westbengal
-
నేను తప్పు చేశా.. ‘స్టూడెంట్తో పెళ్లి’పై మహిళా ప్రొఫెసర్!
కోల్కతా: స్టూడెంట్ను పెళ్లాడిన మహిళా ప్రొఫెసర్ ఘటనలో ట్విస్ట్. క్లాస్ విద్యార్థిని పెళ్లి చేసుకున్న మహిళా ప్రొఫెసర్ తన ఉద్యోగానికి రాజీనామా చేస్తూ యాజమానికి మెయిల్ పంపారు. యాజమాన్యం తీసుకునే నిర్ణయంపై ప్రొఫెసర్ భవిష్యత్ ఆధారపడడం చర్చాంశనీయంగా మారిందిపశ్చిమ బెంగాల్ నదియాలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీకి చెందిన హరిన్ఘటా టెక్నాలజీలో పాయల్ బెనర్జీ సైకాలజీ ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ప్రొఫెసర్ పాయల్ బెనర్జీ క్లాస్ రూంలోనే తన క్లాస్ విద్యారిని వివాహం చేసుకున్నారు. వివాహ తంతు ఎలా జరిగిందో అచ్చం విద్యార్థి, ప్రొఫెసర్ల ఉత్తుత్తి పెళ్లి అలాగే జరిగింది. అయితే ఆ పెళ్లి తంతులో ప్రొఫెసర్ పెళ్లి ఘట్టాన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఆ నోటా ఈ నోటా చేరింది. చివరికి సైకాలజీ ప్రొఫెసర్ పాయల్ బెనర్జీపై చర్యలు తీసుకునే దాకా వెళ్లింది. పెళ్లితంతుపై యూనివర్సిటీ యాజమాన్యం విచారణకు ఆదేశించింది. విచారణలో భాగంగా సైకోడ్రామా ప్రాజెక్ట్లో భాగంగా తాము ఓ నాటకం ఆడామని, నాటకంలో భాగంగా ఉత్తుత్తి పెళ్లి చేసుకున్నామని, అది నిజమైన పెళ్లి కాదని వివరణ ఇచ్చారు. దీనిని విద్యార్థులు,యూనివర్సిటీ సమ్మతితో ప్రదర్శించినట్లు చెప్పారు. A lady Professor in MAKAUT is 'getting married' to her young student in the office. pic.twitter.com/coXaVGH7s7— Abir Ghoshal (@abirghoshal) January 29, 2025 తన కెరీర్ను దెబ్బతీయడానికి, కించపరచడానికి ఉద్దేశపూర్వకంగా ఓ సహోద్యోగి నాటకంలోని ఒక భాగాన్ని లీక్ చేశారని ఆరోపించారు. అనంతరం బెనర్జీని సెలవుపై సాగనంపింది.ఉత్తుత్తి పెళ్లి ఘటన జరిగిన నాటి నుంచి సెలవులో ఉన్న ప్రొఫెసర్ బెనర్జీ తాజాగా యాజమాన్యానికి తన రాజీనామా లేఖ పంపారు. అందులో, ‘నేను చేసుకుంది ఉత్తుత్తి పెళ్లే. కానీ దీనిపై నానా రాద్ధాంతం చేస్తున్నారు. సైకలాజికల్ డ్రామాలో భాగంగా క్లాస్ విద్యార్ధిని వివాహం చేసుకున్నాం. ఈ ఉత్తుత్తి పెళ్లి గురించి యాజమాన్యం నుంచి అనుమతి తీసుకున్నా. అయినా సరే నేనంటే గిట్టని వాళ్లే ఆ పెళ్లి వీడియోల్ని అడ్డం పెట్టుకుని నా పరువు, ప్రతిష్టను మంటగలుపుతున్నారు. వారి వల్ల నేను మానసిక ప్రశాంతను కోల్పోయా. విద్యార్థి పెళ్లి చేసుకుని తప్పు చేశా. ఇక నేను ప్రొఫెసర్గా కొనసాగలేను. నా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారని మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ పార్థ ప్రతిమ్ లాహిరి తెలిపారు. ఆమె లేఖపై తుది నిర్ణయం తీసుకుంటామని, అప్పటి వరకు ప్రొఫెసర్ సెలవులో కొనసాగుతారని చెప్పారు.ఇక విద్యార్థిని ప్రొఫెసర్ పెళ్లి చేసుకున్న ఘటనపై యూనివర్సిటీ ఐదుగురు సభ్యుల విచారణ ప్యానెల్ను ఏర్పాటు చేసింది. మహిళా ప్యాకల్టీ ప్యానెల్ తన విచారణలో ప్రొఫెసర్ పాయల్ బెనర్జీ వాదనల్ని ఖండించినట్లు యూనివర్సిటీ అధికారి ఒకరు తెలిపారు. అదే సమయంలో ఫ్రెషర్స్కు స్వాగతం చెప్పేందుకు చేసిన స్కిట్ తప్ప మరొకటి కాదు. అందులో తప్పులు వెతకడం సరైంది కాదని వైస్ ఛాన్సలర్ తపష్ చక్రవర్తి అన్నారు. -
ఆర్జీ కార్ ఆస్పత్రి ఘటన.. నిందితుడు సంజయ్ రాయ్కు ఉరిశిక్ష?
కోల్కతా : పశ్చిమ బెంగాల్ ఆర్జీకార్ ఆస్పత్రి (rg kar hospital) ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కోల్కతాను వణికించిన జూనియర్ డాక్టర్ హత్యోదంతంలో నిందితుడు సంజయ్ రాయ్కు మరణశిక్షను సమర్థించే సాక్ష్యాలను సీబీఐ (cbi) గురువారం సీల్దా సెషన్స్ కోర్టుకు అందించింది. ఈ కేసులో జనవరి 18న కోర్టు తీర్పును వెలువరించనుంది.ఆర్జీకార్ ఆస్పత్రి జూనియర్ వైద్యురాలి ఘటనలో నిందితుడు సంజయ్ రాయ్ సీబీఐ దర్యాప్తు ముగిసింది. దర్యాప్తు సమయంలో సేకరించిన కీలక ఆధారాల్ని సీల్దా సెషన్స్ (Sealdah sessions court) కోర్టుకు అందించింది. తాము చేపట్టిన దర్యాప్తు ఆధారంగా నిందితుడు సంజయ్ రాయ్కు మరణశిక్ష విధించాలని సీబీఐ తన వాదనలు ముగింపు సమయంలో కోర్టుకు తెలిపింది. అందుకు బలమైన బయోలాజికల్ శాంపిల్స్, సీసీటీవీ ఫుటేజీ అనాలసిస్, 50 మంది సాక్షుల వాంగ్మూలాలే సాక్ష్యమని చెప్పింది.అంతేకాదు, నిందితుడు వైద్యురాలిపై జరిగిన దారుణంలో ఏకైక నిందితుడు సంజయ్ రాయేనని స్పష్టం చేసింది. బాధితురాలిపై జరిగింది భయంకరమైన నేరమని, అత్యాచారం-హత్య అరుదైన నేరంగా పరిగణించింది. దర్యాప్తులో సేకరించిన ఆధారాల ఆధారంగా సంజయ్ రాయ్కి ఉరిశిక్షే సరైందని సీబీఐ తరఫు న్యాయవాదులు కోర్టులో వాదించారు. సంజయ్ రాయ్కు ఉరే సరినిందితుడు సంజయ్ రాయ్పై హత్య, అత్యాచారం, మరణానికి కారణమైనందుకు, బాధితురాలు కోలుకోలేని విధంగా హింసించినట్లు తేలింది. కోర్టు తీర్పుతో భారతీయ న్యాయ సంహిత (BNS)లోని 103(1), 64, 66 కింద ఉరిశిక్ష,లేదంటే జీవిత కాలం జైలు శిక్ష పడే అవకాశం ఉండనుంది. సంజయ్ రాయ్ నిర్దోషి సీబీఐ వాదనల ముగిసిన అనంతరం సౌత్ 24 పరగణాలకు చెందిన లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సర్వీస్ చీఫ్, డిఫెన్స్ లాయర్ సౌరవ్ బంద్యోపాధ్యాయ తన తుది వాదనలలో తన క్లయింట్ సంజయ్ రాయ్ నిర్దోషి అని, అతనికి వ్యతిరేకంగా సాక్ష్యాధారాలను చిత్రీకరించి, ఆపై అతన్ని ఇరికించారని వాదించారు. ఆ రోజు రాత్రి ఆర్జీ కర్ ఆసుపత్రిలో ఏం జరిగిందంటేగతేడాది ఆగస్ట్లో కోల్కతా ఆర్జీకర్ మెడికల్ ఆసుపత్రిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న జూనియర్ వైద్యురాలపై దారుణం జరిగింది. రాత్రి ఆస్పత్రిలో విధులు నిర్వహించిన ఆమె ఉదయానికి ఆసుపత్రి సెమినార్ హాలులో అర్ధనగ్న స్థితిలో శవమై కనిపించారు. ఈ దుర్ఘటనపై పోలీసుల్లో అలసత్వం భయటపడడం, ఘటన జరిగిన ప్రదేశంలో కీలక ఆధారాలు అదృశ్యం కావడం వంటి పరిణాలతో దేశ ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి దీంతో కేసు విచారణను సీబీఐకి అప్పగించాలంటూ బాధితురాలి తల్లిదండ్రులతో పాటు పలువురు పెట్టుకున్న పిటిషన్లపై కల్కత్తా హైకోర్టు విచారణ చేపట్టింది. కోల్కతా పోలీసుల దర్యాప్తుపై పెదవి విరిచింది. రోజు గడుస్తున్నా కేసులో ఎలాంటి పురోగతి లేదంటూ విచారణను సీబీఐకి బదలాయించింది.సుమారు ఐదు నెలల పూర్తి స్థాయి దర్యాప్తు అనంతరం ఆధారాల్ని జనవరి 9న కోర్టుకు అందించింది. జనవరి 18న కోర్టు తీర్పును వెలువరించనుంది. -
అంబరాన్నంటే జానపద సంబరం అక్టోబరు 25-27 దాకా
బెంగాల్లో గ్రామీణ వారసత్వం – సంస్కృతిని అన్వేషించే అవకాశం ఈ అక్టోబర్ నెలలోనే లభిస్తోంది. మొన్నటి దసరా వేడుకల్లో దుర్గా మాత పూజలు, దాండియా నృత్యాల ఆనందాన్ని పొందాం. ఆ ఆస్వాదనకు కొనసాగింపుగా రంగుల కళతో నిండిన మరో ప్రపంచం ఆహ్వానిస్తుంటే... ఎలా మిస్ అవగలం.. ఇష్టమైన హస్తకళల నుండి నోరూరించే వంటకాల వరకు అక్కడ ప్రతిదీ గొప్పగా జరుపుకుంటారు. బెంగాల్ గ్రామాల్లోని వారి గొప్ప వారసత్వం, కనుల విందు చేసే వారి సంస్కృతిలో మనమూ ఇట్టే లీనమైపోతాం. దీనిని గుర్తించిన కోల్ ఇండియా లిమిటెడ్, బంగ్లానాటక్ డాట్ కామ్తోపాటు ఎక్స్ప్లోర్ రూరల్ బెంగాల్ పండుగలు, జాతరల శ్రేణిని మన ముందుకు తీసుకువస్తోంది. దీని ద్వారా బీర్భూమ్, పురూలియా బంకురా, నదియా ప్రాంతాలతో పాటు దక్షిణ బెంగాల్లో గల 16 గ్రామాలలో ప్రయాణించవచ్చు. ఇక్కడి జానపద సంగీతం, నృత్యం, తోలుబొమ్మలాటలు, హస్తకళల ద్వారా వారి సాంస్కృతిక వారసత్వంలో మనమూ పాల్గొనవచ్చు. అక్టోబర్లో చివరి వారాంతాల్లో ఇక్కడ పండుగ, జాతరలు ఘనంగా నిర్వహిస్తారు. బీర్భూమ్లోని అంత్యంత అట్టహాసంగా జరిగే కాంత మేళా, శాంతినికేతన్ మేళాను సందర్శించవచ్చు. పురూలియాలో చౌ ఉత్సవ్, పాత చిత్రాల మేళాను సందర్శించి, వారి కళను ఆస్వాదించవచ్చు. బురాద్వన్లోని డోక్రా మేళా, చెక్క బొమ్మల మేళాలో షాపింగ్ చేయవచ్చు. ఈ గ్రామీణ జాతర అక్టోబర్ 25 నుంచి 27 వరకు జరుగుతుంది. -
కోల్కతా డాక్టర్ది గ్యాంగ్ రేప్ కాకపోవచ్చు.. సీబీఐ స్టేటస్ రిపోర్ట్
ఢిల్లీ : కోల్కతా హత్యాచార ఘటనపై సుప్రీం కోర్టులో విచారణ కొనసాగుతుంది. విచారణ సందర్భంగా సీబీఐ స్టేటస్ రిపోర్ట్లో పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మొదటి నుంచి జూనియర్ డాక్టర్పై సామూహిక అత్యాచారం జరిగిందనే అనుమానాలు వెల్లువెత్తుతున్న తరుణంలో సీబీఐ స్టేటస్ రిపోర్ట్ అందుకు భిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది.జూనియర్ వైద్యురాలిది సామూహిక అత్యాచారం కాకపోవచ్చు అని సీబీఐ తన స్టేటస్ రిపోర్ట్లో పేర్కొన్నట్లు సమాచారం. నిందితుడు సంజయ్ రాయ్ ఒక్కడే దారుణానికి ఒడిగట్టినట్లు సుప్రీంకు సీబీఐ ఇచ్చిన నివేదికలో తేలినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.ఫోరెన్సిక్, డీఎన్ఏ నివేదికలు ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాయి అని సీబీఐ కోర్టుకు తెలిపింది. హాస్పిటల్లో సంజయ్ రాయ్ కదలికలు సీసీటీల్లో రికార్డ్ అయ్యాయన్న సీబీఐ.. కేసును అన్నీ కోణాల్లో లోతుగా దర్యాప్తు చేస్తున్నామని సీబీఐ స్టేటస్ రిపోర్ట్లో వెల్లడించింది. అయితే ఈ దారుణ ఘటనలో ఒక్కరి ప్రమేయం మాత్రమే ఉందా.. లేక సామూహిక అత్యాచారమా అనే కోణంలో సీబీఐ తన దర్యాప్తును ఇంకా కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే ఫోరెన్సిక్ రిపోర్ట్ను స్వతంత్ర నిపుణులకు పంపిన తర్వాత తుది నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఆగస్ట్ 9న కోల్కతాలోని ఆర్జీ కార్ ఆస్పత్రిలోఆగస్ట్ 9న కోల్కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజీకి చెందిన 31 జూనియర్ డాక్టర్పై నిందితుడు సంజయ్ రాయ్ దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. అయితే బాధితురాలిపై నిందితుడు సంజయ్ రాయ్ అఘాయిత్యానికి పాల్పడినా..ఆస్పత్రి సిబ్బంది బాధితురాలి తల్లిదండ్రులకు ఆత్మహత్య చేసుకుందని ఫోన్ చేయడం, ఘటన జరిగిన స్థలాన్ని భద్రపరచుకుండా మరమ్మత్తులు చేయడంతో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. కేసు తప్పుదోవ పట్టించేందుకు సాక్ష్యాల్ని నాశనం చేస్తున్నారని ఆందోళనలు మొదలయ్యాయి. దీనికితోడు అదే ఆస్పత్రి ఎదుట వేలాది మంది ఆందోళన కారులు గుమిగూడడం భద్రతపై అనేక అనుమానాలు తలెత్తాయి.అయితే ఆర్జీకార్ ఆస్పత్రి కేసులో ప్రభుత్వం తీరుపై అనుమానం వ్యక్తమయ్యాయి. దీంతో బాధితురాలి తల్లిదండ్రులు తమకు న్యాయం చేయాలని కోరుతూ కోల్కతా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన కోర్టు.. ఆస్పత్రిలో ఘోరం జరుగుతున్నా ఎవరికి తెలియకపోవడం, అప్పటి ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ సందీష్ ఘోష్ రెండ్రోజుల తర్వాత రాజీనామా చేసి.. మరో మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్గా ఛార్జ్ తీసుకోవడం వంటి అంశాలను కోల్కతా హైకోర్టు తీవ్రంగా మండిపడింది. కేసును సీబీఐకి అప్పగించింది. సందీష్ ఘోష్ను విచారించాలని సూచించింది. దీంతో సందీష్ ఘోష్ను సీబీఐ అధికారులు విచారించగా.. పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అది నుంచి సందీష్ ఘోష్ అక్రమార్జనకు పాల్పడేవారని, ఆస్పత్రి మార్చురి వార్డ్లో శవాలతో వ్యాపారం చేసేవారని, నిబంధనల్ని ఉల్లంఘించి ఆస్పత్రి కాంట్రాక్ట్లు కట్టబెట్టేవారనే ఆధారాలు వెలుగులోకి వచ్చాయి.ఆర్జీకార్ దారుణంపై సీబీఐ అధికారుల విచారణ కొనసాగుతుండగానే వైద్యురాలిపై లైంగికదాడి, హత్య కేసును సుప్రీంకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఆగస్ట్ 20న చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ సారధ్యంలోని బెంచ్ విచారించింది.విచారణ సందర్భంగా ఆగస్ట్ 22లోపు కోల్కతా హత్యాచార ఘటనకు సంబంధించిన ఇప్పటిదాకా జరిపిన దర్యాప్తు స్టేటస్ను అందించాలని సీబీఐకి,ఆర్జీకార్ ఆస్పత్రి విధ్వంసానికి సంబంధించిన నివేదికను సమర్పించాలని పశ్చిమబెంగాల్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. దీంతో ఇవాళ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, సీబీఐ తమ స్టేటస్ రిపోర్ట్లను కోర్టుకు అందించాయి. వాటిపై విచారణ చేపట్టిన కోర్టు వైద్యుల భద్రతపై ఆసుపత్రులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జాతీయ టాస్క్ ఫోర్స్ కమిటీ ముందు వైద్యులు తమ భద్రతకు సంబంధించి సలహాలు సూచనలు ఇచ్చేలా పోర్టల్ను ఏర్పాటు చేయాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖకు సూచించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 5కి వాయిదా వేసింది. -
ట్రైనీ డాక్టర్ హత్య కేసు.. మరొకరి ప్రమేయం ఉందా?
కోల్కతా: దేశ వ్యాప్తంగా సంచలన సృష్టిస్తున్న కోల్కతా ఆర్జీ కార్ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్పై అత్యాచారం, హత్యకేసులో పలు అనుమానాలు, అటాప్సీ రిపోర్ట్లో దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మంగళవారం (ఆగస్ట్13) ట్రైనీ డాక్టర్ ఆటాప్సీ రిపోర్ట్ వెలుగులోకి వచ్చింది. అటాప్సీ రిపోర్ట్ ఆధారంగా..నిందితుడు సంజయ్ రాయ్ ట్రైనీ డాక్టర్ను ఉక్కిరిబిక్కిరి చేసిన ప్రాణాలు తీసినట్లు తేలింది. అమానుషంగా లైంగిక దాడి కారణంగా బాధితురాలి అంతర్గత శరీర భాగాల్లో ఏర్పాడిన గాయాల కారణంగా రక్త స్త్రావమైంది. ఆగస్టు 9 తెల్లవారు జామున 3 గంటల నుంచి 5 గంటల మధ్య హత్య, అత్యాచారం జరిగి ఉండొచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి.నిందితుడి సంజయ్ రాయ్ నుంచి తప్పించుకునేందుకు ట్రైనీ డాక్టర్ ప్రతిఘటించడంతో ఆమె ఉదరం, పెదవులు, వేళ్లు, ఎడమ కాలుపై గాయాలయ్యాయని, నిందితుడు నుంచి చెరనుంచి తప్పించుకునే ప్రయత్నంలో నిలువరించేందుకు ఆమె తలను గోడకు బాదాడు. దారుణానికి ఒడిగట్టే సమయంలో అరుపులు వినపడకుండా ఉండేందుకు నోరు, గొంతు బిగించాడు. దీంతో ఆమె మెడ ఎముకలు విరిగినట్లు పోస్ట్మార్టం నివేదిక పేర్కొంది. అయితే, ఆమె కంటికి గాయం కావడానికి గల కారణాల్ని ఇంకా గుర్తించలేదు.ఆత్మహత్య చేసుకుందంటూ ఫోన్ కాల్మరోవైపు దారుణం వెలుగులోకి వచ్చిన రోజు ఆమె ఆత్మహత్య చేసుకొని మృతి చెందినట్లు బాధితురాలి తల్లిదండ్రులు ఫోన్ కాల్ వచ్చినట్లు తెలుస్తోంది. ఆ ఫోన్ కాల్ చేసింది అసిస్టెంట్ సూపరింటెండెంట్ అని మీడియా కథనాలు చెబుతున్నాయి. సంజయ్ రాయ్ కాకుండా ఇంకెవరైనా ఉన్నారా?దీంతో ఇదే అంశంపై సూపరింటెండెంట్ను విచారించేందుకు పోలీసులు ఇవాళ లాల్బజార్ పీఎస్కు పిలిపించారు. తొలుత బాధితురాలు ఆత్మహత్య చేసుకున్నారని తల్లిదండ్రులకు ఎందుకు ఫోన్ చేశారనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సంజయ్ రాయ్తో పాటు ఇంకెవరైనా ఉన్న అన్న కోణంలో పోలీసులు తమ విచారణను వేగవంతం చేశారు. -
‘మమత’ వర్సెస్ గవర్నర్: తారాస్థాయికి విభేదాలు..!
కోల్కతా: వెస్ట్బెంగాల్లో మమతాబెనర్జీ ప్రభుత్వం, గవర్నర్ ఆనంద బోస్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. కోల్కతా నగర పోలీసు కమిషనర్ వినీత్కుమార్ను ఆ పదవి నుంచి తప్పించాలని గవర్నర్ బోస్ సీఎం మమతకు లేఖ రాసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే గవర్నర్ డిమాండ్ను మమత ప్రభుత్వం తిరస్కరించినట్లు సమాచారం. రాజ్భవన్ను ఆనుకోని పోలీసులు ఓ కంటట్రోల్ను నిర్మించి తన కదలికలపై నిఘా ఉంచినట్లు గవర్నర్ భావిస్తున్నరని తెలుస్తోంది. దీంతో ఆయన కోల్కతా నగర పోలీసు కమిషనర్ను తప్పించాలని కోరుతున్నట్లు చెబుతున్నారు. అయితే కంట్రోల్ రూమ్ కొత్తగా నిర్మించి కాదని, రాజ్భవన్ భద్రత కోసం గత ప్రభుత్వాల హయాం నుంచే అక్కడ ఉందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా, రాజ్భవన్లో మహిళలకు రక్షణ లేదని సీఎం మమత చేసిన ఆరోపణలపై గవర్నర్ ఇప్పటికే కోర్టులో పరువు నష్టం దావా వేశారు. -
అధిర్ రంజన్ చౌదరి రాజీనామా
కోల్కతా: ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం జరిగింది. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న అధిర్ రంజన్ ఛౌదరి తన పదవికి శుక్రవారం(జూన్21) రాజీనామా చేశారు.పార్టీ పేలవ ప్రదర్శనకు గల కారణాలపై పీసీసీ భేటీలో సమీక్ష నిర్వహించిన అనంతరం అధిర్ తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. రాజీనామా ఆమోదంపై కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. బహరంపుర్ లోక్సభ నియోజకవర్గం నుంచి 5సార్లు గెలుపొందిన అధిర్ లోక్సభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ చేతిలో ఓడిపోయారు. లోక్సభ ఎన్నికలకు ముందు దూకుడుగా వ్యవహరించిన ఆయన బెంగాల్లో ఇతర పార్టీలతో కాంగ్రెస్ పొత్తుపైనా పార్టీ అధిష్ఠానంతో విభేదించారు. అధీర్ తీరు రాష్ట్రంలో అధికార తృణమూల్-కాంగ్రెస్ మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణకు కారణమైందనే వాదన ఉంది. ఎన్నికల్లో రాష్ట్రంలో ఒకే ఎంపీ స్థానానికి కాంగ్రెస్ పరిమితమైంది. అదీర్ రాజీనామాతో మాల్దా-దక్షిణ్ నుంచి గెలుపొందిన ఇషాఖాన్ చౌధరికి రాష్ట్ర కాంగ్రెస్ పగ్గాలు అప్పజెప్పనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. -
రామ్నవమి వేడుకలపై ‘తృణమూల్’ కుట్ర: ప్రధాని
కలకత్తా:శ్రీరామనవమి వేడుకలను అడ్డుకునేందుకు తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) కుట్ర పన్నిందని ప్రధాని మోదీ ఆరోపించారు. మంగళవారం(ఏప్రిల్ 16) పశ్చిమబెంగాల్లోని బలూర్ఘాట్లో జరిగిన ఎన్నికల సభలో మోదీ ప్రసంగించారు. ‘అయోధ్యలో రామ్లల్లా ప్రతిష్టాపన జరిగిన తర్వాత జరుగుతున్న మొదటి రామనవమి వేడుక ఇది, రామ్నవమి వేడుకలను ఆపేందుకు టీఎంసీ ఎల్లప్పుడూ ప్రయత్నిస్తుంది. ఎన్నో కుట్రలు చేస్తుంది. కానీ చివరికి నిజమే గెలుస్తుంది. ఈసారి రామ్నవమి వేడుకలు జరుపుకునేందుకు కోర్టు అనుమతిచ్చింది. రామ్నవమి ఊరేగింపు అంగరంగ వైభవంగా, భక్తిశ్రద్ధలతో జరిగి తీరుతుంది. ఇందుకుగాను బెంగాల్ సోదరులు, సోదరీమణులకు నేను అభినందనలు తెలుపుతున్నాను’అని మోదీ అన్నారు. ఇదీ చదవండి.. ఈడీ, సీబీఐల దర్యాప్తు.. శ్వేతపత్రం విడుదల చేయండి: దీదీ -
‘దీదీ’ ఫైర్.. ‘‘చాయ్కు బదులు అది తాగమంటారేమో..!’’
కలకత్తా: లోక్సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ సమీపించిన వేళ పశ్చిమబెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత బీజేపీపై మాటల దాడి పెంచారు. కూచ్బెహార్లో సోమవారం(ఏప్రిల్15) జరిగిన ఎన్నికల ప్రచార సభలో మమత మాట్లాడారు. ఆర్జేడీ నేత తేజస్వియాదవ్ నవరాత్రుల్లో చేపలు తినడంపై విమర్శిస్తున్న బీజేపీ నేతలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. బీజేపీని అధికారంలో నుంచి దించకపోతే దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందన్నారు. ‘మనం ఏం తినాలో, ఎలా పడుకోవాలో బీజేపీ వాళ్లే నిర్ణయిస్తారు. వాళ్లను ఇలాగే వదిలేస్తే రోజూ ఉదయం చాయ్కు బదులు గో మూత్రం తాగమంటారు. భోజనానికి బదులు ఆవు పేడ తినమంటారు. ఒకవేళ బీజేపీ మళ్లీ పవర్లోకి వస్తే భవిష్యత్తులో ఎన్నికలే ఉండవు. వాళ్లకు వన్ లీడర్, వన్ నేషన్, వన్ భోజన్, వన్ భాషన్ కావాలి’అని మమత విరుచుకుపడ్డారు. పశ్చిమబెంగాల్లో తొలి దశ లోక్సభ ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 19న జరగనుంది. ఇదీ చదవండి.. కుటుంబ రాజకీయాలకు స్వస్తి చెప్పండి -
‘సందేశ్ఖాలీ’ కేసు.. ఎన్నికల వేళ ‘తృణమూల్’కు షాక్
కలకత్తా: లోక్సభ ఎన్నికల వేళ పశ్చిమబెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్కు షాక్ తగిలింది. ఇటీవలి కాలంలో రాజకీయ దుమారం రేపిన సందేశ్ఖాలీలో మహిళలపై లైంగిక వేధింపులు, భూ కబ్జాల కేసు దర్యాప్తును కలకత్తా హైకోర్టు సీబీఐకి అప్పగించింది. కేసు దర్యాప్తును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామని తెలిపింది. సందేశ్ఖాలీలో తృణమూల్ కాంగ్రెస్కు చెందిన నేతలు అక్కడి మహిళలపై లైంగిక దాడులకు పాల్పడడమే కాకుండా వారి భూములు కబ్జా చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై అక్కడి మహిళలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. తాజాగా సందేశ్ఖాలీ అకృత్యాలపై దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ కలకత్తా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘సందేశ్ఖాలీ అకృత్యాల కేసు చాలా సంక్లిష్టమైనది. ఇందులో నిష్పాక్షిక విచారణ జరగాలి. ఈ కేసును ఎవరు విచారించినా రాష్ట్ర ప్రభుత్వ సహకారం అవసరమని మా అభిప్రాయం. కేసు దర్యాప్తులో భాగంగా సామాన్యుల, ప్రభుత్వ అధికారులు, ఎన్జీవోలు ఎవరినైనా విచారించే అధికారం సీబీఐకి ఉంది. కేసు విచారించి సమగ్ర దర్యాప్తు నివేదిక మాకు అందించాలి’అని హై కోర్టు ఆదేశించింది. కేసు తదుపరి విచారణను మే 2వ తేదీకి వాయిదా వేసింది. సందేశ్ఖాలీలో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నతృణమూల్ నేత షేక్షాజహాన్ను సీబీఐ ఇప్పటికే అరెస్టు చేసింది. ఇదే కేసులో మనీలాండరింగ్ కోణంపై దర్యాప్తు చేయడానికి వచ్చిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)అధికారులపై దాడి కేసులో సీబీఐ ఆయను అరెస్టు చేసి రిమాండ్కు తరలించింది. ఈడీ అధికారులపై దాడి కేసును సీబీఐ ఇప్పటికే దర్యాప్తు చేస్తోంది. కాగా, సందేశ్ఖాలీ ఆందోళనలకు నేతృత్వం వహించిన రేఖాపత్రా అనే మహిళకు లోక్సభ ఎన్నికల్లో బీజేపీ టికెట్ ఇచ్చి బరిలోకి దింపింది. సందేశ్ఖాలీ అంశం ఈ ఎన్నికల్లో అధికార తృణమూల్ ఓట్ల శాతానికి భారీగా గండి కొట్టి బీజేపీకి మేలు చేసే అవకాశం ఉందని అంచనాలున్నాయి. ఇదీ చదవండి.. ప్రచారంలో యువతికి ముద్దు -
ప్రచార హోరు.. ‘తృణమూల్’పై ప్రధాని మోదీ ఫైర్
కలకత్తా: లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)పై ప్రధాని మోదీ ఫైర్ అయ్యారు. తూర్పు మిడ్నపూర్లో ఎన్ఐఏ అధికారులపై టీఎంసీ కార్యకర్తల దాడిని ప్రధాని ఖండించారు. ఆదివారం జల్పాయ్గురిలో జరిగిన ప్రచార ర్యాలీలో ప్రధాని మాట్లాడారు.‘వారి పార్టీ అవినీతి నేతలను స్వేచ్ఛగా వదిలేయాలని తృణమూల్ భావిస్తోంది. దర్యాప్తు సంస్థలు వస్తే వారిపైనే దాడి చేస్తారు. శాంతిభద్రతలను నాశనం చేయడానికి టీఎంసీ కంకణం కట్టుకుంది. వారికి రాజ్యాంగంతో పని లేదు’ అని విమర్శలు గుప్పించారు. తూర్పు మిడ్నపూర్లో ఎన్ఐఏ అధికారులపై దాడులు జరిగిన మరునాడే ప్రధాని స్పందించడం చర్చనీయంశమైంది.కాగా, ఇది ఎన్ఐఏ అధికారులపై జరిగిన దాడి కాదని వాళ్లు తూర్పు మిడ్నపూర్లోని భూపతినగర్ గ్రామ వాసులపై చేసిన దాడి అని టీఎంసీ చీఫ్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అంటున్నారు. ఇదీ చదవండి.. మరో పదేళ్లు హేమమాలినీనే ఎంపీ -
kolkata: ‘ఎన్ఐఏ’ బృందంపై దాడి.. ‘దీదీ’ కీలక వ్యాఖ్యలు
కలకత్తా: పశ్చిమబెంగాల్ మేదినీపూర్లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) పోలీసులపై శుక్రవారం(ఏప్రిల్ 5) అర్ధరాత్రి స్థానికులు ఇటుకలు, రాళ్లతో దాడి చేసిన ఘటనపై సీఎం మమతాబెనర్జీ స్పందించారు. ‘అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చెప్పాపెట్టకుండా వస్తే ఏం చేయాలో మేదినిపూర్ భూపతినగర్ వాసులు కూడా అదే చేశారు. అసలు అర్ధరాత్రి అక్కడికి వెళ్లేందుకు ఎన్ఐకు అనుమతి ఉందా. ఎన్ఐఏకు ఏం అధికారం ఉందని ఇలాంటివి చేస్తున్నారు. బీజేపీకి మేలు చేసేందుకే ఇదంతా చేస్తున్నారు. బీజేపీ నీచ రాజకీయాలపై అందరూ కలిసి పోరాడాలి’ అని మమత పిలుపునిచ్చారు. కాగా,2022 బాంబు పేలుడు కేసు దర్యాప్తు నిమిత్తం భూపతినగర్ వెళ్లిన ఎన్ఐఏ పోలీసులపై స్థానికులు మూకుమ్మడిగా దాడికి దిగారు. బాంబు పేలుడు కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి కలకత్తా వెళుతుండగా ఈ దాడి జరిగిందని ఎన్ఐఏ అధికారి ఒకరు తెలిపారు. స్థానిక పోలీస్స్టేషన్కు సమాచారమిచ్చిన తర్వాతే తాము అక్కడికి వెళ్లామని చెప్పారు. ఎన్ఐఏ పోలీసులపై దాడి అత్యంత దారుణ ఘటన అని బెంగాల్ బీజేపీ ఖండించింది. ఇది తృణమూల్ కాంగ్రెస్ గూండాల పనేనని బీజేపీ నేతలు ఆరోపించారు. బాంబు పేలుళ్ల కేసు దర్యాప్తును తృణమూల్ అడ్డుకోవాలని చూస్తోందన్నారు. ఇదీ చదవండి.. తృణమూల్ కాంగ్రెస్ ఆ పార్టీకి కాపీ -
Loksabha Elections 2024: ‘మహువా’ మళ్లీ గెలిచేనా !
కలకత్తా: పార్లమెంటులో డబ్బులకు ప్రశ్నలడిగిన వ్యవహారంలో ఎంపీ సభ్యత్వం కోల్పోయిన తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేత మహువామొయిత్రా రానున్న ఎన్నికల్లో మళ్లీ గెలుస్తారా అంటే కష్టమేనన్న ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం ఈసారి ఎన్నికల్లో పశ్చిమబెంగాల్లోని మహువా నియోజకవర్గం కృష్ణానగర్ నుంచి బీజేపీ గట్టి అభ్యర్థిని బరిలోకి దింపింది. రానున్న లోక్సభ ఎన్నికలకు ఇక్కడి నుంచి మహువా అభ్యర్థిత్వాన్ని టీఎంసీ ఇప్పటికే ప్రకటించింది. తాజాగా ఆదివారం(మార్చ్ 24) ప్రకటించిన లోక్సభ అభ్యర్థుల ఐదో జాబితాలో కృష్ణానగర్ సీటును స్థానిక రాజవంశానికి చెందిన రాజమాత అమ్రితా రాయ్కి కేటాయించింది. ఈమె గత వారమే బీజేపీలో చేరడం గమనార్హం. 18వ శతాబ్దంలో బెంగాల్ను పరపాలించిన మహారాజ కృష్ణ చంద్ర రాయ్ చేసిన సేవలను ప్రజలు ఈ రోజుకు కూడా గుర్తు చేసుకుంటారు. కృష్ణా నగర్ బీజేపీ టికెట్ దక్కించుకున్న రాజమాత అమ్రితా రాయ్ కృష్ణచంద్రరాయ్ వంశానికి చెందినవారే. నడియా జిల్లా బీజేపీ నాయకత్వం ఏరికోరి రాజమాత అమ్రితా రాయ్కి కృష్ణానగర్ టికెట్ ఇప్పించారని, పార్టీ నుంచి పోటీ చేయాల్సిందిగా ఆమెతో పలుమార్లు చర్చలు జరిపి ఒప్పించారని తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి కళ్యాణ్చౌబే స్వల్పంగా 63,218 ఓట్ల తేడాతో మహువా విజయం సాధించారు. మహువా గెలుపులో టీఎంసీకి అప్పట్లో గట్టి పట్టున్న కాలీగంజ్, చోప్రా, పలాషిపర అసెంబ్లీ నియోజకవర్గాలు కీలక పాత్ర పోషించాయి. అయితే వీటిలో కాలీగంజ్ అసెంబ్లీ సెగ్మెంట్లో గత కొన్ని నెలల్లో బీజేపీ బలపడినట్లు చెబుతున్నారు. దీనికి తోడు నడియా జిల్లా వ్యాప్తంగా టీఎంసీ గతంతో పోలిస్తే బలహీనపడినట్లు తెలుస్తోంది.ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో డబ్బుకు ప్రశ్నలడిగిన కేసులో ఇప్పటికే ఈ టర్ములో ఎంపీ సభ్యత్వం కోల్పోయి సీబీఐ కేసులు ఎదుర్కొంటున్న మహువా కృష్ణానగర్ నుంచి పార్లమెంటులో మళ్లీ అడుగుపెట్టడం కష్టమేనని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇదీ చదవండి.. కంగనకు బీజేపీ టికెట్.. నటి పాత ట్వీట్ వైరల్ -
స్కార్పియో-ఎన్ను అలా వాడేసిన కేటుగాళ్లు: వైరల్ వీడియో
కోలకతా: కొట్టేసిన సొమ్మును అక్రమ రవాణాకోసం కేటుగాళ్లు కొత్త కొత్త మార్గాలతో పోలీసులను బురిడీ కొట్టించాలని చూసి భంగ పడుతూ ఉంటారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. మహీంద్రా స్కార్పియో-ఎన్లో అక్రమ డబ్బును రవాణా చేయడానికి ప్రయత్నిస్తున్న కొంతమంది వ్యక్తులను పశ్చిమ బెంగాల్ పోలీసులు పట్టుకున్నారు. బ్లాక్ కలర్ మహీంద్రా స్కార్పియో-ఎన్ వాహనంలో 98 లక్షల రూపాయల విలువైన దోపిడీ డబ్బును అక్రమంగా తరలించాలని పోలీసులకు చిక్కారు. నల్లటి పాలిథిన్ ప్యాకెట్లలో డబ్బును ప్యాక్ చేసి స్టెఫినీ టైర్లో దాచిన వైనాన్ని పోలీసులు చేధించారు. చెక్పోస్టు తనిఖీల్లో భాగంగా స్కార్పియో-ఎన్లో నగదు పట్టు బడింది. నమోదైన యూజర్తో పాటు ఎస్యూవీలో ఉన్న వారిపై నల్లధనం అక్రమ రవాణా, దోపిడీ కేసు నమోదు చేశారు. బ్లాక్ కలర్ స్కార్పియో-ఎన్ వాహనంలోని స్టెఫినీ టైర్లో దాచిన నగదు అంటూ ఒక యూ ట్యూబ్ (Raftaar 7811) వైరల్ ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. -
అనుబ్రతా మోండల్కు అవమానం!.. ‘షూ’ చూపిస్తూ ‘చోర్’ అంటూ నినాదాలు!
కోల్కతా: పశువుల అక్రమ రవాణా కేసులో సీబీఐ అరెస్ట్ చేసిన టీఎంసీ సీనియర్ నాయకుడు అనుబ్రతా మోండల్కు ఛేదు అనుభవం ఎదురైంది. ప్రత్యేక సీబీఐ కోర్టులో ప్రవేశపెట్టేందుకు తీసుకెళ్తున్న క్రమంలో ఆయనకు నిరసనల సెగ తగిలింది. పెద్ద సంఖ్యలో ప్రజలు నిరసనలు చేపట్టారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొందరు చోర్ చోర్(దొంగ) అంటూ అరిచారు. కొందరు చెప్పులు, బూట్లు విసిరారు. ప్రత్యేక కోర్టులో హాజరుపరిచేందుకు అనుబ్రతా మోండల్ను తీసుకొచ్చే క్రమంలో న్యాయస్థానం ముందు పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు. టీఎంసీ నేత అనుబ్రతా మోండల్ కారు దిగగానే ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసు భద్రత మధ్య కోర్టులోకి వెళ్లారు అనుబ్రతా మోండల్. విచారించిన కోర్టు ఆయనకు 10 రోజుల సీబీఐ కస్టడీ విధించింది. #WATCH | West Bengal: Anger in people as they show shoes, shout slogans of 'chor, chor' during the production of TMC Birbhum district president Anubrata Mondal in a special CBI court of Asansol. Mondal had been arrested by the CBI in a cattle smuggling case. https://t.co/iE0Ui4xTQ6 pic.twitter.com/Z8yqQWI3JE — ANI (@ANI) August 11, 2022 ఏంటీ కేసు? 2020లో సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత పశువుల స్మగ్లింగ్ కుంభకోణం కేసులో అనుబ్రతా మోండల్ పేరు తెరపైకి వచ్చింది. సీబీఐ నివేదిక ప్రకారం.. 2015, 2017 మధ్య కాలంలో 20,000 పశువుల తలలను సరిహద్దు భద్రతా దళం స్వాధీనం చేసుకుంది. దీంతో పశువుల అక్రమ రవాణా స్కామ్ వెలుగులోకి వచ్చింది. దర్యాప్తులో భాగంగా ఇటీవల కాలంలో బీర్భూమ్ జిల్లాలో పలుచోట్ల సీబీఐ సోదాలు జరిపింది. మోండల్ అంగరక్షకుడు సైగల్ హొస్సేన్ను కూడా దర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది. ఇదీ చదవండి: Anubrata Mondal Arrested: మమతా బెనర్జీకి మరో ఎదురుదెబ్బ.. సీబీఐ ఉచ్చులో టీఎంసీ అగ్రనేత -
పార్థా ఛటర్జీ ఇంట్లో చోరీ.. ‘ఈడీ రైడ్’గా భావించి వదిలేశారటా!
కోల్కతా: టీచర్ నియామక కుంభకోణంలో పశ్చిమ బెంగాల్ మంత్రి పార్థా ఛటర్జీని అరెస్ట్ చేసి విచారిస్తోంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఇప్పటికే ఆయనకు సంబంధించి నటి అర్పితా ముఖర్జీ ఇంట్లో రెండు సార్లు కోట్లాది రూపాయలను స్వాధీనం చేసుకుంది. మంత్రికి సంబంధించిన ఇళ్లల్లోనూ తనిఖీలు చేస్తోంది. ఈ క్రమంలో ఓ అనూహ్య సంఘటన జరిగింది. ఈడీ దాడుల వేళ మంత్రి ఫార్థా ఛటర్జీకి సంబంధించిన సౌత్ 24 పరగానాల ప్రాంతంలోని నివాసంలో చోరీ జరిగింది. జులై 27న బుధవారం రాత్రి ఓ దొంగ ఇంట్లోకి దూరి అందినకాడికి దోచుకెళ్లాడు. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. బుధవారం రాత్రి ఇంటి తాళాన్ని పగలగొట్టి లోపలికి వెళ్లాడు దొంగ. పెద్ద పెద్ద బ్యాగుల్లో పార్థా ఛటర్జీ ఇంట్లోంచి చాలా వస్తువులు తీసుకెళ్లాడు. అయితే.. ఆ దొంగను గమనించిన స్థానికులు అది మరో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేడ్ రైడ్గా భావించారటా. అలా వారు అనుకోవటమే ఆ దొంగకు అదృష్టంగా మారింది. అందినకాడికి దోచుకెళ్లాడు. ఛటర్జీకి సన్నిహితురాలైన నటి అర్పిత ముఖర్జీ రెండో అపార్ట్మెంట్లో బుధవారం దాడులు చేసిన ఈడీ రూ.28.90 కోట్ల నగదు, 5 కేజీలకుపైగా నగలు, పలు పత్రాలను స్వాధీనం చేసుకుంది. ఆ తర్వాత ముఖర్జీకి చెందిన మరో ఇంటిలో రూ.21.90 కోట్ల నగదు, రూ.56 లక్షల విదేశీ కరెన్సీ, రూ.76 లక్షల విలువైన బంగారం స్వాధీనం చేసుకుంది. ఇదీ చదవండి: Arpita Mukherjee: ఆ డబ్బంతా పార్థా ఛటర్జీదే -
ఆమె వస్తే... పెళ్లి ఆగాల్సిందే
20 ఏళ్లు కూడా లేని కోయెల్ని ఆ ఊళ్లో అంతా విలన్గా చూస్తారు. చంపుతాం అన్నారు. అత్యాచారం చేస్తాం అని బెదిరించారు. కాని కోయల్ వినదు. భయపడదు. కోవిడ్ కాలంలో అనేక కారణాల వల్ల బాల్య వివాహాలు పెరిగిపోయాయి. ఆడపిల్లలు విలపిస్తున్నారు. సిలిగురి ప్రాంతంలో కోయెల్ తనలాంటి అమ్మాయిలతో కలిసి గస్తీ కాస్తోంది. బాల్యవివాహం జరిగే మంటపంలో ప్రత్యక్షమై ‘ఆపరా’ అని అంటోంది.ఆమె వస్తే పెళ్లి ఆగాల్సిందే. ‘తల్లిదండ్రుల ఆలోచన, నిస్సహాయత ఏదైనా కావచ్చు. కాని అది ఆడపిల్ల భవిష్యత్తును దెబ్బ తీసే విధంగా ఉండకూడదు’ అంటుంది 19 ఏళ్ల కోయెల్ సర్కార్. ఈ అమ్మాయి సిలిగురి (పశ్చిమ బెంగాల్) సమీపంలో ఉండే ఒక గ్రామంలో ‘వరల్డ్ విజన్ ఇండియా’ అనే ఎన్.జి.ఓతో కలిసి పని చేస్తుంది. ఆమె చేసే ప్రధానమైన పని బాల్య వివాహాలను నిరోధించడం. ఇందుకు ఆమెతో పాటు పని చేసే, ఆమె వయసు ఉండే మరో 25 మంది అమ్మాయిల దళం ఉంది. అందరూ రహస్య పోలీసుల కంటే సమర్థంగా తమ ఊళ్లో చుట్టుపక్కల పల్లెల్లో బాల్య వివాహాలు ఎక్కడ జరుగుతాయా అని చూస్తూ ఉంటారు. ‘ఈ రెండేళ్లలో నేను 8 బాల్య వివాహాలను ఆపించాను’ అంటుంది కోయెల్. కాని పెద్దవాళ్లు ఊరికే ఉంటారా? పెద్దవాళ్లు అంటే ఎవరు? వధువు తల్లిదండ్రులు... వరుడి తల్లిదండ్రులు. మాకు లేని నొప్పి నీకెందుకు అని కోయెల్తో తగాదాకు వస్తారు. ‘ఇప్పటికి రెండుసార్లు మా ఇంటి మీదకు జనం దాడికి వచ్చారు. నన్ను, మా చెల్లెల్ని చంపుతాం అన్నారు. నన్ను రేప్ చేస్తాం అన్నారు. ట్యూషన్ నుంచి వస్తుంటే ఒకసారి నా మీద రాళ్ల దాడి జరిగితే సాయంత్రం ట్యూషన్కు వెళ్లడమే మానేశాను. కాని బాల్య వివాహాలను ఆపడం మాత్రం మానలేదు’ అంటుంది కోయెల్. ఆమెకు ఈ పని ఇంత గట్టిగా చేయాలని ఎందుకు అనిపించింది? స్వీయ జీవితం నుంచే. ‘మా అమ్మకు 17 ఏళ్ల వయసులో 35 ఏళ్ల మా నాన్నతో పెళ్లి జరిపించారు. నేను పుట్టిన మూడేళ్లకు నన్ను. అమ్మను, చెల్లిని వదిలి మా నాన్న వెళ్లిపోయాడు. మా అమ్మకు ఎన్నో ఆశలు, భవిష్యత్తు లక్ష్యాలు ఉండేవి. అన్నీ నాశనం అయ్యాయి. మేము చాలా కష్టాలు పడ్డాం. అలా ఎవరూ పడకూడదనే నా తపన’ అంటుంది కోయెల్. వెస్ట్ బెంగాల్లో బహుశా దేశంలో చాలా చోట్ల ఈ రెండేళ్లలో పరిస్థితి చాలా మారింది. మధ్యతరగతి, పేద వర్గాల ఆదాయం గండి పడింది. ఇంట్లో ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఏదో ఒక విధంగా పిల్లను సాగనంపితే చాలు అనుకుంటున్నారు. కోవిడ్ కాలంలో పెళ్లిళ్లు జనం ఊసు లేకుండా జరిపించే వీలు ఉండటంతో అదీ ఒకందుకు మంచిదే అనుకుంటున్నారు. స్కూళ్లు మూతబడి, చదువు మానేసి, ఫ్రెండ్స్కు దూరమయ్యి ఇరవై నాలుగ్గంటలు ఇంట్లో ఉంటున్న ఆడపిల్లలు తల్లిదండ్రులకు గుబులు పుట్టిస్తున్నారు. అందుకని కూడా పెళ్లిళ్లకు తొందరపడుతున్నారు. ‘పెళ్లి తొందరలో అమ్మాయి తల్లిదండ్రులు ఎవరికో ఒకరికి కట్టబెడుతున్నారు. ఆ వెళ్లినచోట ఆ ఆడపిల్లలు ఏ మాత్రం సురక్షితంగా ఉండటం లేదు. సుఖంగా కూడా’ అంటుంది కోయెల్. ‘ఆడపిల్లను క్షేమంగా ఉంచలేమని, ప్రేమలో పడి ఎవరితోనైనా వెళ్లిపోతారని కూడా ఈ పని చేస్తున్నారు’ అంటుంది కోయెల్. అయితే తల్లిదండ్రుల ఆలోచనలు ఎలా ఉన్నా ఆడపిల్లలు నిజంగా చదువుకోవాలని కోరుకుంటున్నారు. జీవితంలో ఏదో ఒక మేరకు స్థిరపడాలనుకుంటున్నారు. అందుకే పెళ్లి సంబంధం చూడగానే కోయెల్కు ఉప్పందిస్తున్నారు. కోయెల్ తన దళంతో వెళ్లి పెళ్లి ఆపు చేస్తోంది. ‘పెళ్లి ఆపించి ఊరుకోవడం లేదు. అలాంటి ఆడపిల్లల స్వయం ఉపాధికి లేదా తల్లిదండ్రుల ఉపాధికి ప్రభుత్వ పథకాలు అందేలా చేస్తున్నాం.’ అంటుంది కోయెల్. బాల్య వివాహాలు ఆపడమే కాదు నేపాల్ సరిహద్దుకు దగ్గర కాబట్టి చైల్డ్ ట్రాఫికింగ్ జరక్కుండా కూడా అడ్డుకునే పని కోయెల్ దళం చేస్తోంది. ‘అమ్మాయిలను ఏమార్చేవారు పెళ్లి కొడుకుల వేషంలో వస్తుంటారు’ అంటుందామె. ఆడపిల్లల గురించి ప్రభుత్వం ఎన్ని ప్రోత్సాహక చర్యలు చేపట్టినా తల్లిదండ్రుల అండ లేకపోతే వాళ్లు ముందుకు పోరు. తల్లిదండ్రులు విఫలమైన చోట కోయెల్ వంటి సామాజిక కార్యకర్తలు కావాలి. తల్లిదండ్రులు, సామాజిక కార్యకర్తలు కలిసి పని చేస్తే ఏ ఆడపిల్లకు కూడా పరిణిత వయసుకు ముందే అనవసర పెళ్లిళ్లు జరగవు. అక్కర్లేని సమస్యలు రావు. -
గెస్ట్ హౌజ్లో విద్యార్థినిపై అత్యాచారం.. ఫొటోలు, వీడియోలు తీసి..
కోల్కత్తా: పాఠాలు చెబుతానని విద్యార్ధినిని గెస్ట్ హౌస్కు పిలిపించి టీచర్.. ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో లైంగిక దాడికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు లీక్ చేస్తానని బెదిరింపులకు గురి చేశాడు. ఈ దారుణ ఘటన పశ్చిమ బెంగాల్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోల్కత్తాలో సెంగార్ అనే వ్యక్తి యూపీఎస్సీ కోచింగ్ సెంటర్లో జాగ్రఫీ బోధిస్తున్నాడు. ఈ క్రమంలో గత ఏడాది డిసెంబర్లో ఎక్స్ట్రా క్లాస్ పేరుతో విద్యార్ధినిని సాల్ట్లేక్ గెస్ట్ హౌస్కు పిలిపించుకున్నాడు. అనంతరం ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఫొటోలు, వీడియోలు కూడా తీశాడు. ఇదిలా ఉండగా.. మరోసారి ఆమెను కలిసేందుకు ఈ ఏడాది ఫిబ్రవరిలో గ్వాలియర్ రావాలని విద్యార్ధినిని కోరాడు. దీనికి ఆమె నిరాకరించింది. దీంతో తనకు రూ. 5 లక్షలు ఇవ్వాలని బ్లాక్ మెయిల్కు దిగాడు. అంతటితో ఆగకుండా గెస్ట్హౌస్లో తాను తీసిన వీడియోలు, ఫోటోలు లీక్ చేస్తానని బెదిరించాడు. ఈ నేపథ్యంలో సదరు యువతి.. ఈ విషయంపై పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని మధ్యప్రదేశ్లో గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోల్కతాకు తీసుకువచ్చి మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. -
కనీవినీ ఎరుగని రీతిలో పెళ్లి..ఆపై విందు భోజనం! ఎక్కడో తెలుసా?
ప్రస్తుతం కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఉధృతి నేపథ్యంలో ఎలాంటి వేడుకలు నిర్వహించుకోవడానికి వీలులేదు. పైగా అధికారులు కూడా ఎలాంటి వేడుకలు నిర్వహించుకోవడానికి వీల్లేదంటూ కఠినమైన కరోనా ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలో ఒక జంట విన్నూతనమైన ఆలోచనతో తమ పెళ్లిని జరుపుకోవాలనుకున్నారు. అంతేకాదు తమ పెళ్లిని తమవారంతా చూసేలా సరికొత్త ఆలోచన చేశారు. అసలు విషయంలోకెళ్తే.. పశ్చిమ బెంగాల్కి చెందిన సందీపన్ సర్కార్, అదితి దాస్ అనే జంట జనవరి 24న వివాహం చేసుకోనున్నారు. అయితే కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించకుండా వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు పెళ్లికి అతిథులు హాజరయ్యేందుకు ‘గూగుల్ మీట్’ని, భోజనాల కోసం జొమాటో యాప్ను( ఫుడ్ ఆర్డర్లు) వినియోగించనున్నారు. పైగా ప్రత్యక్షంగా పెళ్లిని చూసేలా లైవ్ టెలికాస్ట్ వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్ఫామ్ ఉపయోగిస్తున్నారు. అయితే కరోనా దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వ విధించిన నిబంధనలకు లోబడి 120 మంది అతిధులు నేరుగా పెళ్లికి హాజరవుతారు. కాగా మిగతా 300 మంది డిజిటల్ ప్రత్యక్ష ప్రసారంలో చూస్తారు. ఆహ్వానితులందరికీ వేడుకకు ఒక రోజు ముందు పాస్వర్డ్లతో పాటు వివాహాన్ని చూడటానికి లింక్ను కూడా అందిస్తారు. ఈ క్రమంలో ఆ జంట మాట్లాడుతూ.. ‘మేము గతేడాది వివాహం చేసుకోవాలనుకున్నాం. కానీ కరోనా అడ్డంకిగా మారింది. అందుకే మా కుటుంబ భద్రత, అతిధుల భద్రత దృష్ట్యా డిజిటల్ వివాహాన్ని నిర్వహించాలనే ఆలోచన చేశాము’ అని తెలిపారు. ఈ మేరకు జొమాటో అధికారి మాట్లాడుతూ.. ‘ఈ ఆలోచన చాలా ప్రసంశించదగ్గది. పైగా మాకు ఈ కొత్త ఆలోచన బాగా నచ్చింది. ఈ వివాహాలను స్వాగతిస్తున్నాం. అంతేకాదు ఇలాంటి వివాహాలను పర్యవేక్షించేందుకు ఒక బృందాన్ని కూడా ఏర్పాటు చేశాం’ అని చెప్పారు. (చదవండి: ఆ పుర్రే పురాతన కాలం నాటి అడ్వాన్స్డ్ సర్జరీకి ప్రతీక!) -
"ఈశ్వర్ అల్లా" అంటే ఇదేనేమో
పశ్చిమబెంగాల్: ఇటీవల కాలంలో మతాల పేర్లుతో కోట్లాడుకోవడాలు చూసి ఉంటాం. అలాగే మాట వరసకు ఏదైనా చిన్న మాట అంటే చాలు మా మతాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారంటూ పెద్ద ఎత్తున ఘర్షణకి దిగిపోతారు. అంతేందుకు ఒక ప్రాంతం లేదా గల్లీ మొత్తం ఒక మతంగా నివశిస్తారు. కానీ వాటిన్నింటకి విరుద్ధంగా ఒక ముస్లీం కుటుంబం హిందూ దేవుళ్ల విగ్రహాలను తయారు చేయడమే కాక అన్ని మతాలు ఒకటే భావనను కలిగిస్తున్నారు. (చదవండి: సార్ నా గర్ల్ఫ్రెండ్ సాక్స్ ఉతక లేదు.... కాబట్టి ఆఫీస్కి రాలేను) అసలు విషయంలోకి వెళ్లితే....పశ్చిమ బెంగాల్లోని పశ్చిమ మేదినీపూర్లో దాస్పూర్ గ్రామంలోనే ఇస్మాయిల్ కుటుంబం నలభై సంవత్సారాలుగా నివాసం ఉంటున్నారు. ఈ 61 ఏళ్ల ఇస్మాయిల్ వృత్తి రీత్యా విగ్రహాలు తయారు చేస్తాడు. అందులోనూ కాళీ విగ్రహాలు తయారు చేయడంలో సిద్ధహస్తుడు. అక్కడున్న గ్రామస్తులకు కాళివిగ్రహాలు కావాలంటే ఇస్మాయిల్కే ప్రాధాన్యత ఇస్తారు. అంతేకాదు ఈ కాళిమాత విగ్రహాలను అతని భార్య , ఐదుగురు కుమార్తెలు కలిసి తయారు చేస్తారు. పైగా ఇస్మాయిల్కి తన తన కూతుళ్లను చదివించడం తనకు భారమే అయినప్పటికీ నా పిల్లలకి "ఈశ్వర్" "అల్లా" అనే ఇద్దరి దేవుళ్ల ఆశీస్సులు ఉంటాయి కాబట్టి వాళ్లు బాగా చదువుకుని మంచి జీవితాన్ని గడుపుతారని నమ్మకంగా చెబుతాడు. ఈ మేరకు ఇస్మాయిల్ మాట్లాడుతూ..." “నేను చిన్నప్పటి నుండి ఇదే చేస్తున్నాను. మా ఊరి గ్రామస్తులే కాక ఇతర ప్రాంతాల నుండి సైతం ప్రజలు విగ్రహాల కోసం నా వద్దకే వస్తారు. నేను పేదవాడిని కానీ అందరి దీవెనలతో నా కుటుంబాన్ని చక్కగా నడపగలుగుతున్నాను. అంతేకాదు నాకు విగ్రహాలు సిద్ధమైనప్పుడు చాలా గొప్పగా అనిపిస్తుంది." అని అన్నాడు. ఈ క్రమంలో ఆ గ్రామంలోని బీరేంద్ర రాయ్ అనే స్థానికుడు మాట్లాడుతూ....ఈ గ్రామంలోని ప్రతి హిందువు దేవతా విగ్రహన్ని ఇస్మాయిల్ తయారు చేస్తాడు. ఇది మాకు కొత్తేమి కాదు. అయినా మనమందరం కలిసి పెరిగాం, కలిసి ఉంటున్నాం, ఇదే మన సంస్కృతి" అని అన్నాడు. కానీ ఈ చిన్న గ్రామం నిజంగా మత సామరస్యాంగా ఎలా జీవించాలో ఎలా కొనసాగించాలో ఐక్యతగా జీవిస్తూ చూపించింది. ఈ మేరకు ఇస్మాయిల్ ప్రజలు ఐక్యత గురించి తెలుసుకునేలా ప్రపంచంలో ఇలాంటి దస్పూర్ గ్రామాలు మరిన్ని ఉండాలని ఆకాంక్షిస్తున్నాను అని అన్నాడు. (చదవండి: ఎదురుగా కంగారుల సమూహం.. ఇప్పుడు నేనెలా ఆడాలి?) -
అమ్మో ఈ చేప ఖరీదు రూ.36 లక్షల!
పశ్చిమబెంగాల్: ఈ మధ్యకాలంలో అత్యంత భారీ చేపను పట్టుకుని ఒక్కరోజులోనే ధనవంతులుగా మారిన కథనాలు విన్నాం. అచ్చం అలానే పశ్చిమ బెంగాల్కి చెందిన మత్స్యకారుడు బార్మన్ భారీ తెలియా భోలా చేపను పట్టుకుని ధనవంతుడిగా మారిపోయాడు. (చదవండి: ఒక గంట వ్యవధిలో ఐదువేల కిలోగ్రాములు బరువుని ఎత్తి రికార్డు సృష్టించాడు) వివరాల్లోకెళ్లితే ఐదుగురు మత్స్యకారుల బృందం పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్స్ నదులలో చేపలను వేటాడుతుండగా భారీ తెలియా భోలా చేపను పట్టుకున్నారు. అయితే ఆ చేప సుమారు 7 అడుగుల పొడవు, 75 కిలోగ్రాముల బరువు ఉంటుంది. ఈ మేరకు మత్స్యకారులందరూ సమిష్టిగా కష్టపడితేనే ఆ భారీ చేపను ఒడ్డుకు తీసుకురాగలరు. అంతేకాదు ఆ చేపను హోల్సేల్ మార్కెట్కి తీసుకువెళ్లితే అక్కడ అనుహ్యంగా అత్యధిక ధర పలికింది. దీంతో ఆ తేలియా భోలా చేప కిలో రూ.49,300 చొప్పున మొత్తం సుమారుగా రూ.36 లక్షలకు విక్రయించారు. పైగా ఈ చేప పొట్టలో అత్యంత విలువైన వనరులు ఉంటాయని వాటిని మందులు, ఇతర వస్తువుల తయారీలో వినియోగిస్తారని మత్స్యకారులు చెబుతున్నారు. ఈ సందర్భంగా మత్య్సకారుడు బార్మన్ మాట్లాడుతూ......"ప్రతి ఏడాది నేను తెలియా భోలా చేపలు పట్టడానికి వెళ్తాను. కానీ ఇంత పెద్ద చేపను పట్టుకుంటానని ఊహించ లేదు" అని చెప్పాడు. గతేడాది పశ్చిమ బెంగాల్లోని ఈ నదిలోనే 52 కిలోల భోలా చేపను పట్టుకున్న ఒక వృద్ధ మహిళ రాత్రికి రాత్రే ధనవంతురాలైన సంగతి తెలిసిందే. (చదవండి: చనిపోయిన సోదరుడి అస్థిపంజరంతోనే కలిసి ఉంటున్న సోదరులు) -
విద్యార్ధులకు క్రెడిట్ కార్డులు.. రూ.10 లక్షల వరకు పరిమితి
కోల్కతా: విద్యార్థులకు రుణసాదుపాయం కల్పించేందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘స్టూడెంట్ క్రెడిట్ కార్డ్’ పథకాన్ని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం ప్రారంభించారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు దీదీ ఈ పథకాన్ని ప్రవేశ పెట్టారు. విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడానికి ఇదొక అద్భుత పథకమని ఈ సందర్భంగా మమత తెలిపారు. స్టూడెంట్ క్రెడిట్ కార్డ్ పథకం ద్వారా 4 శాతం వార్షిక సాధారణ వడ్డీతో 10 లక్షల రూపాయల వరకు రుణం పొందవచ్చునని చెప్పారు. పదేళ్లుగా బెంగాల్ లో నివసించే విద్యార్థులు (గరిష్ఠ వయసు 40 ఏళ్లు) ఈ కార్డు పొందేందుకు అర్హులని మమత తెలిపారు. అండర్ గ్రాడ్యేయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు, వైద్య విద్య చదివేవారికి ఈ కార్డు ద్వారా రుణం లభిస్తుందని చెప్పారు. దేశ, విదేశాల్లో చదువుకునేందుకు విద్యార్థులకు ఈ పథకం ఎంతగానో ఉపకరిస్తుందని పేర్కొన్నారు. ఇంజనీరింగ్, మెడికల్, లా, ఐఎఎస్, ఐపిఎస్, ఇతరు పోటీ పరీక్షలకు కోచింగ్కు హాజరయ్యే విద్యార్థులు కూడా ఈ పథకం కింద రుణం పొందవచ్చన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ లేదా రాష్ట్ర సహకార బ్యాంకుల నుంచి ఈ ఎడ్యుకేషన్ లోన్ పొందవచ్చన్నారు. తీసుకున్న రుణాన్ని 15 సంవత్సరాల్లోపు చెల్లించాల్సి ఉంటుందన్నారు. సకాలంలో వడ్డీని పూర్తిగా చెల్లిస్తే రుణగ్రహీతలకు ఒక శాతం వడ్డీ రాయితీ ఇస్తామని ఆమె తెలిపారు. కాగా, దేశంలో స్టూడెంట్ క్రెడిట్ కార్డులు తీసుకొచ్చిన మొదటి రాష్ట్రంగా బెంగాల్ నిలిచింది. చదవండి: శశికళపై మరో కేసు నమోదు.. -
సరిహద్దులు దాటిన ప్రేమ..చివరికి ఏమైందంటే?
కోల్కతా: ప్రేమకు హద్దులు, సరిహద్దులు అంటూ ఉండవు. ఎవరినైనా.. ఎక్కడివారినైనా ప్రేమించొచ్చు. ప్రేమ పుట్టడమే అలస్యం.. ప్రేమించిన అమ్మాయి కోసం దేశాలు దాటి వెళ్లడానికి కూడా సిద్దం అవుతున్నారు కొందరు యువకులు. కొన్ని కొన్ని సార్లు ప్రేమ కోసం అక్రమంగా దేశ సరిహద్దులు దాటి వెళ్లిపోతున్నారు. ఇటువంటి సంఘటనే భారత్-బంగ్లాదేశ్ బోర్డర్ వద్ద చోటుచేసుకుంది. పశ్చిమ బెంగాల్ నదియా జిల్లాలోని బల్లావ్పూర్ గ్రామానికి చెందిన జైకాంతో చంద్రరాయ్ (24)కు ఫేస్బుక్లో బంగ్లాదేశ్కు చెందిన పరిణితి అనే అమ్మాయి పరిచయమైంది. ఆ పరిచయం ప్రేమగా మారింది. దీంతో ఆమెను వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. తరువాత ఓ బ్రోకర్ సాయంతో మార్చి 8న సరిహద్దు దాటి బంగ్లాదేశ్ చేరుకున్నాడు. జూన్ 10వ తేదీన ప్రేయసి పరిణితిని వివాహమాడాడు. ఆ తర్వాత జూన్ 25వ తేదీ వరకు ఇద్దరూ కలిసి అక్కడే ఉన్నారు. జూన్ 26న చంద్రరాయ్ తన భార్యతో కలిసి సొంతూరుకి బయలుదేరాడు. అయితే, బోర్డర్ దాటించేందుకు ఈ సారి కూడా రాజు మండల్ అనే బ్రోకర్ సాయం తీసుకున్నాడు. బోర్డర్ దాటించినందుకు అతడికి 10వేలు ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ఓ జంట అక్రమంగా సరిహద్దు దాటుతున్నట్టు బీఎస్ఎఫ్ బలగాలకు పక్కా సమాచారం అందింది. వెంటనే ఆప్రమత్తమైన బీఎస్ఎఫ్ బలగాలు ఆ జంటను అదుపులోకి తీసుకున్నాయి. బీఎస్ఎఫ్ విచారణలో అబ్బాయిది పశ్చిమ బెంగాల్, అమ్మాయిది బంగ్లాదేశ్ అని తెలింది. వీరిద్దరూ వివాహం చేసుకున్నట్లు చెప్పారు. దీంతో వీరిని స్థానిక పోలీస్ స్టేషన్కు అప్పగించారు. వీరికి సరిహద్దు దాటేందకు సాయం చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. చదవండి: సినిమా స్టోరీని తలపించే మోసాలు, ఆఖరికి తల్లిదండ్రులను కూడా -
బెంగాల్లో కోవిడ్ టీకా సర్టిఫికెట్పై మమత ఫొటో
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో కోవిడ్ టీకా సర్టిఫికెట్లపై సీఎం మమతా బెనర్జీ ఫొటో ప్రత్యక్షమవడం చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో 18–44 ఏళ్ల వయసు వారు కోవిడ్ టీకాలు తీసుకుంటే వారికి సీఎం ఫొటో ఉన్న కోవిడ్ టీకా సర్టిఫికెట్ను ఇస్తున్నారు. దేశవ్యాప్తంగా కోవిడ్ సర్టిఫికెట్లపై ప్రధాని మోదీ ఫొటో ఉండగా, బెంగాల్లో మమత ఫొటో ఉండటంపై బీజేపీ వర్గాలు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాయి. ఈ అంశంపై బెంగాల్ రాష్ట్ర మంత్రి ఫిర్హాద్ హకీమ్ వివరణ ఇచ్చారు. ‘ మా రాష్ట్రంలో 18–44 ఏళ్ల వయసు వారికి ఇస్తున్న టీకాలు.. కేంద్ర ప్రభుత్వం సరఫరాచేసినవి కాదు. బెంగాల్ ప్రభుత్వం సొంత ఖర్చుతో టీకా తయారీ సంస్థల నుంచి కొనుగోలు చేస్తోంది. కేంద్రప్రభుత్వమేమీ 18–44 ఏళ్ల వయసు వారి టీకాలు ఇవ్వట్లేదు కదా? అయినా, మమత ప్రభుత్వం ఇస్తోందికాబట్టే ఆమె ఫొటోను టీకా సర్టిఫికెట్లపై ముద్రించాం. పంజాబ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ప్రభుత్వాలూ తమ సీఎంల ఫొటోలున్న సర్టిఫికెట్లనే జారీచేస్తున్నాయి’ అని వ్యాఖ్యానించారు. -
ప్రధాని బెంగాల్ పర్యటనలో రాజకీయ వివాదం
కోల్కతా: ‘యాస్’ తుపాను కారణంగా ఒడిశా,పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోయాయి. దీనిలో భాగంగా ఒడిశా, పశ్చిమబెంగాల్లోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం ప్రధాని మోదీ.. పశ్చిమబెంగాల్లో తుఫాన్ పరిస్థితిపై అక్కడి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బెంగాల్ గవర్నర్ జగ్దీప్ ధన్కర్, ముఖ్యమంత్రి మమతాబెనర్జి కూడా హాజరు కావాల్సి ఉండగా ఆమె సుమారు అరగంట ఆలస్యంగా వచ్చారు. అనంతరం మమత రెండు పేజీల నివేదిక ఇచ్చి త్వరగానే వెనక్కి వెళ్లిపోయారు. శుక్రవారం బెంగాల్ ప్రాంతాలలో ‘యాస్’ తుపాను వల్ల కలిగిన నష్టాన్ని అంచనా వేయడానికి ఇరువురు నాయకులు సమీక్షా సమావేశం నిర్వహించాల్సి ఉంది. మమత ఈ అంశంపై స్పందిస్తూ.. ప్రధానమంత్రి సమావేశానికి పిలిచారు.. కానీ నా కార్యలయానికి ఆ సమాచారం చేరలేదు. ఈ కారణంగా నేడు దిఘాలో ఒక సమావేశనికి హాజరయ్యాను. కానీ నేను కలైకుండకు వెళ్లి తుపాను నష్టానికి సంబంధించిన నివేదిక అందజేసిన అనంతరం ప్రధాని అనుమతితో తిరిగి వెళ్ళినట్లు తెలిపింది. కాగా సీఎం తీరుపై బెంగాల్ గవర్నర్ జగ్దీప్ ధన్కర్ అసహనం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. It would have served interests of state and its people for CM and officials @MamataOfficial to attend Review Meet by PM. Confrontational stance ill serves interests of State or democracy. Non participation by CM and officials not in sync with constitutionalism or rule of law.— Governor West Bengal Jagdeep Dhankhar (@jdhankhar1) May 28, 2021 చదవండి: ‘కరోనాకు గేట్లు తెరిచిన మోదీ: లెక్కలన్నీ అబద్ధం’ -
మోదీజీ.. దీదీ గెలిస్తే.. మీరు ఓడినట్లే: సంజయ్ రౌత్
ముంబై: మే 2 తర్వాత మహరాష్ట్రలో రాజకీయ పరిణామాలు మారతాయని వాదించిన వాళ్లు పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల తర్వాత ఢిల్లీలో ప్రకంపనలు వస్తాయని గుర్తుంచుకోవాలంటూ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్లో 292 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాని మోదీ, హోమంత్రి అమిత్ షాలు ప్రచారం నిర్వహించారు. ఆ ఇద్దరు ఉద్దండుల ప్రచారంతో బెంగాల్ రాజకీయ ముఖ చిత్రం మారిపోనుందని రాజకీయ నిపుణులు భావించారు. ఇప్పటి వరకు దేశంలో జరిగిన అన్ని ఎన్నికల్లో బీజేపీ ఎలా అయితే విజయం సాధించిందో.. బెంగాల్లో సైతం అదే తరహాలో దీదీని మట్టికరిపిస్తూ బీజేపీ విజయ దుందుభి మోగిస్తోందని సొంత పార్టీల నేతలు, అభ్యర్ధులు ఊహించారు. కానీ నేటి ఓట్ల లెక్కిపు ప్రక్రియలో బీజేపీ నాయకుల అంచనాలన్నీ తల్లకిందులయ్యాయి. ఎన్నికల ప్రచారంలో గాయ పడ్డ మమత ఒంటికాలితో ప్రచారం నిర్వహించి విజయం సాధిస్తానని ప్రత్యర్ధులకు విసిరిన సవాల్ నిజమయ్యింది. ఈ క్రమంలో సంజయ్ రౌత్ శివసేన అధికార మీడియా 'సామ్నా' వేదికగా కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మే 2 తర్వాత మహారాష్ట్రలో రాజకీయ మార్పులు జరుగుతాయని ప్రచారం చేసిన వారు.. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు ఢిల్లీలో కూడా ప్రకంపనల సృష్టిస్తాయని గుర్తించుకోవాలన్నారు. ఓ వైపు దేశంలో కోవిడ్ విజృంభణ కొనసాగుతుంది. వ్యాక్సిన్లు, బెడ్ల కొరత, ఆక్సిజన్ లేకపోవడం వల్ల 5 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రజలు చనిపోతున్నా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రాజకీయం చేయడం ఎంతవరకు సమంజసం అని సంజయ్ రౌత్ ప్రశ్నించారు. ఒక్క రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో గెలిచేందుకు దేశ ప్రజల్ని ప్రమాదంలోకి నెట్టేశారు. సుప్రీంకోర్టు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిందని, ఈసీ తీరుపై మద్రాస్ హైకోర్టు మండిపడిందని సంజయ్ రౌత్ గుర్తు చేశారు. అంతేకాదు వెస్ట్ బెంగాల్లో దీదీ గెలిస్తే అక్కడ ప్రచారం చేసిన మోదీ, అమిత్ షాలు సైతం ఓడినట్లేనని సంజయ్ రౌత్ సామ్నాలో పేర్కొన్నారు. -
ఆమె పులిలా పోరాడింది
ముంబై: పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ పులిలా పోరాడిందని, ఆమె విజేతగా అవతరించడం ఖాయమని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. గురువారం ముంబైలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ఇప్పుడు జరగబోయే కేరళ, తమిళనాడు, అస్సాం, బెంగాల్ (నాలుగు రాష్ట్రాల) ఎన్నికలు జాతీయ రాజకీయాలను నిర్ణయిస్తాయని ఎంపీ అభిప్రాయపడ్డారు. ప్రధానంగా అస్సాం, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలు ముఖ్యపాత్ర పోషిస్తాయని అన్నారు. అస్సాంలో బీజేపీ అధికారంలో ఉందని, అయితే కాంగ్రెస్ గట్టిగా పోరాటం చేసిందని ప్రశంసించారు. మమతా బెనర్జీ లేఖపై మీడియా ప్రశ్నించినపుడు సీఎం ఉద్ధవ్కు కూడా లేఖ వచ్చిందని, ఎన్నికల తర్వాత పొత్తులపై చర్చించే అవకాశం ఉందన్నారు. ఇక పశ్చిమబెంగాల్లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు నిజమైన మహాభారతం కంటే భయంకరంగా ఉన్నాయని రౌత్ ఆందోళన వ్యక్తంచేశారు. బెంగాల్ ఎన్నికలను దేశం మొత్తం పరిశీలిస్తోందని, ప్రజలు కూడా తెలివైనవారేనని ఎంపీ వ్యాఖ్యానించారు. ఇక ఇటీవల సంజయ్పై బాలాసాహెబ్ థోరాట్ చేసిన విమర్శలపై స్పందిస్తూ.. యూపీఏ నాయకత్వాన్ని సోనియా నుంచి శరద్ పవార్కు అప్పగించాలని అనలేదని, కేవలం యూపీఏను గాడిలో పెట్టాలనే వ్యాఖ్యానించానని ఎంపీ స్పష్టంచేశారు. -
పెళ్లి బరాత్లో నవవధువు హల్చల్.. ఏం చేసిందంటే!
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఓ అపూర్వ ఘట్టం. నిరుపేదల నుంచి కోటీశ్వరుల వరకు పెళ్లి జ్ఞాపకాలలో ఓలలాడని వారుండరు. అందుకే ప్రతి ఒక్కరూ బంధు పరివారం, ఆప్తమిత్రులు, శ్రేయోభిలాషుల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంటుంటారు. పెళ్లిలో రకరకాల తంతులు ఉంటాయి. అన్నింటిలోకి అప్పగింతలు ప్రత్యేకం. నూత్న వధువును అత్తారింటికి పంపిస్తూ తమ కూతుర్ని కష్టపెట్టకుండా చూసుకోవాలని వియ్యాలవారికి అప్పగిస్తారు తల్లిదండ్రులు. ఇటువంటి భావోద్వేగ క్షణాలను ఓ నవ వధువు అపూర్వ జ్ఞాపకాలుగా మలుచుకుంది. అప్పగింతలు, ఊరేగింపును విభిన్నంగా జరుపుకుని సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. పశ్చిమ బెంగాల్లోని కోల్కతాకు చెందిన స్నేహ సింఘి సిటీలోని ప్రముఖ కేఫ్ ఓనర్. ఎప్పుడూ వినూత్నంగా ఆలోచించే స్నేహ తన మ్యారేజ్ వేడుకలను విభిన్నంగా చేసుకోవాలని ఎప్పటినుంచో అనుకునేది. ఇటీవలే పెద్దలు నిర్ణయించిన పెళ్లి చేసుకున్న స్నేహ.. అప్పగింతల కార్యక్రమం తర్వాత జరిగే ఊరేగింపు (బరాత్) సందర్భంగా తనే కారు నడిపి అతిథులను ఆశ్చర్యపరిచింది. ఈ వీడియోను స్నేహ ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేయగా అది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వెడ్డింగ్ రోజున తాను చేసిన ఈ పని తనకు మరింత ఆనందాన్నిచ్చిందని స్నేహ చెప్పింది. పెళ్లితంతు ముగిసిన తరువాత ఎరుపు రంగు లెహెంగా ధరించి తన భర్తతో కలిసి బయటకు వచ్చిన స్నేహ.. సిద్ధంగా పూలతో అలంకరించిన కారు డ్రైవర్ సీట్లో కూర్చుంది. పక్కనే భర్త సౌగత్ కూర్చొన్నారు. అప్పగింతల పాట, డప్పు వాద్యాల నడుమ స్నేహ ఒక పక్క ఆనందం మరోపక్క తన వారికి దూరంగా వెళ్తున్న బాధతో నెమ్మదిగా కారు నడుపుతూ ముందుకు సాగింది. పెళ్లి నాడే కారు నడిపిన స్నేహ అంతే బాధ్యతతో తన సంసార నౌకను కూడా సుఖంగా... సౌకర్యంగా నడపగలదని ఆశిద్దాం. View this post on Instagram A post shared by Sneha Singhi Upadhaya (@snehasinghi1) -
నా జుట్టు పట్టుకొని లాగి కొట్టారు!
కోల్కత్తా: పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నకోలది భారతీయ జనాతా పార్టీ, తృణముల్ కాంగ్రెస్ పార్టీల మధ్య రాజకీయాలు మరింత హీట్ను పుట్టిస్తున్నాయి. కాగా, ఇరుపార్టీలు ఏదో ఒక ఘటనతో ప్రతిరోజు వార్తల్లో నిలుస్తున్నాయి. తాజాగా, బీజేపీ పార్టీకి చెందిన ఒక కార్యకర్త ఇంటిపై తృణముల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంత మంది కార్యకర్తలు దాడిచేశారని ఒక మహిళ ఆరోపించింది. ‘తన భర్తను, నన్ను ఇద్దరిని ఇంటి నుంచి బయటకు లాగి కొట్టారని తెలిపింది. తమ కారును కూడా ధ్వంసం చేశారని వాపోయింది. అయితే, ఆదివారం జరిగిన ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సదరు మహిళ తెలిపింది. అయితే దీనిపై స్పందించిన తృణముల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చిత్తరంజన్ మండల్ ఈ ఆరోపణలను ఖండించాడు. ఈ ఘటనతో తమ వారికి ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నాడు. కాగా, వారు తమకారును తామే ధ్వంసం చేసుకుని కావాలనే తమపై బురదజల్లుతున్నారని మండిపడ్డారు. భారతీయ జనాతపార్టీ ప్రతి విషయాన్నిరాజకీయం చేయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. చదవండి: దెబ్బతిన్న పులి మరింత ప్రమాదకారి: దీదీ -
బెంగాల్ దంగల్: ‘అమిత్ షా అబద్ధాలు ఇవిగో..’
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో ఎన్నికల ప్రచారం రసవత్తరంగా కొనసాగుతోంది. రాజకీయ నాయకుల పరస్పర విమర్శలతో వేడి రాజుకుంటోంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా గతంలో ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. 2020 అక్టోబర్లో ఓ టీవీ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. బెంగాల్లోని ప్రతి జిల్లాలో బాంబు తయారీ కర్మాగారాలున్నాయని వ్యాఖ్యానించారు. మమతపై విమర్శలు చేసే క్రమంలో బెంగాల్ను కించపరిచే విధంగా అమిత్ షా మాట్లాడారు. బెంగాల్కు చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త సాకేత్ గోఖలే ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా వెల్లడించారు. అమిత్ షా మితిమీరిన వ్యాఖ్యల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్లో బాంబు కర్మాగారాలపై సమాచారం కోసం ఆర్టీఐలో దరఖాస్తు చేయగా, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఎలాంటి సమాచారం లేదని జవాబిచ్చిందని తెలిపారు. ప్రముఖ న్యూస్ చానళ్లు సైతం ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదని గుర్తు చేశారు. కొన్ని పత్రికలు పక్షపాతవైఖరిని అవలంభిస్తున్నాయని సాకేత్ ట్విటర్లో పేర్కొన్నారు. కాగా, సాకేత్ ట్వీట్పై నెటిజన్లు, టీఎమ్సీ నాయకులు స్పందించారు. ఎన్నికల్లో లాభం పొందడం కోసం బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని, అంతేకాకుండా బెంగాల్ ప్రతిష్టను దెబ్బతీసేలా చూస్తోందని ఆ పార్టీ ఎంపీ మహువా మొయిత్రా ధ్వజమెత్తారు. బెంగాల్లో ఎలాంటి బాంబు తయారీ కర్మాగారాలు లేవని తేలిందన్నారు. అబద్దపు ఆరోపణలు చేసే బీజేపీ కర్మాగారానికి కొంచెం విశ్రాంతిని ఇవ్వండని హితవు పలికారు. ఇదిలాఉండగా.. బెంగాల్లో బాంబ్ తయారీ కర్మాగారాలు ఉన్నాయంటూ పశ్చిమ బెంగాల్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ కూడా గతంలో ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా సీఎం మమతా బెనర్జీ బెంగాల్ను ‘రెండో కశ్మీర్’ గా మార్చారని విమర్శలు గుప్పించారు. చదవండి: మమతా బెనర్జీ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల Not a *single* media house had the spine to report on the fact that Union Home Minister Amit Shah lied on national television. What’s up @aroonpurie? While u shamelessly preach to the Congress on what Opposition should do, why do you get so silent when it comes to the BJP govt? https://t.co/RY6ueQGFmt— Saket Gokhale (@SaketGokhale) March 10, 2021 -
ఫత్వా: టీవీ చూసినా, పాటలు విన్నా శిక్ష
కోల్కతా: ముర్షిదాబాద్ జిల్లాలోని మైనారిటీ ఆధిపత్య గ్రామానికి చెందిన అధిపతులు టెలివిజన్ చూడటం, క్యారమ్ ఆడటం, మద్యం లేదా లాటరీ టిక్కెట్లు కొనడం, అమ్మడం, సెల్ఫోన్లు, కంప్యూటర్ల ద్వారా సంగీతం వినడం వంటి ఇతర కార్యకలాపాలపై నిషేధం విధించారు. సామాజిక సంస్కరణల కమిటీ రూపొందించిన ఈ ఫత్వా ఆగస్టు 9న జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ నిబంధనలు అతిక్రమించిన వారికి చెవులు పట్టుకొని క్షమాపణలు చెప్పడం, గుండు చేయించడం, గుంజిళ్లు తీయించడం వంటి శిక్షలతో పాటు రూ .500 నుంచి రూ .7000 వరకు జరిమానాలు విధించనున్నట్లు ఆ ఫత్వాలో పేర్కొన్నారు. ఈ కమిటీ సూచించిన శిక్షల జాబితా: టీవీ చూడటం, సంగీతం వినడానికి మొబైల్ ఫోన్లు లేదా కంప్యూటర్ ఉపయోగించడం: రూ. 1,000 జరిమానా క్యారమ్ బోర్డు ఆడటం: రూ. 500 జరిమానా లాటరీ కొనుగోలు: రూ. 2,000 జరిమానా మద్యం అమ్మకం: రూ. 7,000తో పాటు గుండు చేసి గ్రామంలో ఊరేగిస్తారు. లాటరీ టికెట్లను అమ్మడం: రూ. 7,000 జరిమానా మద్యం సేవించడం: రూ. 2,000 జరిమానా, 10 గుంజిళ్లు గంజాయి కొనుగోలు: రూ. 7,000 జరిమానా అంతేకాకుండా నిబంధనలు ఉల్లంఘించిన వారి గురించి తెలియజేసేవారికి నేరం స్వభావాన్ని బట్టి 200 నుంచి 2,000 రూపాయల వరకు రివార్డును కూడా కమిటీ ప్రకటించింది. యువ తరం నైతిక, సాంస్కృతిక పద్దతులను తప్పి చెడు మార్గాలలో వెళ్లకుండా ఆపడానికి వీటిపై నిషేధం విధించినట్లు కమిటీ పేర్కొంది. చదవండి: కారంపొడి కొట్టి మరీ దొరికిపోయాడు -
కరోనా అనుమానితుడు.. పీపీఈ కిట్ ధరించి
కోల్కతా: కరోనా వైరస్ మనిషిని చంపితే.. భయం మనలోని మానవత్వాన్ని చంపుతోంది. కళ్లెదుట మనిషి చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నా దగ్గరకు వెళ్లి సాయం చేయట్లేం. కారణం వారికి కరోనా ఉంటే మనకు సోకుతుంది. ఎందుకు వచ్చిన తలనొప్పి అని ఎవరికి వారే దూరంగా ఉంటున్న పరిస్థితి. ఈ క్రమంలో పశ్చిమబెంగాల్ టీఎంసీ నాయకుడు చూపిన సాహసం ప్రస్తుతం తెగ వైరలవ్వడమే కాక ప్రశసంలు పొందుతుంది. వివరాలు.. గోపిబల్లవపూర్కు చెందిన అమల్ బారిక్(43) ఉపాధి నిమిత్తం వేరే రాష్ట్రం వెళ్లాడు. లాక్డౌన్ కారణంగా సొంత ఊరికి వచ్చాడు. ఈ నేపథ్యంలో గత 5-6 రోజులుగా విపరీతమైన జ్వరంతో బాధపడుతున్నాడు. ఆస్పత్రి వెళ్లడానికి కూడా ఓపిక లేదు. దాంతో బారిక్ భార్య ఇరుగుపొరుగును సాయం కోరింది. కానీ కరోనా భయంతో ఎవరూ ముందుకు రాలేదు. అంబులెన్స్, ప్రైవేట్ వాహనం బుక్ చేసుకునేంత ఆర్థిక స్థోమత లేదు వారికి. దాంతో ఏం చేయాలో తెలీక బాధపడుతోంది. (కరోనా జీవితం పోరాటంగా మారింది) అయితే ఈ విషయం గురించి గోపిబల్లవపూర్ యూత్ వింగ్ ప్రెసిడెంట్ సత్యకం పట్నాయక్కు తెలిసింది. దాంతో ఇతర కార్యకర్తలతో మాట్లాడి ఓ బైక్ ఏర్పాటు చేసుకున్నాడు. మెడికల్ షాప్కు వెళ్లి పీపీఈ కిట్ తెచ్చుకున్నాడు. అనంతరం బారిక్ ఇంటికి వెళ్లి అతడిని బైక్ మీద కూర్చోపెట్టుకుని సమీప ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడ వైద్యులు బారిక్ను పరీక్షించి కొన్ని మందులు ఇచ్చి.. ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకోమని తెలిపారు. పట్నాయక్ తిరగి అతడిని ఇంటికి చేర్చాడు. పీపీఈ కిట్ ధరించి బైక్ మీద బారిక్ను ఆస్పత్రికి తీసుకెళ్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైలయ్యింది. దీని గురించి పట్నాయక్ మాట్లాడుతూ.. ‘బారిక్ పరిస్థితి తెలిసి.. కామ్గా ఉండలేకపోయాను. నా కళ్ల ముందు ఎవరైనా బాధపడుతుంటే చూడలేను. దాంతో పీపీఈ కిట్ ధరించి అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లాను’ అన్నాడు. (కరోనా బారిన రామ జన్మభూమి ట్రస్టు ఛైర్మన్) అంతేకాక ‘పాపం నేను అతడికి ఇంటికి వెళ్లేసరికి బారిక్ భార్య, ఇద్దరు కుమారులు అతడి పరిస్థితి గురించి తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఆస్పత్రికి తీసుకెళ్తానని తెలిసి బారిక్ భార్య మాతో పాటు హస్పటల్కి వస్తానంది. కానీ ఆమెకు నచ్చచెప్పి అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లి.. వైద్యం చేయించి తీసుకువచ్చాను. ఎవరైనా ఇలాంటి పరిస్థితుల్లో వుంటే వారికి కూడా సాయం చేస్తాను. అందుకే మరో 4 పీపీఈ కిట్లు కూడా ఆర్డర్ చేశాను’ అని తెలిపాడు. పట్నాయక్ పీపీఈ కిట్ ధరించి బారిక్ను ఆస్పత్రికి తీసుకెళ్తున్న వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. అతడి మంచి మనసును ప్రశంసిస్తున్నారు నెటిజనులు. -
రూపాయికో పండు : అయినా దిక్కులేదు
కోల్కతా : పండ్ల విక్రేతలు, రైతులనూ కరోనా మహమ్మారి వెంటాడుతోంది. కారుచౌకగా లభించే పండ్లనూ కొనేవారు లేక అయినకాడికి అమ్ముకునేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో.. పోషక విలువల్లో మేటిగా పేరొందిన జామపండు రూపాయికి ఒకటి లభిస్తున్నా కొనేవారు లేక రైతులు, పండ్ల విక్రేతలు ఆవేదన చెందుతున్నారు. కరోనా వైరస్ వ్యాప్తికి ముందు ఏడెనిమిది రూపాయలు పలికిన ఒక్కో జామ ఇప్పుడు కేవలం రూపాయికే అందుబాటులో ఉంది. రూపాయికి ఒక జామపండును అందిస్తున్నా ఎవరూ కొనకపోవడంతో ఒక్కోసారి పండ్లను రోడ్డుపైనే పారబోస్తున్నామని పండ్ల విక్రేతలు ఆవేదన వ్యక్తం చేశారు. గిరాకీ లేక అరకొర రేటుకే పండ్లను తెగనమ్ముతున్నా ఆ ధరకూ ఏ ఒక్కరూ కొనకపోవడంతో జామ రైతులకు నష్టాలు ఎదురవుతున్నాయి. దక్షిణ 24 పరగణాల జిల్లాకు చెందిన విమల్ సర్ధార్ (52) గత ఏడాది తనకున్న ఎకరం తోటలో జామ పంటను సాగుచేసి మంచి దిగుబడి సాధించాడు. జామ పండ్లను విక్రయించగా వచ్చిన డబ్బుతో రూ 60,000 అప్పు తీర్చాడు. ఈ ఏడాది కరోనా వైరస్తో పాటు తుపాను బీభత్సంతో పరిస్థితి తారుమారైందని అప్పు ఎలా తీర్చాలో అర్ధం కావడం లేదని వాపోయారు. తమకు ఇప్పటివరకూ ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదని ఆందోళన వ్యక్తం చేశారు. పండ్ల రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని అన్నారు. లాక్డౌన్, ఆంఫన్ తుపాన్తో పశ్చిమ బెంగాల్లో జామ సాగుదారులు, హోల్సేలర్లు తీవ్రంగా నష్టపోయారు. అన్లాక్ దశలో అడుగుపెట్టినా లోకల్ ట్రైన్స్ను అనుమతించపోవడంతో పండ్ల సరఫరాలూ దెబ్బతిన్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ సీజన్లో జామ పండ్ల విక్రయాలు దారుణంగా పడిపోయాయని వ్యాపారులు వాపోతున్నారు. చదవండి : ‘కరోనా నుంచి దేవుడే మనల్ని కాపాడాలి’ -
మరి షహీన్బాగ్ ఘటనలో ఎవరూ మరణించలేదే!
కోల్కతా : నోట్ల రద్దు సమయంలో బ్యాంకుల ఎదుట పొడవాటి క్యూల్లో వేచిచూడటంతో వంద మంది ప్రాణాలు కోల్పోయారని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ బెంగాల్ చీఫ్ దిలీప్ ఘోష్ మరో వివాదానికి తెరతీశారు. నోట్ల రద్దు సమయంలో అంతమంది చనిపోతే సీఏఏకు వ్యతిరేకంగా ఢిల్లీలోని షహీన్బాగ్లో జరుగుతున్న ఆందోళనల్లో ఏ ఒక్కరూ ఎందుకు మరణించలేదని ఆయన ప్రశ్నించారు. కోల్కతా ప్రెస్క్లబ్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఘోష్ ఈ వ్యాఖ్యలు చేశారు. రెండు మూడు గంటల పాటు క్యూల్లో నిలుచుని ప్రజలు ప్రాణాలు విడిస్తే..ఇప్పుడు మహిళలు, చిన్నారులు రోజంతా మంచును సైతం లెక్కచేయకుండా గంటల తరబడి కూర్చున్నా ఏ ఒక్కరూ చనిపోకపోవడం తనను ఆశ్చర్యపరుస్తోందని అన్నారు. నిరసనల్లో పాల్గొనడం ద్వారా వారికి ఏం ఒరుగుతోందని ప్రశ్నించారు. షహీన్బాగ్లో మహిళలు, చిన్నారులు రోజంతా ఆందోళనలో పాల్గొనడంతో వీరి నిరసన అందరినీ ఆకట్టుకుంటోందని, వీరికి రోజుకు రూ 500 చెల్లిస్తున్నారని కొందరు చెబుతున్నారని చెప్పారు. షహీన్బాగ్ ఉదంతం వెనుక ఏం జరుగుతోందనేది త్వరలోనే వెలుగులోకి వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. చదవండి : ‘అలాగైతే ఆవులపై గోల్డ్ లోన్’ -
బెంగాల్లో ఆ సంస్కృతి లేదు
న్యూఢిల్లీ: ‘బెంగాలీల జీవితాల్లో, సంస్కృతుల్లో భాగం దుర్గా మాతా, 'జై శ్రీరామ్' నినాదం ఇటీవల దిగుమతి చేసుకున్న నినాదమే కానీ బెంగాల్ సంస్కృతితో ఎటువంటి సంబంధం లేదని’ నోబెల్ బహుమతి గ్రహీత, ప్రముఖ సాహితీవేత్త అమర్త్యసేన్ వ్యాఖ్యానించారు. జాదవ్పూర్ విశ్వవిద్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ‘ఈ రోజుల్లో ప్రజలను కొట్టడానికి ఒక సాకుగా మాత్రమే జై శ్రీరామ్ నినాదం ఉపయోగిస్తున్నారు. నేను ఇంతకు ముందు జై శ్రీరామ్ నినాదం వినలేదు. దీనికి బెంగాలీ సంస్కృతితో సంబంధం లేదని భావిస్తున్నాను. గతంలో బెంగాల్లో రామనవమి వేడుకలు నిర్వహించడం వినలేదని, ఇప్పుడు రామ నవమిని కోల్కతాలో ఎక్కువగా జరుపుకుంటున్నారు’ అని అన్నారు. ‘నీకు ఇష్టమైన దేవత ఎవరు అని నా నాలుగేళ్ల మనవరాలిని అడిగాను. అప్పుడు ఆమె మా దుర్గా అని బదులిచ్చింది. దుర్గ దేవి మా జీవితంలో సర్వవ్యాప్తి’ అని ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్ససేన్ అన్నారు. కాగా గత గురువారం మమతా బెనర్జీ 623 సంవత్సరాల నాటి రథయాత్రను ప్రారంభించడానికి హుగ్లీ జిల్లాలోని మహేష్ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు బీజేపీ మద్దతుదారులు ‘జై శ్రీరామ్’ నినాదాలతో స్వాగతం పలికిన విషయం తెలిసిందే. ఈ మధ్యకాలంలో బెంగాల్లో ‘జై శ్రీరామ్’ నినాదాలు చేయడంపై తృణమూల్ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మధ్య అనేక గొడవలు జరిగాయి. మే నెలలో ఉత్తర 24 పరగణాల జిల్లాలో జరిగిన బహిరంగ సభలో ‘జై శ్రీ రామ్’ నినాదాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ అనేక విమర్శలు ఎదుర్కొన్నారు. -
అక్కడి సేల్స్.. జనం పల్స్ చెబుతాయి!
సాక్షి, సెంట్రల్ డెస్క్ : కోల్కతాలో అతి పెద్ద హోల్సేల్ మార్కెట్ బుర్రా బజార్. అక్కడ అడుగుపెడితే.. ఎలక్షన్ ఫీవరే కాదు, జనం నాడిని కూడా పట్టుకోవచ్చు. ఈ మార్కెట్లో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీకి సంబంధించిన ఎన్నికల సామగ్రి ఎక్కువగా అమ్ముడుపోతుంది. జాతీయ జెండాలు, టీ షర్ట్లు, చీరలు, స్టోన్స్, గొడుగులు, బ్యాడ్జెట్స్, రిస్ట్ బ్యాండ్స్, బెలూన్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. వాటి మీద మోదీ ఫొటోలు, లేదంటే ఆకట్టుకునే బీజేపీ ఎన్నికల నినాదాలు కనిపిస్తాయి. ఇక టీఎంసీ ఎన్నికల గుర్తు గడ్డి, రెండు పువ్వులు, ఆ పార్టీ ఎన్నికల నినాదాలు ముద్రించి ఉన్న వస్తువులకీ డిమాండ్ ఎక్కువుంది. గత రెండు నెలల అమ్మకాలు పరిశీలిస్తే టీఎంసీకి చెందినవి 10 వేల వస్తువులు అమ్ముడుపోతే, బీజేపీవి 2,500 అమ్ముడయ్యాయి. ‘కోల్కతాలో అతి పెద్ద మార్కెట్ ఇదే. బెంగాల్ నలుమూలల నుంచి ఎన్నికల సమయంలో పార్టీ మద్దతుదారులు వచ్చి రకరకాల వస్తువులు కొంటుంటారు. 50 ఏళ్లుగా నా దుకాణం ఇక్కడే ఉంది. తృణమూల్ పార్టీ వస్తువులకే డిమాండ్ ఎక్కువ. టీఎంసీ, బీజేపీ అమ్మకాలు 4ః1 నిష్పత్తిలో ఉంటాయి’ అని గంభీర్ అనే దుకాణదారుడు వివరించారు. ఈ అమ్మకాలే ఓ రకంగా పశ్చిమ బెంగాల్లో ఎన్నికల సరళిని కూడా తెలుపుతోందని ఆయన అన్నారు. ‘ఎన్నికలకు ఆరు నెలల ముందే పార్టీల వారీగా సామగ్రిని అమ్మకానికి పెడతాం. మొత్తమ్మీద అమ్మకాల ఆధారంగా జనం మూడ్ని పసిగట్టగలం’ అని మరో దుకాణదారుడు కిషన్ దాగా వ్యాఖ్యానించారు. వాస్తవానికి ఈ మార్కెట్లో మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్లోని సూరత్ నుంచి వచ్చిన వ్యాపారులే ఎక్కువున్నారు. కానీ ఈ మార్కెట్పై మమత పట్టు కొనసాగుతోంది. రాహుల్ టీ షర్టుల్ని ఎవరూ పట్టించుకోవట్లేదు. -
ప్రధాని పేరు తెలియదని చెంప ఛెళ్లుమనిపించారు
కోల్కతా : ప్రధాని పేరు తెలియక పోవడం కూడా నేరంగా మారింది. అదే ఓ అమాయకుడైన ప్రయాణికుడిపై దాడికి కారణమయ్యింది. ముక్కూ మొహం తెలియని తోటి ప్రయాణీకులు ప్రధాని పేరేమిటన్న ప్రశ్నకి సరైన సమాధానం చెప్పకపోవడంతో ఓ మైనారిటీ వ్యక్తిపై దాడికి తెగబడ్డ ఘటన పశ్చింబెంగాల్లోని ఓ రైలులో జరిగింది. వలస కూలీ అయిన బాధితుడు హౌరా నుంచి మాల్దా జిల్లా కాలియాచక్కి వెళుతుండగా రైల్లో తన పక్కసీట్లో కూర్చుని వున్న నలుగురు వ్యక్తులు భారత ప్రధాని పేరేమిటి అని ప్రశ్నించడంతో అక్షరం ముక్కరాని ఆ ప్రయాణికుడు బిక్కమొహం వేసాడు. గుచ్చి గుచ్చి అగడగడంతో తనకు తెలిసిన ఒకే ఒక పేరు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీయే మన ప్రధాని అని సమాధానమిచ్చాడా నిరక్షరాస్యుడు. దీంతో మరి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఎవరు? మన రాష్ట్రపతి పేరేమిటి అంటూ ఆ తరువాత కూడా ఆ నలుగురూ ప్రశ్నలతో వేధించడమే కాకుండా అతని పై చేయిచేసుకొన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పైగా జాతీయగీతాన్ని ఆలపించమని ఆ నలుగురూ ఒత్తిడిచేయడంతో తనకు తెలిసినంతవరకూ భయం భయంగా పాడివినిపించాడా వ్యక్తి. దీంతో ‘‘నీకు నమాజ్ చదవడం తెలుసు కదా? మరి జాతీయ గీతం ఎందుకు రాదు?’’ అని నిలదీయడం, పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ గురించి తెలుసా అంటూ ఎద్దేవా చేయడం వీడియోలో స్పష్టంగా వినిపించింది. బందేల్ స్టేషన్ లో ఆ అగంతకులు దిగిపోయినట్టు పోలీసు అధికారులు తెలియజేసారు. బంగ్లా సంస్కృతి మంచ్ స్థానిక స్వచ్ఛంద సంస్థ ప్రయాణికుడిపై దాడి ఘటన వీడియో ఆధారంగా కాలియచక్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు స్టేషన్ ఇన్స్పెక్టర్ సుమన్ చటర్జీ తెలిపారు. -
చదువు రాదన్నా.. చెంప పగలగొట్టారు
-
పశ్చిమబెంగాల్ బీజేపీలో అసీమానంద!
కోల్కతా: హైదరాబాద్లో 2007 మక్కా మసీదు బాంబు పేలుళ్ల కేసులో ఇటీవల నిర్దోషిగా విడుదలైన హిందుత్వ బోధకుడు స్వామి అసీమానంద(66)పై పశ్చిమబెంగాల్ బీజేపీ దృష్టి సారించింది. పశ్చిమబెంగాల్లో బీజేపీని పటిష్టం చేసేందుకు అసీమానంద సేవల్ని వినియోగించుకోవాలని భావిస్తున్నట్లు ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు మీడియాకు తెలిపారు. కాగా, ఈ విషయమై బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ స్పందిస్తూ.. ‘స్వామి అసీమానంద వ్యక్తిగతంగా నాకు చాలాకాలంగా తెలుసు. బెంగాల్కు వచ్చి పార్టీ కోసం పనిచేసే విషయమై ఆయనతో మాట్లాడతాను. అసీమానంద రాష్ట్రంలోని ఆదివాసీ ప్రాంతాల్లో గతంలో చాలాకాలం పనిచేశారు. ఆయన పార్టీకి చాలారకాలుగా ఉపయోగపడతారు’ అని వ్యాఖ్యానించారు. -
డాక్టర్ అవతారం ఎత్తిన ఏసీ టెక్నిషియన్
కోల్కతా: ఏసీ టెక్నిషియన్ డాక్టర్గా అవతారం ఎత్తడంతో ఓ బాలుడు మృతి చెందిన సంఘటన పశ్చిమ బెంగాల్లో కలకలం రేపింది. 10వ తరగతి చదువుతున్న అర్జిత్(16) అనే బాలుడు ఆనారోగ్యంతో బాధ పడుతుండటంతో కుటుంబ సభ్యులు దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ అన్నిపరీక్షలు చేసిన వైద్యులు సమస్య ఏమిటో తేల్చలేకపోయారు. దీంతో అతడిని బుర్ద్వాన్లోని అన్నపూర్ణ నర్సింగ్ హోంలోకి తరలించారు. నర్సింగ్ హోంకి చేరిన తరువాత ఆక్సిజన్ పెట్టిన కొద్దిసేపటికే అర్జిత్కు తీవ్రమైన ఛాతీ నొప్పిరావడంతో అనుమానం వచ్చిన బంధువులు.. బాలుడిని అంబులెన్స్లో 105 కి.మీ దూరంలో ఉన్న కోల్కత్తాలోని రవీంద్రనాధ్ ఠాగూర్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ కార్డీయాక్ సైన్సెస్ లో చేర్పించారు. అక్కడ చేరిన కొంత సమయానికే బాలుడు మృతి చెందాడు. అయితే, అంబులెన్స్ డ్రైవర్గా ఉన్న టేరాబాబు షా, సిలిండర్ ఫిట్ చేసిన సర్పరాజుద్దీన్ అంతకుముందు అన్నపూర్ణ నర్సింగ్ హోంలో వైద్య సహాయకులుగా కనిపించారు. ఆ తర్వాత సర్పరాజుద్దీన్ ఆక్సిజన్ సిలిండర్ ఫిట్చేసే మెకానిక్గా కనిపించడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టగా విచారణలో సర్పరాజుద్దీన్ అసలు నిజం ఒప్పుకున్నాడు. తాను వైద్యుడిని కాదని ఏసీ టెక్నిషియన్ అని ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు అతడ్ని, అంబులెన్స్ డ్రైవర్ను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. -
బెంగాల్లో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే
హౌరా: పశ్చిమ బెంగాల్లో వచ్చే ఎన్నికల్లో బీజేపీ పూర్తిస్థాయి మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కేంద్రజలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి ఆశాభావం వ్యక్తం చేశారు. అస్సాం, హర్యానాల్లో ఒకప్పుడు ఒకరిద్దరు మాత్రమే బీజేపీఎమ్మెల్యేలు ఉండేవారన్నారు. హౌరా రైల్వే స్టేషన్కు చేరుకున్న ఆమె విలేకరులతో మాట్లాడారు. కాంతి దక్షిణ్ అసెంబ్లీ ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి రెండో స్థానంలో ఉండడంతో పార్టీ వర్గాలను ఉత్జేపరిచేలా ఈ వ్యాఖ్యలు చేశారు. తృణమూల్ కాంగ్రెస్ ఈ సీటును తిరిగి నిలబెట్టుకోగా లెఫ్ట్ఫ్రంట్ అభ్యర్థి మూడో స్థానంలో నిలిచారు. -
గెలిచిన, ఓడిన ప్రముఖులు వీరే...
న్యూఢిల్లీ : అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్న ప్రముఖుల్లో కొందరికి విజయం వరించగా, మరికొందరికి నిరాశ ఎదురైంది. తమిళనాడులో డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి వ్యక్తిగతంగా విజయం సాధించినా, పార్టీ మాత్రం రెండోస్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అలాగే సినీనటులు విజయ్కాంత్, శరత్ కుమార్ కూడా పరాజయాన్ని మూటగట్టుకున్నారు. ఇక కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 75 సీట్లు వస్తాయని జోస్యం చెప్పిన క్రికెటర్ శ్రీశాంత్ ఓటమి పాలయ్యాడు. అలాగే పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో పోటీ చేసిన రూపా గంగూలీ, క్రికెటర్ లక్ష్మీ రతన్ శుక్లా ని విజయం వరించింది. కాగా, వివరాల్లోకి వెళితే.. తమిళనాడు: గెలుపొందినవారు: జయలలిత కరుణానిధి స్టాలిన్ పన్నీర్ సెల్వం మాజీ డీజీపీ నటరాజ్ ........... ఓడినవారు అన్బుమణి రాందాస్ డీఎండీకే అధినేత విజయ్ కాంత్ శరత్ కుమార్ పశ్చిమ బెంగాల్లో గెలిచిన ప్రముఖులు మమతా బెనర్జీ సుర్జాకాంత్ మిశ్రా బైచింగ్ భుటియా అమిత్ మిశ్రా రుపా గంగూలీ కె.మణీ లక్ష్మీ రతన్ శుక్లా కేరళలో గెలిచిన ప్రముఖులు ఊమెన్ చాందీ అచ్యుతానందం విజయన్ రమేష్ చెన్నతాల ఓడినవారు క్రికెటర్ శ్రీశాంత్ స్పీకర్ శక్తన్ డిప్యూటీ స్పీకర్ పాలొడే రవి అసోంలో గెలిచిన ప్రముఖులు సరబానంద్ సోనోవాల్ తరుణ్ గొగోయ్ పుదుచ్చేరిలో గెలిచిన ప్రముఖులు రంగస్వామి -
బీజేపీ, టీఎంసీ కార్యకర్తల ఘర్షణ
కోల్ కత్తా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆదివారం రెండో విడత పోలింగ్ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), బీజేపీ కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో 8మంది గాయపడ్డారు. ఈ సంఘటన బిర్భూమ్ జిల్లా దమ్ రుత్ గ్రామంలో చోటుచేసుకుంది. పోలింగ్ జరుగుతున్న సమయంలో ఘర్షణ జరిగిందని, ఇరు వర్గాలకు చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. దాడులకు గురైంది తమ పార్టీ సభ్యులేనని బీజేపీ పేర్కొంది. పోలింగ్ బూత్ లో ఉన్న తమ పార్టీ సభ్యునిపై తృణమూల్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డాడని బీజేపీ ఆరోపించింది. ఉత్తర బెంగాల్ లోని ఆరు జిల్లాల్లో ఈ రోజు పోలింగ్ జరిగింది. కొన్ని చోట్ల ఏవీయంలు మొరాయించగా, సిబ్బంది సరిచేశారు. -
అస్సోంలో 12శాతం, బెంగాల్ లో 23శాతం
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో భాగంగా పశ్చి మ బెంగాల్, అసోం రాష్ట్రాలలో తొలి దశ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ప్రజలు ఉత్సాహంగా తరలివచ్చి ఓటుహక్కు వినియోగించుకుంటున్నారు. సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ చురుకుగా సాగుతోంది. ఉదయం 9 గంటలకు అసోంలో 12 శాతం పోలింగ్ నమోదు కాగా, పశ్చిమ బెంగాల్ లో 23 శాతం పోలింగ్ నమోదైంది. ఇక పశ్చిమ బెంగాల్ లో అక్కడక్కడ చెదురు మదురు సంఘటనలు నమోదయ్యాయని రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారి తెలిపారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం మొరాయించడంతో కొంత గందరగోళం నెలకొంది. దీంతో అధికారులు పోలింగ్ ను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. 33 మంది అభ్యర్థులు బరిలో ఉన్న తొలి దశ ఎన్నికల్లో బెంగాల్ రాష్ట్రంలో 18 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 18 నియోజకవర్గాలల్లో తృణమూల్ కాంగ్రెస్-వామపక్ష కూటమి భారతీయ జనతా పార్టీల అభ్యర్థులు బరిలో ఉన్నారు. అస్సోంలో మొదటి రెండు గంటల్లో 12 శాతం పోలింగ్ శాతం నమోదయినట్టు ఎన్నికల కమిషన్ అధికారి తెలిపారు. ప్రజలు తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు ఉదయం నుంచే పోలింగ్ స్టేషన్ల ముందు బారులు తీరారు. ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్, భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి శరబానందా సొనవాల్ సహా 539 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించనున్న మొదటి దశలో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. అస్సోంలో 65 స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో 539 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఏప్రిల్ 11, 17, 21, 25, 30, మే 5 తేదీలలో మలిదశ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. -
'ఆ ఒక్కటీ తప్ప మిగతా పరిశ్రమలు కుదేల్'
భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షుడిగా రెండోసారి ప్రమాణం చేసిన తర్వాతిరోజే తదుపరి కార్యక్షేత్రం పశ్చిమబెంగాల్ పై దృష్టి సారించారు అమిత్ షా. సోమవారం కోల్ కతాలో రాష్ట్ర బీజేపీ నిర్వహించిన సభలో పాల్గొన్న ఆయన అధికార తృణమూల్ కాంగ్రెస్ పై తీవ్రస్థాయి విమర్శలు గుప్పించారు. దేశ ద్రోహులు, అసాంఘిక శక్తులకు పశ్చిమబెంగాల్ అడ్డాగా మారిందని, మమత నేతృత్వంలోని టీఎంసీ ప్రభుత్వ వైఫల్యమే ఇందుకు కారణమని ఆరోపించారు. 'ఒక్క చిట్ ఫండ్ వ్యాపారం తప్ప రాష్ట్రంలోని మిగతా పరిశ్రమలన్నీ కుదేలయ్యాయి. చిట్ ఫండ్ వ్యాపారం మాత్రమే మూడుపువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతున్నది' అంటూ శారద చిట్ ఫండ్ కుంభకోణాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ దీదీపై విమర్శలు గుప్పించారు. ఈ ఏడాది నవంబర్ లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్ననేపథ్యంలో ఆ రాష్ట్రంలో పాగావేసేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నది. ఎన్నికల ఏడాది మొదటినెలలోనే అమిత్ షా రాకతో అనధికారికంగా ప్రచార శంఖారావాన్ని పూరించినట్లేనని విశ్లేషకులు అంటున్నారు. -
30 నాటు బాంబులు స్వాధీనం
కోల్కతా: పశ్చిమబెంగాల్లో శుక్రవారం 30 నాటు బాంబులు స్వాధీనం చేసుకున్నారు. మాల్దా జిల్లాలోని ఓ మామిడి తోటలో వీటిని గుర్తించారు. ఓ ప్లాస్టిక్ బ్యాగ్లో ఉంచి మామాడి తోటలో దాచినట్టు పోలీసులు తెలిపారు.బాంబు డిస్పోజల్ సిబ్బంది వీటిని నిర్వీర్యం చేసినట్టు చెప్పారు. తోట యజమాని మోషిన్ షేక్ కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. -
దీదీకి అన్నాహజారే మద్దతు
వచ్చే లోక్సభ ఎన్నికల్లో తృణమూల్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నా ఎజెండా అమలుచేసేందుకు మమత అంగీకరించారు ఆమె నిరాడంబరత, సమాజం పట్ల దృక్పథం అద్భుతం దీదీ ఆధ్వర్యంలో రాజకీయ వ్యవస్థలో మార్పులు వస్తాయి కేజ్రీవాల్, మోడీలను బలపరచబోను: హజారే న్యూఢిల్లీ: సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మద్దతు ప్రకటించారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఆమెకు, ఆమె పార్టీ తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ప్రచారంలో పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. దీదీకి అధికారమిస్తే దేశ ప్రగతి వేగవంతమవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో కేజ్రీవాల్ను, మోడీని బలపరచబోనని.. అలాగని వ్యతిరేకించబోనని హజారే స్పష్టం చేశారు. మరోవైపు తృణమూల్కు మద్దతివ్వాలన్న హజారే నిర్ణయాన్ని తప్పుబడుతూ.. మహిళా ఉద్యమ సంస్థలు ఆయనకు బహిరంగ లేఖ రాశాయి. ఢిల్లీలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో హజారే మాట్లాడారు. ఆయన మాటల్లోనే... - వివిధ రాజకీయ, పాలనా, భూ సంస్కరణలకు సంబంధించిన 17 సూత్రాల ఎజెండాను అన్ని రాజకీయ పార్టీలకు పంపాను. - వాటన్నింటినీ అమలు చేసేందుకు మమతా బెనర్జీ అంగీకరించడంతో.. ఆమెకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. - నేను పంపిన ఎజెండాపై కేజ్రీవాల్ ఏ మాత్రం స్పందించలేదు. దాంతో ఆయనకు మద్దతిచ్చే ప్రసక్తే లేదు. - తృణమూల్ పార్టీకి మాత్రమేకాదు.. మమతా బెనర్జీ వ్యక్తిత్వం, నిరాడంబరత, సమాజం పట్ల ఆమె దృక్పథాన్ని చూసే మద్దతిస్తున్నాం. - ఒక రాష్ట్రానికి సీఎం అయినా.. ఆమె చిన్న ఇంట్లో ఉంటారు, ప్రభుత్వ వాహనాలనూ వాడరు. - వచ్చే లోక్సభ ఎన్నికల్లో దీదీ నిలబెట్టిన అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తాం. దాంతోపాటు అవినీతి రహిత రాజకీయాల కోసం మార్చి నుంచి దేశవ్యాప్తంగా పర్యటిస్తా. - ఆమె 100 సీట్లు సాధించగలిగినా.. రాజకీయ వ్యవస్థలో మార్పులు తీసుకురావడానికి తోడ్పడుతుంది. - కాగా, ఆంధ్రప్రదేశ్ ఐపీఎస్ అధికారి, అదనపు డీజీ వినయ్కుమర్ సింగ్ రాసిన ‘ఈజ్ ఇట్ పోలీస్’ అనే పుస్తకాన్ని హజారే ఆవిష్కరించారు. - ఈ సందర్భంగా తాను మమతా బెనర్జీకి మాత్రమే మద్దతు ఇస్తున్నానని, ఏ రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వడం లేదని ఆయన పేర్కొన్నారు. కొన్ని అంశాలపై విభేదాలున్నాయి: మమత హజారే ఎజెండాలోని చాలా అంశాలను బెంగాల్లో మా ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తోంది. - భూసేకరణ వంటి రెండు మూడు అంశాల్లో కొన్ని విభేదాలు ఉన్నాయి. వాటిపై చర్చిస్తాం. - హజారే సలహా తీసుకుని బెంగాల్, అస్సాం, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్తో పాటు ఉత్తర, దక్షిణ భారత్లోని మరిన్ని చోట్ల లోక్సభకు పోటీ చేస్తాం. - యూపీఏ, ఎన్డీఏలలో దేనికీ మద్దతివ్వబోం. మమతకు మద్దతు వద్దు: మహిళా సంఘాలు వచ్చే ఎన్నికల్లో తృణమూల్కు మద్దతుగా ప్రచారం చేయాలన్న హజారే నిర్ణయాన్ని తప్పుబడుతూ మహిళా ఉద్యమ సంస్థలు ఆయనకు బహిరంగ లేఖ రాశాయి. ఇండియన్ డెమొక్రాటిక్ విమెన్ అసోసియేషన్, ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ విమెన్ అసోసియేషన్, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ విమెన్ తదితర సంస్థలు సంయుక్తంగా రాసిన ఈ లేఖలో... ‘‘దీదీకి మీరు మద్దతు ప్రకటించారని తెలిసి, ఆశ్చర్యానికి లోనయ్యాం. బెంగాల్లో ఆమె పార్టీ తృణమూల్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ అరాచకాలు పెరిగిపోయాయి. మహిళలకు భద్రమైన రాష్ట్రంగా ఉన్న బెంగాల్లో ఏ మాత్రం భద్రత లేని పరిస్థితి కల్పించారు. మహిళలు, యువతులు, పిల్లలపై జరుగుతున్న ఎన్నో దారుణమైన నేరాలకు అధికార పార్టీ నేతలు, కార్యకర్తలే నిందితులు. తమ కులం కానివాడిని ప్రేమించినందుకు పంచాయతీ ఆదేశంతో ఓ గిరిజన యువతిపై 13 మంది చేసిన ఘటనపై పోలీసులు, అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహించారు. ఇలాంటివి మరెన్నో ఉన్నాయి. తృణమూల్కు మద్దతివ్వాలన్న మీ నిర్ణయాన్ని పునఃపరిశీలిస్తారని ఆశిస్తున్నాం’’ అని పేర్కొన్నారు.