vanga geeta
-
పవన్ కళ్యాణ్ పై వంగా గీత ఫైర్
-
పార్టీ నుంచి ఎవరు వెళ్లినా నష్టమేమీ లేదు: వంగా గీత
సాక్షి, కాకినాడ: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాదరణ కలిగిన నాయకుడు అని చెప్పుకొచ్చారు పార్టీ నాయకురాలు వంగా గీతా. ఇదే సమయంలో విజయసాయి రెడ్డి రాజీనామా బాధాకరమని అన్నారు. పార్టీ నుంచి ఎవరూ వెళ్లిపోయినా వారి లోటు తీర్చలేము అంటూ వ్యాఖ్యలు చేశారు.గణతంత్ర దినోత్సవ వేడుకల్లో వంగా గీతా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. విజయసాయి రెడ్డి రాజీనామా బాధాకరం. పార్టీలో ముఖ్యమైన, కీలకమైన వ్యక్తి విజయసాయి రెడ్డి. పార్టీ నుండి ఎవరూ వెళ్ళినా.. వారి లోటు తీర్చలేము. పార్టీ నుండి ఎవరూ బయటకు వెళ్ళినా వైఎస్సార్సీపీ కొనసాగుతుంది. పార్టీ అధినేత వైఎస్ జగన్ చాలా దృఢమైన నాయకుడు. ప్రజాదరణ ఉన్న వ్యక్తి. అధికార మార్పిడి జరిగినప్పుడు ఆయా పార్టీల నుండి వ్యక్తులు బయటకు వెళ్ళడం.. మరి కొందరు చేరడం నిరంతర ప్రక్రియ. ఇది కొనసాగుతూనే ఉంటుంది. పార్టీ అధినేత నడిచే విధానంపై పార్టీ ఉనికి ఉంటుంది. వైఎస్ జగన్పై మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది అంటూ కామెంట్స్ చేశారు.ఇదే విషయమై అంతకుముందు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ..‘విజయసాయి రెడ్డి రాజీనామా గురించి ఆయనే చెప్పారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నానని మాట్లాడారు. తన లాంటి వారిని వెయ్యి మందిని వైఎస్ జగన్ తయారు చేయగలరని సాయిరెడ్డి చెప్పారు. పార్టీ మారే వారిని వద్దని చెబుతాము.. అలాంటి వారిని ఆపలేం కదా?. నాయకులను ఏ విధంగా తయారు చేయాలో వైఎస్ జగన్కు తెలుసు’ అంటూ కామెంట్స్ చేశారు. -
చాలా దారుణం.. టీటీడీ ఘటనపై వంగా గీత ఎమోషనల్
-
రైతులను కూటమి ప్రభుత్వం నట్టేట ముంచింది: వంగా గీత
-
కాకినాడ సెజ్ పేరిట రైతుల భూములు కొల్లగొట్టిన చంద్రబాబు
-
ఏపీలో మహిళలు, చిన్నారులకు రక్షణ కరువు: వంగా గీత
సాక్షి, కాకినాడ: ఏపీలో మహిళలకు భద్రత, రక్షణ కల్పించాలని కూటమి ప్రభుత్వాన్ని కోరాు పిఠాపురం వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ వంగా గీత. అలాగే, పిఠాపురంలో బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.పిఠాపురంలో అఘాయిత్యానికి గురైన దళిత బాలికను వంగా గీత బుధవారం పరామర్శించారు. కాకినాడలోని జీజీహెచ్లో చికిత్స పొందుతున్న బాధితురాలితో మాట్లాడారు. అనంతరం, వంగా గీత మీడియాతో మాట్లాడుతూ.. పిఠాపురం సెంటర్లో మిట్ట మధ్యాహ్నం బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారం చేశారు. ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితులను కఠినంగా శిక్షించాలి. బాలిక కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది.కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా జిల్లాల్లో ఇలాంటి ఘటనలో జరుగుతున్నాయి. కొన్ని మాత్రమే వెలుగులోకి వచ్చాయి. వెలుగులోకి రాని ఘటనలు చాలానే ఉన్నాయి. నేరాలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష చేయాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి. రాష్ట్రంలో చిన్నారులకు, మహిళలకు భద్రత, రక్షణ కల్పించాలని కూటమీ ప్రభుత్వాన్ని కోరుతున్నాము’ అంటూ కామెంట్స్ చేశారు. -
దేవుడుతో ఆటలొద్దు.. మీకు దమ్ముంటే లడ్డు వివాదంపై వంగా గీత రియాక్షన్
-
కూటమి ప్రభుత్వానికి వంగా గీత చాలెంజ్
కాకినాడ, సాక్షి: రాజకీయంగా ఎదుర్కొనలేకే తిరుపతి లడ్డూ ప్రసాదం ద్వారా వైఎస్ జగన్పై కూటమి ప్రభుత్వం ఆరోపణలు చేస్తోందని, దమ్ముంటే ఆ ఆరోపణలను నిజమని నిరూపించాలని వైఎస్సార్సీపీ నేత వంగా గీత సవాల్ విసిరారు. పిఠాపురం వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ గీత గురువారం మధ్యాహ్నాం కాకినాడలో మీడియాతో మాట్లాడారు. ‘‘ సిట్ పేరిట చంద్రబాబు తమకు కావాల్సిన మనుషులతో విచారణ జరిపిస్తే ఎలా?. టీటీడీ లడ్డు వివాదంలో నిష్పక్షపాతమైన విచారణ జరగాలి. సీబీఐ లేదంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. చేసిన ఆరోపణల్లో కూటమి ప్రభుత్వం నిజనిజాలు తేల్చాలి అని గీత అన్నారు.జగన్ను రాజకీయంగా తగ్గించాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు తిరుమల లడ్డుపై ఆరోపణలు చేశారు. ముందు ఆ ఆరోపణలను నిజాలు అని నిరూపించండి. అప్పుడు జగన్ డిక్లరేషన్ గురించి మాట్లాడడండి అని రాజకీయ ప్రత్యర్థులకు ఆమె సవాల్ విసిరారు. చివర్లో దేవుడితో.. టీటీడీతో ఆటలొద్దని కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబుకి ఆమె హెచ్చరిక జారీ చేశారు. -
పవన్ కు ఇదే నా రిక్వెస్ట్
-
ఎందుకంత నిర్లక్ష్యం.. ముందే చెప్పినా వినలేదు..
-
పిఠాపురం ముంపుకు ప్రభుత్వమే కారణం ఎమ్మెల్యే, ఎంపీలు ఎక్కడ ?
-
వరదల్లో తిరుగుతూ.. ప్రజల సమస్యలు తెలుసుకున్న వంగా గీత
-
వరద బాధితుల కోసం వంగా గీత సాహసం
కాకినాడ, సాక్షి: వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లేందుకు అధికారంలో ఉన్న నేతలంతా తటపటాయిస్తుంటే.. పిఠాపురం వైఎస్సార్సీపీ ఇంఛార్జి వంగా గీత (60) మాత్రం సాహసం ప్రదర్శించారు. వరద ఉధృతిని లెక్కచేయకుండా.. ట్రాక్టర్ ప్రయాణం చేసి బాధితుల దగ్గరకు చేరుకున్నారామె. బుధవారం వంగా గీత గోకువాడ, జమ్ములపల్లిలో రైతులు, ముంపు బాధితులను పరామర్శించారు. ఈ క్రమంలో.. ఉధృతంగా ప్రవహిస్తున్న ఏలేరు వరద నీటిని ట్రాక్టర్పై దాటి వెళ్లారు. దాదాపు 10 కిలోమీటర్లపాటు ట్రాక్టర్పైనే ఆమె ప్రయాణం చేశారు. ఆమెతో పాటు కొందరు నేతలు వెంట వెళ్లారు. చివరకు.. ముంపు ప్రాంతాలకు చేరుకొని అక్కడి బాధితులను పరామర్శించారు. ‘‘గతంలో లేనంతా ఈసారి ఏలేరు వరద పిఠాపురాన్ని ముంచేసింది. వేలాది ఎకరాల వ్యవసాయ, ఉద్యానవన, సెరీ కల్చర్ పంటలు నీట మునిగాయి. అధికారులకు ప్రభుత్వానికి ముందస్తు అంచనా లేకపోవడం వల్లే ఏలేరు వరద ఉగ్రరూపం దాల్చింది. ఏలేరు ప్రాజెక్టులో నీటి నిల్వలు 15 టీఎంసీలు ఉన్నప్పుడే మిగులు జలాలను క్రమక్రమంగా విడుదల చేసి ఉంటే ఇంత వరద ముప్పు ఉండేది కాదు. .. ఏలేరులో 6 టీఎంసీల నీరు ఉన్నప్పుడే సాగు నీటికి, విశాఖ అవసరాలకు నీటిని వినియోగించుకున్నాం. వరద బాధితుల వద్దకు వెళ్ళి భరోసా కల్పించాల్సిన బాధ్యత రాజకీయ నాయకులపై ఉంది. అధికారులను పంపించి ఆదుకోవాలి’ అని కోరారామె. ఎన్నికల ఫలితంలో సంబంధం లేకుండా.. తాను ఎప్పుడూ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానని వంగా గీత చెబుతున్న సంగతి తెలిసిందే. ఇక.. ఇంత సాహసం చేసి తమ దగ్గరకు పరామర్శకు వచ్చిన గీతకు స్థానికులు కృతజ్ఞతలు తెలియజేశారుపవన్, ఉదయ్లపై పిఠాపురం రైతుల ఫైర్ఏలేరు వరదలో తమ పంటలు గత నాలుగు రోజులుగా నీట మునిగాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్పై పిఠాపురం రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ కనీసం మమ్మల్ని పరామర్శించేందుకు ఎమ్మెల్యే, ఎంపీ రాలేదు. పవన్ను గెలిపిస్తే పిఠాపురాన్ని ప్రపంచమంతా చూస్తుందని జబర్దస్త్ నటులు చెబితే ఆనందపడ్డాం. తీరా ఇప్పుడు ఏలేరు వరదలో పిఠాపురం నియోజకవర్గం మునిగిపోతే టీవీలలో ప్రపంచం చూస్తోంది. ఎకరాకు ఇప్పటి వరకు రూ.30 వేల వరకు పెట్టుబడి పెట్టాం. వరద ముంపుతో పూర్తిగా నష్టపోయాం. ప్రభుత్వం ఆదుకోకపోతే కౌలు రైతులకు ఆహ్మహత్యే శరణ్యం’ అని పిఠాపురం రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.చదవండి: తప్పు చేస్తున్నావ్ చంద్రబాబూ.. వైఎస్ జగన్ వార్నింగ్చదవండి: 'టీడీపీ ప్రభుత్వ అసమర్థతతోనే విజయవాడ వరద కష్టాలు' -
టీడీపీ నేతలకు వంగా గీత వార్నింగ్
-
అసలు ‘తల్లికి వందనం’ ఎప్పటి నుంచి ఇస్తారు?
సాక్షి, అమరావతి: ‘తల్లికి వందనం’ కార్యక్రమంపై రెండ్రోజుల క్రితం పీసీసీ అధ్యక్షురాలు షర్మిల గత వైఎస్సార్సీపీ సర్కారును విమర్శించగా.. అదే రోజు వైఎస్సార్సీపీ ఘాటుగా కౌంటర్ ఇచ్చింది. దీనికి కొనసాగింపుగా ఆమె మళ్లీ శనివారం ‘ఎక్స్’లో పెట్టిన పోస్టుకు వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ వంగా గీత గట్టిగా బదులిచ్చారు. ‘టీడీపీ కూటమి ప్రభుత్వం తల్లికి వందనం కింద బడికి వెళ్లే ప్రతి విద్యార్థికీ రూ.15వేలు చొప్పున ఇస్తుందా.. లేక ప్రతి తల్లికి మాత్రమే అంటూ జారీచేసిన జీఓ–29ని సరిదిద్దుతుందా? అసలు ఎప్పటినుంచి ఈ పథకాన్ని అమలుచేస్తారు?’ అంటూ షర్మిల పోస్టుకు జతచేస్తూ ప్రశ్నించారు.అంతకుముందు.. షర్మిల తన శనివారం నాటి పోస్టులో.. ‘బాబుకి కాంగ్రెస్ తోక పార్టీ అని ముడిపెట్టడం మీ అవగాహన రాహిత్యానికి నిదర్శనం. కూటమి ప్రభుత్వానికి కొమ్ము కాసినట్లు ఎలా అవుతుంది?’ అని ఆమె తన తీరును సమర్ధించుకునే ప్రయత్నం చేస్తూ 2019 ఎన్నికలకు ముందు జగన్ హామీలపై చర్చకు సిద్ధమా? అంటూ ప్రశ్నించారు. ఈ పోస్టుకు గీత కౌంటర్ ఇచ్చారు. -
అధికారంలో ఉంది మీరే.. పవన్ కళ్యాణ్ కు దిమ్మతిరిగే సమాధానం
-
పవన్.. ఆరోపణలు కాదు నిరూపించండి: వంగా గీత
సాక్షి, కాకినాడ: ఏపీలో వైఎస్సార్సీపీపై టీడీపీ కక్షపూరిత దాడులు సరికాదన్నారు మాజీ ఎంపీ వంగా గీత. అలాగే, కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ముందు నెరవేర్చాలని డిమాండ్ చేశారు.కాగా, వంగా గీత శనివారం మీడియాతో మాట్లాడుతూ..‘రాష్ట్రంలో టీడీపీ కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. దాడులు చేయడం సరికాదు. హైకోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా పార్టీ ఆఫీసు భవనాలను కూల్చివేశారు. రాష్ట్రంలో నిర్మాణాలు తప్ప కూల్చివేతలు ఉండవని చంద్రబాబు చెప్పారు. ముందు చంద్రబాబు ఆయన మాటపై నిలబడాలి. ప్రజల సంక్షేమం చూడండి.. అంతేకానీ ప్రజలను ఇబ్బందులు పెట్టే పనులు చేయకండి. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డిలపై పదే పదే ఆరోపణలు చేయ్యడం రాజకీయాల్లో మంచి పద్దతి కాదు. పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలపై ఇప్పటికే మిథున్ రెడ్డి స్పందించారు. రాష్ట్రంలో, కేంద్రంలో మీరే అధికారంలో ఉన్నారు. ఆరోపణలపై విచారణ చేసి చర్యలు తీసుకోండి’ అంటూ కామెంట్స్ చేశారు. -
దాడులు కాదు.. సూపర్ 6 అమలు ఎప్పుడు?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విధ్వంసాలు, అరాచకాలు ఆపి.. చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 హామీలు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలని మాజీ మంత్రులు, వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేశారు. ఎన్నికల్లో దొంగ వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. విశాఖలోని రుషికొండపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. నిరుద్యోగులకు నెలకు ఇస్తామన్న రూ.3 వేలు వెంటనే ఇవ్వాలన్నారు.వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాడేపల్లిలో క్యాంపు కార్యాలయంలో విజిటర్స్ కోసం ఏర్పాటు చేసిన ఫర్నిచర్పై కూడా అసత్యపు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఫర్నిచర్ విలువ చెబితే చెల్లిస్తామని చెప్పినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన లేకపోగా, దుష్ప్రచారం చేస్తుండటం దారుణం అన్నారు. తాడేపల్లిలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయం వద్ద గురువారం మాజీ మంత్రులు కొడాలి నాని, గుడివాడ అమర్నాథ్, సీదిరి అప్పలరాజు, మాజీ ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే సుధా మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.కార్యకర్తలకు అండగా ఉంటాం టీడీపీ దాడులకు భయపడేది లేదు. ఎవరిని చంపుతారో చంపుకోమనండి. టీడీపీ దాడుల్లో గాయపడిన ప్రతి వైఎస్సార్సీపీ కార్యకర్త కుటుంబం వద్దకు తాను వెళ్తానని, వాళ్లకు అండగా ఉంటానని వైఎస్ జగన్ చెప్పారు. ఎటువంటి రివ్యూ చేయకుండా వైఎస్ జగన్కు సెక్యూరిటీ తీసేయడం దారుణం. మమ్మల్ని ఎవరు టార్గెట్ చేసినా భయపడేది లేదు. మేం ప్రజల మధ్య ఉంటాం. వారి సమస్యల కోసం పోరాటం చేస్తాం.రుషికొండపై భవనాలు ప్రభుత్వ ఆస్తి. అవి వైఎస్ జగన్వి కావు. వీఐపీల కోసం భవనాలు కడితే దానినీ రాద్ధాంతం చేస్తున్నారు. ఎల్లో బ్యాచ్ చెప్పేవన్నీ అబద్దాలే. రుషికొండలో కట్టిన ప్రభుత్వ భవనాలి్న.. జగన్ నివాసంగా ఎల్లో మీడియా, టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. ప్రభుత్వం కట్టించిన గెస్ట్ హౌస్లో ఉండాల్సిన అవసరం వైఎస్ జగన్కు లేదు. ఎక్కడైనా ఆయన సొంత ఇంటిలోనే ఉంటారు. చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాలను పక్కదారి పట్టించడానికి టీడీపీ నేతలు రోజుకో డ్రామా ఆడుతున్నారు. – కొడాలి నాని, మాజీ మంత్రి టీడీపీ చేసిన మంచి ఒక్కటీ లేదు రుషికొండపై నిరి్మంచిన ప్రభుత్వ భవనాలు విశాఖకే తలమానికంగా ఉంటాయి. దీనిపై ఎల్లో మీడియా, కూటమి పార్టీలు వికృత రాజకీయం చేస్తున్నాయి. రూ.700 కోట్లతో నాసిరకంగా తాత్కాలిక సచివాలయం నిరి్మంచింది టీడీపీ ప్రభుత్వం. రుషికొండలో రూ.400 కోట్లతోనే ఐకానిక్ భవనాలు నిర్మించింది వైఎస్సార్సీపీ ప్రభుత్వం. ప్రభుత్వ స్థలంలో నిరి్మంచిన ప్రభుత్వ భవనాలివి. శిథిలమైన హరిత రిసార్ట్స్ స్థానంలో నూతన భవనాల నిర్మాణం.విశాఖ నుంచి పరిపాలనకు ఈ భవనాలు అనువైనవని అధికారుల కమిటీ తేలి్చంది. దీంతో సీఎం నివాసం, కార్యాలయానికి అనుకూలంగా కొన్ని మార్పులు చేస్తే అవి సొంత భవనాలంటూ టీడీపీ గగ్గోలు పెడుతోంది. రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు మంచి చేయడం అనేది తెలుగుదేశం పార్టీకి, ఆ పార్టీ ప్రభుత్వానికి చేతకాదు. 2014 – 2019 మధ్య రాష్ట్రానికి చేసిన మంచి ఒక్కటి లేదు. అన్నీ రాష్ట్రానికి తలవంపులు తెచ్చే పనులే. ఇప్పుడూ అదే చేస్తోంది. – గుడివాడ అమర్నాథ్, మాజీ మంత్రివైఎస్ జగన్ ఊరూరా తిరగమన్నారు వైఎస్ జగన్ మమ్మల్ని ఊరూరా తిరగమన్నారు. కూటమి పార్టీల దాడులు, ఆస్తుల విధ్వంసం సమయంలో ప్రతి కార్యకర్తకు అండగా ఉండాలని సూచించారు. 40 శాతం ఓటు బ్యాంకు కలిగిన మనం భయపడకూడదంటూ మనో ధైర్యం నింపారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన మంచి ప్రజలెవరూ మరచిపోలేదు. ప్రతి ఇంట్లో జగన్ చేసిన మంచి కనిపిస్తోంది.ప్రతి ఇంటికీ మేం తలెత్తుకుని పోగలం. చెప్పిన పని చేశాం కాబట్టి.. ప్రజల మధ్యకు గౌరవంగా వెళ్లగలుగుతాం. చంద్రబాబు ప్రలోభాలకు మోసపోయిన పరిస్థితుల మధ్య అపజయం సంభవించింది. బాబు మోసాలు ఎప్పుడైతే తేటతెల్లం అవుతాయో.. కాలం గడుస్తున్న కొద్దీ చంద్రబాబుపై కోపం వస్తుంది. అప్పుడు వైఎస్సార్సీపీ పట్ల అభిమానమూ మళ్లీ రెట్టింపు అవుతుంది. మళ్లీ వైఎస్సార్సీపీ రికార్డు మెజార్టీతో గెలుస్తుంది. చంద్రబాబు చేతిలో ప్రతి రోజు మోసపోతున్న ప్రజలకు అండగా ఉంటాం. – వంగా గీత, మాజీ ఎంపీ అంతర్జాతీయ స్థాయిలో కట్టడాలు రాష్ట్రంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులు ఆపి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంపై టీడీపీ నేతలు దృష్టి సారించాలి. రిషికొండలో పర్యాటక రంగం అభివృద్ధిలో భాగంగా పర్యాటక శాఖ కట్టిన భవనాలు అవి. మేమేమీ వర్షానికి కారిపోయే అసెంబ్లీ, సచివాలయం కట్టలేదు. సెవెన్ స్టార్ రేంజ్లో పర్యాటక శాఖ భవనాలు నిరి్మంచాం. మేము కట్టిన మెడికల్ కాలేజీలు, నాడు – నేడు స్కూల్స్, ఆసుపత్రులు, సచివాలయాలు, పోర్టులను కూడా టీడీపీ నేతలు ఇలానే ప్రజలకు చూపించాలి. రిషికొండలో నాణ్యమైన, అంతర్జాతీయ స్థాయిలో కట్టడాలు నిరి్మంచాం.గతంలో చంద్రబాబు ఎక్కడైనా ఇంత నాణ్యమైన భవనాలు కట్టారా? కేంద్రం అనుమతి, హైకోర్టు పర్యవేక్షణలోనే నిర్మాణాలు చేపట్టాం. ఆడుదాం ఆంధ్రా ఖర్చు రూ.100 కోట్లు అయితే స్కామ్ జరిగింది రూ.100 కోట్లు అని టీడీపీ నేతలు చెబుతున్నారు. స్కామ్ ఇలా కూడా ఉంటుందా? క్రీడాకారులకు ఇచ్చిన నగదు బహుమతులు గుర్తు లేవా? అసలు ఆడుదాం ఆంధ్రా టెండర్లు మా క్రీడా శాఖ ద్వారా నిర్వహించలేదు. అలాంటిది నేను, సిద్దార్థ్ రెడ్డి అవినీతి చేశాం అనడం హాస్యాస్పదం. 2029లో మళ్లీ జగనన్నను సీఎం చేసుకోవడానికి తగ్గట్టుగా ఐదేళ్లు పనిచేస్తాం. – ఆర్కే రోజా, మాజీ మంత్రి మా ఓట్లు ఏమయ్యాయి.. అంటున్నారుబద్వేలు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ప్రతి గ్రామంలో అపూర్వ స్వాగతం లభించింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ 99 శాతం పైగా హామీలను అమలు చేయటంతో సగర్వంగా ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడిగాం. మా ఓటు మీకే నమ్మా? మీ ఫ్యాన్ గుర్తుకే వేసి తీరుతాం అని ఓటర్లు భరోసా ఇచ్చారు. కానీ ఫలితాలు చూస్తే చాలా ఆశ్చర్యం కలిగించాయి. ఈవీఎంలపై జగనన్న ట్వీట్ చేస్తే టీడీపీ నేతలు ఎందుకు ఉలిక్కి పడుతున్నారు? చంద్రబాబు గతంలో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయొచ్చనలేదా? ఎన్నికల ఫలితాలు చూసి ఓటర్లే ఆశ్చర్యపోతున్నారు.మేం జగన్కు వేసిన ఓట్లు ఏమయ్యాయి అని ప్రశి్నస్తున్నారు. అదే మన ప్రభుత్వం ఉండి ఉంటే ఈపాటికే విద్యా దీవెన ఇచ్చేవాళ్లం. రైతు భరోసా, అమ్మ ఒడి, మత్స్యకార భరోసా అన్నీ సమయానికి అందేవి. ఏకంగా రూ.2.7 లక్షల కోట్లు ప్రజలకు డీబీటీ ద్వారా ఇచ్చాం. ఏ పథకం ఏ నెలలో అమలవుతుందో క్యాలెండర్ ఇచ్చి.. తేదీల వారీగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో వైఎస్ జగన్ నగదు జమ చేసేవారు. ఇప్పుడు కూడా నిత్యం ప్రజల్లో ఉంటాం. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం. – దాసరి సుధా, బద్వేలు ఎమ్మెల్యే టీడీపీ కపట నాటకాన్ని ప్రజలు గమనించాలి ఎన్నికల ఫలితాలు ఎందుకు ఇలా వచ్చాయన్నది ఇవ్వాళ్టికీ మాకు ఆశ్చర్యంగా ఉంది. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా వైఎస్ జగన్ మేనిఫెస్టోలో 99 శాతం హామీలు అమలు చేశారు. ఇంత చేసినా ఎక్కడ మోసం జరిగింది అనేదే ప్రశ్న. ఇప్పుడు రుషికొండపై చంద్రబాబు, ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తున్నారు. రుషికొండ మొత్తం 61 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇందులో 9.88 ఎకరాల విస్తీర్ణంలోనే ఈ భవనాలు నిరి్మంచారు.గతంలో హరిత రిసార్టు 48 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండేది. ప్రస్తుత భవనాలు 19,968 చ.మీ విస్తీర్ణంలో ఉన్నాయి.వీటన్నింటినీ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించేందుకు వీలుగా నిరి్మంచారు. ప్రెసిడెన్షియల్ సూట్, సూట్ రూమ్, బాంక్వెట్ హాల్తో విజయనగర బ్లాకు, ప్రెసిడెన్షియల్ సూట్ రూమ్స్, సూట్ రూమ్స్, డీలక్స్ గదులు, బాంక్వెట్ హాల్తో కళింగ బ్లాక్ నిరి్మంచారు. సూట్ రూమ్లు, కాన్ఫరెన్స్ హాల్తో పల్లవ బ్లాక్, సమావేశ మందిరాలతో చోళ బ్లాక్, రిక్రియేషన్ లాంజ్, బిజినెస్ సెంటర్తో గజపతి బ్లాక్, ప్రైవేట్ సూట్ రూమ్లతో వేంగిబ్లాక్, రెస్టారెంట్స్, లాంజ్, కిచెన్, పార్కింగ్ సౌకర్యాలతో ఈస్ట్రన్ గంగా బ్లాక్లని నిరి్మంచారు. ఈ ఏడు బ్లాక్లు ప్రభుత్వానివే. అయినప్పటికీ ఈ విష ప్రచారం టీడీపీ సంస్కృతికి నిదర్శనం. దాడులు, ఆస్తుల విధ్వంసం ఆపి నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఎప్పటి నుంచి ఇస్తారో చెప్పాలి. – సీదిరి అప్పలరాజు, మాజీ మంత్రి -
కూటమి సర్కార్ చేసి చూపించాలి: వంగా గీత
-
వైఎస్ జగన్ ను కలిసిన తర్వాత వంగా గీత రియాక్షన్
-
పవన్ గెలుపుపై వంగా గీత సంచలన వ్యాఖ్యలు
-
వంగా గీత బలం.. ప్యాకేజ్ స్టార్ బలహీనతలు ఇవే!
ఏపీలో పోలింగ్ ముగిసి పది రోజులు గడిచింది.. కాని ఇప్పటికీ అందరి చూపూ పిఠాపురం నియోజకవర్గం మీదే ఉంది. కారణం అక్కడ ప్యాకేజీ స్టార్గా పేరు తెచ్చుకున్న పవన్ కల్యాణ్ పోటీ చేయడమే. దత్త తండ్రి పచ్చ పార్టీని గెలిపించడానికి రాజకీయాల్లోకి వచ్చిన పవన్ ఈసారి పిఠాపురంలో ఎలాగైనా గెలవాలని పడరాని పాట్లు పడ్డారు. ఇక్కడ పవన్ ప్రత్యర్థి వంగా గీత అత్యంత ఆదరణ కలిగిన ప్రజా నాయకురాలు. పిఠాపురంలో పోటీ చేసిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వంగా గీత బలం ఏంటి? ప్యాకేజీ స్టార్ బలహీనతలు ఏంటి? పిఠాపురం ఓటర్లు ఎవరి పక్షాన నిలిచారు? కారణాలు ఏంటి?2019 ఎన్నికల్లో భీమవరం, గాజువాక నుండి పోటీ చేసి రెండు చోట్లా ఓడిపోయిన పవన్ కళ్యాణ్ .. ఈసారి కాపులు అత్యధికంగా ఉన్నారన్న కారణంతో పిఠాపురం నుంచి అసెంబ్లీకి పోటీ చేశారు. పవన్ పిఠాపురం నుండి పోటీ చేస్తానని ప్రకటించక ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీతా విశ్వనాధ్ ను పిఠాపురం ఇంఛార్జిగా ప్రకటించి..బరిలో నిలిపింది. గత ఎన్నికల్లో కంటే ఈసారి పిఠాపురంలో అదనంగా 6 శాతం పోలింగ్ నమోదైంది. దీంతో పోలింగ్ సరళిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ .. జనసేన పార్టీలు అంచనాలు వేసుకుని గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి.వాస్తవంగా చూస్తే గతంలో జిల్లా పరిషత్ ఛైర్పర్సన్గా, పిఠాపురం ఎమ్మెల్యేగా, ఒకసారి రాజ్యసభ సభ్యురాలిగా, ప్రస్తుతం లోక్సభ ఎంపీగా ఉన్న వంగా గీత ఉన్నత విద్యావంతురాలు. న్యాయశాస్త్ర పట్టభద్రురాలు. ప్రజాసేవలో దశాబ్దాల అనుభవం గడించి, ప్రజల ఆదరణ చూరగొన్న వంగా గీతతో టెన్త్ క్లాస్ చదివిన పవన్కల్యాణ్కు ఏమాత్రం పోలిక లేదు. అసలు పవన్కల్యాణ్ పార్ట్టైమ్ పొలిటీషియన్ అనే విషయం అందిరికీ తెలుసు. పైగా రాష్ట్రంలో ఏ జిల్లా గురించీ అవగాహన లేదు. గతంలో రెండు జిల్లాల నుంచి పోటీ చేసి ఓడిపోయి..ఈసారి మరో జిల్లానుంచి పోటీ చేస్తున్నారు.టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ త్యాగం చేస్తే పవన్ కు పిఠాపురం నుండి పోటీ చేసే అవకాశం కలిగింది. తన గెలుపు కోసం వర్మ మీద ఆధారపడిన పవన్..ఒక దశలో ఆయన్ను నమ్మలేదు. చివరికి టివి, సినిమా నటులతో తన కోసం పిఠాపురంలో ప్రచారం చేయించుకున్నాడు పవన్. మెగా కుటుంబాన్ని సైతం తన తరపున ప్రచారానికి పిఠాపురం తెచ్చుకుని గెలుపు కోసం పడరాని పాట్ల పడ్డాడు.ఎలాగైనా గెలవాలని ఇన్ని పాట్లు పడినా..ఒకవేళ ఎమ్మెల్యేగా గెలిస్తే పవన్ తమకు అందుబాటులో ఉండరని ప్రజలకు తెలిసొచ్చింది. ఎందుకంటే పవన్ ప్రచారం కోసం పిఠాపురం వచ్చిన కొత్తలో చిన్నపాటి జర్వానికి రాత్రుళ్లు ప్రత్యేక హెలికాప్టర్, విమానాల్లో హైదరాబాదు వెళ్లి వచ్చేవారు. దీంతో పవన్పై పిఠాపురం ప్రజల్లో నమ్మకం పోయింది. అందువల్ల అందరికి అందుబాటులో ఉండే వంగా గీతా పిఠాపురంకు ఎమ్మెల్యే ఐతే బెటర్ అని ప్రజలు నమ్మారు. ఇక పిఠాపురంలో కాపుల్లో మెజార్టీ పవన్ వైపు ఉన్నా...వంగా గీతను కూడా అభిమానించే కాపులు అధికంగానే ఉన్నారు. అంతేకాదు బీసీ, ఎస్సీ, మైనార్టీలు వంగా గీతకు ఏకపక్షంగా మద్దతు పలికారు.2009లో వంగా గీత పిఠాపురం నుండి ఎమ్మెల్యేగా గెలిచాక..అనేక అభివృద్ది పనులను చేసి ప్రజల విశ్వాసం పొందారు. కాకినాడ ఎంపీగా కూడా జిల్లా అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. గొల్లప్రోలు, పిఠాపురం వద్ద రైల్వే అండర్ పాస్లు నిర్మించి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించారు. యూ.కొత్తపల్లి మండలంలోని సెజ్ లో ప్రతిష్టత్మక ఐఐఎఫ్టీ విద్యా సంస్దను తీసుకువచ్చారు. కాకినాడలో వంద పడకల ఈఎస్ఐ ఆసుపత్రిని నిర్మించి కార్మికులకు అండగా నిలిచారు. మరోవైపు యూ.కొత్తపల్లి మండలంలో సీఎం జగన్ జగన్ చోరవతో రూ.400 కోట్లతో ఫిషింగ్ హర్బర్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఉప్పాడ తీర ప్రాంతం కోతకు గురికాకుండా జియో ట్యూబ్ నిర్మాణం కోసం వంగా గీత కేంద్రానికి ప్రతిపాదన పంపించారు.ఇలా చెప్పుకుంటే కాకినాడ జిల్లాకు ప్రత్యేకించి పిఠాపురంకు వంగా గీత చేసిన సేవలు చాలా ఉన్నాయి. అందుకే ఇక్కడి ప్రజలకు గీత అంటే నమ్మకం. ప్రజల్లో ఆదరణ ఉన్నందునే సీఎం జగన్ పిఠాపురం ప్రచార సభలో మాట్లాడుతూ.. వంగా గీతను డిప్యూటీ సీఎం చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో ఇక్కడ ప్రజలు ఇది తమకో వరమని భావించారు. అందుకే అటు అభివృద్ది.. ఇటు సంక్షేమం కలిపి పిఠాపురంలో ఓటింగ్ శాతం భారీగా పెంచాయని అర్దమవుతోంది. మొత్తం మీద వంగా గీతకే విజయావకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. -
పిఠాపురంలో జోరుగా పోలింగ్
-
వంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎంని చేస్తా: సీఎం జగన్
సాక్షి, పిఠాపురం: అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురంలో వంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎంని చేస్తానని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. శనివారం పిఠాపురంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ మాట్లాడారు.‘వంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎంని చేస్తాను. పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న దత్తపుత్రుడికి ఓటు వేయకండి. దత్తపుత్రుడికి ఓటేస్తే ఇక్కడే ఉంటాడా? హైదరాబాద్ వెళ్తాడా?. గాజువాక, భీమవరం అయిపోయింది.. ఇప్పుడు పిఠాపురం అంటున్నారు. దత్తపుత్రుడిని మహిళలు నమ్మే పరిస్థితి ఉంటుందా?. 5 ఏళ్లకోసారి కార్లు మార్చినట్టుగా భార్యలను మారుస్తున్నాడు’ అని సీఎం జగన్ అన్నారు.చదవండి: దత్తపుత్రుడు గెలిస్తే పిఠాపురంలో ఉండడు: సీఎం జగన్ -
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
పిఠాపురం : ప్రత్యర్ధులు నన్ను అవమానిస్తున్నారు.. అవహేళన చేస్తున్నరని వైఎస్సార్సీపీ అభ్యర్థి వంగా గీత అన్నారు. పిఠాపురం ఎన్నికల ప్రచార సభలో ఆమె మాట్లాడారు. ‘ కొంగు చాచి అడుగుతున్నాను.. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. నా బిడ్డ సాక్షిగా పిఠాపురం అభివృద్ధి చేస్తాను. మళ్లీ జన్మలో పిఠాపురంలో పుడతాను. కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా. నేను పిఠాపురం వదిలి వెళ్లను. నా అంతిమయాత్ర పిఠాపురంలోనే జరగాలి. మళ్లీ జన్మలో పిఠాపురంలోనే పుడతా. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. నా బిడ్డ సాక్షిగా పిఠాపురాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా’ అని ఆమె భావోద్వేగానికి గురయ్యారు. మరోవైపు పవన్ కల్యాణ్ తనపై చేసిన వ్యాఖ్యలకు తనదైన శైలిలో కౌంటరిచ్చారు వంగా గీత. ‘వంగా గీతాను నిలదీయండి అని పవన్ అంటున్నాడు. పిఠాపురంలో పాలిటెక్నిక్ కాలేజ్ తెచ్చినందుకు నన్ను అడగాలా? కాకినాడలో 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి తెచ్చినందుకా? కరోనా సమయంలో ప్రజల్లో ఉన్నది నేను. నాకు అనారోగ్యం వస్తే.. అవమానించేలా మాట్లాడారు. నాటకాలు ఆడాల్సిన అవసరం రాలేదు. .. జ్వరం వస్తే హైదరాబాదు పారిపోలేదు. ఆడవాళ్ళ అనారోగ్యాన్ని అవమానిస్తారా?. వర్మ వాఖ్యలపై కంటతడి పెట్టుకున్నారు. ను పిఠాపురంలో పుట్టలేదని వర్మ అంటున్నాడు.వర్మ మాత్రం పిఠాపురంలో పుట్టాడా?’ అని వంగా గీతా మండిపడ్డారు. -
పవన్ వ్యూహానికి వంగా గీత కౌంటర్ వ్యూహమిదే..!
పిఠాపురం నియోజకవర్గంలో ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్తో ఎన్నికల బరిలో తలపడుతున్న వైఎస్సార్సీపీ అభ్యర్ధి వంగా గీత చాలా వ్యూహాత్మకంగా ప్రచారం సాగిస్తున్నారు. ఆమె తన పార్టీ గురించి, తన గురించి, తన ప్రభుత్వ స్కీముల గురించి చెబుతున్నారే తప్ప పవన్ను ఏ విధంగాను విమర్శించడం లేదు. అక్కడ ఉన్న సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ఆమె తెలివిగా ప్రచారం చేపట్టారు. వంగా గీత.. గత మూడున్నర దశాబ్దాలుగా రాజకీయాలలో క్రియాశీలకంగా ఉన్నారు. విద్యార్ధి దశలో ఉన్నప్పుడే ఆమె రాజకీయాలపై ఆసక్తితో ఉండేవారు. సామాజిక స్పృహతో ఉండేవారు. పవన్తో పోల్చితే పెద్ద ధనికురాలు కూడా కాదు. అయినా స్వయంశక్తితో, రాజకీయాలలోకి వచ్చారు. 1994లో శాసనసభ సీటు కోసం ప్రయత్నించారు కాని సఫలం కాలేదు. తదుపరి కాలంలో జడ్పి చైర్ పర్సన్ గాను, రాజ్యసభ సభ్యురాలిగా, శాసనసభ సభ్యురాలిగా, 2019లో లోక్ సభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు.ఆయా సందర్భంలో ఆమె ప్రజల సమస్యలపై శ్రద్ద వహించేవారు. సాధ్యమైన మేరకు ఆ సమస్యలను తీర్చే యత్నం చేసేవారు. ప్రజలలో కలిసిపోతుంటారు. ఆమె తమకు అందుబాటులో ఉండరన్న మాట రానివ్వరు. కరోనా సమయంలో జబ్బుబారిన పడ్డవారికి ఆమె భయపడకుండా సేవలందించారు. వ్యాధి సోకినవారిని స్వయంగా ఆస్పత్రికి తీసుకువెళ్లిన సందర్భాలు ఉన్నాయి. ఎక్కడైనా రోడ్డు ప్రమాదం జరిగితే, వెంటనే స్పందించి క్షతగాత్రులను ఆస్పత్రులకు పంపించడానికి కృషి చేసేవారు. ఇవన్ని ఆమెకు ఇప్పుడు పాజిటివ్ పాయింట్లుగా ఉన్నాయి. బాగా విద్యాధికురాలు. రెండు పీజీలు, న్యాయశాస్త్ర పట్టభద్రురాలుగా ఉన్నారు. ఆమె లాయర్గా కూడా పేదలకు సేవలందించారు. ఆమె భర్త విశ్వనాద్ కూడా చాలా నిరాడంబరంగా ఉంటారు. ఆమెకు చేదోడువాదోడుగా నిలబడడం కూడా కలిసి వచ్చిందని చెప్పాలి. ఎవరైనా ‘పవన్తో పోటీ పడుతున్నారు.. మరి గెలవడం సాధ్యమా?’ అని అడిగితే, 'ఆయనకు సినిమా రంగంలో పేరు ఉంది.. నాకు ప్రజాసేవ రంగంలో పేరు ఉంది. పవన్కు కూడా ప్రజా సేవ చేయాలని ఉండవచ్చు.. కాని ఆయనకు ఉన్న పరిస్థితులు అందుకు అవకాశం ఇవ్వవు" అని నేర్పుగా సమాధానం చెబుతున్నారు.పవన్ విద్య గురించి ఎవరైనా అడిగితే, దాని గురించి తాను మాట్లాడనని, ఆయన సినిమాలలో స్టార్ అయ్యారు కదా! అంటూ తనకు ఉన్న డిగ్రీలు, ఇతర అర్హతలను మాత్రమే వివరిస్తున్నారు. పవన్ చదువు తక్కువ అనే పాయింట్ను కూడా ప్రస్తావించడం లేదు. తాను ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తినని చెప్పడానికి పలు ఉదాహరణలు వివరిస్తుంటారు. ఎవరికైనా నియోజకవర్గ ప్రజలకు ఏదైనా ఇబ్బంది వస్తే, తాను పిఠాపురంలోనే అందుబాటులో ఉంటానని, అదే పవన్ అయితే ఎక్కడో షూటింగ్లలో బిజీగా ఉంటారని, అందువల్ల ఆయన చేయలేరని, ఆయన పీఏలను పెట్టుకున్నా ప్రజలకు సేవలందించడం కష్టమని అంటారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలపట్ల ప్రజలు ఆకర్షితులయ్యారని, ముఖ్యంగా మహిళలు అయితే మరింతగా ఆదరిస్తున్నారని ఆమె చెబుతున్నారు. ప్రచారంలో ఎవరి ఇంటి వద్ద అన్నా ఆగకపోతే ప్రత్యేకించి పిలిచి మరీ తమ ఇళ్లవద్దకు తీసుకు వెళుతున్నారని ఆమె చెప్పారు. ఆయన ప్రచారానికి ఇప్పటికే నాగబాబు, జబర్దస్త్ టీమ్ తదితర నటులు వచ్చారని, బహుశా మెగాస్టార్ చిరంజీవి రాకపోవచ్చని అనుకుంటున్నానని గీత అభిప్రాయ పడ్డారు.లక్ష ఓట్ల మెజార్టీ వస్తుందని చెబుతున్న పవన్ వీరందరిని ఎందుకు తీసుకు వస్తున్నట్లు అని గీత ప్రశ్నిస్తున్నారు. మరో ఆసక్తికరమైన వాదన తెచ్చారు. పిఠాపురంలో ఏదైనా సమస్య ఉంటే తాను ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకు వెళ్లి పరిష్కరించే అవకాశం ఉంటుందని, జనసేనకు ఆ అవకాశం ఉండదని, వారు వేరే పార్టీ వారి దగ్దరకు వెళ్లాల్సి ఉంటుందని, ఆ తేడాను కూడా ప్రజలు గుర్తించారని ఆమె చెబుతున్నారు. కాపు సామాజికవర్గం వారు పవన్ వైపు ఎక్కువగా ఉన్నారా అని ప్రశ్నిస్తే, అలా ఏమీ ఉండదని, తాను కాపువర్గానికి చెందిన వ్యక్తినే కదా అని అంటారు. తాను కాపు సామాజికవర్గానికి ఉపయోగపడే పనులు అనేకం చేయించానని, ప్రత్యేకించి కాపు కళ్యాణమండపాలు నిర్మించడానికి నిధులు సమకూర్చానని ఆమె గుర్తు చేస్తున్నారు. ఎవరైనా అన్ని సామాజికవర్గాల ఆదరణ పొందాలి తప్ప, ఏ ఒక్క వర్గమో సపోర్టు చేస్తే గెలిచే పరిస్థితి ఉండదని అన్నారు. కొంతమంది కావాలని బయట నుంచి వచ్చి అలజడులు సృష్టించడానికి యత్నిస్తున్నారని, ఇది చాలా ప్రశాంతమైన నియోజకవర్గమని, ప్రజలు వీటిని గమనిస్తున్నారని ఆమె అన్నారు.పవన్ కళ్యాణే పెద్ద సినిమా స్టార్ అయినప్పుడు, జబర్దస్త్ టీవీ నటులు వంటివారి ప్రచారంతో ఏమి అవసరం వచ్చిందోనని ఆమె వ్యాఖ్యానిస్తున్నారు. ఏది ఏమైనా తాను విజయం సాధిస్తానన్న ధీమాను గీత వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో చాలామంది ఒక మాట చెబుతున్నారు. జగన్ చాలా తెలివిగా వంగా గీతను ఎంపిక చేసి పవన్ను ఆత్మరక్షణలో పడేశారని అంటున్నారు. సీనియర్ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వంటివారు ఆమెకు మద్దతు ఇవ్వడం కూడా ప్లస్ పాయింట్ అవుతుంది. పిఠాపురంలో సుమారు తొంభైవేల వరకు కాపుల ఓట్లు ఉండవచ్చని అంచనా. వాటి ఆధారంగా గెలవవచ్చన్న ఆశతో పవన్ అక్కడ పోటీలోకి దిగడం, వర్మ వంటి టీడీపీ నేతలను తనను గెలిపించాలని వేడుకున్న వైనం ఇవన్ని ఆయనకు కాస్త మైనస్ అయ్యాయని చెప్పవచ్చు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి తన అభ్యర్ధులను గెలిపించవలసిన నేత, తన గెలుపుకోసమే ఇతరులను అభ్యర్ధించవలసిన పరిస్థితి ఏర్పడడం చాలామందికి నచ్చడం లేదు.జనసేనకు స్వయంగా నియోజకవర్గం అంతటా పోల్ మేనేజ్ మెంట్ యంత్రాంగం లేదన్నది ఒక అభిప్రాయం. తెలుగుదేశం పార్టీవారి మద్దతు ఉన్నా, పిఠాపురాన్ని జనసేనకు ఇస్తారని ప్రకటన రాగానే, టీడీపీ శ్రేణులు భగ్గుమనడం కూడా పవన్కు నష్టం చేసింది. పవన్కు పిఠాపురం నియోజకవర్గంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయో తెలియదని, అక్కడ ఉన్న సమస్యలు తెలియవని, తాను ఏమి చేస్తానో చెప్పలేకపోతున్నారని వైస్సార్సీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. కేవలం సినిమా గ్లామర్ ఆకర్షణతో గెలవాలన్నది పవన్ వ్యూహం అయితే, ప్రజాసేవ ద్వారా వచ్చిన గ్లామర్తో పాటు జగన్ ప్రభుత్వం అమలు చేసిన స్కీముల ప్రభావంతో విజయం సాధించాలన్నది వంగా గీత వ్యూహంగా ఉంది.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయం: వంగా గీత
-
వంగా గీతని ఓడించడం ఎవరి వల్ల కాదు.. పవన్పై నటి శ్యామల షాకింగ్ కామెంట్స్
నటుడు పవన్ కల్యాణ్.. పిఠాపురంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు. ఇది నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ తరఫున వంగా గీత బరిలో ఉన్నారు. ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతారో అనేది పక్కనబెడితే తాజాగా వైఎస్సార్సీపీ నాయకురాలు, నటి శ్యామల.. పవన్ కల్యాణ్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలానే వంగా గీత గెలుపు ఇప్పటికే ఖాయమైపోయిందని కూడా అన్నారు.(ఇదీ చదవండి: పవన్, చంద్రబాబుకు ముద్రగడ చురకలు..)'వంగా గీత గెలుపు ఇప్పటికే ఖాయమైపోయింది. అంత ఇమేజ్ ఉన్న సినిమా స్టార్ అయితే పవన్ కల్యాణ్.. మిగతా సినిమా వాళ్లని ఎందుకు తీసుకొచ్చి ప్రచారం చేయిస్తున్నారు. వంగా గీత చాలా సీనియర్ నాయకురాలు. ఆమెని ఓడించడం ఎవరి వల్ల కాదు. గీత.. ఏ స్థాయి నుంచి ఏ స్థాయి వరకు చేశారో అందరికీ తెలుసు. అందుకే ఆమెకు భారీ మెజారిటీ రావాలని నేను కూడా ప్రచారం చేస్తున్నాను. పిఠాపురం ప్రజలు అభివృద్ధి చేసే వారికి ఓటు వేయండి. ఆ అభివృద్ధి సీఎం జగన్ మోహన్ రెడ్డి, వంగా గీత వల్లే సాధ్యం' అని శ్యామల్ చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: మేనిఫెస్టోలో మోదీ.. యాడ్స్లో పవన్ ఫొటోలు ఎందుకు లేవు) -
పవర్ స్టార్ కు ఓటమి భయం..! వంగా గీత స్ట్రాంగ్ కౌంటర్
-
గెలవలేక దుష్ప్రచారం!
పిఠాపురం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలుపు కోసం వక్రమార్గం పడుతున్నారు. ఇందులో భాగంగా.. జనసేన అల్లరి మూకలు కొందరు వైఎస్సార్సీపీ పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీతపై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాలకు దిగుతున్నారు. ఆమెకు సినీ నటుడు చిరంజీవి రాజకీయ భిక్ష పెట్టారని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో చిరంజీవి పిఠాపురంలో ప్రచారానికొస్తే, గీత తన నామినేషన్ ఉపసంహరించుకుని జనసేనలో చేరుతున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ కుటిల రాజకీయాలకు తెరలేపారు.వంగా గీత 1990 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు. తొలుత టీడీపీలో నామినేటెడ్ పదవులు నిర్వహించిన ఆమె.. 1996 నుంచి నాటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. అనంతరం రాజ్యసభ సభ్యురాలిగా, ఎమ్మెల్యేగా, లోక్సభ సభ్యురాలిగా ఓటమి ఎరుగని నాయకురాలిగా తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించారు. ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి 2008 ఆగస్టు 2న ప్రకటించారు. 2013లో తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి, ఆ పార్టీని నమ్ముకున్న వారిని నట్టేట ముంచారు. అలాంటి ప్రజారాజ్యం పారీ్ట.. ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్న వంగా గీతకు రాజకీయ భిక్ష పెట్టిందంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. పథకం ప్రకారం కుట్ర కాగా, ప్రజలందరూ వైఎస్సార్సీపీ వైపు ఉన్నారని, జగన్ను మళ్లీ సీఎంను చేసుకోవాలని కృత నిశ్చయంతో ఉన్నారని వంగా గీత చెప్పారు. ఓటమి భయంతోనే జనసేన నేతలు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపసంహరణ గడువు అయిపోయాక నామినేషన్ను నేనెలా విత్డ్రా చేసుకుంటానని, ప్రజలను అయోమయానికి గురి చేయాలని పథకం ప్రకారమే ఇదంతా చేస్తున్నారని, ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని వదిలే ప్రసక్తే లేదని, ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తున్నట్టు తెలిపారు. ఎన్ని కుయుక్తులు పన్నినా పిఠాపురంలో ఇప్పటికే తన గెలుపు ఖాయమైందని, దానిని ఎవరూ ఆపలేరని చెప్పారు. -
పవన్ కి వంగా గీత కౌంటర్
-
పవన్ను పట్టించుకోవాల్సిన పనిలేదు: మిథున్ రెడ్డి
సాక్షి, కాకినాడ: ప్రజలకు ఎవరు అందుబాటులో ఉంటారో వారికే ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్ మిథున్రెడ్డి. పవన్ కల్యాణ్ను వాళ్ల కేడరే చేరుకోలేదు. ఆయన ఎక్కడ ఉంటాడో ఆయనకే తెలియదని ఎద్దేవా చేశారు. నిత్యం ప్రజల్లో ఉండే వంగా గీతను గెలిపించాలని కోరారు. కాగా, మిథున్ రెడ్డి శనివారం మాట్లాడుతూ.. పిఠాపురంలో వంగా గీత బలమైన అభ్యర్థి. పవన్ కల్యాణ్ రాక ముందే ఆమె ఇక్కడ అభ్యర్థిగా ఉన్నారు. గతంలో వంగా గీత ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. నిత్యం ప్రజల్లోనే ఉంటారు. ఇబ్బందులు ఉంటే ఎవరు ప్రజల్లో ఉంటారని ప్రజలు కోరుకుంటారు. పిలిస్తే పలికే వ్యక్తులకే ప్రజలు మద్దతు ఇస్తారు. పవన్ కల్యాణ్ను వాళ్ల కేడరే చేరుకోలేరు. ఆయన ఎక్కడ ఉంటాడో ఎవరికీ తెలియదు. ఎప్పుడు వస్తాడో తెలియదు. పిఠాపురంపై మేము ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు. 175 నియోజకవర్గాల్లో పిఠాపురం కూడా ఒకటి. పిఠాపురంలో వైఎస్సార్సీపీ బలంగా ఉంది. పిఠాపురంలో కష్టపడాల్సింది పవన్. డబ్బులు తీసుకుని ప్రజలు ఓటు వేయరు. నేను కూడా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను. ఇంత వరకు నేను పిఠాపురంలో అడుగుపెట్టింది లేదు. తాను ఓడిపోతే చెప్పుకోడానికి పవన్ కొన్ని కారణాలు వెతుక్కుంటున్నాడు. పవన్ను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. డబ్బుల గురించి పవన్ కల్యాణ్ మాట్లాడటం విడ్డూరం ఉంది. డబ్బులు తీసుకుని సీట్లు ఇచ్చిందే పవన్ కల్యాణ్’ అంటూ కౌంటరిచ్చారు. ఈనెల 19వ తేదీన కాకినాడ రూరల్లో మేమంతా సిద్దం సభ ఉంటుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సభలో పాల్గొంటారు. రాజకీయాల్లో మేమంతా సిద్ధం యాత్ర ఒక గేమ్ ఛేంజర్. సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులను కోరుతున్నాం అని అన్నారు. -
పిఠాపురంలో ఎగిరేది జగన్ జెండానే..
-
పవన్, చంద్రబాబుకు వంగ గీత కౌంటర్
-
చిత్తు చిత్తుగా ఓడిస్తా...పవన్ కళ్యాణ్ కి వంగా గీత అదిరిపోయే కౌంటర్
-
మంచి చేస్తే బాబుకు అస్సలు నచ్చదు..చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెప్పే టైం దగ్గర పడింది..
-
ఓటర్లు డబ్బుకు అమ్ముడుపోతారనడం బాధాకరం
కిర్లంపూడి: ఓటర్లు డబ్బులకు అమ్ముడుపోతారనేలా జనసేన అధినేత పవన్కళ్యాణ్ వ్యాఖ్యానించడం బాధాకరంగా ఉందని కాపు ఉద్యమ నేత, వైఎస్సార్సీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభం అన్నారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎస్టీ, ఎస్సీ, బీసీ, ఓసీ, మైనార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బుధవారం పెద్దఎత్తున కాకినాడ జిల్లా కిర్లంపూడిలోని ముద్రగడ స్వగృహానికి తరలివచ్చి ఆయనను, యువ నాయకుడు ముద్రగడ గిరిబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. కాకినాడ వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్, పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీత ముద్రగడను కలిశారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయానికి తీసుకోవలసిన జాగ్రత్తలపై ఆయన వారికి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ముద్రగడ మీడియాతో మాట్లాడుతూ.. పిఠాపురం నియోజకవర్గంలోని ఒక్కో ఓటరుకు సీఎం జగన్ లక్ష ఇస్తున్నారంటూ ప్రజలను అవమానించేలా మాట్లాడడం పవన్కు తగదన్నారు. పవన్కు డబ్బు తీసుకునే జబ్బు ఉందని, ఆ జబ్బు అందరికీ ఉంటుందనుకోవడం బాధాకరమన్నారు. నియోజకవర్గ ఓటర్లు డబ్బు తీసుకునేవారా? అమ్ముడుపోయేవారమా? అని ముద్రగడ ప్రశ్నించారు. పిఠాపురం ప్రజలంతా డబ్బుకు అమ్ముడుపోతారనుకోవడం సరికాదన్నారు. రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలి.. ఇక రాష్ట్రంలో అమలవుతున్న అనేక సంక్షేమ కార్యక్రమాలతోపాటు రాష్ట్రాభివృద్ధి సీఎం జగన్తోనే సాధ్యమన్నారు. రానున్న ఎన్నికల్లో సీఎం జగన్మోహన్రెడ్డిని అత్యధిక మెజార్టీతో అధికారంలోకి తీసుకురావడానికి రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలని పార్టీ శ్రేణులు, అభిమానులకు ముద్రగడ విజ్ఞప్తి చేశారు. ఆరునెలలకోసారి వచ్చి రాజకీయాలుచేసే పవన్ కన్నా నిత్యం నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ఉండే కాకినాడ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ను, పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీతను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. పార్టీ విజయానికి శ్రమించిన ప్రతి కార్యకర్తను గుర్తుపెట్టుకోవాలని సునీల్, గీతకు సూచించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నియోజకవర్గంలో పరిశ్రమలు నెలకొల్పి ప్రజలంతా ఆర్థికంగా బలపడేలా కృషిచేయాలని ముద్రగడ చెప్పారు. తద్వారా స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలన్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలోని బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, కొద్దిమంది కాపులవల్లే గతంలో తాను అధికారంలోకి వచ్చానన్నారు. నాకు రాజకీయ భిక్ష పెట్టిన ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రజలను ఎప్పుడూ మరచిపోనన్నారు. -
కులాలకతీతంగా సంక్షేమం అందిస్తున్న ప్రభుత్వం మాది: వంగా గీత
-
జనసేన ఆఫర్ పై పవన్ కళ్యాణ్ కు వంగా గీత సూచన
-
ప్రభంజనం సృష్టించనున్న మహిళా శక్తి
-
పిఠాపురంలో వంగా గీత క్యాంపెయిన్
-
Pawan Kalyan: ప్లేటు మార్చిన పవన్!
జనసేన అధినేత పవన్ కల్యాణ్కు ఓటమి భయం పట్టుకుందా?.. తాజా పరిణామాలన్నీ అవుననే చెబుతున్నాయి. పిఠాపురం నుంచి పోటీ చేయడంపై జనసేనాని తర్జనభర్జన పడుతున్నారు. తొలుత అక్కడి నుంచే బరిలో నిల్చుంటానని ప్రకటించి.. రెండ్రోజులు గడవక ముందే ప్లేట్ ఫిరాయించాడు. వరుసగా తగులుతున్న షాక్ నేపథ్యంలో ఎంపీగా పోటీ చేస్తాననే సాకు చూపించి అక్కడి నుంచి బయటపడాలని చూస్తున్నారు. పిఠాపురంలో మారిన సమీకరణాలు.. పవన్ వ్యవహార శైలి కారణంగా పిఠాపురంలో జనసేనకు వరుస షాక్లు తగులుతున్నాయి. కీలక కాపు నేతలందరూ జనసేనను వీడి వైఎస్సార్సీపీలో చేరుతున్నారు. తాజాగా పిఠాపురం జనసేన మాజీ ఇన్చార్జ్ మాకినీడు శేషు కుమారి వైఎస్సార్సీపీలో చేరారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో శేషుకుమారి పిఠాపురం జనసేన అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఆమె 28వేల ఓట్లు సాధించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్కు సిద్దాంతం లేదు.. నిబద్దత లేదు. జనసేనకి విధివిధానాలు లేవని మండిపడ్డారు. వర్మ వార్నింగ్.. మరోవైపు.. టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ ముందు నుంచి పిఠాపురంలో బలమైన నేతగా ఉన్నారు. ఈసారి పిఠాపురం టికెట్ తనకే వస్తుందనే ఆశ పెట్టుకున్నారు. కానీ, కూటమి పొత్తులో భాగంగా పిఠాపురంలో పవన్ పోటీ చేస్తానని ప్రకటించడంతో వర్మ, ఆయన మద్దతుదారులు చంద్రబాబు, పవన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు చంద్రబాబు మంతనాల కారణంగా వర్మ కాస్తా చల్లబడ్డారు. కానీ, తాజాగా వర్మ మరో బాంబు పేల్చారు. పిఠాపురంలో పవన్ తప్ప వేరెవరొచ్చినా పల్లకీ మోయనంటూ వర్మ తేల్చి చెప్పారు. పిఠాపురంలో పవన్ కల్యాణ్ పోటీ చేస్తేనే సహకరిస్తానన్నారు. ‘వేరే వాళ్లు పోటీకి దిగితే టీడీపీ నుంచి నేనే పోటీ చేస్తా.. పవన్ ఎంపీగా వెళ్తే నన్ను పోటీ చేయమని చంద్రబాబు చెప్పారు’ అని వర్మ ట్విస్ట్ ఇచ్చారు. వంగా గీత కౌంటర్.. పిఠాపురం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీత.. పవన్కు కౌంటరిచ్చారు. పవన్ నన్ను జనసేనలోకి రావాలని కోరుతున్నారు. నేను కూడా పవన్ ను వైసీపీలోకి ఆహ్వానిస్తే ఎలా ఉంటుంది? అని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే తాను 2009 కంటే ముందే రాజకీయాల్లో ఉన్నానని.. చిరంజీవి గుర్తించి ప్రజారాజ్యంలోకి ఆహ్వానించారని చెప్పుకొచ్చారు. పవన్ కల్యాణ్వి అన్నీ దింపుడు కల్లం ఆశలే. పిఠాపురంలో అన్ని వర్గాల ప్రజలు నాకు మద్దతు ఇస్తున్నారు’ అని అన్నారు. ఇదిలా ఉండగా.. ఇప్పటికే పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నుంచి సీనియర్ నేత చేగొండి సూర్యప్రకాష్ వైఎస్సార్సీపీలో చేరిపోయారు. ఇక, పవన్ తీరుతో విసుగెత్తి ముద్రగడ పద్మనాభం కూడా వైఎస్సార్సీపీలోకి వచ్చారు. పవన్ వ్యవహారశైలి, నాయకత్వ లక్షణాలపై నమ్మకం కోల్పోయిన గోదావరి జిల్లా కాపులు ఒక్కొక్కరుగా సీఎం జగన్ మీద నమ్మకంతో పార్టీలో చేరుతున్నారు. దీంతో, పవన్కు కొత్త టెన్షన్ పట్టుకుంది. పవన్ కొత్త స్టోరీ.. ఈ పరిణామాల నేపథ్యంలో ఓటమి భయంతో పవన్ ఓ కొత్త స్టోరీ చెబుతున్నారు. ఒక వేళ అమిత్షా చెప్తే తాను కాకినాడ ఎంపీగా పోటీ చేస్తానని పవన్ తెలిపారు. తాను ఎంపీగా పోటీ చేస్తే.. పిఠాపురం ఎమ్మెల్యేగా ఉదయ్ పోటీ చేస్తారని పవన్ చెప్పారు. దీంతో, జనసైనికులు తలలు పట్టుకున్నారు. మరోవైపు అక్కడి పోటీ అభ్యర్థి వంగా గీతతో పాటు వైఎస్సార్సీపీ నేతలంతా పవన్ను ఏకిపారేస్తున్నారు. అసెంబ్లీకి పోటీ చేయాలంటే చంద్రబాబు, ఎంపీగా పోటీ చేయాలంటే అమిత్ షా టిక్ పెట్టాలా?.. ఓ పార్టీ అధ్యక్షుడివి అయ్యి ఉండి ఇదేం ఖర్మ అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇప్పటికే పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ప్రకటించుకున్న పవన్.. ఇప్పుడు మళ్లీ అవసరమైతే కాకినాడ ఎంపీగా వెళ్తానంటున్నారు. ఇంతకీ పిఠాపురంలో పవన్ పోటీ చేస్తారా? లేదా?.. ఓటమి భయంతోనే పవన్ ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారా? ఏది ఏమైనా ఆయన ఇస్తున్న వరుస ప్రకటనలు జనసేన వర్గాలకు అస్సలు సహించడం లేదు. -
పిఠాపురంలో జనసేనకు భారీ షాక్.. వైఎస్సార్సీపీలోకి శేషకుమారి
సాక్షి, తాడేపల్లి: కాకినాడ జిల్లాలోని పిఠాపురంలో జనసేనకు భారీ షాక్ తగిలింది. జనసేన పార్టీ మాజీ ఇంచార్జి మాకినీడి శేషకుమారి వైఎస్సార్సీపీలో చేరారు. బుధవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో ఆమె వైఎస్సార్సీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో జనసేన తరపున పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శేషకుమారి పోటీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ పి.వి. మిథున్రెడ్డి, పిఠాపురం వైఎస్సార్సీపీ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త వంగా గీత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాకినీడి శేషకుమారి మీడియాతో మాట్లాడుతూ, గత ఎన్నికలలో 28 వేల ఓట్లు తనకు వచ్చాయని తెలిపారు. ‘పవన్ పార్టీకి ఒక నిబద్దతనేదే లేదు. పవన్ను జనం నమ్మే పరిస్థితి లేదు. జనసేనకి అసలు విధివిధానాలే లేవు. పిఠాపురం ప్రజల మనోభావాలను పవన్ అర్థం చేసుకోలేడు. జనాసేనలో అనేక సమస్యలు, ఇబ్బందులు ఉన్నాయి. సీఎం జగన్తో అసలు పవన్ను ఎవరూ పోల్చుకోరు. సీఎం జగన్ స్థాయి వేరు. పవన్ చెప్పే సిద్ధాంతాలు మైకుల ముందే పరిమితం. ఆచరణలో ఏమీ చేయరు’ అని తెలిపారు. నన్ను జనసేనలోకి రమ్మనటం పవన్ అవివేకం డబ్బులతో రాజకీయం చేయాలని పవన్ అనుకుంటున్నారని పిఠాపురం నియోజకవర్గం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీత అన్నారు. ఆమె బుధవారం మీడియాతో మాట్లాడారు. ‘మేము గత ఐదేళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని చూసే ఓట్లేయమని అడుగుతాం. కాపు కుల మహిళా నేతగా పిఠాపురంలో నాకు మంచి ఇమేజ్ ఉంది. నాకు బంధువులు, స్నేహితులు పిఠాపురంలో చాలా ఎక్కువ. నన్ను తన పార్టీలోకి రమ్మనటం పవన్ అవివేకం. పవన్ను కూడా నేను మా వైఎస్సార్సీపీలోకి రమ్మంటే బావుంటుందా?. సీఎం జగన్ మీద జనానికి నమ్మకం ఉంది. ఆయన్ను ఢీకొనలేక మిగతా పార్టీలన్నీ కలిసి పోటీ చేస్తున్నాయి. అయినా గెలుస్తామన్న నమ్మకమే వారికి లేదు. పవన్కు అసలు రాజకీయాలపై క్లారిటీ లేదు. జనం డబ్బులకు అమ్ముడు పోతారని పవన్ వ్యాఖ్యలు చేయటం సరికాదు’ అని వంగా గీత అన్నారు. -
పవన్ కళ్యాణ్ పోటీపై వంగా గీత అదిరిపోయే రియాక్షన్
-
ఏపీ సీఎం వైఎస్ జగన్ మహిళలకు పెద్దపీట వేశారు: వంగా గీత
-
మహిళా బిల్లును తెచ్చినందుకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు: వంగా గీత
-
‘బాబూ.. చేతనైతే సాయం చేయ్.. శవాలపై పేలాలు ఏరుకోకు’
సాక్షి, కాకినాడ: విద్యార్థి అమర్నాథ్ హత్య దురదృష్టకరమని ఎంపీ మోపిదేవి వెంకటరమణ అన్నారు. వారి కుటుంబానికి ఇంటి స్థలం, ఇల్లు, ఉద్యోగం కూడా ఇస్తామన్నామని తెలిపారు. ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించి.. నిందితులను 24 గంటల్లోనే అరెస్ట్ చేయించిందన్నారు. చంద్రబాబు శవరాజకీయాలకు తెరలేపుతున్నాడని, ప్రతిచోటా రాజకీయ లబ్ధి కోసమే టీడీపీ ఆరాటపడుతోందని విమర్శించారు. బాబూ.. చేతనైతే బాధిత కుటుంబానికి సాయం చేయాలి కానీ శవాలపై పేలాలు ఏరుకోవడం సరికాదని హితవు పలికారు. కులాల మధ్య చంద్రబాబు చిచ్చు పెడుతున్నాడని మండిపడ్డారు. చంద్రబాబు శవ రాజకీయాలు చేయటం సబబు కాదని హితవు పలికారు.. చంద్రబాబుకు పనిలేక ఖాళీగా ఉన్నాడని ఎవరు పిలుస్తారా? వెళ్దామని ఎదురు చూస్తూ కూర్చున్నారని ఎద్దేవా చేశారు. కుట్రలు, కుయుక్తులన్నీ ఆయన ఉంటున్న అక్రమ ఇంటి నుంచే జరుగుతున్నాయని విమర్శించారు. కుల విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్న చంద్రబాబును ప్రజలంతా అసహ్యించుకుంటున్నారని అన్నారు. వారిని పరామర్శించావా బాబూ! 2014 - 2019 మధ్యలో నాగార్జున యూనివర్సిటీలో రిషితేశ్వరి చనిపోతే వారింటికి వెళ్లి పరామర్శించావా చంద్రబాబు? వనజాక్షిపై నీ ఎమ్మెల్యే దాడి చేస్తే కనీసం వనజాక్షిని పరామర్శించావా? రెండు నెలల క్రితమే టీడీపీ స్థానిక కౌన్సిలర్ హత్యకు గురైతే కనీసం ఆ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు? ఖాళీగానే ఉన్నప్పటికీ ఆ కుటుంబాన్ని పరామర్శించని నేత చంద్రబాబు. చంద్రబాబు సతీమణి గురించి ప్రస్తావన చేశారని బోరున ఏడ్చిన వ్యక్తి చంద్రబాబు. మా కుటుంబాల గురించి మాట్లాడితే చంద్రబాబు నాలుక కోస్తాం. పవన్కు వాస్తవాలు తెలియవు పవన్ లాగా నాకేమీ ప్యాకేజీ డబ్బులు రావటం లేదు. నా కష్టార్జితాన్ని తీసుకుని వెళ్ళి అమరనాథ్ కుటుంబానికి ఇచ్చి అండగా నిలిచాను. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టు చదివే పవన్కు వాస్తవాలు తెలియవు. మత్స్యకారుల జీవితాలను పైకి తీసుకుని రావటానికి సీఎం జగన్ తీవ్రంగా కృషి చేస్తున్నారు. హార్బర్లు కట్టిస్తున్నారు. డీజిల్ సబ్సిడీ అప్పటికప్పుడే ఇచ్చే ఏర్పాటు చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల అభివృద్ధి జగన్ వల్లే సాధ్యం. 2024లో కూడా జగనే సీఎం ఖాయం’ అని మోపిదేవి పేర్కొన్నారు. చదవండి: పవన్తో జాగ్రత్త! లేదంటే జనసేన నేతల చొక్కాలు చించుతారేమో! ఇది సినిమా కాదు, రాజకీయం పవన్ కల్యాణ్ వ్యక్తిగత దూషణలకు దిగుతున్నాడని మాజీ మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. పవన్ సినిమాటిక్ రాజకీయాలు చేస్తున్నాడని మండిపడ్డారు. సినిమా డైలాగ్స్తో హడావిడీ చేస్తున్నాడని దుయ్యబట్టారు. పవన్.. ఇది సినిమా కాదు, రాజకీయం అని హితవు పలికారు. సీఎం అవుతానంటున్న పవన్ భాష సరిగా లేదని, సభ్యత లేకుండా దిగజారి మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై పవన్ వ్యక్తిగత దూషణలకు దిగాడు. ఏదైనా ఆరోపించామంటే కనీస ఆధారాలు ఉండాలి. ద్వారంపూడిని టార్గెట్ చేస్తూ ఆరోపణలు చేశాడు. పవన్తాను ఎక్కడా కుల రాజకీయం చేయనంటుంటాడు. కులాల ప్రస్తావన లేకుండా పవన్ ఎక్కడైనా మాట్లాడాడా?. రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చు పెట్టింది టీడీపీయే. టీడీపీ ఆవిర్భావంతో కులాల కుంపట్లు ప్రారంభం అయ్యాయి. 80 శాతం కాపులు సీఎం జగన్కే మద్దతు తెలుపుతున్నారు. పవన్ చంద్రశేఖర్రెడ్డిపై పోటీ చేయాలి. కాకినాడలో పోటీ విషయంపై ద్వారంపూడి సవాల్కు ఇవాళైనా పవన్ సమాధానం ఇస్తాడో లేదో చూడాలి’ అని కన్నబాబు పేర్కొన్నారు. అవినీతి రాక్షసుడు చంద్రబాబు ‘నాలుగు దశాబ్ధాలుగా ఏపీని పట్టిపీడిస్తున్న శని చంద్రబాబు. చంద్రబాబు తప్పుడు ప్రచారంతో లబ్ది పొందాలని చూస్తున్నాడు. అవినీతి రాక్షసుడు చంద్రబాబు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రజలను మోసం చేయడమే చంద్రబాబు పని. వారాహి యాత్రలో పవన్ ఏం మాట్లాడుతునఆనడో తనకే తెలియట్లే. చంద్రబాబు ఏం చెబితే అదే పవన్ మాట్లాడుతున్నాడు. కాపుల పరువు తీసేలా పవన్ మాట్లాడుతున్నాడు. పవన్ దిగజారి మాట్లాడుతున్నాడు. పవన్ వ్యాఖ్యలకు బాధపడే ముద్రగడ లేఖ రాశారు. చంద్రబాబు మారణహోమంలో పవన్ బలి అవుతాడేమో?. పవన్కు అపాయం జరిగితే చంద్రబాబుకే సానుభూతి వస్తుంది. చంద్బరాబు నుంచే పవన్కు పెను ప్రమాద పొంచి ఉంది. పవన్కు మా ప్రభుత్వం రక్షణ కల్పిస్తుంది.’ -మంత్రి కొట్టు సత్యనారాయణ ‘ఎమ్మెల్యే ద్వారంపూడి.. ఆయన కుటుంబం పట్ల పవన్ చేసిన వాఖ్యలను ఖండిస్తున్నాను. పవన్.. పార్టీని నడింపించాల్సిన విధానం ఇదేనా?. దూషణలు, పరుష పదజాలంతో పవన్ మాట్లాడుతున్నాడు. యువతకు ఏం మెసెజ్ ఇవ్వాలనుకుంటున్నావ్?. ద్వారంపూడిపై పవన్ మాట్లాడిన భాష అభ్యంతరం. సీఎం జగన్ వారసత్వంగా రాలేదు. ఒక నాయకత్వ లక్షణంతో ముందుకు వచ్చారు. ప్రజాస్వామ్యం గతిని మార్చిన వ్యక్తి వైఎస్ జగన్. ప్రజలకు ఒక దైర్యాన్ని నమ్మకాన్ని ఇచ్చారు. -ఎంపీ వంగా గీత -
ఏపీ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి: ఎంపీ వంగా గీత
న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని వైఎస్సార్సీపీ ఎంపీ వంగా గీత డిమాండ్ చేశారు. లోక్సభలో రూల్ 377 కింద ఈ విషయాన్ని ఆమె ప్రస్తావించారు. పార్లమెంట్లో ఇచ్చిన విభజన హామీలను నిలబెట్టుకోవాలని గుర్తుచేశారు. ఏపీలో గ్యాస్ ఆధారిత పరిశ్రమల ఏర్పాటు మద్దతివ్వాలని కోరారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన ప్రోత్సాహకాలు, రాయితీలు ఇవ్వాలని ఎంపీ తెలిపారు. విభజన జరిగి ఏళ్లు గడిచినా మెజార్టీ హామీలు కేంద్రం నిలబెట్టుకోలేదని విమర్శించారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఏపీ సమస్యలను పరిష్కరించాలని వంగా గీత డిమాండ్ చేశారు. -
పోలవరంపై ఎంపీ వంగా గీత ప్రశ్న.. కేంద్రమంత్రి సమాధానమిదే
సాక్షి, న్యూఢిల్లీ: పోలవరంపై లోక్సభలో వంగా గీత ప్రశ్నకు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ సమాధానమిచ్చారు. ‘‘భూసేకరణ పరిహారాన్ని నిర్వాసితుల ఖాతాలో వేయాలని రాష్ట్రం కోరింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలపలేదు’’ అని గజేంద్రసింగ్ తెలిపారు. ‘‘భూసేకరణ కింద 3,779 కోట్ల రూపాయల బిల్లులు రీయింబర్స్మెంట్ కోసం రాష్ట్రం సబ్మిట్ చేసింది. అందులో 3,431.59 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం రీయింబర్స్మెంట్ చేసింది. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద 2,267 కోట్ల రూపాయల బిల్లులను రీయింబర్స్మెంట్ కోసం పంపారు. అందులో 2,110 కోట్ల రూపాయల బిల్లులకు చేశాం. పిఐఏ, సీడబ్ల్యూ సిఫారసుల ఆధారంగా ఎప్పటికప్పుడు బిల్లులను వెరిఫై చేసి చెల్లిస్తున్నాం’’ అని లోక్సభలో గజేంద్రసింగ్ వెల్లడించారు. చదవండి: కోతలు.. కొత్త పథకాలు -
సీఎం జగన్కు రాఖీ కట్టిన వైఎస్సార్సీపీ మహిళా ఎంపీలు
ఢిల్లీ: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్లో జరుగుతున్న నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో సీఎం పాల్గొన్నారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరైన ఈ సమావేశం సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగనుంది. అంతకుముందు ఆయన నివాసంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా ఎంపీలు రాఖీ కట్టారు. రాఖీ కట్టిన వారిలో అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, కాకినాడ ఎంపీ వంగా గీత, అమలాపురం ఎంపీ చింతా అనురాధ ఉన్నారు. శనివారం రాత్రి ఢిల్లీ చేరుకున్న సీఎంకు ఎయిర్పోర్టులో వైఎస్సార్ సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మార్గాని భరత్, నందిగామ సురేష్ సహా పలువురు సీఎం జగన్కు స్వాగతం పలికారు. చదవండి: నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం.. పాల్గొన్న సీఎం జగన్ -
రేషన్ కేటాయింపులో ఏపీకి అన్యాయం
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ ఆహార భద్రత చట్టం (ఎన్ఎఫ్ఎస్ఏ) కింద ఆంధ్రప్రదేశ్లోని 60 శాతం బీపీఎల్ కుటుంబాలకే కేంద్రం బియ్యాన్ని పంపిణీ చేస్తూ అన్యాయం చేస్తోందని వైఎస్సార్సీపీ ఎంపీలు విమర్శించారు. కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ల్లో 76 శాతం బీపీఎల్ కుటుంబాలకు పంపిణీ చేస్తోందని తెలిపారు. పలుమార్లు విజ్ఞప్తి చేసినా కేంద్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. న్యూఢిల్లీలోని ఏపీభవన్లో గురువారం వైఎస్సార్సీపీ ఎంపీలు మార్గాని భరత్రామ్, వంగా గీతావిశ్వనాథ్, ఎన్.రెడ్డెప్ప మీడియాతో మాట్లాడారు. మార్గాని భరత్రామ్ మాట్లాడుతూ కేంద్రానికి సంబంధం లేకుండా 24 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే అందిస్తోందని తెలిపారు. ప్రజా పంపిణీ, ఆహార భద్రత పథకాల కింద ఏపీకి పంపిణీ చేస్తున్న బియ్యానికి, కేంద్రం చెబుతున్న లెక్కలకు పొంతనలేదన్నారు. పార్లమెంటులో తప్పుడు సమాచారం ఇచ్చారని చెప్పారు. వాస్తవాలకు విరుద్ధంగా ‘కేంద్రం నుంచి తీసుకునే రేషన్ ఎక్కువ.. ప్రజలకు పంచేది తక్కువ..’ అంటూ ఈనాడు, ఇతర పత్రికల్లో కథనాలు వచ్చాయని చెప్పారు. ఇది ప్రజలను తప్పుదారి పట్టించడమేనన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా ఏపీలో డోర్ డెలివరీ విధానంలో రేషన్ అందిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ విషయంలో ట్రెండ్ సెట్ చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో 1.54 కోట్ల బీపీఎల్ కుటుంబాలుండగా కేంద్రం 89 లక్షల కార్డుదారులకు మాత్రమే బియ్యం కేటాయిస్తోందని చెప్పారు. మిగిలిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అందించడం వల్ల ఏటా రాష్ట్రంపై రూ.3 వేల కోట్ల భారం పడుతోందన్నారు. బియ్యం కోటా పెంచాలని కేంద్రానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పలుసార్లు విజ్ఞప్తి చేశారని గుర్తుచేశారు. రేషన్ పంపిణీలో మిగులు బియ్యం తర్వాత నెలకు సర్దుబాటవుతుందని, దాన్ని విస్మరించి బియ్యం కేటాయింపులపై కేంద్రం పార్లమెంటులో తప్పుడు నివేదిక ఇవ్వడం బాధాకరమని చెప్పారు. దీనిపై సంబంధిత మంత్రిని స్పష్టత కోరతామని ఆయన తెలిపారు. ఏపీకి అన్యాయం జరిగిందని నీతి ఆయోగ్ చైర్మన్ అంగీకరించారు ఎంపీ వంగా గీత మాట్లాడుతూ కేంద్రం మూడేళ్ల వివరాలు అందించడంలో క్లరికల్ పొరపాటు జరిగిందని భావిస్తున్నామన్నారు. ఈనాడు తదితర పత్రికల్లో వార్తల ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై నిందలు వేయడం సరికాదని చెప్పారు. కేంద్రం ఇచ్చిన సమాచారం కన్నా మరింత తప్పుడు సమాచారం జోడించి కథనాలు ప్రచురించడాన్ని వైఎస్సార్సీపీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. పీడీఎస్ లెక్కల గణనలో ఏపీకి అన్యాయం జరిగిందని 2020–21లో నీతి ఆయోగ్ సమావేశంలో రాష్ట్రం తరఫున వాదనలు వినిపించగా నీతి ఆయోగ్ చైర్మన్ కూడా అంగీకరించారని ఆమె గుర్తుచేశారు. -
ధరల నియంత్రణకు చర్యలేవి?
సాక్షి, న్యూఢిల్లీ: నిత్యావసర ధరల నియంత్రణపై కేంద్రం చర్యలు ఆశాజనకంగా లేవని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. ధరలను నియంత్రించే చర్యలేమిటని, ప్రత్యామ్నాయ మార్గాలపై చేస్తున్న ఆలోచనలు ఏమిటని ప్రశ్నించింది. న్యూఢిల్లీలోని ఏపీభవన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైఎస్సార్సీపీ ఎంపీలు మార్గాని భరత్, వంగా గీత, గొడ్డేటి మాధవి, బీశెట్టి సత్యవతి, గురుమూర్తి మాట్లాడారు. ద్రవ్యోల్బణం, ధరల నియంత్రణలో కేంద్రం పూర్తిగా విఫలమైందని, ధరల పెరగుదలకు కారణాలు చెప్పిన కేంద్రం ఉపశమన చర్యలు మాత్రం ప్రకటించలేదని విమర్శించారు. ఎంపీ భరత్ మాట్లాడుతూ కరోనా కారణంగా ఆర్థికవ్యవస్థ ఒడుదొడుకులకు లోనైంది నిజమైనా.. పేదవాడి ఇబ్బందులు తీర్చడంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదని చెప్పారు. పెట్రో ఉత్పత్తులు, వంటనూనెల ధరల నియంత్రణలో వైఫల్యంతో పేదలు ఆర్థికంగా చితికిపోతున్నారన్నారు. కరోనా కారణంగా రెండేళ్లలో భారీగా ఆదాయం కోల్పోయిన పరిస్థితుల్లో కేంద్రం విప్లవాత్మకమైన అడుగులు వేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. జీడీపీ 8.9 శాతం నుంచి 7 శాతానికి పడిపోయిన నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలపై ఆలోచించాలని సూచించారు. ముఖ్యంగా సోలార్, పునరుత్పాదక ఇంధన వనరులు, హైడ్రో ఎలక్ట్రిక్ విద్యుదుత్పత్తులకు కేంద్రం ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టుకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని ఇస్తే ప్రాజెక్టును పూర్తిచేసి 960 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అవకాశం ఏర్పడుతుందని చెప్పారు. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించేందుకు వాటిని జీఎస్టీ పరిధిలోకి తేవాలన్నారు. ప్రస్తుతం విదేశాల నుంచి భారీగా పామాయిల్ వంటి సరుకులను దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో భారత్లోనే వాటి ఉత్పాదకత పెరిగేలా రైతులకు పంట ప్రోత్సాహకాలు ప్రకటించాలని, ఎంఎస్పీని సవరించాలని కోరారు. టీటీడీపై జీఎస్టీని తొలగించాలన్నారు. ఏపీకి ఇవ్వాల్సిన రూ.18 వేల కోట్ల రెవెన్యూ లోటును కేంద్రం వెంటనే విడుదల చేయాలని కోరారు. ఉపశమన చర్యలేవి? ఎంపీ వంగా గీత మాట్లాడుతూ పార్లమెంట్ ఉభయ సభల్లో దేశవ్యాప్తంగా ధరల పెరుగుదలకు కేంద్ర ఆర్థికమంత్రి కారణాలు చెప్పారే తప్ప పరిష్కార మార్గాలు చెప్పలేదని విమర్శించారు. పీఎం ఉజ్వల యోజన కింద 2లక్షల ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇచ్చి సిలిండర్ ధరను రూ.500 నుంచి రూ.వెయ్యికి పెంచితే లాభమేమిటని ప్రశ్నించారు. ఒకపక్క ధరల పెరుగుదలతో సతమతమవుతుంటే సహకార మార్కెట్లలో అమ్మే స్థానిక ఉత్పత్తులపైనా జీఎస్టీ విధించడం ఏమిటని నిలదీశారు. పేదలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు సరిపోవన్నారు. కేంద్రం మానవతా దృక్పథంతో పేదలపై భారం తగ్గించాలని కోరారు. -
ధరల పెరుగుదలపై కేంద్రం పునరాలోచించాలి
-
ధరలపై కేంద్రం దిద్దుబాటు చర్యలు చేపట్టాలి: వైఎస్సార్సీపీ ఎంపీలు
సాక్షి, ఢిల్లీ: దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, కేంద్రం దదిద్దుబాటు చర్యలు చేపట్టాలని వైఎస్సార్సీపీ ఎంపీ మార్గాని భరత్ రామ్ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఈ రెండేళ్లలో ధరలు రెండు రెట్లు పెరిగాయి. దిగుమతులు పెరిగిపోవడం వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. జీడీపీ తొమ్మిది నుంచి ఏడు శాతానికి పడిపోయింది. చమురు దిగుమతి వల్ల ఎకానమీపై భారం పెరిగింది. అందుకే.. ప్రత్యామ్నాయ ఇంధన వనరులు అందుబాటులో తేవాల్సిన అవసరం ఉంది. ఈ సమయంలో సోలార్ ఎనర్జీ విషయంలో కేంద్ర తీరు సరికాదు. నదుల అనుసంధానంతో కరెంట్ ఉత్పత్తి పెంచే అవకాశం ఉంది. వంట గ్యాస్ ధరలు తగ్గించాలి.పెట్రోల్, డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తేవాలి. ఉక్రెయిన్ రష్యా యుద్ధం వల్ల పామాయిల్ రెట్లు పెరిగాయి. కానీ వాటి ధరలు తగ్గించే చర్యలు తీసుకోవాలి. తిరుమల తిరుపతిపై జీఎస్టీ రద్దు చేయాలి. హిందువుల మనోభావాలు కాపాడాలని ఎంపీ మార్గాని భరత్ కేంద్రాన్ని కోరారు. కేంద్రం ఆదుకోవడం లేదు ధరల పెరుగుదలపై కేంద్రం కారణాలు మాత్రమే చెప్తోందని.. ఎవరిని ఆదుకోవడం లేదని వైఎస్సార్సీపీ ఎంపీ వంగా గీత తెలిపారు. ప్రజలు కూడా అదే సమస్యలతో బాధపడుతున్నారు. ధరల పెరుగుదలతో తీవ్ర కష్టాలపాలు అవుతున్నారు. మానవతా దృక్పథంతో ప్రజలను ప్రధాని ఆదుకోవాలి. ప్యాకేజీ ఫుడ్ పై జీఎస్టీ వేయడం దారుణం. కష్టాలు ఉన్నా.. ఏపీలో సీఎం వైఎస్ జగన్ అందరికీ సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. మేం గడప గడప కార్యక్రమం కింద ప్రజల వద్దకు వెళితే.. ధరల తగ్గించేలా పార్లమెంట్లో మాట్లాడాలని అడుగుతున్నారు అని ఎంపీ వంగా గీత పేర్కొన్నారు. -
మహారాష్ట్రలో భారీ వర్షాల వల్లే గోదావరికి వరదలు: ఎంపీ వంగా గీత
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపిన ఫిషింగ్ హార్బర్ల ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వంగా గీత కోరారు. ఈ మేరకు రెండో రోజు పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ఎంపీ వంగా గీత మీడియాతో మాట్లాడారు. జాతీయ రహదారుల నిర్మాణం కోసం ప్రతిపాదనలు కేంద్రానికి పంపామని తెలిపారు. అన్నవరం నుంచి జీఎంఆర్ఎస్ఈజడ్ వరకు ప్రత్యేక రైల్వే లైన్ వేయాలని సూచించారు. విభజన చట్టంలో ఉన్న అంశాలతో పాటు ఇతర అభివృద్దికి కేంద్రం సహకరించాలని కోరారు. మహారాష్ట్రలో భారీ వర్షాల వల్లే గోదావరికి వరదలు వచ్చాయని ఎంపీ పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు పెంచడం వల్ల భద్రాచాలం మునిగిందన్న ఆరోపణల్లో వాస్తవం లేదని, ఇలాంటి వ్యాఖ్యలు సరైనవి కావని అన్నారు. బ్లూ ఎకానమీ దిశగా ఏపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం అధీనంలోనే నడుస్తోందని వైఎస్సార్ సీపీ రాజ్యసభ ఎంపీ అయోధ్య రామిరెడ్డి అన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టని, కేంద్రం నిధులు సమకూరుస్తోందని పేర్కొన్నారు. ఎవరు ఇష్టం వచ్చినట్లు వారు చేయడానికి వీలు లేదని, డిజైన్లలో కరెక్షన్లపై చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. బ్లూ ఎకానమీ దిశగా ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్నారు. రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడు పోర్టుల నిర్మాణమే అత్యంత ముఖ్యమని, జీవనోపాధి పెంచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. రూ. 20వేల కోట్లతో జాతీయ రహదారుల నిర్మాణం చేపడుతుందన్న ఎంపీ.. రాష్ట్ర ప్రభుత్వం 10 వేల కోట్ల ఖర్చుతో రహదారులు వేస్తోందని తెలిపారు. ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు కావాల్సిన అనుమతుల కోసం గట్టి ప్రయత్నం చేస్తున్నాంమని, ఇప్పటికే మూడు మెడికల్ కాలేజీలకు అనుమతులు వచ్చాయని పేర్కొన్నారు. రామాయపట్నం పోర్ట్ శంకుస్థాపన రామాయపట్నం పోర్ట్ పనులకు బుధవారం శంకుస్థాపన చేయనున్నట్లు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఢిల్లీలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులతో ఈ పోర్ట్ నిర్మిస్తోందన్నారు. రామాయపట్నం పోర్టును కేంద్రమే నిర్మించాలని కోరినట్లు గుర్తు చేశారు. అయిదు వేల కోట్ల రూపాయలతో పోర్ట్ నిర్మాణం జరగనుందన్నారు. ఇప్పటికే పర్యావరణ అనుమతులు కూడా వచ్చాయని, దీని వల్ల నెల్లూరు జిల్లా పరిసర ప్రాంతాల అభివృద్ధి జరుగుతందని ఆశాభావం వ్యక్తం చేశారు. మచిలీపట్నం పోర్ట్ కూడా త్వరలో వచ్చే అవకాశం ఉందని తెలిపారు. -
చిన్న స్టేషన్లలో ఆగనున్న ఫాస్ట్ ప్యాసింజర్ రైళ్లు
కాకినాడ: ఫాస్ట్ ప్యాసింజర్ రైళ్లు చిన్న స్టేషన్లలో కూడా నిలుపుదల చేయాలంటూ కాకినాడ ఎంపీ వంగా గీత చేసిన కృషి ఎట్టకేలకు ఫలించింది. కరోనా సమయంలో ఫాస్ట్ ప్యాసింజర్ రైళ్లు రద్దు చేసి వాటిని ఎక్స్ప్రెస్ రైళ్లుగా మార్పుచేయడంతో చిన్న స్టేషన్లలో రైళ్ల నిలుపుదల నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను ఎంపీ వంగా గీత రైల్వే మంత్రి, రైల్వేబోర్డు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. కరోనా తీవ్రత తగ్గినప్పటికీ ప్యాసింజర్ రైళ్లు పునరుద్ధరించకపోవడం వల్ల రైతులు, ఉద్యోగస్తులు, విద్యార్థులు, చిరువ్యాపారులు, సాధారణ పేద, మధ్య తరగతి ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను ఆమె కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఆమె చేసిన కృషి నేపథ్యంలో ఇప్పటికే తిమ్మాపురం, హంసవరం, రావికంపాడు, రైల్వే స్టేషన్లలో ఫాస్ట్ ప్యాసింజర్ రైళ్లను నిలుపుదల చేసేందుకు రైల్వేశాఖ ఆమోదం తెలిపింది. కాకినాడ–విశాఖ, విశాఖ–కాకినాడ మధ్య శుక్రవారం నుంచి ఈ మూడు స్టేషన్లలో రైలు ఆగనుంది. ప్రయాణికుల సౌలభ్యం కోసం తన విజ్ఞప్తితో రాష్ట్రంలోని ప్యాసింజర్ రైళ్లు పునరుద్ధరణతోపాటు చిన్న స్టేషన్లలో రైళ్ల నిలుపుదల విషయంలో సానుకూలంగా నిర్ణయం తీసుకున్న రైల్వే అధికారులకు ఎంపీ వంగా గీత కృతజ్ఞతలు తెలిపారు. ఇది చదవండి: అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలన్న ఆలోచనే బాబుకు లేదు: సీఎం జగన్ -
ఉపాధి నిధులు విడుదల చేయండి.. కేంద్రానికి ఎంపీ వంగా గీత విజ్ఞప్తి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన ఉపాధి హామీ పథకం నిధులను వెంటనే విడుదల చేయాలని లోక్సభలో వైఎస్సార్సీపీ ఎంపీ వంగా గీత కేంద్రాన్ని కోరారు. కేంద్రం కూలి పనిదినాలు పెంచినందుకు ధన్యవాదాలు తెలిపారు. 1,18,626 లక్షల పనిదినాల సంబంధించిన 4,97,650 లక్షల రూపాయలు విడుదల చేయాలని విజ్క్షప్తి చేశారు. -
పోలవరం ప్రాజెక్టుకు కేంద్రమే అడ్డంకులు సృష్టిస్తోంది..
సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించినప్పటికీ దానిని పూర్తి చేసే బాధ్యత విషయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతోందని వైఎస్సార్సీపీ ఎంపీలు విమర్శించారు. ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయాల్సిన కేంద్రం.. అనేక కొర్రీలు పెడుతూ అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోందన్నారు. ఏపీ భవన్లో గురువారం ఎంపీలు పిల్లి సుభాష్చంద్రబోస్, వంగా గీత, చింతా అనురాధ, బీశెట్టి సత్యవతిలు మీడియాతో మాట్లాడారు. బోస్ మాట్లాడుతూ ‘పోలవరం ప్రాజెక్టు రూ.55,656 కోట్ల సవరించిన అంచనాలకు ఫైనాన్స్ కమిటీ, సీడబ్ల్యూసీ టెక్నికల్ కమిటీలు ఆమోదించినా కేంద్రం ఆమోదించడం లేదు. దీనిపై పలుమార్లు ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాలను కలిసి విన్నవించినా పెండింగ్లోనే పెట్టారు. ప్రాజెక్టులో విద్యుదుత్పత్తి పనులకు సంబంధించి రూ.4 వేల కోట్ల వ్యయాన్ని తగ్గించారు. తాగునీటికి సంబంధించిన కాంపోనెంట్ను విడదీసి చూస్తున్నారు. ప్రాజెక్టు ప్రధాన కార్యాలయాన్ని ఏపీకి మార్చాలని కోరుతున్నా ఆదేశాలివ్వడం లేదు. ఆర్ అండ్ ఆర్ విషయంలో గిరిజనులకు పునరావాస కల్పనలో తీవ్ర జాప్యం చేస్తున్నారు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పాటే ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని పూర్తిగా విస్మరిస్తున్నారని, పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీనే తుంగలో తొక్కేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టును గత ప్రభుత్వాలు రాజకీయ అవసరాలకు వాడుకుంటే.. వైఎస్ జగన్ ప్రభుత్వం మాత్రం చిత్తశుద్ధితో పూర్తి చేస్తోందని, దీనికి కేంద్రం సహకరించాలని గీత విజ్ఞప్తి చేశారు. సత్యవతి మాట్లాడుతూ దక్షిణ కోస్తా రైల్వే జోన్కు సంబంధించి ఓ ప్రత్యేకాధికారిని నియమించారని, డీపీఆర్ను రూపొందించి కేంద్రానికి సైతం పంపారని, అపోహలు వద్దన్నారు. -
ఉన్నత న్యాయవ్యవస్థలో మహిళా ప్రాతినిధ్యం పెంచాలి
సాక్షి, న్యూఢిల్లీ: ఉన్నత న్యాయవ్యవస్థలో మహిళా ప్రాతినిధ్యం పెరగాల్సిన అవసరం ఉందని వైఎస్సార్సీపీ ఎంపీ వంగా గీత చెప్పారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో కేవలం 9 శాతం అంటే నలుగురు, హైకోర్టుల్లో 11 శాతం అంటే 81 మంది మహిళా న్యాయమూర్తులే ఉన్నారని తెలిపారు. జనాభాలో 50 శాతం ఉన్న మహిళలకు న్యాయవ్యవస్థలోనూ సమాన ప్రాతినిధ్యం కల్పించాలని ఆమె కేంద్రాన్ని కోరారు. హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల (జీతాలు, సేవా నిబంధనలు) సవరణ బిల్లుపై లోక్సభలో మంగళవారం జరిగిన చర్చలో ఆమె మాట్లాడారు. న్యాయవ్యవస్థలో 1950 నుంచి 1990 వరకు ఎస్సీ, ఎస్టీ న్యాయమూర్తుల సంఖ్య 10 శాతం దాటలేదన్నారు. సుప్రీంకోర్టు ఏర్పడిన నాటినుంచి కేవలం ఐదుగురు ఎస్సీలు, ఒక్క ఎస్టీ న్యాయమూర్తి మాత్రమే ఉన్నారని చెప్పారు. హైకోర్టుల్లోనూ 850 మందికిగాను కేవలం 24 మంది మాత్రమే ఎస్సీ, ఎస్టీలు ఉన్నారని నివేదికలు చెబుతున్నాయన్నారు. సరైన రిజర్వేషన్ విధానం ద్వారా అందరికీ సమన్యాయం జరిగేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు. ‘న్యాయవ్యవస్థ నియామకాలపై కొందరిదే గుత్తాధిపత్యం నడుస్తోంది. హైకోర్టు న్యాయమూర్తుల్లో 50 శాతం, సుప్రీంకోర్టులో 33 శాతం న్యాయమూర్తులు న్యాయవ్యవస్థలోని ఉన్నత స్థాయిల్లోని వారి కుటుంబ సభ్యులని సూచించే నివేదికలున్నాయి. ఈ దృష్ట్యా కొలీజియం వ్యవస్థను నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ వంటి వ్యవస్థతో భర్తీచేయాల్సిన అవసరం ఉంది. దీనిద్వారా న్యాయమూర్తుల ఎంపిక ప్రక్రియలో మరింత పారదర్శకత వస్తుంది. దీంతోపాటే దేశం నలుమూలలా నాలుగు సుప్రీంకోర్టు శాశ్వత ప్రాంతీయ బెంచ్లను ఏర్పాటు చేసే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలి..’ అని ఆమె పేర్కొన్నారు. -
ఉక్కు పోరాటం
-
పోలవరం నిధులొచ్చే వరకూ పోరాటం
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం నుంచి పోలవరం నిధులొచ్చే వరకూ పార్లమెంట్లో పోరాటం కొనసాగిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు స్పష్టంచేశారు. ఏడేళ్లుగా పోలవరం నిరాదరణకు గురైందని వారు ఆవేదన వ్యక్తంచేశారు. పార్టీ ఎంపీలు బెల్లాన చంద్రశేఖర్, వంగా గీత, పోచ బ్రహ్మానందరెడ్డి, గురుమూర్తి సోమవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. బెల్లాన మాట్లాడుతూ.. ప్రధాని, జలశక్తి మంత్రులకు సీఎం జగన్మోహన్రెడ్డి ఎన్నిసార్లు నిధుల కోసం విన్నవించినా కేంద్రం మాత్రం నిధులు విడుదల చేయడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తన నిధుల నుంచి వేల కోట్లు ఖర్చుపెడుతోందన్నారు. అలాగే, సవరించిన అంచనా మేరకు పునరావాసం, పరిహారం నిమిత్తం రూ.33వేల కోట్లు రావాల్సి ఉందన్నారు. రాష్ట్రం ఖర్చుచేసిన రూ.2వేల కోట్లకు పైగా కూడా విడుదల చేయలేదన్నారు. గతంలో చంద్రబాబు 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకొంటూ రైతుల ప్రయోజనాలు విస్మరించారని ఆరోపించారు. టీడీపీ ముగ్గురు ఎంపీలు వైఎస్సార్సీపీని విమర్శించడం తప్ప ఏ రోజూ కూడా బీజేపీని ప్రశ్నించడం లేదన్నారు. సీఎం జగన్మోహన్రెడ్డి సూచనల మేరకు పోలవరం నిధుల కోసం సభలో ఆందోళన చేస్తామన్నారు. కేంద్రం సకాలంలో విడుదల చేస్తే ప్రాజెక్టు వచ్చే ఏడాది ఖరీఫ్ నాటికి పూర్తవుతుందని బెల్లాన చంద్రశేఖర్ తెలిపారు. సవరించిన అంచనాలపై తాత్సారం ఎంపీ వంగా గీత మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి ఎంతో ముఖ్యమైందని తెలిపారు. ఏపీ విభజన సమయంలో జాతీయ ప్రాజెక్టుగా పోలవరాన్ని ప్రకటించినప్పటికీ ఆ తర్వాత తగిన శ్రద్ధ లేకపోవడంవల్ల ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగాయన్నారు. సాంకేతిక కమిటీ ఆమోదించినా సవరించిన అంచనాలపై కేంద్రం ముందుకెళ్లడం లేదన్నారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)ని హైదరాబాద్ నుంచి రాజమండ్రికి తరలించాలన్నారు. కార్యాలయం తరలించడానికే ఇంతకాలం పడుతోందంటే ప్రాజెక్టుపై కేంద్రానికున్న చిత్తశుద్ధి అర్ధంచేసుకోవచ్చన్నారు. ప్రాజెక్టుకు తగిన నిధులు వెంటనే కేటాయించాలని ఆమె డిమాండు చేశారు. ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ.. నిధులిచ్చే వరకూ తమ పార్టీ నిరసన కొనసాగుతుందని స్పష్టంచేశారు. నిధులు, విభజన హామీలపై సభలో రోజూ పోరాడతామని ఆయన తెలిపారు. -
పోలవరానికి ఇవ్వవలసిన నిధులు కేంద్రం వెంటనే విడుదల చేయాలి : వంగా గీతా
-
రైతులకు ఉపయోగపడే విధంగా సీఎం నిర్ణయం
సాక్షి, విశాఖపట్నం: తాండవ షుగర్ ఫ్యాక్టరీలో మంగళవారం మంత్రులబృందం రైతులతో సమావేశమయ్యింది. తాండవ షుగర్ ఫ్యాక్టరీపై రైతుల అభిప్రాయాలను మంత్రుల బృందం అడిగి తెలుసుకుంది. అనంతరం మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ, ‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతుల పక్షపాతి. సీఎం జగన్ చంద్రబాబులాగా ఎన్నికల కోసం పనిచేయరు. షుగర్ పరిశ్రమల్లో స్థితిగతులు ప్రత్యక్షంగా తెలుసుకోమని సీఎం కమిటీ వేశారు. రైతులకు నష్టం చేయడం కోసం కమిటీ వేయలేదు. మీరు చెప్పిన అభిప్రాయాలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం. అందరికి మేలు జరిగే నిర్ణయం సీఎం జగన్ తీసుకుంటారు’ అని వెల్లడించారు. అనంతరం పరిశ్రమల శాఖ మంత్రి గౌతం రెడ్డి మాట్లాడుతూ, ‘ రాష్ట్రంలో 12 షుగర్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. రైతులకు ఉపయోగపడే విధంగా నిర్ణయం తీసుకోమని సీఎం చెప్పారు. రైతులకు సీఎం జగన్ మేలు చేస్తారు. రైతులకు మేలు జరగాలన్నదే సీఎం జగన్ ఉద్దేశం’ అని తెలిపారు. వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు మాట్లాడుతూ, ‘నాన్న ఒక అడుగు ముందుకు వేస్తే నేను రెండు అడుగులు ముందుకు వేస్తానని సీఎం జగన్ చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో రైతులకు అన్యాయం జరిగింది. రైతులకు మంచే జరుగుతుంది. మీ అభిప్రాయాలను సీఎం జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తాం’ అని పేర్కొన్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, ‘వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్ మోహన్ రెడ్డి ఉన్నపుడు రైతులకు మేలు జరిగింది. రైతులకు సీఎం జగన్ ఏం చేశారో, చంద్రబాబు ఏం చేశారో అందరికి తెలుసు. రైతుల అభిప్రాయాలన్నింటిని సీఎం దృష్టికి తీసుకువెళ్తాం. రైతులకు మేలు చేయాలన్నదే సీఎం జనగ్ ఆలోచన. టీడీపీ హయాంలో చెరుకు రైతులకు బకాయి ఉన్న రూ.54 కోట్లును సీఎం జగన్ విడుదల చేశారు’ అని చెప్పారు. ఎంపీ వంగ గీత మాట్లాడుతూ, ‘ షుగర్ పరిశ్రమల స్థితిగతులు తెలుసుకోవాలని సీఎం కమిటీ వేశారు. నష్టం వస్తే ఎలా ముందుకు తీసుకువెళ్లాలనే దానిపై కమిటి చర్చిస్తోంది. చరిత్రలో ఎన్నడూలేని విధంగా చెరుకు రైతులకు బకాయిలు చెల్లించారు. రైతులకు మేలు జరగేలా మంత్రుల కమిటీ నిర్ణయం ఉంటుంది’ అని అన్నారు. చదవండి: ప్రధాని మోదీతో ముగిసిన సీఎం జగన్ భేటీ -
ఎంపీ వంగా గీతకు కరోనా పాజిటివ్
సాక్షి, తూర్పుగోదావరి : కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు వంగా గీతకు కరోనా పాజిటివ్గా తేలింది. శుక్రవారం నుంచి కోవిడ్ లక్షణాలు కనిపించడంతో కాకినాడ జీజీహెచ్లో పరీక్షలు చేయించుకున్నారు. ఈ క్రమంలోనే శనివారం నాటి ఫలితాల్లో కోవిడ్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. స్వల్ప లక్షణాలే ఉండటంతో వైద్యుల సూచనల మేరకు హోం ఐసోలేషన్కి వెళ్లారు. కాగా ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన ప్రతీ కార్యక్రమంలోనూ ఎంపీ గీతా పాల్గొంటున్నారు. కోవిడ్ ఆస్పత్రుల సందర్శనతో పాటు నియోజకవర్గంలోనూ పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే వైరస్ సోకినట్లు వైద్యులు భావిస్తున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా నిర్ధారణ పరీక్షలను ప్రభుత్వం పెద్ద ఎత్తున నిర్వహిస్తోంది. (ఏపీలో కొత్తగా 9,901 పాజిటివ్ కేసులు) -
వారికి కూడా కాపునేస్తం తరహా పథకం
సాక్షి, తూర్పుగోదావరి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ‘వైఎస్ఆర్ కాపు నేస్తం’ ద్వారా కాపులకు ఆర్థిక సహయం అందజేయడం ఆనందకరమని ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. బుధవారం ఆయన ఎంపీ వంగా గీతతో కలిసి కాకినాడలో మీడియాతో మాట్లాడారు. ‘కాపు సోదరీమణులు ఇళ్ళు దాటి బయట ఎటువంటి పనులకు వెళ్ళరు. ఇది అనాదిగా వస్తున్న సాంప్రదాయం . ప్రస్తుత పరిస్ధితుల వల్ల వారు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఒక భరోసా ఇవ్వాలని సీఎం జగన్ ముందు చూపుతో చేసిన నిర్ణయానికి ధన్యవాదాలు. వచ్చే నెలలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరీమణులకు కూడా ఇటువంటి పథకం అమలు అవుతుంది. ఇప్పటికే కేబినెట్ తీర్మానం కూడా అయిపోయింది. త్వరలోనే ఈ పథకం ప్రారంభించే తేది ఖరారు అవుతుంది. దేశంలోనే బడుగు, బలహీన, గిరిజన, మైనార్టీలకు సంబంధించిన ఒక గొప్ప పధకాన్ని సీఎం జగన్ అమలు చేయబోతున్నారు’ అని అన్నారు. (కరోనా వైద్య పరీక్షల్లో ఏపీ మరో రికార్డ్ ) కాకినాడ ఎంపీ వంగా గీతా మాట్లాడుతూ...‘కాపు కుటుంబాల తరపున సీఎం జగన్కు ధన్యవాదాలు. ఆర్ధిక ఇబ్బందులు, కరోనా కష్టాలు ఉన్నప్పటికీ ఏ ఒక్క పథకాన్ని ఆపకుండా సీఎం జగన్ అమలు చేస్తున్నారు. గత ప్రభుత్వాలు అర్హత ఉన్న లబ్ధిదారులను తగ్గించేందుకు ప్రయత్నించేవి. కానీ సీఎం జగన్ పాలనలో అర్హులందరికి సంక్షేమ పథకాలు అమలు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. కాపు, తెలగ, ఒంటరి కులాల్లో మహిళలకు మానిటరీ బెనిఫిట్ అందించడంతో పాటుగా అదనంగా అమ్మ ఒడి, వసతి దీవెన, విద్యా దీవెన, రైతు భరోసా పథకాల ద్వారా సహాయం చేస్తున్నారు. మహిళలకు అందించే ప్రతి రూపాయి కూడా తమ కుటుంబ సంక్షేమానికే ఖర్చు పెడతారు’ అని ఆమె అన్నారు. ('వైఎస్సార్ కాపు నేస్తం' ప్రారంభం) -
'సీఎం జగన్ మంచి విజన్ ఉన్న నాయకుడు'
సాక్షి, కాకినాడ: దేశంలో ప్రధాని మోదీ, ఏపీలో సీఎం వైఎస్ జగన్ కరోనా నియంత్రణ కోసం తీసుకుంటున్న చర్యల వల్లే మనం క్షేమంగా ఉంటున్నామని కాకినాడ ఎంపీ వంగా గీత అన్నారు. కరోనా వ్యాధి ఫేజ్-5 ఫీవర్ సర్వేలెన్స్ పోస్టర్ ఆవిష్కరణలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కలెక్టర్ మురళీధర్ రెడ్డితో కలిసి ఎంపీ గీత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కరోనా నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేయవలసిన దానికంటే చాలా ఎక్కువ ఏర్పాట్లు చేసింది. క్వారంటైన్ సెంటర్ ఏర్పాట్ల నుంచి కరోనా నిర్ధారణ పరీక్షల వరకు దేశంలో ఏపీ ప్రభుత్వం ఆదర్శంగా ఉండేలా సీఎం జగన్ పనిచేశారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. అనుమానాలు ఉంటే స్వచ్ఛందంగా వచ్చి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. చదవండి: ప్రభుత్వం మా పల్లెకొచ్చింది కార్యక్రమంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి మాట్లాడుతూ.. జిల్లాలో కరోనా నియంత్రణ కోసం అధికారులు శ్రమ, ప్రజల సహకారం ప్రశంసనీయం. కరోనా నియంత్రణ కోసం సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను కొందరు హేళన చేశారు. అయితే ఇప్పుడు సీఎంజగన్ చేసిన సూచనలను దేశం మొత్తం అనుసరిస్తోంది. సీఎం జగన్ మంచి విజన్ ఉన్న నాయకుడు అంటూ ఎమ్మెల్యే చంద్రశేఖర్రెడ్డి పేర్కొన్నారు. కరోనా లక్షణాలు కలిగిన వ్యక్తులు స్వచ్చందంగా ముందుకు వచ్చి పరీక్షలు చేయించుకోవాలని కలెక్టర్ మురళీధర్ రెడ్డి ప్రజలకు సూచించారు. పాజిటివ్ వస్తే కారంటైన్, ఐసోలేషన్లో ఉండాలి అనే అపోహలను విడనాడాలి. సదుపాయాలు ఉంటే ఇంట్లోనే ఉండి కరోనా చికిత్సను పొందవచ్చు. జి. మామిడాడలో కరోనా పాజిటివ్ వచ్చిన ఓ వ్యక్తి చేసిన నిర్లక్ష్యం వల్ల అక్కడ 50కి పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఐదోసారి ఇంటింటికీ సర్వే కోసం వస్తున్న వాలంటీర్లకు ప్రజలు సహకరించాలని కలెక్టర్ కోరారు. చదవండి: ఏపీలో మరో 48 కరోనా కేసులు.. -
పండ్లను ప్రజలకు చౌకగా అందిస్తాం
-
రూ.100కే అయిదు రకాల పండ్లు..
సాక్షి, తూర్పుగోదావరి : ఉద్యానవన శాఖ, మెప్మా ద్వారా పండ్లను కిట్ల రూపంలో ప్రజలకు చౌకగా అందిస్తామని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. కాకినాడలో మంగళవారం రూ. 100లకే అయిదు రకాల పండ్లను డోర్ డెలీవరి సదుపాయాన్ని మంత్రి కన్నబాబు, ఎంపీ వంగా గీత ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఉద్యానవన రైతులకు మేలు జరిగేలా.. వినియోగదారులకు చౌకగా పండ్లు అందించేలా కిట్ల రూపంలో డోర్ డెలీవరీ చేస్తున్నామని తెలిపారు. (విషమంగా కిమ్ జోంగ్ ఆరోగ్యం..! ) ముందుగా రాజమండ్రి, కాకినాడ, అమలాపురంలో వీటిని ప్రారంభించి త్వరలోనే అన్ని ప్రాంతాలకు విస్తరిస్తామన్నారు. మామిడి పండ్ల సీజన్ మొదలైన నేపథ్యంలో మామిడి రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. విశాఖ నుంచి ఇతర రాష్ట్రాలకు140 టన్నులు, తిరుపతి నుంచి 1.2 టన్నుల మామిడి పండ్లను విదేశాలకు ఎగుమతి చేశామని తెలిపారు. కరోనా వంటి ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతులను ఆదుకునేలా చర్యలు తీసుకుంటున్నారని ఎంపీ వంగా గీత అన్నారు. ధరలు పెరగకుండా వినియోగదారులను ఆదుకుంటున్నారని తెలిపారు. రూ. 100లకే అయిదు రకాల పండ్లు సదుపాయాన్ని ప్రజలందరు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. (కరోనా: బెజవాడంతా రెడ్జోన్ ) -
చిల్లర రాజకీయాలు చేయకు ‘బాబూ’
సాక్షి, తుని: రాష్ట్రం విపత్కర పరిస్థితుల్లో ఉంటే సహాయం చేయకపోగా చంద్రబాబు రాజకీయాలు చేయడం దురదృష్టకరమని ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా అన్నారు. శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా తునిలో ఎంపీ గీతతో కలిసి రాజా విలేకర్లతో మాట్లాడారు. హైదరాబాద్లో ఉన్న చంద్రబాబు తన అనుంగులైన యనమల రామకృష్ణుడు, చింతకాయల అయ్యన్నపాత్రుడులతో కలిసి కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. విశాఖ మెడిటెక్ జోన్ గురించి మాట్లాడడానికి వారికి అర్హత లేదన్నారు. కాకినాడ సెజ్ను యనమల సోదరులు సొంత అవసరాలకు వాడుకున్నారని ధ్వజమెత్తారు. విశాఖలో వెంటిలేటర్లు, కరోనా పరీక్ష కిట్లు, కాకినాడ సెజ్లో పీపీఈలు తయారు చేయించి సీఎం జగన్మోహన్రెడ్డి దేశానికి ఆదర్శంగా నిలిచారన్నారు. మా సలహాలు తీసుకొండని చంద్రబాబు అంటున్నారని, వెన్నుపోటూ, ప్రజలను మోసగించడం, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోని నెట్టడం దేనిని తీసుకోవాలో చెప్పాలని రాజా ప్రశ్నించారు. నిజంగా ప్రజల కోసమైతే అమరావతి వచ్చి సేవలందించాలని డిమాండ్ చేశారు. లాక్డౌన్ అమలులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సఫలీకృతమయ్యాయని ఎంపీ గీత అన్నారు. ప్రజలు ఇళ్లలోనే ఉండి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కోసం సహకరించాలని కోరారు. ఏఎంసీ చైర్మన్ కొయ్యా మురళి, ఏలూరి బాలు పాల్గొన్నారు. చదవండి: నిర్లక్ష్యమే ముంచుతోంది..! -
మహిళలకు మాస్కులు లేకపోవడంతో
-
మహిళకు చీరకొంగుతో మాస్క్ కట్టిన ఎంపీ
సాక్షి, తూర్పు గోదావరి : కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కఠిన చర్యలను చేపడుతోంది. దీనిలో భాగంగానే ప్రజాప్రతినిధులంతా ప్రజలకు వైరస్పై అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. సీఎం ఆదేశాలతో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు రంగంలోకి దిగారు. మాస్కులు పంపిణీ చేస్తూ, లాక్డౌన్లో అమలవుతున్న చర్యలను సమీక్షిస్తున్నారు. సోమవారం కాకినాడ ఎంపీ వంగ గీత సామర్లకోట కూరగాయల మార్కెట్ను సందర్శించారు. మార్కెట్కు వచ్చిన మహిళలకు మాస్కులు లేకపోవడంతో మహిళల చీరలతో ఆమె స్వయంగా మాస్కు కట్టారు. (ఏపీలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు) బయటకు వచ్చేయుందు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ఎంపీ సూచించారు. అలాగే మార్కెట్లోని కూరగాయల వ్యాపారస్తులకు, కొనుగోలుదారులకు కరోనా వైరస్ వ్యాప్తిపై ఎంపీ గీత అవగాహన కల్పించారు. ప్రజలంతా లాక్డౌన్ను తప్పనిసరిగా పాటించాలని కోరారు. వైరస్ వ్యాప్తి నియంత్రణకు సామాజిక దూరం పాటించాలని సూచించారు. కాగా ఎంపీ వెంట వైఎస్సార్సీపీ కోఆర్డినేటర్ దవులూరి దొరబాబు, ఇతర ప్రజాప్రతినిధుతు, అధికారులు ఉన్నారు. -
విదేశాల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి కానీ..
చేతికి అందివచ్చిన కుమారుడు విదేశాల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడన్న ఆనందం.. ఆ కుటుంబానికి ఎంతోకాలం నిలవలేదు. పట్టుమని ఆరు నెలలు గడవకముందే అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించాడన్న సమాచారం అతడి తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది. కరోనా వైరస్ ఎఫెక్ట్తో అతడి మృతదేహాన్ని కడసారి చూడలేని దుర్భర పరిస్థితిలో వారు ఉన్నారు. వారిని ఓదార్చడం సన్నిహితులు, కుటుంబ సభ్యుల వల్ల కావడం లేదు. ఆ యువకుడి మృతి.. అతడిలో తీవ్ర విషాదాన్ని తెచ్చింది. సాక్షి, కాకినాడ: స్థానిక శ్రీరామ్నగర్కు చెందిన చంద్రశేఖర్, మంగతాయార్ల కుమారుడు పీసపాటి కృష్ణ చైతన్య (35) సుమారు ఆరు నెలల క్రితం స్వీడన్ వెళ్లారు. అక్కడ క్యాప్ జెమినీ కంపెనీలో ఉద్యోగంలో చేరారు. ఇంకా వివాహం కూడా కాని కృష్ణచైతన్య ఇప్పుడిప్పుడే జీవితంలో స్థిరపడుతున్నాడు. నాలుగు రోజుల క్రితం ఆ కుటుంబానికి పిడుగు లాంటి వార్త చేరింది. స్వీడన్లో అతడు విధి నిర్వహణలో గుండెనొప్పితో కుప్పకూలిపోయాడని, తోటి ఉద్యోగులు ఆస్పత్రిలో చేర్చినా ప్రయోజనం లేకపోయింది. ఆస్పత్రికి వెళ్లిన కొద్దిసేపటికే అతడు మరణించినట్టు స్వీడన్లో వైద్యులు ధ్రువీకరించారు. మృతదేహం కోసం.. కరోనా ప్రభావంతో కృష్ణచైతన్య మృతదేహం ఇక్కడికి చేర్చేందుకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కరోనా ప్రభావం వల్ల ఇరుదేశాల మధ్య అంతర్జాతీయ విమానాల రాకపోకలు ఈ నెల 29వ తేదీ వరకు రద్దు కావడంతో సమస్య జఠిలమైంది. అందరూ ఉండి ఎవరూ లేని అనాథలా కుమారుడి మృతదేహం స్వీడన్లో నిలిచిపోవడం ఆ కుటుంబానికి చెప్పలేనంత విషాదాన్ని నింపింది. అక్కడి కంపెనీ అధికారులు, ఇతర వర్గాలతో చర్చించినా ప్రయోజనం లేకపోయింది. స్పందించిన ఎంపీ, ఎమ్మెల్యేలు ఈ విషయం తెలుసుకున్న కాకినాడ ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి చొరవ తీసుకున్నారు. లోక్సభ పక్ష నేత వి.విజయసాయిరెడ్డి ద్వారా కేంద్ర విదేశాంగశాఖ మంత్రి, స్వీడన్లోని ఎంబసీ అధికారులతో చర్చించారు. మృతదేహాన్ని ఎలాగైనా స్వదేశానికి రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. అవసరమైతే ప్రత్యేక విమానం ద్వారా మృతదేహాన్ని తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్నందున వీరి కృషికి కూడా ప్రతిబంధకం ఏర్పడింది. ఈ నెల 29వ తేదీ వరకు విమానయానానికి అంక్షలు ఉన్నందున ఆ తరువాత కూడా కొనసాగితే పరిస్థితి ఏమిటని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా ఈ నెల 30వ తేదీ దాటితే ఆ మృతదేహాన్ని స్థానికంగా ఉండే ఓ మత సంస్థకు అప్పగిస్తారనే సమాచారంతో వారిని మరింత ఆవేదనకు గురిచేస్తోంది. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని తమ కుమారుడిని కడసారైనా చూసే అవకాశం కల్పించాలంటూ మృతుడి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఓదార్చిన ఎంపీ, ఎమ్మెల్యేలు ఆండాళ్లమ్మ కళాశాలలో లెక్చరర్గా పదవీ విరమణ చేసిన కృష్ణచైతన్య తల్లిదండ్రులు చంద్రశేఖర్, మంగతాయారులను కాకినాడ ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి శనివారం పరామర్శించారు. శ్రీరామ్నగర్లోని వారి ఇంటికి వెళ్లి కేంద్రం, ఎంబసీ అధికారులతో చర్చిస్తున్న విషయాన్ని వారికి చెప్పారు. మృతదేహాన్ని రప్పించేందుకు చేస్తున్న ప్రయత్నాలను వివరించారు. ప్రభుత్వపరంగా అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నామని, ఆందోళన చెందవద్దని వారిని ఓదార్చారు. పెద్ద సంఖ్యలో బంధువులు, సన్నిహితులు మృతుని ఇంటికి చేరుకుంటున్న నేపథ్యంలో, వారి ఆవేదన వర్ణనాతీతంగా ఉంది. ప్రభుత్వం తీసుకునే చొరవ వల్ల మృతదేహం కొంత జాప్యమైనా స్వదేశానికి వస్తుందన్న విశ్వాసాన్ని మృతుడి మేనమామ బ్రహ్మయ్య శాస్త్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు దంపతులు ఆ కుటుంబాన్ని ఓదార్చారు. -
‘కృష్ణ చైతన్య మృతదేహాన్ని భారత్కు తీసుకొస్తాం’
సాక్షి, తూర్పుగోదావరి : కాకినాడకు చెందిన కృష్ణ చైతన్య స్వీడన్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా విధులు నిర్వర్తిస్తూ.. నాలుగు రోజుల క్రితం గుండె పోటుతో చనిపోయాడు. కరోనా ప్రభావంతో అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు చేయడంతో కృష్ణ చైతన్య మృతదేహం స్వీడన్లోనే ఉండిపోయింది. ఈ నేపథ్యంలో విశాఖ ఎంపీ వంగా గీతా, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి.. శ్రీరామ్ నగర్లో నివాసం ఉంటున్న కృష్ణ చైతన్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎంపీ విజయసాయి రెడ్డి సహకారంలో విదేశాంగ మంత్రి, భారత ఎంబసీతో మాట్లాడి కృష్ణ చైతన్య మృతదేహాన్ని భారత్కు తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తామని వంగా గీతా భరోసానిచ్చారు. (జనతా కర్ఫ్యూకు యంగ్ టైగర్ సైతం.. ) -
ఎంపీ గీత చొరవతో సౌదీ నుంచి సొంతింటికి
సాక్షి, కాకినాడ: కుటుంబపోషణ కోసం దేశంకాని దేశం వెళ్లి నరకయాతన అనుభవించాడు. బాధ చెప్పుకునే దిక్కులేక ఇబ్బందుల నుంచి బయటపడే దారిలేక నరకాన్ని చవిచూశాడు. కనీసం కుటుంబ సభ్యులతో కూడా సంబంధాలు తెగిపోవడంతో అతను అనుభవించిన నరకం అంతా, ఇంతా కాదు. అలాంటి కుటుంబానికి కాకినాడ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్ తీసుకున్న చొరవ ఊరటనిచ్చింది. వివరాల్లోకి వెళ్తే తుని నియోజకవర్గం తొండంగి మండలం ఏవీ నగరానికి చెందిన దిమ్మల ధారకొండ ఉద్యోగం కోసం పాతికేళ్ల క్రితం సౌదీ అరేబియా వెళ్లాడు. కొన్నేళ్ల పాటు ఉద్యోగం సాఫీగానే సాగినా ఐదేళ్లుగా జీతం అందక, పోషణ కూడా భారం కావడంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. జీతం కోసం యజమానితో గొడవ పడడం అతనిని మరింత ఇబ్బందుల్లోకి నెట్టేసింది. చివరకు యజమాని ఫిర్యాదుతో పోలీసు కేసులో ఇరుక్కుని సౌదీలోనే బందీగా మారాడు. కనీసం కుటుంబ సభ్యులతో మాట్లాడే అవకాశం కూడా లేకపోయింది. ఎక్కడ ఉన్నారో? ఎలా ఉన్నారో? తెలియని పరిస్థితుల్లో ‘ధారకొండ’ కోసం ఆయన కుటుంబ సభ్యులు ఎంపీ వంగా గీతను కలిశారు. ఆమె కేంద్ర విదేశాంగశాఖ మంత్రి జయశంకర్ ద్వారా సౌదీలోని ఎంబసీ అధికారులతో పలుసార్లు సంప్రదింపులు జరిపారు. ఎంపీ కృషికి ఫలితం దక్కి కొద్దిరోజుల క్రితమే ధారకొండ స్వదేశానికి చేరుకున్నాడు. తీవ్ర అనారోగ్యంతో ఇక్కడకు వచ్చిన అతను చికిత్స చేయించుకున్న అనంతరం కుటుంబంతో సహా మంగళవారం కాకినాడలో ఎంపీ వంగా గీతను ఆమె కార్యాలయంలో కలుసుకున్నారు. ఎంపీ చొరవ తీసుకోకపోయి ఉంటే తమ కుటుంబ పరిస్థితి ఏ విధంగా ఉండేదో అన్నాడు. ఆ కుటుంబం ఎంపీ గీతకు కృతజ్ఞతలు తెలిపింది. ఎంపీ చొరవ వల్లే ధారకొండ స్వస్థలానికి వచ్చారంటూ ఆ కుటుంబం ఎంతో సంబరపడుతూ చెప్పింది. -
ఐఐటీ, ఐఐఎంలలో డ్రాపౌట్లకు కారణాలేంటి?
సాక్షి, న్యూఢిల్లీ: ఐఐటీ, ఐఐఎంలలో డ్రాపవుట్లకు ప్రధాన కారణాలేంటి? ప్రభుత్వం దీని నివారణకు తీసుకుంటున్న చర్యలేంటని వైఎస్సార్సీపీ ఎంపీ వంగా గీతావిశ్వనాథ్ సోమవారం లోక్సభ ప్రశ్నోత్తరాల్లో కేంద్రాన్ని ప్రశ్నించారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి రమేష్ పోఖ్రియాల్ సమాధానమిస్తూ ఒత్తిడి కారణంగా విద్యార్థులు డ్రాపవుట్ అవుతున్నారని చెప్పారు. విద్యార్థులకు కౌన్సెలింగ్ అందించడం వంటివి అమలు చేస్తున్నట్టు తెలిపారు. 5 వేల కోట్లతో జాతీయ రహదారులు ఏపీలో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో సుమారు రూ.15 వేల కోట్ల అంచనా వ్యయంతో 18 జాతీయ రహదారుల ప్రాజెక్ట్ పనులు చేపట్టినట్లు కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సోమవారం రాజ్యసభలో వెల్లడించారు. వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ జాతీయ రహదారుల విస్తరణ, అభివృద్ధితోపాటు మరో రూ.10 వేల కోట్లతో రెండు వరుసల రహదారుల అభివృద్ధి, కనెక్టివిటీ, రోడ్డు ఓవర్బ్రిడ్జ్ల నిర్మాణ పనులకు సంబంధించి 38 ప్రాజెక్ట్లను చేపట్టినట్లు తెలిపారు.వీటిలో విజయవాడ సమీపంలోని గొల్లపూడి నుంచి కృష్ణా నది మీద నిర్మించే వంతెన మీదుగా చినకాకాని వరకు 17.88 కి.మీ. నిర్మించే ఆరు వరుసల బైపాస్ రహదారి ఒకటి. గొల్లపూడి నుంచి చినఅవుటుపల్లి వరకు 30 కి.మీ. మేర నిర్మించే మరో ఆరు వరుసల బైపాస్రోడ్డు. హైబ్రీడ్ యాన్యుటీ ప్రాతిపదికపై చేపట్టే ఈ ఆరు వరుసల బైపాస్ రహదారులు గుండుగొలను–విజయవాడ మధ్య నిర్మించే ఆరు లైన్ల రహదారికి అనుసంధానమవుతాయన్నారు. ‘బీమ్స్’ బీచ్గా రిషికొండ అభివృద్ధి విశాఖలోని రిషికొండ బీచ్కు మహర్దశ పట్టనుంది. దేశంలోని 13 బీచ్లను అంతర్జాతీయ స్థాయి బీచ్లుగా అభివృద్ధి చేసేందుకు కేంద్రం ప్రారంభించిన బీచ్ ఎన్విరాన్మెంట్–ఈస్థటిక్స్ మేనేజ్మెంట్ సర్వీసెస్ (బీమ్స్) ప్రాజెక్ట్లో రిషికొండ బీచ్కు చోటు దక్కినట్లు పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ సోమవారం రాజ్యసభలో వి.విజయసాయిరెడ్డి ప్రశ్నకు జవాబిస్తూ చెప్పారు. నెల్లూరు జిల్లాలో రూ.8,320 కోట్ల విలువైన 12 ప్రాజెక్టులు నెల్లూరు జిల్లాలో సాగరమాల పథకం పరిధిలో రూ.8,320 కోట్ల విలువైన 12 ప్రాజెక్టులను గుర్తించినట్టు కేంద్ర షిప్పింగ్ శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. వైఎస్సార్సీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి అడిగిన ప్రశ్నకు రాజ్యసభలో మంత్రి సమాధానమిచ్చారు. బళ్లారి నుంచి కృష్ణపట్నం జాతీయ రహదారి నిర్మాణంలో ఉందన్నారు. రూ.4.15 లక్షల కోట్ల మేర పన్నులు వివాదాల్లో ఉన్నాయి 2019 డిసెంబర్ 31 నాటికి మొత్తం రూ.4,15,172 కోట్ల సర్వీస్ ట్యాక్స్, సెంట్రల్ ఎక్సైజ్ ట్యాక్స్కు సంబంధించిన వివాదాలు వివిధ న్యాయస్థానాల పరిధిలో ఉన్నాయని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్సింగ్ ఠాకూర్ తెలిపారు. వైఎస్సార్సీపీ లోక్సభాపక్ష నేత పీవీ మిథున్రెడ్డి, ఎంపీలు పోచ బ్రహ్మానందరెడ్డి, బీశెట్టి వెంకటసత్యవతి అడిగిన ప్రశ్నలకు ఆయన రాతపూర్వక సమాధానం ఇచ్చారు. సబ్ కా విశ్వాస్ స్కీమ్ ద్వారా ఫిబ్రవరి 5 నాటికి రూ.24,970 కోట్ల విలువైన 49,534 కేసులు పరిష్కరించినట్టు మంత్రి వివరించారు. ఏపీకి పీఎంజీఎస్వై నిధులు పెంచండి ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన కింద ఏపీకి నిధుల కేటాయింపు పెంచాలని, ప్రస్తుతం ఉన్న 3,285 కి.మీ. మేర రోడ్ల ప్రతిపాదనలను 8 వేల కి.మీ.కు పెంచాలని వైఎస్సార్సీపీ ఎంపీ డాక్టర్ బీవీ సత్యవతి కేంద్రాన్ని కోరారు. అనకాపల్లి నియోజకవర్గ పరిధిలో 121 కి.మీ. ప్రతిపాదనల నుంచి 659 కి.మీ.కు పెంచాలని కోరారు. -
జ్యోతి క్షేమం కోసం అన్ని చర్యలు తీసుకున్నాం
సాక్షి, న్యూఢిల్లీ: చైనాలోని వూహాన్లో చిక్కుకున్న టీసీఎల్ అనుబంధ సంస్థ ట్రైనీ ఉద్యోగి, కర్నూలు జిల్లా వాసి అన్నెం జ్యోతి క్షేమం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు చైనాలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. ఈ మేరకు కేంద్ర విదేశాంగ శాఖకు సమాచారం అందించింది. ఆ వివరాలను కేంద్ర విదేశాంగ శాఖ వైఎస్సార్సీపీ ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డికి మెయిల్ చేసింది. సోమవారం ఉదయం వైఎస్సార్సీపీ ఎంపీలు పోచ బ్రహ్మానందరెడ్డి, గోరంట్ల మాధవ్లతో పాటు జ్యోతి తల్లి ప్రమీలాదేవి, జ్యోతి బంధువులు అమర్నాథ్రెడ్డి, సురేష్రెడ్డి కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ సుబ్రహ్మణ్యం జైశంకర్ను కలిశారు. జ్యోతిని క్షేమంగా ఇంటికి తీసుకురావాలని విన్నవించారు. వెంటనే స్పందించిన విదేశాంగ మంత్రి.. చైనాలోని భారత రాయబార కార్యాలయ అధికారులతో మాట్లాడారు. జ్యోతిని కూడా ఫోన్ ద్వారా సంప్రదించారు. భారత రాయబార కార్యాలయం ఇచ్చిన వివరాలను కేంద్ర విదేశాంగ శాఖ అండర్ సెక్రటరీ ప్రశాంత్ కె సోన సోమవారం సాయంత్రం ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డికి మెయిల్ చేశారు. కుమార్తె కోసం కన్నీటిపర్యంతమైన జ్యోతి తల్లి ప్రమీలాదేవిని ఎంపీ వంగా గీత ఓదార్చారు. -
జీఎస్టీ నిధులు విడుదల చేయాలి
సాక్షి, న్యూఢిల్లీ/కాకినాడ: ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన జీఎస్టీ నిధులను వెంటనే విడుదల చేయాలని తూర్పు గోదావరి జిల్లా కాకినాడ ఎంపీ వంగా గీత కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోమవారం ఆమె లోక్సభలో ఈ అంశంపై మాట్లాడుతూ జీఎస్టీ అమలులో వివిధ రాష్ట్రాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని కేంద్రం దృష్టికి తీసుకొచ్చారు. ‘2017లో జీఎస్టీ అమలు చేసినప్పుడు కేంద్రం రాష్ట్రాలకు నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పింది. కానీ ఇప్పుడు తమ వద్ద ఆర్థిక వనరులు లేవని చెబుతోంది. ఆంధ్రప్రదేశ్కు 2019 అక్టోబర్, నవంబర్లలో రూ.682 కోట్ల మేర ఆదాయం తగ్గింది. కానీ కేంద్రం నష్టపరిహారం ఇవ్వలేదు. డిసెంబరు నుంచి జనవరికి సంబంధించి ఇంకా లెక్కించలేదు. ఏప్రిల్ 2019 నుంచి నవంబరు 2019 వరకు రూ. 2,136 కోట్ల మేర తక్కువ ఆదాయం వచ్చింది. కానీ కేంద్రం పరిహారంగా రూ. 1,454 కోట్లు మాత్రమే ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు ఎస్జీఎస్టీ ఎంత ఇవ్వాల్సి ఉంది? ఈ మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పుడు ఆశించవచ్చు?..’ అని ప్రశ్నించారు. దీనికి ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్సింగ్ ఠాకూర్ సమాధానమిస్తూ ఇప్పటివరకు ఎంత పరిహారం ఇవ్వాల్సి ఉందో అంతా ఇచ్చేస్తామని చెప్పారు. ఎంపీ వంగా గీతావిశ్వనాథ్ మరో ఉప ప్రశ్న సంధిస్తూ ‘జీఎస్టీ నెట్వర్క్ సమస్యలు పరిష్కరించేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు. అలాగే అఖిలభారత బీమా ఉద్యోగుల సంఘం జీవిత బీమా పాలసీ ప్రీమియం నుంచి జీఎస్టీ తొలగించాలన్న డిమాండ్పై కేంద్రం ఎలాంటి చర్య తీసుకుంది..’ అని ప్రశ్నించారు. దీనికి మంత్రి సమాధానమిస్తూ జీవిత బీమా పాలసీల విషయంలో జీఎస్టీ అంశంపై కౌన్సిల్ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. జీఎస్టీ నెట్ వర్క్కు సంబంధించి సభ్యురాలు సూచించిన అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నామని చెప్పారు. ఎంపీ మార్గాని భరత్ ఇదే అంశంపై ప్రశ్నిస్తూ ‘కేంద్ర ప్రభుత్వం సెస్ రూపంలో అనేక పన్నులు వసూలు చేస్తోంది. ఈ పన్నులను రాష్ట్రాలకు పంపిణీ చేస్తోందా లేదా?’ అని ప్రశ్నించారు. దీనికి మంత్రి సమాధానమిస్తూ సెస్ ద్వారా వసూలు చేస్తున్న మొత్తాన్ని రాష్ట్రాలకు పంచుతున్నామని చెప్పారు. వెనబడిన జిల్లాలకు నిధుల కేటాయింపుపై స్పష్టత ఇవ్వని కేంద్రం ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టాన్ని అనుసరించి వెనకబడిన జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక సాయం కింద ఏడు జిల్లాలకు ఏటా రూ. 350 కోట్లు ఇస్తుండగా 2017–18, 2018–19కి ఇవ్వలేదని, 2019–20కి సం బంధించి వాస్తవ స్థితి ఏంటని వైఎస్సార్సీపీ సభ్యుడు వల్లభనేని బాలశౌరి ప్రశ్నకు కేంద్రం స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. తెలంగాణకు మూడో విడత, నాలుగో విడత కలిపి ఇప్పటివరకు ఏటా రూ. 450 కోట్ల చొప్పున ఇచ్చామని, ఇది నీతిఆయోగ్ సిఫారసుల మేరకు ఇచ్చామని కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ తన సమాధానంలో చెప్పారు. నీతి ఆయోగ్ సిఫారసులకు అనుగుణంగా ఏపీకి రూ.350 కోట్ల చొప్పున 3 విడతలుగా రూ.1050 కోట్లు ఇచ్చామన్నారు. తదుపరి ఎందుకు ఇవ్వలేదన్న ప్రశ్నకు కేంద్రం నుంచి సమాధానం రాలేదు. గొట్టిప్రోలు వర్తక కేంద్రమని పురావస్తు తవ్వకాల్లో వెల్లడైంది ప్రాచీన చరిత్ర కాలంలో గొట్టిప్రోలు వర్తక కేంద్ర మని భారత పురావస్తు శాఖ తవ్వకాల్లో వెల్లడైందని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ తెలిపారు. వైఎస్సార్సీపీ లోక్సభాపక్ష నేత మిథున్రెడ్డి, ఎంపీలు మాగుంట, బెల్లాన, కోటగిరి శ్రీధర్ అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. 2018–19లో తవ్వకాలు జరపగా ప్రాచీన చరిత్ర ఆనవాళ్లు లభించాయని, ఇటుక నిర్మాణం, మహా విష్ణు విగ్రహం, టెర్రకోట బొమ్మలు, రాగి నాణేలు లభ్యమైనట్టు వివరించారు. జల్ జీవన్ మిషన్ ద్వారా ఏపీకి రూ. 372 కోట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా ఏపీకి రూ.372.64 కోట్లు కేటాయించామని, ఇందులో రూ. 151.73 కోట్లు ఇప్పటికే మొదటి విడతగా విడుదల చేశామని కేంద్ర జల శక్తి శాఖ సహాయ మంత్రి రతన్లాల్ కటారియా తెలిపారు. రాజ్యసభలో వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. 2020 జనవరి 28 నాటి రాష్ట్ర ప్రభుత్వ నివేదిక ప్రకారం నెల్లూరు జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో కేవలం 60.89 శాతం కుటుంబాలకే నల్లా కనెక్షన్లు ఉన్నాయని వివరించారు. -
త్వరలో జీఎస్టీ బకాయిల చెల్లింపు
-
‘బాధ తక్కువ.. బాగు ఎక్కువ’
సాక్షి, తూర్పుగోదావరి: అన్ని ప్రాంతాల ప్రజలు అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకాంక్షించినట్లే బోస్టన్ కమిటీ నివేదిక వచ్చిందని ఎంపీ వంగా గీత అన్నారు. కాకినాడ మీడియా సమావేశంలో శనివారం ఆమె మాట్లాడుతూ.. మూడు రాజధానులు- రెండు జోన్లు అనే కాన్సెప్ట్ను బోస్టన్ కమిటీ తన నివేదికలో పేర్కొన్నట్లు తెలిపారు. కమిటీలో వివిధ రంగాలకు చెందిన నిపుణులు ఉన్నారని తెలిపారు. నేల స్వభావం రీత్యా అమరావతి ప్రమాదకరంగా ఉందని, ఈ విషయం సాధారణ రైతును అడిగినా చెబుతాడని అన్నారు. వ్యయభారం లేకుండా రాజధానిని నిర్మించుకోవాలని, తక్కువ ఖర్చుతో ఎక్కువ అభివృద్ధి జరగాలని పేర్కొన్నారు. బాధ తక్కువ.. బాగు ఎక్కువతో రాజధానుల నిర్మాణం జరుగుతుందని వంగా గీత చెప్పారు. సీఎం జగన్ ఎవరి మీద కోపంతోనో, కక్షతోనో ఈ అధికార వికేంద్రీకరణ చేయలేదని, ప్రజల మీద మక్కువతో ఏపీ అభివృద్ధి కోసమే చేస్తున్నారని పేర్కొన్నారు. తప్పకుండా ఇది విజయం సాధిస్తుందని, సీఎం జగన్కు ప్రజలంతా నీరాజనాలు పలికి అభినందించే రోజులు వస్తాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏపీ అభివృద్ధి అనేది ఇప్పుడే ప్రారంభమైందని వ్యాఖ్యానించారు. (చదవండి: మూడు రాజధానులు.. రెండు ఆప్షన్లు!) -
సంపదలు ఎన్ని ఉన్నా ఆరోగ్యమే ప్రధానం