే ప్రస్తుతం ఎదురైన కష్టం చాలా చిన్నదని క్షణంలో తెలిసిపోతుంది. ఆత్మహత్య నిర్ణయాన్ని ఒక్కసారి వాయిదా వేసి వెనక్కు చూసుకుంటే... ఇక్కడి వరకు సాగిన జీవన ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటే భవిష్యత్తు మీద భరోసా కలుగుతుంది. జీవించి తీరాలనే తపన పెరుగుతుంది. - వాకా మంజులారెడ్డి