YS Rajasekhara Reddy
-
నాడు వైఎస్సార్, జగన్ నీళ్లు తీసుకెళ్తుంటే ఊడిగం చేశారు
సాక్షి, నాగర్ కర్నూల్ / నారాయణపేట: ఆనాడు వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోతిరెడ్డిపాడు పొక్క 4 వేల క్యూసెక్కుల నుంచి 40 వేల క్యూసెక్కులకు పెంచితే ఆయనకు ఊడిగం చేసి.. చెప్పులు మోసి.. కృష్ణా నది జలాలను రాయలసీమకు తరలించడానికి అనుమతించిన సన్నాసి చంద్రశేఖరరావు అని తెలంగాణ సీఎంరేవంత్రెడ్డి మండిపడ్డారు. కృష్ణా జలాలను తరలించుకుపోతుంటే హారతి ఇచ్చింది నువ్వు కాదా.. ఆనాడు మంత్రి వర్గంలో నీ మంత్రులు లేరా.. హరీశ్ రావు ఆ మంత్రి వర్గంలో మంత్రి కాదా.. సమాధానం చెప్పాలని నిలదీశారు. ఆయన కుమారుడు జగన్సీఎం అయ్యాక, ప్రజల స్వేదంతో నిర్మించిన ఇదే ప్రగతి భవన్ అధికారిక నివాసానికి పిలిపించి పంచభక్ష్య పరమాన్నాలు పెట్టి.. ఆరు గంటలు చర్చించి రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పథకం రచించింది నువ్వు కాదా.. ఇది ద్రోహం కాదా.. అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ నీళ్ల కోసమైతే తెలంగాణ తెచ్చుకున్నామో.. ఏ నీళ్ల కోసం శ్రీకాంతచారి లాంటి యువకులు ఆత్మ బలిదానం చేసుకున్నారో ఆ నీళ్లను రాయలసీమకు తరలించుకుపోతుంటే ఏం చేశావని ప్రశ్నించారు. రంగారెడ్డి, మహబూబ్నగర్, నల్లగొండ జిల్లాలకు రావాల్సిన నీళ్లను తీసుకెళ్తుంటే ఒక్కరోజైనా నువ్వు అడ్డుకున్నావా అని ధ్వజమెత్తారు. ‘అవ్వాల నువ్వు చేసిన పాపం ఇయ్యాల మాకు శాపమైంది. ఇవాళ మాకు ఉరైంది. తొందర్లోనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తయితే రోజుకు 10 టీఎంసీలు అంటే నెల రోజులు కళ్లు మూసుకుంటే 300 టీఎంసీల శ్రీశైలం నీళ్లు మొత్తం తరలించుకుపోతారు’ అని చెప్పారు. శుక్రవారం నారాయణపేట జిల్లా అప్పక్పల్లిలో మెడికల్ కళాశాల, నర్సింగ్, పారా మెడికల్ కళాశాలలకు సీఎం రేవంత్రెడ్డి ప్రారంభోత్సవం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. -
అందరికీ అమ్మ.. వైఎస్ జయమ్మ
పులివెందుల రూరల్ : అడగందే అమ్మ అయినా అన్నం పెట్టదంటారు.. కానీ ఏమీ అడగకుండానే పేదలకు సాయం అందించిన అమ్మ మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మాతృమూర్తి వైఎస్.జయమ్మ. వైఎస్.జయమ్మ జీవించి ఉన్నంతకాలం పులివెందులకు సంబంధించిన ప్రజల కష్టసుఖాలలో పాలుపంచుకుంటూ అను నిత్యం దాన,ధర్మాలలో మునిగిపోయేది. మహా నేత వైఎస్.రాజశేఖరరెడ్డి సీఎం కావాలన్న ఆమె చిరకాల వాంఛ నెరవేరిన తర్వాత 2006 జనవరి, 25న జయమ్మ తుదిశ్వాస వదిలారు. అంతకుమునుపు 2003లో వైఎస్సార్ ప్రజల కష్ట సుఖాలను తెలుసుకొనేందుకు పాదయాత్ర చేసిన సందర్భంలో తల్లిగా వైఎస్.జయమ్మ కుమిలిపోతూనే.. ఇంట్లో పాదయాత్ర చేస్తూ బిడ్డకు మంచి జరగాలని రోజూ ప్రారి్థంచేది. అంతేకాదు 1999లో విపరీతమైన కరవు పరిస్థితులు ఏర్పడినప్పుడు పది మందికి పట్టెడన్నం పెట్టాలని భావించిన మాతృమూర్తి వైఎస్.జయమ్మ. అప్పటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రతి రోజూ ఐదారు వందల మందికి ఉచిత భోజన సౌకర్యాన్ని కల్పించి ప్రశంసలందుకున్నారు. అంతేకాకుండా 1995 నుంచి 2000 వరకు పులివెందుల సర్పంచ్గా పనిచేసిన వైఎస్.జయమ్మ అప్పటి ప్రభుత్వం నుంచి ఉత్తమ సర్పంచ్ అవార్డుతోపాటు పంచాయతీని ఆదర్శంగా నిలిపి ఉత్తమ పంచాయతీ అవార్డును సొంతం చేసుకున్నారు. ఇలా చెప్పుకొంటూ పోతే వైఎస్.జయమ్మ జీవించినంత కాలం ఎప్పుడూ ప్రజల గురించి ఆలోచిస్తూ పులివెందుల అమ్మగా గుర్తింపు పొందారు. ఆమె మరణించి నేటికి సరిగ్గా 18ఏళ్లు అవుతోంది. నేడు వైఎస్ జయమ్మ వర్ధంతి వేడుకలు దివంగత వైఎస్.రాజారెడ్డి సతీమణి వైఎస్.జయమ్మ 19వ వర్ధంతి వేడుకను శనివారం పులివెందులలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ కుటుంబ సభ్యులు పాలు పంచుకుంటారు. వైఎస్.జయమ్మ సమాధి వద్ద ప్రార్థనలతోపాటు.. స్థానిక పార్క్ వద్ద ఉన్న జయమ్మ విగ్రహం వద్ద మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి, ఆయన తల్లి, మాజీ ఎమ్మెల్యే వైఎస్.విజయమ్మ, దివంగత వైఎస్.జార్జిరెడ్డి సతీమణి వైఎస్. భారతమ్మలతోపాటు వైఎస్సార్ సోదరుడు వైఎస్.సు«దీకర్రెడ్డి, కుటుంబ సభ్యులు నివాళులరి్పంచనున్నారు. అందుకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. వైఎస్ కుటుంబ సభ్యులతోపాటు పలువురు వైఎస్ఆర్ అభిమానులు కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోనున్నారు. -
బాబుకది షరా మామూలే!
బాబుకది షరా మామూలే! ‘‘చంద్రబాబూ..కళ్లార్పకుండా అబద్దాలు చెప్పడంలో నీకు నీవే సాటి’’ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తెలుగుదేశం అధ్యక్షుడిని ఉద్దేశించి తరచూ చేసిన వ్యాఖ్య ఇది. 1999-2004 మధ్యకాలంలో చంద్రబాబు రెండోసారి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైఎస్సార్ విపక్ష నేత అన్నది తెలిసిన విషయమే. ఆ తర్వాత ఐదేళ్లు వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా వ్యవహరించినప్పుడు విపక్ష నేతగా బాబు ఉన్నారు. ఈ సమయంలో ఆయా సందర్భాలలో వీరిద్దరి మధ్య మాటల తూటాలు పేలేవి. వైఎస్ రాజశేఖరరెడ్డి కొన్నిసార్లు టీడీపీ మేనిఫెస్టోలోని అంశాలను, బాబు చేసిన ప్రకటనల్లోని అబద్ధాలను వేలెత్తి చూపుతూండేవారు. ‘‘అబద్దాలు చెప్పకపోతే తల వెయ్యి ముక్కలవుతుంది అని శాపం ఉంది’’ అని కూడా వైఎస్సార్ ఎద్దేవ చేసేవారు. కానీ చంద్రబాబు మాత్రం తనదైన ధోరణిలోనే ప్రసంగాలు సాగిస్తుండేవారు. ఈ క్రమంలోనే చంద్రబాబు అసత్యమైనా తన అవసరానికి తగ్గట్టు మాట్లాడేవారని చెప్పాలి.ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. అబద్ధాలు చెప్పి, ఏ ఎండకు ఆ గొడుగు పట్టి ప్రజలను నమ్మించడంలో చంద్రబాబు ఎక్కువసార్లు సఫలమయ్యారు. ఎన్నికలకు ముందు ఒక మాట.. ఆ తరువాత ఇంకో మాట మాట్లాడటం విషయంలో ముప్పై ఏళ్ల క్రితం మాదిరిగానే ఇప్పుడూ బాబు ఉన్నారు. అబద్దాల విషయంలో స్థిరత్వం పాటించిన నేత అన్నమాట! చంద్రబాబు తాజా ప్రసంగం ఒకటి వింటే ఔరా అనిపిస్తుంది. ఎన్నికల ముందు సూపర్ సిక్స్ హామీల పేరుతో ప్రజలను తెగ ఊరించిన ఆయన వీటితోపాటు మేనిఫెస్టోలో మరో 175 హామీలు ఇచ్చారు. అధికారంలోకి రావడంతోనే అమలు చేస్తామని, సంపద సృష్టించడం తనకు తెలుసు అంటూ నమ్మబలికారు. లోకేష్, పవన్కళ్యాణలు కూడా బాబు వాగ్ధానాలను ఇంకా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చారు. సూపర్ సిక్స్ హామీలు ఎప్పుడు అమలు అవుతాయా అని ప్రజలందరూ ఎదురు చూస్తున్న తరుణంలో చంద్రబాబు... ‘‘సూపర్ సిక్స్ సూపర్ హిట్’’ అని ప్రకటించేశారు. అరె... తమకు తెలియకుండా అన్ని హామీలెప్పుడు అమలు చేశారబ్బా అని ముక్కున వేలేసుకోవడం ప్రజల వంతైంది. ఎన్నికల ప్రచారంలో సూపర్ సిక్స్ హామీలు బాగా పనిచేశాయంటే అర్థం చేసుకోవచ్చు. అవి ఉత్తుతివే అని అందరూ అనుకుంటున్నప్పుడు ఎన్నికల సంగతి ఎవరూ ప్రస్తావించరు. అందుకే హామీలన్నీ అమలు చేసేశామన్న భ్రమ కల్పించేందుకు చంద్రబాబు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అన్నారని అనుకోవాలి. అయితే వృద్ధుల ఫించన్ను రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచడం మినహా మరే ఇతర హామీ అమలు కాలేదన్నది వాస్తవం. పైగా... లక్షల మంది ఫించన్లకు కోత పెట్టిన తరువాత కానీ మొత్తం పెంపు జరగలేదు.ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్న హామీని కూడా నెరవేర్చామని ప్రభుత్వం చెబుతోంది కానీ.. ఎంతమందికి నిజంగా అందిందన్నది స్పష్టం కావాల్సి ఉంది. ప్రస్తుతానికి ఒక గ్యాస్ సిలిండర్ ఇచ్చారనుకున్నా, మరో నాలుగు నెలల వరకు ఆ ఊసే ఎత్తడానికి వీలు లేదు. అంటే నెలకు రూ. 200ల చొప్పున రాయితీ మాత్రమే ఇచ్చారన్నమాట. ఇతర వాగ్దానాలు అమలు చేయకుండానే సూపర్ సిక్స్ సూపర్ హిట్ ఎలా అయ్యిందని అడిగితే సమాధానం మాత్రం బాబూ అండ్ కో నుంచి ఉండదు. ఇదేం న్యాయమని అడిగితే వారి గొంతు నొక్కేందుకు పోలీసులు కేసులు బనాయించేస్తారు. కేసులు వస్తాయి. జైలుపాలు కావాల్సి ఉంటుంది. మహిళా శక్తి పథకం కింద ఎంతమంది ఉంటే అంతమందికీ రూ.1500 చొప్పున ఇస్తామని అప్పట్లో ప్రచారమైతే చేశారు కానీ.. ఇచ్చింది సున్నా! తల్లికి వందనం పథకం కింద ప్రతి విద్యార్థికీ రూ.15 వేల చొప్పున ఇస్తామని.. గతంలో జగన్ కుటుంబానికి ఒక్కరికి మాత్రమే ఇస్తే తాము ఎంతమంది ఉంటే అంతమందికీ ఇస్తామని ఊదరగొట్టారు. ముగ్గురుంటే రూ.45 వేలు, నలుగురుంటే రూ.60 వేలు వస్తాయని, ఓపిక ఉంటే ఇంకా పిల్లలను కనండని కూడా చంద్రబాబు ఉచిత సలహా ఇచ్చిన విషయం ఎవరూ మరచిపోలేదు కానీ అధికారంలోకి వచ్చాక ఒక విద్యార్ధికి ఈ పథకం అంది ఉంటే ఒట్టు! రైతు భరోసా కింద ప్రతి రైతుకు జగన్ హయాంలో ఇచ్చిన రూ.13500 కాకుండా రూ.20 వేల చొప్పున ఇస్తామన్న హామీ గురించి అసలు మాట్లాడటమే లేదిప్పుడు. అయినా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటే ప్రజలు బిత్తరపోవడం తప్ప చేసేది ఏముంటుంది. ఇక నిరుద్యోగుల సంగతి సరేసరి.ఇరవై లక్షల ఉద్యోగాలు వచ్చేలా చేస్తామని, అంతవరకు నెలకు రూ.3 వేల చొప్పున ఇస్తామన్న భృతి కూడా ఇప్పటివరకూ అమలు కాలేదు. ఇవి కాకుండా మానిఫెస్టోలో వలంటీర్ల కొనసాగింపు, వారి జీతం రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచడం, బీసీ, ఎస్సీఎస్టీ వర్గాల వారికి యాభై ఏళ్లకే రూ.4 వేల చొప్పున ఫించన్, కరెంటు ఛార్జీలు తగ్గిస్తామన్న హామీ కూడా అమలు కాకపోగా.. అసలుకే మోసం వచ్చిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. వలంటీర్ల విషయంలో స్పష్టత లేకపోవడంతో ఉన్న 2.5 లక్షల ఉద్యోగాలు పోగా.. ప్రజలపై రూ.15 వేల కోట్ల కరెంటు ఛార్జీల భారం పడింది. బహుశా చంద్రబాబు సృష్టిస్తానన్న సంపద ఇలా జనాలపై బాదడం ద్వారానే అనుకోవడం ప్రజల వంతైంది. ఒకపక్క ప్రజలకు పైసా విదల్చని ప్రభుత్వం ఇంకోపక్క వారానికి వారం కొత్త కొత్త అప్పులు తెచ్చుకుంటున్న వైనం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఏడు నెలల వ్యవధిలోనే లక్ష కోట్ల రూపాయల అప్పులు తేవడం ఆర్థిక వేత్తలను కూడా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 1996 ఎన్నికల సమయంలో కూడా చంద్రబాబు ఇలాగే అలివికానీ హామీలు బోలెడన్ని చేసి ఎన్నికల తరువాత అన్నీ తూచ్ అనేశారు. విభజిత ఆంధ్రప్రదేశ్లో రైతులకు రూ.87 వేల కోట్ల రుణమాఫీ చేస్తానని 2014లో హామీ ఇచ్చిన బాబు తరువాత ఎన్ని పిల్లిమొగ్గలు వేసింది ఇటీవలి అనుభవమే. ప్రత్యేక తెలంగాణ అంశంలో చూసుకున్నా, కాంగ్రెస్, వామపక్షాలు, టీఆర్ఎస్, బీజేపీలతో జత కట్టే అంశంలో గమనించినా, ఎన్నికల పొత్తులలో పలు భిన్నమైన విధానాలు కలిగిన పార్టీలతో పొత్తులు పెట్టుకున్నా, అన్ని అవకాశవాద రాజకీయాలు చేయడానికి ఎక్కడా వెనుకాడలేదు.కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
వైఎస్ఆర్ కు నివాళులర్పించిన వైఎస్ జగన్
-
ఇడుపులపాయ : వైఎస్ఆర్కు నివాళులర్పించిన వైఎస్ జగన్ (ఫొటోలు)
-
వైఎస్సార్ విగ్రహం ధ్వంసం.. టీడీపీ నేతలపై అనుమానం
-
ఐక్యంగా పోరాడండి: వైఎస్ జగన్
సాక్షి ప్రతినిధి, కడప: ‘వైఎస్సార్సీపీ నాయకులు ఐక్యంగా పోరాటం చేయాలి. కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి...’ అని మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. మంగళవారం హెలికాప్టర్లో ఇడుపులపాయకు చేరుకున్న ఆయన నేరుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్కు వెళ్లి నివాళులు అర్పించారు. అనంతరం స్థానిక గెస్ట్హౌస్లో ఎమ్మెల్సీ పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మూలె సు«దీర్రెడ్డితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ భరోసా కలి్పంచాలని సూచించారు. ప్రభుత్వ వైఫల్యాలపై ఎప్పటికప్పుడు ఎండగట్టాలని ఆదేశించారు.కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్సీలు రామచంద్రారెడ్డి, రమేష్ యాదవ్, గంగుల ప్రభాకర్రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి, ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు, మాజీ ఎమ్మెల్యేలు ఎస్బీ అంజాద్బాషా, రాచమల్లు శివప్రసాదరెడ్డి, గడికోట శ్రీకాంత్రెడ్డి తదితరులతో సమావేశమై పలు విషయాలు చర్చించారు. అనంతరం పులివెందులకు చేరుకున్న వైఎస్ జగన్ పార్టీ నాయకులతో మమేకమయ్యారు.బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధ, మాజీ ఎమ్మెల్యేలు ఎస్.రఘురామిరెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, ఆయా ప్రాంతాల నాయకులతోను వివిధ అంశాలపై చర్చించారు. కాగా, పులివెందులలో దారిపొడవునా తన కోసం ఎదురుచూస్తున్న కార్యకర్తలు, అభిమానులు, ప్రజలకు అభివాదం చేస్తూ... ఆగి పలకరిస్తూ... వారి వినతులు స్వీకరిస్తూ... వైఎస్ జగన్ భాకరాపురంలో ఉన్న తన క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. ప్రజలు, పార్టీ శ్రేణులు, అభిమానులతో క్యాంపు కార్యాలయం కిక్కిరిసిపోయింది. ప్రభుత్వ మెడికల్ కళాశాల వద్ద సెల్ఫీ వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పులివెందుల ప్రభుత్వ మెడికల్ కళాశాల రూ.530 కోట్లతో నిరి్మంచారు. 605 పడకల ఆస్పత్రి, నర్సింగ్ కళాశాల, మెడికల్ కళాశాల నిర్మాణం పూర్తిచేశారు. ఎన్ఎంసీ తనిఖీల అనంతరం 50 ఎంబీబీఎస్ సీట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అయితే కూటమి ప్రభుత్వం మంజూరైన 50 ఎంబీబీఎస్ సీట్లు తిరస్కరిస్తూ లేఖ రాసింది. దీంతో ఈ ఏడాది పులివెందుల మెడికల్ కాలేజీలో అడ్మిషన్లు నిలిచిపోయాయి.ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ వేంపల్లె నుంచి పులివెందులకు వెళుతూ మార్గమధ్యంలోని మెడికల్ కళాశాల వద్ద ఆగి సెల్ఫీ తీసుకున్నారు. అక్కడ ఉన్న స్థానికులు, కొంతమంది ఉద్యోగులు మెడికల్ సీట్లు భర్తీ చేసి వైద్య కళాశాలను నిర్వహించాల్సి ఉండగా కూటమి ప్రభుత్వం తిరస్కరించిందని వైఎస్ జగన్కు వివరించారు. ఇక్కడ నియమించిన ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లను సైతం ఇతర ప్రాంతాలకు బదిలీ చేశారని తెలిపారు. ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని వారు ఆవేదన వ్యక్తంచేశారు. -
ఇడుపులపాయలో వైఎస్ జగన్ (ఫొటోలు)
-
YS Jagan: వైఎస్సార్కు ఘన నివాళులు
-
వైఎస్సార్కు నివాళులర్పించిన వైఎస్ జగన్
సాక్షి, వైఎస్సార్జిల్లా: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మంగళవారం(అక్టోబర్ 29) పులివెందుల నియోజకవర్గం ఇడుపులపాయలో పర్యటించారు. ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ జగన్ వెంట పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, వైఎస్సార్సీపీకి చెందిన ఇతర ముఖ్యనాయకులు పాల్గొని వైఎస్సార్కు నివాళులర్పించారు. కాగా, వైఎస్ జగన్ మంగళవారం ఉదయమే బెంగళూరు నుంచి ఇడుపులపాయకు చేరుకున్నారు. మూడు రోజుల పాటు పులివెందులలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో పులివెందుల ప్రజలతో పాటు పార్టీ నాయకులను వైఎస్జగన్ కలవనున్నారు. ఇదీ చదవండి: చంద్రబాబూ..! రైతుల ఉసురు పోసుకువద్దు: వైఎస్జగన్ -
ధర్మ ద్రోహం బాబుదే
సాక్షి, అమరావతి, సాక్షి ప్రతినిధి, తిరుపతి: విదేశీ దండయాత్రికులను మించి ఆలయాలను నేలమట్టం చేసిన చరిత్ర సీఎం చంద్రబాబు సొంతం! తిరుమల వేయి కాళ్ల మండపం నుంచి విజయవాడలోని పురాతన ఆలయాల దాకా ఆయన తీరు ఇదే! వదాన్యుల ఔదార్యంతో భక్తులు, బాటసారుల కోసం ఏర్పాటైన సత్రాలను సైతం విక్రయించి సొమ్ము చేసుకునేందుకు వెనుకాడ లేదు. బెజవాడ అమ్మవారి ఆలయంలో క్షుద్రపూజల కలకలం బాబు నిర్వాకమే కదా! ఇక చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చితో పుష్కరాల వేళ జరిగిన తొక్కిసలాటతో డజన్ల సంఖ్యలో భక్తుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి! దేవాలయాలను కూలగొట్టి నిర్దాక్షిణ్యంగా వ్యవహరించిన చరిత్ర చంద్రబాబుదైతే వేల ఆలయాలను నిర్మించడంతోపాటు జీర్ణోద్ధారణ పనులు సైతం చేపట్టి హైందవ ధర్మాన్ని గౌరవించిన మనసున్న పాలకుడు వైఎస్ జగన్. ఆలయ నిర్మాణం, ఆధునికీకరణ పనులకు ప్రభుత్వ ఖజానా నుంచి నిధులిచ్చిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగనే. ఏడుకొండల వైభవాన్ని చాటి చెబుతూ శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రారంభమైంది నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే. మతాలకు అతీతంగా మానవత్వానికి పెద్దపీట వేసిన పాలకులు వైఎస్సార్, వైఎస్ జగన్. మూడేళ్లకు ఒకసారి ధార్మిక పరిషత్తు కమిటీలను నియమించాల్సి ఉండగా ఇప్పటివరకు రెండుసార్లు మాత్రమే వైఎస్సార్, వైఎస్ జగన్ హయాంలో మాత్రమే ఏర్పాటయ్యాయి. నిత్య పూజలకు నోచుకోని వేలాది దేవాలయాల్లో ధూపదీప నైవేద్య పథకం ద్వారా దీపాలు వెలిగించిన వైఎస్సార్ కుటుంబంపై చంద్రబాబు బరి తెగించి దుష్ప్రచారానికి పాల్పడుతున్నారు. పద్నాలుగేళ్ల పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానంలో గుర్తుండిపోయే కార్యక్రమాలు ఒక్కటైనా చేపట్టని సీఎం చంద్రబాబు అతి పవిత్రమైన శ్రీవారి లడ్డూ ప్రసాదంపై నిందలు వేయటంపై భక్తకోటి ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తోంది. ఆయన నిర్వాకాలను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. శ్రీరాముడి పాలనలో ధర్మం నాలుగు పాదాలపై నడిచిందని చెబుతారు... మరి ధర్మ ద్రోహం చేసింది ఎవరు? విశాఖలో వైఎస్ జగన్ హయాంలో నిర్మించిన శ్రీవారి ఆలయం శరణం అయ్యప్పా..!!భక్తులు అయ్యప్ప మాల ధరించడం కారణంగా రాష్ట్రంలో మద్యం అమ్మకాలు తగ్గుతున్నాయంటూ చంద్రబాబు గతంలో సీఎంగా ఉన్న సమయంలో ఎగతాళిగా మాట్లాడారు. మద్యం అమ్మకాలు తగ్గి రాష్ట్రం ఆదాయం కోల్పోవాల్సి వస్తోందని నాడు దారుణంగా వ్యాఖ్యానించారు.బాబు పాలనలో కూల్చివేతలు.. విక్రయాలు.. క్షుద్రపూజలు!⇒ తిరుమలలో 1472 సంవత్సరంలో నిర్మించిన పురాతనమైన వెయ్యి కాళ్ల మండపాన్ని 2003లో కూల్చివేసింది నాటి చంద్రబాబు ప్రభుత్వమే. ⇒ గతంలో చంద్రబాబు హయాంలో విజయవాడ దుర్గగుడిలో క్షుద్రపూజలు జరిగినట్లు ఆరోపణలున్నాయి. ⇒ బెంజి సర్కిల్ పరిసరాల్లో దుర్గగుడికి చెందిన విలువైన భూములను చంద్రబాబు తన సన్నిహితుడి విద్యా సంస్థకు కారుచౌకగా కట్టబెట్టారు. ⇒ 2014– 19 మధ్య సింహాచలం ఆలయ భూముల రికార్డుల నుంచి వందల ఎకరాల భూమి మాయమైనట్లు దేవదాయ శాఖ ప్రాథమిక విచారణలో తేలింది. ⇒ విజయనగరంలో మెడికల్ కాలేజీ నిర్మాణం పేరుతో మాన్సాస్ ట్రస్టుకు విశాఖ చుట్టు పక్కల ఉన్న విలువైన భూములను 2014లో చంద్రబాబు ప్రభుత్వం విక్రయించింది. ⇒ అమరావతిలోని సదావర్తి సత్రానికి చెన్నై సమీపంలో ఉన్న విలువైన భూములను టీడీపీ నాయకులకు చంద్రబాబు కారుచౌకగా కట్టబెట్టేందుకు చేసిన యత్నాలపై వైఎస్సార్ సీపీ న్యాయ పోరాటం చేసింది. ⇒ చంద్రబాబు హయాంలో ఆలయాల పాలక మండళ్ల సభ్యులుగా నియమించిన టీడీపీ నేతల ఆగడాలతో వివిధ సందర్భాల్లో ఐదుగురు అర్చకులు మృతి చెందినట్లు అర్చక సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. వైఎస్సార్ హయాంలో కీలక నిర్ణయాలు⇒ రాజకీయ నేతల జోక్యానికి తావు లేకుండా దేవదాయ శాఖలో కీలక నిర్ణయాలు తీసుకునేందుకు 21 మందితో ధార్మిక పరిషత్ను ఏర్పాటు చేస్తూ 2007లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం చట్ట సవరణలు చేసింది. ⇒ దేవదాయ శాఖ పరిధిలో కనీస వార్షికాదాయం లేని వేలాది ఆలయాల్లో నిత్య పూజల కోసం ధూప దీప నైవేద్య పథకాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా దివంగత వైఎస్సార్ తెచ్చారు. తొలి విడతగా 3,500 ఆలయాల్లో అమలు చేశారు. ⇒ వైఎస్సార్ హయాంలో భక్తులకు స్వామి వారి అన్న ప్రసాదాలు ఉచితంగా అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. క్యూ లైన్లో ఉన్న భక్తులకు పాలు, అన్న ప్రసాదాల పంపిణీ కార్యక్రమం చేపట్టింది కూడా వైఎస్ పాలనలోనే. తిరుమలలో అఖండ హరినామ సంకీర్తన కార్యక్రమాల ద్వారా భక్తి భావాన్ని పెంపొందించే కార్యక్రమాలను చేపట్టారు. దివ్య దర్శనం టోకెన్లు, చంటి పిల్లలకు దైవ దర్శనం, తిరుమలకు వెళ్లే భక్తులు ప్రతి ఒక్కరూ తిరునామం తిలక ధారణ చేయాలనే నిబంధన తెచ్చారు. తిరుమల మాడవీధుల్లో చెప్పులతో తిరుగాడకుండా పవిత్రతను పరిరక్షించారు. స్వామి వారి వైభవం చాటేందుకు భక్తి చైతన్య రథాలు తెచ్చారు. ⇒ వేద విద్య, విజ్ఞానం, పరిశోధనలను ప్రోత్సహించే లక్ష్యంతో టీటీడీ 2006లో వేద విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించింది. దేశంలో ఆధ్యాత్మీక విద్య అందించే ఏకైక యూనివర్సిటీగా గుర్తింపు పొందింది. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్సిటీ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి అన్ని విభాగాలను విస్తరించే దిశగా అడుగులు వేశారు. ⇒ ఏడుకొండల వైభవాన్ని దశదిశలా చాటేందుకు నాటి సీఎం వైఎస్సార్ సూచనలతో అప్పటి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి 2008 జూన్లో శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్ను ప్రారంభించారు. భక్తులను ఆధ్యాత్మీక సాగరంలో ఓలలాడించే కార్యక్రమాలను ప్రత్యేకంగా రూపొందించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలను అశేష భక్త కోటి ఎస్వీబీసీ చానల్ ద్వారా వీక్షిస్తోంది. ⇒ శ్రీనివాసుడి వైభవాన్ని చాటిన వాగ్గేయ కారుడు అన్నమయ్య ఉత్సవాలు నిర్వహించింది వైఎస్సార్ హయాంలోనే. 75 మంది వేద పండితులతో విద్వత్తు సదస్సులు కూడా నిర్వహించారు. దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడికి లడ్డూ ప్రసాదాన్ని ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. అలిపిరి వద్ద శ్రీనివాస దివ్యానుగ్రహం పేరుతో నిత్యం హోమం నిర్వహణ కార్యక్రమాన్ని ప్రారంభించింది కూడా వైఎస్సార్ పాలనలోనే. ⇒ వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో 2006లో కళ్యాణమస్తు పథకానికి రూపకల్పన చేశారు. పేద, మధ్య తరగతి కుటుంబాల్లో వివాహం చేసుకునే ప్రతి జంటకు బంగారు మంగళసూత్రాలు, వెండి మెట్టెలు, నూతన వస్త్రాలు, తలంబ్రాలు, పెళ్లి సామగ్రి, ధార్మిక స్తోత్ర పుస్తకాలు, పురోహితుడు, 60 మంది బంధుమిత్రులకు పెళ్లి భోజనాలు ఉచితంగా ఏర్పాటు చేశారు. మంగళసూత్రాలు, మెట్టెలను శ్రీవారి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించి సుమారు 36 వేల నూతన జంటలకు పంపిణీ చేసి శ్రీవారి కళ్యాణమస్తు కార్యక్రమం ద్వారా వేడుకగా వివాహం జరిపించారు. ⇒ దళిత, గిరిజన గోవిందం పేరుతో విప్లవాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది వైఎస్సార్ పాలనలోనే. స్వామి వారినే దళిత, గిరిజన వాడలకు తీసుకెళ్లి శ్రీవారి దర్శనభాగ్యం కల్పించే కార్యక్రమం చేపట్టారు. మత్స్యకారులకు వైదిక కర్మల్లో శిక్షణ ఇచ్చి సమానత్వాన్ని చాటారు.జగన్ పాలనలో ధర్మ సంరక్షణ ఇలా..⇒ తిరుమల శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్రమైన నవనీత సేవకు స్వచ్ఛమైన వెన్న సమకూర్చేందుకు నాటి సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో టీటీడీ చైర్మన్ నవనీత సేవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దేశీ ఆవు పాల నుంచి తీసిన వెన్నతో నవనీత సేవ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించేందుకు తిరుమలలోని గోశాలను విస్తరించారు. సుమారు 150 పాలిచ్చే ఆవులను సంరక్షించేందుకు ఏర్పాట్లు చేశారు. గో ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించడంలో భాగంగా తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో గో మహా సమ్మేళనం నిర్వహించారు. ⇒ చిన్నారుల్లో దైవభక్తి పెంపొందించేందుకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం గోవింద కోటి, రామకోటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గోవింద, రామకోటి రాసిన పిల్లలకు వేంకటేశ్వరస్వామి దర్శన భాగ్యం కల్పించింది. గోవింద నామ కోటి పుస్తకాలను భక్తులకు ఉచితంగా అందించింది. ⇒ టీటీడీ ఉద్యోగులకు ఇంటి పట్టాలతో పాటు వేతనాలు పెంచారు. కారుణ్య నియామకాలు చేపట్టి ఉద్యోగుల కుటుంబాలలో వెలుగులు నింపారు. ⇒ వంశపారంపర్య అర్చకులకు రిటైర్మెంట్ లేకుండా వారికి ఓపిక ఉన్నంత కాలం పని చేసుకునే అవకాశం కల్పిస్తూ జీవో ఇచ్చారు. ⇒ తిరుమలలో శ్రీవారి గర్భగుడిని సన్నిధి గొల్లలు తెరిచే సంప్రదాయం పునరుద్ధరణ ⇒ తెలుగు రాష్ట్రాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు అధికంగా నివసించే ప్రాంతాలలో శ్రీవారి ఆలయాల నిర్మాణాన్ని చేపట్టారు. ⇒ వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనలో సుమారు రూ.350 కోట్లతో శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 2,635 నూతన ఆలయాలను నిర్మించారు. మరో 300 ఆలయాలకు మరమ్మతులు చేపట్టి జీరో్ణద్ధారణ చేశారు. ⇒ అమరావతి, విశాఖ, భువనేశ్వర్, జమ్ము కశ్మీర్, చెన్నైతో పాటు అమెరికాలో సైతం శ్రీవారి ఆలయాల నిర్మాణానికి వైఎస్సార్సీపీ హయాంలో శ్రీకారం చుట్టారు. ⇒ వైఎస్సార్ తరహాలో వేద విద్యకు ప్రాధాన్యతనిచ్చారు. ⇒ గత ప్రభుత్వం తొలగించిన ప్రధాన కైంకర్యాలను పండితులు, వేద విద్వాంసులు, పీఠాధిపతుల సలహాలతో పునరుద్ధరించారు. ⇒ మఠాధిపతులు, ఆగమ పండితులతో 2022 ఆగస్టులో రెండో విడత ధార్మిక పరిషత్ను నియమించి నిర్ణయాధికారాలు కల్పించింది వైఎస్ జగన్ ప్రభుత్వమే. ⇒ దేవదాయ శాఖ భూముల ఆక్రమణలకు అడ్డుకట్ట వేసేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం విప్లవాత్మక ఆర్డినెన్స్ తెచ్చింది. ఆక్రమణలపై కోర్టు ప్రక్రియ ద్వారా కాలయాపనకు తావు లేకుండా కేవలం ఒక నోటీసు ఇచ్చి వారం రోజుల తర్వాత భూమిని స్వా«దీనం చేసుకునే అధికారాన్ని దేవదాయ శాఖకు ఆర్డినెన్స్ ద్వారా కట్టబెట్టారు. ⇒ వైఎస్సార్ సీపీ అధికారంలో ఉండగా ఏడాదికి రూ.5 లక్షల లోపు ఆదాయం ఉండే ఆలయాలన్నింటినీ వంశపారంపర్య ధర్మకర్తలు, స్థానిక భక్తుల కమిటీలకు అప్పగిస్తూ జీవో ఇచ్చింది. ⇒ 2014– 19 మధ్య విజయవాడలో కృష్ణా నది ఒడ్డున 30కిపైగా పవిత్ర దేవాలయాలను చంద్రబాబు ప్రభుత్వం కూల్చి వేయగా అనంతరం వైఎస్ జగన్ ప్రభుత్వం వాటిని పునఃనిర్మించింది. ⇒ 2021 మే 14న జీవో నెంబరు 52 జారీ చేయడం ద్వారా గతంలో రూ.5,000 వేతనాలు పొందే వారికి రూ.పది వేల చొప్పున, రూ.పది వేల వేతనం పొందేవారికి రూ. 15,625 చొప్పున వేతనాలను పెంచుతూ వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ⇒ వంశపారంపర్య అర్చకత్వం హక్కులను గుర్తిస్తూ ఎండోమెంట్ ప్రాపర్టీ రిజిస్టర్లో ఆయా అర్చకుల పేర్ల నమోదుకు నిర్ణయం తీసుకున్నది గత ప్రభుత్వమే. ⇒ ఈనాం భూములు కలిగి ఉన్న వేలాది మంది అర్చకులకు గత ప్రభుత్వం రైతు భరోసా పథకం అందజేసింది. ఆరోగ్యశ్రీ కార్డులు కూడా జారీ చేసింది. ⇒ అర్చక సంక్షేమ ట్రస్టు ద్వారా పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి రూ.48.33 కోట్ల మేర లబ్ధి చేకూర్చింది. ⇒ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్లుగా అర్చక సమాఖ్య నాయకులకు స్థానం కల్పించింది. ⇒ పాలక మండలి సభ్యులెవరైనా అర్చక స్వాముల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే పదవీ కాలం పూర్తి కాకముందే తొలగించేలా చట్ట సవరణ తెచ్చింది. ⇒ రాష్ట్రవ్యాప్తంగా 16 ఆగమ వేద పాఠశాలల ద్వారా 400 మంది విద్యార్థులకు శిక్షణ కార్యక్రమాలతోపాటు స్టైఫండ్ రూ.3.06 కోట్లు అందజేసింది. ⇒ రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని కాంక్షిస్తూ దేవదాయ శాఖ ఆధ్వర్యంలో తొలిసారిగా విజయవాడలో రాజశ్యామల యాగాన్ని నిర్వహించారు. ⇒ మఠాధిపతులు, ఆగమ పండితులతో ధార్మిక పరిషత్ ఏర్పాటు చేసి నిర్ణయాధికారాలు కల్పించిన వైఎస్ జగన్⇒ 2014–19 మధ్య చంద్రబాబు హయాంలో ధూప దీప నైవేద్య పథకాన్ని 1,600 ఆలయాలకు పరిమితం చేయగా అనంతరం వైఎస్ జగన్ ప్రభుత్వం 5,338 ఆలయాలలో అమలయ్యేలా చర్యలు తీసుకుంది.⇒ బ్రహ్మోత్సవాల్లో అతి ముఖ్యమైన గరుడసేవకు భక్తులు అందరూ వచ్చి దర్శించుకోలేరనే ఉద్దేశంతో గత ప్రభుత్వం ప్రతి పౌర్ణమికి పున్నమి గరుడసేవ నిర్వహించేలా ఏర్పాట్లు చేసింది. ప్రతి నెలా పున్నమి గరుడసేవ ద్వారా ఎంతో మంది భక్తులకు స్వామి వారి దర్శనభాగ్యం కల్పించింది.⇒ ఆలయ నిర్మాణం, ఆధునికీకరణ పనులకు ప్రభుత్వ ఖజానా నుంచి నిధులిచ్చిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగనే. గతంలో ఇతర ఆలయాల నుంచి సమకూరిన కామన్ గుడ్ ఫండ్ నిధుల నుంచే ఈ కార్యక్రమాలు చేపట్టగా వైఎస్ జగన్ ప్రభుత్వం తొలిసారిగా విజయవాడ దుర్గ గుడి ఆలయ అభివృద్ధికి ఖజానా నుంచి రూ.70 కోట్లు మంజూరు చేసింది. -
వైఎస్ఆర్ అంటేనే ఒక చరిత్ర..
-
వైఎస్సార్ సేవలు చిరస్మరణీయం
సాక్షి కడప/వేంపల్లె: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 15వ వర్థంతిని పురస్కరించుకుని వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్వద్ద ఆయన కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులరి్పంచారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, తల్లి వైఎస్ విజయమ్మ, సతీమణి వైఎస్ భారతీరెడ్డితోపాటు ఇతర కుటుంబ సభ్యులు సోమవారం ఉదయాన్నే ఘాట్ వద్ద పూలమాలలు వేసి ఘన నివాళి అరి్పంచారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఆయన అభిమానులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతలు ఇడుపులపాయకు కదిలివచ్చారు. ముందుగా వైఎస్ జగన్ కుటుంబమంతా ఘాట్ ప్రాంగణంలో దివంగత నేతను స్మరించుకున్నారు. వైఎస్ జగన్తోపాటు తల్లి విజయమ్మ నివాళులరి్పంచే క్షణంలో భావోద్వేగానికి గురయ్యారు. ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు.. ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద మాజీ సీఎం వైఎస్ జగన్తోపాటు కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. చర్చి పాస్టర్లు దేవుని వాక్యంతోపాటు వైఎస్సార్ హయాంలో జరిగిన మంచి పనులను వివరించారు. వైఎస్సార్ సువర్ణ పాలనలో ప్రజలంతా సంక్షేమంలో మునిగిపోయారని కొనియాడారు.అంతేకాక.. 108, ఆరోగ్యశ్రీ, 104, ఫీజు రీయింబర్స్మెంట్, రైతుల కోసం రుణమాఫీ అమలుచేసి ప్రజల కష్టాల నుంచి మహానేత రక్షించారని స్మరించుకున్నారు. మహానేత సేవలు చిరస్మరణీయమన్నారు. వైఎస్సార్ అడుగుజాడల్లోనే వైఎస్ జగన్ ధైర్యంగా ముందుకెళ్తున్నారని పాస్టర్లు కొనియాడారు. కష్టకాలంలో దేవునితోపాటు నాన్న ఆశీస్సులు ఎల్లప్పుడూ ఆయనకు ఉంటాయన్నారు. ప్రతి ఒక్కరూ వైఎస్ జగన్కు తోడుగా నిలబడాలని వారు ఆకాంక్షించారు. ఇక ప్రత్యేక ప్రార్థనల్లో చిన్నాన్న వైఎస్ సు«దీకర్రెడ్డి, అత్తమ్మ ఈసీ సుగుణమ్మ, సోదరుడు, కడప ఎంపీ వైఎస్ అవినా‹Ùరెడ్డి, మేనమామ, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు పి. రవీంద్రనాథ్రెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి, అన్నమయ్య జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి, కడప నగర మేయర్ కె. సురేష్బాబు, ఎమ్మెల్యేలు డాక్టర్ సుధ, టి. చంద్రశేఖర్, విరూపాక్షి, ఎమ్మెల్సీలు పి. రామసుబ్బారెడ్డి, రమేష్ యాదవ్, గోవిందరెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం ఎస్బీ అంజద్బాషా, వైఎస్సార్సీపీ రాష్ట్ర నేతలు ఎస్వీ సతీష్కుమార్రెడ్డి, ఆర్. రమే‹Ùకుమార్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. మరోవైపు.. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచి్చన వైఎస్సార్ అభిమానులు, పార్టీ శ్రేణులు, నేతలు అందరికీ వైఎస్ జగన్ అభివాదం చేశారు. ఒక్కొక్కరిని పేరుపేరునా పలకరిస్తూ వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. -
సోషల్ మీడియాలో బతికేస్తున్న కేటీఆర్, హరీశ్
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ప్రతిపక్షాలు ప్రజాప్రభుత్వంపై చేస్తున్న విమర్శలు పనికిమాలినవని.. వాళ్లు చేసిన పాపాలపై నిలదీస్తారనే భయంతో ప్రజల్లోకి వచ్చే ధైర్యం లేక ట్విటర్, ఫేస్బుక్, వాట్సాప్ వేదికగా బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్రావు రాజకీయంగా బతికేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విమర్శించారు. అనుకోని విధంగా వచి్చన ఈ విపత్తును ఎదుర్కొనేలా రాష్ట్ర ప్రభుత్వం హైఅలర్ట్గా ఉన్నందునే రాష్ట్రంలో ఎక్కడా ప్రాణనష్టం జరగలేదని వెల్లడించారు. ఖమ్మంలోని కాంగ్రెస్ జిల్లా కార్యాలయంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖర్రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో భట్టి పాల్గొన్నారు.వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులరి్పంచాక డిప్యూటీ సీఎం మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష నేతలకు పని లేదని.. వారు చేస్తున్న విమర్శలను ప్రజలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. గత బీఆర్ఎస్ పాలకుల మాదిరిగా తాము గడీల్లో పడుకోలేదని, ప్రజల మధ్యే ఉండి సహాయక చర్యలు చేపట్టామని తెలిపారు. గత బీఆర్ఎస్ పాలనలో కొద్దిపాటి వర్షం పడితే జంట నగరాలు మునిగిపోయాయని, కానీ ఇంత పెద్ద విపత్తు వచ్చినా హైదరాబాద్ నేడు సురక్షితంగా ఉందంటే తమ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా ఫలితమేనని భట్టి తెలిపారు. భారీ వర్షాలు, వరదతో నిరాశ్రయులైన వారికి తక్షణమే నిత్యావసర సరుకులను ప్రభుత్వం పంపిణీ చేస్తుందని భట్టి విక్రమార్క తెలిపారు. -
AP: వైఎస్ఆర్కు రాష్ట్రవ్యాప్తంగా నేతల ఘన నివాళులు
సాక్షి,విశాఖపట్నం: దివంగత నేత వైఎస్రాజశేఖరరెడ్డి ఒక వ్యక్తి కాదని ఒక వ్యవస్థ శాసనమండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ అన్నారు. సోమవారం(సెప్టెంబర్2) వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా విశాఖపట్నం బీచ్రోడ్డులో ఉన్న ఆయన విగ్రహానికి వైఎస్ఆర్సీపీ నేతలు పూలమాల వేసి నివాళులర్పించారు. వైఎస్ఆర్కు ఉన్న ప్రజాదరణ దేశంలో మరే సీఎంకు లేదు: బొత్సవైఎస్ పేరు చెప్పగానే అనేక సంక్షేమ పథకాలు గుర్తొస్తాయి.ఆరోగ్యశ్రీ ఫీజు రీయింబర్స్మెంట్లాంటి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు.అన్ని వర్గాల ప్రజలకు వైఎస్ హయాంలో మేలు జరిగింది.పార్టీలకతీతంగా వైఎస్ను ప్రజలు ఆరాధిస్తారు.వైఎస్ అడుగుజాడల్లోనే వైఎస్జగన్ పయనిస్తున్నారు. ఆయన ఆశయాల కోసం పనిచేస్తున్నారు.వైఎస్ ఆశయాలను మేమంతా కలిసి ముందుకు తీసుకువెళ్తామని ప్రమాణం చేస్తున్నాంప్రజల గుండెల్లో దేవుడిగా వైఎస్.. రాజ్యసభ సభ్యులు గొల్లబాబురావుపేదల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారు.వైఎస్ ఆశయాలను వైఎస్ జగన్ కొనసాగిస్తున్నారు.మళ్లీ వైఎస్ జగన్ ను మనమంతా కలిసి ముఖ్యమంత్రిగా చేసుకోవాలివైఎస్ఆర్ జిల్లాలో.. వైఎస్రాజశేఖర్రెడ్డి వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ జిల్లాలోని పొద్దుటూరు పట్టణంలో మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి,మునిసిపల్ ఛైర్మన్ లక్ష్మీదేవి, మాజీ ఆప్కోబ్ చైర్మన్ మల్లెల జాన్సీ,కౌన్సిలర్లు, నాయకులు వైఎస్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన -
మరపురాని మహానేత.. ఇడుపులపాయంలో నివాళులర్పించిన జననేత (ఫొటోలు)
-
నాన్నకు కన్నీటి నివాళి
-
వైఎస్సార్ను గుర్తు చేసుకుని.. జగన్ భావోద్వేగం
వైఎస్సార్, సాక్షి: మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి వర్ధంతిన.. వైఎస్ జగన్మోహన్రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. జిల్లా పర్యటనలో ఉన్న ఆయన ఈ ఉదయం ఇడుపులపాయకు వెళ్లి వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాల సమర్పించారు. అనంతరం ఎక్స్ ఖాతాలో ఆయన తండ్రికి గుర్తు చేసుకుంటూ ‘డాడ్.. మిస్ యూ’ అనే ఓ సందేశం ఉంచారు. We miss you, Dad pic.twitter.com/lzNm7wSHJn— YS Jagan Mohan Reddy (@ysjagan) September 2, 2024 -
వైఎస్ఆర్ ఘాట్ వద్ద వైఎస్ జగన్ నివాళులు
వైఎస్సార్, సాక్షి: సంక్షేమ ప్రదాత.. అభివృద్ధి విధాత.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి 15వ వర్ధంతి నేడు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. వైఎస్సార్ సతీమణి విజయమ్మ, తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్ భారతి, ఇతర కుటుంబ సభ్యులు, వైఎస్సార్సీపీ నేతలు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని మహానేతను స్మరించుకున్నారు.ఈ ప్రార్థనా కార్యక్రమంలో ఎంపీలు వైఎస్ అవినాష్ రెడ్డి, గురుమూర్తి, జిల్లా పార్టీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, ఎమ్మెల్యేలు అమర్నాథ్ రెడ్డి, దాసరి సుధ, మాజీ డిప్యూటీ సిఎం ఆంజాద్ బాషా, మాజీ ఎమ్మెల్యేలు కోరుముట్ల శ్రీనివాస్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు, ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సంక్షేమ ప్రదాత.. అభివృద్ధి విధాత
సాక్షి, అమరావతి: వైఎస్సార్.. ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా ఉన్నది ఐదేళ్ల మూడు నెలలే! కానీ మంచి చేయాలన్న మనసుంటే ప్రజలకు ఎంత మేలు చేయవచ్చో ఆ కొద్ది కాలంలోనే నిరూపించారు. భౌతికంగా దూరమైనా ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. సోమవారం వైఎస్సార్ 15వ వర్ధంతి సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం... పాదయాత్రతో కాంగ్రెస్కు జీవం వరుస ఓటములతో 2003 నాటికి కాంగ్రెస్ జీవచ్ఛవంలా మారిన తరుణంలో వైఎస్సార్ ఉమ్మడి రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి మండుటెండలో 2003 ఏప్రిల్ 9న ప్రజాప్రస్థానం పాదయాత్ర ప్రారంభించారు. మండుటెండలో 1,475 కి.మీ. నడిచారు. పాదయాత్రతో కాంగ్రెస్కు జీవం పోసి 2004లో ఇటు ఉమ్మడి రాష్ట్రంలో, అటు కేంద్రంలోనూ అధికారంలోకి తెచ్చారు. 2004 మే 14న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వేదికపై నుంచే వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా ఫైలుపై తొలి సంతకం చేసి రూ.1,100 కోట్ల వ్యవసాయ విద్యుత్ బకాయిలను మాఫీ చేశారు. దాదాపు 35 లక్షలకు పైగా పంపు సెట్లకు ఉచిత విద్యుత్ను అందించారు. ఆరోగ్యశ్రీ... ఫీజులు 2004 మే 14 నుంచి 2007 జూన్ 26 వరకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ.168.52 కోట్లను వైఎస్సార్ విడుదల చేశారు. అనంతరం ఉచితంగా కార్పొరేట్ వైద్యాన్ని అందించేలా ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు. 108, 104 స రీ్వసులను ప్రారంభించారు. ఆయన తెచ్చిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకంతో లక్షలాది పేద విద్యార్థులకు మేలు జరిగింది. జిల్లాకు ఒక విశ్వవిద్యాలయం.. తాడేపల్లిగూడెంలో ఉద్యాన వర్సిటీ.. తిరుపతిలో పశువైద్య కళాశాల, హైదరాబాద్లో ఐఐటీని ఏర్పాటు చేశారు. బాసర, ఇడుపులపాయ, నూజివీడు వద్ద ట్రిపుల్ ఐటీలను నెలకొల్పారు. జలయజ్ఞం ద్వారా ఒకేసారి 86 ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఐదేళ్లలో 23.49 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా 41 ప్రాజెక్టులను పూర్తి చేశారు. గంగవరం, కృష్ణపట్నం, కాకినాడ పోర్టులు నిరి్మంచారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తి చేశారు. -
ప్రజల బాగు కోరిన పాలకుడు
ముఖ్యమంత్రి పదవిని లక్కీ లాటరీలా పొందినవారు కొందరు, పైరవీలతో చేజిక్కించుకున్నవారు కొందరు, తెలివిగా పావులు కదిపి సాధించినవారు కొందరు... ఈ కేటగిరీల్లో కాంగ్రెస్ ఏలుబడిలోని రాష్ట్రాల్లో ఎందరినో చూశాం. పూర్తి ప్రజాదరణతో ఒకే ఒక్కడై నిలిచి, గెలిచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించిన వ్యక్తి... కాదు శక్తి... డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మాత్రమే! జమ్మలమడుగులో పుట్టి, స్వగ్రామం పులివెందులలో, బళ్లారిలో చదివి, గుల్బర్గాలో మెడిసిన్ చేసి డాక్టరుగా పులివెందులలో రూపాయి డాక్టరుగా ఊరి జనానికి చేరువయ్యారు. చిన్ననాటి నుండీ గాంధీ, నెహ్రూలపై పెరుగుతూ వస్తున్న అభిమానం ఆయనను కాంగ్రెస్కు చేరువ చేసింది. పులివెందుల డిగ్రీ కాలేజీ స్థాపించి విద్యాభివృద్ధికీ, 20 పడకల ఆసుపత్రి నిర్మించి, పేదలకు ఉచిత వైద్యం చేసి ఊరి చుట్టుపక్కల ప్రజలకూ దగ్గరయ్యారు. యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడై 1978లో కాంగ్రెస్ చీలిక రాగా ‘రెడ్డి కాంగ్రెస్’ ఎమ్మెల్యేగా తొలిసారి ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా ప్రతిసారీ గెలుస్తూ వచ్చారు. యువజన సర్వీసులు, ఎక్సైజ్, విద్యా శాఖలకు మంత్రిగా పనిచేశారు. రెండుసార్లు పీసీసీ అధ్యక్షుడిగా వ్యవహరించారు. 1999 అసెంబ్లీ ఎన్నికల్లో తన నాయకత్వంలో 91 స్థానాలు గెలుచుకుని ప్రతిపక్ష నాయకుడిగా సత్తా చాటారు. 2004 ఎన్నికలకు ఏడాది ముందు జనంలోకి వెళ్ళారు. ఆ ఏడాది ఏప్రిల్ 3న రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో పాదయాత్రకు శ్రీకారం చుట్టి, ఆంధ్రప్రదేశ్ చివరి గ్రామం ఇచ్ఛాపురం వరకూ దాదాపు 1600 కిలోమీటర్లు వైఎస్ పాదయాత్ర చేశారు. దారి పొడవునా, గ్రామ గ్రామాన ప్రజల కష్టనష్టాలను కళ్ళారా చూశారు. చెవులారా విన్నారు. భగ్గున మండుతున్న ఎండల్లో కాలినడకలో ప్రజలు ఎన్నెన్ని అవస్థలు పడుతున్నారో గమనించారు.ఓ పక్క కరువు, మరోవంక గంజినీళ్లకు కూడా నోచుకోని అభాగ్యులు, విద్యుత్ కొరత వల్ల బోర్లు పనిచేయక అచేతనులైన రైతన్నల దౌర్భాగ్య స్థితి, నిరుద్యోగుల నిస్తేజం... ఇవన్నీ ఆయనను కొత్త మనిషిగా తీర్చిదిద్దాయి. ‘ఇందిరమ్మ రాజ్యం’ తెస్తాననీ, అన్ని కష్టాల నుంచి గట్టెక్కిస్తాననీ ప్రజలకు మాటిచ్చారు. నమ్మకం కలిగించారు. వ్యవసాయ ప్రధానమైన గ్రామీణ ప్రజలకు విద్యుత్ చార్జీలు భారం కావడం, ఎప్పుడు వస్తుందో, పోతుందో తెలియని కరెంటు సరఫరా ప్రాథమిక అవరోధంగా గుర్తించి ‘ఉచిత విద్యుత్’ హామీ ఇచ్చి ముఖ్యమంత్రిగా తొలి సంతకం ఆ ఫైలు పైనే చేస్తానన్నారు. సరిగా పండక, అరకొర దిగుబడి తెగనమ్మితే పెట్టుబడి ధర కూడా రాక రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్న వార్తలు విని, చదివి ఆయన చలించి పోయారు. వివిధ వర్గాల ప్రజల జీవన్మరణ సమస్యలను ఎలాగైనా సరే పరిష్కరించాలని నిశ్చయించుకున్నారు. పాదయాత్ర క్రమంలో రాజమండ్రి నగరం వచ్చాక తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మూడు రోజుల విశ్రాంతి అనంతరం మళ్ళీ నిర్విరామంగా ఇచ్ఛాపురం వరకూ నడక సాగించి, 64 రోజుల పాదయాత్ర (3 రోజుల విరామంతో కలిపి 67 రోజులు) లక్ష్యం పూర్తి చేశారు.అంతలో 2004 ఎన్నికల నగారా మోగింది. వైఎస్ హైదరాబాద్ తిరుగు పయనమయ్యారు. అంతకు పదేళ్ళ ముందు 1994 ఎన్నికల్లో ఎన్టీఆర్ అఖండ విజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యారు. కొద్దికాలానికే ఎన్టీఆర్ను పదవీచ్యుతుణ్ణి చేసి, తెలుగుదేశం పార్టీని హైజాక్ చేసి, ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నారు చంద్రబాబు. అలాంటి చంద్రబాబు బీజేపీ ఆసరా తోడై, 1999లో మళ్ళీ అధికార పగ్గాలు చేపట్టారు. ప్రజలంటే గొఱె<లనీ, ఎన్నికలంటే కాస్త పేరున్న పార్టీతో జతకట్టి సునాయాసంగా గెలవచ్చనీ పాత అనుభవ పాఠాల ద్వారా నమ్మి, ఈసారి 2004 ఎన్నికల బరిలోనూ దూకారు. అలిపిరి మందుపాతర పేలుడులో త్రుటిలో బతికి బయటపడిన ఘటన సానుభూతి తెచ్చి గెలిపిస్తుందని నమ్మారు. సానుభూతి చల్లారకుండా ముందస్తు ఎన్నికలకు చంద్రబాబు దిగారు. ప్రచార పర్వంలో ఎక్కడా సానుభూతి జాడలేదు సరికదా ప్రజాగ్రహం ఎదురైంది. కాంగ్రెస్ అఖండ విజయం, వైఎస్ ముఖ్యమంత్రి కావడం చకచకా జరిగిపోయాయి.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 2004 మే 14న హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియంలో ప్రజా సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు వైఎస్. ఇచ్చిన మాట ప్రకారం ఉచిత విద్యుత్ ఫైలుపై తొలి సంతకం చేశారు. అది మొదలు ప్రజలకు ఎలా మేలు చేయాలన్న ఆలోచన తప్ప ఆయనకు మరొకటి లేదు. రైతులకు సహకార రుణమాఫీ కోసం కేంద్రాన్ని ఒప్పించారు. పీకల లోతు అప్పుల్లో మునిగి ఉన్న రైతులకు రుణ విముక్తి కలిగించారు. ‘ఆరోగ్యశ్రీ’తో అత్యంత ఖరీదైన వైద్యాన్ని నిరుపేదలకు అందించారు. పేదరికం కారణంగా పౌష్టికాహార లోపంతో గుండెజబ్బుల బారిన పడిన పసిపిల్లలకు ఉచిత శస్త్రచికిత్సలు చేయించారు.‘108 వాహనం’ ద్వారా అత్యవసర అంబులెన్సు వాహనాలను రాష్ట్రమంతటా అందుబాటులోకి తెచ్చారు. బీసీ విద్యార్థులకు ఇంజనీరింగ్ విద్య కోసం ‘ఫీజు రీ–ఇంబర్స్మెంట్’ పథకాన్ని ప్రవేశపెట్టారు. ముస్లిమ్ మైనారిటీ విద్యార్థులకు 4 శాతం రిజర్వేషన్లతో ఇంజనీరింగ్ విద్యను అందించారు. ‘జలయజ్ఞం’తో భారీ, మధ్యతరహా, చిన్నతరహా సాగునీటి ప్రాజెక్టులను రాష్ట్రం నలుమూలలా విస్తరించే పథకాలకు శ్రీకారం చుట్టారు. కోటి ఎకరాల సాగుభూమితో రాష్ట్రం అన్నపూర్ణగా విరాజిల్లాలని పట్టుదలతో కృషి చేసారు. అంతకు ముందు నామమాత్రంగా ఉండే వికలాంగ, వృద్ధాప్య పింఛన్లను ఇబ్బడిముబ్బడిగా పెంచారు. ఎస్సీ, ఎస్టీ పథకాల రుణమాఫీతో ఊరట కలిగించారు.‘ఇందిరమ్మ ఇళ్ల’ను ‘ఇందిరమ్మ ఊళ్ళు’ అనేలా గణనీయంగా నిర్మించారు. ప్రకృతి కూడా పరవశించిందేమో... హర్షాతిరేకంతో వర్షాలను చాలినంతగా రాష్ట్రమంతటా కురిపించింది. గ్రామదేవతల, దేవాలయ ఉత్సవాలు ఊరూరా పునః ప్రారంభమయ్యాయి. దేశం ఆంధ్రప్రదేశ్ వైపు తల తిప్పి చూడసాగింది. కాంగ్రెసేతర ముఖ్యమంత్రులు సైతం ‘ఆరోగ్యశ్రీ’తో పాటు వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన మరికొన్ని పథకాలను తమ రాష్ట్రంలో అమలు చేశారు. 2009 ఎన్నికల్లోనూ వైఎస్ నేతృత్వంలో కాంగ్రెస్ అధికారం కైవసం చేసుకుంది. రెండోసారి ముఖ్యమంత్రిగా అధికార పీఠాన్ని అధిష్ఠించి, మరింత జాగరూకతతో సాగుతూ, పథకాల అమలు తీరు ఎలా ఉందో ప్రజల నుండి నేరుగా తెలుసుకోవాలన్న కోరికతో ‘రచ్చబండ’ ప్రవేశపెట్టారు. తొలి సమావేశానికి హాజరవడానికి హెలికాప్టర్లో చిత్తూరు జిల్లాకు పోయే క్రమంలో వాతావరణం ప్రతికూలించింది. కంట్రోల్ రూముతో సంబంధాలు తెగిపోయాయి. మరునాడు ఊహించని విషాద వార్త వెల్లడైంది. ‘నల్లమల అడవుల్లో హెలికాప్టర్ కూలిపోయింది. వైఎస్ ఇకలేరు’! ఈ వార్తను తట్టుకోలేక రాష్ట్రవ్యాప్తంగా సుమారు 700 గుండెలు ఆగిపోయాయి. ఇంతగా ప్రేమను పొందిన నాయకుడు చరిత్రలో మరొకరు లేరు. 2009 సెప్టెంబరు 3వ తేదీ జన హృదయ విజేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఇక లేరని లోకానికి తెలిసిన రోజు. అదే రోజు గణేశ నిమజ్జనం. ‘గణేశ్ మహరాజ్కీ జై’, ‘గణపతి బప్పా మోరియా’ నినాదాలతో, పిల్లలు, పెద్దలు సహా అశేష జనసందోహంతో, నృత్యాలు, ఆటపాటలు, టపాసుల, డప్పులు, ఆర్కెస్ట్రాల కోలాహలంతో 24 గంటలపాటు నిర్విరామంగా సాగాల్సిన హైదరాబాద్ గణేశ్ నిమజ్జనోత్సవం అంతే జనంతో నిర్వికారంగా, ఎటువంటి ఆర్భాటం లేకుండా ఒక మహా మౌనప్రదర్శన అన్నట్టుగా సాగిపోయింది. లెక్కకు మిక్కిలిగా పూనుకున్నా జరగదనిపించే ఆ సంఘటన ఆ జననేత పట్ల గొప్ప గౌరవానికి తార్కాణం. ‘పథకాలంటే ఇవీ, పరిపాలన అంటే ఇదీ, పాలకుడంటే ఇలా...’ అని మామూలు వ్యక్తుల నుండి మేధావుల దాకా అనుకునేలా సాగిన ఆయన రాష్ట్ర నాయకత్వ హయాం ‘న భూతో న భవిష్యతి!’తిరుమలగిరి సురేందర్ – వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు, ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ -
జనం గుండెల్లో నిండిన దేవుడు
ప్రజా సంక్షేమం కోసం అనుక్షణం పరితపించిన నాయకుడాయన. పేదవాడి ముఖంపై చిరునవ్వు వెలిగించడానికి నిరంతరం శ్రమించిన కార్మికుడాయన. జలయజ్ఞంతో రాష్ట్రాన్ని అన్నపూర్ణగా మార్చిన కర్షక భగీరథుడాయన. సర్కారీ పాలనలోనే కాదు... స్నేహంలోనూ, సాయంలోనూ వై.ఎస్. రాజశేఖరరెడ్డిది ఓ అరుదైన వ్యక్తిత్వం. మనుషుల గుండెల్లో చిరకాలం చెరిగిపోని సంతకం. జనహృదయ విజేత వైఎస్ 2009లో అకాల మరణం చెందినప్పుడు ఆయన ఆప్తుడు, నాటి కాంగ్రెస్ నేత ఉండవల్లి అరుణ్కుమార్ తన గుండె లోతుల్లో నుంచి ‘సాక్షి’తో పంచుకున్న అనుభవాల మాలిక ఈ వ్యాసం. నేడు వైఎస్ 15వ వర్ధంతి సందర్భంగా నాటి కథనాన్ని నవతరం పాఠకుల కోసం మరోసారి అందిస్తున్నాం.గాంధీభవన్లో మీటింగ్... పీసీసీ అధ్యక్షులు ఎం. సత్యనారాయణరావు గారు, సీఎల్పీ లీడర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డిగారు కూర్చున్నారు. ఏదో అర్జంట్ మీటింగ్! అందుబాటులో ఉన్న నాయకులందరినీ పిలిచారు. ప్రెసిడెంట్ గారి రూంలోనే మీటింగ్. ముప్పై కుర్చీల దాకా వేశారు. నేను బాగా చివరి వరుసలో మూలగా ఉన్న కుర్చీలో కూర్చున్నాను. ‘అరుణ్! ముందుకు రావయ్యా... ఇక్కడ ఖాళీగా ఉంది గదా!’ అంటూ ముందు వరుసలో కూర్చోమని ఆహ్వానించారు సత్యనారాయణ గారు. ‘ఎందుకు సార్... మళ్లీ ఎవరైనా పెద్ద లీడరొస్తే లేచి వెనక్కి రావాలి. ఇక్కడ కూర్చుంటే ఎవ్వరొచ్చినా లేవక్కర్లేదు’ అన్నాను నవ్వుతూ. అన్ని సీట్లూ నిండిపోయాయి. మీటింగ్ ప్రారంభమైంది. ఏదో నోట్ చేయాల్సిన అవసరమొచ్చింది. ‘అరుణ్! ముందుకు రావయ్యా!’ అంటూ వైఎస్ గారి పక్కనే కుర్చీ వేయించి నన్ను కూర్చోపెట్టారు. నేను, వైఎస్ గారితో అన్నాను... ‘చూశారా సార్! టైం వచ్చినప్పుడు చివరాఖర్న కూర్చున్నా తీసుకొచ్చి ముందు కూర్చోపెడ్తారు.’ ‘అవును అరుణ్! ఇది బైబిల్లో ఉంది... తనను తాను తగ్గించుకొనువాడు హెచ్చించబడును, తనను తాను హెచ్చించుకొనువాడు తగ్గించబడును’. నా జీవితంలో మర్చిపోలేని సందేశమిది. అప్పట్నుంచి నేనేనాడూ నా గురించి నేను గొప్పగా ఊహించుకోలేదు. ఎవరైనా పొగుడుతుంటే వైఎస్ గారి వాక్యమే గుర్తుతెచ్చుకుంటూ ఉండేవాడిని. 2009 ఎన్నికల ఫలితాలపై వైఎస్ మాట్లాడుతూ, ‘ప్రజలు మాకు పాస్ మార్కులే వేశారు. ఇది ఘన విజయంగా నేను భావించడం లేదు. గర్వం వీడి అణకువతో ప్రజలకు దగ్గరకండి’ అంటూ తనను తాను తగ్గించుకుంటున్నప్పుడు ఆయన మరింత హెచ్చించబడతాడనే అనుకున్నాను గానీ ఆ హెచ్చు మరీ ఇంత ఎక్కువగా ఉంటుందనీ... ఎవరికీ అందనంత ఎత్తులోకి వెళ్లిపోతారనీ కలలోనైనా ఊహించుకోలేదు. ఎవరైనా ఇతర ప్రాంతాల నుంచి నాయకులొస్తే వారి ఉపన్యాసాలను నేను అనువదించాలి. ఈ విషయంలో మాత్రం ఇంకెవర్నీ ఒప్పుకునేవారు కాదు వైఎస్ గారు! చాలాసార్లు కొందరు నాయకులు లోపల్లోపల గొణుక్కుంటూ ఉండేవారు ‘వీడే చెయ్యాలా ట్రాన్స్లేషన్... ఆ మాత్రం అనువాదకులు మనూళ్లో లేరా...’ అని!! కొన్నిసార్లు బాహాటంగా పత్రికల్లోనే విమర్శించారు. రాజీవ్గాంధీ, మన్మోహన్సింగ్, రాహుల్ గాంధీ – ఎవరొచ్చినా వారితోపాటు వేదిక మీద నాకూ కుర్చీ వేసేవారు! నాకన్నా సీనియర్లు, మంత్రులు, పెద్ద నాయకులు ఎంతోమంది కింద కూర్చోవటం, కేవలం అనువాదకుడినైన కారణంగా నేను వేదిక మీద కూర్చోవటం కొంతమందికి మింగుడుపడేది కాదు. కానీ ట్రాన్స్లేషన్ విషయంలో మాత్రం వైఎస్ కాంప్రమైజ్ అయ్యేవారు కారు. రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రాం అనంతపూర్లో ప్రారంభించారు. ప్రధాని మన్మోహన్సింగ్, అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి రçఘువంశప్రసాద్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి మణిశంకర్ అయ్యర్ ప్రసంగించారు. నన్ను సోనియాగాంధీ గారికి కేటాయించి, మిగతా ముగ్గురికీ ఇంకో ముగ్గురు నాయకులను ట్రాన్స్లేషన్కి ఏర్పాటు చేశారు. సరిగ్గా అందరూ స్టేజీ మీద కూర్చున్నాక వైఎస్ గారికి ఈ ఏర్పాటు సంగతి తెలిసింది. ఆయన ససేమిరా అంగీకరించలేదు. మొత్తం నలుగురికీ నేనే అనువాదం చెయ్యాలన్నారు. ‘సుమారు నలుగురు మాట్లాడేదీ ఒకటే ఉంటుంది. మళీ మళ్లీ అదే నేనొక్కడినే రిపీట్ చేస్తే జనానికి బోర్ కొడ్తుందేమో సార్’ అన్నాను. ‘చెప్పినట్టు చెయ్! నో మోర్ ఆర్గ్యుమెంట్!’ అన్నారు. నలుగురి స్పీచ్లూ నేనే అనువదించాను. ‘ఇంటర్ ప్రెటేషన్ కావాలి, ట్రాన్స్లేషన్ కాదు. లక్షల మంది పాల్గొన్న సభ, ఎక్స్పెరిమెంట్లు చేయటం పద్ధతి కాదు’ అన్నారాయన. నాకు అప్పుడు పదేళ్ల క్రితం జరిగిన ఒక అనువాద సంఘటన గుర్తుకొచ్చింది. విశాఖలో గాజువాక దగ్గర రాజీవ్గాంధీ విగ్రహావిష్కరణ. రాజేష్ పైలట్, అహ్లూవాలియా, వైఎస్, ద్రోణంరాజులతో కలిసి కార్లలో గాజువాక వెళ్తున్నాం. రాజీవ్గాంధీ చిరునవ్వు ముఖంలో మృత్యుకళ ప్రవేశపెట్టడం ఆ దేవుడి వల్ల కాలేదనీ... అందుకే అందమైన ఆ ముఖం నిర్జీవమైనప్పుడు ఎలాగుంటుందో చూపించలేని ఆ దేవుడు, అసలు ఆ ముఖమే లేకుండా చేసేశాడని వైఎస్ గారితో చెప్పాను. ఆ రోజుల్లో వైఎస్తో ఉండవల్లి ఈ మాటలు రాజశేఖరరెడ్డి గారి స్పీచ్లో చెప్పమన్నాను. ఆయన వద్దన్నారు. ‘ఇంత వివరంగా నువ్వే చెప్పగలవు. నువ్వే చెప్పు’ అన్నారు. ‘సార్! నేను అనువాదకుణ్ణేగానీ వక్తను గాను. రాజేష్ పైలట్, లేదా అహ్లూవాలియానో ఈ మాటలంటే నేను అనువదించగలను గానీ వాళ్లనకుండా నేనెలా చెప్తాను’ అన్నాను. ‘అక్కడికేదో వాళ్లు చెప్పింది మాత్రమే నువ్వు చెబుతున్నట్టు పోజు పెట్టకోయ్... అయినా నువ్వు చేసేది భావానువాదం, భాషానువాదం కాదు! భావం మారకుండా ఈ పదాలు జొప్పించు’ అన్నారు వైఎస్. అహ్లూవాలియా మాట్లాడుతూ రాజీవ్ మరణాన్ని విశ్లేషిస్తుండగా... నేను అనువాదం చేస్తూ, పైన చెప్పిన నాలుగు మాటలూ కలిపేశాను. సభలో ఊహించని రెస్పాన్స్. వైఎస్ గారు మీటింగ్ అయిపోయాక నా భుజం తట్టారు. ఇప్పుడనిపిస్తోంది... ఎప్పుడూ నవ్వుతూ ఉండే వైఎస్ ముఖంలో సైతం మృత్యువును ప్రవేశపెట్టడం ఆ భగవంతుని వల్ల కాలేదనీ, అందుకే హెలికాప్టర్ ప్రమాదంలో ఛిన్నాభిన్నమైన ఆ శరీరం కోట్లాదిమంది అభిమానుల ఆఖరి చూపులకు కూడా నోచుకోలేదని!ఇద్దరు మనుష్యుల మధ్య సంబంధాలు... ఇచ్చిపుచ్చుకోవటాలతో బలపడుతుంటాయి. ఒకరికొకరు సహాయపడుతూ ఆప్తులవుతారు. వైఎస్ గారితో నా సంబంధం తల్చుకుంటే... నాకు ఆశ్చర్యమేస్తుంది! ఎప్పుడూ ఆయన వల్ల నాకు జరిగిన ఉపకారాలే తప్ప... నా నుంచి ఆయన కోసం వీసమెత్తు కంట్రిబ్యూషన్ కూడా లేదు. కనీసం వార్డు కౌన్సిలర్గా పోటీ చేయడానికి కూడా... కావల్సిన కులబలం, ధనబలం లేని నన్ను రెండుసార్లు అసెంబ్లీకి, రెండుసార్లు పార్లమెంట్కీ పోటీ చేయించారు. ఎక్కడో లక్షలాదిమంది మధ్య నుంచొని రాజీవ్గాంధీ ఉపన్యాసానికి చప్పట్లుకొట్టే స్థాయి కాంగ్రెస్ కార్యకర్తనైన నన్ను సాక్షాత్తూ ఆ రాజీవ్గాంధీ పక్కనే నిలబెట్టారు. అగ్రనాయకులందరూ అడ్డుపడ్డా... నేనే బాగా అనువదిస్తానని, వారితో వాదించి – వారిని వారించి నాకు ఢిల్లీ స్థాయి నాయకులందరి పక్కనా ఉండే స్థాయి కల్పించారు. సోనియాగాంధీ, రాహుల్గాంధీ స్థాయి నాయకులు నన్ను పేరెట్టి పిలిచే స్థానంలోకి పంపించారు. నేనేనాడూ ఆయన్ని ‘నాకిది కావాల’ని అడగలేదు. మొన్నటి (2009) ఎన్నికలకు మూడు నెలల ముందు మాత్రం ధైర్యం చేసి ఒక్క రిక్వెస్ట్ చేశాను... ‘ఈసారి ఎన్నికల్లో నన్ను పోటీ చేయించవద్ద’ని! అప్పటికే రామచంద్రరావు గారి దగ్గర ఈ ప్రతిపాదన చేసి చాలా తిట్టించుకున్నాను. అందుకే వైఎస్ గారితో నెమ్మదిగా ఈ విషయం చెప్పాను. హైదరాబాద్ శివార్లలో ఒక సభకు హాజరవ్వటానికి బయలుదేరుతున్న వైఎస్, తనతో పాటు కారెక్కమన్నారు. సుమారు ఇరవై నిమిషాల ప్రయాణం. దారిలో ఆయనకి ఎక్స్ప్లైన్ చేశాను. ఈసారి నాకెంత ప్రతికూల పరిస్థితులున్నాయో... నేను నెగ్గటం ఎంత అసాధ్యమో వివరించాను. ‘ఇప్పుడు నువ్వు పోటీ చేయకపోవడం కరెక్ట్ డెసిషన్ కాదు. నువ్వు చెప్పిందంతా నిజమే, అయినా నువ్వే గెలుస్తావు... డోంట్ వర్రీ గాడ్ ఈజ్ దేర్’ అన్నారు వైఎస్. అది 2009 సెప్టెంబర్ 3. ఆ రోజు వినాయక నిమజ్జనం. హైదరాబాద్ నగరమంతా అల్లకల్లోల సునామీ సముద్రంలా ఉండేరోజు. వైఎస్ మరణవార్త నెమ్మది నెమ్మదిగా జనానికి చేరుతోంది. నిశ్శబ్దంగా నిమజ్జనం ప్రారంభమయ్యింది. ప్రతి ముఖంలో దుఃఖం, ఎంతోమంది మహానాయకుల మరణవార్తల్ని విన్నాం, కళ్లారా చూశాం. ‘ఆ వార్త వినగానే గుండె పగిలింది’ అంటూ చాలాసార్లు అంటుంటాం. ఇంతకాలం ఇదొక పద ప్రయోగమే... మహా అయితే పదాలంకారమో అనుకున్నాగానీ... నిజంగా గుండె పగిలి చచ్చిపోయేంత దుఃఖం ఉంటుందని నాకు ఇప్పుడే తెలిసింది. ఇంట్లో అందొచ్చిన కొడుకు చచ్చిపోతే ఏడ్చినట్టుగా ఏడుస్తున్న వృద్ధులు... ‘రేపు నా బిడ్డల పరిస్థితేమి’టంటూ పిల్లల తల్లులు... ఫ్రీగా ఇంజనీరింగ్ చదువుకుంటున్న విద్యార్థులు... రాష్ట్రమంతా వెక్కివెక్కి ఏడ్చింది. కొన్ని వందల గుండెలు నిజంగానే పగిలిపోయాయి. యాక్సిడెంట్ కన్ఫర్మ్ అయి వైఎస్ మృతదేహాన్ని గుర్తించారని తెలిసిపోయాక, సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి గారి ఫ్లోర్లోకి వెళ్లాను. ఆయనతో నాకున్న సంబంధం, ఆయన నాపై చూపిన ప్రేమాభిమానాలూ మనసులో రీళ్లు తిరగసాగాయి. ఒక మాట దగ్గర రీల్ ఆగిపోయింది. ‘డోంట్ వర్రీ,,, గాడ్ ఈజ్ దేర్.’ నేను తప్పుగా విన్నాను ఆయనన్న మాట... ‘డోంట్ వర్రీ గాడ్ ఈజ్ హియర్!’ అని అయి ఉంటుంది. నేనుండగా నీకెందుకు వర్రీ!! నా సంకల్పమే నీకు దైవం. నా బలమే నీకు దైవబలం. ఇంకా తెలియలేదా అరుణ్... నేనెవరినో!!వైఎస్ గారితో నేను మాట్లాడిన మాటలు, వెటకారాలు, వేళాకోళాలు, జోకులూ అన్నీ గుర్తుకొచ్చి నెమ్మదిగా వెన్నులో వణుకు పుట్టింది. ఆయనతో మాట్లాడేటప్పుడు ఏమి అనాలనిపిస్తే అది అనేసేవాడిని. ఎవరేమనుకుంటారో, అనొచ్చో–లేదో... అని ఏనాడూ సంకోచించలేదు. ఎన్నిసార్లు నా మాటలు ఆయనకు నచ్చకపోయి ఉండొచ్చో... ఎన్నిసార్లు ఆయనకు నా మాటల వల్ల బాధ కలిగిందో... హఠాత్తుగా నాకు ‘భగవద్గీత’లోని ఒక శ్లోకం (11: 42) గుర్తుకొచ్చింది. అర్జున ఉవాచ :‘‘యచ్చావహా సార్థ మసత్కృతోసివిహార శయ్యాసన భోజనేషుఏకోథ వాప్యచ్యుత తత్సమక్షంతత్ క్షామయే త్వామహ మప్రమేయమ్’’ (విశ్వరూప సందర్శన యోగం)‘‘కృష్ణా! నాశరహితా! నీ ఈ మహిమ తెలియక పొరపాటున గానీ, చనువు వల్ల గానీ ఓ కృష్ణా, ఓ యాదవా, ఓ సఖా అని అలక్ష్యముగా నేనేమి అన్నానో... విహారము సల్పునపుడుగానీ, పరుండునప్పుడుగానీ, కూర్చుండునప్పుడు గానీ, భుజించినప్పుడు గానీ, ఒక్కడవుగా ఉన్నప్పుడుగానీ, ఇతరుల యెదుట పరిహాసముగా గానీ ఏ విధంగా ప్రవర్తించితినో నా అపరాధములన్నీ అప్రమేయుడవగు నీవు క్షమించమని వేడుకొనుచున్నాను.’’తండ్రీ! ఓ రాజశేఖరరెడ్డీ! నన్ను క్షమించు... అనుగ్రహించు!!ఉండవల్లి అరుణ్కుమార్ – వ్యాసకర్త ప్రముఖ రాజకీయ నాయకుడు, పార్లమెంట్ మాజీ సభ్యుడు -
వైద్య కళాశాలలపై చంద్రబాబు శాడిజం..
సాక్షి, విజయవాడ: ఏపీలో ప్రభుత్వ కొత్త వైద్య కళాశాలలకు వైఎస్సార్ పేరును తొలగిస్తూ చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 8500 కోట్లతో 17 కొత్త మెడికల్ కళాశాలలకు వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. గత ఏడాది విజయనగరం, ఏలూరు,రాజమండ్రి, మచిలీపట్నం, నంద్యాలలో మెడికల్ కళాశాలలను ఆయన ప్రారంభించారు. కొత్త మెడికల్ కళాశాలలకు దివంగత సీఎం డాక్టర్ వైఎస్సార్ పేరు పెట్టిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం.. దశాబ్దాలగా ఉద్దానంలో ఉన్న కిడ్నీ సమస్యకి వైఎస్ జగన్ ప్రభుత్వంలో శాశ్వత పరిష్కారం లభించింది.రూ. 750 కోట్లతో ఉద్దానం వాసులకి శాశ్వత మంచినీటి పథకంతో పాటు కిడ్నీ రీసెర్చ్ సెంటర్ను కూడా వైఎస్ జగన్ సర్కార్ నిర్మించింది. ఈ ఏడాది ప్రారంభం కావాల్సిన ఐదు మెడికల్ కళాశాలలకు చంద్రబాబు సర్కార్ అనుమతి సాధించలేకపోయింది. కానీ కొత్త మెడికల్ కళాశాలకు దివంగత సీఎం డాక్టర్ వైఎస్సార్ పేరు తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ జారీ చేసింది.2023-24లో ప్రారంభమైన ఐదు, 2024-25 లో ప్రారంభం కావాల్సిన మరో ఐదు వైద్య కళాశాలలు పలాసలోని కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పటల్, కడపలోని క్యాన్సర్ ఆసుపత్రికీ వైఎస్సార్ పేరును తొలగిస్తూ వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు ఉత్తర్వులు ఇచ్చారు. -
‘చంద్రబాబూ.. పేర్లు మార్చడం తప్ప ఏం చేశావ్?’
నెల్లూరు, సాక్షి : సోమశిల జలాశయానికి తానే ఆద్యుడిగా సీఎం చంద్రబాబు చెప్పుకోవడం సిగ్గుచేటని నెల్లూరు వైఎస్సార్సీపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. 1995 నుంచి 2004 వరకూ అయన ముఖ్యమంత్రిగా ఉన్నారు..ఏనాడైనా సమగ్ర సోమశిల గురించి ఆలోచించారా..? అని ప్రశ్నించారు.‘‘అప్పట్లో 36 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉండేది. మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతే సోమశిల సామర్థ్యాన్ని 78 టీఎంసీలకు పెంచారు. అదేవిధంగా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని కూడా 40 వేల క్యూసెక్కులకు పెంచారు. అప్పట్లో తెలంగాణలోని కాంగ్రెస్ వాదులు దీనిని వ్యతిరేకించినా.. రాజశేఖర్ రెడ్డి ఖాతర చేయలేదు. 14 ఏళ్లల్లో ఎప్పుడూ పెన్నార్ డెల్టా అధునికీకరణ గురించి పట్టించు కోలేదు. సంగం...నెల్లూరు బ్యారేజ్ల నిర్మాణాన్ని పట్టించుకోలేదు.. మేమే పూర్తి చేశాం అని అన్నారాయన... సంగం బ్యారేజ్కు మంత్రిగా ఉంటూ మరణించిన గౌతమ్ రెడ్డి పేరు పెడితే దానిని చంద్రబాబు తొలగించారు. నెల్లూరు బ్యారేజ్కు మాజీ మంత్రి నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి పేరు పెట్టారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పేర్లు మార్చడం తప్ప ఏం అభివృద్ది చేశారో చెప్పాలి చంద్రబాబు అని డిమాండ్ చేశారు. సోమశిల మరమ్మతులకు వైఎస్సార్సీపీ హయాంలోనే పునాది పడింది. 1995 నాటి ముఖ్యమంత్రిని చూస్తారని చంద్రబాబు అన్నారు.1995లో ఆయన ట్రాక్ రికార్డ్ బాగా లేదు..అందుకే ఆందోళన కలుగుతోంది. సోమశిల జలాశయం పనులు నాణ్యతతో చేయాలని కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. -
మార్గదర్శి అక్రమాల పునాదికి ఈనాడు కవచం
సాక్షి, అమరావతి: “నిత్యం ఉషోదయంతో సత్యం నినదించుగాక..! అన్నది తమ నినాదమని ఈనాడు పత్రిక నీతులు వల్లిస్తూ ఉంటుంది. నిజానికి రామోజీ అక్రమ ఆర్థిక సామ్రాజ్యానికి ‘మార్గదర్శి’ పునాది కాగా ‘ఈనాడు’ ఆ అరాచకాలకు దశాబ్దాలుగా రక్షణ కవచంలా నిలుస్తోంది!! మరి అలాంటి ‘మార్గదర్శి’ అక్రమాలను బట్టబయలు చేస్తే ఈనాడు సహిస్తుందా? పాత్రికేయ పైశాచికత్వం జడలు విప్పి కరాళ నృత్యం చేస్తుంది. అందుకే 2004 నుంచి 2009 వరకు ముఖ్యమంత్రి నాడు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డికి వ్యతిరేకంగా ఈనాడు పత్రిక అంతగా దుష్ప్రచారానికి తెగబడింది. వైఎస్సార్ హఠాన్మరణం తరువాత కూడా ఆయన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని కుట్రలకు పాల్పడింది. తదనంతరం 2019 నుంచి 2024 వరకు వైఎస్ జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈనాడు బరితెగించి విష ప్రచారం చేసింది. ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు వక్రభాష్యం చెబుతూ రోజుకో రీతిలో బురద జల్లింది. ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి అనే కనీస గౌరవం కూడా ఇవ్వకుండా రోజుకో రీతిలో వ్యక్తిత్వ హననానికి పాల్పడిందన్నది అక్షరసత్యం. రామోజీరావు ముమ్మాటికీ ఆర్థిక ఉగ్రవాది అనే వాస్తవాన్ని ఆధారాలతో సహా ప్రజల ముందు ఉంచడంతోనే ఈనాడు అంతగా విషం చిమ్మిందన్నది నిరూపితమైంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజాగా తెలంగాణ హైకోర్టుకు సమర్పించిన నివేదికే ఆ విషయాన్ని రుజువు చేస్తోంది. నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో... అనంతరం నవ్యాంధ్ర ప్రదేశ్లో ఈనాడు ముసుగులో రామోజీ పాల్పడ్డ కుట్రలు తేటతెల్లమయ్యాయి. మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమ డిపాజిట్ల కేసులో వాస్తవాలను వెల్లడిస్తూ తెలంగాణ హైకోర్టుకు ఆర్బీఐ సమరి్పంచిన నివేదిక లోగుట్టును విప్పింది.ఆర్థిక దోపిడీని అడ్డుకున్నారనే అక్కసుతోనే నాడు వైఎస్సార్కు వ్యతిరేకంగా దుష్ప్రచారం‘మార్గదర్శి ఫైనాన్సియర్స్’ ముసుగులో రామోజీరావు దశాబ్దాలుగా సాగించిన ఆర్థిక దోపిడీకి నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. అప్పటి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఫిర్యాదుతో 2006లో వైఎస్సార్ ప్రభుత్వం దీనిపై సీఐడీ విచారణకు ఆదేశించింది. ఆర్బీఐ నిబంధనలను ఉల్లంఘిస్తూ రామోజీరావు అక్రమ డిపాజిట్లు సేకరిస్తున్నారని, అప్పటికే ఏకంగా రూ.2,600 కోట్లకుపైగా అక్రమ డిపాజిట్లు సేకరించారని నిగ్గు తేల్చింది. అప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రామోజీరావు అక్రమాలను ప్రశ్నించడం కాదు కదా మంత్రులు, ఉన్నతాధికారులు సైతం ఆయన పేరు పలికేందుకు సాహసించ లేదు. ఈ క్రమంలో అశేష ప్రజాదరణతో అధికారంలోకి వచ్చిన నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తమకు ఏ రాజగురువూ అవసరం లేదని, ప్రజల ఆశీస్సులే శ్రీరామరక్షగా భావించి దృఢ సంకల్పంతో వ్యవహరించారు. ఈ క్రమంలో మార్గదర్శి ఫైనాన్సియర్స్ మూసివేయడంతో రామోజీరావు ఆర్థిక అక్రమ సామ్రాజ్యం పునాదులు కదలిపోయాయి. దశాబ్దాలుగా తాను సాగిస్తున్న ఘరానా మోసానికి వైఎస్ రాజశేఖరరెడ్డి అడ్డుకట్ట వేయడాన్ని ఆయన సహించలేకపోయారు. దాంతో పట్టరాని ఆక్రోశం, విద్వేషంతో వైఎస్సార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈనాడులో నిత్యం పేజీలకు పేజీలు తప్పుడు వార్తలు రాయించారు. యావత్ వైఎస్సార్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని దు్రష్పచారానికి తెగించారు. అయితే రామోజీ బ్లాక్ మెయిల్ పాత్రికేయానికి వైఎస్ రాజశేఖరరెడ్డి వెరవలేదు. ఆయనతో ఏమాత్రం రాజీ పడలేదు. తలొగ్గిన తరువాత ప్రభుత్వాలు ఆ అక్రమాలకు అండగా చంద్రబాబువైఎస్ రాజశేఖరరెడ్డి హఠాన్మరణం తరువాత కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రులుగా వ్యవహరించిన రోశయ్య, కిరణ్కుమార్రెడ్డి ఈనాడు రామోజీరావుకు జీహుజూర్ అన్నారు. మార్గదర్శి ఫైనాన్సియర్స్ ఆర్థిక అక్రమాలపై కాంగ్రెస్ ప్రభుత్వమే కేసు పెట్టిందనే విషయాన్ని విస్మరించి నీరుగార్చారు. అప్పటి కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్వయంగా రోశయ్య, కిరణ్కుమార్రెడ్డిని కలసి మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమ డిపాజిట్ల గురించి ప్రస్తావించి ప్రజా ప్రయోజనాలను కాపాడాలని ఎంత కోరినా ఆలకించలేదు. రాష్ట్ర విభజన అనంతరం 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో రామోజీరావు అక్రమాలకు రక్షణ లభించింది. దాంతో గుట్టుచప్పుడు కాకుండా మార్గదర్శి ఫైనాన్సియర్స్ కేసును క్లోజ్ చేసేందుకు పావులు కదిపారు. ఈ నేపథ్యంలో 2018 డిసెంబర్లో మార్గదర్శి ఫైనాన్సియర్స్పై కేసును ఉమ్మడి హైకోర్టు కొట్టివేయడం గమనార్హం. డిపాజిటర్ల ప్రయోజనాల కోసం ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాల్సిన అప్పటి చంద్రబాబు ప్రభుత్వం మౌనంగా ఉండిపోవడం ద్వారా రామోజీ అక్రమాలకు రక్షణగా నిలిచింది.అక్రమాల పుట్ట మార్గదర్శి చిట్ఫండ్స్.. నిగ్గు తేల్చినందుకే జగన్పై దుష్ప్రచారంరామోజీ నెలకొల్పిన మార్గదర్శి చిట్ఫండ్స్ కూడా ఆర్థిక అక్రమాల పుట్టేనని వైఎస్సార్సీపీ ప్రభుత్వం వెలుగులోకి తెచ్చింది. చందాదారుల ఫిర్యాదులతో స్టాంపులు–రిజి్రస్టేషన్ల శాఖ, సీఐడీ అధికారులు మార్గదర్శి చిట్ఫండ్స్ కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించడంతో అక్రమాలు బట్టబయలయ్యాయి. కేంద్ర చిట్ ఫండ్స్ చట్టానికి విరుద్ధంగా రామోజీరావు చందాదారుల సొమ్మును తమ కుటుంబ వ్యాపార సంస్థల్లో, మ్యూచ్వల్ ఫండ్స్లలో అక్రమంగా పెట్టుబడి పెడుతున్నట్లు గుర్తించారు. చందాదారులకు ప్రైజ్మనీ ఇవ్వకుండా రశీదు రూపంలో డిపాజిట్లు సేకరించారు. బ్రాంచి కార్యాలయాల్లోని నగదు నిల్వలలను హైదరాబాద్లోని కేంద్ర కార్యాలయానికి తరలించారు. నకిలీ చందాదారుల ముసుగులో నల్లధనం దందా సాగించారు. డమ్మీ చెక్కులతో మోసగిస్తూ చందాదారులను ఇబ్బంది పెట్టి వారి ఆస్తులను సొంతం చేసుకున్నారు. ఇలా మార్గదర్శి చిట్ఫండ్స్ యథేచ్ఛగా పాల్పడుతున్న అక్రమాలన్నీ ఆధారాలతో సహా వెలుగులోకి వచ్చాయి. దీంతో ఈ కేసులో నిందితులైన రామోజీరావు, ఆయన కోడలు శైలజ కిరణ్లను సీఐడీ అధికారులు హైదరాబాద్లోని వారి నివాసానికి వెళ్లి విచారించారు. తన ఇంటికి పోలీసులు రావడం ఇదే తొలిసారని రామోజీరావు సీఐడీ అధికారులతో వ్యాఖ్యానించడం గమనార్హం. నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి మాదిరిగానే ఆయన తనయుడు వైఎస్ జగన్ తమ అక్రమాలకు అడ్డుకట్ట వేయడాన్ని రామోజీరావు సహించలేకపోయారు. వైఎస్ జగన్ మరోసారి అధికారంలోకి వస్తే తమ అక్రమ సామ్రాజ్యం పూర్తిగా కుప్పకూలడం ఖాయమని, తమకు శిక్ష పడటం ఖాయమని గ్రహించారు. దాంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీస్థాయిలో దుష్ప్రచారానికి తెగించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ విధానాలకు వక్రభాష్యం చెబుతూ నిరాధార ఆరోపణలతో రోజుకో రీతిలో బురదజల్లారు. సత్యం నినదించడం కాదు... దోపిడీ వర్ధిల్లాలి అదే ఈనాడు నినాదం.. విధానం రామోజీరావు తన ఆత్మనే ఈనాడు పత్రికగా ... ‘నిత్యం ఉషోదయంతో సత్యం నినదించుగాక’ అనే జ్యోతిని వెలిగించి పత్రిక తెచ్చారని ఇటీవల ఈనాడు స్వర్ణోత్సవాల్లో ఘనంగా ప్రకటించారు. ఈ మాటలు వినటానికి ఎంత అందంగా ఉంటాయో ఆచరణలోకి వచ్చేసరికి మాత్రం ఈనాడు పాత్రికేయం అంత పైశాచికంగా ఉంటుందన్నది 50 ఏళ్లుగా రోజూ నిగ్గుతేలుతున్న అక్షర సత్యం. రామోజీరావు అక్రమ ఆర్థిక సామ్రాజ్యానికి పునాది మార్గదర్శి ఫైనాన్సియర్స్, మార్గదర్శి చిట్ఫండ్స్ అయితే.. ఆ ఆర్థిక ఉగ్రవాదానికి రక్షణ కవచంగా ఈనాడు పత్రికను వాడుకున్నారన్నది సీఐడీ దర్యాప్తులు, ఆర్బీఐ నివేదికల సాక్షిగా వెల్లడైన వాస్తవం. మార్గదర్శి చిట్ఫండ్స్ సహ వ్యవస్థాపకుడు జీజే రెడ్డి కుటుంబం వాటాలను అక్రమంగా తన కోడలు పేరిట రామోజీ బదిలీ చేసుకున్నారు. ఈనాడు కార్యాలయాలు జాతీయ రహదారులు, నగరాల్లోని రహదారులను కబ్జా చేసినా వ్యవస్థలు కళ్లు మూసుకున్నాయి. తమకు పోటీగా ఉన్న ఉదయం పత్రికను దెబ్బతీసేందుకు సారా వ్యతిరేక ఉద్యమం...అనంతరం సంపూర్ణ మద్యపాన నిషేద ఉద్యమాన్ని ఈనాడు నెత్తిన పెట్టుకుంది. నాటి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దు్రష్పచారం చేసింది. ఇక 1995లో ఆనాటి సీఎం ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచిన కుట్రలో చంద్రబాబు భాగస్వామి రామోజీ. అందుకు ప్రతిగా సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని ఎత్తివేసి రామోజీ ఫిల్మ్ సిటీలో మద్యాన్ని ఏరులై పారించారు. ప్రభుత్వ, ప్రైవేటు భూములను ఫిల్మ్ సిటీ పేరిట కబ్జా చేసిన రామోజీరావుకు టీడీపీ ప్రభుత్వం సహకరించింది. ఇక ఈనాడు స్వర్ణోత్సవ వేడుకల్లో ఆ పత్రిక ప్రతినిధులు మాట్లాడుతూ 2006లోనూ 2022లోనూ ఈనాడు పత్రికపై ప్రభుత్వాలు దాడులకు పాల్పడ్డాయని ఆరోపించడం విడ్డూరంగా ఉంది.ఇకనైనాప్రభుత్వాలు స్పందిస్తాయా? మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమ డిపాజిట్లు వసూలు చేసినట్లు తాజాగా ఆర్బీఐ స్పష్టం చేసిన నేపథ్యంలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఇప్పుడు ఎలా స్పందిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. ఇరు ప్రభుత్వాలు తెలంగాణ హైకోర్టుకు ఈ నెల 20న తమ అభిప్రాయాన్ని తెలపాల్సి ఉంది. ఇకనైనా డిపాజిట్ దారుల హక్కుల పరిరక్షణ కోసం పోరాడతాయా? లేక ఈనాడు ప్రాపకం కోసం రామోజీ కుటుంబ ఆర్థిక దోపిడీకి వంత పాడి మౌనంగా ఉండిపోతాయా? అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. దాదాపు 18 ఏళ్లుగా మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ కేసులో మునుముందు ఎలా వ్యవహరిస్తారన్నది కూడా ఆసక్తికరంగా మారింది.18 ఏళ్లు నెట్టుకొచ్చారు6.11.2006: మార్గదర్శి ఫైనాన్సియర్స్, రామోజీరావులపై చర్యలు కోరుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండవల్లి ఫిర్యాదు.13.11.2006: ఉండవల్లి ఫిర్యాదును కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు పంపింది. ఆర్బీఐ మార్గదర్శి వివరణ కోరింది. 30.11.2006: తాము సెక్షన్ 45ఎస్ పరిధిలోకి రామన్న మార్గదర్శి. ఇకపై డిపాజిట్లు వసూలు చేయవద్దని మార్గదర్శికి ఆర్బీఐ ఆదేశం.19.12.2006: మార్గదర్శి ఫైనాన్సియర్స్కు సంబంధించిన సమాచారం, డాక్యుమెంట్లు ఇవ్వాలంటూ ఆర్బీఐకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ.19.12.2006: వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు ఎన్.రంగాచారిని నియమిస్తూ జీవో నంబర్ 801 జారీ. మార్గదర్శి అక్రమాలపై ఫిర్యాదు చేసేందుకు అదీకృత అధికారిగా టి.కృష్ణరాజు నియామకం జీవో 800 జారీ. 27.12.2006: రంగాచారి, కృష్ణరాజుల నియామకాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో మార్గదర్శి, రామోజీరావు పిటిషన్.29.12.2006: మార్గదర్శిపై చట్ట ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వమేనంటూ ఆర్బీఐ లేఖ. 29.12.2006: ఏపీ డిపాజిటర్ల పరిరక్షణ చట్టం చట్టబద్ధతను సవాలు చేస్తూ మార్గదర్శి, రామోజీ హైకోర్టులో పిటిషన్.19.2.2007: ఎన్.రంగాచారి మార్గదర్శి అక్రమాలపై ప్రభుత్వానికి నివేదిక సమర్పణ. 19.2.2007: రంగాచారి నియామక జీవోపై స్టే విధించేందుకు హైకోర్టు నిరాకరణ.23.2.2007: రంగాచారి నియామకం విషయంలో హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన మార్గదర్శి, రామోజీ రావు.23.1.2008: మార్గదర్శి అక్రమాలపై నాంపల్లి కోర్టులో అదీకృత అధికారి కృష్ణరాజు ఫిర్యాదు. 13.7.2009: అదీకృత అధికారి దాఖలు చేసిన ఫిర్యాదులో రామోజీరావు వ్యక్తిగత హాజరుకు నాంపల్లి కోర్టు ఆదేశం 20.7.2009: నాంపల్లి కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టును ఆశ్రయించిన రామోజీ. 3.8.2009: రామోజీ పిటిషన్ను కొట్టేస్తూ వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనన్న హైకోర్టు.7.9.2009: అదీకృత అధికారి తరఫున వాదనలు వినిపించేందుకు ప్రత్యేక పీపీ నియామకంపై మార్గదర్శి, రామోజీ పిటిషన్. 27.11.2009: వ్యక్తిగత హాజరు విషయంలో హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన మార్గదర్శి, రామోజీ 17.10.2010: ప్రత్యేక పీపీ నియామకంపై మార్గదర్శి పిటిషన్ మూసివేత 1.7.2011: మార్గదర్శి అక్రమాల కేసులో విచారణను కొన్ని సెక్షన్లకే పరిమితం చేయాలంటూ రామోజీ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేసిన నాంపల్లి 18.7.2011: నాంపల్లి కోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ రామోజీ హైకోర్టులో పిటిషన్ 26.07.2011: మార్గదర్శి అక్రమాలపై దాఖలైన ఫిర్యాదును కొట్టేయాలంటూ హైకోర్టులో రామోజీ, మార్గదర్శి పిటిషన్ 2011: రామోజీ, మార్గదర్శిపై నాంపల్లి కోర్టులో జరుగుతున్న విచారణకు సంబంధించి తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు 2014: రాష్ట్ర విభజన జరిగిన తరువాత రాజకీయ పరిస్థితులు మారిపోవడంతో ఈ కేసు గురించి ఎవరూ పట్టించుకోలేదు. 18.9.2018: నాంపల్లి కోర్టులో మార్గదర్శికి వ్యతిరేకంగా దాఖలైన ఫిర్యాదులో తదుపరి చర్యలు నిలుపుదల చేయాలంటూ మార్గదర్శి, రామోజీ అనుబంధ పిటిషన్ 12.10.2018: నాంపల్లి కోర్టులో మార్గదర్శికి వ్యతిరేకంగా దాఖలైన ఫిర్యాదులో తదుపరి చర్యలు నిలుపుదలకు సుప్రీంకోర్టు నిరాకరణ 31.12.2018: నాంపల్లి కోర్టులో మార్గదర్శి, రామోజీరావుపై అ«దీకృత అధికారి దాఖలు చేసిన ఫిర్యాదును కొట్టేసిన హైకోర్టు 16.12.2019: హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఉండవల్లి అరుణ్కుమార్ సుప్రీంకోర్టులో పిటిషన్ 17.10.2022: డిపాజిటర్ల పరిరక్షణ చట్టంపై మార్గదర్శి, రామోజీరావు గతంలో దాఖలు చేసిన పిటిషన్ను మూసేసిన హైకోర్టు 9.4.2024: మార్గదర్శిపై అ«దీకృత అధికారి ఫిర్యాదును కొట్టేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేసిన దర్మాసనం. మార్గదర్శి అక్రమాలపై నిగ్గు తేల్చాలని తెలంగాణ హైకోర్టుకు ఆదేశం. మొత్తం వ్యవహారాలపై దర్యాప్తు చేయాలి మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమ డిపాజిట్లు వసూలు చేసినట్టు పూర్తి ఆధారాలతో సహా నిరూపితమైంది. ఆ సంస్థ చైర్మన్ రామోజీరావు లేకున్నా సరే మార్గదర్శి ఎండీగా ఉన్న ఆయన కోడలు శైలజ కిరణ్, భాగస్వాములుగా ఉన్న వారి కుటుంబ సభ్యులను చట్టపరంగా శిక్షించాలి. అంతేకాదు మార్గదర్శి మొత్తం అక్రమాలపై సమగ్రంగా దర్యాప్తు చేయాలి. – వొగ్గు గవాస్కర్, న్యాయవాదిరామోజీ కుటుంబం బాధ్యత వహించాల్సిందే మార్గదర్శి అక్రమాలు నిరూపితమయ్యాయి. హెచ్యూఎఫ్ కర్త రామోజీరావు ప్రస్తుతం లేకున్నా సరే ఆ హెచ్యూఎఫ్లోని ఇతర సభ్యులు బాధ్యత వహించాల్సిందే. వసూలు చేసిన డిపాజిట్లకు కనీసం పదిరెట్లు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఇతరత్రా శిక్షలకు రామోజీ కుటుంబ సభ్యులు అర్హులు. కోటంరాజు వెంకటేశ్ శర్మ, న్యాయవాది, విజయవాడ సొంత ఆడిట్ కుదరదు∙ నిజాలు నిగ్గు తేలాల్సిందే ∙ మార్గదర్శికి స్పష్టంచేసిన సుప్రీం మార్గదర్శి అక్రమ డిపాజిట్ల బాగోతాన్ని కప్పిపుచ్చుకునేందుకు అప్పట్లో చెరుకూరి రామోజీరావు చేయని కుతంత్రం లేదు... ఎంతగా అంటే ‘అక్రమంగా సేకరించిన డిపాజిట్ల సొమ్మును డిపాజిట్దారులకు చెల్లించేశాం... ఆ విషయాన్ని మా ఆడిటర్లు లెక్క తేల్చేసి నివేదిక ఇచ్చారు’అంటూ కనికట్టు చేసేందుకు యతి్నంచారు. కానీ, ఆ కుతంత్రాన్ని సుప్రీంకోర్టు ఈ ఏడాది ఏప్రిల్లోనే తిప్పికొట్టింది. ‘నేరం నాదే... దర్యాప్తు నాదే... తీర్పు నాదే’ అంటే కుదరదు అని తేల్చిచెప్పింది. డిపాజిట్దారులకు తిరిగి చెల్లించారో... లేదో... నిర్దారించాల్సిందిగా మార్గదర్శి ఆడిటర్లు కాదు... రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అని విస్పష్టంగా ప్రకటించింది. డిపాజిట్లు చెల్లించేశాం...మా ఆడిటర్లులెక్క తేల్చేశారు.. సుప్రీంకోర్టులో రామోజీ వితండవాదం రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు విరుద్ధంగా రూ.2,610.38కోట్ల అక్రమ డిపాజిట్లు సేకరించిన కేసులో చెరుకూరి రామోజీరావు సుప్రీంకోర్టులో అడ్డగోలు వాదనలతో కనికట్టు చేయాలని యతి్నంచారు. తాము అక్రమంగా సేకరించిన డిపాజిట్ల మొత్తాన్ని సంబంధిత డిపాజిట్దారులకు చెల్లించేశామని ఆయన తరఫు న్యాయవాదులు వాదించారు. మొత్తం రూ.2,610.38 కోట్ల అక్రమ డిపాజిట్లలో 2023, జూన్ 30నాటికి 1,247మంది డిపాజిట్దారులకు తిరిగి చెల్లించేశామని చెప్పారు. కేవలం రూ.5.31కోట్లు మాత్రమే క్లెయిమ్ చేయని డిపాజిట్లు ఉన్నాయని తెలిపారు. ఈ విషయాన్ని మార్గదర్శి ఫైనాన్సియర్స్ ఆడిటర్లు పూర్తిగా ఆడిట్ చేసి నివేదిక సమరి్పంచారని... అన్ని లెక్కలు సరిపోయాయని కూడా చెప్పుకొచ్చారు. కాబట్టి మార్గదర్శి ఫైనాన్సియర్స్ డిపాజిట్దారులు, వారికి చెల్లింపుల వివరాలను వెల్లడించాల్సిన అవసరం లేదని వితండవాదం చేశారు.అదేం కుదరదు.. డిపాజిట్ల నిగ్గు తేలాల్సిందే – స్పష్టంచేసిన సుప్రీంకోర్టు రామోజీరావు తరఫు న్యాయవాదుల వాదనలను ఏప్రిల్లోనే సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. ‘డిపాజిట్దారులకు తిరిగి చెల్లించేశామని మీరు చెబితే... మీ దగ్గర పని చేసే ఆడిటర్లు నివేదిక ఇస్తే సరిపోదు. ఆ నివేదికను పరిగణలోకి తీసుకోము’ అని స్పష్టం చేసింది. ఎందుకంటే రూ.5వేలు డిపాజిట్చేసిన వ్యక్తి తనకు న్యాయం జరగలేదని న్యాయస్థానాన్ని ఆశ్రయించలేరు.. అంతటి వ్యయ ప్రయాసలు భరించలేరు కదా అని కూడా వ్యాఖ్యానించింది. అందుకే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు ఉండవల్లి అరుణ్కుమార్ను కూడా పారీ్టగా చేరుస్తూ ఈ కేసును తెలంగాణ న్యాయస్థానం విచారించాలని తీర్పునిచి్చంది. డిపాజిట్లు తిరిగి చెల్లించినది.. లేనిది పరిశీలించేందుకు ఓ జ్యుడిíÙయల్ అధికారిని నియమించాలని కూడా తెలంగాణ హైకోర్టును ఆదేశించింది. మొత్తం విచారణ ప్రక్రియను ఆరు నెలల్లో పూర్తి చేయాలని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది. -
శ్రీరాంపురంలో దివంగత నేత YSR విగ్రహం ధ్వంసం
-
శ్రీరాంపురంలో దివంగత నేత YSR విగ్రహం ధ్వంసం
-
ఇదేం రూల్?.. విశాఖ ఎలక్షన్ కోడ్లో అధికారుల ఓవరాక్షన్
విశాఖపట్నం, సాక్షి: విశాఖపట్నంలో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో అధికారులు వైఎస్సార్ విగ్రహాలకు ముసుగు వేశారు. కానీ, ఎన్టీఆర్ విగ్రహాలకు మాత్రం ముసుగు వేయకుండా వదిలేశారు. అంతే కాకుండా కూటమి నేతల ఫ్లెక్సీలను తొలగించకుండా వదిలిపెట్టారు. విశాఖ నగరంలో ఎక్కడికక్కడ కూటమి నాయకుల ఫ్లెక్సీలు దర్శనం ఇస్తున్నాయి.అధికార పార్టీ నేతలు ఒత్తిడితోనే వైఎస్సార్ విగ్రహాలకు ముసుగు వేశారని ఆరోపణలు వస్తున్నాయి. కూటమి నేతల ఫ్లెక్సీలు వదిలివేయడంపై వైఎస్సార్సీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. రాజకీయ నాయకుల ఫ్లెక్సీలు, బ్యానర్లు తొలగించాలని అధికారులకు కలెక్టర్ ఆదేశాలు ఇచ్చినా ఉద్యోగులు లెక్క చేయకపోవటం గమనార్హం. ఇక.. ఉద్యోగుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. -
TG: అసెంబ్లీలో వైఎస్ఆర్ను పొగిడిన అక్బరుద్దీన్
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డిని ఎంఐఎం శాసనసభాపక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ పొగిడారు. బడ్జెట్లో సోమవారం(జులై 29) బడ్జెట్పై మాట్లాడిన సందర్భంగా ఒవైసీ వైఎస్ఆర్ను గుర్తుచేసుకున్నారు. ముస్లింలకు రిజర్వేషన్ విషయంలో వైఎస్ఆర్ న్యాయం చేశారని కొనియాడారు.ఐదు శాతం రిజర్వేషన్ ఇచ్చి మైనార్టీల మదిలో వైఎస్ఆర్ చిరస్థాయిగా నిలిచిపోయారని చెప్పారు. వైఎస్ఆర్ లేకపోతే రిజర్వేషన్ల అంశంలో తమకు అన్యాయం జరిగేదన్నారు. మాజీ సీఎం కేసీఆర్ మైనారిటీ విద్యార్థుల స్కాలర్షిప్ విషయంలో సాయం చేశారని గుర్తుచేశారు. ఎవరు న్యాయం చేసినా వాళ్ల గురించి మొహమాటం లేకుండా చెప్తానన్నారు. -
YSRపై ప్రశంసలు
-
న్యూజెర్సీలో వైఎస్సార్ 75వ జయంతి వేడుకలు
-
నాన్ననంటే నొప్పి లేదు.. బాబు కోసం బయలుదేరావా తల్లీ..!
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఏమైంది?ఆమె పూర్తిగా బాలెన్స్ కోల్పోతున్నట్లు కనిపిస్తోంది. ఆమె టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కొంత ప్రత్యక్షంగా, మరికొంత పరోక్షంగా మద్దతు ఇస్తున్న తీరు రాజకీయంగా దివాళాకోరుతనాన్ని తెలియచేస్తుంది. చంద్రబాబును పొగిడితే పొగుడుకోవచ్చు. కాని తన అన్న ,మాజీ ముఖ్యమంత్రిని, వైఎస్సార్ కాంగ్రెస్ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడం పద్దతిగా లేదు. తాను తెలంగాణలో రాజకీయం చేస్తానంటూ బయల్దేరి ,చివరికి తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన వైనం సిగ్గుచేటైన విషయంగా ఆమె భావిస్తున్నట్లు లేదు.తెలంగాణ రాజకీయాలలో ఉండడానికి వీలు లేదని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరిమేసిన మాట నిజమా?కాదా?ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో మట్టి చేబూని ప్రమాణం చేసి ,ఈ గడ్డపైనే రాజకీయం చేస్తానని చెప్పారా? లేదా? కాని ఆ తర్వాత నాలుక మడతేసి అక్కడ నుంచి ఎందుకు వచ్చారో ప్రజలకు తెలియదా? ఆమె ఆత్మకు తెలియదా? దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతిష్టకు భంగం కలిగించేలా ఆయన ప్రత్యర్దులతో చేతులు కలిపి ఆమె ఆంధ్ర రాజకీయాలలోకి ఎంటర్ అయిన విషయం అబద్దమా?ఆమెకు టీడీపీ మీడియా ప్రముఖుడు సలహాలు ఇచ్చే మాట నిజం కాదా? కర్నాటక కాంగ్రెస్ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ తో చంద్రబాబు నాయుడు జరిపిన మంతనాలు దేనికోసమో తెలియదా? తన అన్నపై పెట్టిన అక్రమ కేసులలో తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును కూడా చేర్చడం ద్వారా కాంగ్రెస్ అవమానకరంగా వ్యవహరిస్తే, తగుదునమ్మా ..అంటూ అదే పార్టీలో చేరి ఆయన ఆత్మకు శాంతి లేకుండా చేసిన చరిత్రను షర్మిల సొంతం చేసుకున్నట్లు అనిపిస్తుంది. కేసులు పెట్టడం, ఆ చార్జీషీట్లలో రాజశేఖరరెడ్డి పేరు ప్రస్తావించడం తప్పు అని కాంగ్రెస్ అధిష్టానం చెబితే,అప్పుడు ఆమె ఆ పార్టీలో చేరితే ఫర్వాలేదు. కాని వైఎస్సార్కు ప్రజలలో ఉన్న అభిమానంలో వాటాను పొందే దురుద్దేశంతో షర్మిలను కేవలం ఒక పావుగానే కాంగ్రెస్ వాడుకుంటున్న విషయం తెలియనిదా?ఇదే కాంగ్రెస్ ను ఆమె ఎంత తీవ్రంగా గతంలో విమర్శించారో గుర్తు లేదా? పైగా రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే తన లక్ష్యమని వైఎస్సార్ అనేవారని, అందుకే కాంగ్రెస్ లో చేరారని ఆమె బొంకినంత మాత్రాన జనం నమ్ముతారా? కడప జిల్లాలో ఓటమి ఎరుగని వైఎస్ ఆర్ కుటుంబం నుంచి పోటీచేసి షర్మిల ఓటమిపాలై అపకీర్తి పొందారా?లేదా? రాజకీయాల కన్నా ఇంటిలో ఉన్న తగాదాలను రోడ్డుమీదకు తెచ్చి అందరి పరువు తీయడానికి వెనుకాడని షర్మిల మనస్తత్వం అర్ధం అవుతూనే ఉంది. టీడీపీతో కాంగ్రెస్ మాచ్ ఫిక్సింగ్ ఉందో ,లేదో కాంగ్రెస్ నేతలు ఎవరిని అడిగినా తెలుస్తుంది.ఒకప్పుడు వైఎస్సార్ మరణంపై దారుణమైన వ్యాఖ్యలు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఏపీకి తీసుకువెళ్లి సభ పెడితే వైఎస్సార్ కు నివాళి అర్పించినట్లే అవుతుందా?ఇదే రేవంత్ రెడ్డిని గతంలో షర్మిల ఏమని నిందించారో గుర్తు లేదా?కడప ఉప ఎన్నిక జరిగితే ఆయన వచ్చి గల్లి,గల్లీ తిరుగుతానని అంటే ప్రజలు పిచ్చివాళ్లా? షర్మిల సీఎం అవుతారని రేవంత్ ప్రకటిస్తే నిజమేనని పొంగిపోతే అంతకన్నా తెలివితక్కువతనం ఉంటుందా? షర్మిల కాంగ్రెస్ సీఎం. అవుతారని రేవంత్ అనడంతో ఉబ్బితబ్బిబ్బు అవుతున్నారు కాని, ఆయన కేవలం టీడీపీకి ఉపయోగపడడానికే అలా అంటున్నారని ఆమెకు అర్ధం కాకపోవచ్చు. ఆంధ్ర రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం మృత పార్టీగానే ఉందని చెప్పక తప్పదు. అది కోలుకుంటుందా?అన్నది తేలడానికి ఇంకా చాలా సమయం పడుతుంది. ఆ కాంగ్రెస్ కు షర్మిల నాయకత్వం వహించినందున వైఎస్ ఆర్ కాంగ్రెస్ వారు కొందరైనా వస్తారన్న ఆశ ఉండవచ్చు.గత ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపీలో టిక్కెట్ రాని కొంతమంది కాంగ్రెస్ లో చేరినా వారికి ఎలాంటి ఫలితం వచ్చిందో అందరికి తెలుసు. షర్మిల ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అధికారంలో ఉన్న చంద్రబాబుపై కన్నా విపక్షంలో ఉన్న జగన్ పైనే ఎక్కువ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉంది.దానిని బట్టే ఆమె లక్ష్యం తెలిసిపోతుంది. ఏపీలో ఒకవైపు బీజేపీతో ప్రత్యక్ష పొత్తు పెట్టుకుని, మరో వైపు కాంగ్రెస్ తో పరోక్ష పొత్తును పెట్టుకుని చంద్రబాబు తనదైన శైలిలో రాజకీయం చేశారా?లేదా? వైఎస్సార్సీపీ ఓట్లు ఒకటి,రెండు శాతం చీలినా తనకు రాజకీయంగా ఉపయోగమని చంద్రబాబు పన్నిన వ్యూహంలో షర్మిల కూడా ఒక పావు మాత్రమేనని రాజకీయవర్గాలలో బహిరంగ రహస్యమే.అదే ధోరణి ఇప్పటికీ షర్మిల కొనసాగిస్తున్నారు. బీజేపీకి వైఎస్సార్సీపీ మద్దతు ఇస్తున్నదంటూ చేసిన వ్యాఖ్య అర్ధరహితం. వైఎస్సార్సీపీ బీజేపీతో పొత్తు పెట్టుకోలేదు. కాని అంశాలవారీగా సపోర్టు చేసే విషయాన్ని రహస్యంగా చేయడం లేదు. షర్మిల మీడియాతో మాట్లాడుతూ చెప్పిన కొన్ని అసత్యాలు చూడండి. ఆమె సాక్షిని నడుపుతున్న జగన్ ను ప్రశ్నిస్తున్నారట. ఇందులోనే ఆమె ఎంత ద్వేషం వెళ్లగక్కుతోంది కనబడుతూనే ఉంది. ఆయన నలభై శాతం ఓట్లు తెచ్చుకున్న వైఎస్సార్సీపీ అధినేత. ఐదేళ్లపాటు ఏపీకి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి. ఆయనను ఉద్దేశించిన తీరు కచ్చితంగా ఆమెలో అక్కసు తెలియచేస్తుంది. ఎంతమంది బిడ్డలు ఉంటే అందరికి అమ్మ ఒడి పధకం అమలు చేస్తామని జగన్ 2019లో హామీ ఇచ్చారని ఆమె చెబుతున్నారు. అది పచ్చి అబద్దం . వైఎస్సార్సీపీ అమ్మ ఒడి స్కీమ్ కింద పిల్లల చదువుల నిమిత్తం తల్లికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పింది. ఆ మేరకు అమలు చేసింది. తెలుగుదేశం పార్టీ ,జనసేన పార్టీ కలిసి మానిఫెస్టో విడుదల చేసి ప్రతి కుటుంబంలో ఎందరు పిల్లలు ఉంటే అందరికి తల్లికి వందనం పేరుతో ఒక్కొక్క విద్యార్ధికి పదిహేను వేల రూపాయలు చొప్పున అందచేస్తామని ప్రకటించాయి. కాని ఇప్పుడు అలా చేయకుండా మడమ తిప్పుతున్నారు.అలా మోసం చేస్తున్నదన్న విమర్శను ప్రజలు టీడీపీపై చేస్తుంటే షర్మిల ఆ పార్టీని, చంద్రబాబును కాపాడడానికి జగన్ పై అబద్దపు ఆరోపణలతో రంగంలోకి దిగినట్లు అనిపిస్తుంది. తల్లికి వందనం స్కీము పై చంద్రబాబు క్లారిటీ ఇవ్వాలని అన్నారు తప్ప, ఏపీ ప్రజలను టీడీపీ మోసం చేస్తోందని కాంగ్రెస్ నేతగా షర్మిల చెప్పలేకపోవడంలోని ఆంతర్యం ప్రజలు అర్దం చేసుకోలేరా?మొక్కుబడిగా బస్ లలో మహిళల ఉచిత ప్రయాణం గురించి టీడీపీని ప్రశ్నించారు . ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయల చొప్పున ఇస్తామన్న స్కీమ్ గురించికాని, మూడు గ్యాస్ బండల పంపిణీ .నిరుద్యోగ భృతి, వలంటీర్లకు పదివేల రూపాయల గౌరవ వేతనం, రైతు భరోసా ఇరవై వేల రూపాయలు వంటి హామీల గురించి చంద్రబాబును నిలదీయవలసి కాంగ్రెస్ అద్యక్షురాలు , ఆ పని చేయకుండా విపక్షంలో ఉన్న వైఎస్సార్సీపీని ప్రశ్నించడం విడ్డూరంగానే కనిపిస్తుంది. వైఎస్సార్ విగ్రహాల ద్వంసంపై ఇన్నాళ్లకు కొద్దిగా స్పందిస్తూ, ఇంకోసారి విగ్రహాలను పగలకొడితే ఊరుకోం అని ఆమె అన్నారు. అంటే ఇన్నాళ్లూ చేసిన విద్వంసాన్ని ఆమె తప్పు పట్టడం లేదనుకోవాలి. కనీసం అలా విగ్రహాలను ధ్వంసం చేసినవారిపై కేసులు పెట్టాలని కూడా ఆమె డిమాండ్ చేయడం లేదు.అది తండ్రిపై ఆమెకు ఉన్న ప్రేమ. టీడీపీకి కాంగ్రెస్ తోకపార్టీ కాదని ఆమె అంటున్నారు.మంచిదే. ఆ విషయాన్ని ఆచరణలో చూపించాలి కదా? టీడీపీవారి స్క్రిప్ట్ ప్రకారం వైఎస్సార్సీపీపై విమర్శలు చేస్తే ఎవరైనా ఏమంటారు?తమలపాకుతో టీడీపీని, తలుపుచెక్కతో వైఎస్సార్సీపీని కొట్టినట్లుగా విమర్శలు చేయడం ద్వారానే షర్మిల తన మనోగతాన్ని తెలియచేస్తున్నట్లు కనిపిస్తుంది. మరో కొత్త ప్రచారాన్ని ఆమె తెరపైకి తీసుకురావడం ద్వారా తాను చంద్రబాబు మద్దతుదారునని చెప్పకనే చెప్పారు. ఈ ఎన్నికలు చంద్రబాబు సీఎం.కావాలా? వద్దా?అన్న కోణంలో జరిగాయట.చంద్రబాబుకు అనుభవం ఉందట. సమర్దుడు అని ప్రజలు అవకాశం ఇచ్చారని ఆమె సర్టిఫికెట్ ఇచ్చారు.ఒకనెల రోజుల క్రితం ఈమెనే ఈ ఎన్నికలు జగన్ పై జరిగినవని అన్న సంగతి మర్చిపోయి ఉంటారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీకి ఆమె పరోక్ష మద్దతు ఇస్తున్నారు.అదే టైమ్ లో టీడీపీ, జనసేన,బీజేపీ కూటమితో పోరాడిన వైఎస్సార్సీపీ ని బీజేపీ తోకపార్టీ అని షర్మిల అనడం చిత్రంగానే ఉంది.వైఎస్ ఆర్ కాంగ్రెస్ కు, వైఎస్ రాజశేఖరరెడ్డికి సంబంధం లేదట. ఇక్కడ సంబంధం గురించిన ప్రశ్న కాదు. వైఎస్సార్ మరణం తర్వాత ప్రజలలో ఆయన స్మృతిని నిలబెట్టింది..ప్రజలలో ఆయన పట్ల ఉన్న ఆదరణను బహిర్గతం చేసింది జగన్ అన్న ది ఆమెకు తెలియదా?ఏ తండ్రికి ఏ కొడుకు ఇవ్వలేనంతగా గొప్ప నివాళి అర్పించిన ఘనత జగన్ ది కాదా! జగన్ తన ప్రభుత్వంలో ఎన్ని స్కీములకు వైఎస్ ఆర్ పేరు పెట్టింది షర్మిలకు తెలియదా? హెల్త్ యూనివర్శిటీకి సైతం వైఎస్ ఆర్ పేరు పెట్టారు. టీడీపీ అధికారంలోకి రావడంతోనే కొందరు టీడీపీ కార్యకర్తలు యూనివర్శిటీ గోడకు ఉన్న వైఎస్ ఆర్ పేరును అవమానకరంగా తొలగిస్తే కనీసం ఖండించని షర్మిల ఆయనకు వారసురాలు అవుతుందట. వైఎస్సార్ పేరుతో ఉన్నదాదాపు అన్నిటిని మార్చేసిన టీడీపీని ఒక్క మాట అనకపోవడం ఆమె విజ్ఞత. వైఎస్సార్ మరణం తర్వాత ఆయనను అవమానించిన కాంగ్రెస్ లో చేరిన షర్మిల టీడీపీకి సేవ చేస్తున్నారన్న విమర్శను ఎదుర్కుంటున్నారు.ఏది ఏమైనా షర్మిల తన తండ్రి మాదిరి ఫెయిర్ రాజకీయం చేసి పేరు తెచ్చుకుంటారా?లేక కుట్ర రాజకీయంలో భాగం అయి తన అన్నపై అక్కసు తీర్చుకుంటారా?అన్నది ఆమె తేల్చుకోవాలి! – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
డల్లాస్లో ఘనంగా మహానేత వైఎస్సార్ 75వ జయంతి వేడుకలు
దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్. రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలు అమెరికాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూఎస్ఏ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. డల్లాస్ లోని బసేరా ఇండియన్ క్యూసిన్లో జరిగిన వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలకు ఎన్ఆర్ఐలు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. కొవ్వొత్తులు వెలిగించి, వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన ఆంద్రప్రదేశ్ ప్రజలకు స్వర్ణయుగంలాంటిదని వారు అభిప్రాయపడ్డారు. తెలుగు ప్రజలకు వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన సేవలు, పేదల పట్ల ఆయన కనబరిచిన ప్రత్యేక శ్రద్ధను ప్రస్తావించారు. తండ్రికి తగ్గ తనయుడిగా వైఎస్ జగన్ అనేక సంక్షేమ పథకాలను చేపట్టారని ఈ సందర్భంగా కొనియాడారు. -
వైఎస్ఆర్ పాదాల చెంతకు సోనియా, రాహుల్ గాంధీ?
-
ప్రజల పక్షాన పోరాటానికి ఎప్పుడూ సిద్ధమే: సజ్జల రామకృష్ణారెడ్డి
సాక్షి, అమరావతి: ప్రజల పక్షాన పోరాటానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టంచేశారు. సమకాలీన చరిత్రను మనం ప్రత్యక్షంగా చూశామని, ఆ సంక్షోభం, ప్రజల కష్టాల్లో నుంచి పుట్టిందే వైఎస్సార్సీపీ అని గుర్తుచేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద సోమవారం దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతిని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. వైఎస్సార్ రక్తం పంచుకున్న బిడ్డగానే కాకుండా ఆయన ఆశయాలకు వారసుడిగా వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పోరాటాల మధ్యనే ఈ పార్టీని ప్రారంభించారని గుర్తుచేశారు. ఆ రోజు నుంచి కోట్ల మందికి జగన్ ఆశాదీపం అయ్యారన్నారు. వైఎస్సార్కి మించి అడుగులు ముందుకు వేసే బిడ్డగా జగన్ ఈ రాష్ట్రానికి 30 ఏళ్లలో జరగాల్సిన అభివృద్ధిని తన ఐదేళ్ల పాలనా కాలంలో అందరూ గర్వపడేలా చేసి చూపించారన్నారు. వైఎస్సార్ ఆశయ సాధన కోసం జగన్ ఎంతో కృషిచేస్తున్నారన్నారు. సజ్జల ఇంకా ఏమన్నారంటే...విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు..రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలను అమలుచేశాం. ఎన్నికల్లో ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం. అసాధ్యమైన హామీలతో ప్రత్యర్థులు అందలమెక్కారు. హామీలిచ్చి మోసం చేయటం, ప్రజలను భ్రమల్లో ఉంచటం వైఎస్ జగన్కి చేతకాదు. కులం, మతం, ప్రాంతం, రాజకీయాలతో పనిలేకుండా ఆయన పాలించారు. విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. ఇళ్ల ముంగిటకే ఆయన పరిపాలన అందించారు. ప్రజల్లో మమేకమైన పార్టీగా మన ప్రయాణం అనంతం. అది ఆగిపోదు. ఎన్నికల ఫలితాలపై అనుమానాలున్నా లోతుకుపోవటం సరైంది కాదు. మరోసారి మోసానికి బాబు శ్రీకారం..ఇక అధికారంలోకి వచ్చి నెల దాటిందో లేదో ఇచ్చిన హామీలు ఇప్పట్లో నెరవేర్చటం కష్టమని అప్పుడే చంద్రబాబు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసి కూడా ప్రజల్ని మోసం చేసి ఎన్నికల్లో గెలిచేందుకు ఆయన అలవిగాని హామీలిచ్చారు. ఆసాధ్యమైన హామీలిచ్చి 2014లో ప్రజలను ఎలా మోసం చేశారో ఇప్పుడు ఆదే రీతిలో మరోసారి మోసానికి బాబు శ్రీకారం చుట్టారు. ఖజానా ఇంత ఖాళీ అయి ఉంటుంది అనుకోలేదని అప్పుడే చంద్రబాబు అంటున్నారు. ఖజానా బాగాలేదు కాబట్టి హామీలు నెరవేర్చటం కష్టమని ఆయన చెప్పకనే చెబుతున్నారు. ఇది అత్యంత మోసం, దగా.రాష్ట్రం రావణకాష్టం..అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి రాష్ట్రంలో ఎలా ఆరాచకం సృష్టిస్తున్నారో చూస్తున్నాం. రాష్ట్రాన్ని ఎలా రావణకాష్టం చేస్తున్నారో, ఎలా దాడులు చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారు. సామాన్యులు తిరగలేని పరిస్థితి తీసుకొచ్చారు. ఐదేళ్లలో రూపుదిద్దుకున్న ఆరోగ్య, విద్యా వ్యవస్థలకు గండికొట్టడం ప్రారంభమైంది. వైద్యంలో స్పెషలిస్టు సేవలను నిర్వీర్యం చేస్తున్నారు. రాష్ట్రాన్ని మళ్లీ పదేళ్లు వెనక్కి తీసుకెళ్లేలా చంద్రబాబు చేస్తున్నారు. మన లోటుపాట్లు సరిదిద్దుకుని ముందుకెళ్దాం. మళ్లీ రాష్ట్రానికి పూర్వవైభవం తీసుకొద్దాం. బాబు తన గొయ్యి తానే తవ్వుకుంటున్నారు. రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లకుండా, ప్రజల దృష్టి మళ్లించేందుకు జగన్పైన, వైఎస్సార్సీపీపైన కూటమి నేతలు దాడిచేస్తున్నారు.తాను అమలుచేయాల్సిన హామీల నుంచి తప్పించుకోవాలని బాబు చూస్తున్నారు. అది జరగకుండా.. మనం ఎక్కడా డీలాపడకుండా కలిసికట్టుగా అడుగులు వేయాలి. ప్రజల పక్షాన నిలబడే పార్టీగా మనమంతా పునరంకితం అవుదామని శపథం చేద్దాం. ఇందుకు ఇంతకంటే మంచి రోజు, వైఎస్సార్ జయంతిని మించిన రోజులేదు. అనంతరం.. మాజీమంత్రి అంబటి రాంబాబు కూడా మాట్లాడారు.ఈ కార్యక్రమంలో.. మాజీమంత్రి జోగి రమేష్, నాయకులు పుత్తా ప్రతాప్రెడ్డి, అంబటి మురళీ, మలసాని మనోహర్రెడ్డి, చిల్లపల్లి మోహనరావు, బత్తుల బ్రహ్మానందరెడ్డి, చల్లా మధు, కొమ్మూరి కనకారావు, ఎ.నారాయణమూర్తి, బందెల కిరణ్రాజ్, న్యాయవాది కొమ్మసాని శ్రీనివాస్రెడ్డి, మహిళా నేతలు నారమల్లి పద్మ, రజనీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘అపర భగీరథుడు వైఎస్సార్’ పుస్తకాన్ని సజ్జల ఆవిష్కరించారు. పార్టీ కార్యాలయంలో సేవా కార్యక్రమాలు..ఇదిలా ఉంటే.. వైఎస్ జయంతి సందర్భంగా పుత్తా ప్రతాప్రెడ్డి ఏర్పాటుచేసిన భారీ కేక్ను సజ్జల రామకృష్ణారెడ్డి కట్ చేశారు. పేదలకు వస్త్ర, అన్నదానం నిర్వహించారు. వికలాంగులకు, వృద్ధులకు చేతి కర్రలను పంపిణీ చేశారు. తొలుత.. వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి అందరూ ఘనంగా నివాళులర్పించారు. -
సంక్షేమాభివృద్ధి సారథి వైఎస్సార్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమానంగా ముందుకు తీసుకెళ్తూ పరిపాలనలో సమానత్వాన్ని చాటుకుంటూ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుని పాలకుడంటే ఎలా ఉండాలో చాటిచెప్పిన మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అని ప్రజలు, అభిమానులు, వైఎస్సార్సీపీ శ్రేణులు కొనియాడారు. దివంగత వైఎస్ 75వ జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా సోమవారం ఘనంగా నివాళులర్పించారు. ‘జోహార్ వైఎస్సార్.. వైఎస్సార్ అమర్ రహే’ అంటూ వాడవాడలా నినదించారు.ఈ సందర్భంగా మహానేత అందించిన పథకాలను ప్రజలు గుర్తుచేసుకున్నారు. గ్రామ గ్రామాన, వాడవాడలా కేక్లు కట్చేసి, పేదలకు వస్త్ర, అన్నదానం చేసి మహానేతపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. రాష్ట్రంలో 26 జిల్లాలు, 175 నియోజకవర్గాల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు పండుగలా నిర్వహించారు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ సహా వివిధ రాష్ట్రాల్లో మహానేతకు ఘనంగా నివాళులర్పించారు. ఢిల్లీలోని పార్లమెంట్ ఆవరణలో ఉన్న వైఎస్సార్సీపీ కార్యాలయంలో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ తదితరులు కేక్ కట్చేసి వైఎస్సార్ చిత్రపటానికి నివాళులర్పించారు.ఇడుపులపాయలో..ఇక ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైఎస్ జగన్ తన తండ్రికి ఘన నివాళులర్పించారు. ఆయనతోపాటు వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి, కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మహానేతకు నివాళులర్పించారు. అలాగే, పామర్రు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కైలే అనిల్కుమార్ ఆధ్వర్యంలో వైఎస్సార్ విగ్రహాలకు భారీ పూలమాలలు వేసి నివాళులర్పించారు.విదేశాల్లోనూ ఘనంగా..వివిధ దేశాల్లోనూ ప్రవాసాంధ్రులు వైఎస్కు ఘనంగా నివాళులు అర్పించారు. అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, యూకే, జర్మనీ, దక్షిణాఫ్రికా, సింగపూర్, మలేసియా, ఒమన్, యూఏఈ, సౌదీ అరేబియా తదితర దేశాల్లో ప్రవాసాంధ్రులు, భారతీయులు వైఎస్సార్ సేవలను గుర్తుచేసుకున్నారు. మెల్బోర్న్లో వైఎస్సార్సీపీ ఆస్ట్రేలియా కన్వీనర్ చింతలచెరువు సూర్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో కేక్ను కట్ చేశారు. తెలుగు ప్రజల గుండెల్లో వైఎస్సార్: డాక్టర్ ప్రదీప్ చింతా తెలుగుజాతి ఉన్నంత వరకు తెలుగు ప్రజల హృదయాల్లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి పదిలంగా ఉంటారని వైఎస్సార్సీపీ యూకే కన్వీనర్ డాక్టర్ ప్రదీప్ చింతా తెలిపారు. పేదల దేవుడు వైఎస్సార్ అని, మనసున్న మారాజు వైఎస్సార్కు నీరాజనం పలుకుతున్నామన్నారు. ఇక యూకే టీం ఆధ్వర్యంలో నంద్యాలలోని పరివర్తన్ లైఫ్ సెంటర్లోనూ వైఎస్సార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పిల్లలకు మందులు, దుస్తులు, ఫ్రిజ్, మంచాలు, బెడ్స్ పంపిణీ చేసి అన్నదానం చేశారు. అలాగే, ఆయన కుటుంబసభ్యుల ఆధ్వర్యంలో వైఎస్సార్ జిల్లా ముద్దనూరులోని సాంఘిక సంక్షేమ హాస్టల్లో కేక్ కట్చేసి దుప్పట్లు పంపిణీ చేశారు. -
కాంగ్రెస్ నేతలకు వైఎస్ జయంతి కానుక
సాక్షి, హైదరాబాద్ : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కార్పొరేషన్ చైర్మన్ల ఉత్తర్వులు ఎట్టకేలకు విడుదలయ్యాయి. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖర్రెడ్డి జయంతి కానుకగా 34 మంది కాంగ్రెస్ నేతలను రాష్ట్రంలోని పలు కార్పొరేషన్లకు చైర్మన్లుగా అధికారికంగా నియమించారు. మరొకరిని వైస్చైర్మన్గా నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పేరిట మార్చి 15వ తేదీతో ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆయా చైర్మన్లు బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి రెండేళ్ల పాటు పదవిలో కొనసాగుతారని ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. అయితే లోక్సభ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడానికి ముందు మొత్తం 37 మంది కాంగ్రెస్ నేతలకు నామినేటెడ్ పదవులు లభించాయి. వీరిలో కొల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన జగదీశ్వరరావు తనకు నామినేటెడ్ పదవి వద్దనడంతో ఆయన పేరు అధికారిక జాబితాలో లేదని తెలుస్తోంది.ఆయన్ను ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఐడీసీ) చైర్మన్గా నియమిస్తున్నట్టు ప్రకటించగా, తాజా జాబితాలో ఆ పోస్టును ఖమ్మం జిల్లాకు చెందిన మువ్వా విజయ్బాబుకు కేటాయించారు. ఆయనకు గతంలో కేటాయించిన విద్యా, సంక్షేమ మౌలిక వసతుల అభివద్ధి సంస్థ (ఈడబ్ల్యూఐడీసీ) చైర్మన్ పదవిని ఎవరికీ కేటాయించలేదు. ఇక కరీంనగర్ జిల్లాకు చెందిన మహిళా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు నేరెళ్ల శారద పేరు కూడా అధికార జాబితాలో లేదు. ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్గా నియమిస్తున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో కమిషన్ల నియామకానికి గవర్నర్ నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంటుందని, అందుకే ఆమె పేరు పెండింగ్లో పెట్టారని గాం«దీభవన్ వర్గాలు చెబుతున్నాయి. గతంలో ప్రకటించిన జాబితాలో జ్ఞానేశ్వర్ ముదిరాజ్ కార్పొరేషన్ను మార్చారు. ఆయనకు గతంలో డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రకటించినా. ఆ పదవిని యాదవ సామాజికవర్గానికి చెందిన నేతలకు కట్టబెట్టాలన్న ఆలోచనతో జ్ఞానేశ్వర్ను ముదిరాజ్ కార్పొరేషన్కు మార్చారు. గిరిజన సహకార సంస్థ (జీసీసీ) చైర్మన్గా గతంలో కోటా్నక్ నాగును నియమించగా, ఆయన స్థానంలో కోటా్నక్ తిరుపతిని ప్రకటించారు. ఇక, సామాజికవర్గాల వారీగా పరిశీలిస్తే రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేతలకు 12, కమ్మలకు 3, వెలమలకు 1, ముస్లింలకు మూడు, ఆర్యవైశ్య, బ్రాహ్మణులకు ఒక్కోటి చొప్పున పదవులు లభించాయి.బీసీల్లో గౌడ్లకు 4, ముదిరాజ్లకు 2, మున్నూరుకాపులకు రెండు, వడ్డెర, పద్మశాలి, లింగాయత్లకు ఒక్కో పదవి లభించింది. ఎస్సీలకు 1, ఎస్టీలకు 3 కార్పొరేషన్లు ప్రకటించారు. కాగా, కార్పొరేషన్ చైర్మన్లను నియమిస్తూ అధికారికంగా ఉత్తర్వులు వచి్చన రోజే పలువురు బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటికే చాలా కాలం వేచి ఉన్నామని, ఇక ఉత్తర్వులు వచి్చన తర్వాత ఇంకా వేచి ఉండడం ఎందుకంటూ హడావుడిగా వెళ్లి తమ తమ కార్యాలయాల్లోని సీట్లలో ఆసీనులు కావడం గమనార్హం. -
సంక్షేమానికి మారుపేరు వైఎస్
సాక్షి,హైదరాబాద్: దేశంలో సంక్షేమం అంటే గుర్తుకు వచ్చే పేరు వై.ఎస్. రాజశేఖరరెడ్డి అని ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి కొనియాడారు. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు, నాయకులు వై.ఎస్. చేసిన సంక్షేమాన్ని అమలు చేస్తున్నారన్నారు. ఉమ్మడి రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి 75వ జయంతిని పురస్కరించుకొని గాంధీ భవన్లో సంస్మరణ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రేవంత్రెడ్డి మాట్లాడుతూ సంక్షేమంపై వై.ఎస్. చెరగని ముద్ర వేశారన్నారు.ఆయన హయాంలో జరిగిన అభివద్ధి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలోనూ ఉపయోగపడుతోందని చెప్పారు. ఎన్నికల్లో ఇచి్చన ఆరు గ్యారంటీల హామీలకు స్ఫూర్తి రాజశేఖరరెడ్డేనని పేర్కొన్నారు. మూసీ ప్రక్షాళన, మెట్రో రైల్, గోదావరి, కష్ణా జలాల వినియోగం, హైదరాబాద్లో పెట్టుబడులకు కూడా ఆయనే స్ఫూర్తి అని రేవంత్ కొనియాడారు. వై.ఎస్. స్ఫూర్తి ని తమ ప్రభుత్వం, పార్టీ కొనసాగిస్తుందన్నారు. ఆయన చేవెళ్ల నుంచి ఇచ్ఛాపురం వరకు చేసిన పాదయాత్రే రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు స్ఫూర్తినిచి్చందన్నారు. 2009లో రెండోసారి సీఎం అయ్యాక రాహుల్ గాం«దీని ప్రధానిని చేయాలని వై.ఎస్. చెప్పారని.. కానీ రాహుల్ ప్రధాని కాకుండానే ఆయన దూరమయ్యారని విచారం వ్యక్తం చేశారు. వై.ఎస్. స్ఫూర్తి తో దేశంలో కాంగ్రెస్ కార్యకర్తలంతా కొట్లాడి రాహుల్ను ప్రధాని చేయాలని రేవంత్ పిలుపునిచ్చారు. ఆయన అభిమానులంతా కాంగ్రెస్లోకి రావాలని కోరారు.వైఎస్ స్థానం సుస్థిరం: డిప్యూటీ సీఎం భట్టిఅభివద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో కోట్లాది మంది ప్రజల హదయాల్లో వై.ఎస్. స్థానం సుస్థిరంగా ఉందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆయన చేపట్టిన జలయజ్ఞం ఫలితంగానే నేడు సాగునీటి ప్రాజెక్టుల ద్వారా ప్రజానీకానికి మేలు జరుగుతోందన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, ఫీజు రీయింబర్స్మెంట్, రాజీవ్ ఆరోగ్యశ్రీ లాంటి ప్రతిష్టాత్మక పథకాలతో పేద, మధ్యతరగతి ప్రజలను వై.ఎస్. ఆదుకున్నారని చెప్పారు. తెలంగాణ వడివడిగా అభివద్ధివైపు అడుగులు వేయడానికి వై.ఎస్. వేసిన పునాదులే కారణమన్నారు. ఔటర్ రింగ్రోడ్డు, ఎయిర్పోర్టు, మౌలిక సదుపాయాల కల్పన ద్వారా నేడుహైదరాబాద్ను ప్రపంచపటంలో నిలిపారని కొనియాడారు. గాం«దీభవన్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.ప్రజాభవన్లో వైఎస్సార్ ఫొటో ఎగ్జిబిషన్ ప్రారంభించిన సీఎం లక్డీకాపూల్/పంజగుట్ట/బంజారాహిల్స్: మహానేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి ప్రజల గుండెల్లో భద్రంగా ఉన్నారని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. వై.ఎస్. భౌతికంగా ప్రజల మధ్య లేకున్నా ఆయన స్ఫూర్తి బతికే ఉంటుందన్నారు. వై.ఎస్. 75వ జయంతి వేడుకల్లో భాగంగా ఆయన జీవిత విశేషాలను తెలియజేస్తూ సోమవారం ప్రజాభవన్లో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను రేవంత్ ప్రారంభించారు.ఈ సందర్భంగా వై.ఎస్. ఫొటోలను ఆసక్తిగా తిలకించారు. అనంతరం పంజగుట్ట కూడలిలోని వై.ఎస్. విగ్రహానికి సీఎం రేవంత్ పూలమాల వేసి నివాళులరి్పంచారు. మరోవైపు బంజారాహిల్స్ రోడ్ నంబర్ 1/10లోని సిటీ సెంటర్ వద్ద ఉన్న వై.ఎస్. విగ్రహానికి డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నం ప్రభాకర్, వై.ఎస్. ఆప్తమిత్రుడు కేవీపీ, మేయర్ విజయలక్షి్మ, ఎమ్మెల్యే దానం నాగేందర్ ఘన నివాళులు అర్పించారు. -
పార్లమెంట్ ఆవరణలో వైఎస్సార్ విగ్రహం ఏర్పాటు చేయాలి
న్యూఢిల్లీ, సాక్షి: దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి 75వ జయంతి సందర్భంగా.. పార్లమెంట్ ఆవరణలో ఆయన విగ్రహం ఏర్పాటు చేయాలని వైఎస్సార్సీపీ కోరుతోంది. ఈ మేరకు లోక్సభ స్పీకర్కు విజ్ఞప్తి చేసింది. వైయస్సార్ విగ్రహాన్ని పార్లమెంట్ ఆవరణలో ప్రతిష్టించాలి. ప్రజానీకానికి ఆయన చేసిన సేవలు వారసత్వాన్ని కొనసాగించేందుకు ఇదే నిజమైన నివాళి. పేద ప్రజల అభ్యున్నతి, సామాజిక న్యాయం, సాధికారత కోసం వైఎస్ఆర్ తన జీవితాంతం పనిచేశారు అని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తన ఎక్స్ ఖాతా ద్వారా కోరారు. -
నిను మరువం రాజన్నా.. ఏపీలో వైఎస్సార్ 75వ జయంతి వేడుకలు (ఫొటోలు)
-
సిడ్నీలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు
-
వైఎస్సార్ 75వ జయంతి వేడుకలు
-
వైఎస్ఆర్ స్ఫూర్తితోనే భారత్ జోడో యాత్ర: రాహుల్ గాంధీ!
సాక్షి,న్యూఢిల్లీ: వైఎస్రాజశేఖర్రెడ్డి అసలు సిసలైన ప్రజా నాయకుడని లోక్సభ ప్రతిపక్షనేత రాహుల్గాంధీ కొనియాడారు. వైఎస్ఆర్ నుంచి తాను వ్యక్తిగతంగా ఎంతో నేర్చుకున్నట్లు చెప్పారు. తాను దేశవ్యాప్తంగా నిర్వహించిన భారత్ జోడో యాత్రకు వైఎస్ఆర్ పాదయాత్రే స్ఫూర్తి అని తెలిపారు. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా సోమవారం(జులై 8) నివాళి అర్పించిన రాహుల్గాంధీ ప్రత్యేాక వీడియో విడుదల చేశారు. ప్రజల కోసమే జీవించిన నాయకుడు రాజశేఖర్రెడ్డి అని కీర్తించారు. ఆయన బతికి ఉంటే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి వేరుగా ఉండేదన్నారు. కష్టాలు, కన్నీళ్లు ఉండేవి కావన్నారు. My humble tributes to former Chief Minister of Andhra Pradesh, YS Rajasekhara Reddy ji, on his 75th birth anniversary.A true leader of the masses, his grit, dedication, and commitment to the upliftment and empowerment of the people of Andhra Pradesh and India has been a guiding… pic.twitter.com/iuGVsmsW8g— Rahul Gandhi (@RahulGandhi) July 8, 2024 -
వైఎస్ఆర్ పై అంతులేని అభిమానం
-
నాన్నా.. మీ 75వ పుట్టిన రోజు మా అందరికీ పండుగ రోజు
-
సాక్షి ప్రధాన కార్యాలయంలో వైఎస్సార్ 75వ జయంతి వేడుకలు (ఫోటోలు)
-
"వైఎస్ఆర్ ఉంటే రాష్ట్రం మరోలా ఉండేది"
-
వైఎస్ఆర్ కు నివాళులర్పించిన గురుమూర్తి
-
ప్రజాభవన్ లో వైఎస్ఆర్ ఫోటో ఎగ్జిబిషన్
-
"అపర భగీరథుడు వై.యస్.ఆర్" పుస్తకావిష్కరణ
-
TG: వైఎస్సార్ జయంతి కానుక.. కాంగ్రెస్ నేతలకు కార్పొరేషన్ పదవులు
సాక్షి,హైదరాబాద్: మహానేత వైఎస్రాజశేఖర్రెడ్డి 75వ జయంతిని పురస్కరించుకుని సీఎం రేవంత్రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ నేతలకు కానుక అందించారు. తెలంగాణలో ఎప్పటినుంచో పెండింగ్లో ఉన్న కార్పొరేషన్ పదవుల పంపిణీ చేపట్టారు. చురుగ్గా పనిచేసిన మొత్తం 35 మంది నేతలకు వివిధ కార్పొరేషన్ల చైర్పర్సన్ పదవులను కట్టబెట్టారు.ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం(జులై 8) ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ కో ఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ కార్పొరేషన్ చైర్పర్సన్గా జంగారాఘవరెడ్డి, టీఎస్ఐఐసీ చైర్పర్సన్గా నిర్మలజగ్గారెడ్డి, సంగీత నాటక అకాడమీ చైర్పర్సన్గా అలేఖ్యపూజారి, సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు అవినాష్రెడ్డి అగ్రి ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు కాసుల బాలరాజు, స్టేట్ కో-ఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ కార్పొరేషన్కు మనాల మోహన్ రెడ్డి, వేర్హౌజ్ కార్పొరేషన్ లిమిటెడ్కు జ్ఞానేశ్వర్ ముదిరాజ్, ఫిషరీస్ కోపరేటివ్ కార్పొరేషన్కు మెట్టు సాయికుమార్ తదితరులను చైర్పర్సన్లుగా నియమించారు.ఏ పదవి ఎవరికి.. ఇక్కడ క్లిక్ చేయండి.. -
వైఎస్ ఆర్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన పెద్దిరెడ్డి
-
ఇప్పటికీ ప్రజల గుండెల్లో వైఎస్ఆర్
-
గిరిజనుల కులదైవం ఫోటోతో పాటు వైఎస్ఆర్ గారి ఫోటో..
-
తెలుగు జాతిని నడిపించిన మహోన్నత నేత వైఎస్సార్: భూమన
-
తుల గుండెల్లో రైతు బిడ్డగా YSR..
-
వ్యవసాయమంటే ప్రత్యేకమైన ప్రేమను చూపిన వైఎస్సార్
-
ఆస్ట్రేలియాలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు
-
KSR Live Show: YSR సంక్షేమ ముద్ర.. రాజ ముద్ర..
-
వైఎస్సార్ జయంతి: జనహృదయ నేతకు వైఎస్ జగన్ నివాళి (ఫోటోలు)
-
ఆ జ్ఞాపకం.. నా జీవితంలో మర్చిపోలేను..
-
ప్రజా సంక్షేమానికి డైరెక్షన్ వైఎస్ఆర్..
-
రాజన్నా.. ఈ నేల నిను మరవదన్నా.. వైఎస్సార్ పాదయాత్ర ఫోటోలు
-
శత్రువులు కూడా అభినందించే గొప్ప నాయకుడు వైఎస్సార్
-
చెప్పింది చేసిన అరుదైన నేత
వైఎస్ రాజశేఖర రెడ్డి వ్యక్తిత్వం ఎందరికో ఆదర్శం. రాజకీయాల్లో ఇచ్చిన మాటకు కట్టుబడిన వారిలో వైఎస్సార్ది మొదటి స్థానం. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు ప్రయత్నించారు. ఎప్పుడూ తెలుగువారి సంప్రదాయ పంచెకట్టులోనే కనిపించేవారు. వివిధ సందర్భాల్లో రాజకీయ ప్రత్యర్థులు ఎదురైనప్పుడు నవ్వుతూ పలకరించేవారు. ఆయన మాటలూ, చేతల్లో హుందాతనం తొణికిసలాడేది. ప్రజల జీవితాల్లో ఎన్నో మార్పులు తీసుకొచ్చేందుకు ప్రయత్నించిన ప్రజా నాయకుడాయన.రాజకీయాల్లో ప్రవేశించినప్పటి నుంచి అంతిమ ఘడియల వరకూ ఓటమి ఎరుగని నేత. తెలుగు ప్రజల గుండెల్లో వైఎస్సార్గా చిరస్థాయిగా నిలిచిన ఆయన పూర్తి పేరు యెడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి. నేటి వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో రాజారెడ్డి, జయమ్మ దంపతులకు 1949 జూలై 8న జన్మించారు. బళ్లారిలో పాఠశాల విద్యాభ్యాసం, తర్వాత విజయవాడ లయోలా కళాశాలలో పీయూసీ ఉత్తీర్ణులై, 1972లో గుల్బర్గా విశ్వవిద్యాలయంలో మెడిసిన్ చదివారు.తిరుపతి శ్రీ వేంకటేశ్వర వైద్య కళాశాల నుంచి హౌస్ సర్జెన్సీ పూర్తి చేసి వైద్య విద్యలో పట్టా అందుకున్నారు. తరువాత జమ్మలమడుగు క్యాంబెల్ ఆసుపత్రిలో వైద్యునిగా పేదలకు ఏడాది కాలం సేవలందించారు. తర్వాత కొంతకాలం జమ్మలమడుగులో వైద్యాధికారిగా పనిచేసి, అనంతరం తండ్రి రాజారెడ్డి పేరుతో 30 పడకల ఆసుపత్రి నిర్మించి, పేదలకు వైద్య సేవలు అందించి, రెండు రూపాయల డాక్టర్గా గుర్తింపు పొందారు.తండ్రి కోరిక మేరకు 1978లో తొలిసారి పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి, జనతాపార్టీ అభ్యర్థి నారాయణరెడ్డిపై 20 వేల 496 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి శాసన సభలో కాలు పెట్టినప్పటినుంచీ 2009 వరకు ఆయన పోటీ చేసిన అన్ని సార్లూ విజయం సాధించారు. 4 పర్యాయాలు పార్లమెంటు సభ్యుడిగా, 6 సార్లు ఎమ్మెల్యేగా, రెండు పర్యాయాలు పీసీసీ అధ్యక్షుడిగా, మూడు పర్యాయాలు సీఎల్పీ నేతగా, రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా, రాజకీయ నేతలకు మార్గదర్శకంగా నిలిచారు.పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకున్న వైఎస్సార్ 2004 మే 14న తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి, ఉచిత విద్యుత్, పెండింగ్లో ఉన్న విద్యుత్ బకాయిల రద్దుపై తొలి, మలి సంతకాలు చేశారు. అది మొదలు ఎన్నో ప్రజా ప్రయోజన పథకాలు ప్రవేశపెట్టి అమలు జరిపారు. ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం వంటివి ఆయనను చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయేలా చేశాయి.నిర్లక్ష్యం నీడలో ఉన్న కడప జిల్లాను 2004–09 కాలంలో సమగ్రాభివృద్ధి దిశగా పరుగులు పెట్టించారు. కడప మునిసిపాలిటీని కార్పొరేషన్గా, రాయచోటి, పులివెందుల, జమ్మలమడుగు, బద్వేలు, రాజంపేట మేజర్ పంచాయతీలను మునిసిపాలిటీలుగా రూపొందించారు. జిల్లాలో యోగి వేమన యూనివర్సిటీ, జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల, పశువైద్య విద్య కళాశాలను నెలకొల్పారు. జిల్లా కేంద్రంలో రిమ్స్ వైద్య కళాశాల, 750 పడకల రిమ్స్ ఆసుపత్రి, దంత వైద్యశాల, అలాగే ట్రిపుల్ ఐటీ నెలకొల్పారు. అనేక పరిశ్రమలు స్థాపింపజేశారు.ఆయన హయాంలో జలయజ్ఞంలో భాగంగా సుమారు రూ. 12 వేల కోట్లతో కడప జిల్లాలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను చేపట్టారు. గాలేరు–నగరి సుజల స్రవంతి, గండికోట కెనాల్, టన్నెల్, గండికోట వరదకాల్వ, గండికోట ఎత్తిపోతల పథకాలు వైఎస్ హయాంలో రూపొందించినవే. మైలవరం ఆధునికీకరణ, సర్వారాయ సాగర్, వామికొండ ప్రాజెక్టు, సీబీఆర్, పీబీసీ, వెలిగల్లు, తెలుగుగంగ ప్రాజెక్టు పనులు చకచకా సాగించారు. ఇంతలో 2009 సెప్టెంబర్ 2న సంభవించిన ఆయన అకాల మరణం రాష్ట్ర అభివృద్ధికి పెద్ద కుదుపయ్యింది. – నందిరాజు రాధాకృష్ణ, సీనియర్ జర్నలిస్ట్, 98481 28215 (నేడు వైఎస్సార్ 75వ జయంతి) -
వైఎస్సార్ కు నివాళులర్పించిన వైఎస్ జగన్
-
జనహృదయ విజేత
సమైక్య రాష్ట్రంలో అన్ని వర్గాల అభివృద్ధే ధ్యేయంగా కృషి చేసిన ఏకైక నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఆయన పేద ప్రజల్లో దైవంలా కొలువై నిలిచారు. అధికారాన్ని స్వప్రయోజనాలకు ఉపయోగించుకునే రాజకీయ నాయకులున్న రోజుల్లో... వైఎస్సార్ పేద ప్రజల బాగుకోసం దాన్ని ఉపయోగించారు. ‘ఆరోగ్యశ్రీ’ పథకం ద్వారా నిరుపేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. 108 అంబులెన్స్ సర్వీసులు ప్రారంభించారు.ఆ విధంగా ప్రభుత్వ వైద్యాన్ని పేదలకు దగ్గర చేశారు. పాదయాత్రలో రైతుల కష్టాలు చూసి చలించిపోయిన ఆయన దేశానికి వెన్నెముక వ్యవసాయమేనని బలంగా విశ్వసించి, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ‘జలయజ్ఞం’ ఆరంభించారు. ఆత్మహత్య చేసుకున్న రైతులకు అండగా నిలిచారు. ఆయన కాలంలోనే ఎన్నో విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణాలు జరిగాయి. రైతులకు ఉచిత విద్యుత్ అందించారు. ఏక కాలంలో లక్ష రూపాయల రుణమాఫీ చేసి రైతులకు అండగా నిలిచారు.దళిత, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి ఫీజు రీయింబర్స్మెంటు పథకాన్ని తీసుకువచ్చి ఇంజనీరింగ్, వైద్య విద్యలను అందించి అనేక మందిని ఇంజనీర్లుగా, వైద్యులుగా తీర్చిదిద్దారు. ప్రతి నిరుపేదకూ ‘ఇందిరమ్మ ఇల్లు’ పేరిట రాష్ట్రంలో లక్షల ఇళ్లను కట్టించి పేదవారి సొంతింటి కలను నిజం చేశారు. నిరుపేద ముస్లిం యువతకు విద్య, ఉద్యోగాల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించడం ఆయన తీసుకున్న విప్లవాత్మక నిర్ణయం. పండుటాకుల వంటి వృద్ధులకు పింఛన్ను క్రమం తప్పకుండా ఇచ్చి వారి ఆకలి తీర్చారు.ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు తాను రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత ‘రచ్చబండ’ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ కార్యక్రమానికి వెళ్తూ హెలికాప్టర్ ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ వార్త విని ఎందరో అభిమానుల గుండెలూ ఆగిపోయాయి. ఆయన భౌతికంగా లేకపోయినా సకల జనుల హృదయాల్లో ‘రాజన్న’గా ఆయన నిలిచే ఉన్నారు. – సంపత్ గడ్డం, కామారెడ్డి జిల్లా -
ఇడుపులపాయకు భారీగా తరలివచ్చిన YSR అభిమానులు
-
Watch Live: జన నేతకు వైఎస్ జగన్ నివాళి
-
వైఎస్ఆర్ రాజముద్ర
-
YSR Jayanthi: ఇడుపులపాయకు వైఎస్ జగన్
-
మహానేత వైఎస్సార్ 75వ జయంతి
-
వైఎస్ రాజశేఖరరెడ్డి మహోన్నత నాయకుడు... ఆయన లేరని ప్రతిరోజూ విచారిస్తూనే ఉన్నాం... సందేశం విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీశ.. ఇంకా ఇతర అప్డేట్స్
-
ఓటమి ఎరుగని ధీరుడు..
-
మహోన్నత నాయకత్వం
విలక్షణ నాయకుడు వై.ఎస్.ఆర్. విపక్షాలు సైతం కొనియాyì న వ్యక్తిత్వం ఆయనది! ఇచ్చిన మాట తప్పని నైజం. ‘పేదల కోసమే పాలన’ అన్నది ఆయన సిద్ధాంతం. అన్నదాతకు ఆపద్బాంధవుడు. విద్య, వైద్యం, ఉద్యోగం అందరికీ అందుబాటులోకి తెచ్చి, అసమానతలను రూపుమాపిన క్రాంతదర్శి. జన జీవితంతో ఆయన మమేకం అయ్యారు. జయాపజయాలకు అతీతంగా పాలన సాగించారు. ఏం చేసినా అది ప్రజల కోసమే! ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా అది ప్రజా సంక్షేమం కోసమే! తెలుగు నేలను సస్యశ్యామలం చేయటానికి జలయజ్ఞం తలపెట్టారు. విశ్వసనీయతే తన సైన్యంగా విమర్శలను తిప్పికొట్టారు. తెలుగు ప్రజల గుండె చప్పుడుగా ఆదర్శప్రాయుడైన ప్రజా నాయకుడిగా నిలబడ్డారు. నేడు ఆయన జయంతి.అధికారం కోసం వెన్నుపోటుకైనా వెనుకాడని నేతలుండొచ్చు. పదవి కోసం ఎలాంటి వంచనకైనా నిస్సిగ్గుగా సిద్ధపడే పార్టీలుండొచ్చు. కానీ జయాపజయాలతో సంబంధం లేకుండా, జన జీవితంతోనే పెనవేసుకున్న నాయకత్వాన్ని వైఎస్ రక్తంలోనే చూస్తాం. అందుకే వైఎస్ఆర్ అనే మూడక్షరాలు తెలుగువాడి గుండె గొంతుకయ్యాయి. దశాబ్దకాలం దాటినా వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనలోని పున్నమి వెలుగులే పేదవాడి చిరునవ్వుగా మారాయి. ఎంత పెద్ద ఆపదొచ్చినా పెద్దాయన ఉన్నాడనేది వైఎస్ పాలనలో ప్రజలకు ఉన్న నమ్మకం. మాటిస్తే మడమ తిప్పడనేది వైఎస్పై జనానికి ఉన్న విశ్వాసం. మేలు చేసేటప్పుడు వైఎస్ రాజకీయాలు చేయడనేది విపక్షాలే ఒప్పుకున్న నిజం. ఓ బ్యూరోక్రాట్గా నేను ఆయన్ని దగ్గర్నుంచీ చూశాను. ప్రజల కోసమే బతికిన విలక్షణ నాయకుడే వైఎస్ఆర్లో నాకు కన్పించాడు. కార్యకర్తలే కుటుంబం అనుకున్న గొప్ప వ్యక్తిత్వం వైఎస్లోనే చూశాను. దశాబ్దాల రాజకీయ అనుభవం కావచ్చేమో... ప్రజలకు ఏం కావాలో నిక్కచ్చిగా నిర్ణయించే సామర్థ్యం వైఎస్కే సొంతం. ఆయన పాలనలో ఎన్నో ఘటనలు... ఇంకెన్నో జ్ఞాపకాలు... మరెన్నో మరపురాని ఘట్టాలు..!విన్నాడు... ఉన్నానని ధైర్యమిచ్చాడు!పాదయాత్ర వైఎస్ను పూర్తిగా ప్రజల పక్షానికి చేర్చింది. ఊరూవాడా జనం గుండె చప్పుళ్ళు విన్నాడు. అప్పుడే ‘నేనున్నా’ననే భరోసా ఇచ్చాడు. వాళ్ళ కోసం ఏమైనా చేయాలనే పట్టుదల ఆయనలో బహుశా అప్పుడే మొదలైందేమో! పాలనలో అది స్పష్టంగా కన్పించింది. పేదవాడికి పెద్ద జబ్బొస్తే ఊపిరి పోవడమే వైఎస్ వచ్చే నాటికి ఉన్న పరిస్థితి. ముద్ద పెట్టే పొలం, తలదాచుకునే ఇల్లు అమ్మేసి వైద్యం చేయించుకునే దయనీయ పరిస్థితి అది. ఇది వైఎస్ మనసును చలించేలా చేసింది. సీఎంగా పగ్గాలు చేపట్టాక ఈ పరిస్థితే ఉండకూడదని ఆశించారు. చిన్న అర్జీ తీసుకొస్తే చాలు ఎన్ని లక్షలైనా వైద్యం కోసం ఇవ్వాలని ఆదేశించారు. ఇలా రోజుకు రూ. 1.20 కోట్లు ఖర్చయ్యేది. ఇదంతా ఖజానాకు భారం అని బ్యూరోక్రాట్స్ చెప్పబోతే వారించారాయన. ‘పేదవాడి ఆపద తీర్చలేకపోతే ఎందుకయ్యా? బేవరేజ్ మీద సెస్ 1 నుంచి 2 శాతానికి పెంచితే సరిపోదా?’ అంటూ తేలికగా చెప్పేవారు. పనుల్లో బిజీగా ఉండి, రాత్రి 8 గంటలకు ఇంటికొచ్చినా.. ‘సీఎం రిలీఫ్ ఫండ్ దరఖాస్తులన్నీ క్లియర్ అయ్యాయా?’ అని అడిగేవారు. పేదవాడిపై ఇంత ప్రేమ ఎంతమందికి ఉంటుంది? గ్రేట్ అన్పించేది. ఇలా ఎంతకాలం సీఎం ఆఫీసుకు పేదవాళ్ళు అర్జీలు పట్టుకుని రావాలి? శాశ్వత పరిష్కారం లేదా? వైఎస్ వేసిన ఈ ప్రశ్నల్లోంచే ‘ఆరోగ్య శ్రీ’ పథకం ఆవిర్భవించింది. దీనిపైనా విపక్షాలు విమర్శలు చేశాయి. విషయం ఏమిటంటే విమర్శించిన విపక్ష నేతలే ఈ పథకం ద్వారా లబ్ధి పొందడం! వాళ్ళే వైఎస్ తమకు ప్రాణ భిక్ష పెట్టారని చెప్పటం!తప్పు చేయను... ఏం చేసినా మీ కోసమే!ఇది వైఎస్ గట్టిగా నమ్మిన సిద్ధాంతం. జలయజ్ఞం పేరుతో భారీగా సాగునీటి ప్రాజెక్టులు చేపట్టారు. ప్రతీ ప్రాజెక్టుపైనా విపక్షాలు రాద్ధాంతం చేశాయి. ఈ నేపథ్యంలో ఆయన అనుసరించిన విధానం విపక్షాల నోటికి తాళం వేసింది. ప్రతీ ప్రాజెక్టు దగ్గరకు విపక్ష నేతలను పిలిపించి, వాస్తవాలు అర్థమయ్యేలా చెప్పే ఏర్పాటు చేయడం వైఎస్ విజ్ఞతకు నిలువుటద్దం. ‘‘నేను తప్పు చేయనయ్యా... ఏం చేసినా ప్రజలకోసమేనయ్యా...’’ అని వైఎస్ చెప్పిన ఈ మాటలను ప్రజలు విశ్వసించారు. కాలగర్భంలో కలిసిన పోలవరం ప్రాజెక్టుకు ఫౌండేషన్ వేసినా... పోతిరెడ్డిపాడుతో వరద జలాలు వాడుకునే ప్రయత్నం చేసినా ఆయనకు ప్రజాభిష్టమే లభించింది. ప్రాణహిత ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసినప్పుడు ‘ఇక మిమ్మల్ని విమర్శించలేను’ అంటూ జి. వెంకటస్వామి కృతజ్ఞతా పూర్వకంగా అనడం ఇప్పటికీ చాలామంది గుర్తు చేస్తారు. ఒక ప్రాంతం కాదు... ఒక పార్టీ కాదు... ప్రజలకు ఉపయోగపడేది ఏదైనా చేసి తీరాల్సిందే అనేది వైఎస్ సిద్ధాంతం. అద్భుతమైన తెలివితేటలుండీ ఆర్థిక ఇబ్బందులతో చదవలేని పేదలకు ఫీజు రీ–ఎంబర్స్మెంట్ తీసుకొచ్చిన వైఎస్ వల్ల... డాక్టర్లు, ఇంజనీర్లు అయిన పేదవాళ్ళున్నారు. అలా కొత్త వెలుగులు విరజిమ్ముతున్న జీవితాలు ఎన్నో! పేదవాడి నోటికాడికి ముద్ద చేర్చాలన్న లక్ష్యంతో రూ. 5.30 కిలో బియ్యం ధరను రూ. 2కు తగ్గించాలని భావించారు. దీన్ని బ్యూరోక్రాట్స్ వ్యతిరేకించారు. ‘‘మీ అభ్యంతరాలు మీరు చెప్పండి... కానీ ఇది అమలు చేయడం నా బాధ్యత’’ అంటూ... నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడ్డ గొప్ప వ్యక్తి వైఎస్ అనడం అతిశయోక్తేమీ కాదు.తిరుగులేని నిర్ణయాలువైఎస్ సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పుడు అంతర్జాతీయ పరిణామాల వల్ల మిర్చి ధర ఒక్కసారిగా పడిపోయింది. ఆ సమయంలో మిర్చి రైతుల ఆవేదన అంతా ఇంతా కాదు. జిల్లాల నుంచి అందిన ఈ సమాచారంతో వైఎస్ అప్పటికప్పుడే అధికారులను సమావేశపర్చారు. మార్కెట్లో రూ. 800 క్వింటాలున్న మిర్చిని, రూ.1500కు కొనాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ నిర్ణయంతో కొన్ని వేల మంది మిర్చి రైతుల కళ్ళల్లో ఆనందం చూశాం. ఇలాంటిదే మరో ఘటన. నిజామాబాద్లో రైతులు పండించే ఎర్ర జొన్నలు పంజాబ్, హర్యానాలకు సరఫరా అవుతాయి. వీటిని సేకరించే దళారులకు కేజీకి రూ. 12 వస్తే, రైతుకు వచ్చేది రూ. 4. రైతులకు ఎక్కువ ధర చెల్లించే ఓ దళారికి అవసరమైన బ్యాంకు లోన్ ఇప్పించడంలో అధికారులు కాదన్నా, వైఎస్ఆర్ నిర్ణయం తీసుకుని రైతులకు మేలు చేయడాన్ని ఇప్పటికీ అక్కడి రైతులు మరిచిపోరు. మరొక సందర్భం – వైఎస్ఆర్ హయాంలో దేశవ్యాప్తంగా గ్యాస్ ధరలు పెరిగాయి. ప్రతీ సిలిండర్కు రూ. 50 సబ్సిడీ ప్రకటించారు. రూ. 50 సబ్సిడీ ఇవ్వడం మామూలు విషయమేమీ కాదు. ఆర్థిక భారం పడుతుందని అధికారులు, ఆర్థిక మంత్రి చెప్పినా ‘ప్రతీ ఇంట్లో మేలు జరుగుతుంది కదా’ అని తన నిర్ణయంతో ముందుకు వెళ్లారు వైఎస్ఆర్. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు వేసేప్పుడు స్వపక్షం నుంచే అనేక రకాల ఒత్తిడి వచ్చింది. ఇవేవీ లెక్క చేయలేదు. 150 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డును అంత ధైర్యంగా చేపట్టడం వల్ల రాజధాని రూపురేఖలే మారాయి. హైదరాబాద్ విమానాశ్రయం పరిశీలనకు వెళ్ళినప్పుడు ఓ ముఖ్య విషయం ఆయన దృష్టికి వచ్చింది. విమానాల హబ్ ఏర్పాటు వల్ల అనేక రకాల అభివృద్ధి ఉంటుంది, దీనికి టాక్స్ను 14 నుంచి ఒక్క శాతానికి తగ్గించాలన్న విజ్ఞప్తి అది. అప్పటికప్పుడే ఆయన దానిపై అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల విమానాశ్రయం ఆర్థిక పురోగతే మారింది.విశ్వసనీయతే ఆయన సైన్యంఇంటిలిజెన్స్ కన్నా ముందే వైఎస్కు రాష్ట్రంలో ఏం జరుగుతోందో తెలిసేది. ఒకసారి గుంటూరు దగ్గర రైలు ప్రమాదం జరిగితే అధికారుల కన్నా ముందే ఆయన అప్రమత్తమయ్యారు. ఆయనే అందరికీ ఫోన్లు చేసి బాధితులకు అండగా ఉండమని చెప్పారు. ప్రతీ ఊళ్ళో ఆయనకు నెట్వర్క్ ఉండేది. ఏ జిల్లాకు వెళ్ళినా కనీసం 40 మంది కార్యకర్తలతో ఆయన విడిగా మాట్లాడేవారు. ఏ అర్ధరాత్రయినా ఆయనకు వాళ్ళు ఫోన్లు చేసేవాళ్ళు. విషయం చెప్పేవాళ్లు. ఆయన కూడా వినేవాడు. దీంతో కచ్చితమైన సమాచారం వచ్చేది. చుట్టూ ఉన్న కోటరీపై ఆయన ఎప్పుడూ ఆధారపడేవాడే కాదు. ఎంత పెద్ద ఆందోళన జరిగినా రైతులు, ప్రజలపై తుపాకులు ఎక్కు పెట్టొద్దని స్పష్టమైన సంకేతాలు ఇచ్చేవాడు. నిజామాబాద్లో ఎర్రజొన్నల వివాదం సందర్భంగా, ముదిగొండలో కాల్పుల సందర్భంగా... ‘రైతులకు ఏమైనా జరిగిందా?’ అంటూ ఆయన పడ్డ కంగారు మాటల్లో చెప్పలేనిది. విపక్ష నేతలను అసెంబ్లీలోనూ పేర్లు పెట్టి పిలిచే స్వతంత్రం... చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకున్నా– మళ్ళీ సెక్యులర్ మాటలు చెప్పినా తేలికగా కొట్టిపారేసే ధైర్యం... ఓడిపోయినా ప్రతీ క్షణం ప్రజా క్షేత్రంలోనే ఉండే గొప్ప నైజం... వైఎస్ ఉన్నతిని పెంచాయి. ఈనాటికీ ఏ నేతకూ లేని ప్రజాదరణను తెచ్చి పెట్టింది. వైఎస్ మన మధ్య లేకపోవచ్చు. సడలని విశ్వాసం... చెదిరిపోని ప్రజల కలల స్వప్నంలో పథకాల రూపంలో ఎప్పటికీ ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారు. కొప్పోలు ప్రభాకర్ రెడ్డి వ్యాసకర్త రిటైర్డ్ ఐఏఎస్ అధికారి(వై.ఎస్.ఆర్. సీఎంగా ఉన్నప్పుడు సీఎంవో కార్యదర్శి) -
వైఎస్సార్.. తెలుగు నేలపై చెరగని జ్ఞాపకం
ఆ పేరే ఒక స్ఫూర్తి వైఎస్ రాజశేఖరరెడ్డి.. వైఎస్సార్.. ఈ పేరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఓ భరోసా. అభివృద్ధికి, సంక్షేమానికి చిరునామా. అర్హతే ప్రామాణికంగా సంతృప్త స్థాయిలో పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందించిన మహనీయుడు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ను సరఫరా చేస్తూ.. రూ.1,100 కోట్ల సేద్యపు విద్యుత్ బకాయిలను రద్దు చేస్తూ ఫైలుపై సీఎంగా తొలి సంతకం చేసిన పాలకుడు. ఫీజు రీయింబర్స్మెంట్తో పేద విద్యార్థులను ఉన్నత విద్య చదివించిన విద్యా దాత. ఆరోగ్య శ్రీ పథకంలో నిరుపేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించిన ప్రాణ దాత. పంట పండినా.. ఎండినా నష్టపోమనే ధీమా రైతులకు కల్పించి.. వ్యవసాయాన్ని పండగలా మార్చిన రైతు బాంధవుడు. రూ.లక్ష కోట్ల వ్యయంతో 86 ప్రాజెక్టులను జలయజ్ఞం కింద చేపట్టి.. ఐదేళ్లలోలోనే 41 ప్రాజెక్టులను పూర్తి చేసి ఉమ్మడి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసిన మహా నేత. పారదర్శక పారిశ్రామిక విధానంతో పెట్టుబడులు వరదెత్తేలా చేసి.. ఉపాధి అవకాశాలను పుష్కలంగా కల్పించి.. 3 పోర్టులు నిర్మించి ఎగుమతులకు రాష్ట్రాన్ని కేంద్రంగా మార్చిన ప్రగతిశీలి. ఆర్థిక మాంద్యం ముప్పును ఎలా అధిగమించాలో చాటిచెప్పిన ఆర్థికవేత్త. సంక్షేమాభివృద్ధి పథకాలతో తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని జ్ఞాపకంగా నిలిచిన మహానేత.. పరిపాలనలో మానవత్వాన్ని జోడించి నవయుగానికి నాంది పలికిన మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కోట్లాది మంది హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. సంక్షేమం, అభివృద్ధికి మానవీయతను జోడించిన మహనీయుడు వైఎస్సార్సాక్షి, అమరావతి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా పనిచేసింది ఐదేళ్ల మూడు నెలలే. ఆ కొద్ది కాలంలోనే మనసుండాలే కానీ ప్రజలకు ఎంతో మేలు చేయొచ్చని చేతల్లో చూపించారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, పొదుపు సంఘాల మహిళలకు పావలా వడ్డీ రుణాలు, అర్హులందరికీ ఇళ్లు వంటి విప్లవాత్మక పథకాలు.. సాగునీటి ప్రాజెక్టులు, రహదారులు, పేదలకు పక్కా ఇళ్లు వంటి పథకాలతో సమగ్రాభివృద్ధి వైపు ఎలా పరుగెత్తించవచ్చో దేశానికే చాటిచెప్పారు. మహానేత మరణించి 15 ఏళ్లవుతున్నా ఇప్పటికీ ప్రజలు నమ్మలేకపోతున్నారు. వైఎస్సార్ అనే పదం వినగానే స్వచ్ఛమైన చిరునవ్వు మన కళ్ల ముందు సాక్షాత్కరిస్తుంది. నమస్తే అక్కయ్యా.. నమస్తే చెల్లెమ్మా.. నమస్తే తమ్ముడూ.. అని ఆప్యాయంగా పిలిచే పిలుపు మన చెవుల్లో ఎప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. అందుకే ఆయన చిరస్మరణీయుడు. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో 1949 జూలై 8న జన్మించిన వైఎస్ రాజశేఖరరెడ్డి వైద్య విద్యను అభ్యసించారు. పులివెందులలో ఆస్పత్రి నెలకొల్పి ఒక్క రూపాయికే వైద్యం చేసి రూపాయి డాక్టర్గా ప్రజల ప్రేమాభిమానాలు పొందారు. డాక్టర్గా ప్రజల నాడి తెలిసిన వైఎస్సార్ 1978లో రాజకీయ అరంగేట్రం నాటి నుంచి 2009 సెప్టెంబర్ 2న హెలికాఫ్టర్ ప్రమాదంలో హఠాన్మరణం చెందేవరకూ తన జీవితాన్ని ప్రజలకే అంకితం చేశారు. జీవచ్ఛవంలా మారిన కాంగ్రెస్కు జీవం అటు కేంద్రంలో.. ఇటు రాష్ట్రంలో వరుస ఓటములతో 2003 నాటికి కాంగ్రెస్ పార్టీ జీవచ్ఛవంలా మారింది. ఆ దశలో రాష్ట్రంలో పాదయాత్ర చేశారు వైఎస్ రాజశేఖరరెడ్డి. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి మండుటెండలో 2003 ఏప్రిల్ 9న ప్రజాప్రస్థానం పాదయాత్రను ప్రారంభించారు. 2003 జూన్ 15న శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వద్ద ముగించారు. మండుటెండలో 1,475 కిలోమీటర్ల వైఎస్సార్ పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. తన పాదయాత్రతో కాంగ్రెస్కు జీవం పోసి 2004లో ఇటు ఉమ్మడి రాష్ట్రంలోను, అటు కేంద్రంలో కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చారు. సంక్షేమం, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ, జలయజ్ఞం ప్రాజెక్టులతో, రైతు పథకాలతో వ్యవసాయాన్ని పండగలా మార్చి ప్రజారంజక పాలన అంటే ఏమిటో దేశానికి చూపించారు. పాదయాత్రలో ఇచి్చన హామీ మేరకు 2004 మే 14న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వేదికపై నుంచే వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా ఫైలుపై తొలి సంతకం చేసి రైతు రాజ్యానికి పునాది వేశారు. రూ.1,100 కోట్ల వ్యవసాయ విద్యుత్ బకాయిలను మాఫీ చేశారు. 35 లక్షలకు పైగా పంపు సెట్లకు ఉచిత విద్యుత్ను అందించారు. రూ.400 కోట్లతో మొదలైన వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ ఆ తర్వాతి ఏడాదికి రూ.6 వేల కోట్లకు చేరినా ఉచిత విద్యుత్ హామీ అమలుపై వెనక్కు తగ్గలేదు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తే విద్యుత్ తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సిందేనని ఎగతాళి చేసిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కూడా అధికారంలోకి వచ్చాక ఆ పథకాన్ని కొనసాగించాల్సిన పరిస్థితిని కల్పించారు. వైఎస్సార్ స్ఫూర్తితో దేశంలో అనేక రాష్ట్రాలు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ను అందిస్తున్నాయి. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించారు. పంట ఎండినా రైతు నష్టపోకూడదనే లక్ష్యంతో పంటల బీమాను అమలు చేశారు. ఇన్ఫుట్ సబ్సిడీని అందించారు. పండిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడం కోసం ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వంతో పోరాడారు. 2004 నుంచి 2009 మధ్య ధాన్యం కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.550 నుంచి రూ.1000 వరకు పెరగడమే అందుకు తార్కాణం.ప్రజారోగ్యం, విద్యకు పెద్దపీట⇒ 2004 మే 14 నుంచి 2007 జూన్ 26 వరకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద వైద్య సహాయం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి రూ.168.52 కోట్లను విడుదల చేశారు. ఆ సమయంలో పేదలు పడిన వేదన గమనించారు. జబ్బునపడ్డ పేద కుటుంబాలు ఆ ఆపత్కాలంలో సహాయం కోసం సీఎం కార్యాలయానికి రావాల్సిన ప్రయాసకు స్వస్తి పలుకుతూ ఉచితంగా కార్పొరేట్ వైద్యాన్ని అందించేలా ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇది ప్రజల ఆరోగ్యానికి భరోసా ఇచి్చంది. 108, 104 అంబులెన్స్ సరీ్వసులను ప్రవేశపెట్టారు. ఆరోగ్యశ్రీ స్ఫూర్తితోనే కేంద్రం ఆయుష్మాన్ భారత్ను చేపట్టింది. ⇒ కడలి పాలవుతున్న నదీ జలాలను ప్రాజెక్టుల ద్వారా మళ్లించి, తెలుగు నేలను సుభిక్షం చేయడానికి జలయజ్ఞం చేపట్టారు. ఒకేసారి పోలవరంతోసహా 86 ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఐదేళ్లలో 23.49 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా 41 ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా దేశ సాగునీటి రంగంలో రికార్డును నెలకొల్పారు. ⇒ కొన్ని ప్రైవేట్ మైక్రో ఫైనాన్స్ సంస్థలు పేదల నుంచి రోజువారీ వడ్డీలు వసూలు చేసే సమయంలో.. 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ ప్రవేశపెట్టిన పావలా వడ్డీ పథకం సంచలనం సృష్టించింది. మన రాష్ట్రంలోనే కాదు.. దేశమంతటా పొదుపు సంఘాల (డ్వాక్రా) వ్యవస్థలో విప్లవం తీసుకొచి్చంది. ⇒ 2007–08, 2008–09 సంవత్సరాల్లో ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలను ఆర్థిక మాంద్యం అతలాకుతలం చేసింది. ఆ ప్రభావం దేశంపైనా పడింది. కానీ.. వైఎస్సార్ దాని ముప్పు ప్రభావం రాష్ట్రంపై పడకుండా చేయగలిగారు. సాగునీటి ప్రాజెక్టులు, పేదల ఇళ్ల నిర్మాణం, రహదారులు వంటి అభివృద్ధి పనులు చేపట్టి మార్కెట్లోకి ధన ప్రవాహం కొనసాగేలా చేశారు. 2009 ఎన్నికల్లోనూ మరోసారి రాష్ట్రంలో, కేంద్రంలోనూ ఒంటిచేత్తో కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చారు. ⇒ పేదరికం వల్ల ఏ ఒక్కరూ ఉన్నత చదువులకు దూరం కాకూడదన్న లక్ష్యంతో ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి రూపకల్పన చేశారు. మెడిసిన్, ఇంజినీరింగ్ వంటి ఉన్నత చదువులు పేదవాడి సొంతమైతేనే పేదరికం నిర్మూలన సాధ్యమని ఆయన బలంగా నమ్మారు. ఉన్నత చదువులను అందరికీ అందుబాటులోకి తేవడం కోసం జిల్లాకు ఒక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. తాడేపల్లిగూడెంలో ఉద్యాన వర్శిటీని.. తిరుపతిలో పశు వైద్య కళాశాలను నెలకొల్పారు. ప్రతిష్ఠాత్మక జాతీయ విద్యా సంస్థ ఐఐటీ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)ని హైదరాబాద్ సమీపంలో కంది వద్ద ఏర్పాటు చేశారు. బాసర, ఇడుపులపాయ, నూజివీడు వద్ద ట్రిపుల్ ఐటీలను ఏర్పాటు చేసి లక్షలాది మందికి ఉన్నత చదువులు దక్కేలా చేశారు⇒ పెట్టుబడుల ఆకర్షణలో 2004 నుంచి 2009 వరకు రాష్ట్రం అగ్రగామిగా నిలిచింది. శ్రీసిటీ సెజ్తోసహా రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున పరిశ్రమలు ఏర్పాటవడంతో ఉపాధి అవకాశాలు పుష్కలంగా వచ్చాయి. సుదీర్ఘమైన తీర ప్రాంతాన్ని వినియోగించుకోవడంలో భాగంగా గంగవరం, కృష్ణపట్నం, కాకినాడ పోర్టులు నిర్మించారు. దాంతో ఎగుమతులు భారీ ఎత్తున పెరిగాయి. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి హైదరాబాద్ను ప్రపంచ చిత్రపటంలో నిలిపారు. తద్వారా హైదరాబాద్లో ఐటీ పరిశ్రమ వేళ్లూనుకునేలా చేశారు. దాంతో ఐటీ ఎగుమతులు 566 శాతం పెరిగాయి. -
వారానికో జిల్లాకు సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి క్షేత్రస్థాయి పర్యటనలపై దృష్టి పెట్టారు. ఇకపై ప్రతి వారం ఒక జిల్లాకు వెళ్లాలని, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలును సమీక్షించడంతో పాటు ఆయా జిల్లాల వారీగా పెండింగ్లో ఉన్న పనులన్నింటినీ త్వరితగతిన పూర్తి చేసేలా అధికారులకు దిశానిర్దేశం చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. తన సొంత జిల్లా పాలమూరు నుంచి ఆయన పర్యటనలు ప్రారంభించనున్నారు. ఈ నెల 9వ తేదీన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా సమీక్ష నిర్వహించనున్నారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాల అమలును సీఎం సమీక్షిస్తారని, ఈ మేరకు అన్ని వివరాలతో సమావేశానికి రావాలని క్షేత్రస్థాయి యంత్రాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఉమ్మడి జిల్లా పరిధిలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల అధిపతులు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ఇప్పటికే ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం అందింది. కీలక రంగాలపై ఫోకస్ జిల్లాల పర్యటనలో భాగంగా కీలక రంగాలపై ఫోకస్ పెట్టాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్టు తెలిసింది. విద్యాసంవత్సరం ప్రారంభం కానుండడం, వర్షాకాలం నేపథ్యంలో విద్య, వైద్యం, సాగునీటి రంగాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలు, తీసుకోవాల్సిన చర్యలపై ఆయన సమీక్ష జరుపుతారని సీఎంవో వర్గాల ద్వారా తెలిసింది. ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయడంపై ఇప్పటికే దృష్టి పెట్టిన సీఎం.. ఆ దిశలో చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు సూచనలు చేయనున్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్సుల నిర్మాణం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లుగా ఐటీఐల అప్గ్రెడేషన్ తదితర అంశాలపై కూడా ఆయన దృష్టి పెట్టనున్నారు. వర్షాకాలంలో వచ్చే అంటు వ్యాధులు, వైద్య శాఖ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రభుత్వ వైద్యరంగ బలోపేతం తదితర అంశాలపై కూడా సూచనలు చేయనున్నారు. ఇక ప్రతి జిల్లాలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల గురించి స్థానిక అధికారులతో సీఎం ప్రత్యేకంగా మాట్లాడతారని, త్వరగా పూర్తయ్యేందుకు అవకాశం ఉన్న ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించడం ద్వారా వీలైనంత వేగంగా వాటిని పూర్తి చేసి రైతాంగానికి సాగునీరు అందించేలా అధికారులకు మార్గదర్శనం చేస్తారని సమాచారం. వీటితో పాటు వ్యవసాయ సీజన్కు సంబంధించిన కార్యాచరణ, ఎరువుల లభ్యత, ఉపాధి హామీ పనులను సమీక్షించనున్న సీఎం.. రైతుభరోసా అమలు విధివిధానాలపై కూడా అధికారులతో చర్చించనున్నారు. ఎక్కడికక్కడ జిల్లాల వారీగా పెండింగ్లో ఉన్న సమస్యలను స్థానిక అధికారులను అడిగి తెలుసుకోనున్న ముఖ్యమంత్రి, జిల్లా స్థాయిలో అమలు కావాల్సిన అన్ని కార్యక్రమాల అమలుపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. అదే సమయంలో జిల్లాల్లోని శాంతిభద్రతల పరిస్థితిని కూడా సీఎం సమీక్షించనున్నారు. ఏడు నెలల పాలనపై ఏమంటారు? గత ఏడాది డిసెంబర్ 7వ తేదీన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం పాలనా పరంగా సాధారణ కార్యక్రమాలు కొనసాగుతున్నప్పటికీ, సీఎం ఎక్కువగా రాజకీయ అంశాలపైనే దృష్టి సారించాల్సి వచ్చింది. ముఖ్యంగా లోక్సభ ఎన్నికలు, ఆ తర్వాత టీపీసీసీ అధ్యక్షుడి నియామకం, కేబినెట్ విస్తరణ లాంటి అనివార్య రాజకీయ కార్యకలాపాల్లో నిమగ్నమయ్యారు. అదే సమయంలో పార్టీలో చేరికలపై కూడా దృష్టి పెట్టారు. ఇక వీలున్నంత మేరకు ప్రభుత్వ పాలనపై కూడా సమీక్షలు నిర్వహించారు. ఇటీవలే అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమావేశమైన సీఎం ప్రజలతో మమేకం కావాలని వారికి సూచించారు. ఆఫీసుల్లో కూర్చుని పనిచేయడం కన్నా క్షేత్రస్థాయికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ప్రాధాన్యమివ్వాలని స్పష్టం చేశారు. కేబినెట్ విస్తరణ, పీసీసీ అధ్యక్షుడి నియామకం లాంటివి తాత్కాలికంగా వాయిదా పడిన నేపథ్యంలో ప్రస్తుతానికి పాలన వ్యవహారాలపై రేవంత్ దృష్టి సారించారు. తాను సైతం క్షేత్రస్థాయికి వెళ్లాలని నిర్ణయించారు. తొలుత గత ఏడు నెలల పాలనపై అధికారుల నుంచి అభిప్రాయాలు సేకరించడంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ప్రజల మనోగతం ఎలా ఉందన్న దానిపై కూడా జిల్లాల పర్యటనల సందర్భంగా ఆయన ఫీడ్బ్యాక్ తీసుకోనున్నారు. ముఖ్యంగా రైతు రుణమాఫీ, రైతు భరోసా లాంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాల అమలుపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవాలని భావిస్తున్నారు. స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నందున క్షేత్రస్థాయిలో ప్రజల మూడ్ ఎలా ఉందన్న దానిపై కూడా ఆయన ఫోకస్ పెట్టారని, అందులో భాగంగానే జిల్లాల పర్యటనకు శ్రీకారం చుడుతున్నారని సీఎంవో వర్గాలు చెబుతున్నాయి. నేడు మంగళగిరికి రేవంత్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి 75వ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు గాను ముఖ్యమంత్రి సోమవారం ఏపీకి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 3:15 నిమిషాలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మంగళగిరికి వెళ్లి సీకే కన్వెన్షన్లో జరిగే వైఎస్సార్ జయంతి వేడుకల్లో పాల్గొంటారని, కార్యక్రమం ముగిసిన తర్వాత గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి రాత్రి 7:45 నిమిషాలకు హైదరాబాద్ వస్తారని సీఎంవో వర్గాలు వెల్లడించాయి. -
రైతన్నల గుండెల్లో రాజముద్ర
ప్రకృతి కన్నెర్ర చేసింది. పాలకుల కరుణ కరువైంది. వరుణుడు పత్తా లేకుండా పోయాడు.వర్షాలు లేక, పంటలు పండక 1993 నుంచి 2004 మధ్య కాలంలో కరువు రక్కసి కబంధ హస్తాల్లో ‘అనంత’ రైతన్న చిక్కుకున్నారు. అలాంటి తరుణంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశాకిరణంగా కనిపించారు. వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయి అన్నదాత దిక్కులు చూస్తున్న సమయంలో అపర భగీరథుడిగా నిలిచారు. చేతిలో చిల్లిగవ్వ లేక పొట్ట చేతపట్టుకుని ఇతర ప్రాంతాలకు వలస వెళుతున్న కూలీలు, పేదల ఇంటికి పెద్ద కొడుకయ్యారు. పుట్టెడు అప్పులతో పిల్లల్ని చదివించలేక, ఆత్మాభిమానం చంపుకోలేక అర్ధంతరంగా అసువులు బాసిన రైతుల కుటుంబాలతో పాటు, పేదలకు అండగా నిలిచారు. అన్ని వర్గాలకూ అందరి బంధువయ్యారు. అందుకే ఆయన తనువు చాలించి 15 యేళ్లు కావస్తున్నా నేటికీ అందరి మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు. నేడు మహానేత వైఎస్సార్ 75వ జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం.అనంతపురం అగ్రికల్చర్: 2004లో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన వేదికపై ఉచిత కరెంటు, విద్యుత్ బిల్లుల మాఫీ చేస్తూ తొలి సంతకంతోనే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి వ్యవసాయానికి ఊపిరిపోశారు. ఆ ఒక్క సంతకంతో ఉమ్మడి జిల్లా రైతులకు చెందిన రూ.70.65 కోట్ల విద్యుత్ బిల్లులు మాఫీ అయ్యాయి. ఐదేళ్లూ 1.75 లక్షల వ్యవసాయ మోటార్లకు రూ.వందల కోట్ల విలువ చేసే కరెంటు ఉచితంగా సరఫరా చేశారు. ఖరీఫ్లో పంట రుణాల పంపిణీ రూ.6,594 కోట్లకు చేర్చారు. పావలా వడ్డీ కింద రూ.44 కోట్లు ఇచ్చారు.పంటల బీమాతో ధీమా..అప్పట్లో చంద్రబాబు హయాంలో అమలవుతున్న పంటల బీమా పథకాన్ని మార్పు చేసి రైతులకు ఎనలేని ధీమా కల్పించారు. 2004–2009 మధ్య వైఎస్ హయాంలో వేరుశనగ రైతులకు పంట కోత ఫలితాల ఆధారంగా బీమా కింద ఏకంగా రూ.1,138 కోట్ల పరిహారం దక్కింది. అలాగే ఇన్పుట్ సబ్సిడీ కింద రూ.100 కోట్లు అందింది.ఒకే విడతగా రుణమాఫీ..2008లో తీవ్ర కరువు పరిస్థితుల నేపథ్యంలో అప్పట్లో కేంద్ర ప్రభుత్వం సహకారంతో వైఎస్సార్ 3,03,937 మంది రైతులకు చెందిన రూ.554.92 కోట్ల రుణాలు ఒకేవిడతలో మాఫీ చేశారు. అప్పటికే బ్యాంకులకు రుణాలు చెల్లించిన రైతులకు ప్రోత్సాహకాల కింద 3,61,269 మందికి రూ.5 వేల చొప్పున రూ.174.04 కోట్లు అందజేశారు. మొత్తమ్మీద రుణమాఫీ, ప్రోత్సాహకాల కింద ఒకే విడతగా 6,65,206 మంది రైతులకు రూ.625 కోట్ల లబ్ధి చేకూర్చారు.రాయితీతో విత్తనాలు..ఖరీఫ్, రబీలో రైతులకు లక్షల క్వింటాళ్ల వేరుశనగ, పప్పుశనగ, కంది, ఇతర విత్తనాలు రాయితీతో ఇచ్చారు. 2004– 2009 వరకు ఆరేళ్ల కాలంలో 28,05,901 మంది రైతులకు రూ.280.88 కోట్ల రాయితీతో 26,02,717 క్వింటాళ్ల వేరుశనగ అందజేశారు. కంది, ఆముదం లాంటి ఇతర విత్తనాల కోసం రూ.80 కోట్లు ఖర్చు చేశారు.అనుబంధ రంగాలకూ ప్రాధాన్యత..వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలైన పాడి, పశుపోషణ, పట్టు, పండ్లతోటలు, డ్రిప్, స్ప్రింక్లర్ల రైతులకు కూడా చేయూత అందించారు. రూ.25 కోట్ల రాయితీ ఇచ్చి పశుక్రాంతి, జీవక్రాంతి కింద 50 శాతం రాయితీతో మేలుజాతి పశువులు, గేదెలు అందజేసి క్షీర విప్లవానికి నాంది పలికారు. 40 వేల హెక్టార్ల పండ్లతోటల విస్తరణకు రూ.80 కోట్ల సబ్సిడీ అందజేశారు. దీంతో అప్పట్లోనే ‘ఫ్రూట్బౌల్ ఆఫ్ ఏపీ’గా పేరొచ్చింది. బిందు, తుంపర (డ్రిప్, స్ప్రింక్లర్లు) పరికరాలను ఎస్సీ, ఎస్టీలకు వంద శాతం, ఇతర రైతులకు 90 శాతం రాయితీతో అందజేశారు. సూక్ష్మసేద్యం విస్తరణకు రూ.280 కోట్ల రాయితీ ఇవ్వడంతో 1.13 లక్షల హెక్టార్లకు చేరుకుంది. ఇలా వ్యవసాయం, అనుబంధ రంగాల అభివృద్ధికి, రైతుల సంక్షేమానికి ఏకంగా రూ.13 వేల కోట్ల వరకు ఖర్చు చేశారు.అంతకు మించి..తండ్రి వైఎస్సార్కు తగ్గ తనయుడిగా గత ఐదేళ్ల కాలంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అంతకు మించి అన్నట్లుగా అన్నదాతకు అడుగడుగునా అండగా నిలిచింది. కరోనా కాలంలో ఉద్యాన ఉత్పత్తుల అమ్మకాలకు ప్రోత్సాహం లాంటివే కాకుండా కేవలం రైతు సంక్షేమానికి ఏకంగా రూ.8 వేల కోట్లకు పైగా వెచ్చించారు. దేశంలో తొలిసారిగా ఊరూరా రైతు భరోసా కేంద్రాల వ్యవస్థతో వ్యవసాయ విప్లవానికి శ్రీకారం చుట్టారు. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, ఇతరత్రా ఇన్పుట్స్ కోసం గ్రామం దాటి వెళ్లకుండా 867 ఆర్బీకేలను నిర్మించారు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల నాణ్యత పరిశీలనకు ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ ల్యాబ్లతో పాటు పశుసంపద, జీవాల రక్షణకు వెటర్నరీ ల్యాబ్లు ఏర్పాటు చేశారు. 108 మాదిరిగా 1962 కింద మొబైల్ వెటర్నరీ అంబులెన్సులు తెచ్చారు. రైతు గ్రూపులకు ప్రతి ఆర్బీకే పరిధిలో రూ.15 లక్షలు వెచ్చించి కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లు (సీహెచ్సీ) కింద ట్రాక్టర్లు, ఇతర అధునాతన యంత్ర పరికరాలు అందించారు. ఇన్పుట్ సబ్సిడీ, ఉచితంగా పంటల బీమా పథకాన్ని అమలు చేశారు. ఏటా మూడు విడతల్లో రైతు భరోసా–పీఎం కిసాన్ కింద రూ.13,500 పెట్టుబడి సాయం ఇచ్చారు. ప్రతి రైతుకూ న్యాయం జరిగేలా ‘ఈ–క్రాప్’, ఈ–కేవైసీ పారదర్శకంగా చేపట్టారు. రాయితీతో డ్రిప్, స్ప్రింక్లర్లు అందించారు. ఇలా వ్యవసాయ, అనుబంధ రంగాల పురోభివృద్ధికి అడుగడుగునా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహకారం అందజేశారు. -
రాజువయ్యా.. మహరాజువయ్యా..
ప్రతి అడుగులో ఆలోచన..ముఖంలో చిరు మందహాసంతో కూడిన దర్పం..ఆహార్యంలో రాజసం..నమ్మిన ప్రజలకు దిక్సూచి.. అభాగ్యులకు ఆపన్నహస్తం..అన్నార్తులకు భరోసా..అభివృద్ధికి చిరునామా..అనారోగ్య బాధితులకు ఆరోగ్య శ్రీ, 108, 104 సేవలు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, రైతులకు జలయజ్ఞం, పేదవాడికి గూడు ఈ మాటలన్నీ ఎవరి నోట వినిపించినా ఠక్కున గుర్తొచ్చే పేరు దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. తన పరిపాలన కాలంలో ప్రజల మదిలో చెరగని ముద్ర వేసుకున్న ఆయన నాటికీ..నేటికీ ప్రజల గుండెల్లో మహారాజులా కొలువై ఉన్నారనడంలో ఎటువంటి సందేహం లేదు. నేడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి. ఆయన పాలన కాలంలో ఉమ్మడి విజయనగరం జిల్లాకు అందించిన సేవలు ఒకసారి మననం చేసుకుంటే..సాక్షి ప్రతినిధి, విజయనగరం: కరువు, పేదరికం, కటిక సమస్యలు తాళలేక పొట్ట చేతబట్టుకుని ఉపాధి కోసం వలసపోయే జనం..ఇదీ సరిగ్గా ఇరవయ్యేళ్ల క్రితం వరకూ ఉమ్మడి విజయనగరం జిల్లా ముఖచిత్రం! అలాంటి నేపథ్యంలో 2003లో ప్రతిపక్షనేతగా ఉన్న డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన పాదయాత్ర కీలక మలుపు. ఇక్కడి ప్రజల కష్టాలను కళ్లారా చూసిన ఆయన చలించిపోయారు. 2004 మే నెలలో తాను అధికారం చేపట్టింది మొదలు 2009 సెప్టెంబరులో అకాల మరణం వరకూ ముఖ్యమంత్రిగా ప్రతి పథకంలోనూ, అభివృద్ధి పనుల్లోనూ ఈ ప్రాంతానికి పెద్దపీట వేస్తూనే ఉన్నారు. నాటి ఆయన కృషి తాలూకా ఫలాలు ఇప్పుడు ప్రజలకు అందుతున్నాయి. తదుపరి ప్రభుత్వాలు పట్టించుకోకపోయినా మళ్లీ ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం అదే పంథాను కొనసాగించారు. ఇప్పుడు ఖరీఫ్ వచ్చేసరికి సాగునీరు అందుతోంది. ప్రగతిపథం వైపు ఉమ్మడి విజయనగరం జిల్లా వడివడిగా అడుగులు వేస్తోంది. వలసలు దాదాపుగా తగ్గిపోయాయి. బయటి ప్రాంతాలవారే ఇక్కడికొచ్చి స్థిరపడేలా ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి.జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల కలను సాకారం చేసిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తన తుది శ్వాస వరకూ ప్రజాసేవలోనే గడిపిన ఆ మహామనిషి జయంతి నేడు (సోమవారం, జూలై 8). ఆయనను స్మరించుకోవడానికి ఊరూవాడా ప్రజలు సిద్ధమవుతున్నారు. వైఎస్సార్ జయంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని వైఎస్సార్సీపీ రీజినల్ డిప్యూటీ కో ఆర్డినేటర్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) పార్టీ క్యాడర్ను కోరారు.జేఎన్టీయూ వైఎస్సార్ పుణ్యమే...ఉమ్మడి విజయనగరం జిల్లాలో నేడు సాంకేతిక విద్యకు దిక్సూచిగా ఉన్న జేఎన్టీయూ–జీవీ విశ్వవిద్యాలయానికి పునాదిరాయి వేసింది డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి. 2007లో జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటైంది. దీన్ని ఎప్పటికై నా యూనివర్సిటీని చేయాలనే ముందుచూపుతోనే 80 ఎకరాల విశాలమైన స్థలాన్ని కేటాయించారు. ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో యూనివర్సిటీగా అప్గ్రేడ్ అయ్యింది.మాతాశిశుసంరక్షణకు ప్రాధాన్యం..డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే బొబ్బిలి సీహెచ్సీలో రూ.44.30 లక్షలతో సీమాంక్ సెంటర్ను ఏర్పాటు చేశారు. ఆయన ప్రారంభించిన భవనంలోనే నాటి నుంచి గర్భిణులు, బాలింతలకు వైద్యసేవలు అందుతున్నాయి.ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి పునాది....విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో దాదాపు 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని ఉద్దేశించిన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు, వంగర మండలంలోని మడ్డువలస ప్రాజెక్టు లైనింగ్ పనులు, పాచిపెంట మండలంలోని పెద్దగెడ్డ ప్రాజెక్టు, నాగావళి ఉపనది జంఝావతి నుంచి రాష్ట్రానికి వచ్చే 4 టీఎంసీల వాటా నీరు వినియోగించుకునేందుకు వీలుగా 1976వ సంవత్సరంలో జంఝావతి ప్రాజెక్టు నిర్మాణం వంటి ఎన్నో పనులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాలోపూర్తయినవే.వైఎస్సార్కు స్మృతివనం..పాలకొండ మండలం ఎం.సింగుపురం గ్రామ ప్రజలు తమ సమస్యలకు పరిష్కారం చూపించిన వైఎస్ రాజశేఖరరెడ్డిని ఒక దైవంలా ఆరాధిస్తున్నారు. 2006లో ముఖ్యమంత్రి హాదాలో ఇక్కడ ప్రజాపఽథం కార్యక్రమానికి వైఎస్సార్ వచ్చారు. ఆయన మరణానంతరం ఇక్కడ వైఎస్సార్ స్మృతివనాన్ని గ్రామస్తులు నిర్మించారు.చీపురుపల్లి అభివృద్ధికి ఆద్యుడుచీపురుపల్లి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులకు వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నాంది పలికారు. ఆయన క్యాబినెట్లో మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ చొరవతో రూ.83 కోట్లతో ఇందిరమ్మ సుజలధార పథకం చేపట్టడం ద్వారా తాగునీటి ఇబ్బందులు తొలగించారు. చీపురుపల్లికి ఆ మహానేత వైఎస్సార్ హయాంలో మంజూరైన ప్రభుత్వ డిగ్రీ కళాశాల నేడు ఆదర్శ డిగ్రీ కళాశాలగా కొనసాగుతోంది.‘గిరి’జన గ్రామాల్లో వెలుగువేపాడ మండలం కరకవలస పంచాయతీ పరిధిలోని గిరిశిఖర గ్రామమైన మారిక గ్రామానికి తొలిసారిగా 2006లో విద్యుత్ సదుపాయం కల్పించిందీ నాటి రాజశేఖరరెడ్డి మాత్రమే. ఆ గ్రామానికి బీటీ రోడ్డుకు నిధులు కేటాయించిందీ ఆయనే. జామి మండలంలో మూతపడి ఉన్న భీమసింగి చక్కెర కర్మాగారాన్ని తెరిపించి చెరుకు రైతుల జీవితాల్లో తీపి నింపారు. రాజన్న మరణానంతరం మళ్లీ ఆ ఫ్యాక్టరీ మూతపడింది.తోటపల్లితో మూడు జిల్లాల్లో ప్రగతి...విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో ప్రగతికి మూలకారకంగా తోటపల్లి ప్రాజెక్టు ఉంది. వాస్తవానికి ఇప్పుడు ప్రాజెక్టు ఉన్న తోటపల్లి ప్రాంతానికి దిగువన నాగావళి నదిపై బ్యారేజీ ఉండేది. 64 వేల ఎకరాలకు సాగునీరు అందించే దీన్ని బ్రిటిష్ వారి హయాంలో నిర్మించారు. దీనికి ప్రత్యామ్నాయంగా ప్రాజెక్టును నిర్మిస్తానంటూ 2003 సంవత్సరంలో చంద్రబాబు ఎన్నికలకు కొద్దిరోజుల ముందు హడావుడిగా శంకుస్థాపన చేసేశారు. తర్వాత దాని ఊసే తేలేదు. 2004వ సంవత్సరంలో అధికారం చేపట్టిన వైఎస్ రాజశేఖరరెడ్డి పరిపాలనా అనుమతులు ఇచ్చారు. దాదాపు 2 లక్షల ఎకరాలకు ఆయకట్టుకు సాగునీరు అందించే ఈప్రాజెక్టు నిర్మాణానికి రూ.450.23 కోట్లు నిధులు మంజూరు చేశారు. పల్లెబాట కార్యక్రమంలో భాగంగా 2004 అక్టోబరు 17వ తేదీన ఆయనే స్వయంగా వచ్చి ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ఆయన హయాంలోనే భూసేకరణ, పునరావాసం పనులు పూర్తయ్యాయి. ప్రాజెక్టు పనులు కూడా 81 శాతం అయిపోయాయి. ఆయన అకాల మరణం తర్వాత ముఖ్యమంత్రులైన వారెవ్వరూ పెండింగ్ పనులపై దృష్టిపెట్టలేదు. మళ్లీ వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాతే పెండింగ్ పనుల్లో కదలిక వచ్చింది. ఆధునికీకరణకు, హెడ్ వర్క్లను పూర్తి చేయడానికి నిధులు కేటాయించారు. -
వైద్యరంగంలో రాజముద్ర