UP Yodha
-
సెమీస్లో యూపీ యోధాస్, పట్నా పైరేట్స్
పుణే: గత ఏడాది ప్రొ కబడ్డీ లీగ్లో 11వ స్థానంతో సరిపెట్టుకున్న యూపీ యోధాస్ ఈసారి మాత్రం సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన తొలి ఎలిమినేటర్ మ్యాచ్లో యూపీ యోధాస్ 46–18 పాయింట్ల తేడా మాజీ చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్ జట్టును చిత్తుగా ఓడించింది. రెయిడర్ భవానీ రాజ్పుత్ 12 పాయింట్లతో మెరిసి యూపీ యోధాస్ను సెమీఫైనల్కు చేర్చాడు. హితేశ్ 6 పాయింట్లు రాబట్టగా... గగన్ గౌడ, సుమిత్ 5 పాయింట్ల చొప్పున సాధించారు. భవానీ రాజ్పుత్ 14 సార్లు రెయిడింగ్కు వెళ్లాడు. 9 సార్లు పాయింట్లతో తిరిగి వచ్చాడు. రెండుసార్లు దొరికిపోగా, మూడుసార్లు పాయింట్ సాధించకుండానే వెనక్కి వచ్చాడు. మరోవైపు పింక్ పాంథర్స్ జట్టు సమష్టిగా విఫలమైంది. ఆ జట్టు రెయిడర్లుగానీ, డిఫెండర్లుగానీ ఆకట్టుకోలేకపోయారు. డిఫెండర్ రెజా మీర్బాఘేరి ఐదు పాయింట్లతో సరిపెట్టుకున్నాడు. భారీ ఆశలు పెట్టుకున్న కెప్టెన్ అర్జున్ దేశ్వాల్ కేవలం రెండు రెయిడింగ్ పాయింట్లు సాధించి నిరాశపరిచాడు. రెండో ఎలిమినేటర్ మ్యాచ్లో మూడుసార్లు చాంపియన్ పట్నా పైరేట్స్ 31–23 పాయింట్ల తేడాతో మాజీ విజేత యు ముంబా జట్టును ఓడించి ఎనిమిదోసారి సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. పట్నా పైరేట్స్ స్టార్ రెయిడర్లు దేవాంక్ 8 పాయింట్లు, అయాన్ 10 పాయింట్లు స్కోరు చేసి తమ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. ఆల్రౌండర్ గుర్దీప్ ఐదు పాయింట్లతో రాణించాడు. యు ముంబా తరఫున అమీర్ మొహమ్మద్ 7 పాయింట్లు... అజిత్ చౌహాన్ 5 పాయింట్లు సాధించారు.నేడు జరిగే సెమీఫైనల్స్లో హరియాణా స్టీలర్స్తో యూపీ యోధాస్ (రాత్రి 8 గంటల నుంచి), దబంగ్ ఢిల్లీతో పట్నా పైరేట్స్ (రాత్రి 9 గంటల నుంచి) తలపడతాయి. మ్యాచ్లను స్టార్ స్పోర్ట్స్–2 చానెల్లో, హాట్స్టార్ యాప్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. -
సెమీస్ బెర్త్ ఎవరిదో!
పుణే: గత రెండు నెలలుగా క్రీడాభిమానులను ఉర్రూతలూగించిన ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్ చివరి అంకానికి చేరింది. లీగ్ దశ పోటీలు ముగియగా... ఇక నాకౌట్ సమరాలకు వేళయింది. పాయింట్ల పట్టిక తొలి రెండు స్థానాల్లో నిలిచిన హరియాణా స్టీలర్స్, దబంగ్ ఢిల్లీ జట్లు నేరుగా సెమీఫైనల్స్కు అర్హత సాధించగా... ఆ తర్వాత 3 నుంచి 6వ స్థానం వరకు నిలిచిన జట్ల మధ్య గురువారం ఎలిమినేటర్ మ్యాచ్లు జరగనున్నాయి.ఇందులో విజయం సాధించిన జట్లు సెమీఫైనల్కు చేరనున్నాయి. రాత్రి 8 గంటలకు ప్రారంభం కానున్న తొలి ఎలిమినేటర్లో యూపీ యోధాస్తో జైపూర్ పింక్ పాంథర్స్ తలపడనుండగా... రాత్రి 9 గంటల నుంచి జరగనున్న రెండో ఎలిమినేటర్లో పట్నా పైరేట్స్తో యు ముంబా పోటీపడుతుంది. పీకేఎల్లో యూపీ యోధాస్ ఇప్పటి వరకు టైటిల్ గెలవలేకపోగా... జైపూర్ పింక్ పాంథర్స్ రెండుసార్లు విజేతగా నిలిచింది. పట్నా పైరేట్స్ మూడుసార్లు చాంపియన్గా నిలవగా... యు ముంబా కూడా ఒకసారి విన్నర్స్ ట్రోఫీని ముద్దాడింది. తాజా సీజన్లో యూపీ యోధాస్ 13 విజయాలు సాధించి 79 పాయింట్లతో పట్టికలో మూడో స్థానంలో నిలవగా... పింక్ పాంథర్స్ 12 విజయాలతో 70 పాయింట్లు సాధించి ప్లే ఆఫ్స్కు అర్హత సాధించింది. కెపె్టన్ సురేందర్ గిల్తో పాటు శివమ్ చౌధరీ యోధాస్కు కీలకం కానుండగా... పింక్ పాంథర్స్ జట్టు సారథి అర్జున్ దేశ్వాల్పై ఎక్కువగా ఆధారపడుతోంది. మరి ఈ కీలక పోరులో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి. లీగ్ చివరి మ్యాచ్ విజయంతో యు ముంబా ముందడుగు వేయగా... పట్నా పైరేట్స్ సమష్టి ప్రదర్శనతో సత్తా చాటి నాకౌట్లో అడుగు పెట్టింది. యు ముంబా జట్టు తరఫున కెప్టెన్ సునీల్ కుమార్, అజిత్ చౌహాన్, మన్జీత్ రాణిస్తుండగా... పైరేట్స్ తరఫున దేవాంక్, దీపక్ నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఎలిమినేటర్లో విజయం సాధించిన జట్లు శుక్రవారం జరగనున్న సెమీఫైనల్స్లో తలపడనున్నాయి. -
యూపీ యోధాస్ జోరు
పుణే: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో యూపీ యోధాస్ జోరుకు గుజరాత్ జెయింట్స్ చేతులెత్తేసింది. దీంతో యూపీ యోధాస్ 59–23 స్కోరుతో ఏకపక్ష విజయం సాధించింది. రెయిడర్లు గగన్ గౌడ (19 పాయింట్లు), భవాని రాజ్పుత్ (11 పాయింట్లు) అదరగొట్టగా, డిఫెండర్లు సుమిత్ (5), అశు సింగ్ (4), మహేందర్ సింగ్ (4) రాణించారు. 18 సార్లు కూతకెళ్లిన గగన్ గౌడ 13 సార్లు విజయవంతంగా పాయింట్లు తెచ్చిపెట్టాడు. మ్యాచ్లో నాలుగుసార్లు ప్రత్యర్థి జట్టును ఆలౌట్ చేయడం విశేషం. తొలి అర్ధభాగం మొదలైన ఎనిమిది నిమిషాలకే యోధాస్ ఆటగాళ్లు గుజరాత్ను ఆలౌట్ చేశారు. 12–7తో అక్కడ మొదలైన ఆధిపత్యం ఆఖరిదాకా కొనసాగింది. ఈ అర్ధభాగం ముగిసేలోపే మళ్లీ 18వ నిమిషంలో జెయంట్స్ ఆలౌటైంది. గుజరాత్ ఆటగాళ్లలో రెయిడర్ గుమన్ సింగ్ (7), ఆల్రౌండర్ జితేందర్ యాదవ్ (6), రెయిడర్ రాకేశ్ (5) రాణించారు. ఇదివరకే ప్లేఆఫ్స్కు అర్హత సంపాదించిన యూపీ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. అనంతరం జరిగిన మరో మ్యాచ్లో యు ముంబా 43–37తో పట్నా పైరేట్స్పై గెలిచింది. ముంబా రెయిడర్ అజిత్ చౌహాన్ (15) పదేపదే పాయింట్లు తెచ్చిపెట్టగా, డిఫెండర్లు సునీల్ కుమార్ (5), పర్వేశ్ (4), మన్జీత్ (4), ఆల్రౌండర్ రోహిత్ రాఘవ్ (4) సమష్టిగా రాణించారు. పైరేట్స్ తరఫున రెయిడర్ దేవాంక్ (12), అయాన్ (7), డిఫెండర్లు దీపక్ (4), శుభమ్ (4) మెరుగ్గా ఆడారు. నేడు జరిగే మ్యాచ్ల్లో జైపూర్ పింక్పాంథర్స్తో బెంగాల్ వారియర్స్... తెలుగు టైటాన్స్తో పుణేరి పల్టన్ తలపడనున్నాయి. -
ప్లే ఆఫ్స్కు పట్నా పైరేట్స్, యూపీ యోధాస్
పుణే: ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్లో పట్నా పైరేట్స్, యూపీ యోధాస్ జట్లు ప్లేఆఫ్స్కు దూసుకెళ్లాయి. లీగ్లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్లో పట్నా పైరేట్స్ 41–37 పాయింట్ల తేడాతో తెలుగు టైటాన్స్పై విజయం సాధించింది. తద్వారా 20 మ్యాచ్ల్లో 13 విజయాలు, 6 పరాజయాలు, ఒక ‘టై’తో 73 పాయింట్లు ఖాతాలో వేసుకున్న పైరేట్స్... పట్టికలో రెండో స్థానానికి చేరింది. మరోవైపు 21 మ్యాచ్ల్లో 11 విజయాలు, 10 పరాజయాలతో 61 పాయింట్లతో ఉన్న తెలుగు టైటాన్స్ పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోంది. కీలక పోరులో పట్నా పైరేట్స్ తరఫున దేవాంక్ 14 పాయింట్లతో విజృంభించగా... దీపక్, అంకిత్ చెరో ఆరు పాయింట్లతో అతడికి అండగా నిలిచారు. టైటాన్స్ తరఫున పవన్ సెహ్రావత్, విజయ్ మలిక్ చెరో 9 పాయింట్లతో పోరాడినా ఫలితం లేకపోయింది. మరోవైపు ఇతర జట్ల ఫలితాల ఆధారంగా యూపీ యోధాస్ కూడా ప్లేఆఫ్స్లో అడుగు పెట్టింది. యోధాస్ బుధవారం బరిలోకి దిగకపోయినా... లీగ్లో 20 మ్యాచ్లాడి 11 విజయాలు, 6 పరాజయాలు, 3 ‘టై’లతో 69 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో నాలుగో స్థానానికి చేరి ప్లే ఆఫ్స్ బెర్త్ను ఖరారు చేసుకుంది. బుధవారమే జరిగిన మరో మ్యాచ్లో తమిళ్ తలైవాస్ జట్టు 31 పాయింట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తలైవాస్ 60–29 పాయింట్ల తేడాతో బెంగాల్ వారియర్స్ను మట్టికరిపించింది. తలైవాస్ తరఫున మోయిన్, హిమాన్షు చెరో 13 పాయింట్లతో చెలరేగారు. ఈ ఇద్దరూ సూపర్ రెయిడ్లతో విజృంభించడంతో తలైవాస్ ఏకపక్ష విజయం సాధించింది. నేడు జరిగే మ్యాచ్ల్లో గుజరాత్ జెయింట్స్తో యూపీ యోధాస్; యు ముంబాతో పట్నా పైరేట్స్ తలపడతాయి. -
రెండు మ్యాచ్లూ ‘టై’
పుణే: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్లో గురువారం జరిగిన రెండు మ్యాచ్లు ‘టై’గా ముగిశాయి. దబంగ్ ఢిల్లీ, యూపీ యోధాస్ మధ్య జరిగిన తొలి మ్యాచ్ 32–32 పాయింట్లతో... జైపూర్ పింక్ పాంథర్స్, యు ముంబా మధ్య జరిగిన రెండో మ్యాచ్ 22–22 పాయింట్లతో ‘టై’ అయ్యాయి. ఢిల్లీ తరఫున అశు మలిక్ 11 పాయింట్లు, నవీన్ 8 పాయింట్లతో రాణించారు. యోధాస్ తరఫున గగన్ గౌడ 13 పాయింట్లు, భవానీ రాజ్పుత్ 10 పాయింట్లు సాధించారు. మాŠయ్చ్ ఆరంభం నుంచి ఇరు జట్లు హోరాహోరీగా పోరాడాయి. రక్షణాత్మక ధోరణిలో ముందుకు సాగిన ఇరు జట్లు ఒక్కోసారి ఆలౌటయ్యాయి. ఆధిక్యం చేతులు మారుతూ సాగిన మరో మ్యాచ్లో పింక్ పాంథర్స్, యు ముంబా జట్లు తుదికంటా పోరాడాయి. జైపూర్ తరఫున రెజా అత్యధికంగా 6 పాయింట్లు సాధించగా... యు ముంబా తరఫున సోమ్బీర్ 7 పాయింట్లతో సత్తా చాటాడు. ఈ మ్యాచ్లో ఇరుజట్లు డిఫెన్స్లో దుమ్మురేపాయి. తాజా సీజన్లో ఇప్పటి వరకు 16 మ్యాచ్లాడిన యు ముంబా 54 పాయింట్లతో రెండో స్థానానికి చేరింది. పింక్ పాంథర్స్ 49 పాయింట్లతోఆరో స్థానంలో ఉంది. నేడు జరిగే మ్యాచ్ల్లో తమిళ్ తలైవాస్తో గుజరాత్ జెయింట్స్ (రాత్రి 8 గంటలకు), హరియాణా స్టీలర్స్తో పట్నా పైరేట్స్ (రాత్రి 9 గంటలకు) తలపడతాయి. -
టైటాన్స్కు మరో పరాజయం
పుణే: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్లో తెలుగు టైటాన్స్ జట్టుకు ఏడో పరాజయం ఎదురైంది. బుధవారం హోరాహోరీగా సాగిన పోరులో టైటాన్స్ 33–36తో యూపీ యోధాస్ చేతిలో ఓటమి పాలైంది. స్టార్ రెయిడర్ విజయ్ 11 పాయింట్లతో సత్తా చాటినా... కీలక సమయాల్లో ఆధిక్యం కనబర్చిన యోధాస్ విజేతగా నిలిచింది.ఓవరాల్గా ఈ మ్యాచ్లో టైటాన్స్ 19 రెయిడ్ పాయింట్లు సాధించగా... యూపీ యోధాస్ 24 పాయింట్లతో ముందంజ వేసింది. యూపీ యోధాస్ ప్రధాన రెయిడర్ గగన్ నారంగ్ 15 పాయింట్లతో విజృంభించాడు. తాజా సీజన్లో 16 మ్యాచ్లాడిన టైటాన్స్ తొమ్మిందిట గెలిచింది. ఏడింటిలో ఓడింది. 49 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. మరో మ్యాచ్లో బెంగాల్ వారియర్స్ 39–32తో హరియాణా స్టీలర్స్ను ఓడించింది. నేడు జరిగే మ్యాచ్ల్లో దబంగ్ ఢిల్లీతో యూపీ యోధాస్ (రాత్రి 8 గంటలకు), జైపూర్ పింక్ పాంథర్స్తో యు ముంబా (రాత్రి 9 గంటలకు) తలపడతాయి. -
యోధాస్పై తలైవాస్ పైచేయి
నోయిడా: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో తమిళ్ తలైవాస్ వరుస పరాజయాలకు బ్రేక్ వేస్తూ ఈ సీజన్లో ఐదో విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం జరిగిన పోరులో తలైవాస్ 40–26 స్కోరుతో యూపీ యోధాస్పై ఘనవిజయం సాధించింది. డిఫెండర్ మొయిన్ షఫాగి (8 పాయింట్లు) అదరగొట్టగా, రెయిడర్లు నరేందర్ ఖండోలా (6), మసన ముత్తు (6) రాణించారు. డిఫెండర్లు రోనక్, ఆశిష్, నితీశ్, అమిర్ హుస్సేన్ తలా 2 పాయింట్లు చేశారు.యూపీ తరఫున గగన్ గౌడ 8, అశు సింగ్ 5, భవానీ రాజ్పుత్ 3 పాయింట్లు సాధించారు. నిజానికి తొలి అర్ధభాగంలో చకచకా పాయింట్లు సాధించిన యోధాస్ రెండో అర్ధభాగంలో తేలిపోయింది. 17–12తో పైచేయి సాధించిన యూపీ ద్వితీయార్ధంలో మరో 9 పాయింట్లే చేసి ఏకంగా 28 పాయింట్లను సమర్పించుకుంది. తొలి అర్ధభాగంలో తలైవాస్ ఒకసారి ఆలౌట్ కాగా, రెండో అర్ధభాగంలో తలైవాస్ ఆటగాళ్ల దూకుడుకు యూపీ యోధాస్ ఏకంగా మూడు సార్లు ఆలౌట్ కావడం విశేషం. మరో మ్యాచ్లో దబంగ్ ఢిల్లీ, పట్నా పైరేట్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 39–39తో ‘టై’ అయ్యింది. పట్నా రెయిడర్ దేవాంక్ (15) క్రమం తప్పకుండా పాయింట్లు తెచి్చపెట్టగా, డిఫెండర్ దీపక్ (7) ఆకట్టుకున్నాడు. దబంగ్ జట్టులో రెయిడర్ అశు మలిక్ (11), ఆల్రౌండర్ ఆశిష్ (7), రెయిడర్ నవీన్ కుమార్ (6) రాణించారు. నేడు జరిగే పోటీల్లో హరియాణా స్టీలర్స్తో పుణేరి పల్టన్... బెంగాల్ వారియర్స్తో గుజరాత్ జెయింట్స్ తలపడనున్నాయి. -
పోరాడి ఓడిన తెలుగు టైటాన్స్
నోయిడా: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్లో వరుసగా నాలుగు విజయాల తర్వాత తెలుగు టైటాన్స్ జట్టుకు పరాజయం ఎదురైంది. గురువారం జరిగిన పోరులో తెలుగు టైటాన్స్ 34–40 పాయింట్ల తేడాతో యూపీ యోధాస్ జట్టు చేతిలో ఓటమి పాలైంది. టైటాన్స్ తరఫున విజయ్ మలిక్ 15 పాయింట్లతో ఒంటరి పోరాటం చేయగా... కెప్టెన్ పవన్ సెహ్రావత్ 4 పాయింట్లు మాత్రమే సాధించాడు. యూపీ యోధాస్ తరఫున భవాని రాజ్పుత్ 12, భరత్ 11 పాయింట్లు సాధించారు. తాజా సీజన్లో 9 మ్యాచ్లు ఆడిన తెలుగు టైటాన్స్ 5 విజయాలు, 4 పరాజయాలలతో 25 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు యూపీ యోధాస్ లీగ్లో నాలుగో మ్యాచ్ నెగ్గి 25 పాయింట్లతో 8వ స్థానంలో ఉంది. మరో మ్యాచ్లో యు ముంబా 35–32 పాయింట్ల తేడాతో తమిళ్ తలైవాస్పై గెలుపొందింది. యు ముంబా తరఫున మన్జీత్ 10 పాయింట్లు, అజిత్ చవాన్ 8 పాయింట్లు సాధించగా... తలైవాస్ తరఫున మోయిన్ 10 పాయింట్లతో పోరాడాడు. 10 మ్యాచ్లాడి 6వ విజయం నమోదు చేసుకున్న యు ముంబా జట్టు 34 పాయింట్లతో పట్టికలో రెండో స్థానానికి చేరగా... వరుసగా నాలుగో మ్యాచ్లో ఓటమి పాలైన తమిళ్ తలైవాస్ 22 పాయింట్లతో పట్టికలో 10వ స్థానంలో ఉంది. లీగ్లో భాగంగా నేడు జరగనున్న మ్యాచ్ల్లో పట్నా పైరేట్స్తో బెంగాల్ వారియర్స్ (రాత్రి 8 గంటలకు), జైపూర్ పింక్ పాంథర్స్తో గుజరాత్ జెయింట్స్ (రాత్రి 9 గంటలకు) తలపడతాయి. -
PKL 11: యు ముంబా ‘హ్యాట్రిక్’ విజయం.. పాయింట్ల పట్టికలో పైపైకి
నోయిడా: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్లో మాజీ చాంపియన్ యు ముంబా ‘హ్యాట్రిక్’ విజయం ఖాతాలో వేసుకుంది. నోయిడా వేదికగా జరుగుతున్న రెండో అంచె పోటీల్లో ఆదివారం యు ముంబా జట్టు ఉత్కంఠ పోరులో 35–33తో యూపీ యోధాస్పై గెలిచింది.యు ముంబా తరఫున అజిత్ చవాన్, రోహిత్ రాఘవ్ చెరో 8 పాయింట్లతో రాణించగా... యూపీ యోధాస్ తరఫున భరత్ హుడా 11 పాయింట్లతో ఒంటరి పోరాటం చేశాడు. ఆరంభంలో ఆకట్టుకున్న యూపీ జట్టు ప్రత్యర్థిపై పైచేయి కనబర్చినా దాన్ని చివరి వరకు కొనసాగించలేక పోయింది.ఇక తాజా సీజన్లో యు ముంబా 8 మ్యాచ్లాడి 5 విజయాలు, 2 పరాజయాలు, ఒక ‘టై’తో 29 పాయింట్లతో పట్టికలో రెండో స్థానానికి చేరింది. మరోవైపు.. ఎనిమిది మ్యాచ్ల్లో ఐదో పరాజయం మూటగట్టుకున్న యూపీ యోధాస్ 20 పాయింట్లతో పదో స్థానంలో ఉంది. గుజరాత్ జెయింట్స్ ఓటమిమరో మ్యాచ్లో హరియాణా స్టీలర్స్ 39–23 పాయింట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్పై విజయం సాధించింది. హరియాణా స్టీలర్స్ తరఫున రాహుల్ 8 పాయింట్లు... వినయ్, రెజా చెరో 7 పాయింట్లతో సత్తాచాటారు. గుజరాత్ జెయింట్స్ తరఫున రాకేశ్ (7 పాయింట్లు) మినహా మిగతా వారు ఆకట్టుకోలేకపోయారు. హరియాణా 26 పాయింట్లతో ప్రస్తుతం మూడో స్థానానికి ఎగబాకింది. మరోవైపు... గుజరాత్ జెయింట్స్ 7 పాయింట్లతో చివరిదైన 12వ స్థానంలో ఉంది. నేడు జరిగే మ్యాచ్ల్లో గుజరాత్ జెయింట్స్తో పట్నా పైరేట్స్ (రాత్రి 8 గంటలకు), యు ముంబాతో హరియాణా స్టీలర్స్ (రాత్రి 9 గంటలకు) తలపడతాయి. ఇక ఇప్పటి వరకు పుణెరి పల్టన్ అస్థానంలో కొనసాగుతోంది. -
ఉత్కంఠ పోరులో జైపూర్దే పైచేయి
హైదరాబాద్, :ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్లో రెండు ఓటములు, ఒక టై తర్వాత మాజీ చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్ తిరిగి గెలుపు బాట పట్టింది. ఆరంభం నుంచి ఉత్కంఠగా సాగుతూ ఆధిపత్యం చేతులు మారిన పోరులో చివర్లో అద్భుతంగా ఆడిన జైపూర్... యూపీ యోధాస్కు చెక్ పెట్టి లీగ్లో మూడో విజయం ఖాతాలో వేసుకుంది. పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి దూసుకొచ్చింది. మంగళవారం గచ్చిబౌలిలోని జిఎంసి బాలయోగి ఇండోర్ స్టేడియంలో జరిగిన పీకెఎల్ 11 లీగ్ దశ మ్యాచ్లో పింక్ పాంథర్స్ జట్టు 33–30 స్కోరుతో యూపీ యోధాస్పై గెలిచింది. జైపూర్ జట్టులో రెయిడర్ నీరజ్ నర్వాల్ తొమ్మిది పాయింట్లతో మెరిశాడు. కెప్టెన్, మరో స్టార్ రెయిడర్ అర్జున్ దేశ్వాల్ ఐదు పాయింట్లతో రాణించాడు.ఈ క్రమంలో పీకేఎల్లో 1000 రెయిడ్ పాయింట్ల మైలురాయి చేరుకున్నాడు. యోధాస్ తరఫున ఆల్రౌండర్ భరత్ ఏడు, హితేశ్, సుమిత్ చెరో ఐదు పాయింట్లు రాబట్టినా తమ జట్టుకు వరుసగా మూడో ఓటమి తప్పించలేకపోయారు.హోరాహోరీ పోరుజైపూర్, యూపీ మధ్య ఆట ఆరంభం నుంచి నువ్వానేనా అన్నట్టు నడిచింది. ఇరు జట్లూ బలమైన డిఫెన్స్ ను ప్రదర్శించాయి. దాంతో ఆటలో ఆధిపత్యం కోసం శ్రమించాయి. బోనస్ ద్వారా అర్జున్ జైపూర్కు తొలి పాయింట్ అదించగా.. గగన్ యూపీ యోధాస్ ఖాతా తెరిచాడు. యూపీ డిఫెండర్లు రెండుసార్లు అర్జున్ను ట్యాకిల్ చేయగా.. రితిక్, భవానీ రాజ్పుత్ తెచ్చిన రైడ్ పాయింట్లతో ఆ జట్టు 6–4తో ఆధిక్యంలోకి వెళ్లింది. కానీ, జైపూర్ వెంటనే పుంజుకొని 6–6తో స్కోరు సమం చేసింది. ఇరు జట్లూ ఎక్కడా తగ్గకపోవడంతో స్కోరు బోర్డు 8–8, 11–11, 15–15తో సమంగా నడిచింది. తొలి అర్ధభాగానికి ముందు యూపీ జట్టులో ఇద్దరు ఆటగాళ్లే మిగిలినా.. అర్జున్ను సూపర్ ట్యాకిల్ చేసి 17–15తో స్వల్ప ఆధిక్యంతో విరామానికి వెళ్లింది.జైపూర్ జోరురెండో అర్ధభాగంలో యూపీ బలమైన డిఫెన్స్ను ప్రదర్శించింది. విరామం నుంచి వచ్చిన వెంటవెంటనే రెండు సూపర్ ట్యాకిల్స్తో నీరజ్, అర్జున్ను నిలువరించి 21–17తో తన ఆధిక్యాన్ని పెంచుకుంది. కానీ, జైపూర్ వెనక్కు తగ్గలేదు. ఆ జట్టు డిఫెండర్లు కూడా పుంజుకున్నారు. యోధాస్ కెప్టెన్ సురేందర్ను ట్యాకిల్ చేయడంతో పాటు కోర్టులో మిగిలిన సుమిత్ను నిలువరించిన పింక్ పాంథర్స్ 32వ నిమిషంలో ప్రత్యర్థిని ఆలౌట్ చేసి 22–22తో స్కోరు సమం చేసింది. ఈ దశలో జైపూర్ కెప్టెన్ అర్జున్తో పాటు ఆ జట్టు మరో స్టార్ రెయిడర్ నీరజ్ను బెంచ్ మీదకు పంపించిన యూపీ 25–22తో తిరిగి ఆధిక్యం అందుకుంది. అయితే, చివరి పది నిమిషాల్లో జైపూర్ జోరు పెంచింది. నీరజ్ వరుస రెయిడ్ పాయింట్లు రాబట్టగా.. డిఫెండర్లు కూడా ఆకట్టుకోవడంతో 36వ నిమిషంలో ప్రత్యర్థిని మరోసారి ఆలౌట్ చేసి 31–28తో మళ్లీ పైచేయి సాధించింది. ఆఖరి నిమిషాల్లో యూపీ యోధాస్ పుంజుకునే ప్రయత్నం చేసినా ఆధిక్యాన్ని కాపాడుకున్న జైపూర్ జట్టు ఉత్కంఠ విజయం సాధించింది. -
పట్నా పైరేట్స్ సూపర్ షో
హైదరాబాద్: పీకెఎల్ మూడుసార్లు చాంపియన్ పట్నా పైరేట్స్ ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్లో ముచ్చటగా మూడో విజయం సాధించింది. శనివారం గచ్చిబౌలిలోని జిఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో జరిగిన లీగ్ దశ మ్యాచ్లో యూపీ యోధాస్పై 42-37తో పట్నా పైరేట్స్ పైచేయి సాధించింది. రెయిడింగ్లో, డిఫెన్స్లో హవా చూపించిన పైరేట్స్ 5 పాయింట్ల తేడాతో యూపీ యోధాస్ను చిత్తు చేసింది. పట్నా పైరేట్స్ రెయిడర్ దేవాంక్ (11 పాయింట్లు) సూపర్ టెన్ షోతో మెరువగా.. అయాన్ ( 9 పాయింట్లు) అదరగొట్టాడు. యూపీ యోధాస్ ఆటగాళ్లలో గగన్ గౌడ (9 పాయింట్లు), భరత్ (6 పాయింట్లు) , సురేందర్ గిల్(5 పాయింట్లు) రాణించినా ఆ జట్టుకు సీజన్లో మూడో పరాజయం తప్పలేదు.పైరేట్స్ ముందంజ : యూపీ యోధాస్, పట్నా పైరేట్స్ మ్యాచ్లో మూడుసార్లు ప్రథమార్థంలో ముందంజ వేసింది. తొలి 20 నిమిషాల ఆటలో 23-19తో నాలుగు పాయింట్ల ఆధిక్యం దక్కించుకుంది. పైరేట్స్ ఆధిక్యం సాధించినా.. ప్రథమార్థం హోరాహోరీగా సాగింది. రెయిడింగ్, డిఫెన్స్లో ఇరు జట్లు తగ్గ పోటీనిచ్చాయి. దీంతో ఇరు జట్లు ఆలౌట్ సైతం చవిచూశాయి. డిఫెన్స్లో పైచేయి సాధించిన పట్నా పైరేట్స్.. తొలి అర్థభాగం ఆటను ఖాతాలో వేసుకుంది. కెప్టెన్ శుభమ్ షిండె మెరుపు ట్యాకిల్స్తో అదరగొట్టాడు. రెయిడర్ దేవాంక్ సహజంగానే తనదైన జోరు కొనసాగించాడు.యోధాస్కు నిరాశ : ఆట ద్వితీయార్థంలో యూపీ యోధాస్ పుంజుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ప్రథమార్థం ఆధిక్యం కొనసాగించిన పట్నా పైరేట్స్.. ఓ దశలో ఏడు పాయింట్ల ఆధిక్యంలో నిలిచింది. యూపీ యోధాస్ రెయిడర్లు సురేందర్ గిల్, గగన్ గౌడ సహా ఆల్రౌండర్ భరత్ వరుసగా పాయింట్లు సాధించారు. యూపీ యోధాస్ను ఆఖరు వరకు రేసులో నిలపాలని చూశారు. ఇదే సమయంలో పట్నా పైరేట్స్ సైతం పాయింట్ల వేటలో దూకుడు చూపించింది. దేవాంక్కు అయాన్ సైతం జత కలవటంతో పట్నా పైరేట్స్ ఏ దశలోనూ ఆధిక్యం కోల్పోలేదు. ఆఖరు రెయిడ్లోనూ రెండు పాయింట్లు సాధించిన అయాన్ పట్నా పైరేట్స్కు మెరుపు విజయాన్ని అందించాడు. ద్వితీయార్థంలో యూపీ యోధాస్ 18 పాయింట్లు సాధించగా, పట్నా పైరేట్స్ 19 పాయింట్లు ఖాతాలో వేసుకుంది. -
హర్యానా స్టీలర్స్ హ్యాట్రిక్ విజయం
హైదరాబాద్, 30 అక్టోబర్ 2024 : ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ 10 రన్నరప్ హర్యానా స్టీలర్స్ పీకెఎల్ 11వ సీజన్లో హ్యాట్రిక్ విజయం నమోదు చేసింది. ఈ సీజన్ తొలి మ్యాచ్లో నిరాశపరిచిన హర్యానా స్టీలర్స్ తర్వాత వరుసగా మూడు మ్యాచుల్లో సాధికారిక విజయాలు సాధించింది. బుధవారం గచ్చిబౌలిలోని జిఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో జరిగిన ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్ లీగ్ దశ మ్యాచ్లో యూపీ యోధాస్పై 30-28తో హర్యానా స్టీలర్స్ గెలుపొందింది. నాలుగు మ్యాచుల్లో హర్యానా స్టీలర్స్కు ఇది మూడో విక్టరీ కాగా.. యూపీ యోధాస్కు ఐదు మ్యాచుల్లో ఇది రెండో పరాజయం. ఈ విజయంతో హర్యానా స్టీలర్స్ పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానం నుంచి నాల్గో స్థానానికి ఎగబాకింది. హర్యానా స్టీలర్స్ ఆటగాళ్లలో రెయిడర్ వినయ్ (8 పాయింట్లు), డిఫెండర్ సంజయ్ ధుల్ (6 పాయింట్లు) రాణించారు. యూపీ యోధాస్ తరఫున గగన్ గౌడ ( 9 పాయింట్లు), భరత్ (5 పాయింట్లు) ఆకట్టుకునే ప్రదర్శన చేశారు.ప్రథమార్థంలోనూ యూపీ యోధాస్పై హర్యానా స్టీలర్స్ పైచేయి సాధించింది. తొలి అర్థభాగం ఆటలో ఇరు జట్లకు పాయింట్లు అంత సులువుగా దక్కలేదు. కూతలో హర్యానా, యూపీ నాలుగేసి పాయింట్లు సాధించాయి. కానీ స్టీలర్స్ డిఫెండర్ సంజయ్ ధుల్ మెరుపు ట్యాకిల్స్ చేశాడు. హర్యానా స్టీలర్స్కు డిఫెన్స్లో ఏడు పాయింట్లు అందించాడు. దీంతో తొలి 20 నిమిషాల ఆటలో హర్యానా స్టీలర్స్ 11-9తో పైచేయి సాధించింది. విరామ సమయానికి రెండు పాయింట్ల ఆధిక్యంతో నిలిచింది. ద్వితీయార్థంలో స్టీలర్స్ ఆధిపత్యం కొనసాగినా.. ఆఖరు ఐదు నిమిషాల్లో యూపీ యోధాస్ నుంచి ప్రతిఘటన ఎదురైంది. పాయింట్ల లోటు నెమ్మదిగా పూడ్చకుంటూ హర్యానాపై యోధాస్ ఒత్తిడి పెంచింది. హర్యానా 26-24తో ముందంజలో నిలువగా.. చివరి రెండు నిమిషాల ఆటలో ఇరు జట్లు ఒక్కో పాయింట్ సాధిస్తూ వచ్చాయి. ఆఖరు వరకు రెండు పాయింట్ల ఆధిక్యత నిలుపుకున్న హర్యానా స్టీలర్స్ సీజన్లలో మూడో విజయం ఖాతాలో వేసుకుంది. -
PKL 11: బెంగాల్ వారియర్స్ బోణీ, యూపీ యోధాస్పై 32-29తో గెలుపు
హైదరాబాద్, 24 అక్టోబర్ 2024: ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్లో బెంగాల్ వారియర్స్ బోణీ కొట్టింది. హ్యాట్రిక్ విజయంపై కన్నేసి బరిలోకి దిగిన యూపీ యోధాస్పై బెంగాల్ వారియర్స్ మెరుపు విజయం నమోదు చేసింది. హైదరాబాద్లోని జిఎంసీ బాలయోగి ఇండోర్స్టేడియంలో గురువారం జరిగిన తొలి మ్యాచ్లో యూపీ యోధాస్పై బెంగాల్ వారియర్స్ 32-29తో గెలుపొందింది. ఉత్కంఠ మ్యాచ్లో మూడు పాయింట్ల తేడాతో విజయం సాధించిన బెంగాల్ వారియర్స్.. యూపీ యోధాస్కు సీజన్లో తొలి ఓటమి రుచి చూపించింది. బెంగాల్ వారియర్స్ సమిష్టి ప్రదర్శనతో రాణించింది. రెయిడర్లు మణిందర్ సింగ్ (8), నితిన్ (7), సుశీల్ (7) అదరగొట్టారు. యూపీ యోధాస్ ఆల్రౌండర్ భరత్ (13) సూపర్ టెన్తో షో చేసినా.. ఫలితం దక్కలేదు.ప్రథమార్థం హోరాహోరీ : బెంగాల్ వారియర్స్, యూపీ యోధాస్ తొలి అర్థభాగం ఆటలో నువ్వా నేనా అన్నట్టు పోటీపడ్డాయి. తొలి రెండు మ్యాచుల్లో విజయాలతో ఊపుమీదున్న యూపీ యోధాస్ను ఒత్తిడిలో నిలువరించిన బెంగాల్ వారియర్స్ 12-11తో ప్రథమార్థంలో ఆధిక్యం సాధించింది. ఇరు జట్లూ రెయిడింగ్, డిఫెన్స్లో బలంగా ఉండటంతో ఏ జట్టు సైతం ఆలౌట్ స్కోరు చేయలేకపోయింది. భరత్ సక్సెస్ఫుల్ రెయిడ్తో యూపీ యోధాస్ తొలుత ఖాతా తెరిచినా.. బెంగాల్ వారియర్స్ను మణిందర్ సింగ్ ముందుండి నడిపించాడు. బెంగాల్ వారియర్స్ రెయిడింగ్లో 9 పాయింట్లు సాధించగా, యూపీ యోధాస్ 8 పాయింట్లు ఖాతాలో వేసుకుంది. డిఫెన్స్లో ఇరు జట్లు మూడేసి పాయింట్లు సాధించాయి.వారియర్స్ దూకుడు : ప్రథమార్థం ఆటలో ఒక్క పాయింట్ ఆధిక్యంలో నిలిచిన బెంగాల్ వారియర్స్ విరామం అనంతరం దూకుడు పెంచింది. ఆఖరు పది నిమిషాల ఆట వరకు యూపీ యోధాస్ నుంచి గట్టి పోటీ ఎదురైంది. కానీ మణిందర్ సింగ్కు నితిన్ జత కలవటంతో బెంగాల్ దూకుడు ముందు యూపీ యోధాస్ నిలువలేదు. వరుసగా సక్సెస్ఫుల్ రెయిడ్స్తో బెంగాల్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 25-21తో నాలుగు పాయింట్ల ముందంజ వేసిన బెంగాల్ ఆ తర్వాత యోధాస్కు చిక్కలేదు. యోధాస్ రెయిడర్ భరత్ సూపర్ టెన్ ప్రదర్శనతో మెరిసినా.. ఆ జట్టుకు నిరాశ తప్పలేదు. ఆఖరు రెండు నిమిషాల్లోనూ యూపీ యోధాస్ గట్టిగా ప్రయత్నించినా అప్పటికే మ్యాచ్ బెంగాల్ వారియర్స్ చేతుల్లోకి వెళ్లిపోయింది. -
యూపీ యోధాస్ రెండో గెలుపు.. బెంగళూరు బుల్స్ హ్యాట్రిక్ ఓటమి
హైదరాబాద్, అక్టోబర్ 22: ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్లో యూపీ యోధాస్ రెండో విజయం సొంతం చేసుకోగా.. పర్దీన్ నర్వాల్ కెప్టెన్సీలోని బెంగళూరు బుల్స్ వరుసగా మూడో మ్యాచ్లో ఓడి హ్యాట్రిక్ పరాజయం చవి చూసింది. మంగళవారం రాత్రి ఇక్కడి జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో యూపీ యోధాస్ 57-–36 తేడాతో బెంగళూరు బుల్స్ను చిత్తుగా ఓడించింది. యూపీ యోధాస్ కెప్టెన్ సురేందర్ గిల్ 17 పాయింట్లతో విజృంభించాడు. ఆల్రౌండర్ భరత్ (14), డిఫెండర్ సుమిత్ (9) కూడా ఆకట్టుకున్నారు. బుల్స్ తరఫున కెప్టెన్ పర్దీప్ నర్వాల్ (16 ) సూపర్ టెన్ సాధించగా, జతిన్ (9) పోరాడాడు. ఈ మ్యాచ్లో బెంగళూరు బుల్స్ను యూపీ మూడుసార్లు ఆలౌట్ చేసింది. ఈ మ్యాచ్ ఆరంభం నుంచి యూపీ యోధాస్ అద్భుత ప్రదర్శన చేసింది. ఆ జట్టు రైడర్లు ఆరంభం నుంచి కెప్టెన్ సురేందర్ గిల్, భరత్ వరుస రైడ్ పాయింట్లతో విజృంభించారు. జట్టుకు తొలి పాయింట్ అందించిన భరత్ ప్రత్యర్థి డిఫెండర్ల పట్టుకు చిక్కకుండా అలరించాడు. మరోవైపు సురేందర్ కూడా కోర్టులో పాదరసంలా కదులుతూ ఆకట్టుకున్నాడు. అదే సమయంలో యోధాస్ డిఫెండర్లు సైతం సత్తా చాటారు. బెంగళూరు తరఫున కెప్టెన్ పర్దీప్ నర్వాల్, జతిన్ పోరాడినా మిగతా రైడర్ల నుంచి వారికి సహకారం లభించలేదు.11వ నిమిషంలో బుల్స్ను ఆలౌట్ చేసిన 15–9తో ముందంజ వేసింది. ఆపై, భరత్ వెంటవెంటనే రెండు సూపర్ రైడ్లతో అలరించాడు. రెండు ప్రయత్నాల్లో ముగ్గురేసి ఆటగాళ్లను ఔట్ చేశాడు. దాంతో నాలుగు నిమిషాల వ్యవధిలోనే బెంగళూరును రెండోసారి ఆలౌట్ చేసిన యూపీ యోధాస్ 24–10తో భారీ ఆధిక్యం సొంతం చేసుకుంది. ఇదే జోరుతో భరత్, సురేందర్ సూపర్ టెన్స్ పూర్తి చేసుకోగా.. యోధాస్ 33–15తో తొలి అర్ధభాగాన్ని ముగించింది. రెండో భాగంలోనూ భరత్, సురేందర్ జోరు కొనసాగింది. అటువైపు బుల్స్ కెప్టెన్ పర్దీప్ సూపర్ రైడ్ చేసి సూపర్ టెన్ పూర్తి చేసుకోగా జతిన్ కూడా మెప్పించాడు. కానీ, యూపీ ఏమాత్రం పట్టు విడవలేదు. ఇరు జట్లూ కొద్దిసేపు పోటాపోటీగా రైడ్ పాయింట్లు రాబట్టగా యోధాస్ తన ఆధిక్యాన్ని నిలబెట్టుకుంటూ వెళ్లింది. 32వ నిమిషంలో మూడోసారి బెంగళూరును ఆలౌట్ చేసిన యూపీ 49–28తో ఆధిక్యంలోకి వెళ్లింది. చివర్లో పర్దీప్తో పాటు ఇతర ఆటగాళ్లు పోరాడినా అది బెంగళూరు ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించింది. కాగా, బుధవారం జరిగే తొలి మ్యాచ్లో తమిళ్ తలైవాస్తో పుణెరి పల్టాన్ తలపడుతుంది. రెండో మ్యాచ్లో గుజరాత్ జెయింట్స్తో యు ముంబా పోటీ పడనుంది. -
దబాంగ్ ఢిల్లీపై యూపీ యోధాస్ అద్భుత విజయం
హైదరాబాద్,: ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్ను యూపీ యోధాస్ జట్టు అద్బుత విజయంతో ఆరంభించింది. డిఫెన్స్లో గొప్ప ప్రదర్శన చేస్తూ రెండో భాగంలో గొప్పగా పుంజుకున్న యూపీ.. బలమైన దబాంగ్ ఢిల్లీ కేసీపై పైచేయి సాధించింది. సోమవారం రాత్రి ఇక్కడి జీఎంసీ బాలయోగి గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో యూపీ యోధాస్ 28–23 తేడాతో దబాంగ్ ఢిల్లీపై విజయం సాధించింది. యూపీ జట్టులో రైడర్లు భవానీ రాజ్పుత్ (7 పాయింట్లు), సురేందర్ గిల్ (4) ఆకట్టుకోగా.. డిఫెండర్ సాహుల్ కుమార్ 5 పాయింట్లతో హైఫైవ్ సాధించాడు. ఢిల్లీ జట్టులో కెప్టెన్, స్టార్ రైడర్ అషు మాలిక్ 15 రైడ్స్లో నాలుగే పాయింట్లు రాబట్టాడు. నవీన్ కుమార్ (4), ఆశీష్ (4) పోరాడినా ఫలితం లేకపోయింది.ఈ మ్యాచ్ ఆరంభం నుంచి హోరాహోరీగా సాగింది. ఇరు జట్లూ పోటాపోటీగా తలపడుతూ చెరో పాయింట్ సాధిస్తూ ముందుకెళ్లాయి. సురేందర్ గిల్ తెచ్చిన బోనస్తో యూపీ ఖాతా తెరవగా.. భరత్ను ట్యాకిల్ చేసిన యోగేశ్ ఢిల్లీకి తొలి పాయింట్ అందించాడు. డూ ఆర్ డై రైడ్కు వచ్చిన అషు సింగ్ సింగిల్ టయాకిల్ చేయగా.. భరత్ రెండోసారి ఢిల్లీ డిఫెండర్లకు దొరికిపోయాడు. ఈ దశలో అషు మాలిక్ వరుసగా రెండు రైడ్ పాయింట్లు రాబట్టాడు. మరోసారి రైడ్కు వచ్చిన అతడిని.. యూపీ ట్యాకిల్ చేయగా.. సురేందర్ గిల్ను యోగేశ్ నిలువరించాడు. ఇరు జట్ల డిఫెన్స్ బలంగా ఉండటంతో డూ ఆర్ డై రైడ్లోనే ఢిల్లీ, యూపీ పాయింట్లు రాబట్టే ప్రయత్నం చేశాయి. దాంతో ఆట సమంగా సాగింది. విరామం ముంగిట చివరి రైడ్కు వచ్చిన అషు మాలిక్ను సుమిత్ ట్యాకిల్ చేయడంతో యూపీ 12–11తో ఒక పాయింట్ ఆధిక్యంతో తొలి అర్ధభాగాన్ని ముగించింది. కోర్టు మారిన తర్వాత యూపీ యోధాస్ పైచేయి సాధించింది. ఆలౌట్ ప్రమాదం తప్పించుకొని ప్రత్యర్థిని ఆలౌట్ చేసి ముందంజ వేసింది. విరామం నుంచి వచ్చిన వెంటనే ఢిల్లీ రైడర్ నవీన్ కుమార్.. సాహుల్ కుమార్, అషు సింగ్ పట్టు నుంచి తప్పించుకొని వచ్చి రెండు పాయింట్లు అందించాడు. ఆపై విక్రాంత్ను భరత్ ట్యాకిల్ చేయడంతో దబాంగ్ ఢిల్లీ 16–14తో రెండు పాయింట్ల ఆధిక్యంలోకి వచ్చింది. మరోవైపు కోర్టులో ఇద్దరు ఆటగాళ్లే మిగలడంతో యూపీ ఆలౌట్ ప్రమాదం ముంగిట నిలిచింది. కానీ, హితేశ్, మొహమ్మద్రెజా కలిసి ఢిల్లీ కెప్టెన్ అషు మాలిను సూపర్ ట్యాకిల్ చేయడంతో 16–16తో స్కోరు మరోసారి సమం అయింది. ఇక్కడి నుంచి యూపీ వేగం పెంచింది. భవాని రాజ్పుత్, సురేందర్ గిల్ చెరో రైడ్ పాయింట్ రాబట్టగా.. నవీన్, మోహిత్తో పాటు ఆశీష్ను యూపీ డిఫెండర్లు ట్యాకిల్ చేయడంతో 33వ నిమిషంలో ఢిల్లీ ఆలౌట్ అయింది. దాంతో యోధాస్ 24–18తో ఆరు పాయింట్ల ఆధిక్యం అందుకుంది. చివర్లో దబాంగ్ ఢిల్లీ పుంజుకునే ప్రయత్నం చేసినా ఆ జట్టుకు యోధాస్ ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. రైడింగ్లో భవనీ రాజ్పుత్, నితిన్ జోరు చూపెట్టగా.. అషు మాలిక్ను మరోసారి ట్యాకిల్ చేసిన సాహుల్ కుమార్ హైఫైవ్ సాధించాడు. దాంతో తన ఆధికాన్ని 27–20కి పెంచుకున్న యూపీ విజయం ఖాతాలో వేసుకుంది. -
PKL: షెడ్యూల్ పూర్తి వివరాలు.. తొలి మ్యాచ్లో తలపడే జట్లు ఇవే
Pro Kabaddi League Season 11: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్ మ్యాచ్ల షెడ్యూల్ను ప్రకటించారు. ఆరంభ దశ మ్యాచ్లకు హైదరాబాద్ ఆతిథ్యమివ్వనుంది. వచ్చే నెల 18 నుంచి పీకేఎల్ ప్రారంభం కానుండగా... గచ్చిబౌలి స్టేడియం వేదికగా జరగనున్న తొలి పోరులో బెంగళూరు బుల్స్తో తెలుగు టైటాన్స్ జట్టు తలపడనుంది.అదే రోజు జరగనున్న రెండో మ్యాచ్లో యు ముంబాతో దబంగ్ ఢిల్లీ పోటీపడుతుంది. మూడు వేదికల్లో పీకేఎల్ మ్యాచ్లు నిర్వహించాలని నిర్ణయించగా... అక్టోబర్ 18 నుంచి నవంబర్ 9 వరకు హైదరాబాద్లో పీకేఎల్ తొలి దశ సాగనుంది.ఆ తర్వాత నవంబర్ 10 నుంచి డిసెంబర్ 1 వరకు నోయిడాలోని ఇండోర్ స్టేడియంలో మ్యాచ్లు నిర్వహించనున్నారు. అనంతరం డిసెంబర్ 3 నుంచి 24 వరకు పుణేలో లీగ్ సాగనుంది. ఇక ప్లే ఆఫ్స్కు సంబంధించిన షెడ్యూల్ను తర్వాత ప్రకటించనున్నారు. గత నెలలో జరిగిన పీకేఎల్ వేలంలో మొత్తం 12 జట్లు తమ అస్త్రశ్రస్తాలకు పదును పెంచుకోగా... లీగ్ చరిత్రలోనే అత్యధికంగా ఎనిమిది మంది ప్లేయర్లు కోటి రూపాయలకు పైగా ధర పలికారు. హైదరాబాద్ (గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం)అక్టోబర్ 18, శుక్రవారం-తెలుగు టైటాన్స్ వర్సెస్ బెంగళూరు బుల్స్ (రాత్రి 8:00 గంటలు)-దబాంగ్ ఢిల్లీ కేసీ వర్సెస్ యు ముంబా (రాత్రి 9:00 గంటలు)అక్టోబర్ 19, శనివారం- తెలుగు టైటాన్స్ వర్సెస్ తమిళ్ తలైవాస్ (రాత్రి 8:00 గంటలు)- పుణెరి పల్టాన్ వర్సెస్ హర్యానా స్టీలర్స్ (రాత్రి 9:00 గంటలు)అక్టోబర్ 20, ఆదివారం- బెంగాల్ వారియర్స్ వర్సెస్ జైపూర్ పింక్ పాంథర్స్ (రాత్రి 8:00 గంటలు)- గుజరాత్ జెయింట్స్ వర్సెస్ బెంగళూరు బుల్స్ (రాత్రి 9:00 గంటలు) అక్టోబర్ 21, సోమవారం- యూపీ యోధాస్ వర్సెస్ దబాంగ్ ఢిల్లీ కేసీ (రాత్రి 8:00 గంటలు)- పుణెరి పల్టాన్ వర్సెస్ పట్నా పైరేట్స్ (రాత్రి 9:00 గంటలు)అక్టోబర్ 22, మంగళవారం- తెలుగు టైటాన్స్ వర్సెస్ జైపూర్ పింక్ పాంథర్స్ (రాత్రి 8:00 గంటలు)- యూపీ యోధాస్ వర్సెస్ బెంగళూరు బుల్స్ (రాత్రి 9:00 గంటలు)అక్టోబర్ 23, బుధవారం- గుజరాత్ జెయింట్స్ వర్సెస్ యు ముంబా (రాత్రి 8:00 గంటలు)- తమిళ్ తలైవాస్ వర్సెస్ పుణెరి పల్టన్ (రాత్రి 9:00 గంటలు)అక్టోబర్ 24, గురువారం- బెంగాల్ వారియర్స్ వర్సెస్ యూపీ యోధాస్ (రాత్రి 8:00 గంటలు)- హర్యానా స్టీలర్స్ వర్సెస్ జైపూర్ పింక్ పాంథర్స్ (రాత్రి 9:00 గంటలు)అక్టోబర్ 25, శుక్రవారం- పట్నా పైరేట్స్ వర్సెస్ తమిళ్ తలైవాస్ (రాత్రి 8:00 గంటలు)- బెంగళూరు బుల్స్ వర్సెస్ పుణెరి పల్టాన్ (రాత్రి 9:00 గంటలు)అక్టోబర్ 26, శనివారం- యు ముంబా వర్సెస్ బెంగాల్ వారియర్స్ (రాత్రి 8:00 గంటలు)- తెలుగు టైటాన్స్ వర్సెస్ దబాంగ్ ఢిల్లీ కేసీ (రాత్రి 9:00 గంటలు)అక్టోబర్ 27, ఆదివారం- జైపూర్ పింక్ పాంథర్స్ వర్సెస్ తమిళ్ తలైవాస్ (రాత్రి 8:00 గంటలు)- యూపీ యోధాస్ వర్సెస్ గుజరాత్ జెయింట్స్ (రాత్రి 9:00 గంటలు)అక్టోబర్ 28, సోమవారం- హర్యానా స్టీలర్స్ వర్సెస్ దబాంగ్ ఢిల్లీ కేసీ (రాత్రి 8:00 గంటలు)- తెలుగు టైటాన్స్ వర్సెస్ పట్నా పైరేట్స్ (రాత్రి 9:00 గంటలు)అక్టోబర్ 29, మంగళవారం- బెంగాల్ వారియర్స్ వర్సెస్ పుణెరి పల్టాన్ (రాత్రి 8:00 గంటలు)- బెంగళూరు బుల్స్ వర్సెస్ దబాంగ్ ఢిల్లీ కేసీ (రాత్రి 9:00 గంటలు)అక్టోబర్ 30, బుధవారం- గుజరాత్ జెయింట్స్ వర్సెస్ తమిళ్ తలైవాస్ (రాత్రి 8:00 గంటలు)- యూపీ యోధాస్ వర్సెస్ హర్యానా స్టీలర్స్ (రాత్రి 9:00 గంటలు)అక్టోబర్ 31, గురువారం- పట్నా పైరేట్స్ వర్సెస్ దబాంగ్ ఢిల్లీ కేసీ (రాత్రి 8:00 గంటలు)- యు ముంబా వర్సెస్ జైపూర్ పింక్ పాంథర్స్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 2, శనివారం- బెంగళూరు బుల్స్ వర్సెస్ తెలుగు టైటాన్స్ (రాత్రి 8:00 గంటలు)- యూపీ యోధాస్ వర్సెస్ పట్నా పైరేట్స్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 3, ఆదివారం- పుణెరి పల్టాన్ వర్సెస్ యు ముంబా (రాత్రి 8:00 గంటలు)- బెంగాల్ వారియర్స్ వర్సెస్ హర్యానా స్టీలర్స్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 4, సోమవారం- బెంగళూరు బుల్స్ వర్సెస్ తమిళ్ తలైవాస్ (రాత్రి 8:00 గంటలు)- పుణెరి పల్టాన్ వర్సెస్ గుజరాత్ జెయింట్స్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 5, మంగళవారం- యు ముంబా వర్సెస్ దబాంగ్ ఢిల్లీ కేసీ (రాత్రి 8:00 గంటలు)- జైపూర్ పింక్ పాంథర్స్ వర్సెస్ యూపీ యోధాస్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 6, బుధవారం- తమిళ్ తలైవాస్ వర్సెస్ తెలుగు టైటాన్స్ (రాత్రి 8:00 గంటలు)- పట్నా పైరేట్స్ వర్సెస్ యు ముంబా (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 7, గురువారం- హర్యానా స్టీలర్స్ వర్సెస్ గుజరాత్ జెయింట్స్ (రాత్రి 8:00 గంటలు)- బెంగాల్ వారియర్స్ వర్సెస్ దబాంగ్ ఢిల్లీ కేసీ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 8, శుక్రవారం- జైపూర్ పింక్ పాంథర్స్ వర్సెస్ పాట్నా పైరేట్స్ (రాత్రి 8:00 గంటలు)- దబాంగ్ ఢిల్లీ కేసీ వర్సెస్ తమిళ్ తలైవాస్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 9, శనివారం- తెలుగు టైటాన్స్ వర్సెస్ పుణెరి పల్టన్ (రాత్రి 8:00 గంటలు)బెంగళూరు బుల్స్ వర్సెస్ బెంగాల్ వారియర్స్ (రాత్రి 9:00 గంటలు)నోయిడా (నోయిడా ఇండోర్ స్టేడియం)నవంబర్ 10, ఆదివారం- యూపీ యోధాస్ వర్సెస్ యు ముంబా (రాత్రి 8:00 గంటలు)- గుజరాత్ జెయింట్స్ వర్సెస్ హర్యానా స్టీలర్స్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 11, సోమవారం- గుజరాత్ జెయింట్స్ వర్సెస్ పట్నా పైరేట్స్ (రాత్రి 8:00 గంటలు)- యు ముంబా వర్సెస్ హర్యానా స్టీలర్స్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 12, మంగళవారం- బెంగళూరు బుల్స్ వర్సెస్ జైపూర్ పింక్ పాంథర్స్ (రాత్రి 8:00 గంటలు)- దబాంగ్ ఢిల్లీ కేసీ వర్సెస్ పుణెరి పల్టాన్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 13, బుధవారం- గుజరాత్ జెయింట్స్ వర్సెస్ బెంగాల్ వారియర్స్ (రాత్రి 8:00 గంటలు)- పట్నా పైరేట్స్ వర్సెస్ హర్యానా స్టీలర్స్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 14, గురువారం- యూపీ యోధాస్ వర్సెస్ తెలుగు టైటాన్స్ (రాత్రి 8:00 గంటలు)- తమిళ్ తలైవాస్ వర్సెస్ యు ముంబా (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 15, శుక్రవారం- పట్నా పైరేట్స్ వర్సెస్ బెంగాల్ వారియర్స్ (రాత్రి 8:00 గంటలు)- జైపూర్ పింక్ పాంథర్స్ వర్సెస్ గుజరాత్ జెయింట్స్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 16, శనివారం- బెంగాల్ వారియర్స్ వర్సెస్ తమిళ్ తలైవాస్ (రాత్రి 8:00 గంటలు)- దబాంగ్ ఢిల్లీ కేసీ వర్సెస్ బెంగళూరు బుల్స్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 17, ఆదివారం- హర్యానా స్టీలర్స్ వర్సెస్ తమిళ్ తలైవాస్ (రాత్రి 8:00 గంటలు)- జైపూర్ పింక్ పాంథర్స్ వర్సెస్ పుణెరి పల్టాన్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 18, సోమవారం- బెంగళూరు బుల్స్ వర్సెస్ యు ముంబా (రాత్రి 8:00 గంటలు)- తెలుగు టైటాన్స్ వర్సెస్ హర్యానా స్టీలర్స్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 19, మంగళవారం- పుణెరి పల్టాన్ వర్సెస్ యూపీ యోధాస్ (రాత్రి 8:00 గంటలు)బెంగళూరు బుల్స్ వర్సెస్ పాట్నా పైరేట్స్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 20, బుధవారం- దబాంగ్ ఢిల్లీ కేసీ వర్సెస్ గుజరాత్ జెయింట్స్ (రాత్రి 8:00 గంటలు)- తెలుగు టైటాన్స్ వర్సెస్ యు ముంబా (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 21, గురువారం- బెంగళూరు బుల్స్ వర్సెస్ హర్యానా స్టీలర్స్ (రాత్రి 8:00 గంటలు)- బెంగాల్ వారియర్స్ వర్సెస్ తెలుగు టైటాన్స్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 22, శుక్రవారంజైపూర్ పింక్ పాంథర్స్ వర్సెస్ దబాంగ్ ఢిల్లీ కేసీ (రాత్రి 8:00 గంటలు)- తమిళ్ తలైవాస్ వర్సెస్ యూపీ యోధస్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 23, శనివారం- గుజరాత్ జెయింట్స్ వర్సెస్ తెలుగు టైటాన్స్ (రాత్రి 8:00 గంటలు)- జైపూర్ పింక్ పాంథర్స్ వర్సెస్ హర్యానా స్టీలర్స్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 24, ఆదివారం- పుణెరి పల్టాన్ వర్సెస్ బెంగాల్ వారియర్స్ (రాత్రి 8:00 గంటలు)- పట్నా పైరేట్స్ వర్సెస్ యూపీ యోధాస్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 25, సోమవారం- యు ముంబా వర్సెస్ బెంగళూరు బుల్స్ (రాత్రి 8:00 గంటలు)- పుణెరి పల్టాన్ వర్సెస్ జైపూర్ పింక్ పాంథర్స్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 26, మంగళవారం- దబాంగ్ ఢిల్లీ కేసీ వర్సెస్ పాట్నా పైరేట్స్ (రాత్రి 8:00 గంటలు)- యూపీ యోధాస్ వర్సెస్ తమిళ్ తలైవాస్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 27, బుధవారం- హర్యానా స్టీలర్స్ వర్సెస్ పుణెరి పల్టాన్ (రాత్రి 8:00 గంటలు)- బెంగాల్ వారియర్స్ వర్సెస్ గుజరాత్ జెయింట్స్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 28, గురువారం- యూపీ యోధాస్ వర్సెస్ జైపూర్ పింక్ పాంథర్స్ (రాత్రి 8:00 గంటలు)- యు ముంబా వర్సెస్ తెలుగు టైటాన్స్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 29, శుక్రవారం- తమిళ్ తలైవాస్ వర్సెస్ హర్యానా స్టీలర్స్ (రాత్రి 8:00 గంటలు)- గుజరాత్ జెయింట్స్ వర్సెస్ పుణెరి పల్టాన్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 30, శనివారం- పట్నా పైరేట్స్ వర్సెస్ బెంగళూరు బుల్స్ (రాత్రి 8:00 గంటలు)జైపూర్ పింక్ పాంథర్స్ వర్సెస్ తెలుగు టైటాన్స్ (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 1, ఆదివారం- తమిళ్ తలైవాస్ వర్సెస్ దబాంగ్ ఢిల్లీ కేసీ (రాత్రి 8:00 గంటలు)- బెంగాల్ వారియర్స్ వర్సెస్ పట్నా పైరేట్స్ (రాత్రి 9:00 గంటలు)పుణె (బాలేవాడి బ్యాడ్మింటన్ స్టేడియం)డిసెంబర్ 3, మంగళవారం- బెంగళూరు బుల్స్ వర్సెస్ గుజరాత్ జెయింట్స్ (రాత్రి 8:00 గంటలు)- యు ముంబా వర్సెస్ పుణెరి పల్టాన్ (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 4, బుధవారం- తెలుగు టైటాన్స్ వర్సెస్ యూపీ యోధాస్ (రాత్రి 8:00 గంటలు)- హర్యానా స్టీలర్స్ వర్సెస్ బెంగాల్ వారియర్స్ (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 5, గురువారం- దబాంగ్ ఢిల్లీ కేసీ వర్సెస్ యూపీ యోధాస్ (రాత్రి 8:00 గంటలు)- జైపూర్ పింక్ పాంథర్స్ వర్సెస్ యు ముంబా (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 6, శుక్రవారం- హర్యానా స్టీలర్స్ వర్సెస్ పాట్నా పైరేట్స్ (రాత్రి 8:00 గంటలు)- తమిళ్ తలైవాస్ వర్సెస్ గుజరాత్ జెయింట్స్ (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 7, శనివారం- యూపీ యోధాస్ వర్సెస్ పుణెరి పల్టాన్ (రాత్రి 8:00 గంటలు)- తెలుగు టైటాన్స్ వర్సెస్ బెంగాల్ వారియర్స్ (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 8, ఆదివారం- పట్నా పైరేట్స్ వర్సెస్ జైపూర్ పింక్ పాంథర్స్ (రాత్రి 8:00 గంటలు)- యు ముంబా వర్సెస్ గుజరాత్ జెయింట్స్ (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 9, సోమవారం- హర్యానా స్టీలర్స్ వర్సెస్ తెలుగు టైటాన్స్ (రాత్రి 8:00 గంటలు)- పుణెరి పల్టాన్ వర్సెస్ దబాంగ్ ఢిల్లీ కేసీ (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 10, మంగళవారం- గుజరాత్ జెయింట్స్ వర్సెస్ జైపూర్ పింక్ పాంథర్స్ (రాత్రి 8:00 గంటలు)- బెంగాల్ వారియర్స్ వర్సెస్ బెంగళూరు బుల్స్ (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 11, బుధవారంహర్యానా స్టీలర్స్ వర్సెస్ బెంగళూరు బుల్స్ (రాత్రి 8:00 గంటలు)- యు ముంబా వర్సెస్ తమిళ్ తలైవాస్ (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 12, గురువారం- దబాంగ్ ఢిల్లీ కేసీ వర్సెస్ తెలుగు టైటాన్స్ (రాత్రి 8:00 గంటలు)- యూపీ యోధాస్ వర్సెస్ బెంగాల్ వారియర్స్ (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 13, శుక్రవారం- తమిళ్ తలైవాస్ వర్సెస్ పట్నా పైరేట్స్ (రాత్రి 8:00 గంటలు)- పుణెరి పల్టాన్ వర్సెస్ బెంగళూరు బుల్స్ (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 14, శనివారం- తెలుగు టైటాన్స్ వర్సెస్ గుజరాత్ జెయింట్స్ (రాత్రి 8:00 గంటలు)- దబాంగ్ ఢిల్లీ కేసీ వర్సెస్ హర్యానా స్టీలర్స్ (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 15, ఆదివారం- తమిళ్ తలైవాస్ వర్సెస్ జైపూర్ పింక్ పాంథర్స్ (రాత్రి 8:00 గంటలు)- యు ముంబా వర్సెస్ యూపీ యోధాస్ (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 16, సోమవారం- దబాంగ్ ఢిల్లీ కేసీ వర్సెస్ బెంగాల్ వారియర్స్ (రాత్రి 8:00 గంటలు)- పట్నా పైరేట్స్ వర్సెస్ పుణెరి పల్టాన్ (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 17, మంగళవారం- హర్యానా స్టీలర్స్ వర్సెస్ యూపీ యోధాస్ (రాత్రి 8:00 గంటలు)జైపూర్ పింక్ పాంథర్స్ వర్సెస్ బెంగళూరు బుల్స్ (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 18, బుధవారం- తమిళ్ తలైవాస్ వర్సెస్ బెంగాల్ వారియర్స్ (రాత్రి 8:00 గంటలు)- పట్నా పైరేట్స్ వర్సెస్ తెలుగు టైటాన్స్ (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 19, గురువారం- గుజరాత్ జెయింట్స్ వర్సెస్ యూపీ యోధాస్ (రాత్రి 8:00 గంటలు)- యు ముంబా వర్సెస్ పట్నా పైరేట్స్ (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 20, శుక్రవారం- జైపూర్ పింక్ పాంథర్స్ వర్సెస్ బెంగాల్ వారియర్స్ (రాత్రి 8:00 గంటలు)- పుణెరి పల్టాన్ వర్సెస్ తెలుగు టైటాన్స్ (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 21, శనివారం- పట్నా పైరేట్స్ వర్సెస్ గుజరాత్ జెయింట్స్ (రాత్రి 8:00 గంటలు)- దబాంగ్ ఢిల్లీ కేసీ వర్సెస్ జైపూర్ పింక్ పాంథర్స్ (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 22, ఆదివారం- తమిళ్ తలైవాస్ వర్సెస్ బెంగళూరు బుల్స్ (రాత్రి 8:00 గంటలు)- హర్యానా స్టీలర్స్ వర్సెస్ యు ముంబా (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 23, సోమవారం- గుజరాత్ జెయింట్స్ వర్సెస్ దబాంగ్ ఢిల్లీ కేసీ (రాత్రి 8:00 గంటలు)- పుణెరి పల్టాన్ వర్సెస్ తమిళ్ తలైవాస్ (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 24, మంగళవారం- బెంగళూరు బుల్స్ వర్సెస్ యూపీ యోధాస్ (రాత్రి 8:00 గంటలు)- బెంగాల్ వారియర్స్ వర్సెస్ యు ముంబా (రాత్రి 9:00 గంటలు) -
Pro Kabaddi League: సెమీస్లో పింక్ పాంథర్స్
Pro Kabaddi League 10-కోల్కతా: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో డిఫెండింగ్ చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్ జట్టు సెమీఫైనల్లోకి ప్రవేశించింది. యూపీ యోధాస్తో జరిగిన మ్యాచ్లో పింక్ పాంథర్స్ 67–30తో గెలిచింది. జైపూర్ ప్లేయర్ అర్జున్ 20 పాయింట్లతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఈ గెలుపుతో పింక్ పాంథర్స్ 82 పాయింట్లతో టాప్ ర్యాంక్లోకి రాగా... పుణేరి పల్టన్ 81 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. మిగతా మ్యాచ్ల ఫలితాలతో సంబంధం లేకుండా ఈ రెండు జట్లు టాప్–2లో నిలవనున్నాయి. దాంతో ఈ రెండు జట్లకు సెమీఫైనల్ బెర్త్లు ఖరారయ్యాయి. మరో మ్యాచ్లో బెంగాల్ వారియర్స్ 46–34తో యు ముంబాను ఓడించింది. చదవండి: Paris olympics: బ్రెజిల్కు బిగ్ షాక్.. పారిస్ ఒలింపిక్స్కు అర్జెంటీనా -
తెలుగు టైటాన్స్కు మరో ఓటమి.. ఏకంగా 12వ పరాజయం
సాక్షి, హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో తెలుగు టైటాన్స్ జట్టు నిరాశాజనక ప్రదర్శన కొనసాగుతోంది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో శుక్రవారం హైదరాబాద్ అంచె పోటీలు మొదలయ్యాయి. ఈ క్రమంలో సొంతగడ్డపై తెలుగు టైటాన్స్ జట్టు 26–42 పాయింట్ల తేడాతో బెంగళూరు బుల్స్ చేతిలో ఓడిపోయింది. ఈ లీగ్లో తెలుగు టైటాన్స్ జట్టుకిది 12వ పరాజయం కావడం గమనార్హం. టైటాన్స్ తరఫున కెప్టెన్ పవన్ సెహ్రావత్ ఏడు పాయింట్లు స్కోరు చేశాడు. అదే విధంగా.. బెంగళూరు జట్టు తరఫున సుర్జీత్ ఏడు పాయింట్లు, వికాశ్ ఆరు పాయింట్లు సాధించారు. మరో మ్యాచ్లో పట్నా పైరేట్స్ 34–31తో యూపీ యోధాస్ను ఓడించింది. నేడు జరిగే మ్యాచ్ల్లో దబంగ్ ఢిల్లీతో యు ముంబా; తెలుగు టైటాన్స్తో యూపీ యోధాస్ తలపడతాయి. -
యూపీ యోధాస్ను చిత్తు చేసిన తమిళ్ తలైవాస్
ముంబై: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో తమిళ్ తలైవాస్ మూడో విజయం నమోదు చేసింది. యూపీ యోధాస్తో బుధవారం జరిగిన మ్యాచ్లో తలైవాస్ 46–27తో గెలిచింది. యు ముంబా, హరియాణా స్టీలర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 44–44తో ‘డ్రా’ అయింది. ప్రస్తుతం పుణేరీ పల్టన్ (10 మ్యాచ్ల్లో 9 విజయాలు) పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. దబంగ్ ఢిల్లీ, గుజరాత్ జెయింట్స్, జైపూర్ పింగ్ పాంథర్స్, యు ముంబ రెండు నుంచి ఐదు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఆడిన 11 మ్యాచ్ల్లో కేవలం ఒకే ఒక మ్యాచ్ గెలిచిన తెలుగు టైటాన్స్ పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. -
PKL 2023: తలైవాస్పై పాంథర్స్ గెలుపు
Pro Kabaddi League 2023- చెన్నై: ప్రొ కబడ్డీ లీగ్లో హోరాహోరీగా సాగిన మ్యాచ్లో ఢిపెండింగ్ చాంపియన్ జైపూర్ పింక్పాంథర్స్ 25–24తో తమిళ్ తలైవాస్పై గెలిచింది. అర్జున్ దేశ్వాల్ (7 పాయింట్లు), రెజా మిర్బగెరి (5), సునీల్ కుమార్ (4), అజిత్ (3) రాణించారు. The Pink Panthers' 𝗿𝗲𝘇-son to 𝔹𝔼𝕃𝕀𝔼𝕍𝔼 🩷#ProKabaddiLeague #ProKabaddi #PKLSeason10 #PKL #HarSaansMeinKabaddi #CHEvJPP #TamilThalaivas #JaipurPinkPanthers pic.twitter.com/jCmyGWIsui — ProKabaddi (@ProKabaddi) December 23, 2023 తలైవాస్ తరఫున హిమాన్షు నర్వాల్ 8 పాయింట్లు సాధించాడు. తద్వారా ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది డేగా నిలిచాడు. ఇక తలైవాస్పై తాజా విజయంతో జైపూర్ పింక్పాంథర్స్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దూసుకెళ్లింది. మరోవైపు.. శనివారం జరిగిన రెండో మ్యాచ్లో గుజరాత్ జెయింట్స్ 38–30తో యూపీ యోధాస్పై విజయం సాధించింది. గుజరాత్ విజయంలో రెయిడర్ రాకేశ్ (14) కీలకపాత్ర పోషించాడు. Powerful Parteek with a Giant tackle 🤜🤛#ProKabaddiLeague #ProKabaddi #PKLSeason10 #PKL #HarSaansMeinKabaddi #GGvUP #GujaratGiants #UPYoddhas pic.twitter.com/My5I0MfTXS — ProKabaddi (@ProKabaddi) December 23, 2023 బంగ్లా చేతిలో కివీస్ చిత్తు నేపియర్: న్యూజిలాండ్తో వన్డే సిరీస్ను ఇప్పటికే చేజార్చుకున్న బంగ్లాదేశ్కు ఊరట విజయం దక్కింది. శనివారం జరిగిన చివరి వన్డేలో బంగ్లా 9 వికెట్ల తేడాతో కివీస్ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ 31.4 ఓవర్లలో 98 పరుగులకే కుప్పకూలింది. బంగ్లాపై ఆ జట్టుకు ఇదే అత్యల్ప స్కోరు. యంగ్ (26) టాప్ స్కోరర్ కాగా, ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ తన్జీమ్ హసన్ (3/14), సౌమ్య సర్కార్, షరీఫుల్ తలా 3 వికెట్లు తీశారు. అనంతరం బంగ్లా 15.1 ఓవర్లలో వికెట్ నష్టానికి 99 పరుగులు చేసింది. నజ్ముల్ హుస్సేన్ (51 నాటౌట్), అనాముల్ హక్ (37) రాణించారు. కివీస్ గడ్డపై బంగ్లాదేశ్కు ఇదే తొలి గెలుపు కావడం విశేషం. తొలి రెండు మ్యాచ్లు నెగ్గిన న్యూజిలాండ్ 2–1తో సిరీస్ సొంతం చేసుకుంది. -
PKL 2023: డిఫెండింగ్ చాంపియన్ జైపూర్ గెలుపు బోణీ
Pro Kabaddi League 2023- బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో డిఫెండింగ్ చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్ జట్టు తొలి విజయం సాధించింది. గుజరాత్ జెయింట్స్తో సోమవారం జరిగిన మ్యాచ్లో జైపూర్ పింక్ పాంథర్స్ 35–32తో గెలిచింది. విరామ సమయానికి 12–20తో వెనుకబడి ఉన్న జైపూర్ జట్టు రెండో అర్ధభాగంలో పుంజుకుంది. రెయిడర్ అర్జున్ దేశ్వాల్ అత్యధికంగా 15 పాయింట్లు స్కోరు చేసి జైపూర్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. కాగా ఈ సీజన్లో జైపూర్ ఇప్పటి వరకు మూడు మ్యాచ్లు ఆడగా.. ఆ జట్టుకు ఇదే తొలి గెలుపు. మరోవైపు.. గుజరాత్ జెయింట్స్ ఐదింట మూడు గెలిచి 17 పాయింట్లతో ప్రస్తుతం టేబుల్ టాపర్గా కొనసాగుతోంది. 2️⃣4️⃣-carat magical raid ft. Sonu 😍#ProKabaddi #PKL #PKLSeason10 #HarSaansMeinKabaddi #JPPvGG #JaipurPinkPanthers #GujaratGiants pic.twitter.com/vDrssOgxDi — ProKabaddi (@ProKabaddi) December 11, 2023 బెంగళూరు బుల్స్ చేతిలో యూపీ యోధాస్ ఓటమి ఇదిలా ఉంటే.. సోమవారం నాటి మరో మ్యాచ్లో బెంగళూరు బుల్స్ 38–36తో యూపీ యోధాస్ను ఓడించి ఈ సీజన్లో ఐదో మ్యాచ్లో తొలి విజయాన్ని అందుకుంది. బెంగళూరు తరఫున వికాశ్, భరత్ 11 పాయింట్ల చొప్పున స్కోరు చేశారు. అదే విధంగా... మంగళవారం జరిగే మ్యాచ్లో పట్నా పైరేట్స్తో బెంగాల్ వారియర్స్ తలపడుతుంది. Announcing the yuddh in his style ⚔️ Pardeep Narwal for you 💪#ProKabaddi #PKL #PKLSeason10 #HarSaansMeinKabaddi #BLRvUP #BengaluruBulls #UPYoddhas pic.twitter.com/HrUJXMKK3W — ProKabaddi (@ProKabaddi) December 11, 2023 -
PKL 2022: తెలుగు టైటాన్స్ దారుణ వైఫల్యం.. తొమ్మిదింట 8 పరాజయాలతో..
Pro Kabaddi League 2022- Telugu Titans- పుణే: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో తెలుగు టైటాన్స్ చెత్త ప్రదర్శన కొనసాగుతోంది. ఈ సీజన్లో తొమ్మిదో మ్యాచ్ ఆడిన టైటాన్స్ ఎనిమిదో పరాజయాన్ని చవిచూసింది. సోమవారం జరిగిన మ్యాచ్లో టైటాన్స్ 24–43 స్కోరు తేడాతో యూపీ యోధాస్ చేతిలో ఓడిపోయింది. తెలుగు టైటాన్స్ జట్టులో ఏ ఒక్కరు చెప్పుకోదగ్గ పాయింట్లు సాధించలేకపోయారు. ఆదర్శ్, మోహిత్ పహాల్ చెరో 5 పాయింట్లు సాధించారు. మిగతావారంతా నిరాశపరిచారు. యూపీ తరఫున రెయిడర్ సురేందర్ గిల్ (13 పాయింట్లు), ప్రదీప్ నర్వాల్(9) రాణించారు. కాగా 12 జట్లు పోటీపడుతున్న ఈ టోర్నీలో తెలుగు టైటాన్స్ ఒకే ఒక్క విజయంతో అట్టడుగున ఉంది. ఇక బెంగళూరు బుల్స్ ఆరు విజయాలతో 34 పాయింట్లు సాధించి టాప్లో కొనసాగుతోంది. చదవండి: T20 WC 2022: భారత్- బంగ్లాదేశ్ మ్యాచ్కు వర్షం ముప్పు.. ఆట రద్దు అయితే? Special Story: ఉరికే జలపాతం.. ఉత్తుంగ తరంగం.. సెరీనా విలియమ్స్ Match 5️⃣0️⃣ belonged to the Pirates while the Yoddhas claimed Match 5️⃣1️⃣ Here's the league table 📊 after tonight's encounters 😃#vivoProKabaddi #FantasticPanga #GGvPAT #UPvTT pic.twitter.com/M3Yhds5cFK — ProKabaddi (@ProKabaddi) October 31, 2022 Full time.#vivoProKabaddi #TeluguTitans #IdiAataKaaduVetaa #MatchDay #WeRiseAgain #TTvsUP #Kabaddi #KabaddiIndia pic.twitter.com/QDL3sLMAXw — Telugu Titans (@Telugu_Titans) October 31, 2022 -
చివరి దాకా ఉత్కంఠ.. దబాంగ్ ఢిల్లీ 'హ్యాట్రిక్' విజయం
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్లో దబాంగ్ ఢిల్లీ వరుసగా మూడో విజయంతో ‘హ్యాట్రిక్’ సాధించింది. యూపీ యోధాస్తో బుధవారం జరిగిన మ్యాచ్లో దబాంగ్ ఢిల్లీ 44–42తో గెలిచింది. ఢిల్లీ తరఫున నవీన్ 13 పాయింట్లు, మంజీత్ 12 పాయింట్లు స్కోరు చేశారు. యూపీ తరఫున సురేందర్ గిల్ 21 పాయింట్లు సాధించాడు. మరో మ్యాచ్లో బెంగాల్ వారియర్స్ 42–33తో బెంగళూరు బుల్స్ను ఓడించింది. నేడు విశ్రాంతి దినం. శుక్రవారం మూడు మ్యాచ్లు జరుగుతాయి. -
PKL 2022: సెమీఫైనల్స్కు యూపీ యోధ, బెంగళూరు బుల్స్
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో యూపీ యోధ, బెంగళూరు బుల్స్ జట్లు సెమీ ఫైనల్స్కు చేరాయి. సోమవారం జరిగిన తొలి ఎలిమినేటర్ మ్యాచ్లో యూపీ యోధ 42–31తో పుణేరి పల్టన్పై గెలుపొందగా, బెంగళూరు బుల్స్ 49–29తో గుజరాత్ జెయింట్స్పై విజయం సాధించింది. మ్యాచ్ ఆరంభంలో అస్లామ్, మోహిత్ గోయత్ రెయిడింగ్ పాయింట్లతో పుణేరి 5–0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. దీంతో ఏడో నిమిషంలో యూపీ ఆలౌటైంది. తర్వాత పర్దీప్ వరుసగా కూతకు వెళ్లి పాయింట్లు తెచ్చిపెట్టడంతో పుంజుకుంది. స్టార్ రెయిడర్ పర్దీప్ 18 పాయింట్లతో రాణించాడు. ప్రత్యర్థి పుణేరి జట్టులో అస్లామ్ ఇనామ్దార్ (10) మెరుగనిపించాడు. రెండో ఎలిమినేటర్ పోరులో బెంగళూరు సమష్టిగా రాణించింది. రెయిడర్లు పవన్ 13, భరత్ 6, రంజీత్ చంద్రన్ 7 పాయింట్లు సాధించగా, డిఫెండర్లు మహేందర్ సింగ్ 5, సౌరభ్ నందల్ 4, అమన్ 4 పాయింట్లు చేశారు. గుజరాత్ జట్టులో రాకేశ్ (8), మహేంద్ర రాజ్పుత్ (5) మెరుగనిపించారు. బుధవారం జరిగే సెమీఫైనల్లో యూపీ... పట్నా పైరేట్స్తో, బెంగళూరు... దబంగ్ ఢిల్లీతో తలపడతాయి. -
Pro Kabaddi League: ఎదురులేని బెంగళూరు బుల్స్.. తొమ్మిదో విజయం
Pro Kabaddi League 2021- 2022: Bengaluru Bulls Beat UP Yoddha: ప్రొ కబడ్డీ లీగ్లో బెంగళూరు బుల్స్ జట్టు తొమ్మిదో విజయం సాధించింది. యూపీ యోధతో మంగళవారం జరిగిన మ్యాచ్లో బెంగళూరు బుల్స్ 31–26 పాయింట్ల తేడాతో గెలిచింది. బెంగళూరు కెప్టెన్ పవన్ సెహ్రావత్ తొమ్మిది పాయింట్లు స్కోరు చేయగా... డిఫెండర్ అమన్ ఏడు పాయింట్లు సాధించాడు. ఇక యూపీ యోధ తరఫున శ్రీకాంత్ జాదవ్, నితీశ్ కుమార్ ఆరు పాయింట్ల చొప్పున స్కోరు చేశారు. అదే విధంగా... మరో మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ బెంగాల్ వారియర్స్ 25–34 తో గుజరాత్ జెయింట్స్ చేతిలో ఓడిపోయింది. చదవండి: Icc U 19 World Cup 2022: మరో ఫైనల్ వేటలో.. అండర్-19 టీమిండియా IPL 2022 Auction: వేలంలో మనవాళ్లు 23 మంది.. అంబటి, హనుమ విహారి, తన్మయ్, మనీశ్ రెడ్డి.. ఇంకా.. -
యూపీ, గుజరాత్ మ్యాచ్ ‘టై’
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్లో మరో మ్యాచ్ ‘టై’గా ముగిసింది. బుధవారం యూపీ యోధ, గుజరాత్ జెయింట్స్ హోరాహోరీగా తలపడగా, 32–32 స్కోరుతో మ్యాచ్ సమమైంది. యూపీ తరఫున పర్దీప్ నర్వాల్ 11 పాయింట్లతో సత్తా చాటగా...గుజరాత్ ఆటగాళ్లలో రాకేశ్ నర్వాల్ 13 పాయింట్లతో చెలరేగాడు. మరో మ్యాచ్లో దబంగ్ ఢిల్లీ 52–35 తేడాతో బెంగాల్ వారియర్స్ను చిత్తు చేసింది. నవీన్ కుమార్ అద్భుత ప్రదర్శన ఢిల్లీని గెలిపించింది. అతనొక్కడే 24 పాయింట్లతో దూసుకుపోవడం విశేషం. బెంగాల్ ఆటగాళ్లలో కెప్టెన్ మణీందర్ సింగ్ 16 పాయింట్లు సాధించాడు. నేడు జరిగే మ్యాచ్లలో జైపూర్తో యు ముంబా, హర్యానాతో బెంగళూరు తలపడతాయి. చదవండి: ఉత్తర్ప్రదేశ్ కెప్టెన్గా కుల్ధీప్ యాదవ్.. -
బెంగళూరుపై యూపీ యోధ గెలుపు
గ్రేటర్ నోయిడా: ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్ లీగ్ మ్యాచ్లు శుక్రవారంతో ముగిశాయి. లీగ్ దశ చివరి మ్యాచ్లో యూపీ యోధ 45–33తో బెంగళూరు బుల్స్పై విజయం సాధించింది. బెంగళూరు రైడర్ పవన్ షెరావత్ 13 పాయింట్లతో టాప్ స్కోరర్గా నిలిచినా... అతనికి సహచరుల నుంచి సహకారం అందలేదు. ఒక దశలో 5–14తో వెనుకంజలో ఉన్న యూపీని రైడర్ సురేందర్ గిల్ (9 పాయింట్లు), శ్రీకాంత్ జాదవ్ (9 పాయింట్లు) ఆదుకున్నారు. సూపర్ రైడ్తో 4 పాయింట్లు సాధించిన సురేందర్... బెంగళూరు ఆధిక్యాన్ని 14–9కి తగ్గించాడు. తర్వాత కూడా యూపీ యోధ క్రమం తప్పకుండా పాయింట్లు సాధించి మొదటి అర్ధ భాగాన్ని 20–22తో ముగించింది. ఇక రెండో అర్ధ భాగంలో యూపీ డిఫెండర్ ఆశు సింగ్ (5 పాయింట్లు) ప్రత్యర్థి రైడర్లను పట్టేయడంతో ఆధిక్యంలోకెళ్లింది. ఇదే దూకుడును చివరి వరకు కొనసాగించి విజయాన్ని అందుకుంది. తాజా విజయంతో యూపీ యోధ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలువగా... బెంగళూరు బుల్స్ ఆరో స్థానంలో నిలిచింది. అంతకుముందు దబంగ్ ఢిల్లీ–యు ముంబా మ్యాచ్ 37–37తో ‘టై’గా ముగిసింది. ప్లే ఆఫ్ షెడ్యూల్ (వేదిక: అహ్మదాబాద్) అక్టోబర్ 14: ఎలిమినేటర్–1: యూపీ యోధ x బెంగళూరు బుల్స్ అక్టోబర్ 14: ఎలిమినేటర్–2: యు ముంబా xహరియాణా స్టీలర్స్ అక్టోబర్ 16: తొలి సెమీఫైనల్: దబంగ్ ఢిల్లీ xఎలిమినేటర్–1 విజేత అక్టోబర్ 16: రెండో సెమీఫైనల్: బెంగళూరు బుల్స్ x ఎలిమినేటర్–2 విజేత అక్టోబర్ 19: ఫైనల్ (సెమీఫైనల్స్ విజేతలు) -
విజయంతో టైటాన్స్ వీడ్కోలు
గ్రేటర్ నోయిడా: ప్రొ కబడ్డీ లీగ్ను తెలుగు టైటాన్స్ జట్టు విజయంతో ముగించింది. బుధవారం జరిగిన పోరులో టైటాన్స్ 41–36తో యూపీ యోధపై విజయం సాధించింది. సిద్ధార్థ్ దేశాయ్ చక్కగా రాణించాడు. 15 సార్లు రైడింగ్ వెళ్లిన అతను 15 పాయింట్లు తెచి్చపెట్టాడు. మిగతా వారిలో కృష్ణ మదనే, ఫర్హాద్ చెరో 4 పాయింట్లు సాధించారు. యూపీ యోధ జట్టులో శ్రీకాంత్ జాదవ్ (8), రిషాంక్ దేవడిగ (8) అదరగొట్టారు. సుమిత్ (5), మోను గోయత్ (4), నితీశ్ కుమార్ (4) రాణించారు. మొత్తం మీద 22 మ్యాచ్లాడిన తెలుగు టైటాన్స్ 6 విజయాలతో 11వ స్థానంలో నిలిచింది. 4 విజయాలతో తమిళ్ తలైవాస్ అట్టడుగున నిలిచింది. మరో మ్యాచ్లో బెంగాల్ వారియర్స్ 33–29తో తమిళ్ తలైవాస్పై విజయం సాధించింది. నేడు (గురువారం) జరిగే పోటీలో యు ముంబాతో హరియాణా స్టీలర్స్ తలపడుతుంది. -
ప్లే ఆఫ్స్కు యూపీ యోధ
గ్రేటర్ నోయిడా: ప్రస్తుత కబడ్డీ సీజన్ ప్లే ఆఫ్స్కు యూపీ యోధ అర్హత సాధించింది. దీంతో ప్లే ఆఫ్స్కు పోటీ పడుతున్న జైపూర్ పింక్ పాంథర్స్ ఆశలు ఆవిరయ్యాయి. శనివారం జరిగిన మ్యాచ్లో యూపీ 50–33తో దబంగ్ ఢిల్లీపై ఘన విజయం సాధించింది. మోను (11 పాయింట్లు), శ్రీకాంత్ (9 పాయింట్లు) రాణించడంతో యూపీ విజయాన్ని ఖాయం చేసుకుంది. మరో మ్యాచ్లో పట్నా పైరేట్స్ 39–33తో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్పై నెగ్గింది. -
యూపీ యోధ గెలుపు
జైపూర్: ప్రొ కబడ్డీ లీగ్లో యూపీ యోధ తొమ్మిదో విజయాన్ని నమోదు చేసింది. శనివారం జరిగిన మ్యాచ్లో యూపీ 42–22తో తమిళ్ తలైవాస్ను చిత్తుచేసింది. యూపీ రైడర్ శ్రీకాంత్ జాధవ్ 8 పాయింట్లతో రైడింగ్లో మెరవగా...ట్యాక్లింగ్లో సమిత్ ‘హై–ఫై’ (5 పాయింట్లు)తో జట్టును గెలిపించాడు. తలైవాస్ రైడర్ రాహుల్ (5 పాయిం ట్లు) నిరాశ పరిచాడు. జైపూర్ పింక్ పాంథర్స్, గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ మ్యాచ్ 28–28తో ‘డ్రా’గా ముగిసింది. నేటి మ్యాచ్ల్లో యు ముంబాతో ఫార్చూన్ జెయింట్స్; బెంగాల్ వారియర్స్తో జైపూర్ పింక్ పాంథర్స్ తలపడతాయి. -
యూపీ యోధపై యు ముంబా గెలుపు
పుణే: అభిషేక్ సింగ్ (11 రైడ్ పాయింట్లు) చెలరేగడంతో ప్రొ కబడ్డీ లీగ్లో బుధవారం యూపీ యోధపై మాజీ చాంపియన్ యు ముంబా 39–36 తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ ప్రారంభంలో యూపీ ఆధిపత్యం చూపినా ముంబై తేరుకుని మొదటి భాగాన్ని 16–15తో ముగించింది. రెండో భాగమూ పోటాపోటీగానే సాగింది. ఆరు నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా అభిõÙక్ మూడు రైడ్ పాయింట్లతో ఫలితాన్ని మలుపు తిప్పాడు. పుణేరి పల్టన్–తమిళ్ తలైవాస్ మధ్య జరిగిన మరో మ్యాచ్ 36–36తో ‘డ్రా’గా ముగిసింది. -
హరియాణాను గెలిపించిన వికాశ్
న్యూఢిల్లీ: ప్రొ కబడ్డీ లీగ్లో భాగంగా సోమవారం జరిగిన మ్యాచ్లో హరియాణా స్టీలర్స్ 36–33తో బెంగాల్ వారియర్స్ను కంగుతినిపించింది. హరియాణా రైడర్ వికాశ్ కండోలా 11 పాయింట్లతో చెలరేగాడు. మరో రైడర్ వినయ్ 9 పాయింట్లతో వికాశ్కు చక్కని సహకారం అందించాడు. బెంగాల్ వారియర్స్ రైడర్ మణీందర్ సింగ్ 15 పాయింట్లతో ‘టాప్’ స్కోరర్గా నిలిచినా జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. మరో మ్యాచ్లో యూపీ యోధ 35–30తో పుణేరి పల్టన్పై నెగ్గింది. నేడు ప్రొ కబడ్డీ లీగ్లో విశ్రాంతి దినం. బుధవారం జరిగే మ్యాచ్ల్లో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్తో హరియాణా స్టీలర్స్; యు ముంబాతో దబంగ్ ఢిల్లీ తలపడతాయి. -
వారెవ్వా వారియర్స్
పట్నా: పేరుకు తగ్గట్టే బెంగాల్ వారియర్స్ అసలైన వారియర్లా పోరాడింది. ఒక్కసారి కాదు ఏకంగా రెండు సార్లు 5 పాయింట్ల అంతరాన్ని పూడ్చి విజేతగా నిలిచింది. ఒత్తిడి సమయాన ఎలా ఆడాలో మిగతా జట్లకు నేర్పింది. శుక్రవారం జరిగిన మ్యాచ్లో బెంగాల్ వారియర్స్ 32–30తో యు ముంబాను ఓడించింది. అదిరే ఆరంభం లభించినా... దానిని సద్వినియోగం చేసుకోలేని యు ముంబా సీజన్లో నాలుగో పరాభవాన్ని మూటగట్టుకుంది. యు ముంబా రైడర్ అర్జున్ దేశ్వాల్ సూపర్ ‘టెన్’తో చెలరేగినా... వారియర్స్ సమష్టి కృషి ముందు అది ఏ మాత్రం నిలవలేదు. వారియర్స్ డిఫెండర్లయిన మణీందర్ సింగ్, బల్దేవ్ సింగ్లు చెరో 5 టాకిల్ పాయింట్లతో మెరిశారు. ముంబా... విజయం ముంగిట... మ్యాచ్ మొదటి అర్ధ భాగంలో యు ముంబా ఆడిన తీరు చూస్తే ఆ జట్టు ఖాతాలో మరో విజయం ఖాయమన్నట్లు కనిపించింది. విరామ సమయానికి ఆ జట్టు 16–11తో ఆధిక్యంలో ఉంది. అయితే రెండో అర్ధ భాగం ఆరంభమైన కాసేపటికే సూపర్ రైడ్తో చెలరేగిన వారియర్ రైడర్ ప్రపంజన్ కుమార్ యు ముంబా ఆధిక్యాన్ని 14–16కు తగ్గించాడు. అనంతరం మరో నాలుగు పాయింట్లు సాధించిన బెంగాల్ జట్టు 18–17తో ముందంజ వేసింది. ప్రత్యర్థి ఇచ్చిన షాక్ నుంచి తేరుకున్నట్లు కనిపించిన ముంబై జట్టు వరుసగా పాయింట్లు సాధించి 26–21తో మరోసారి ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇటువంటి ఒత్తిడి సమయంలో ముంబైని తమ పట్టుతో పట్టేసిన బెంగాల్ డిఫెండర్లు ఆ జట్టును ఆలౌట్ చేసి... అనంతరం ఆధిక్యాన్ని కాపాడుకొని విజయాన్ని అందుకున్నారు. సొంత మైదానంలో పట్నా పైరేట్స్ ఎట్టకేలకు విజయం సాధించింది. అంతకు ముందు ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ ఓడిన పట్నా... చివరి మ్యాచ్లో విజయం సాధించి ఊపిరి పీల్చుకుంది. 41–20తో యూపీ యోధపై ఘన విజయం సాధించింది. పట్నా తరపున ప్రదీప్ నర్వాల్ 12 పాయింట్లతో రాణించాడు. నేటి నుంచి గుజరాత్ అంచె పోటీలు అహ్మదాబాద్లో ఆరంభం కానున్నాయి. నేడు జరిగే మ్యాచ్ల్లో తమిళ్ తలైవాస్తో గుజరాత్ ఫార్చున్ జెయింట్స్; పుణేరి పల్టన్తో దబంగ్ ఢిల్లీ తలపడతాయి. -
టైటాన్స్ నాన్ టెక్నికల్ టై
ముంబై: తెలుగు టైటాన్స్ ఆటగాళ్ల అత్యుత్సాహం జట్టుకు విజయాన్ని దూరం చేసింది. సాధారణంగా మ్యాచ్ ముగిశాక రిఫరీ వేసే లాంగ్ విజిల్ కంటే ముందుగా కబడ్డీ కోర్టు వెలుపల ఉన్న సహచర ఆటగాళ్లు గెలిచామనే ఆనందంతో కోర్టులోకి దూసుకొచ్చారు. దీంతో ఆగ్రహించిన రిఫరీలు యూపీ యోధకు నాన్ టెక్నికల్ రైడ్ పాయింట్ కేటాయించడంతో... టైటాన్స్కు ఈ సీజన్లో దక్కాల్సిన తొలి విజయం కాస్తా ‘టై’గా ముగిసింది. ముంబై వేదికగా శుక్రవారం ముగిసిన మ్యాచ్లో తెలుగు టైటాన్స్, యూపీ యోధ జట్లు నిర్ణీత సమయానికి 20–20తో సమంగా నిలిచాయి. దీంతో ప్రొ కబడ్డీ సీజన్ – 7లో తొలి ‘టై’ నమోదైంది. టైటాన్స్ తరపున సిద్ధార్థ్ దేశాయ్ (5 పాయింట్లతో) ఫర్వాలేదనిపించాడు. చేజేతులా... ఎలాగైనా విజయాన్ని నమోదు చేయాలనే పట్టుదలతో బరిలో దిగిన టైటాన్స్ మొదట ఆధిక్యాన్ని ఆ తర్వాత గెలుపుని చేజేతులా జారవిడుచుకుంది. మొదట 7–3తో ఆధిక్యంలో ఉన్న సమయంలో అలసత్వం ప్రదర్శించడంతో యూపీ వరుస పాయింట్లను సాధించి స్కోర్ను సమం చేసింది. మళ్లీ చివరి నిమిషంలో అదే అలసత్వం ప్రదర్శించి గెలుపును వదులుకుంది. మ్యాచ్ చివరి క్షణాల్లో కూతకెళ్లిన టైటాన్స్ రైడర్ సిద్ధార్థ్ దేశాయ్ పాయింట్ సాధించి జట్టును 20–19తో ఆధిక్యంలో నిలిపాడు. దీంతో గెలిచామనే ఆనందంలో టైటాన్స్ జట్టు సభ్యులు రిఫరీ లాంగ్ విజిల్ వేశాడా..? లేదా... అనేది చూసుకోకుండా కోర్టులోకి దూసుకురావడంతో రిఫరీలు యూపీ జట్టుకు నాన్ టెక్నికల్ రైడ్ పాయింట్ను కేటాయించారు. దీనిపై టైటాన్స్ సమీక్షకు వెళ్లగా... టీవీ అంపైర్ రిఫరీల నిర్ణయానికే కట్టుబడటంతో గెలవాల్సిన మ్యాచ్ కాస్త టైగా ముగిసింది. ఆఖరి పంచ్ ముంబైదే.. ముంబై వేదికగా జరిగిన ఆఖరి మ్యాచ్లో ఆఖరి పంచ్ ముంబై కొట్టింది. గుజరాత్ ఫార్చున్ జెయింట్స్పై 20–32తో ముంబై గెలిచి వరుస పరాజయాలకు పుల్స్టాప్ పెట్టింది. ముంబై ఆటగాళ్లు సురీందర్ సింగ్ 9 పాయింట్లతో, అభిషేక్ సింగ్ 6 పాయింట్లతో జట్టు విజయంలో కీలక పాత్ర వహించారు. నేడు జరిగే మ్యాచ్ల్లో పట్నా పైరేట్స్తో జైపూర్ పింక్ పాంథర్స్; బెంగాల్ వారియర్స్తో బెంగళూరు బుల్స్ తలపడతాయి. -
యూపీ యోధ మరోసారి చిత్తుచిత్తుగా..
హైదరాబాద్: ప్రొ కబడ్డీ సీజన్ ఏడులో యూపీ యోధ వరుసగా రెండో మ్యాచ్లోనూ ఘోరంగా ఓటమిపాలైంది. ఆ జట్టు స్టార్ రైడర్ మోను గోయత్ దారుణంగా విఫలమవడం, సమిష్టి వైఫల్యంతో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ చేతిలో చిత్తుచిత్తుగా ఓడిపోయింది. శుక్రవారం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో యూపీ యోధ 19-44 తేడాతో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ చేతిలో ఓటమి పాలైంది. గుజరాత్ ఆటగాళ్లు ఆరంభం నుంచి ఆటాకింగ్ ఆడారు. ముఖ్యంగా ఆ జట్టు రైడర్లు రోహిత్ గులియా(11), సచిన్(6) రెచ్చిపోయారు. దీంతో తొలి అర్దభాగంలోనే గుజరాత్ జట్టు 19-9తో భారీ ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక గుజరాత్ ఢిఫెండర్లు పర్వేష్ బైన్సాల్(6), మోరె(5) కూడా ఓ చేయి వేయడంతో యూపీ జట్టు పనిపట్టారు. యూపీ రైడర్ శ్రీకాంత్ జాదవ్(5) మినహా ఎవరూ అంతగా ఆకట్టుకోలేదు. యూపీ స్టార్ రైడర్ మోనూ గోయత్ ఎనిమిది సార్లు రైడ్కు వెళ్లి కేవలం రెండు పాయింట్లు మాత్రమే సాధించాడు. ఇది యూపీపై పెద్ద ప్రభావం చూపింది. గుజరాత్ జట్టు 23 రైడ్ పాయింట్లు, 14 టాకిల్ పాయింట్లతో హోరెత్తించగా.. యూపీ జట్టు 14 రైడ్ పాయింట్లు, 5 టాకిల్ పాయింట్లతో అందుకోలేకపోయింది. అంతేకాకుండా యూపీ జట్టును ఆలౌట్ చేసి మరో మూడు పాయింట్లను గుజరాత్ తన ఖాతాలో వేసుకుంది. -
గర్జించిన బెంగాల్.. కుదేలైన యూపీ
హైదరాబాద్: ప్రో కబడ్డీ సీజన్ లీగ్-7 తమ తొలి మ్యాచ్లోనే బెంగాల్ వారియర్స్ జూలు విదిల్చింది. బెంగాల్ దెబ్బకు యూపీ యోదా చిత్తుచిత్తుగా ఓడింది. బుధవారం హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన ఏకపక్షపోరులో యూపీ యోధాపై బెంగాల్ వారియర్స్ 48-17 తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్ ఆరంభంలో బెంగాల్ను ప్రతిఘటించిన యూపీ యోధా.. మ్యాచ్ జరిగే కొద్ది పట్టు విడిచింది. తొలుత పాయింట్ల ఖాతా తెరిచిన యూపీ 4-0తో మంచి లీడింగ్లో ఉంది. అనంతరం తొలిహాఫ్ ముగిసే సరికి యూపీ 8-11తో స్పల్ప వెనుకంజలో నిలిచింది. రెండో అర్ధభాగం ప్రారంభమయ్యాక బెంగాల్ వారియర్స్ అసలు ఆట ప్రారంభమైంది. బెంగాల్ ఆటగాళ్ల దూకుడుతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. అటాకింగ్ గేమ్తో విరుచుకపడటంతో యూపీ ఆటగాళ్లకు ఏం చేయాలో పాలు పోలేదు. యూపీ స్టార్ రైడర్ మోనూ గోయత్(6) మినహా ఎవరూ అంతగా ఆకట్టుకోలేదు. బెంగాల్ ఆటగాళ్లలో మహ్మద్ నబిబక్ష్ 10 పాయింట్లతో రెచ్చిపోయాడు. అతడికి తోడుగా మనిందర్ సింగ్(8), బల్దేవ్ సింగ్(7), ప్రపంజన్(5) ఆకట్టుకున్నారు. ఓవరాల్గా బెంగాల్ 24 రైడ్ పాయింట్లు, 14 టాకిల్ పాయింట్లతో హోరెత్తించగా.. యూపీ యోధా 10 రైడ్ పాయింట్లతో, 5 టాకిల్ పాయింట్లతో ప్రత్యర్థి జట్టును అందుకోలేకపోయింది. ఇక బెంగాల్ ధాటిక యూపీ జట్టు నాలుగు సార్లు ఆలౌటవ్వడం గమనార్హం. -
ఎలిమినేటర్–3కి యూపీ, ఢిల్లీ
కొచ్చి: ప్రొ కబడ్డీ లీగ్ ఆరో సీజన్లో యూపీ యోధ, దబంగ్ ఢిల్లీ జట్లు మూడో ఎలిమినేటర్ మ్యాచ్కు అర్హత సాధిం చాయి. ఆదివారం జరిగిన ప్లే ఆఫ్ ఎలిమినేటర్–1లో యూపీ యోధ 34–29తో యు ముంబాపై... ఎలిమినేటర్–2లో దబంగ్ ఢిల్లీ 39–28తో బెంగాల్ వారియర్స్పై గెలిచాయి. నేడు జరిగే క్వాలిఫయర్–1లో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్తో బెంగళూరు బుల్స్, ఎలిమినేటర్–3లో యూపీ యోధతో దబంగ్ ఢిల్లీ తలపడనున్నాయి. క్వాలిఫయర్–1లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్కు అర్హత సాధిస్తుంది. ఓడిన జట్టు మాత్రం ఎలిమినేటర్–3 విజేత జట్టుతో జనవరి 3న క్వాలిఫయర్–2లో తలపడుతుంది. ఈ మ్యాచ్ విజేత ఫైనల్లో రెండో బెర్త్ను ఖాయం చేసుకుంటుంది. -
‘ప్లే ఆఫ్స్’కు యూపీ యోధ
ప్రొ కబడ్డీ లీగ్ కోల్కతా: ‘ప్లే ఆఫ్స్’కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో యూపీ యోధ జట్టు సత్తా చాటింది. ప్రొ కబడ్డీ లీగ్ ఆరో సీజన్లో భాగంగా గురువారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో యూపీ యోధ 41–25తో బెంగాల్ వారియర్స్పై గెలిచి 57 పాయింట్లతో జోన్ ‘బి’ నుంచి ‘ప్లే ఆఫ్’కు చేరింది. దీంతో డిఫెండింగ్ చాంపియన్ పట్నా పైరేట్స్ (55 పాయింట్లు) పట్టికలో నాలుగో స్థానంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. కీలకమైన మ్యాచ్లో పటిష్టమైన డిఫెన్స్తో ఆకట్టుకున్న యూపీ యోధ అలవోకగా గెలిచింది. యూపీ తరఫున రిషాంక్ 9, శ్రీకాంత్, నితేశ్ చెరో 6 పాయింట్లతో చెలరేగగా... బెంగాల్ తరఫున ఆదర్శ్ 4, జాంగ్ కున్ లీ 3 పాయింట్లు సాధించారు. నామమాత్రమైన మరో మ్యాచ్లో బెంగళూరు బుల్స్ 40–32తో జైపూర్పింక్ పాంథర్స్పై గెలిచింది. జోన్ ‘ఎ’ నుంచి గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ (93 పాయింట్లు), యు ముంబా (86 పాయింట్లు), దబంగ్ ఢిల్లీ (68 పాయింట్లు) ‘ప్లే ఆఫ్స్’కు చేరగా... జోన్ ‘బి’ నుంచి బెంగళూరు బుల్స్ (78 పాయింట్లు), బెంగాల్ వారియరర్స్ (69 పాయింట్లు), యూపీ యోధా (57 పాయింట్లు) నాకౌట్కు అర్హత సాధించాయి. ఆదివారం కొచ్చిలో జరుగనున్న ఎలిమినేటర్–1లో యు ముంబాతో యూపీ యోధ... ఎలిమినేటర్–2లో దబంగ్ ఢిల్లీతో బెంగాల్ వారియర్స్ తలపడనున్నాయి. -
పట్నాపై యూపీ విజయం
పంచకుల (హరియాణా): ప్రొ కబడ్డీ లీగ్ జోన్ ‘బి’లో భాగంగా ఆదివారం రాత్రి జరిగిన లీగ్ మ్యాచ్లో యూపీ యోధా 47–31తో పట్నా పైరేట్స్పై గెలిచింది. యోధా తరఫున ప్రశాంత్ 10 పాయింట్లతో మెరవగా... పట్నా తరఫున మన్జీత్ 10 పాయింట్లు సాధించాడు. మరో మ్యాచ్లో జైపూర్ పింక్ పాంథర్స్ 29–34తో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ చేతిలో ఓడింది. -
యూపీ యోధా, తమిళ్ తలైవాస్ మ్యాచ్ ‘డ్రా’
పంచకుల (హరియాణా): ప్రొ కబడ్డీ లీగ్లో శనివారం జరిగిన రెండు మ్యాచ్లు ‘డ్రా’గా ముగిశాయి. తొలుత యూపీ యోధా, తమిళ్ తలైవాస్ మధ్య పోరు 25–25తో ‘డ్రా’అయింది. యోధా తరఫున ప్రశాంత్ 12 పాయింట్లతో మెరిశాడు. యు ముంబా, జైపూర్ పింక్ పాంథర్స్ మధ్య జరిగిన మరో మ్యాచ్ కూడా 35–35తో ‘టై’ అయింది. నేటి మ్యాచ్ల్లో పట్నా పైరేట్స్తో యూపీ యోధా, గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్తో జైపూర్ పింక్ పాంథర్స్ తలపడనున్నాయి. -
టైటాన్స్ జోరుకు బ్రేక్
సాక్షి, విశాఖపట్నం: సొంత ప్రేక్షకుల మధ్య రెండు వరుస విజయాల తర్వాత తెలుగు టైటాన్స్ ఓటమి పాలైంది. ప్రొ కబడ్డీ లీగ్లో భాగంగా మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్లో తెలుగు టైటాన్స్ 20–27తో యూపీ యోధా చేతిలో ఓడింది. రాహుల్ చౌదరి, అబోజర్ చెరో 6 పాయింట్లు సాధించారు. యూపీ యోధా తరఫున ప్రశాంత్ 8, నితేశ్ 5 పాయింట్లు చేశారు. మరో మ్యాచ్లో యు ముంబా 44–19తో దబంగ్ ఢిల్లీపై గెలుపొందింది. నేటి మ్యాచ్ల్లో హరియాణా స్టీలర్స్తో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్, పట్నా పైరేట్స్తో తెలుగు టైటాన్స్ ఆడతాయి. -
యూపీ యోధ గెలుపు
న్యూఢిల్లీ: ప్రొ కబడ్డీ లీగ్లో యూపీ యోధ పాయింట్ తేడాతో గట్టెక్కింది. గురువారం జరిగిన హోరాహోరీ పోరులో యూపీ యోధ 30–29 స్కోరుతో హరియాణా స్టీలర్స్పై విజయం సాధించింది. యోధ జట్టులో శ్రీకాంత్ జాదవ్ (8), ప్రశాంత్ (8), సచిన్ (6) రాణించారు. హరియాణా తరఫున మోను గోయట్ (11), వికాస్ (7) ఆకట్టుకున్నారు. మరో మ్యాచ్లో దబంగ్ ఢిల్లీ 37–33తో తమిళ్ తలైవాస్పై విజయం సాధించింది. ఢిల్లీ జట్టులో మిరాజ్ షేక్ 9, నవీన్ కుమార్ 8 పాయింట్లు చేశారు. తలైవాస్ జట్టులో అజయ్ ఠాకూర్ (14) రాణించగా... సుకేశ్, అతుల్ చెరో 5 పాయింట్లు సాధించారు. శుక్రవారం నుంచి మ్యాచ్లు వైజాగ్లో జరుగనున్నాయి. నేడు జరిగే పోరులో తెలుగు టైటాన్స్తో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్, పట్నా పైరేట్స్తో పుణేరి పల్టన్ తలపడతాయి.