‘ఎక్స్’ ఫిర్యాదులూ పరిష్కరించాలి
జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ చేయాల్సిన పనులకు సంబంధించి ప్రజావాణి ద్వారా అందే ఫిర్యాదులతోపాటు ఆన్లైన్ లో మైజీహెచ్ఎంసీ యాప్ ద్వారా, ఎక్స్ (ట్విట్టర్) ద్వారా అందిన ఫిర్యాదుల్ని సైతం పరిష్కరించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి అధికారులకు సూచించారు. సోమవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ప్రజావాణి సందర్భంగా ఆమె ఈ సూచన చేశారు. ప్రతివారం ప్రజావాణి ఫిర్యాదుల్ని పరిష్కరించాలని కమిషనర్ ఆదేశిస్తున్నప్పటికీ, పరిష్కారం మాత్రం కావడం లేవని కార్యక్రమానికి హాజరైన కొందరు ఆరోపించారు.
నగరంలో దేవీ నవరాత్రుల సందడి షురూ అయింది. గురువారం నుంచి తొమ్మిది రోజుల పాటు నిర్వహించనున్న దసరా శరన్నవరాత్రుల కోసం ఆయా ఆలయాలు, కాలనీల్లో ఏర్పాట్లు భారీగా చేపట్టారు. ఈమేరకు అమ్మ వారి విగ్రహాల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ధూల్పేట, ఎర్రగడ్డ, ఎల్బీనగర్, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో దేవీ మాత విగ్రహాలు విక్రయిస్తున్నారు. వీటిని భక్తులు కొనుగోలు చేసి వాహనాల్లో తరలిస్తున్నారు.
– సాక్షి, సిటీబ్యూరో
Comments
Please login to add a commentAdd a comment