YSR District Latest News
-
కీచక ఉపాధ్యాయులపై చర్యలేవీ?
బద్వేలు : బడిలోని చిన్నారులకు అండ దండగా ఉంటూ.. విద్యా బుద్ధులు నేర్పి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాల్సిన గురువులు దారి తప్పుతున్నారు. బద్వేలు నియోజకవర్గ పరిధిలో వరుసగా జరిగిన మూడు సంఘటనలు తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. గత ఏడాది డిసెంబర్ 26 తేదీ పోరుమామిళ్ల మండలం టేకూరుపేట జిల్లా పరిషత్ పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్న విద్యార్థిని పట్ల అదే పాఠశాలలో హిందీ పండిట్గా పని చేస్తున్న కలసపాడు మండలానికి చెందిన రత్నమయ్య అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ విషయం బాధిత విద్యార్థిని తల్లిదండ్రులకు తెలియడంతో కుటుంబ సభ్యులు, బంధువులు పాఠశాలకు చేరుకుని సదరు ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. పోరుమామిళ్ల ఎస్ఐ కొండారెడ్డి స్పందించి కీచక ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత బద్వేలు పట్టణంలో లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో 4 వ తరగతి చదువుతున్న విద్యార్థిని పట్ల అన్వర్బాషా అనే ఉపాధ్యాయుడు ఈనెల 2వ తేదీన అసభ్యంగా ప్రవర్తించాడు. తల్లిదండ్రులకు విషయం తెలియడంతో వారు పాఠశాలకు చేరుకుని ఆ ఉపాధ్యాయుడికి బుద్ధి చెప్పారు. ఈ సంఘటన మరువక ముందే బద్వేలు పట్టణంలోని ఏవీఆర్ పాఠశాలలో మరో కీచకుడు అయిన కంప్యూటర్ ఆపరేటర్ పెంచలయ్య ఆరవ తరగతి విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.విద్యార్థినులు విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పాఠశాలకు చేరుకుని పిడిగుద్దులు కురిపించారు. అనంతరం పోలీసులు వచ్చి పెంచలయ్యను స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేయించని ప్రధానోపాధ్యాయుడు పోరుమామిళ్ల మండలం టేకూరుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన సంఘటనపై ప్రధానోపాధ్యాయుడు రమణయ్య అసలు కేసు పెట్ట లేదు. హిందీ ఉపాధ్యాయుడు రత్నమయ్య కొన్నిరోజులుగా పాఠశాలలోని విద్యార్థినులతో ఆసభ్యంగా ప్రవర్తిస్తున్నా ప్రధానోపాధ్యాయుడు ఎందుకు మిన్నకుండిపోయారో అర్థం కావడం లేదు. ఈ సంఘటనపై జిల్లా విద్యాశాఖాధికారి బద్వేలు , మైదుకూరు విద్యాశాఖాధికారులతో విచారణ జరిపించారు. లైంగిక వేధింపులు జరిగింది వాస్తవమని తేలిన తరువాత కూడా ప్రధానోపాధ్యాయుడు కేసు నమోదు చేయించలేదు. ఈ విషయమై పోరుమామిళ్ల ఎస్ఐ కొండారెడ్డిని వివరణ కోరగా కేసు పెట్టేందుకు ఎవరూ రాలేదని తెలిపారు. బద్వేలులోని లిటిల్ ఫ్లవర్, ఏవీఆర్ పాఠశాలలో జరిగిన సంఽఘటనలపై పోక్సో కేసు నమోదు చేశామని వారికి కోర్టు బెయిల్ మంజూరు చేసిందని బద్వేలు పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం.రాజగోపాల్ తెలిపారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం బద్వేలు నియోజకవర్గంలో జరిగిన వరుస సంఘటనలపై విచారించి చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాశాఖాధికారి షంషుద్దీన్ తెలిపారు. టేకూరుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సంఘటన జరిగిన సమయంలో తాను జిల్లాలో బాధ్యతలు స్వీకరించలేదన్నారు. ఆ సంఘటనపై విచారించి సంబంధిత ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. తానే స్వయంగా ఆయా పాఠశాలలను సందర్శించి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటానని చెప్పారు.ఉపాధ్యాయ వనంలో కలుపు మొక్కలను ఏరుతున్నా ఎక్కడికక్కడ మళ్లీ మొలుస్తూనే ఉన్నాయి. దారి చూపాల్సింది పోయి దారి తప్పి అభం శుభం తెలియని చిన్నారులపై బుస కొడుతూనే ఉన్నాయి. ఏడాది పొడవునా ఎక్కడో ఒకచోట ఏదో ఒక పాఠశాలలో పసి మొగ్గలపై దురాగతాలు జరుగుతూనే ఉన్నాయి. గురువులు వారి గురుతర బాధ్యత మరిచి చిన్నారుల పాలబుగ్గలపై కన్నేసి కాటేస్తున్నారు. చాలా పాఠశాలల్లో ఇలాంటి సంఘటనలు జరగుతున్నా యాజమాన్యం పట్టించుకోవడం లేదు. బాధిత చిన్నారులు వచ్చీరాని మాటలతో ఇంటికి వచ్చి మా సార్ ఇలా చేశాడు అని చెప్పేంత వరకూ బయటి ప్రపంచానికి తెలియడంలేదు. చిన్నారులపై ఇలాంటి దురాగతాలకు పాల్పడిన దుర్మార్గులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం వారి వైపు కన్నెత్తి చూడటం లేదు. వరుస ఘటనలతో తల్లిదండ్రుల్లో భయాందోళన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటున్న తల్లిదండ్రులు -
మహిళపై హత్యాయత్నం కేసులో మరో ఇద్దరి అరెస్టు
ఖాజీపేట : పుల్లూరు పీడబ్ల్యూ బంగళా వద్ద భాగ్య అనే మహిళపై జరిగిన హత్యాయత్నం కేసులో మరో ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఖాజీ పేట సీఐ మోహన్ తెలిపారు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన విష యంలో ఈమైపె హత్యాయత్నం జరిగింది. డ్రైవర్ శివకృష్ణకు గాయాలయ్యా యి. ఈ కేసులో ఇప్పటికే ఆరుగురిని అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. వీరితో పాటు కొప్పులోలు వెంకట సూర్య చంద్రారెడ్డి (23) షేక్ మహమ్మద్ రఫీ (38) లను రావులపల్లె క్రాస్ వద్ద అరెస్టు చేసి వారి వద్దనుంచి బైక్ను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ కేసులో ఇప్పటికి 8 మందిని అరెస్టు చేశామని మరికొందరిని అదుపులోకి తీసుకుని విచారణ చేయాల్సి ఉందన్నారు. పెన్నా నదిలో పడి వృద్ధుడి మృతిప్రొద్దుటూరు క్రైం : స్థానిక రామేశ్వరానికి చెందిన ఇల్లూరు చిన్నవెంకటేష్ (73) అనే వృద్ధుడు స్నానం చేసేందుకు పెన్నా నదిలో దిగి ఊపిరాడక మృతి చెందాడు. మూడు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిన చిన్న వెంకటేష్ తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు అతని కోసం గాలించసాగారు. ఈ క్రమంలో పెన్నానదిలో శవమై తేలాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. వెంకటేష్ పశువుల వ్యాపారం చేసేవాడు. అతనికి భక్తి ఎక్కువ. పెన్నానదిలో స్నానం చేసి గుడికి వెళ్లేవాడు. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం రెండు కుళాయిల సమీపంలో ఉన్న రైల్వే బ్రిడ్జి వద్దకు వెళ్లాడు. స్నానం చేసేందుకు అక్కడ ఉన్న నీళ్లలో దిగాడు. ఈ క్రమంలో సోమవారం అతని మృతదేహం నీళ్లలో తేలడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. లోతు ఎక్కువగా ఉన్న కారణంగా ఊపిరాడక మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అతనికి ఆయాసం ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రిలోని మార్చురీకి తరలించినట్లు రూరల్ ఎస్ఐ సురేష్ తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన మహిళలు
వేంపల్లె : వేంపల్లె పట్టణంలోని వివేకానంద రెడ్డి (రెడ్డయ్య) కాలనీలో గత 15 రోజులుగా తాగునీరు రాలేదని అ కాలనీ మహిళలందరూ ఖాళీ బిందెలతో రోడ్డెక్కారు. అటుగా వెళ్తున్న ఎమ్మెల్సీ కారును ఆపి మహిళలు తాగునీటి ఇబ్బందులను తొలగించాలని ముట్టడించారు. దీంతో ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి కారు దిగి వచ్చి వివేకానంద రెడ్డి కాలనీలో ఉన్న నీటి సమస్యను మహిళలను అడిగి తెలుసుకున్నారు. ఉగాది పండుగ ముందు నుంచి తమ కాలనీకి తాగునీటిని సరఫరా చేయలేదని, నీటికి ఇబ్బందులు ఉండడంతో ఖాళీ బిందెలతో రోడ్డెక్కాల్సి వచ్చిందని వివరించారు. ప్రతిసారి మోటార్ కాలిపోయిందని సిబ్బంది చెబుతున్నారని, వేసవిలో తాగునీటి ఎద్దడి ఉండటంతో చిన్నపిల్లలతో చాలా ఇబ్బందులు పడుతున్నామన్నారు. పంచాయతీ సిబ్బందికి ఫోన్ ద్వారా తెలిపితే నిర్లక్ష్యంగా సమాధానాలు ఇస్తున్నారన్నారు. తాగునీటి ఇబ్బందులు తొలగించాలని కోరారు. రెండు రోజుల్లోగా వివేకానంద రెడ్డి కాలనీకి తాగునీటికి ఇబ్బందులు లేకుండా చేస్తామని ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి హమీ ఇచ్చారు. దీంతో మహిళలు నిరసన విరమించారు. పోటాపోటీగా ట్యాంకర్లతో నీటి సరఫరా స్థానిక వివేకానంద రెడ్డి (రెడ్డయ్య కాలనీ)లో నీటి సమస్య ఉండడంతో పోటాపోటీగా వైఎస్సార్సీపీ, టీడీపీ (ఎమ్మెల్సీ వర్గం) నాయకులు నీటి ట్యాంకర్లను పెట్టి నీటిని సరఫరా చేశారు. సోమవారం వివేకానంద రెడ్డి కాలనీకి చెందిన మహిళలు నిరసన తెలపడంతో ఈ విషయాన్ని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ మండల కన్వీనర్ కమతం రాజా, వార్డు మెంబర్ గణేష్ ప్రసాద్లు సర్పంచ్ రాచినేని శ్రీనివాసులు దృష్టికి తెచ్చారు. అలాగే ఎమ్మెల్సీ వర్గానికి చెందిన టీడీపీ నాయకులకు కూడా విషయం తెలియడంతో అటు ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి, ఇటు సర్పంచ్ రాచినేని శ్రీనివాసులు ఆదేశాల మేరకు వివేకానంద రెడ్డి కాలనీ ప్రజలకు నీటి ట్యాంకర్ల ద్వారా ఇరు పార్టీల నాయకులు నీటిని సరఫరా చేశారు. అలాగే కాలనీ వాసులకు నీటి ఇబ్బందులు లేకుండా తాగునీటి బోరును కూడా వేస్తామని సర్పంచ్ రాచినేని శ్రీనివాసులు తెలిపారు.ఎమ్మెల్సీ కారును అడ్డగించి సమస్య తీర్చాలని నిలదీత -
ఉప సర్పంచ్ ఎన్నికలో ఓటమి తప్పదనే టీడీపీ అరాచకాలు
కడప కోటిరెడ్డిసర్కిల్ : ప్రొద్దుటూరు మండలం గోపవరం పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నికలో ఓటమి తప్పదని గ్రహించి టీడీపీ అరాచకాలు సృష్టించిందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి తెలిపారు. ఈ ఎన్నిక సందర్భంగా చోటుచేసుకున్న సంఘటనపై ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు ఆయన సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. ఎస్పీ అందుబాటులో లేకపోవడంతో అడిషనల్ ఎస్పీకి వినతిపత్రాన్ని సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికకు సంబంధించి 20 మంది వార్డు మెంబర్లు ఉండగా 19 మంది వైఎస్సార్సీపీ, కేవలం ఒక్క వార్డు సభ్యుడు మాత్రమే టీడీపీ మద్దతు దారుడు ఉన్నాడన్నారు. ఒక్క సభ్యుడిని పెట్టుకుని వైస్ సర్పంచ్ పదవి కావాలని కోరడం దారుణమన్నారు. దేశంలోగానీ, రాష్ట్రంలోగానీ, ప్రపంచంలోగానీ జరిగే అవకాశం ఉందా అని ఆయన ప్రశ్నించారు. ఈ ఎన్నిక సందర్భంగా ఏకంగా పోలీసుల మద్దతుతోనే టీడీపీ నేతలు అరాచకాలు సృష్టించారన్నారు.తమను లోనికి రానీయకుండా టీడీపీ చోటామోటా నేతలు దుర్మార్గమైన నీచమైన సంస్కృతికి తెర తీశారన్నారు. నకిలీ మనుషులను ఏర్పాటు చేసి, నకిలీ ఐడీ కార్డులు తయారు చేసి వారిని పంచాయతీ వార్డు సభ్యులుగా తీసుకు వస్తే పోలీసులు వారిని లోనికి పంపించారన్నారు. ఈ నేపథ్యంలో లోపలున్న అధికారులు ఒప్పుకోకపోతే ఆయా అధికారులను బండబూతులు తిట్టారన్నారు. తమ వారిపై పోలీసుల సమక్షంలోనే దాడి చేస్తే తిరిగి తమ వారినే పోలీసు స్టేషన్కు తీసుకెళ్లి నిర్బంధించారన్నారు. తమ ఫిర్యాదుపై కేసు నమోదు చేయకపోగా తమకు చెందిన 100 మందిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారన్నారు. ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి సోదరుడు భార్గవరెడ్డి ఎన్నిక జరిగే పంచాయతీ కార్యాలయంలో కూర్చుని తన మనుషులతో వైఎస్సార్సీపీ కార్యకర్తలను బెదిరించే ప్రయత్నాలు చేశారన్నారు. టీడీపీ వారికి ఓటమి తథ్యమనుకున్న తరుణంలో వారు ఎన్నికల అధికారి రామాంజనేయరెడ్డి చేత గుండెపోటు డ్రామా ఆడించారన్నారు. ప్రొద్దుటూరులో తమ ఫిర్యాదుపై కేసు నమోదు చేయకపోవడంతో కడపలో జరిగే గ్రీవెన్సెల్కు వచ్చి ఫిర్యాదు చేస్తున్నామన్నారు. ఇప్పటికై నా పోలీసు అధికారులు రాఘవేంద్రారెడ్డి, వెంకటేశ్వరరెడ్డిలపై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేయాలని, నకిలీ ఐడీ కార్డులు సృష్టించిన, ఆయా ఐడీ కార్డులను అడ్డం పెట్టుకుని ఎన్నికల హాలులోకి వచ్చిన వారిపై, ఎన్నిక సందర్భంగా అధికారులను బెదిరించిన వారిపై, వీధి రౌడీలను ఎన్నికల్లో పాల్గొనేందుకు అనుమతించిన పోలీసు అధికారులపై చర్యలు చేపట్టి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. వివిధ కారణాలతో ఎస్పీ తమకు న్యాయం చేయకపోతే ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని, ఆపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు, ప్రొద్దుటూరును ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు బలిదానం చేసేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ లక్ష్మిదేవి, గోపవరం సర్పంచ్ మోషె, ఉప సర్పంచ్ అభ్యర్థి బీరం రాఘవేంద్రారెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు గోరెడ్డి నరసింహారెడ్డి, కౌన్సిలర్ వరికూటి ఓబుల్రెడ్డి, వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు భూమిరెడ్డి వంశీధర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్రెడ్డి -
పేదల సొంతింటిపై చిత్తశుద్ధి లేని కూటమి
కడప సెవెన్రోడ్స్ : పేదలకు సొంతిల్లు ఉండాలన్న విషయంలో రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని సీపీఐ జిల్లా కార్యదర్శి చంద్ర విమర్శించారు. సీపీఐ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన నిరాహార దీక్షా శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. అర్హులందరికీ రెండు సెంట్ల స్థలం, టిడ్కో ఇల్లు ఇవ్వాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు మంజూరు చేసి ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షలు మంజూరు చేయాలన్నారు. పెండింగ్ పనులు తక్షణమే పూర్తి చేసి లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లు వెంటనే అప్పగించాలని డిమాండ్ చేశారు. సీపీఐ నగర కార్యదర్శి ఎన్.వెంకట శివ అధ్యక్షతన జరిగిన నిరాహార దీక్ష కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు నాగసుబ్బారెడ్డి, వేణుగోపాల్, బాదుల్లా, సుబ్రమణ్యం, మునెయ్య, మనోహర్రెడ్డి, లింగన్న తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీపీపీలో చోరీ కేసులో నిందితుడి అరెస్టు
ఎర్రగుంట్ల : డాక్టర్ ఎంవీఆర్ రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు క్వార్టర్స్లో ఫిబ్రవరి నెలలో జరిగిన చోరీ కేసుకు సంబంధించి నిందితుడు గణపత్ దావర్ (25)ను అరెస్టు చేసినట్లు కొండాపురం సీఐ మహమ్మద్ రఫీ తెలిపారు. సోమవారం కలమల్ల పోలీస్ స్టేషన్లో ఎస్ఐ తిమోతితో కలసి నిందితుడి అరెస్టు వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని థార్ జిల్లా కుక్షి తాలూకాలోని నర్వాలి గ్రామానికి చెందిన జవర్సింగ్ కుమారుడు గణపత్ దావర్ చెడు వ్యసనాలకు బానిసయ్యాడన్నారు. మరో ముగ్గురు స్నేహితులతో కలిసి తమ అవసరాలకు తప్పుడు మార్గంలో డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్మాగారాలు, పెద్దపెద్ద అపార్ట్మెంట్లను ఎంచుకుని దొంగతనాలు చేస్తున్నారన్నారు. ఆర్టీపీపీలోని క్వార్టర్స్లో తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకున్నారని తెలిపారు. ఇలా ఫిబ్రవరి నెలలో 9.10 తేదీల మధ్య రాత్రి సమయంలో ఆరు ఇళ్లలో దొంగతనాలు చేశారన్నారు. సుమారు రూ.2,40,000లు విలువ గల బంగారు, వెండి ఆభరణాలను చోరీ చేశారన్నారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి కలమల్ల ఎస్ఐ తిమోతి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే సోమవారం నిందితులు మళ్లీ దొంగతనాలు చేసేందుకు వచ్చారని అందిన సమాచారం మేరకు ఎర్రగుంట్ల– ముద్దనూరు మార్గంలోని కొత్తపల్లి క్రాస్ రోడ్డు వద్ద నిందితుడు గణపత్ దావర్ను అరెస్టు చేశామన్నారు. మరో ముగ్గురిని అరెస్టు చేయాల్సి ఉందన్నారు. ఈ కేసులో ఆధారాలను సేకరించడంలో, నేరస్తుల ఆచూకీ కనిపెట్టడంలో తన నైపుణ్యాన్ని చూపిన ఎస్ఐ తిమోతి, ఇతర సిబ్బందిని జిల్లా ఎస్పీ, జమ్మలమడుగు డీఎస్పీ, కొండాపురం సీఐ మహమ్మద్రఫీలు అభినందించారు. -
పొగాకు కొనుగోలుకు ముందుకొచ్చిన జీపీఐ కంపెనీ
బి.కోడూరు : మండలంలో అకాల వర్షాలకు దెబ్బతిన్న పొగాకు కొనుగోలుకు ఎట్టకేలకు జీీపీఐ కంపెనీ ముందుకు వచ్చింది. మండల రైతుల నుంచి ఒత్తిడి అధికం కావడంతో సోమవారం నుంచి పొగాకును కొనుగోలుకు కంపెనీ సిద్ధమైంది. జీపీఐ కంపెనీ వారు పొగాకు కొనుగోలుకు ముందుకు రావడం పట్ల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మందు పిచికారీతో పంట నష్టంఖాజీపేట : పంటకు తెగులు సోకిందని మందు పిచికారీ చేస్తే చేతికి వచ్చిన పంట పూర్తిగా ఎండిపోయిందని బాధిత రైతు లబోదిబోమంటున్నాడు. ఖాజీపేట మండలం కొత్త ఏటూరు గ్రామానికి చెందిన వీరభద్ర అనే రైతుకు రెండు ఎకరాల పొలం ఉంది. పొలంలో పచ్చపెసర సాగు చేశాడు. పంటకు తెగులు సోకడంతో ప్రొద్దుటూరుకు చెందిన ఒక దుకాణంలో మందు కొనుగోలు చేశాడు. మందు పిచికారీ చేశాక సాయంత్రం కల్లా పంట పూర్తిగా ఎండిపోయింది. పంటకు సక్రమమైన మందు ఇచ్చి ఉంటే ఎకరాకు 8 క్వింటాళ్ల దిగుబడి వచ్చేదని రైతు తెలిపాడు. ఎకరాకు రూ.50వేలు ఖర్చయిందని, కేవలం మందు పిచికారీ కారణంగా పంట పూర్తిగా నష్టపోయానని వాపోయాడు. అధికారులు తనకు న్యాయం చేయాలని కోరుతున్నాడు. -
పనులు త్వరగా పూర్తిచేయాలి
జిల్లా పంచాయతీ అధికారి రాజ్యలక్ష్మి సిద్దవటం : ఒంటిమిట్ట కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలను పురష్కరించుకొని సిద్దవటం మండలం లోని కడప– చైన్నె ప్రధాన రహదారికి ఇరువైపులా పారుశుధ్య పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా పంచాయతీ అధికారి రాజ్యలక్ష్మి పేర్కొన్నారు. సోమవారం ఆమె భాకరాపేట, కనుమలోపల్లె గ్రామాల్లో జరిగే పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పనుల్లో జాప్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీఎల్పీఓ విజయ భాస్కర్, ఈఓపీఆర్డీ మోహతాబ్ యాస్మిన్, పంచాయతీ కార్యదర్శులు రాజేష్, శివయ్య పాల్గొన్నారు. -
రిజిస్ట్రేషన్కు 19 స్లాట్ బుకింగ్లు
కడప కోటిరెడ్డిసర్కిల్ : స్టాంపులు, రిజిస్ట్రేషన్శాఖ సేవలను మరింత సులభతరం చేసేందుకు స్లాట్ బుకింగ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ విధానంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధానాన్ని అన్ని జిల్లాల్లో కేంద్రాల్లో అందుబాటులోకి తీసుకువచ్చా రు. కడప అర్బన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కొత్త విధానంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తికి దస్తావేజులను అందజేశారు. సోమవారం 19 స్లాట్ బుకింగ్ చేసుకున్న వారికి దస్తావేజులను అందజేసినట్లు సబ్ రిజిస్ట్రార్ హరికృష్ణ తెలిపారు. కొత్త విధానంతో ఆస్తుల రిజిస్ట్రేషన్కు ఎక్కువ సమయం వృథా కాదని, ప్రజలు నిరీక్షించే బాధ తగ్గుతుందన్నా రు. అలాగే క్యూఆర్ కోడ్తోనూ బుకింగ్ చేసుకోవచ్చన్నారు. ఈ మేరకు తమ కార్యాలయంలో క్యూఆర్ కోడ్ అందుబాటులో ఉంచామన్నారు. -
ప్రతి రైతుకు ప్రత్యేక విశిష్ట గుర్తింపు
పులివెందుల రూరల్ : భూమి ఉన్న ప్రతి రైతుకు ప్రత్యేక విశిష్ట గుర్తింపు సంఖ్య ఇవ్వాలని జిల్లా వ్యవసాయ అధికారి నాగేశ్వరరావు సిబ్బందికి సూచించారు. సోమవారం పట్టణంలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయ సభా భవనంలో పులివెందుల, ముద్దనూరు వ్యవసాయ డివిజన్ల పరిధిలోని 9మండలాల వ్యవసాయ అధికారులు, రైతు సేవా కేంద్రాల సిబ్బందికి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి నాగేశ్వరరావు మాట్లాడుతూప్రత్యేక విశిష్ట గుర్తింపు సంఖ్యను ఇవ్వడం ద్వారా వ్యవసాయ సేవలను సులభతరం చేయడంతో పాటు పారదర్శకంగా ఉంటాయన్నారు. రైతులకు అందుబాటులో ఉంటూ రైతులకు కావలసిన నాణ్యమైన ఎరువులను, విత్తనాల ను అందిస్తూ రైతుకు సేవ చేసే దానిలో ఎల్లప్పుడూ ముందు ఉండాలన్నారు. రైతులు సబ్సిడీ యంత్ర పరికరాల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేయాలని సూచించారు. జిల్లా వ్యవసాయ అధికారి ఎ. నాగేశ్వర రావు -
రాయంచపై రామయ్య విహారం
ఒంటిమిట్ట : ఏకశిలానగరిలోని శ్రీ కోదండ రామస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమవారం రాత్రి 7 నుంచి 8:30 గంటలకు హంసవాహనసేవ వైభవంగా జరిగింది. రాములోరు రాయంచపై కొలువుదీరి మాఢవీధుల్లో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. రామా..మము బ్రోవుమా అంటూ భక్తజనం ప్రణమిల్లారు. ఆత్మానాత్మ వివేకం కలవానికి భగవదనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. హంస వాహనంలోని పరమార్థం ఇదే. హంసకు పాలను, నీళ్లను వేరుచేసే సామర్థ్యం ఉంది. భక్తుల్లో అహంభావం తొలగించి శ్రీదాసోహంశ్రీఅనే భావం కలిగించడానికే పరమహంస రూపానికి ప్రతీక అయిన హంస వాహనాన్ని స్వామి వారు అధిరోహిస్తారు. కోలాటం బృందం నృత్య ప్రదర్శనలు, తాళ భజనలు, మంగళవాయిద్యాలు ముందు సాగుతుండగా రాచఠీవితో హంస వాహనంపై నిలిచిన రాములవారు ఒంటిమిట్ట వీధుల్లో విహరించారు. వేలాది మంది తరలిరావడంతో రామయ్య క్షేత్రంలో భక్తజన సందడి నెలకొంది. అంతకు ముందు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు వేణుగానాలంకారంలో స్వామివారు ఆలయ నాలుగు మాఢవీధుల్లో భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 11 నుంచి కల్యాణవేదిక వద్ద ఉత్సవమూర్తులకు అభిషేకాలు జరిపారు. అనంతరం స్నపనతిరుమంజనం నిర్వహించారు. ప్రణమిల్లిన భక్తజనం నేటి కార్యక్రమాలు... బ్రహ్మోత్సవాలలో మంగళవారం ఉదయం వటపత్రశాయి అలంకారంలో శ్రీరాముడు దర్శనమివ్వనున్నారు. రాత్రి 7 గంటల నుంచి సింహ వాహనంపై విహరిస్తారు. -
గ్రీవెన్స్సెల్కు వినతుల వెల్లువ
కడప సెవెన్రోడ్స్ : కలెక్టర్ కార్యాలయ సభా భవనంలో సోమవారం నిర్వహించిన ప్రజా వినతుల పరిష్కార వేదిక కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి అర్జీదారులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఇన్ఛార్జి డీఆర్వో వెంకటపతి, ఇతర అధికారులకు తమ సమస్యలు విన్నవించారు. ● లింగాల మండలం తాతిరెడ్డిపల్లె సర్వే నెంబరు 457లో తనకు వారసత్వంగా వచ్చిన 1.41 ఎకరాల భూమిని టీడీపీ నాయకులు సురేంద్రారెడ్డి, సుధాకర్రెడ్డి అనే వ్యక్తులు ఆక్రమించి అరటిమొక్కలు నాటారని కోమన్నూతల గ్రామానికి చెందిన శ్రావణి ఫిర్యాదు చేశారు. అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. టీడీపీ నేతల నుంచి తన భూమిని ఇప్పించాలని కోరారు. ● వీఎన్ పల్లె మండలం అనిమెలలో 1976–77 ప్రాంతంలో దళితులకు మంజూరు చేసిన పట్టా భూములను ఎం.జగదీశ్వర్రెడ్డి, జోగిరెడ్డి, రాజారెడ్డి, ఝాన్సీలక్ష్మి తదితరులు ఆక్రమించారని దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి మునెయ్య ఫిర్యాదు చేశారు. ● ఇంజనీరింగ్ కాలేజీలో ఔట్సోర్సింగ్ కింద పనిచేస్తున్న కొంతమంది జాబ్కార్డులు పొంది ఉపాధి హామీ సొమ్మును కాజేస్తున్నారని చాపాడు మండలం పల్లవోలు గ్రామానికి చెందిన ఆంజనేయులు ఫిర్యాదు చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్, ఏపీడీఓ సుబ్బారెడ్డి మద్దతుతోనే ఇది జరుగుతోందని ఫిర్యాదు చేశారు. ● బెంగుళూరు–విజయవాడ ఆరు లేన్ల రహదారి నిర్మాణంలో భాగంగా రెండు ఎకరాల తన భూమిని ప్రభుత్వం సేకరించిందని, తన అన్న నరసింహారెడ్డి పేరిట అవార్డు పాస్ చేశారని బ్రహ్మంగారిమఠం మండలం చిన్నాయిపల్లెకు చెందిన పెంచల్రెడ్డి ఫిర్యాదుచేశారు. అన్ని డాక్యుమెంట్ ఆధారాలు తమకు ఉన్నప్పటికీ రెవెన్యూ అధికారులు స్పందించడం లేదన్నారు. -
కోదండరాముడి కల్యాణోత్సవానికి చురుగ్గా ఏర్పాట్లు
ఒంటిమిట్ట : ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో ఏప్రిల్ 11న సీతారాముల కల్యాణోత్సవాన్ని ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహిస్తామని, ఇందుకోసం ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయని రాష్ట్ర దేవదాయశాఖా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్చార్జి మంత్రి ఎస్ సవిత సంయుక్తంగా పేర్కొన్నారు. సోమవారం ఒంటిమిట్ట టీటీడి కల్యాణ మండపం సమీపంలోని పరిపాల భవన సమావేశ మందిరంలో వైఎస్సార్ జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి, ఎస్పీ అశోక్ కుమార్, టీడీడీ జేఈఓ వీరబ్రహ్మం, టీటీడీ విజిలెన్స్ ఎస్పీ విష్ణువర్దన్ రాజు, జేసీ అదితి సింగ్తో కలిసి బ్రహ్మోత్సవాలు, కల్యాణోత్సవ ఏర్పాట్లపై సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈనెల 11వ తేదీన సీతారాముల కల్యాణం వైభవంగా జరగనుందని, అందుకు సంబంధించి ఇప్పటికే దాదాపు అన్ని పనులు పూర్తయ్యాయని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రులు అధికారులకు సూచించారు.ప్రజా భద్రత కోసం సుమారు 150కిపైగా సీసీ, డ్రోన్ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే కడప, రాజంపేట వైపు నుంచే ఆర్టీసీ బస్సులకు పార్కింగ్, అలాగే ఇతర జిల్లాల నుంచి ఎన్ని బస్సులు వస్తున్నాయో తెలుసుకొని పక్కాగా ప్లాన్ రూపొందించుకొని పార్కింగ్ ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.మంత్రి సవిత మాట్లాడుతూ కల్యాణోత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులతోపాటు ప్రముఖులు అత్యంత ప్రముఖులు రావచ్చనే అంచనాతో అన్ని రకాల ఏర్పాట్లు చేశామన్నారు. కల్యాణవేదిక ప్రాంగణాన్ని భక్తులు శోభాయమానంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. వైఎస్సార్ జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి మాట్లాడుతూ ఉత్సవాలకు హాజరయ్యే భక్తులకు మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. శానిటేషన్, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు, తాగునీటి వసతి కల్పించామన్నారు.108 వాహనాలు, అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలన్నారు. వైఎస్సార్ జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, టీటీడీ విజిలెన్స్ ఎస్పీ హర్షవర్దన్ రాజు మాట్లాడుతూ టీటీడీ అధికారులు, జిల్లా యంత్రాంగం, పోలీసులు సమష్టి కృషితో బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి గ్యాలరీ వద్ద గట్టి భద్రతా చర్యలు చేపడతామన్నారు. టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం బ్రహ్మోత్సవాల విజయవంతానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని అధికారులను కోరారు. కల్యాణ వేదిక పరిశీలన అంతకుముందు మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, సవిత, జిల్లా కలెక్టర్, ఎస్పీలు ఒంటిమిట్ట కోదండరామస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు, వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం దేవస్థానం సమీపంలోని కల్యాణ వేదికను వారు పరిశీలించారు.ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్ల గురించి కలెక్టర్ మంత్రులకు వివరించారు. కార్యక్రమంలో కడప, పులివెందుల ఆర్డీఓలు జాన్ ఇర్విన్, చిన్నయ్య, టీటీడీ డిప్యూటీ ఈఓ నటేష్, డీఆర్డీఏ పీడీ ఆనంద్ నాయక్, డీఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎంహెచ్ఓ నాగరాజు, డీపీఓ రాజ్యలక్ష్మీ, పంచాయతీ రాజ్ ఎస్ఈ శ్రీనివాస్ రెడ్డి, ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ రమణయ్య పాల్గొన్నారు. మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, సవిత -
కూటమి ప్రభుత్వం మానవత్వం మరిచింది. పేదల ఉచిత వైద్య సేవను నిలిపేసి రోగుల ఆరోగ్యాన్ని గాలికొదిలేసింది. మాటలు కోటలు దాటించే కూటమి నేతలు.. ఆరోగ్యశ్రీ వైద్య సేవ దగ్గరికొచ్చేసరికి ‘కోట్ల’ బిల్లులు నిలిపేశారు. ఇంకేముంది నెట్వర్క్ ఆస్పత్రులు ఉచిత వైద్య సేవలను న
కడప రూరల్ : పేదలకు అందించే ఉచిత వైద్యం నిలిచిపోయింది. ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ట్రస్ట్ ద్వారా నెట్ వర్క్ ఆసుపత్రులకు చెల్లించాల్సిన బకాయిలు పేరుకుపోయాయి. ‘ఇన్నాళ్లు అప్పులు తెచ్చి ఆసుపత్రులను నడిపాం. ఇకపై ముందుగు సాగలేమ’ని ఆషా (ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేన్) రాష్ట్ర కమిటీ ప్రభుత్వానికి తెలిపింది. ప్రభుత్వం స్పందించకపోవడంతో సోమవారం నెట్ వర్క్ ఆసుపత్రుల్లో ఎన్టీఆర్ వైద్య సేవ (ఆరోగ్య శ్రీ) పథకం ద్వారా పేదలకు అందించే ఉచిత వైద్య సేవలను నిలుపుదల చేశారు. పాపం.. ప్రజలు.. జిల్లా వ్యాప్తంగా నెట్ వర్క్ ఆసుపత్రులు మొత్తం 108 ఉన్నాయి. అందులో 36 ప్రైవేట్ ఆసుపత్రులు. మిగిలినవి ప్రభుత్వ ఆసుపత్రులు. ఈ ఆసుపత్రుల ద్వారా అర్హులకు 3,255 రకాల వ్యాధులకు వైద్య సేవ లు అందించాలి. ప్రతి రోజు దాదాపు 2 వేల మంది రోగులు ఆసుపత్రులకు వస్తుంటారు.కాగా 36 ప్రైవేట్ నెట్ వర్క్ ఆసుపత్రుల్లో వైద్య సేవలు నిలిచిపోవడంతో, వైద్యం కోసం వచ్చిన పేదలు ఇబ్బందులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆసుపత్రుల్లో ఉండే వైద్య మిత్రలు వచ్చిన రోగులకు ఈ రోజు ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద చూసే వైద్య సేవలు లేవు. ఆసుపత్రుల వారు బంద్లో ఉన్నారని చెప్పి పంపించేస్తున్నా రు. ఈ సమాధానం విని రోగులు ఆశ్చర్యపోతున్నారు. బందా..ఎప్పుడూ లేదే..? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ పథకం కింద ఔట్ పేషెంట్స్కు ఫీజు తీసుకోకుండా పేషెంట్ను చూడాలి. ఇన్ పేషెంట్స్కు అయితే ఉచితంగా వైద్య సేవలు అందించాలి. బంద్ కావడంతో ఔట్ పేషెంట్స్ డాక్టరుకు ఫీజులు చెల్లించి చూపించుకుంటున్నారు. ఆపదలో ఉన్న ఇన్ పేషెంట్స్గా అవసరమైన వ్యాధిగ్రస్తుల పరిస్థితి చాలా ఇబ్బందిగా మారింది. ప్రైవేట్గా చూపించుకోవాలంటే వేలు దాటి లక్షల్లో ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం నుంచి బెదిరింపులు..నెట్ వర్క్ ఆసుపత్రులకు పెండింగ్ బకాయిలను చెల్లించి, పేదల వైద్యానికి భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతోంది. వైద్య సేవలను నిలుపుదల చేసిన ఆసుపత్రుల వివరాలను తెలపాలని ఎన్టీఆర్ వైద్య సేవ సిబ్బందికి ప్రభుత్వం ఆదేశించినట్లుగా తెలిసింది. ప్రభుత్వం సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేయకుండా బెదిరింపు చర్యలకు పాల్పడడం మంచి పద్ధతి కాదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ‘ఎన్టీఆర్ వైద్య సేవ’లు బంద్ ఉచిత వైద్యం అందక పేదల ఇబ్బందులు జిల్లా వ్యాప్తంగా రూ. 120 కోట్లకు పైగా బకాయిలు నిధులు అందకపోవడంతో వైద్య సేవలను నిలుపుదల చేసిన నెట్ వర్క్ ఆసుపత్రులు ఈ వ్యక్తి పేరు అంకన్న. వేముల మండలం, గొందిపల్లె వాసి. రెండు వారాల క్రితం బండి మీద నుంచి కింద పడి కాలుకు గాయమైంది. కుట్టు వేశారు. అప్పుడు ఉచితంగా వైద్య సేవలు అందాయి. ఇప్పుడు చెకప్ కోసం వచ్చారు. వైద్య సేవలను నిలుపుదల చేయడంతో డబ్బులు చెల్లించాల్సి వచ్చింది. ఈ రోజు బంద్ ఉందంట. చాలా మంది వచ్చి వెనక్కి వెళ్లారు. ఉచితంగా వైద్య సేవలు అందకపోతే తమ లాంటి వారి పేదల పరిస్ధితి ఏమికావాలని అంకన్న ప్రశ్నించారు. ఉచిత వైద్యం అందకపోతే పేదల పరిస్థితి ప్రమాదకరంగా ఉంటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. బంద్ అంటే ఫీజు చెల్లించాను కంటి సమస్యతో కడపకు వచ్చాను. ఆసుపత్రుల వారు ఆరోగ్య శ్రీ కింద అందించే వైద్య సేవలు బంద్ చేశారని చెప్పారు. చేసేదిలేక రూ.300 ఫీజు చెల్లించి డాక్టర్ వద్ద చూపించుకున్నాను. ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందో అర్థం కావడం లేదు. – రామ్మోహన్, ముద్దనూరు. -
రామ మందిరం..సాహితీ సౌరభం
ఒంటిమిట్ట : ఒంటిమిట్ట కోదండ రామయ్య సేవలో ఎందరో కవులు పుణీతులయ్యారు. అమూల్య ఆధ్యాత్మిక రచనలను రామయ్యకు అంకితం చేశారు. అయ్యలరాజు తిప్పయ్య క్రీ.శ. 1440లో జగదభిరాముడికి సాహితీ సేవ చేసి చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఒంటిమిట్ట రఘువీర జానకీ నాయక మకుటంతో ఆయన వెలువరించిన శతకం లభ్యమైంది. తొలుత రాచరిక పాలనలో తన పాండిత్యాన్ని సాగించినప్పటికీ తరువాత పూర్తిగా దాశరథి సేవకు అంకితమయ్యారు. ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల నేపథ్యంలో రామయ్య సేవలో తరించిన కవులపై కథనం. చమత్కార శైలి.. విభిన్నం అయ్యలరాజు రామభద్రుడు ఒంటిమిట్టలో క్రీ.శ. 1550లో ఇక్కడ నివాసం ఉన్నట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. రామాభ్యుదయం కావ్యం ఆయన కలం నుంచి జాలువారింది. శ్రీ కృష్ణదేవరాయల అల్లుడు రామరాయల మేనల్లుడు గొబ్బూరి నరసరాజుకు ఈ కావ్యాన్ని అంకితం చేశారు. రామాభ్యుదయం 8 ఆశ్వాసాల గ్రంధం. రామభద్రుని కవిత్వంలో చమత్కారం తొణికిసలాడుతుంది. చరిత్రపుటలలెక్కని కవి నల్లకాలువ అయ్యప్ప.. చరిత్ర పుటలలెక్కని కవి నల్లకాలువ అయ్యప్ప.. వరకవి నల్లకాలువ అయ్యప్ప కోదండ పాణిని సేవించి వర కవి అయ్యారు. చంద్రగిరిని పాలించిన రెండో వెంకటపతి రాయల బావమరిది కుమారుడు ఓబరాజు. ఈయన సర్వసైన్యాధ్యక్షుడిగా సేవలందిచారు. ఆయనను ప్రసన్నం చేసుకుని అయ్యప్ప కృతులు చెప్పారు. నెల్లూరు జిల్లా భీమవరం గ్రామాన్ని అగ్రహారంగా పొందారు. పూర్వం నెల్లూరు నుంచి తిరుపతి వరకు దాడులు జరిగాయి. బద్వేలు, నందలూరు, రాజంపేట, కోడూరు, మామండూరు ప్రాంతాల మీదుగా దాడులు చేశారు. ఈ ఘటనలన్నింటిని నిర్భయంగా శతక రూపంలో అద్భుతమైన పద్యాలతో ఆవిష్కరించారు. ఆ శతకమే ‘శతృసంహార వెంకటాచల విహార’ సాహితీ మణి మకుటం మట్లిరాజులు సిద్దవటం కేంద్రంగా పరిపాలన చేశారు. వీరు రామయ్య క్షేత్రాన్ని వైభవోపేతంగా తీర్చిదిద్దారు. గుడి నిర్మాణ సమయంలో ఉప్పు గొండూరు వెంకట కవి తరచూ సందర్శన నిమిత్తం ఇక్కడకి వచ్చేవారు. ఆ సమయంలోనే ఏకశిలానగరి రామయ్య మీద దశరథరామ అనే మకుటంతో శతకం రాశారు. రామయ్యను దర్శించిన అన్నమయ్యకోదండ రామస్వామిని పద కవితా పితామహుడు తాళ్లపాక అన్నమయ్య దర్శించి తన్మయం పొందారు. రాముడిపై అద్భుతమైన కీర్తనలను గానం చేశారు. నేటికి ఈ ప్రాంత ప్రజలకు ఆ కీర్తనలు సుపరిచితం. కోదండపాణి సేవలో పునీతులైన కవులు భాగవతం రచించిన బమ్మెర పోతన వాసుదాసు వాల్మీకి రామాయణం అంకితం అపర భక్తుడు మాల ఓబన్న రాముడికే అంకితం చేశారు. వావిలి కొలను సుబ్బారావు వావిలి కొలను సుబ్బారావు(వాసుదాసు) తన యావదాస్తిని రాముడికి అంకితం చేశారు. వా ల్మీకి మహర్షి సంస్కృతంలో రచించిన రామాయణాన్ని తెలుగులోకి అనువాదం చేశారు. కుమారాభ్యుదయం, కౌసల్యా పరిణయం రాశారు. 1908 అక్టోబర్ 9, 10, 11 తేదీలలో రామాయణం గ్రంథాన్ని రాముడికి అంకితం ఇచ్చారు. అక్షర హాలికుడు పోతన వ్యాస మహర్షి సంస్కృతంలో రచించిన భాగవతాన్ని బమ్మెర పోతన తెలుగులో రాశారు. మహావిష్ణువును శ్రీరాముడిగా ఆదరించి తరించిన అపర భక్తుడు. భాగవతం రచన చేసి జగదభిరాముడి చరణానికి అంకితం చేశారు. ఇక్కడి నేల తల్లితో మమేకమై అక్షర సేద్యం చేసి హాలికుడిగా ఆయన ప్రత్యేకతను చాటారు. అమూల్య సాహితీ గ్రంథాలను తనకు అంకితమివ్వమని రాజులు అడిగితే అందుకు ఆయన అంగీకరించ లేదు. ఆయనది సడలని భక్తి భావం రామాలయం తూర్పు దిశలో మాలకాటిపల్లె గ్రామం ఉంది. ఈ ఊరికి చెందిన భవనాసి మాల ఓబన్న జీవిత లక్ష్యం శ్రీరామచంద్రునిపై సడలని భక్తి భావం. ఆయన అమృత కంఠంతో నిరుపమాన రామకీర్తనలు పాడారు. పగటి పూట పనులు చేసుకుని రాత్రి పూట గుడికి ఎదురుగా ఉన్న సోపానాల ముందు కూర్చుని భజన పాటలు గానం చేసేవారు. బాగా పొద్దుపోయిన తరువాత ఇంటికి వెళ్లేవారు. ఒక రోజు సాయంత్రం రామయ్య దర్శనం కోసం తహసీల్దార్ వచ్చారు. ఆయన రావడాన్ని ఓబన్న గమనించలేదు. ఆధ్యాత్మికంగా అనురక్తితో లీనమై గానామృతం చేస్తూనే ఉన్నారు. దారికి అడ్డు తొలగలేదని తహసీల్దార్ ఆయనను దూషించారు. అదే రాజు రాత్రి తహసీల్దార్కు కలలో రాముడు కనిపించి భక్తుడిపై దూకుడు ప్రదర్శన మంచిది కాదని హితబోధ చేశారట. ఆ మరుసటి రోజు అధికారి ఓబన్న చెంతకు వచ్చి పొరపాటు జరిగిందని చింతించారు. భవనాసి పట్టుదల, భక్తిభావాన్ని చూసి మెచ్చుకున్నారు. నేటి పాలకులు మాల ఓబన్న సేవలను గుర్తించలేదు. ఆయనకు తగిన గుర్తింపు ఇవ్వడం లేదని భక్తుల ఆవేదన. -
వెంటిలేటర్పై వైద్య సేవ
పేదలకు ఉచిత వైద్యం అందించే బృహత్తర పథకం ‘ఎన్టీఆర్ వైద్య సేవ’ (ఆరోగ్య శ్రీ) పథకం పతనం దిశగా సాగుతోంది. ఇప్పటికే ఈ సంస్థలో పని చేస్తున్న సిబ్బంది తమ ఉద్యోగ భద్రత కోసం ఆందోళన బాట పట్టారు. మూడు దఫాలుగా విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. తాజాగా ఆషా (ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోషియేషన్) రాష్ట్ర కమిటీ వైద్య సేవల నిలుపుదలకు నిర్ణయించడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. కూటమి పాలకుల్లో ఎలాంటి స్పందన కనిపించకపోవడంతో ‘ఎన్టీఆర్ వైద్య సేవ’పథకంపై ‘పచ్చ’నీడలు కమ్ముకున్నాయి. కడప రూరల్: ‘ఎన్టీఆర్ వైద్య సేవ’ పథకం వెంటిలేటర్పై ఉంది. ఈ పథకంలో భాగంగా కార్పొరేట్ నెట్ వర్క్ ఆసుపత్రుల్లో పేదలకు ఉచితంగా వైద్య సేవలు లభించడమే ప్రధాన ఉద్దేశ్యం.ప్రభుత్వం ఈ నెట్ వర్క్ ఆసుపత్రులకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో పెండింగ్ బిల్లులు రూ. కోట్లల పేరుకు పోయాయి. దీంతో ఆసుపత్రుల యాజమాన్యాలు ‘బకాయిలు చెల్లిస్తే గాని తాము కోలుకోలేము..పేదలకు ఉచిత వైద్యంను అందించలేము’అని స్పష్టం చేశాయి. పేరుకు పోయిన బకాయిలు.. ‘ఎన్టీఆర్ వైద్య సేవ’పరిధిలో జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో నెట్ వర్క్ ఆసుపత్రులు ఉన్నాయి. అందులో ప్రైవేట్ కార్పొరేట్ (నెట్వర్క్) ఆసుపత్రుల తో పాటు ప్రభుత్వ ఆసుపత్రులు కూడా ఉన్నాయి. ● ప్రైవేట్ ఆసుపత్రులు వంద పడకలు, 50 పడకలు గల ఆసుపత్రులు ఉన్నాయి. ఒక రోజుకు వేలాది మంది నిరుపేద రోగులు ఉచిత వైద్యం కోసం నెట్ వర్క్ ఆసుపత్రులకు వస్తుంటారు. వారికి వైద్య సేవలు అందించాలంటే ఆసుపత్రుల యాజమాన్యానికి ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఈ ఆసుపత్రులకు ప్రభుత్వం కోట్లల్లో బకా యిలు చెల్లించాల్సి ఉంది. ఒక నెలకే ఒక ఆసుపత్రికి రూ.లక్షల్లో ఖర్చు ఉంటుంది. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి బకాయిలను సక్రమంగా చెల్లించలేదు. విడుదల చేసిన నిధుల కన్నా..ఆసుపత్రుల్లో అందించిన వైద్య సేవలు, అందాల్సిన బిల్లులు అధికంగా ఉన్నాయి. దీంతో నెట్ వర్క్ ఆసుపత్రుల వారు అవకాశం ఉన్న బ్యాంకుల నుంచి ఓవర్ డ్రాఫ్ట్లు, ప్రైవేట్ సంస్థల నుంచి వడ్డీలకు అప్పులు తెచ్చి ఆసుపత్రులను నిర్వహిస్తున్నట్లు ‘ఆషా’ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ● ప్రభుత్వ రంగానికి చెందిన ఆసుపత్రుల్లో ‘వైద్య సేవ’పథకం కింద ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సాధారణ డెలివరీలు, పెద్దాసుపత్రుల్లో సాధారణ డెలివరీలతో పాటు సర్జరీలు, అలాగే గర్భాశయం తదితర వ్యాధులకు సంబంధించి ఉచిత వైద్య సేవలు అందిస్తారు. ఇందుకు గాను ఒక్కో వ్యాఽధిని బట్టి వైద్య సేవ ట్రస్ట్ నుంచి బిల్లులు మంజూరవుతాయి. ఆ విధంగా వచ్చిన డబ్బును ప్రోత్సాహకం కింద వైద్యులకు 45 శాతం, ఆసుపత్రుల అభివృద్ధికి 55 శాతం కేటాయిస్తారు. అధిక సంఖ్యలో ప్రైవేట్ నెట్ వర్క్ ఆసుపత్రుల ద్వారానే దాదాపుగా 95 రకాల పైగా వ్యాధులకు ఉచిత వైద్య సేవలు లభించడంతో, ఈ ఆసుపత్రులపైనే పెనుభారం పడనుంది. ‘ఆరోగ్య శ్రీ’పై అక్కసు... 2007–2008లో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి పేదలకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఖరీదైన వైద్యంను అందించాలనే సంకల్పంతో ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు. తద్వారా లక్షలాది మంది పేదలు ఉచిత వైద్యం ద్వారా పునర్జన్మను పొందారు. అనంతరం వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని మరింత బలోపేతం చేసింది. కాగా టీడీపీ ప్రభుత్వం ఎప్పుడొచ్చినా ‘ఆరోగ్య శ్రీ’పథకం ఒడిడుడుకులను ఎదుర్కొంటుంది. దీంతో ‘ఆరోగ్య శ్రీ’అంటే టీడీపీకి అక్కసు అనే అభిప్రాయం నెలకొంది. ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం ఆసుపత్రులకు సకాలంలో బకాయిలు చెల్లించకపోవడంతో వైద్య సేవలు నిలిపే పరిస్థితులు వచ్చాయి. దీంతో ‘ఎన్టీఆర్ వైద్య సేవ’వెంటిలేటర్పై ఉందనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. పేదలను పట్టించుకోని ప్రభుత్వం‘వైద్య సేవ’లో పనిచేస్తున్న వైద్య మిత్రలు ఇతర సిబ్బంది తమ ఉద్యోగ భద్రత, సంస్థ మనుగడపై ఆందోళన చేపట్టారు. విడతల వారీగా విధులను బహిష్కరించి, శాంతియుత నిరసన తెలిపారు. నామమాత్రంగా చేపట్టిన విధుల బహిష్కరణకే ఉచిత వైద్యం కోసం వచ్చిన పేదలు ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ఏకంగా నెట్ వర్క్ ఆసుపత్రుల వారే పూర్తిగా వైద్య సేవల నిలుపుదలకు గట్టిగా నిర్ణయించా రు. ఇంత జరుగుతున్నా పాలకులకు చీమ కుట్టి నట్లైనా లేదు. వైద్య సేవలు నిలిచిపోతే అనారోగ్యం పాలైన రోగులకు ఉచిత వైద్యం అందక, వారి పరిస్థితి ఎంత దయనీయంగా మారుతుందో ఊహించుకోవడమే కష్టం. రూ.కోట్లల్లో పేరుకు పోయిన బకాయిలు స్పందించని కూటమి పాలకులు నేటి నుంచి ఉచితవైద్య సేవలు నిలుపుదల ‘ఆషా’రాష్ట్ర కమిటీ నిర్ణయం పేదల ఉచిత వైద్యంపై పెను ప్రభావం మాకు సహకరించాలి నెట్ వర్క్ ఆసుపత్రుల వారికి కోట్లల్లో బిల్లులు అందాలి. ప్రభుత్వం బిల్లులు విడుదల చేస్తేనే ఆసుపత్రులను నిర్వహించే పరిస్థితి ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ఆషా) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల 7 నుంచి ఉచిత వైద్య సేవలను నిలుపుదల చేస్తున్నాం. – డాక్టర్ భూమిరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, జిల్లా అధ్యక్షులు, ఏపీ స్పెషాలిటీ హస్పిటల్ అసోషియేషన్ ప్రమాదకర పరిస్థితులు ఉంటాయి సకాలంలో వైద్యం అందితేనే కోలు కోవడానికి చాలా టైమ్ పడుతుంది. అలాంటిది ఉచిత వైద్య సేవలు నిలిచిపోతే అనర్థాలు జరిగిపోతాయి. అనారోగ్యం పాలైతే లక్షలాది రూపాయలు చెల్లించి ప్రైవేట్ ఆసుపత్రుల్లో చూపించుకోలేం. ప్రభుత్వం మా లాంటి పేదలకు ఇబ్బందులు కలగకుండా చూడాలి. –గంగాధర్రెడ్డి, అక్కాయపల్లె, కడప -
చర్లపల్లి–తిరుపతి మధ్య ప్రత్యేక రైలు
కడప కోటిరెడ్డిసర్కిల్: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా హైదరాబాదులోని చర్లపల్లి–తిరుపతి (07017– 07018) మధ్య ప్రత్యే రైలును ప్రవేశపెట్టినట్లు కడప రైల్వే కమర్షియల్ ఇన్స్పెక్టర్ జనార్దన్ తెలిపారు. ఈ రైలు ఈనెల 6, 11, 13, 18, 20, 25, 27, మే 2, 4, 9, 11, 16, 18, 23, 25, 30 తేదీల్లో చర్లపల్లి నుంచి తిరుపతికి బయలుదేరుతుందన్నా రు. అలాగే తిరుపతి నుంచి ఈనెల 7, 12, 14, 19, 21, 26, 28, మే 3, 5, 10, 12, 17, 19, 24, 26 31 తేదీల్లో నడుస్తుందని పేర్కొన్నారు. ఈ రైలు ప్రతి శుక్ర, ఆదివారాల్లో చర్లపల్లిలో రాత్రి 9.35 గంటలకు, తిరుపతిలో సోమ, శనివారాలలో సాయంత్రం 4.40 గంటలకు బయలుదేరుతుందన్నారు. ఈ రైలు మల్కాజ్గిరి, కాచిగూడ, హుందానగర్, షాద్నగర్, జడ్చర్ల, మహబూబ్నగర్, వనపర్తిరోడ్డు, గద్వాల్, కర్నూలుసిటీ, డోన్, గుత్తి, తాడిపత్రి, ఎర్రగుంట్ల, కడప, ఒంటిమిట్ట, రాజంపేట, రేణిగుంట మీదుగా రాకపోకలు సాగిస్తుందని తెలిపారు. ప్రయాణికులు ముందస్తుగా తమ టిక్కెట్లను ముందుగానే రిజర్వు చేసుకోవాలని సూచించారు. -
ప్రజాస్వామ్యం అపహాస్యం
ప్రొద్దుటూరు: స్వయంగా పోలీసుల సమక్షంలోనే ప్రజాస్వామ్యం అపహాస్యం అయిందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి మండిపడ్డారు. ప్రొద్దుటూరులోని తన స్వగృహంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గత వారంలో గోపవరం గ్రామ పంచాయతీ ఉపసర్పంచ్ ఎన్నిక సందర్భంగా పోలీసులు, టీడీపీ నేతలు అనుసరించిన వైఖరిని తూర్పారబట్టారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజాస్వామ్యాన్ని బట్టలు ఊడదీసి నడిబజారులో నిలబెట్టారని విమర్శించారు. వాస్తవానికి టీడీపీకి ఒకే వార్డు మెంబర్ ఉన్నారని, పార్టీ మారిన వారితో కలిపి ఆరుగురు అయ్యారన్నారు. వైఎస్సార్సీపీకి సంబంధించి 14 మంది వార్డు మెంబర్లు ఉంటే టీడీపీ ఎలా గెలుస్తుందని ప్రశ్నించారు. అధికార పార్టీ నేతలు దౌర్జన్యంగా బెదిరించి వైఎస్సార్సీపీ వార్డు మెంబర్లను ఓటింగ్కు రాకుండా రాళ్లతో దాడి చేశారన్నారు. వాస్తవానికి వార్డు మెంబర్లు మాత్రమే పంచాయతీ కార్యాలయంలోకి వెళ్లాల్సి ఉండగా 30 మంది టీడీపీ నాయకులు చేపల మార్కెట్కు వెళ్లినట్లు వస్తున్నా పక్కన ఉన్న పోలీసులు ప్రశ్నించకుండా మిన్నకుండిపోయారని తీవ్ర విమర్శలు చేశారు. తమ వార్డు సభ్యులు ఓటింగ్కు వెళుతుండగా రాళ్లతో దాడి చేయడంతో ప్రాణభయంతో బయటపడ్డారన్నారు. ఇన్ని జరుగుతున్నా పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్ర వహించారన్నారు. నిస్సిగ్గుగా టీడీపీ నేతలు వ్యవహరించిన కారణంగానే చివరికి ఎన్నిక వాయిదా పడిందన్నారు. ఫేక్ ఐడీ కార్డులతో దొంగ వార్డు సభ్యులను లోనికి పంపి ఎన్నిక జరిపించాలని టీడీపీ నేతలు ఎన్నికల అధికారిని బూతులు తిట్టి చేయిచేసుకున్నారని ఆరోపించారు. బచ్చల పుల్లయ్య, బచ్చల ప్రతాప్, సెల్పాయింట్ నవీన్, చీమల రాజశేఖరరెడ్డి, పర్లపాడు మహేశ్వరరెడ్డి లాంటి వారంతా లోనికి ఎలా వెళ్లగలిగారని ప్రశ్నించారు. స్వయంగా తమ ఉప సర్పంచ్ అభ్యర్థిని కొట్టుకుంటూ ఈడ్చుకెళుతున్నా పోలీసులు నిలువరించలేకపోయారని తెలిపారు. డీఎస్పీతోపాటు పట్టణంలోని అన్ని పోలీస్స్టేషన్ల సీఐలు, ఎస్ఐలతోపాటు అక్కడే ఉండగా ఈ దౌర్జన్యకాండ జరిగిందన్నారు. టీడీపీ నేతలు విచ్చల విడిగా అరాచకానికి, దౌర్జన్యానికి పాల్పడినా కనీసం ప్రశ్నించలేకపోయారన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ నాయకులు అడ్డు అదుపు లేకుండా పెట్రేగిపోతున్నారని విమర్శించారు. ● సమావేశంలో ఎంపీపీ శేఖర్ యాదవ్, సర్పంచ్ మోషా, ఉపసర్పంచ్ అభ్యర్థి రాఘవేంద్రారెడ్డి, వైఎస్సార్సీపీ వార్డు సభ్యులు పాల్గొన్నారు. తప్పు చేసిన వారిని సస్పెండ్ చేయాలి నేడు ఎస్పీని కలుస్తాం మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి -
రోషన్ భయ్యా.. ఈ రోతేంటయ్యా!
సాక్షి, టాస్క్ఫోర్స్ : అతను ఓ పోలీస్ అధికారి. అయితే వీధి రౌడీకి ఏ మాత్రం తక్కువ కాకుండా ప్రవర్తించడం ఆయన నైజం. పని చేసిన ప్రతి చోట వివాదాలు సృష్టించుకోవడం.. ప్రజలతో ఛీ కొట్టించుకోవడం ఆయనకు పరిపాటి. అయితే పుష్ప సినిమాలో లాగా తాను ఏమాత్రం తగ్గేదేలే అనే చందాన వ్యవహరిస్తున్నాడు. తన పద్ధతి, విధానాలను పోలీసుశాఖ లక్ష్యాలకు అనుగుణంగా మార్చుకోవడానికి ఏమాత్రం ప్రయత్నించకపోవడం ఆయన ప్రత్యేకత. తన సర్కిల్ పరిధిలోని ప్రజలకు రోత పుట్టించే విధంగా విధి నిర్వహణ ఉందంటే ఆయన తీరు ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. నిష్పక్షపాతంగా విచారణ చేస్తే నిజానిజాలు బయటపడతాయని సర్కిల్ పరిధిలోని ప్రజలు గుసగుసలాడుతున్నారు. కమలాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి నేటి వరకు సీఐ రోషన్ వ్యవహార శైలిని గమనిస్తే కడప జిల్లాలో ఎక్కడో గాని ఇలాంటి అధికారి పోలీసుశాఖలో లేడనే చెబుతారు. డబ్బుల కోసం ఏ స్థాయికై నా దిగజారే మనస్తత్వం అని కమలాపురం ప్రాంతంలో ఏ ఒక్కరిని అడిగినా ఠక్కున చెప్పేస్తారు. ఇటీవల ఆయన విధి నిర్వహణలో అనేక భంగపాట్లు ఎదురైనా తనకు ఉన్నతాధికారుల అండ ఉందనే గర్వంతో పోలీసు స్టేషన్కు వచ్చే సామాన్య ప్రజల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూనే ఉన్నాడు. ఇలా ఈయన గురించి చెప్పుకుంటూ పోతే రోషన్ రోత చరిత్ర అనే పెద్ద పుస్తకమే రాయాల్సి ఉంటుంది. ఇక ఇటీవల కమలాపురంలో జరిగిన కొన్ని సంఘటనలు గమనిస్తే.. కమలాపురం మండలం కోగటం గ్రామంలో ఒక చిన్న స్థాయి వీధి గలాటాకు సంబంధించి వైఎస్సార్సీపీ మద్దతుదారుడైన ఓ వ్యక్తిని నాలుగు రోజుల కిందట పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి అధికార పార్టీ అగ్ర నాయకుడి ఆదేశాలతో ఆ వ్యక్తిపై పోలీసు జులుం ప్రదర్శించాడు. పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి పంపించాలంటే లక్ష రూపాయలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు. ఆ వ్యక్తి 45 వేల రూపాయలు చెల్లించడంతో ఆ డబ్బు తీసుకొని ఏమాత్రం సంతృప్తి చెందక మిగిలిన డబ్బుల కోసం ఆ వ్యక్తిపై వీధి రౌడీలా ప్రతాపాన్ని చూపాడు. సీఐ రోషన్ కొట్టిన దెబ్బలకు ఆ వ్యక్తి పోలీస్ స్టేషన్లో స్పృహ తప్పి పడిపోవడంతో కమలాపురానికి చెందిన ఒక వైద్యుడిని పోలీస్ స్టేషన్కు పిలిపించి వైద్యం చేయించారు. బాధితుడి కుటుంబీకులు ఈ విషయంపై ఆదివారం రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉమ ముఖ్యమంత్రి, రాష్ట్ర హోం మంత్రి, డీజీపీ, డీఐజీ, ఎస్పీ, మానవ హక్కుల సంఘానికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అలాగే కమలాపురం పట్టణంలో ఇటీవల జరిగిన పదోతరగతి పరీక్ష లీకేజీ వ్యవహారంలో బాధ్యులు కాని వ్యక్తులపై కూడా అధికార పార్టీ అగ్ర నాయకుడు చెప్పాడనే ఏకై క కారణంతో స్వామి భక్తిని చాటుకునేందుకు.. దీనికితోడు వారి దగ్గర డబ్బును బాగా దండుకోవచ్చనే దురుద్దేశంతో సంబంధం లేని వ్యక్తులను సైతం పోలీస్ స్టేషన్కు పిలిపించి.. కేసు నమోదు చేసి.. వారిని బెదిరించి.. వారి నుంచి భారీ స్థాయిలో డబ్బులు డిమాండ్ చేసి వసూలు చేసిన విషయం కమలాపురంలో వీధి వీధినా వ్యాపించింది. డబ్బులు ఇవ్వని కొందరు నిందితులను భారీ స్థాయిలో పోలీస్ కోటింగ్ ఇచ్చిన ఘనత కూడా రోషన్కే దక్కింది. అలాగే చిన్నచెప్పలి గ్రామానికి చెందిన తండ్రి కొడుకుల ఆస్తి వ్యవహారంలో రోషన్ వ్యవహరించిన అత్యుత్సాహం సామాన్యుడిని సైతం నివ్వెర పరిచింది. జిల్లా ఉన్నతాధికారి ఈ విషయంలో జోక్యం చేసుకోవడంతో రోషన్ కొంచెం వెనక్కి తగ్గినట్టుగా కనిపించింది. ఈయన కమలాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు చేపట్టిన మొదటి నెలలోనే రాయచోటి ప్రాంతానికి సంబంధించిన ఒక వ్యక్తికి కమలాపురానికి సంబంధించిన ఒక మైనారిటీ వర్గ నాయకుడికి జరిగిన వ్యవహారంలో వైఎస్సార్సీపీకి మద్దతుగా ఉన్న ఆ మైనార్టీ నాయకుడిని బెదిరించి దాదాపు 15 లక్షలకు పైగా వసూలు చేసుకున్న ఘనాపాటి ఈ సీఐ అని ప్రజలు చర్చించుకుంటున్నారు. డబ్బులు ఇచ్చిన వ్యక్తి స్వయంగా ఒక డివిజనల్ అధికారిని కలిసి ఫిర్యాదు చేసి వీడియో దృశ్యాలను చూపించినా ఆ డివిజనల్ అధికారి మిన్నకుండిపోవడం గమనిస్తే ఈ సీఐ ఏ స్థాయిలో అధికారులను తన వైపు తిప్పుకుంటున్నాడో తెలిసిపోతోంది. ఇక ఇటీవల కడప జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన ఈ జీ అశోక్ కుమార్ తమ నియోజకవర్గ నాయకుడికి అత్యంత ఆప్తుడని, అలాగే రేంజ్ పరిధిలో ఉన్న ఓ అధికారి సైతం తమ నాయకుడి మాటే వింటాడని తనను ఎవరూ ఏమీ పీకలేరని బహిరంగంగానే ఈ అధికారి మాట్లాడడం గమనిస్తున్న కమలాపురం ప్రజానీకం ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ సీఐ గారికి జీతం ఇచ్చేది నియోజకవర్గానికి చెందిన అధికార పార్టీ అగ్ర నాయకుడా?? లేక పోలీస్ శాఖనా అనే విషయంపై చర్చ కూడా కమలాపురం ప్రాంతంలో జోరుగా జరుగుతోంది. జిల్లాలో ఎక్కడా లేని విధంగా కమలాపురం పట్టణంలో దాదాపు పదికి పైగాా అధికార పార్టీ అగ్ర నాయకుడి బెల్ట్ షాపులు బహిరంగంగా బార్లను తలదన్నే విధంగా నడుస్తున్నాయంటే వాటి నుంచి ఈయన ఎంత దండుకుంటున్నాడో మరో మాట చెప్పాల్సిన అవసరమే లేదు. ఇంత బహిరంగంగా బెల్ట్ షాపులు ఈ సీఐ రోషన్ సహాయంతో నడుస్తున్నప్పటికీ సంబంధిత ఎకై ్సజ్ శాఖ కూడా కళ్లకు గంతలు కట్టుకున్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికై నా పోలీస్ శాఖ ఉన్నతాధికారులు ఈ విషయంలో తగిన జోక్యం చేసుకొని రోషన్ ఆగడాలను అరికట్టకపోతే కమలాపురం పోలీసుల తీరు మరో బీహార్ ప్రాంతాన్ని తలపించే విధంగా మారుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. రాజకీయ అండతో రెచ్చి పోతున్న సీఐ రోషన్ డబ్బుల కోసం ప్రజలను పీక్కు తింటున్న వైనం గతంలో ఉన్నతాధికారులు హెచ్చరించినా మారని తీరు కోగటం సంఘటనపై సీఐ రోషన్ను వివరణ కోరగా అదంతా బోగస్ అని కొట్టి పారేశారు. వారు లాయర్కు డబ్బు ఇచ్చుకున్నారేమో గాని తాను డబ్బు అడగలేద ని వివరించారు. -
శ్రీరాముడి జీవితం ఆదర్శం
– డీఈఓ డాక్టర్ షంషుద్దీన్ కడప ఎడ్యుకేషన్ : ప్రతి ఒక్కరూ శ్రీ రాముని జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని, సన్మార్గంలో నడవాలని జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ షేక్. షంషుద్దీన్ సూచించారు. కడప మున్సిపల్ హైస్కూల్ మెయిన్లో పదవ తరగతి ప్రశ్నా పత్రాలను మూల్యాంకనం చేస్తున్న ఉపాధ్యాయులకు ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా జిల్లా విద్యాశాఖాధికారి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ రామయ్య చిట్స్ వారి సహకారంతో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం (ఆపస్) జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పానకం, వడపప్పు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనుషులంతా ఈర్ష్య, అసూయ, ద్వేషాలను విడనాడి ఒకరికొకరు సహకరించుకుంటూ ఆనందంగా జీవించాలన్నారు. పానకం, వడపప్పు పంపిణీకి ఆర్థిక సహకారం అందించిన శ్రీ రామయ్య చిట్స్ నిర్వాహకులు కళావతి, రమేష్ దంపతులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉప విద్యాశాఖాధికారి రాజగోపాల్ రెడ్డి, కడప ఎంఈఓ గంగిరెడ్డి, డీఈఓ కార్యాలయ సూపరింటెండెంట్ బాదుల్లా, ఆపస్ నాయకులు పోగుల వెంకట్రామిరెడ్డి, సుబ్బరాయుడు, దేవిరెడ్డి కొండారెడ్డి, మిట్టా కేశవరెడ్డి, పీఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు లెక్కల జమాల్ రెడ్డి, ఎస్ఎల్టీఏ నాయకులు అంకాల్ కొండయ్య, గిరిబాబు, వివిధ ఉపాధ్యాయ సంఘ నాయకులతో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
అరటితోటలో 300 మొక్కలు దగ్ధం
కొండాపురం : మండల పరిధిలోని వెంకయ్య కాలువ గ్రామానికి చెందిన ఎస్.శంకర్రెడ్డి అరటి తోటలో 300 మొక్కలు దగ్ధమైన సంఘటన రెండు రోజుల కిందట జరిగింది. రైతు వివరాల మేరకు... తోట సమీపంలోని బీడు భూమిలో ఎండిన గడ్డికి అగ్గిపెట్టడంతో నిప్పు రవ్వలు అరటితోటలో పడ్డాయి. దీంతో సుమారు 300 మొక్కలు కాలిపోయాయి. మొక్కలు గేల వేసే సమయంలో ఈ ఘటన జరగడంతో సుమారు రూ.2లక్షల నష్టం వాటిల్లిందని రైతు తెలిపారు. రైతును ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. పర్యావరణంపై అవగాహన ఉండాలి కడప ఎడ్యుకేషన్ : విద్యార్థి దశ నుంచే పర్యావరణంపై అవగాహన పెంచుకోవాలని నేషనల్ గ్రీన్ కోర్ జిల్లా కోర్డినేటర్(ఎన్జీసీ) టీవీ.రమణయ్య సూచించారు. ఏపీ ఎన్జీసీ, పర్యావరణ విద్య సౌజన్యంతో నేచర్ క్యాంపు శనివారం నిర్వహించారు. పొలతలలో జిల్లా నుంచి వచ్చిన ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు వృక్ష, జంతు సంబంధమైన విషయాలపై అవగాహన కల్పించారు. స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించి పర్యావరణంపై క్విజ్, డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు. విజేతలకు కడప పదో తరగతి మూల్యాంకన కేంద్రంలో డీఈఓ షంషుద్దీన్, కడప ఉప విద్యా శాఖాధికారి రాజగోపాల్రెడ్డి సర్టిఫికెట్, బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ కోఆర్డినేటర్స్ విజయమోహన్రెడ్డి, దానం, రవీంద్ర, సూర్యచంద్ర రెడ్డి, అహల్యాభాయి తదితరులు పాల్గొన్నారు ఈత సరదా తీసింది ప్రాణం పులివెందుల రూరల్ : మండు టెండల్లో ఉపశమనం కోసం సరదాగా ఈతకు వెళ్లిన యువకుడు, ఓ విద్యార్థికి అకస్మాత్తుగా ఫిట్స్ రావడంతో అక్కడికక్కడే మృతి చెందిన వైనం శనివారం జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. పులివెందుల మండలం అచ్చివెళ్లి పంచాయతీ పరిధిలోని కానేపల్లె గ్రామానికి చెందిన సుబ్బరాయుడి కుమారుడు శివ(26) పులివెందుల పట్టణంలో ఉద్యోగం చేస్తున్నాడు. తన ఇంటి సమీపంలో కుంట వద్దకు శనివారం సరదాగా ఈత కొట్టడానికి వెళ్లారు. ఈ సమయంలో అతడికి ఫిట్స్ రావడంతో నీటిలో మునిగి మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. పెద్ద దిక్కుగా మారిన కొడుకు చనిపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు బోరున విలపించారు. ముమ్మడిగుంటపల్లెలో మరొకరు.. సిద్దవటం : మండలంలోని ముమ్మడిగుంటపల్లె వ్యవసాయ పొలాల్లోని బావిలో ఈతకు వెళ్లి ఫిట్స్ రావడంతో మరో విద్యార్థి మృతి చెందాడు. బంధువుల కథనం మేరకు.. ఒంటిమిట్ట మండలం చొన్నకొత్తపల్లె గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థి తమ్మిశెట్టి శ్రీనివాసులు(16) శనివారం మధ్యాహ్నం గ్రామస్తులు, స్నేహితులతో కలిసి ముమ్మడిగుంటపల్లె వ్యవసాయ పొలాల్లోని బావిలో ఈత కోసం వెళ్లారు. బావిలో ఈత కొట్టి బయటకు రాగానే శ్రీనివాసులుకు ఫిట్స్ రావడంతో అక్కడికకక్కడే మృతిచెందారు. వడదెబ్బతో దివ్యాంగుడు మృతి రాజంపేట రూరల్ : ఎండ వేడిమి అధికం కావడంతో వడదెబ్బ సోకి దివ్యాంగుడు కుల్లూరు నరసింహులు(38) శనివారం మృత్యువాత పడ్డారు. పట్టణ శివారులోని డీబీఎన్పల్లి అరుంధతి వాడకు చెందిన కుల్లూరు చిన్న నరసింహులు, రంగమ్మలకు ఆరుగురు సంతానం. తల్లిదండ్రులు మరణించడంతో పెద్ద కుమారుడు శ్రీనివాసులు బేల్దారి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఇతనికి తోడుగా దివ్యాంగులైన నరసింహులు, చెంగలరాయుడు బేల్దారి పనికి వెళ్తున్నారు. ఈ క్రమంలో నరసింహులుకు శుక్రవారం నుంచి విరేచనాలు, వాంతులయ్యాయి. శనివారం తీవ్రం కావడంతో తన గృహంలో కుప్పకూలిపోయాడు. హుటాహుటిన పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే డీ హైడ్రేషన్ కారణంగా నరసింహులు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారని ఆయన బంధువు మహేశ్వరి తెలిపారు. దాతలు ఆదుకోవాలని కోరారు. రెండు జేసీబీలు, ట్రాక్టర్ సీజ్ కలికిరి : అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు జేసీబీలు, ఒక ట్రాక్టరును సీజ్ చేసినట్లు సీఐ రెడ్డిశేఖర్రెడ్డి తెలిపారు. పోలీసుల కథనం మేరకు... మండలంలోని మేడికుర్తి పరిధిలోని బాహుదానదిలో ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా జేసీబీలతో ట్రాక్టర్లకు ఇసుక వేస్తున్నట్లు అందిన సమాచారం మేరకు దాడులు నిర్వహించారు. నదిలో ఉన్న రెండు జేసీబీలను, ఒక ట్రాక్టరును సీజ్ చేసినట్లు సీఐ తెలిపారు. తదుపరి చర్యల నిమిత్తం తహశీల్దారుకు అప్పగించనున్నట్లు చెప్పారు. ఏఎల్సీసీ మూవీ టీజర్ రిలీజ్ కురబలకోట : ఏఎల్సీసీ(ఓ యూనివర్సల్ బ్యాచిలర్) మూవీ టీజర్ను అంగళ్లు వద్ద విశ్వం ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన ఫంక్షన్లో విశ్వం విద్యా సంస్థల అధినేత ఎం.ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఎల్ఆర్ ఫిల్మ్ సర్క్యూట్స్ బ్యానర్పై నిర్మించిన ఏఎల్సీసీ చిత్రం విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. చిత్ర హీరో జెపి.నవీన్, దర్శక, నిర్మాత కోలా లెలీదర్రావుకు గుర్తింపు రాగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. హీరో నవీన్, నటులు శ్రీనివాసరెడ్డి, ధనుష్, ప్రిన్సిపల్ డాక్టర్ ఎం.రమణారెడ్డి, ఎఎల్సీసీ చిత్ర బృందం పాల్గొన్నారు. -
సకల గుణాభిరామా.. శ్రీరామా
సకల సద్గుణాలకు మారురూపుగా, మానవాళికి ఆదర్శంగా అపురూపమైన బంధాలకు ఆలవాలంగా నిలిచిన శ్రీరాముడు జన్మించిన శుభదినం. ఆయన సీతారాముడయ్యే శుభలగ్నం వెరసి ఆదివారం శ్రీరామ నవమి వేడుకలను ఘనంగా నిర్వహించుకునేందుకు జిల్లా అంతటా రామాలయాలు పండుగ శోభతో కళకళలాడుతున్నాయి. కడప కల్చరల్ : సీతా, రాముల కల్యాణ వేడుకలకు జిల్లా వ్యాప్తంగా ఆయా ఆలయాల్లో నిర్వాహకులు చురుగ్గా ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర అధికారిక ఆలయం కోదండ రామాలయం జిల్లా ఒంటిమిట్టలో ఉండడంతో జిల్లాకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. శ్రీరామ నవమి పండగను జిల్లాలో ఇటీవల భారీగా నిర్మించిన రామాలయాలలో ఘనంగా నిర్వహిస్తారు. శనివారం సాయంత్రానికే ఆలయాలు, వీధుల్లో చలువ పందిళ్లు, షామియానాలు వెలిశాయి. ఇక పండగ రోజున ప్రజలు ఒకే చోట చేరి స్వామి, అమ్మవారి పెళ్లి తిలకించి విందు భోజనాలు చేస్తారు. ఔత్సాహిక భక్తులు, నిర్వాహకులు అందించే పానకం, వడపప్పు, తీర్థ ప్రసాదాలు శ్రీరామ నవమి ప్రత్యేకతను చూపుతాయి. ఓ శుభ కార్యానికి బంధుమిత్రులు, ఇరుగుపొరుగులతో కలిసి రెండు గంటలపాటు ఒకే చోట కలిసి ఉండే అపురూపమైన అవకాశం శ్రీరామ నవమి ఇస్తోంది. జిల్లాలో చిన్న, పెద్ద రామాలయాలు దాదాపు 4 వేలకు పైగా ఉన్నాయి. వాటితోపాటు పెద్ద వైష్ణవాలయాలు కూడా శ్రీరామనవమి పండుగకు సిద్ధమయ్యాయి. ఉదయం పది గంటల తర్వాత ఆయా ఆలయాల్లో పురోహితుల నిర్ణయాన్ని బట్టి సీతారాముల కల్యాణోత్సవాన్ని నిర్వహించేందుకు ప్రత్యేక వేదికలను సిద్ధం చేశారు. భక్త బృందాలు ఆలయాలకు పండగ శోభ కల్పించడంలోభాగంగా మామిడి తోరణాలు, అరటి బోదలతో అలంకరించడం, కల్యాణానికి హాజరయ్యే భక్తులందరికీ ప్రసాదంగా పంచి పెట్టేందుకు పానకం, వడపప్పు తయారు చేయడంలో నిమగ్నమయ్యారు. పలు పెద్ద ఆలయాలలో కల్యాణ అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుంచి భక్తులందరికీ విందు ఏర్పాటు చేసేందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కొన్ని ఆలయాల్లో ఉగాది నుంచి శ్రీరామ నవమి వరకు ప్రతిరోజు ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం లోపుగా కల్యాణం, సాయంత్రం 6 గంటల నుంచి నగరోత్సవాలు నిర్వహించేందుకు రథాలు, పల్లకీలు సిద్ధం చేసుకుంటున్నారు. నేడు జిల్లా అంతటా కల్యాణానికి ఏర్పాట్లు -
ప్రజలను రెచ్చగొట్టి పంపిస్తున్నారు
కడప అర్బన్ : అధికార పార్టీ నాయకులు అమాయకులైన ప్రజలను రెచ్చగొట్టి డబ్బులిచ్చి ఇళ్లపైకి పంపిస్తున్నారని, ఇది విష సంస్కృతికి నాంది పలుకుతోందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం ఎస్బీ.అంజద్బాషా, నగర మేయర్ సురేష్బాబు, ఇతర వైఎస్సార్ సీపీ నేతలు తెలిపారు. కడప ఎస్పీ బంగ్లాలో శనివారం రాత్రి జిల్లా ఎస్పీ ఈజీ.అశోక్కుమార్ను వారుకలిసి వినతిపత్రం అందజేశారు. అంజద్బాష మాట్లాడుతూ వైఎస్సార్సీపీ కార్యకర్త ఇబ్రహీంమియా చెన్నూరు బస్టాండు వద్ద వ్యాపారం చేసుకుంటుండగా, కొందరు మహిళలు వారి అనుచరులతో వచ్చి విచక్షణారహితంగా కొట్టి నీ అంతుచూస్తామంటూ వార్నింగ్ ఇచ్చి వెళ్లారన్నారు. ఇబ్రహీంమియా తనకు జరిగిన అన్యాయంపై వన్టౌన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లారని, అక్కడి పోలీసులు మియా ఇచ్చిన ఫిర్యాదు తీసుకోలేదన్నారు. మియా తనకు ఫోన్ ద్వారా తెలుపగా వన్టౌన్ పోలీసుస్టేషన్కు వెళ్లి సీఐ రామకృష్ణతో మాట్లాడానన్నారు. ఇబ్రహీం మియాకు తగిలిన గాయాలు చూపించి కేసు కట్టాలని విజ్ఞప్తి చేశామన్నారు. ఈ నెల 4న సాయంత్రం 5 గంటలకు అశోక లాడ్జి వద్ద తన ఇంటి నివాస స్థలానికి కొంతమంది మహిళలు వారి అనుచరులు, కొంతమంది మీడియాతో వచ్చి తన చిత్రపటాన్ని ఫ్లెక్సీలను ముద్రించి ఆందోళన చేశారన్నారు. సాధారణంగా తన దృష్టికి వచ్చిన ఏ సమస్యనైనా పరిష్కరించేందుకు తాను ముందుంటానని, అందులో భాగంగానే శుక్రవారం స్టేషన్కు వెళ్లి వైఎస్సార్సీపీ కార్యకర్త ఇబ్రహీం మియాను పరామర్శించడం జరిగిందన్నారు. గతంలో మేయర్ సురేష్బాబు ఇంటి ఎదుట చెత్త వేయించి నినదిస్తూ కూర్చొన్నారన్నారు. ఇవన్నీ చూస్తుంటే కడపలో ఒక కొత్త సంప్రదాయానికి తెరలేపారన్నారు. తాను రెండుసార్లు ఎమ్మెల్యేగా, డిప్యూటీ సీఎంగా, సురేష్బాబు జెడ్పీ చైర్మన్గా, రెండు సార్లు నగర మేయర్గా, నాలుగుసార్లు జిల్లా అధ్యక్షులుగా పనిచేశామని, తమకే భద్రత లేకపోతే కార్యకర్తలు, సాధారణ ప్రజలకు ఏం భద్రత ఉంటుందో ఆలోచించాలన్నారు. ఈ సంఘటనలపై విచారణ చేసి కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు పులిసునీల్కుమార్, ఎస్ఎండీ.షఫీ, దాసరి శివప్రసాద్, దేవిరెడ్డి ఆదిత్య తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఎస్పీకి వైఎస్సార్సీపీ నేతల వినతి -
శాస్త్రోక్తంగా అంకురార్పణ
ఒంటిమిట్ట: ఒంటిమిట్టలో జాంబవంతుడు ప్రతిష్టించిన శ్రీ కోదండరామస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలకు శనివారం ఆలయ టీటీడీ డిప్యూటీ ఈవో నటేష్ బాబు ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా అంకురార్పణ చేశారు. తొలుత ఉత్సవ నిర్వాహకుడు రాజేష్భట్టర్ను సంప్రదాయబద్ధంగా ఆలయంలోకి తీసుకువచ్చారు. ఉదయం 4 గంటలకు సుప్రభాతంతో స్వామి వారిని మేల్కోలిపి, పరివార దేవతలకు తిరుమంజనం నిర్వహించారు. ఉదయం 5 నుంచి 6 గంటల వరకు వ్యాసాభిషేకం, ఆరాధన, అర్చన చేశారు. రాత్రి 6 నుంచి 8 గంటల వరకు అర్చకులు వేదమంత్రాల నడుమ శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ రంగ మండపంలో ఉత్సవ మూర్తులకు బంగారు ఆభరణాలు, పట్టువస్త్రాలు తొడిగి, తులసి గజమాలతో సుందరంగా అలంకరించారు. అనంతరం ఉత్సవ నిర్వాహకుడు రాజేష్భట్టర్ ఉత్సవ మూర్తులకు అంకురార్పణ పూజలు నిర్వహించి, ఆలయంలోని పవిత్ర పుట్టమన్నును యాగశాలలో ప్రతిష్టించారు. నేడు ధ్వజారోహణం ఆదివారం ఉదయం 9:30 నుంచి 10:15 గంటల మద్య వృషభలగ్నంలో ధ్వజారోహణం జరుగనుంది. సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు పోతన జయంతి, కవి సమ్మేళనం, రాత్రి 7 నుంచి 9 వరకు శేషవాహన సేవ ఉంటాయి. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో నటేష్బాబు, ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్, ఆలయ అర్చకులు, పండితులు, టీటీడీ సిబ్బంది పాల్గొన్నారు. -
వక్ఫ్ బిల్లును ఆమోదించింది.. కూటమి ప్రభుత్వమే
కమలాపురం: లోక్ సభ, రాజ్యసభలో ఎన్డీఏ ప్రభు త్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ బిల్లును ఏపీలోని కూటమి ప్రభుత్వం ఆమోదించిందని, అయితే ఆ బిల్లును రెండు సభల్లోనూ వైఎస్సార్సీపీ తీవ్రంగా వ్యతిరేకించిందని వైఎస్సార్సీపీ వైఎస్సార్ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు. కమలాపురంలోని పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కొన్ని పత్రికల్లో, పచ్చ మీడియాలో వైఎస్సార్సీపీ లోక్ సభలో వ్యతిరేకించి, రాజ్యసభలో మద్దతిచ్చిందని రావడం అసత్యం అన్నారు. వైఎస్సార్సీపీ రెండు సభల్లోనూ పూర్తిగా వ్యతిరేకించిందని ఆయన నొక్కి వక్కాణించారు. మహానేత వైఎస్సార్ ముస్లింల పక్షపాతి అని, ముస్లింలకు 4శాతం రిజర్వేషన్ కల్పించి వారికి విద్య, ఉపాధిలో స్థిరపడేలా చేసిన ఘనత వైఎస్సార్కే దక్కుతుందన్నారు. అలాగే ఆయన తనయుడు మాజీ సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డి ముస్లింల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారని, డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడంతోపాటు ప్రతి మసీదులో ఇమాం, మౌజన్లకు జీతాలిచ్చే పద్ధతి తీసుకువచ్చారన్నారు. చంద్రబాబు రెండు కళ్ల పద్ధతి పాటిస్తున్నారని, ఏపీలో ముస్లింల ఓట్లు దండుకుని, ఢిల్లీలో ముస్లింలు వ్యతిరేకిస్తున్న బిల్లుకు మద్దతు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. ఓటర్లను వాడుకొని వదిలేయడం చంద్రబాబు నైజమని ఊసరవెల్లిలా రంగులు మార్చే నాయకుడు ఆయనొక్కడే అన్నారు. వక్ఫ్ ఆస్తులకు ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదన్నారు. వక్ఫ్ ఆస్తులను తమ పార్టీ నాయకులకు, బినామీలకు కట్టబెట్టేందుకే చంద్రబాబు వక్ఫ్ బిల్లుకు మద్దతు ఇస్తున్నారన్నారు. బిల్లు ఇలా పాస్ అయిందో లేదో అప్పుడే వక్ఫ్ ఆస్తులను అభివృద్ధి చేయడానికి ఇష్టమున్న వారు ముందుకు రావాలని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పేరిట పత్రికల్లో ప్రకటనలు రావడం ఇందుకు నిదర్శనమని, మొబైల్ ఫోన్లో చూపిస్తూ ఆరోపించారు. వక్ఫ్ ఆస్తులు దోచేయడానికి టీడీపీ నాయకులు కుట్ర పన్నారని, బిల్లుకు ప్రజల ఆమోదం లేదని స్పష్టం చేశారు. తమ పార్టీ ఎప్పటికీ ముస్లింలకు బాసటగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆ పార్టీ నాయకులు రాజుపాళెం సుబ్బారెడ్డి, సుమిత్రా రాజశేఖర్రెడ్డి, గంగాధర్ రెడ్డి, మహ్మద్ సాదిక్, మారుజోళ్ల శ్రీనివాసరెడ్డి,మోహన్ రెడ్డి, కొండారెడ్డి, ఆర్వీఎన్ఆర్, లక్ష్మీ నారాయణరెడ్డి, జగన్ మోహన్రెడ్డి, గఫార్, ఖాజా హుసేన్, జిలాని, ఆచారి, జనార్థన్ రెడ్డి, ఆంజనేయరెడ్డి, చంద్రశేఖర్రెడ్డి, సుదర్శన్ రెడ్డి, జెట్టి నగేష్, శ్రీరాం రమణ, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఆ బిల్లుకు ప్రజల ఆమోదం లేదు వక్ఫ్ ఆస్తులతో ప్రభుత్వానికి సంబంధం లేదు కాపాడుకోవాల్సిన బాధ్యత ముస్లింలపై ఉంది వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్రెడ్డి -
సామాజిక విప్లవ యోధుడు జగ్జీవన్
కడప సెవెన్రోడ్స్: సామాజిక వివక్షతను జయించిన సామాజిక విప్లవ యోధుడు డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ అని, ఆయనకు దేశం యావత్తు నీరాజనాలు అర్పిస్తోందని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి కొనియాడారు. శనివారం కలెక్టరేట్లో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అదితి సింగ్, డీఆర్వో విశ్వేశ్వర నాయుడు, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ అనితా దీప్తి,జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డీడీ సరస్వతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో శాంతియుత వాతావరణం నెలకొల్పడం, వివక్షతను నిర్మూలించడంలో ఆయన చేసిన కృషికి గుర్తుగా ఆయన జన్మదినాన్ని భారత ప్రభుత్వం ‘సమతా దివస్‘గా పరిగణించిందన్నారు. విలువలతో కూడిన ఆయన జీవితం మన అందరికీ ఆదర్శనీయమని, ఆయన అడుగు జాడల్లో నేటి యువత నడవాలని కోరారు. కార్యక్రమంలో ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం కలెక్టర్, అధికారులు,వివిధ సంఘాల నేతలతో కలసి డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎల్డీఎం జనార్దన్, పరిశ్రమల శాఖ జీఎం చాంద్ బాషా, ఎస్సీ,ఎస్టీ హ్యూమన్ రైట్స్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షుడు జేవీ రమణ, జాతీయ చేతి వృత్తుల ఐక్యవేదిక అధ్యక్షుడు అవ్వారు మల్లికార్జున, లోక్ జనశక్తి పార్టీ ప్రతాపరెడ్డి, మహాజన పార్టీ అధ్యక్షుడు సంగటి మనోహర్, దళిత మిత్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె రామాంజులు తదితరులు పాల్గొన్నారు. మహనీయుడు బాబూ జగజ్జీవన్ రామ్ కడప అర్బన్: దేశ స్వాతంత్య్ర సమరయోధుడు, సంఘసంస్కర్త, భారత మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ జీవితం స్ఫూర్తిదాయకమని ఎస్పీ ఈ.జి అశోక్ కుమార్ కొనియాడారు. శనివారం బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏ.ఆర్ అదనపు ఎస్పీ బి. రమణయ్య, ఏ.ఆర్ డి.ఎస్.పి కె.శ్రీనివాస రావు, ఆర్ఐలు ఆనంద్, వీరేష్, టైటాస్, శివరాముడు, పోలీస్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు దూలం సురేష్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉప్పు శంకర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి -
వక్ఫ్ బిల్లుకు మద్దతిచ్చామంటూ టీడీపీ దుష్ప్రచారం
కడప సెవెన్రోడ్స్: వక్ఫ్ సవరణ బిల్లుకు రాజ్యసభలో వైఎస్సార్సీపీ మద్దతు ఇచ్చిందంటూ టీడీపీ నేతలు దుష్ప్రచారానికి దిగడం వారి నీచ సంస్కృతిని బట్టబయలు చేస్తోందని రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి ఎస్బీ.అంజద్బాషా ధ్వజమెత్తారు. కడపలో మీడియాతో శనివారం ఆయన మాట్లాడుతూ నారా లోకేష్ ఆధ్వర్యంలో నడుస్తున్న సోషల్ మీడియా వైఎస్సార్సీపీపై దుష్ప్రచారానికి పాల్పడుతోందని మండిపడ్డారు. వక్ఫ్ సవరణ బిల్లును లోక్సభలో వ్యతిరేకించిన వైఎస్సార్సీపీ రాజ్యసభలో మద్దలిచ్చిందంటూ టీడీపీ నేతలు నక్కాఆనంద్బాబు, నాగుల్ మీరాలు చెప్పడంలో ఎలాంటి నిజం లేదన్నారు. తమ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి మాటకు కట్టుబడే ఉంటారని, లోక్సభలో తమ పార్టీ ఫ్లోర్ లీడర్ మిథున్రెడ్డి బిల్లుకు వ్యతిరేకంగా మాట్లాడిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రాజ్యసభలో తమ పార్టీ ఫ్లోర్ లీడర్ వైవీ.సుబ్బారెడ్డి బిల్లును వ్యతిరేకిస్తూ సుమారు పది నిమిషాలు మాట్లాడారన్నారు. వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులంతా బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలంటూ వైవీ.సుబ్బారెడ్డి జారీ చేసిన విప్ను ఆయన ఈ సందర్భంగా ప్రదర్శించారన్నారు. విప్ జారీలో ఇంత స్పష్టంగా ఉన్నప్పటికీ టీడీపీ సోషల్ మీడియా దుష్ప్రచారం చేయడం దారుణమన్నారు. బిల్లుకు అనుకూలంగా రాజ్యసభలో 125 ఓట్లు రాగా, వ్యతిరేకంగా వచ్చిన 95 ఓట్లలో వైఎస్సార్ కాంగ్రెస్వే ఏడు ఉన్నాయన్నారు. ఈ విషయం నేషనల్ మీడియా తెలియజేసిందని, పవన్ కల్యాణ్ బిల్లుకు తాము మద్దతు ఇస్తున్నట్లు స్పష్టంగా చెప్పారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇటీవల జరిగిన ఇఫ్తార్ విందులో ముస్లింలపై ఈగ వాలనివ్వబోమని, వక్ఫ్ ఆస్తులకు నష్టం కలగదని, ముస్లింలకు అండగా ఉంటామని మాట్లాడి.. ఇప్పుడు బిల్లుకు అనుకూలంగా ఓటు వేయడం ఆయన నీచ రాజకీయాలకు నిదర్శనమని దుయ్యబట్టారు. ● ఉభయ సభల్లో వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ సభ్యులు ఓటేశారు ● లోకేష్ ఆధ్వర్యంలో సోషల్ మీడియా ద్వారా బురదజల్లే యత్నం ● బిల్లులకు మద్దలిచ్చిన టీడీపీ మైనార్టీ ద్రోహిగా నిలిచిపోయింది ● రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి ఎస్బీ అంజద్బాషా -
బాబూ జగ్జీవన్రాం ఆదర్శప్రాయుడు
కడప కార్పొరేషన్ : మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్రాం ఆదర్శప్రాయుడు అని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డి, మేయర్ సురేష్బాబు, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా అన్నారు. జగ్జీవన్రాం జయంతి సందర్భంగా కడప మహావీర్ సర్కిల్లో జగ్జీవన్రాం విగ్రహానికి పూలమాల వేసి శనివారం నివాళులర్పించారు. అనంతరం జిల్లా పార్టీ కార్యాలయంలో జగ్జీవన్రాం చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ఎస్సీసెల్ నగర అధ్యక్షుడు కంచు పాటి బాబు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఉప ప్రధానిగా బాబు జగ్జీవన్రాం అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. కులాలకు, మతాలు, పార్టీలకు అతీతంగా ఆయనఅనేక సంస్కరణలు తీసుకువచ్చారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్ నాయక్, పార్టీ నాయకులు బి. రెడ్డెన్న, పులి సునీల్, సీహెచ్ వినోద్, కె.బాబు, త్యాగరాజు, ఎం.సుబ్బరాయుడు, బండి ప్రసాద్, పి. జయచంద్రారెడ్డి, యానాదయ్య, బీహెచ్ ఇలియాస్,దాసరి శివప్రసాద్, తోటక్రిష్ణ, షఫీ, బసవరాజు, మునిశేఖర్రెడ్డి, ఏ1 నాగరాజు, రత్న కుమారి, బండి మరియలు, సుశీలమ్మ, తులశమ్మ తదితరులు పాల్గొన్నారు. -
‘మౌలానా’ అరెస్టు టీడీపీ కుట్ర!
కడప రూరల్: మౌలానా జాకీర్ హుస్సేన్ను కుట్రపూరితంగా అరెస్ట్ చేయించడంపై అఖిలపక్ష, ప్రజా సంఘాల నేతలు తీవ్రంగా ఖండించారు. ఈ అరెస్టు వెనక కూటమి నేతల కుట్ర ఉందని ఆరోపించారు. శనివారం కడప వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్క్లబ్లో అఖిలపక్ష, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు అఫ్జల్ఖాన్, రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్రెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి చంద్ర, జేఏసీ కన్వీనర్ అహ్మద్బాబు మాట్లాడుతూ వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం దారుణమన్నారు. మతాల మధ్య విభజన పెంచి దేశ లౌకిక స్వభావాన్ని, మత సామరస్యాన్ని దెబ్బ తీస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా మత గురువు మౌలానా జాకీర్ హుస్సేన్ గళం విప్పితే ఒక టెర్రరిస్ట్ను అరెస్ట్ చేసిన విధంగా అరెస్ట్ చేయడం దారుణమన్నారు. ఈ పరిణామాల వెనుక టీడీపీ, బీజేపీల హస్తం ఉందని ఆరోపించారు. అక్రమ అరెస్ట్లతో ఉద్యమాలను ఆపలేరని పేర్కొన్నారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం మౌలానా జాకీర్ హుస్సేన్పై పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవాలని కోరారు. ప్రస్తుతం సవరించిన వక్ఫ్ చట్టంలో గణనీయమైన మార్పులు తేవడం తగదన్నారు. ముస్లింలు తమ మతాన్ని ఆచరించడానికి రాజ్యాంగం కల్పించిన హక్కులపై దాడి చేయడం దుర్మార్గ చర్యగా అభివర్ణించారు. ఇప్పటికై నా కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ చట్టం 2024ను వెనక్కి తీసుకోవాలని తెలిపారు. తాహిర్, సయ్యద్ సలావుద్దీన్, మక్బూల్బాషా, దస్తగిరి, న్యాయవాది అహ్మద్అలీ, ఖాన్అమీద్ తదితరులు పాల్గొన్నారు. ‘వక్ఫ్ బిల్లు’ను వ్యతిరేకిస్తే అరెస్టు చేస్తారా! వక్ఫ్ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలి సమావేశంలో అఖిలపక్ష,ప్రజా సంఘాల నేతల ధ్వజం -
మోడల్ పరీక్షలోనూ మహిళలదే ఆధిపత్యం
కడప అర్బన్ : కడప బార్ అసోసియేషన్లో శనివారం నిర్వహించిన జూనియర్ సివిల్ జడ్జి మోడల్ పరీక్షలో ఎనిమిది మంది మహిళలు ఆధిపత్యం సాధించడమేగాక అధిక మార్కులు సొంతం చేసుకున్నారు. కడప భారత న్యాయవాదుల సంఘం అధ్యక్షులు సి.సుబ్రహ్మణ్యం వర్కింగ్ ప్రెసిడెంట్ టి.ఈశ్వర్ ముందుగానే ప్రకటించడంతో 40 మంది న్యాయవాదులు హాజరయ్యారు. ఈ మోడల్ పరీక్ష శనివారం ఉదయం 11 గంటల నుండి ఒంటిగంట వరకు జరిగింది. కడప బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాఘవరెడ్డి ప్రధాన కార్యదర్శి చంద్రవదన, ఉపాధ్యక్షులు ఉమాదేవి ప్రశ్నపత్రం విడుదల చేశారు. వంద ప్రశ్నలతో కూడిన పరీక్ష పూర్తవగానే కీ విడుదల చేశారు. షేక్ ముస్తఫాకు 86, సి.రాజ్యలక్ష్మికి 84, ఎ.రాహుల్కు 80 మార్కులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు నాగసుబ్బారెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, వెంకటశివ, సురేష్, చిన్నయ్య పాల్గొన్నారు. -
సీతారాముల అనుగ్రహం అందరికీ ఉండాలి
– ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పులివెందుల : శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా ప్రజలకు కడప ఎంపీ వైఎస్.అవినాష్రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఒంటిమిట్టలో జరగబోయే సీతారామ కళ్యాణం వైభవంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజలంతా శ్రీరామనవమి పండగను సంతోషంగా జరుపుకోవాలని కోరుకున్నారు. జువైనల్ జస్టిస్ బోర్డు సభ్యులుగా డాక్టర్ లలిత కడప ఎడ్యుకేషన్ : జువైనల్ జస్టిస్ బోర్డ్లో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులుగా వైవీయూ సైకాలజీ డిపార్ట్మెంట్ అసోసియేట్ ప్రొఫెసర్ డా. కె.లలిత ఎంపికయ్యారు. కమిటీ చైర్ పర్సన్గా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ యు.దుర్గా ప్రసాదరావు, ఇతర సభ్యులు ఉన్నారు. విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాల నుండి ప్రొఫెసర్ వి.లలిత కుమారి (సోషియల్ వర్కర్, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తిరుపతి), బి పద్మావతి(మెంబర్ ,కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్)ను సభ్యులుగా ఎంపిక చేశారు. ఈ కమిటీ పదవీకాలం మూడేళ్లు ఉంటుంది. పొడదుప్పిపై మానవత్వం కలసపాడు : మండలంలోని సింగరాయపల్లె గ్రామంలో పొడదుప్పిని కుక్కల దాడి నుంచి కాపాడి గ్రామస్థులు మానవత్వం చాటారు. అడవి నుండి పొడ దుప్పి గ్రామంలోకి వచ్చింది. కుక్కలు దాడి చేసేందుకు ప్రయత్నించగా గమనించిన సింగరాయపల్లె గ్రామస్తులు అడ్డుకుని పొడ దుప్పిని ఒక ఇంటిలో ఉంచారు. అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. పోరుమామిళ్ల ఫారెస్టు రేంజ్ అధికారి రఘునాథరెడ్డి ఆదేశాల మేరకు తంబళ్లపల్లె సెక్షన్ అధికారి రమణయ్య, మామిళ్లపల్లె బీట్ అధికారి భారతి, డాగ్ స్క్వాడ్ అధికారి హసన్, గురయ్య, ప్రొడక్షన్ ఫోర్స్ సిబ్బంది చేరుకుని పొడదుప్పిని పరిశీలించారు. అనంతరం గ్రామస్థుల సాయంతో అటవీ వాహనంలో తీసుకెళ్ళి తడుకుచెరువు సమీపాన అడవిలో వదిలారు. అంతర్ జిల్లా దొంగల అరెస్టు మదనపల్లె : షట్టర్లు తొలగించి దుకాణాల్లో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్ జిల్లా దొంగలను అరెస్టు చేసినట్లు డీఎస్పీ దర్బార్ కొండయ్యనాయుడు తెలిపారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో అంతర్ జిల్లా దొంగల అరెస్టు వివరాలను శనివారం మీడియాకు ఆయన వెల్లడించారు. కర్నూలు జిల్లా గూడూరు మండలం చనుగొండ్ల గ్రామానికి చెందిన గుజిరీ వ్యాపారి మాదిగజార్జి(26), అన్నమయ్య జిల్లా సుండుపల్లె మండలం భైరవగుట్టకు చెందిన బండపల్లిరెడ్డిశేఖర్(23) ముఠాగా ఏర్పడ్డారు. అన్నమయ్య జిల్లా కురబలకోట, మదనపల్లె, గుర్రంకొండ తదితర ప్రాంతాల్లో దుకాణాల షట్టర్లు తొలగించి దొంగతనాలకు పాల్పడ్డారు. దీంతో జిల్లా ఎస్పీ విద్యాసాగర్నాయుడు ఆదేశాల మేరకు క్రైమ్ సీఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలతో విచారణ చేపట్టామన్నారు. సాంకేతికతను ఉపయోగించి నిందితులకు సంబంధించిన పక్కా సమాచారం తెలుసుకున్నామని పేర్కొన్నారు. శనివారం ఉదయం కురబలకోట మండలం కడప–మదనపల్లె రోడ్డులోని కడప క్రాస్ వద్ద నిందితులను అరెస్ట్ చేశామన్నారు. నిందితుల నుంచి కురబలకోట, గుర్రంకొండ, మదనపల్లె, చిత్తూరు, ఆదోని పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులకు సంబంధించిన వస్తువులు...సోనీ టీవీ, ల్యాప్టాప్, 50 కిలోల కాపర్వైర్, మూడు ట్యాబ్లు, ఒక టేబుల్ ఫ్యాన్, సిగరెట్లు, ఆటోరిక్షా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వాటి విలువ రూ.4 లక్షలు ఉంటుందన్నారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించినట్లు తెలిపారు. కేసు విచారణలో ప్రతిభ కనపరిచిన సీఐ చంద్రశేఖర్, రూరల్ సీఐ సత్యనారాయణ, ముదివేడు ఎస్ఐ దిలీప్కుమార్, స్టేషన్ సిబ్బందిని డీఎస్పీ డి.కొండయ్యనాయుడు అభినందించారు. -
కొత్త పెన్షన్ బిల్లు ఉపసంహరించుకోవాలి
కడప ఎడ్యుకేషన్ : కొత్త పెన్షన్ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు రఘునాథరెడ్డి డిమాండ్ చేశారు. కడప ఎస్టీయూ భవన్లో జిల్లా అధ్యక్షుడు ఎస్ఎండీ.ఇలియాస్బాషా అధ్యక్షతన శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగంలోని ‘ఆర్టికల్–14’ను ఉల్లంఘించడం సరికాదన్నారు. సిపిఎస్/జిపిఎస్ స్థానంలో ఆమోద యోగ్యమైన పెన్షన్ విధానం తెస్తామని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు చేయాలని కోరారు. 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మెమో 57 మేరకు పాత పెన్షన్ వర్తింప చేయాలన్నారు. ఏఐఎస్టీఎఫ్ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కత్తినరసింహారెడ్డి మాట్లాడుతూ 12 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లకు చెల్లించాల్సిన 11వ పీఆర్సీ, డీఎ, సరెండర్ లీవ్, సీపీఎస్ బకాయిలు కలిపి రూ.23వేల కోట్లు ప్రభుత్వం చెల్లించాల్సి ఉందన్నారు. 2024 జనవరి నుంచి ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న మూడు విడతల డీఏ మంజూరుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర సంయుక్త అధ్యక్షుడు కె.సురేష్బాబు మాట్లాడుతూ ఏకీకృత సర్వీసు రూల్స్ సమస్య పరిష్కరించి, పర్యవేక్షణాధికారి పోస్టులను భర్తీచేయాలన్నారు. రాష్ట్ర నాయకులు పిల్లిరమణారెడ్డి, కంబం బాలగంగిరెడ్డి, రషీద్ఖాన్ మాట్లాడుతూ 70 ఏళ్లు దాటిన పెన్షనర్లకు పది శాతం, 75 సంవత్సరాలు నిండిన పెన్షనర్లకు 15 శాతం అడిషనల్ క్వాంటం పెన్షన్ అమలుచేయాలని కోరారు. అనంతరం బాబు జగ్జీవన్ రామ్ జయంతి, వీణా విజయరామరాజు వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సమావేశంలో ఎన్.సంగమేశ్వర్రెడ్డి, శివశంకర్, గురుకుమార్, దాదా పీర్, గురు ప్రసాద్, రవిశంకర్రెడ్డి, కొత్తపల్లి శ్రీను, వాకా చంద్రశేఖర్, చెన్నకేశవరెడ్డి మహబూబ్ బాషా, రామ్మోహన్, జిల్లా, మండల కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. -
కల్యాణోత్సవంలో ప్రతి భక్తుడికి తలంబ్రాలు
ఒంటిమిట్ట: ఒంటిమిట్టలో ఏప్రిల్ 11న జరగనున్న శ్రీ సీతారాముల కల్యాణోత్సవానికి విచ్చేసే ప్రతి భక్తుడికి ముత్యపు తలంబ్రాలు, అన్నప్రసాదాలు అందజేసే ఏర్పాట్లు చేస్తున్నా మని టీటీడీ జేఈఓ వి.వీరబ్రహ్మం తెలిపారు. ఒంటిమిట్టలోని టీటీడీ పరిపాలన భవనం సమావేశ మందిరంలో శనివారం సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేదిక ప్రాంగణం వద్ద ఉన్న 120 గ్యాలరీలలో ఉండే భక్తులతోపాటు కల్యాణం వీక్షించేందుకు వచ్చిన భక్తులందరూ శ్రీ సీతారాముల కల్యాణోత్సవాన్ని వీక్షించేలా ఏర్పా ట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వేదిక ప్రవేశ ప్రారంభంలో తలంబ్రాల పంపిణీ కోసం 16 కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. శ్రీ సీతారాముల కల్యాణోత్సవం తిలకించేలా 15 ఎల్ఈడీ స్క్రీన్లు, ఆలయం, కల్యాణ వేదిక తదితర ప్రాంతాలలో విద్యుత్ కాంతులతో 38 దేవతామూర్తుల విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దాదాపు మూడు లక్షల తాగునీరు బాటిళ్లు, 250 మంది పారామెడికల్ సిబ్బంది, 35 మంది వైద్య నిపుణులు, 13 మెడికల్ టీమ్ లు, ఎనిమిది అంబులెన్సులు, అగ్నిమాపక సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. హెచ్డీపీపీ 18, దాస సాహిత్య ప్రాజెక్టు 4, అన్నమాచార్య ప్రాజెక్టు 8 ఆధ్వర్యంలో మొత్తం 30 కళా బృందాలతో సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మొదటిసారి కళాకృతులతో సంక్షిప్త రామాయణాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కల్యాణ వేదిక, ఆలయ పరిసర ప్రాంతాలలో 12 టన్నుల సంప్రదాయ పుష్పాలు, లక్ష కట్ ప్లవర్స్తో పుష్పాలంకరణలు చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం కల్యాణ వేదిక ప్రాంగణం వద్ద ఏర్పాట్లను జేఈఓ పరిశీలించారు. ఆర్డీఓ జాన్ ఎర్విన్ పాల్గొన్నారు. -
● బ్రహ్మోత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు
ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టనున్నట్లు కడప జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ తెలిపారు. శుక్రవారం ఒంటిమిట్టలో జరుగుతున్న ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. అనంతరం టీటీడీ పరిపాలన భవనంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు, ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలన్నారు.కార్యక్రమంలో కడప ఆర్డీఓ జాన్ ఇర్విన్, టీటీడీ ఎస్టేట్ ఆఫీసర్ గుణ భూషణరెడ్డి, జమ్మలమడుగు ఆర్డీఓ సాయిశ్రీ, డీపీఓ రాజ్యలక్ష్మీ, కడప జిల్లా ఆర్టీసీ ఆర్ఎం గోపాల్ రెడ్డి, ఒంటిమిట్ట ఎంఆర్ఓ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. -
చదువుకున్నారు.. చోరీలు ఎంచుకున్నారు
బద్వేలు అర్బన్ : ఒకరు బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చేశారు. మరొకరు బీఎస్సీ డిగ్రీ పూర్తి చేశారు. ఇంకొకరేమో బీటెక్ చివరి దశలో మానేశారు. ఉద్యోగ, ఉపాధి మార్గాలు ఎంచుకుని ఉన్నతంగా ఎదగాల్సిన వీరు.. దురలవాట్లకు బానిసలుగా మారి పక్కదారి పట్టారు. చేసిన అప్పులు తీర్చేందుకు, జల్సాల కోసం చోరీల బాట పట్టారు. చివరకు ఇద్దరు పోలీసులకు చిక్కి కటకటాల పాలు కాగా, మరొకరేమో పరారీలో ఉన్నాడు. గోపవరం మండలం పి.పి.కుంట సమీపంలోని సెంచురీ పానెల్స్ పరిశ్రమ నుంచి నకిలీ పత్రాలతో ప్లేవుడ్ బోర్డులు కాజేసేందుకు యత్నించగా రూరల్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. శుక్రవారం స్థానిక రూరల్ సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ ఎం.నాగభూషణ్ ఇందుకు సంబంధించి వివరాలు వెల్లడించారు. గోపవరం మండలం పి.పి.కుంట సమీపంలోని సెంచురీ పానెల్స్ పరిశ్రమ ద్వారా దేశంలోని వివిధ రాష్ట్రాలకు ప్లేవుడ్ బోర్డులను ఎగుమతి చేస్తుంటారు. ఇందుకోసం వివిధ ట్రాన్స్పోర్ట్ కంపెనీలతో ఒప్పందం చేసుకుని వారి ద్వారా వాహనాలను సమకూర్చుకుంటారు. ఈ క్రమంలో కలకత్తాకు చెందిన సరస్వతి ప్లేబోర్డ్ లిమిటెడ్ కంపెనీ ద్వారా సెంచురీ పానెల్స్ పరిశ్రమకు రూ.5 లక్షల విలువ చేసే 885 ప్లేవుడ్ బోర్డుల ఆర్డర్ వచ్చింది. ఇందుకు సెంచురీ పరిశ్రమ యాజమాన్యం వాహనం కోసం తమ వెబ్సైట్లో పొందుపరచగా... విజయవాడకు చెందిన ఫైన్ లాజిస్టిక్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ వాహనం సమకూర్చే హక్కును దక్కించుకుంది. అయితే అప్పటికే సంబంధిత ట్రాన్స్పోర్ట్ కంపెనీతో సంబంధాలున్న నెల్లూరు జిల్లా సీతారామపురం గ్రామం పడమటివీధికి చెందిన ఆకులమహేష్ ముందస్తు ప్రణాళికలో భాగంగా కంపెనీ తరఫున తన స్నేహితుడైన పూంగవనంశివకుమార్ ద్వారా నకిలీ ఆర్సీ, ఎఫ్సీ, పర్మిట్ సృష్టించి మరొక స్నేహితుడైన మనీష్ ద్వారా వేరొక వాహనానికి నంబర్ ప్లేట్ మార్చి గత నెల 20వ తేదీన సరుకును తీసుకెళ్లాడు. అయితే సరుకును కలకత్తాకు తీసుకెళ్లకుండా నెల్లూరులోని ఓ గదిలో భద్రపరిచి.. కొద్ది రోజుల తర్వాత అమ్ముకోవాలని ప్లాన్ చేసుకుని ఫోన్లు స్విచ్ఛాఫ్ చేశారు. కంపెనీ నుంచి సరుకు బయటికి వెళ్లినప్పటి నుంచి అన్లోడ్ చేసే వరకు వాహనాన్ని జీపీఎస్ ట్రాకింగ్ చేస్తారు. అయితే ఫోన్లు స్విచ్ఛాఫ్ కావడంతో ట్రాకింగ్ లభించలేదు. దీంతో అనుమానం వచ్చిన కంపెనీ ప్రతినిధులు ఈ నెల 2వ తేదీన రూరల్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా సీఐ ఎం.నాగభూషణ్, బి.కోడూరు ఎస్ఐ కె.సి.రాజులు సిబ్బందితో కలిసి గాలిస్తుండగా శుక్రవారం పి.పి.కుంట సమీపంలో ఆకులమహేష్, పూంగవనం శివకుమార్లను అరెస్టు చేసి కోర్టు ఎదుట హాజరు పరచగా న్యాయస్థానం 14 రోజులు రిమాండ్ విధించినట్లు సీఐ తెలిపారు. ఇదే కేసులో ఏ1 నిందితుడుగా ఉన్న మనీష్ కోసం గాలిస్తున్నట్లు ఆయన తెలిపారు. కాగా నిందితులు నెల్లూరు జిల్లా ముత్తుకూరు స్టేషన్ పరిధిలో కూడా గత నెల 25న ఇదే తరహాలో పామాయిల్ డబ్బాలను లోడ్ చేసుకుని చేర్చవలసిన పాయింట్కు చేర్చకుండా కాజేసే యత్నం చేసినట్లు విచారణలో తేలినట్లు సీఐ తెలిపారు. సమావేశంలో ఏఎస్ఐ రాజశేఖర్రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ సురేష్, కానిస్టేబుళ్ళు శ్రీను, పీరయ్య తదితరులు పాల్గొన్నారు. నకిలీ పత్రాలతో ప్లేవుడ్ బోర్డులు కాజేసిన యువకులు చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు ఇద్దరు అరెస్టు, పరారీలో ఒకరు -
ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ
ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 6వ తేదీ నుంచి 14 వరకు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 వరకు అంకురార్పణ శాస్త్రోక్తంగా నిర్వహిచనున్నారు. ఈ సందర్భంగా సీతారామ లక్ష్మణ ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించి ఆశీనులు చేస్తారు. అనంతరం టీటీడీ పాంచరాత్ర ఆగమ సలహాదారు రాజేష్ కుమార్ ఆగమ శాస్త్రం ప్రకారం అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.ఆలయంలోని పుట్టమన్నును యాగశాలకు తీసుకెళ్లే కార్యక్రంమతో అంకుకార్పణ ముగుస్తుంది. రేపు ధ్వజారోహణం ఏప్రిల్ 6న ధ్వజారోహణంతో శ్రీ కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9.30 నుంచి 10.15 గంటల మధ్య వృషభ లగ్నంలో ధ్వజారోహణం, రాత్రి 7 నుండి 9 వరకు శేష వాహనసేవ జరగనున్నాయి. ● ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ ఏర్పాట్లు చేపట్టింది. ఆలయంలో ప్రత్యేక క్యూలైన్లు, చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. గోపురాలు, కల్యాణ వేదిక, ఇతర ప్రాంతాల్లో విద్యుత్దీపాలు అమర్చారు. -
సొంతంగా ఏ పని చేసుకోలేని వారు.. కొందరు పుట్టుకతో.. ఇంకొందరు అనారోగ్యం కారణంగా వైకల్యం బారిన పడిన వారు.. వీరంతా నిరుపేదలు. ప్రభుత్వ సాయంతోనే నాలుగు ముద్దలు నోటికాడికి వెళ్తాయన్న దివ్యాంగులు వీరు. అయితే వీరి పింఛన్లలో కోత పెట్టాలని కూటమి నిర్ణయించింది. పునః
● సదరంలో దివ్యాంగుల అగచాట్లు ● కుటుంబ సభ్యుల అపసోపాలు ● అర్హత ఉన్నా తప్పని పునఃపరిశీలన ● అందుబాటులో లేని వీల్చైర్లు, స్ట్రెచర్లు ● రిమ్స్లో కనీస సౌకర్యాలు కరువుకడప అర్బన్ : కడప నగర శివార్లలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి సర్టిఫికెట్ల పునః పరిశీలన కోసం వస్తున్న దివ్యాంగులలో దయనీయస్థితిలో వున్నవారు లేకపోలేదు. ఇందుకు ప్రత్యక్షంగా ఈ నెల 2,3 తేదీలలో ‘సాక్షి’ పరిశీలనలో వెల్లడైంది. మంచానికి, వీల్చైర్లకే పరిమితమై, వారి వ్యక్తిగత పనులను కూడా కుటుంబ సభ్యులపై ఆధారపడి జీవించే వారిని కూడా ‘రీ వెరిఫికేషన్’ పేరుతో నోటీసులు ఇచ్చి కడప రిమ్స్కు రప్పిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత సీఎం చంద్రబాబు దివ్యాంగుల జాబితాను తగ్గించే దిశగా.. రాష్ట్ర వ్యాప్తంగా వారిని మరలా ‘రీ వెరిఫికేషన్’ పేరుతో తమ సమీపంలో మెడికల్ బోర్డ్ వున్న ఆసుపత్రులకు పంపిస్తున్నారు. ప్రతి మనిషికి కనిపించగానే.. ప్రత్యక్షంగా వీరికి వికలత్వం వుందని ఇట్టే తెలిసిపోతుంది. కానీ అలాంటి వారిని కూడా వదిలిపెట్టకుండా ‘రీ వెరిఫికేషన్’ నోటీసులను ఇచ్చి వేధింపులకు గురి చేయడం ఎంత వరకు సమంజసమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ● రిమ్స్ ఓపీ విభాగానికి ఎదురుగా ఏర్పాటు చేసిన షామియానా, కుర్చీలను ‘రీ వెరిఫికేషన్’కు వస్తున్న దివ్యాంగుల కోసం వినియోగిస్తున్నారు. అయితే వేసవి కాలంలో కనీసం తాగేందుకు ‘మంచినీటి’ సౌకర్యం కూడా కల్పించకపోవడం దారుణం. అసలే మూడు రోజులుగా ఓపీ క్యాంటీన్ను మూసివేయడం వల్ల అక్కడికి వస్తున్న రోగులకు, వారి సహాయకులకు కనీసం అల్పాహారం, టీ, కాఫీ, మజ్జిగ, నీటి సౌకర్యం కరువయ్యాయి. రిమ్స్ అధికారులు గానీ, డీఆర్డీఏ విభాగానికి చెందిన అధికారులైనా స్పందించి నీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ● ఒకవైపు నానా తిప్పలు పడి అక్కడికి ‘రీ వెరిఫికేషన్’కు వస్తున్న దివ్యాంగుల పాలిట కొందరు ‘చిరుద్యోగుల’ చేష్టలు కూడా శాపంగా మారుతున్నాయి. ‘రీ వెరిఫికేషన్’ చేయించుకునేందుకు వచ్చిన వారికి ‘తప్పకుండా’ మరలా సర్టిఫికెట్ను యథావిధిగా చేయిస్తామని మాయమాటలను చెప్పి తమ జేబులను నింపుకొంటున్నారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఒక్కో ‘రీ వెరిఫికేషన్’ సర్టిఫికెట్ కోసం వేలాది రూపాయలను వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. అధికారుల పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని ప్రజలు అనుకుంటున్నారు. వీల్చైర్, స్ట్రెక్చర్ల కొరత స్పష్టంగా తెలుస్తోందని పేర్కొంటున్నారు. ● దివ్యాంగుల కష్టాలు, ఇబ్బందులపై సీఎస్ ఆర్ఎంఓ డాక్టర్ రాజేశ్వరి మాట్లాడుతూ తమకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదన్నారు. ఎవరైనా తమకు ఫిర్యాదు చేసినా, తమ దృష్టికి వచ్చినా చర్యలను తీసుకుంటామని వెల్లడించారు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల మేరకే ‘రీ వెరిఫికేషన్’కు దివ్యాంగులను పిలిపిస్తున్నామని వివరణ ఇచ్చారు. -
నేడు జగ్జీవన్రామ్ జయంతి
కడప సెవెన్రోడ్స్: బాబు జగ్జీవన్రాం జయంతి వేడుకను శనివారం ఉదయం 10 గంటలకు కలెక్టరేట్లో నిర్వహించనున్నట్లు కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు, ఎస్సీ,ఎస్టీ, బీసీ మైనార్టీ నాయకులు, అధికారులు, ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. నేడు ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలపై సమావేశం కడప సెవెన్రోడ్స్: శ్రీరామ నవమి పర్వదిన సందర్బంగా ఒంటిమిట్టలో జరగనున్న బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై శనివారం మధ్యాహ్నం అక్కడి టీటీడీ భవనంలో అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని డీఆర్వో విశ్వేశ్వరనాయుడు ఒక ప్రకటనలో తెలిపారు తిరుమల–తిరుపతి దేవస్థానం ఈఓ, ఇతర అధికారులు సమావేశంలో పాల్గొంటారన్నారు. జిల్లాలోని ఇందుకు సంబంధించిన వివిధ శాఖల అధికారులు హాజరు కావాలని ఆయన కోరారు. డీఈఓ వెబ్సైట్లో జాబితా కడప ఎడ్యుకేషన్: జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్తు యాజమాన్యాలలో పనిచేసే సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు,తత్సమాన కేటగిరీల నుంచి పాఠశాల సహాయకులుగా పదోన్నతి కోసం సీనియారిటీ జాబితాను ఉపాధ్యాయ సమాచార వ్యవస్థ ఆధారంగా సబ్జెక్టుల వారీగా (www. kadapadeo.in) డీఈఓ వెబ్సైట్లో పొందు పరి చినట్లు డీఈఓ షేక్ షంషుద్దీన్ తెలిపారు. సదరు సీనియారిటీ జాబితాలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 5 నుంచి 11వ తేదీ వరకు పనిదినాల్లో సాయంత్రం 5 గంటలలోపు రాత పూర్వకంగా సరైన ఆధారాలతో డీఈఓ కార్యాలయంలో సంప్రదించాలని డీఈఓ పేర్కొన్నారు. పరిసరాల శుభ్రతతో వ్యాధులు దూరం సిద్దవటం: పరిసరాల పరిశుభ్రతతోనే వ్యాధులను దూరం చేయవచ్చని జిల్లా వైద్యాధికారి డాక్టర్ నాగరాజు తెలిపారు. సిద్దవటం మండలం లోని మాధవరం–1 గ్రామంలో శుక్రవారం జరుగుతున్న ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలన్నారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉందని, వృద్ధులు, బాలింతలు, చిన్నపిల్లలు బయట తిరుగొద్దని సూచించారు. ప్రస్తుతం జరిగే ఎన్సీడీ–సీడీ సర్వే, ఏబీబీఏ(అభా)జనరేషన్, ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన పథకాలకు ఈ–కేవైసీ చేయించాలని వైద్య సిబ్బందికి ఆదేశించారు. కార్యక్రమంలో మాధవరం పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ శివకుమార్, సూపర్వైజర్లు నాగవల్లి, జ్యోతి ,రమణయ్య, ఏఎన్ఎంలు పద్మావతి, ఉమా, ఆశా వర్కర్లు సుజాత, అదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
భూ సేకరణ పనులను పూర్తిచేయాలి
కడప సెవెన్రోడ్స్: జాతీయ రహదారుల విస్తరణ, సోలార్ పార్కుల ఏర్పాటు కోసం చేపట్టిన భూ సేకరణ, అటవీ, పర్యావరణ అభ్యంతరాలు, లీగల్ క్లియరెన్స్ ప్రక్రియలను పెండింగ్ లేకుండా...త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సంబంధిత అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారుల విస్తరణ కోసం చేపట్టిన భూ సేకరణ ప్రక్రియ పై శుక్రవారం కలెక్టరేట్ బోర్డు మీటింగ్ హాలు నుంచి జేసీ అదితి సింగ్, డీఎఫ్ఓ వినీత్ కుమార్లతో కలిసి సంబంధిత తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ దేశంలో రవాణా వ్యవస్థను మరింత సులభతరం చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాయన్నారు. అందు లో భాగంగా బెంగుళూరు–కడప–విజయవాడ జాతీయ రహదారి నిర్మాణానికి సంబంధించి భూసేకరణ చేస్తోందన్నారు. భూములు కోల్పోయినవారికి పరిహారం కూడా ఇస్తోందన్నారు. జిల్లాలో ఏర్పాటు చేస్తున్న మూడు రకాలైన సోలార్ అనుబంధ పవ ర్ ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ పనులను, ఇతర అనుమతులను క్లియర్ చేయాలన్నారు. జమ్మలమడుగు, పులివెందుల ఆర్డీఓలు సాయిశ్రీ, చిన్న య్య, ఎన్ హెచ్ఏఐ ఎస్డీసి వెంకటపతి, పీడి అశోక్ కుమార్, డిప్యూటీ మేనేజర్లు వేణుగోపాల్, సుదర్శన్ కుమార్, ఆర్అండ్బీ నేషనల్ హైవే ఈఈ విజయ్ భాస్కర్ రెడ్డి, నెడ్ క్యాప్ జిల్లా అభివృద్ధి అధికారి యల్లారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. లక్ష్యాలను అధిగమించాలి ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా.. అన్ని ప్రాధాన్యతా రంగాలను మరింత పటిష్టం చేసి జిల్లాకు నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లోని బోర్డు మీటింగ్ హాలులో అన్ని రకాల ప్రాధాన్యతా రంగాలకు చెందిన జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయా రంగాల్లో జిల్లాకు నిర్దేశించిన లక్ష్యాలు, సాధించాల్సిన ప్రగతి.. తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. విత్తనాల ఉత్పత్తి, పంటల మార్పులు, మైక్రో న్యూట్రియన్స్ల పై రైతుల్లో అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో చిరుధాన్యాల పంటల సాగుబడిని పెంపొందించాలని.. ఆ దిశగా రైతుల్లో అవగాహన పెంచాలన్నారు. వర్షాలకు దెబ్బతిన్న పంటల నష్టం పై రిపోర్ట్ అందజేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యవసాయ శాఖ జేడీ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి -
సొంతంగా ఏ పని చేసుకోలేని వారు.. కొందరు పుట్టుకతో.. ఇంకొందరు అనారోగ్యం కారణంగా వైకల్యం బారిన పడిన వారు.. వీరంతా నిరుపేదలు. ప్రభుత్వ సాయంతోనే నాలుగు ముద్దలు నోటికాడికి వెళ్తాయన్న దివ్యాంగులు వీరు. అయితే వీరి పింఛన్లలో కోత పెట్టాలని కూటమి నిర్ణయించింది. పునః
● సదరంలో దివ్యాంగుల అగచాట్లు ● కుటుంబ సభ్యుల అపసోపాలు ● అర్హత ఉన్నా తప్పని పునఃపరిశీలన ● అందుబాటులో లేని వీల్చైర్లు, స్ట్రెచర్లు ● రిమ్స్లో కనీస సౌకర్యాలు కరువుకడప అర్బన్ : కడప నగర శివార్లలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి సర్టిఫికెట్ల పునః పరిశీలన కోసం వస్తున్న దివ్యాంగులలో దయనీయస్థితిలో వున్నవారు లేకపోలేదు. ఇందుకు ప్రత్యక్షంగా ఈ నెల 2,3 తేదీలలో ‘సాక్షి’ పరిశీలనలో వెల్లడైంది. మంచానికి, వీల్చైర్లకే పరిమితమై, వారి వ్యక్తిగత పనులను కూడా కుటుంబ సభ్యులపై ఆధారపడి జీవించే వారిని కూడా ‘రీ వెరిఫికేషన్’ పేరుతో నోటీసులు ఇచ్చి కడప రిమ్స్కు రప్పిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత సీఎం చంద్రబాబు దివ్యాంగుల జాబితాను తగ్గించే దిశగా.. రాష్ట్ర వ్యాప్తంగా వారిని మరలా ‘రీ వెరిఫికేషన్’ పేరుతో తమ సమీపంలో మెడికల్ బోర్డ్ వున్న ఆసుపత్రులకు పంపిస్తున్నారు. ప్రతి మనిషికి కనిపించగానే.. ప్రత్యక్షంగా వీరికి వికలత్వం వుందని ఇట్టే తెలిసిపోతుంది. కానీ అలాంటి వారిని కూడా వదిలిపెట్టకుండా ‘రీ వెరిఫికేషన్’ నోటీసులను ఇచ్చి వేధింపులకు గురి చేయడం ఎంత వరకు సమంజసమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ● రిమ్స్ ఓపీ విభాగానికి ఎదురుగా ఏర్పాటు చేసిన షామియానా, కుర్చీలను ‘రీ వెరిఫికేషన్’కు వస్తున్న దివ్యాంగుల కోసం వినియోగిస్తున్నారు. అయితే వేసవి కాలంలో కనీసం తాగేందుకు ‘మంచినీటి’ సౌకర్యం కూడా కల్పించకపోవడం దారుణం. అసలే మూడు రోజులుగా ఓపీ క్యాంటీన్ను మూసివేయడం వల్ల అక్కడికి వస్తున్న రోగులకు, వారి సహాయకులకు కనీసం అల్పాహారం, టీ, కాఫీ, మజ్జిగ, నీటి సౌకర్యం కరువయ్యాయి. రిమ్స్ అధికారులు గానీ, డీఆర్డీఏ విభాగానికి చెందిన అధికారులైనా స్పందించి నీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ● ఒకవైపు నానా తిప్పలు పడి అక్కడికి ‘రీ వెరిఫికేషన్’కు వస్తున్న దివ్యాంగుల పాలిట కొందరు ‘చిరుద్యోగుల’ చేష్టలు కూడా శాపంగా మారుతున్నాయి. ‘రీ వెరిఫికేషన్’ చేయించుకునేందుకు వచ్చిన వారికి ‘తప్పకుండా’ మరలా సర్టిఫికెట్ను యథావిధిగా చేయిస్తామని మాయమాటలను చెప్పి తమ జేబులను నింపుకొంటున్నారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఒక్కో ‘రీ వెరిఫికేషన్’ సర్టిఫికెట్ కోసం వేలాది రూపాయలను వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. అధికారుల పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని ప్రజలు అనుకుంటున్నారు. వీల్చైర్, స్ట్రెక్చర్ల కొరత స్పష్టంగా తెలుస్తోందని పేర్కొంటున్నారు. ● దివ్యాంగుల కష్టాలు, ఇబ్బందులపై సీఎస్ ఆర్ఎంఓ డాక్టర్ రాజేశ్వరి మాట్లాడుతూ తమకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదన్నారు. ఎవరైనా తమకు ఫిర్యాదు చేసినా, తమ దృష్టికి వచ్చినా చర్యలను తీసుకుంటామని వెల్లడించారు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల మేరకే ‘రీ వెరిఫికేషన్’కు దివ్యాంగులను పిలిపిస్తున్నామని వివరణ ఇచ్చారు. -
● బ్రహ్మోత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు
ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టనున్నట్లు కడప జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ తెలిపారు. శుక్రవారం ఒంటిమిట్టలో జరుగుతున్న ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. అనంతరం టీటీడీ పరిపాలన భవనంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు, ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలన్నారు.కార్యక్రమంలో కడప ఆర్డీఓ జాన్ ఇర్విన్, టీటీడీ ఎస్టేట్ ఆఫీసర్ గుణ భూషణరెడ్డి, జమ్మలమడుగు ఆర్డీఓ సాయిశ్రీ, డీపీఓ రాజ్యలక్ష్మీ, కడప జిల్లా ఆర్టీసీ ఆర్ఎం గోపాల్ రెడ్డి, ఒంటిమిట్ట ఎంఆర్ఓ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. -
నేడు జగ్జీవన్రామ్ జయంతి
కడప సెవెన్రోడ్స్: బాబు జగ్జీవన్రాం జయంతి వేడుకను శనివారం ఉదయం 10 గంటలకు కలెక్టరేట్లో నిర్వహించనున్నట్లు కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు, ఎస్సీ,ఎస్టీ, బీసీ మైనార్టీ నాయకులు, అధికారులు, ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. నేడు ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలపై సమావేశం కడప సెవెన్రోడ్స్: శ్రీరామ నవమి పర్వదిన సందర్బంగా ఒంటిమిట్టలో జరగనున్న బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై శనివారం మధ్యాహ్నం అక్కడి టీటీడీ భవనంలో అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని డీఆర్వో విశ్వేశ్వరనాయుడు ఒక ప్రకటనలో తెలిపారు తిరుమల–తిరుపతి దేవస్థానం ఈఓ, ఇతర అధికారులు సమావేశంలో పాల్గొంటారన్నారు. జిల్లాలోని ఇందుకు సంబంధించిన వివిధ శాఖల అధికారులు హాజరు కావాలని ఆయన కోరారు. డీఈఓ వెబ్సైట్లో జాబితా కడప ఎడ్యుకేషన్: జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్తు యాజమాన్యాలలో పనిచేసే సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు,తత్సమాన కేటగిరీల నుంచి పాఠశాల సహాయకులుగా పదోన్నతి కోసం సీనియారిటీ జాబితాను ఉపాధ్యాయ సమాచార వ్యవస్థ ఆధారంగా సబ్జెక్టుల వారీగా (www. kadapadeo.in) డీఈఓ వెబ్సైట్లో పొందు పరి చినట్లు డీఈఓ షేక్ షంషుద్దీన్ తెలిపారు. సదరు సీనియారిటీ జాబితాలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 5 నుంచి 11వ తేదీ వరకు పనిదినాల్లో సాయంత్రం 5 గంటలలోపు రాత పూర్వకంగా సరైన ఆధారాలతో డీఈఓ కార్యాలయంలో సంప్రదించాలని డీఈఓ పేర్కొన్నారు. పరిసరాల శుభ్రతతో వ్యాధులు దూరం సిద్దవటం: పరిసరాల పరిశుభ్రతతోనే వ్యాధులను దూరం చేయవచ్చని జిల్లా వైద్యాధికారి డాక్టర్ నాగరాజు తెలిపారు. సిద్దవటం మండలం లోని మాధవరం–1 గ్రామంలో శుక్రవారం జరుగుతున్న ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలన్నారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉందని, వృద్ధులు, బాలింతలు, చిన్నపిల్లలు బయట తిరుగొద్దని సూచించారు. ప్రస్తుతం జరిగే ఎన్సీడీ–సీడీ సర్వే, ఏబీబీఏ(అభా)జనరేషన్, ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన పథకాలకు ఈ–కేవైసీ చేయించాలని వైద్య సిబ్బందికి ఆదేశించారు. కార్యక్రమంలో మాధవరం పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ శివకుమార్, సూపర్వైజర్లు నాగవల్లి, జ్యోతి ,రమణయ్య, ఏఎన్ఎంలు పద్మావతి, ఉమా, ఆశా వర్కర్లు సుజాత, అదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థినిపై ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన
బద్వేలు అర్బన్ : ఇటీవల పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 4వ తరగతి విద్యార్థిని పట్ల ఓ ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించిన ఘటన మరువకముందే.. అటువంటి సంఘటన మరొకటి పునరావృత్తమైంది. పట్టణంలోని సుందరయ్యకాలనీ సమీపంలో గల ఏవీఆర్ స్కూల్లో 6వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థినిపై.. అదే పాఠశాలలో కంప్యూటర్ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న పెంచలయ్య అసభ్యకరంగా ప్రవర్తించాడు. బాధిత విద్యార్థిని జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో.. వారితోపాటు బంధువులు పాఠశాల వద్దకు చేరుకుని ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. బద్వేలు పట్టణంలో శుక్రవారం చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని త్యాగరాజకాలనీకి చెందిన ఓ విద్యార్థిని సుందరయ్యకాలనీ సమీపంలోని ఏవీఆర్ స్కూల్లో 6వ తరగతి చదువుతోంది. అదే పాఠశాలలో గోపవరం మండలం అడుసువారిపల్లె గ్రామానికి చెందిన పెంచలయ్య కంప్యూటర్ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. అయితే కొంత కాలంగా పెంచలయ్య బాధిత విద్యార్థినితోపాటు మరికొంత మంది విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో త్యాగరాజకాలనీకి చెందిన విద్యార్థిని.. ఉపాధ్యాయుడి ఆగడాలను తట్టుకోలేక శుక్రవారం తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో తల్లిదండ్రులతోపాటు బంధువులు పాఠశాల వద్దకు చేరుకుని ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. ఇంతలో విషయం తెలుసుకున్న అర్బన్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఉపాధ్యాయుడిని స్టేషన్కు తరలించారు. అనంతరం విద్యార్థిని తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఉపాధ్యాయుడు పెంచలయ్యపై అర్బన్ సీఐ ఎం.రాజగోపాల్ కేసు నమోదు చేశారు. కాగా ఇటీవల కాలంలో ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థినులపై జరుగుతున్న వరుస ఘటనలతో తల్లిదండ్రులు భయభ్రాంతులకు గురవుతున్నారు. అలాగే విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులు ఇలా అసభ్యంగా ప్రవర్తించడం సరికాదని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. దేహశుద్ధి చేసిన తల్లిదండ్రులు, బంధువులు స్టేషన్కు తరలించిన పోలీసులు బద్వేలులోని ఏవీఆర్ స్కూల్లో ఘటన -
రైతులపై పాలకులే కాదు ప్రకృతీ పగబట్టింది. చేతికొచ్చిన పంటను.. రైతన్న నోటికాడ కూడును అమాంతం లాగేసింది. అకాల వర్షాలు.. ఈదురుగాలుల రూపంలో పచ్చని పంటను నేలమట్టం చేసింది. పచ్చని అరటిపంటే కాదు.. రైతన్నల ఆశల్నీ నేలరాల్చింది. కోటి ఆశలతో సాగు చేసిన రైతన్నకు కడగండ్ల
లింగాల: లింగాల మండలంలో గురువారం బలమైన ఈదురు గాలులకు అరటి పంట నేలకూలింది. మండలంలోని ఇప్పట్ల, అక్కులగారిపల్లె, తేర్నాంపల్లె, పెద్దకుడాల, లింగాల, లోపట్నూతల గ్రామాల్లోని అరటి చెట్లు సుమారు 30ఎకరాలలో నేలకూలాయని రైతులు వాపోతున్నారు. తన అరటితోటలో సుమారు 3వేల అరటి చెట్లు నేలకూలాయని లోపట్నూతల గ్రామానికి చెందిన బాల పుల్లయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. పంట కోతకు వచ్చిన సమయంలో ప్రకృతి వైపరీత్యాలు దెబ్బతీస్తున్నాయని.. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని అరటి రైతులు కోరుతున్నారు. ఈ విషయమై ఉద్యాన శాఖాధికారి రాఘవేంద్రారెడ్డి స్పందిస్తూ ఆర్ఎస్కే అధికారులు పంట నష్టాన్ని అంచనా వేస్తున్నారని, పంట నష్టం అంచనాలను ప్రభుత్వానికి నివేదికలు అందిస్తామన్నారు. సుమారు 30ఎకరాలలో అరటి పంట కూలిపోయిందని రూ.60లక్షల మేర పంట నష్టం సంభవించినట్లు ఆయన వెల్లడించారు. అకాలవర్షం... రైతులకు నష్టం కొండాపురం: మండల పరిధిలోని తిరుమలాయపల్లె,బుక్కపట్నం వెంకయ్య కాలువ గ్రామాల్లో గురువారం రాత్రి ఈదురుగాలులతో కురిసిన వర్షానికి అరటి, మిర్చి పంటలు దెబ్బతిన్నాయి. పంట చేతికొచ్చే దశలో అనుకోకుండా అకాలవర్షం కురవడంతో పంటలు నేలకొరిగాయి. బుక్కపట్నం, తిరుమ లాయపల్లె గ్రామాల్లో మిర్చిపంటలో ఎండు మిరపకాయలకోసం ఉంచిన పొలంలో ఈదురుగాలులు వీయడంతో పండుమిరపకాయలు నేలపాలయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.అలాగే వెంకయ్యకాలువ లో అరటి కోత దశలో స్వల్పంగా అరటి మొక్కలు నెలకొరిగాయి. దీంతో ఆయా గ్రామాలల్లో రైతులకు నష్టం వాటిలింది.నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. అకాల వర్షాలు,గాలులకు కూలిన అరటితోటలు జిల్లా వ్యాప్తంగా నష్టపోయిన రైతులు -
ఆడపిల్లలకు చదువును దూరం చేయొద్దు
కమలాపురం : కూటమి ప్రభుత్వం ముస్లింలపై వివక్ష చూపిస్తోంది. ముస్లింలకు అండగా ఉంటాం.. ఆడపిల్లల చదువుకు చేయూతనిస్తాం.. అంటూ మాటల్లో ప్రేమ ఒలకబోస్తూ... చేతల్లో కర్కశత్వం చూపిస్తూ.. కపట నాటకమాడుతోంది. కమలాపురంలోని యూపీ ఉర్దూ స్కూల్ను రివర్షన్ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడమే అందుకు నిదర్శనం. కమలాపురం పట్టణ పరిధిలోని బీడీ కాలనీలో ఉన్న ఉర్దూ యూపీ స్కూల్ను ప్రైమరీ స్కూల్గా మారుస్తూ ఉత్తర్వులు అందాయి. విషయం తెలుసుకున్న స్థానికులు .. విద్యార్థుల తల్లిదండ్రులు ఎంఈఓ కార్యాలయానికి వచ్చి నిరసన తెలిపారు. తమ కాలనీలోని యూపీ స్కూల్ను రివర్షన్ చేసి ఆడపిల్లలకు చదువును దూరం చేయొద్దని విద్యార్థుల తల్లిదండ్రులు మహబూబ్ బాషా, షఫీవుల్లా, హబీబున్, మాబుచాన్ తదితరులు కోరారు. ఈ విషయమై వారు ఎంఈఓకు వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ కాలనీలో మొత్తం బీడీ కార్మికులేనని, నిరుపేదలేనని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం 85 మంది విద్యార్థులున్న ఈ పాఠశాలను తిరిగి రివర్షన్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. ముఖ్యంగా తమ కాలనీలోనే ఈ పాఠశాల ఉండటంతో తమ పిల్లలు చదువుకుంటున్నారని, దీనిని ప్రైమరీ పాఠశాలగా మార్చి 6, 7 తరగతులను దూరంగా ఉన్న పాఠశాలల్లో కలిపితే తమ ఆడపిల్లలు చదువుకు దూరం అవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పాఠశాలపై ప్రభుత్వం లక్షలు వెచ్చించి ఎంతో అభివృద్ధి చేసిందని, ఇలాంటి సమయంలో యూపీ పాఠశాలగా తీసివేయడం బాధాకరమన్నారు. చెన్నూరు మండలంలోని ఒక పాఠశాలలో కేవలం 25 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నప్పటికీ ఆ పాఠశాలను యూపీ పాఠశాలగానే కొనసాగిస్తున్నారని, మరి తమ బీడీ కాలనీలోని యూపీ పాఠశాలకు ఎందుకు రివర్షన్ ఇస్తున్నారని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. అనంతరం పాఠశాలలో పేరెంట్స్ మీటింగ్ నిర్వహించారు. విద్యార్థినుల తల్లిదండ్రుల ఆవేదన యూపీ ఉర్దూ స్కూల్ రివర్షన్పై మండిపాటు -
ప్రారంభమైన పది మూల్యాంకనం
కడప ఎడ్యుకేషన్: పదో తరగతి పరీక్షల సమాధాన పత్రాల మూల్యాంకనం గురువారం కడపలోని మున్సి పల్ హైస్కూల్ మొయిన్లో ప్రారంభమైంది. ఈ మూల్యాంకనానికి క్యాంపు ఆఫీసర్గా డీఈఓ షేక్ షంషుద్దీన్ వ్యవహరించారు. ఈ మూల్యాంకనానికి రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల నుంచి అన్ని సబ్జెక్టులకు సంబంధించి 1,75,934 పేపర్లు వచ్చాయి. ఈ మూల్యాంకన విధుల్లో 105 మంది చీఫ్ ఎగ్జామినర్లు, 604 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్లు, 198 మంది స్పెషల్ అసిస్టెంట్లు పాల్గొని 12,910 పేపర్లను మూల్యాంకనాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా క్యాంపు ఆఫీసర్, డీఈఓ షేక్ షంషుద్దీన్ మాట్లాడుతూ ఈ మూల్యాంకన ప్రక్రియ ఈ నెల 9 వరకు జరుగుతుందన్నారు. తొలి రోజు 12, 910 పేపర్లను మూ ల్యాంకనం చేశారని ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ వెంకటేసు తెలిపారు. తొలి రోజు 12,910 సమాధాన పత్రాలకు మూల్యాంకనం -
డయేరియా రహిత జిల్లాగా మారుద్దాం
కడప సెవెన్రోడ్స్: డయేరియా రహిత, ఆరోగ్య సహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అన్నిశాఖల అధికారులు కృషి చేయాలని కలెక్టర్ శ్రీధర్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా టాస్క్ఫోర్స్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 15 నుంచి డయేరియా నియంత్రణ క్యాంపెయిన్ నిర్వహించాలన్నారు. నియోజకవర్గ, మండ ల, గ్రామ స్థాయి టాస్క్ఫోర్స్ కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. ఎక్కడా అతిసార కేసులు వ్యాప్తి చెందకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. ఇందుకోసం ఆరోగ్యం, కుటుంబ సంక్షేమశాఖ అధికారులు మైక్రో ప్లాన్ అమలు చేయాలని ఆదేశించారు. పారిశుద్ద్య పర్యవేక్షణ చర్యలు చేపట్టేందుకు పబ్లిక్ హెల్త్, మున్సిపాలిటీ, ఆర్డబ్ల్యూఎ్స్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. డీఎంహెచ్ఓ నాగరాజు, నగర పాలక సంస్థ కమిషనర్ మనోజ్రెడ్డి, ఇన్ఛార్జి డీపీఓ ఖాదర్బాష, రిమ్స్ సూపరింటెండెంట్ రమాదేవి, ఎపిడమాలజిస్టు ఖాజా మోహిద్దీన్ పాల్గొన్నారు. 15 నుంచి జిల్లా వ్యాప్తంగా క్యాంపెయిన్ కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి -
రిమ్స్లో తీరు మారదంతే..!
కడప టాస్క్ఫోర్స్ : కడప నగర శివార్లలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్)తీరు మారడం లేదు. ఓపీ విభాగంలో మహిళా కంటి విభాగం(ఆప్తాలమిక్)లో గురువారం ఉదయం 10:20 గంటలైనా వైద్యులు రాకపోవడం గమనార్హం. అలాగే ఆప్తాల్మిక్, ఈఎన్టీ విభాగాలకు శ్రీరీ వెరిఫికేషన్శ్రీకు వచ్చిన రోగులు, వారి సహాయకుల క్యూలైన్ పెద్దదిగా వుండి ఇబ్బందులకు గురవుతున్నారు. అక్కడ రిజిస్టర్లలో పేర్లను నమోదు చేసేందుకు విద్యార్థులను.. ఎలాంటి ఉద్యోగి పర్యవేక్షణ లేకుండానే వారికి వదిలేయడం ఎంత వరకు సమంజసం. ● ఓపీ విభాగంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కోతుల బెడద తప్పడం లేదు. ఈ కోతుల బెడదకు ఒకవైపు చిన్నారులు, బాలింతలు, వృద్ధులు బెంబేలెత్తిపోతున్నారు. ● గైనిక్ విభాగం ఓపీ విభాగం ముందు భాగాన విరిగిపడి మూలనపడిన ఇనుపకుర్చీ నిరుపయోగంగానే పడివుంది. ● కడప జీజీహెచ్ (రిమ్స్)లో ప్రభుత్వం మంజూరు చేసిన స్టాఫ్ నర్సులు 402 కాగా వీరిలో రెగ్యులర్ స్టాఫ్ నర్సులు 62 మంది, కాంట్రాక్ట్ పద్ధతిలో 202 మంది విధులు నిర్వహిస్తున్నారు. ఇంకా 138 స్టాఫ్ నర్సుల పోస్టులు ఖాళీగా వున్నాయి. త్వరలోనే భర్తీ జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాగా 13 మంది స్టాఫ్ నర్సులు వివిధ ఓపీ, ఐపీ, పరిపాలనా విభాగాలలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కేవలం కంప్యూటర్ ఆపరేటర్ (డి.ఈ.ఓ) పనులను మాత్రమే నిర్వహిస్తున్నారు. వీరికి ఎలాంటి షిఫ్ట్ డ్యూటీలు లేకపోవడం, ఆయా పోస్టింగ్లకే అధికారులు పరిమితం చేయడం పలురకాల ఆరోపణలకు తావిస్తోంది. ఇంకా సిటీ స్కానింగ్ విభాగంలో అటెండర్గా పని చేస్తున్న ఓ వ్యక్తి కంప్యూటర్ ఆపరేటర్గా ఐదు సంవత్సరాలుగా విధులను నిర్వహిస్తున్నాడు. తనను కంప్యూటర్ ఆపరేటర్గా తీసుకుని న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాడు. ● మరోవైపు కడప రిమ్స్ ఓపీలోని క్యాంటీన్ మూసివేత వ్యవహారం రోజురోజుకు ముదిరిపాకాన పడుతోంది. టెండర్ వేసేందుకు నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అధికారులు ప్రస్తుత క్యాంటీన్ నిర్వాహకులను బలవంతంగా ఖాళీ చేయాలని చూస్తున్నారు. మొదటి రోజున ఏకంగా తాళళం వేసిన ఓ ప్రైవేట్ వ్యక్తి మూడవరోజున ఆ తాళం కాస్తా తీసేశాడు. మరోవైపు అధికారులు తగిన ఉత్తర్వులను ఇస్తే తాము ఖాళీ చేస్తామని ప్రస్తుత నిర్వాహకులు తెలియజేస్తున్నారు. ఓపెన్ టెండర్ను నిర్వహిస్తే అందరికీ మంచిదంటున్నారు. కంటి మహిళా ఓపీలో 10:20 గంటలైనా రాని వైద్యులు గైనిక్ ఓపీ ముందు మూలనపడ్డ కుర్చీ 13 మంది స్టాఫ్ నర్సులు డీఈఓ ఉద్యోగాలకే పరిమితం -
విద్యార్థిని అదృశ్యం
జమ్మలమడుగు రూరల్ : జమ్మలమడుగు పట్టణంలోని లక్ష్మీనగర్కు చెందిన ముత్తులూరు ప్రత్యూష (16) అనే విద్యార్థిని కనిపించడం లేదని తల్లి ప్రభావతి పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఎస్ఐ రామక్రిష్ణ ఇచ్చిన వివరాలు ఇలా ఉన్నాయి. లక్ష్మీనగర్కు చెందిన ముత్తులూరు ప్రత్యూష పట్టణంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. బుధవారం సాయంత్రం 6 గంటల సమయంలో అంగడికి వెళ్లి వస్తానని చెప్పి తిరిగి రానట్లు గురువారం పట్టణ పోలీస్స్టేషన్లో తల్లి ప్రభావతి ఫిర్యాదు చేసింది. రేషన్షాపు సీజ్ కాశినాయన : మండల కేంద్రమైన నరసాపురంలోని రేషన్షాపును సీజ్ చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డీటీ శివశంకర్ తెలిపారు. 25 క్వింటాళ్లు బియ్యం, 75 కేజీల చక్కెర స్టాకులో తక్కువగా ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. కేసు నమోదు చేసి ఈ విషయాన్ని జిల్లా అధికారులకు తెలియజేశామని పేర్కొన్నారు. అనుమానాస్పద స్థితిలో ఆటో డ్రైవర్ మృతి జమ్మలమడుగు రూరల్ : ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన ఎస్. మహమ్మద్ అజీజ్ (40) అనే ఆటో డ్రైవర్ అనుమానస్పదంగా మృతి చెందాడు. ఎస్ఐ బి. రామకృష్ణ తెలిపిన వివరాల మేరకు ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన మహమ్మద్ అజీజ్ గురువారం ప్రొద్దుటూరు నుంచి జమ్మలమడుగుకు బాడుగ కోసం వచ్చాడు. తిరిగి ప్రొద్దుటూరుకు వెలుతుండగా దానవులపాడుకు రాగానే అకస్మాత్తుగా ఆటోలోనే మృతి చెందాడు. అయితే కొంతకాలంగా అజీజ్ అనారోగ్యంతో ఉన్నట్లు సమాచారం. నకిలీ ఫోన్ పే మోసగాళ్ల అరెస్ట్ చాపాడు : నకిలీ ఫోన్ పే యాప్ ఉపయోగించి మూడు నెలలుగా జనరల్ స్టోర్లో మోసం చేస్తున్న ముగ్గురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక పోలీస్స్టేషన్లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ట్రైనీ డీఎస్పీ భవానీ వివరాలు వెల్లడించారు. చాపాడులోని నక్కలదిన్నె రోడ్డులో గల పెంచల నరసింహా జనరల్ స్టోర్లో.. చాపాడుకు చెందిన ముత్యాల శివశంకర్, లక్ష్మీపేటకు చెందిన భూమిరెడ్డి వీరాంజనేయరెడ్డి, సీతారామాపురానికి చెందిన సాయి గత మూడు నెలలుగా నకిలీ ఫోన్ పే యాప్ ద్వారా సరకులు కొనుగోలు చేస్తూ మోసానికి పాల్పడ్డారు. రూ.3 లక్షల వరకు సరకులు తీసుకెళ్లడంతోపాటు కత్తితో బెదిరించిన ఘటనపై బుధవారం బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టి శివశంకర్, వీరాంజనేయరెడ్డి, సాయిలను అరెస్ట్ చేసినట్లు ట్రైనీ డీఎస్పీ తెలిపారు. వారి వద్ద నుంచి ఒక మొబైల్, ఒక కత్తిని స్వాధీనం చేసుకున్నామన్నారు. సమావేశంలో ఎస్ఐ చిన్న పెద్దయ్య, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
జజ్జనకర జనారే.. జాతర భళారే..!
రాజంపేట టౌన్ : పట్టణంలోని బలిజపల్లెలో గురువారం గంగమ్మ జాతర సంబరం అంబరమంటింది. వేడుక బుధవారం రాత్రి నుంచే అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. తొలుత నిర్వహణలో భాగస్వాములైన నాపరపురెడ్డిపల్లె నిర్వాహకులు, ప్రజలు.. గంగమ్మ సోదరుడైన పోతురాజును ఊరేగిస్తూ అమ్మవారికి నవధాన్యాలు తీసుకొచ్చారు. అనంతరం గంగమ్మకు పుట్టినిల్లయిన తుమ్మల అగ్రహారం నుంచి.. ఆ గ్రామ మహిళలు పెద్దఎత్తున గండదీయలను బలిజపల్లెకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆ గ్రామానికి చెందిన నిర్వాహకులు, యువకులు తప్పెట్ల దరువుకు అనుగుణంగా అడుగులు వేస్తూ.. కర్రసాము విన్యాసాలు చేస్తూ, దీపావళిని తలపించేలా బాణాసంచా పేల్చుతూ చేరుకున్నారు. బలిజపల్లెలో గంగమ్మ ప్రతిమ తయారైన అనంతరం.. నిర్వాహకులు గురువారం తెల్లవారుజామున రథంలో అమ్మవారిని ఊరేగిస్తూ ప్రత్యేకంగా తయారు చేసిన వేపమండల గుడిలోకి తీసుకొచ్చి కొలువు దీర్చారు. గంగమ్మ ఊరేగింపుగా గుడిలోకి వచ్చే సమయంలో పోతురాజును ఎగిరించేందుకు భక్తులు పోటీపడ్డారు. గంగమ్మ గుడిలోకి వస్తుండగా.. వందలాది మంది భక్తులు ముద్దలు పెట్టి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించారు. గంగమ్మా.. కాపాడమ్మా ఈ సందర్భంగా భక్తులు ‘అమ్మా గంగమ్మ తల్లి.. మము కరుణించి కాపాడమ్మా’ అంటూ వేడుకున్నారు. గంగమ్మ గుడిలోకి చేరుకోక ముందే వేలాది మంది బలిజపల్లెకు చేరుకోవడంతో.. బలిజపల్లె గ్రామం ఇసుకవేసినా రాలనంతగా భక్తులతో నిండిపోయింది. అమ్మవారు గుడిలో కొలువు దీరాక భక్తులు ఒక్కసారిగా గంగమ్మను దర్శించుకునేందుకు త్వరపడటంతో పోలీసులు అధికారులు, సిబ్బంది అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. గంగమ్మ గుడిలో కొలువుదీరగానే జాతర ఒక్కసారిగా ఊపందుకుంది. దీంతో ఉదయం నుంచి రాత్రి వరకు కిలోమీటరు మేర భక్తుల రద్దీ కొనసాగింది. దారులన్నీ జాతర వైపే బలిజపల్లె గంగమ్మ జాతరలో అమ్మవారికి వరపడితే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందువల్ల బుధవారం రాత్రి నుంచే గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు బలిజపల్లెకు చేరుకోవడం ప్రారంభించారు. జాతరలోకి వచ్చేందుకు నాలుగువైపులాఉన్న రహదారుల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలి వచ్చారు. దీంతో పట్టణంలోని అన్ని దారులు జాతరవైపు సాగి కోలాహలంగా మారాయి. వైభవంగా బలిజపల్లె గంగమ్మ జాతర ఆకట్టుకున్న యువకుల విన్యాసాలు భారీగా తరలివచ్చిన భక్తులు గంగమ్మను దర్శించుకున్న ఆకేపాటి, పోలా జాతర సందర్భంగా ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాఽథ్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పోలా శ్రీనివాస్రెడ్డి.. గంగమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడారు. బలిజపల్లె గంగమ్మ ఎంతో విశిష్టత సంతరించుకున్న దేవత అని, గంగమ్మ బలిజపల్లె గ్రామంలో స్వయంభుగా వెలియడం ఈ ప్రాంత ప్రజలు చేసుకున్న అదృష్టమన్నారు. బలిజపల్లె గంగమ్మ వల్ల జిల్లాలోనే కాక రాష్ట్రంలోనూ రాజంపేటకు ప్రత్యేకమైన గుర్తింపు ఉందని తెలిపారు. గంగమ్మ కరుణతో ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ ఏడాది వర్షాలు బాగా కురిపించి ప్రజల, రైతుల కష్టాలు తీర్చాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. మున్సిపల్ చైర్మన్ పోలా శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఎంతో ప్రసిద్ధి గాంచిన గంగమ్మ జాతరలో తాను ప్రతి ఏడాది పాల్గొని, ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని, అమ్మవారిని వేడుకునే అవకాశం రావడం తన పూర్వజన్మ సుకృతమని తెలిపారు. -
వైవీయూ క్యాంపస్ డ్రైవ్కు విశేష స్పందన
కడప ఎడ్యుకేషన్ : యోగి వేమన విశ్వవిద్యాలయం క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్కు విశేష స్పందన లభించింది. ప్రముఖ బయోకాన్ మల్టీనేషనల్ కంపెనీ వైవీయూలో గురువారం చేపట్టిన ఎంపికలకు తిరుపతి, వైజాగ్, గుంటూరు, రాజమండ్రి, బాపట్ల, అన్నమయ్య, కడప జిల్లాల నుంచే కాక చత్తీస్ఘడ్, ఒడిస్సా, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి 500 మంది ఇంజినీరింగ్, డిగ్రీ పీజీ అర్హత గల అభ్యర్థులు హాజరయ్యారు. వైవీయూ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎస్ రఘునాథ్రెడ్డి , రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పుత్తా పద్మలు క్యాంపస్ డ్రైవ్ ప్రారంభించి మాట్లాడారు. విశ్వవిద్యాలయ ప్లేస్మెంట్ సెల్ డైరెక్టర్ ఆచార్య జి.విజయ భారతి ఎంపికల ప్రక్రియను సమన్వయం చేశారు. బయోకాన్ కంపెనీ క్వాలిటీ అస్సూరెన్స్ మేనేజర్ లక్ష్మినరసయ్య, హెచ్.ఆర్ విభాగ డిప్యూటీ మేనేజర్ జయప్రకాష్, ఎస్సార్ డైరెక్టర్ జయభారత్, ఆపరేషన్ హెడ్ ఎన్హెచ్ అశోక్, క్లస్టర్ హెడ్ రాజశేఖర్, హెచ్ఆర్ విభాగ ఆర్ శరత్ విద్యార్థులకు మౌఖిక పరీక్ష నిర్వహించారు. ఇందులో 160 మంది అభ్యర్థులను కంపెనీ ప్రొడక్షన్, క్వాలిటీ కంట్రోల్ ,ఇంజనీరింగ్ అండ్ మెయింటెనెన్స్ విభాగాలలో ఉద్యోగాలకు ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ పాలకమండలి సభ్యురాలు ప్రొఫెసర్ చంద్రమతి శంకర్, ప్లేస్మెంట్ సెల్ ప్రతినిధులు డాక్టర్ లలిత, డాక్టర్ గణేష్ నాయక్, డాక్టర్ సుభోస్ చంద్ర, అధ్యాపక, బోధనేతర సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. -
ఖాకీ వనంలో కలుపు మొక్కలు!
● ఎన్నికల అధికారికి గుండెపోటు వచ్చేలా.... తొలి రోజు వాయిదా పడిన ఎన్నిక మరుసటి రోజైన 28న నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు సమాయత్తమైతే వారిపైనే దౌర్జన్యానికి దిగి ఎన్నికల అధికారి రామాంజనేయరెడ్డికి గుండెపోటు వచ్చేలా చేశారు. ఇదంతా కూడా డీఎస్పీ సమక్షంలోనే చోటుచేసుకున్నా ఈ రోజు వరకు కేసు నమోదు కాలేదు. ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి సోదరుడు నంద్యాల అనందభార్గవరెడ్డి మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య కుమారుడు ప్రతాప్, మాజీ జెడ్పీటీసీ మహేశ్వరరెడ్డి ఎన్నికల గదిలోకి ప్రవేశించి దౌర్జన్యానికి దిగారు. టీడీపీకి చెందిన వారు ఎన్నికల అధికారి వద్ద ఉన్న డాక్యుమెంట్లను చించేశారు. కుర్చీలు ఎత్తేసి భయబ్రాంతులకు గురిచేశారు. దీంతో సదరు ఎన్నికల అధికారి రామాంజనేయరెడ్డికి గుండెపోటు వచ్చింది. ఇప్పుడా వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నా యి. ఇంత తతంగం తెరపైకి వచ్చినా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. సాక్షి ప్రతినిధి, కడప: సోషల్ మీడియాలో చిన్న పోస్టు పెడితే చాలు... గోడలు దూకి మరీ అరెస్టులు చేసే పోలీసులు...ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించే ఎన్నికల్లో దౌర్జన్యం, దాడులకు దిగితే చూస్తుండిపోయారు. వైఎస్సార్సీపీ సభ్యులపై దాడు లు చేసి.. ఫేక్ ఐడీ కార్డులతో ఎన్నికను తారుమా రు చేయాలనుకున్నా.. మౌనాన్నే ఆశ్రయించారు. ఎన్నికలు రూమ్లోకి వెళ్లి ఎన్నికల అధికారిపైనే దౌర్జన్యానికి దిగినా నో కేస్. చివరికి ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి సోదరుడు చేసిన దౌర్జన్యానికి ఎన్నికల అధికారికి గుండె పోటు కూడా వచ్చినా నో కేస్. ఇదీ.. కూటమి పాలనలో ఖాకీల పనితీరు. ● ప్రొద్దుటూరు మండలం గోపవరం పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నికల్లో టీడీపీ చేయని అరాచకం లేదు. సాక్షాత్తు డీఎస్పీ ముందే ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి సోదరుడు అనందభార్గవ్రెడ్డితోపాటు పలువురు టీడీపీ నేతలు ఎన్నికల అధికారిపై దౌర్జన్యానికి దిగితే కనీసం కేసు కూడా లేదు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో టీడీపీ దౌర్జన్యకాండను కళ్లకు కట్టినట్లు బహిర్గతం చేశాయి. ఎటువంటి బలం లేని కారణంగా ఎలాగైనా ఉప సర్పంచ్ ఎన్నికను అడ్డుకునేందుకు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి బంధువు లు చేయని అరాచకం లేదు. మార్చి 27న వైఎస్సార్సీపీ సభ్యులు ఎన్నికకు వస్తుంటే వారి వాహనంపై దాడి చేసి, మహిళా సభ్యులను సైతం గాయపరిచి ఎన్నికకు రాకుండా అడ్డుకున్నారు. అదే రోజు ఎలాగైనా గెలవాలని నలుగురు వ్యక్తులకు ఫేక్ ఐడీ కార్డులు సృష్టించి ఎన్నిక గదిలోకి పంపినా వారిని కనీసం అదుపులోకి కూడా తీసుకోలేదు. సాక్షాత్తు రాష్ట్ర ఎన్నికల కమిషన్ను అపహాస్యం చేసే విధంగా వారు వ్యవహరిస్తే చట్టపరమైన చర్యల్లేవు. ఎన్నికల కమీషన్ ఆదేశాలకే దిక్కులేదు... 20 మంది వార్డు మెంబర్లు ఉన్న గోపవరం పంచాయితీలో ఉప సర్పంచ్ ఎన్నిక కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలకే జిల్లాలో దిక్కులేకుండా పోయింది. ఎన్నికకు సంబంధం లేని తెలుగుదేశం నాయకులు ఎన్నికల రూమ్లోకి ప్రవేశించారు. పోలీసు అధికారులు సైతం అదే వీడియోలో కన్పిస్తున్నారు. అయినా నియంత్రించలేదు. పోలీసుల కళ్లముందే దౌర్జన్యానికి దిగినా వారికి కనిపించలేదు. మరోవైపు ‘ఒక్క ఫోన్ కొడితే చాలు న్యాయం చేస్తా’మని ఎస్పీ ఈజీ అశోక్కుమార్ ప్రకటించారు. ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు చేపట్టిన 20 మంది వార్డు మెంబర్లు ఉన్న ఎన్నికల్లో అరాచకం తాండవించినా చట్టపరమైన చర్యలు లేకపోవడం ఎస్పీ ప్రకటనను ప్రశ్నాకర్థంగా మారుస్తోంది. ఆలస్యంగా వీడియోలు బయటకు రావడంతో చిన్న ఉప సర్పంచ్ పదవి కోసం టీడీపీ నేతలు చేసిన దౌర్జన్యకాండ వెలుగు చూసింది. ఇప్పటికై నా జిల్లా పోలీసు యంత్రాంగం చట్టాన్ని పరిరక్షించేందుకు ముందుండాలని ప్రజాస్వామ్యవాదులు కోరుతున్నారు. అధికార పార్టీ నాయకుల మెప్పు కోసం తాపత్రయం ఎన్నికల కమీషన్ ఆదేశాలు ఉల్లంఘించినా కేసుల్లేవు గోపవరం ఉపసర్పంచ్ ఎన్నికలో ప్రజాస్వామ్యం అపహాస్యం ఫేక్ ఐడీలతో పట్టుబడినా చర్యల్లేవ్ ‘దేశం’ నేతలు కావడంతోచట్టపరమైన చర్యలకు వెనుకంజ -
ఆస్పత్రిలో రోగుల భోజన నాణ్యతపై తనిఖీ
కడప అర్బన్ : కడప నగర శివార్లలోని ప్రభుత్వ వైద్యశాల(రిమ్స్)లోని రోగులకు అందిస్తున్న భోజన నాణ్యతను ఫుడ్ సేఫ్టీ అధికారులు యండి.షంషీర్ ఖాన్, డాక్టర్ ఎం.హరిత గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిమ్స్ ఆస్పత్రిలో రోగులకు అందిస్తున్న భోజనం , పోషక విలువలు సంవృద్ధిగా ఉన్నాయా? లేదా అన్నది స్వయంగా పరీక్షించారు. రోగులతో మాట్లాడి అందుతున్న భోజనం గురించి వారి అభిప్రాయాలు తెలుసుకొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కమిషన్ ఆఫ్ ది ఫుడ్ సేఫ్టీ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, ఆరోగ్యశ్రీ ఆసుపత్రులు,ప్రైవేట్ ఆసుపత్రుల్లో డైట్ కాంట్రాక్టర్లు అందిస్తున్న భోజనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. భోజనం నాణ్యతలో ఎక్కడైనా లోపం కనబడితే తక్షణమే వాటిని స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీకి పంపించి పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. తదుపరి పైన తెలిపిన ఆసుపత్రి ముడి పదార్థాల నాణ్యత కోసం ల్యాబొరేటరీకి పంపించారు. ఈక్రమంలో డైట్ కాంట్రాక్టర్లకు తగిన సూచనలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రిమ్స్ డైటిషన్ బాలాజీ నాయక్, డైట్ కాంట్రాక్టర్ ఖాజా పాల్గొన్నారు. -
జిల్లా ఆస్పత్రిని పరిశీలించిన కాయకల్ప బృందం
ప్రొద్దుటూరు క్రైం : జిల్లా ఆస్పత్రిని కాయకల్ప పర్యవేక్షణ బృందం గురువారం పరిశీలించింది. జాయింట్ డైరెక్టర్ సాగర్, స్టేట్ టీబీ కార్యాలయ అసిస్టెంట్ ప్రోగ్రాం ఆఫీసర్ రవీంద్రకుమార్ ఆస్పత్రిని పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వాసుపత్రుల పనితీరును బట్టి కాయకల్ప అవార్డును ప్రకటిస్తుంది. ఇందులో భాగంగా అధికారుల బృందం ఆస్పత్రిలోని అన్ని విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అన్ని వార్డులతో పాటు, ఓపీ విభాగాలను పరిశీలించి ప్రజలతో మాట్లాడారు. అలాగే పారిశుధ్యంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆనంద్బాబు కాయకల్ప బృందానికి ఆస్పత్రిలో అందిస్తున్న సేవల గురించి వివరించారు. కార్యక్రమంలో ఆర్ఎంఓ డాక్టర్ రూపానంద్, డాక్టర్ గోపాల్ పాల్గొన్నారు. -
అకాల వర్షం.. అపార నష్టం
కేంద్ర కారాగాలను పరిశీలించిన జడ్జి కడప అర్బన్ : జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జి.శ్రీదేవి సూచనల మేరకు జిల్లా న్యాయసేవాధికారసంస్థ సెక్రటరీ, జడ్జి ఎస్.బాబా ఫక్రుద్దీన్ తమ సిబ్బందితో కలిసి గురువారం కడప నగర శివార్లలోని పురుషుల కేంద్ర కారాగారం, మహిళల కారాగారంలోని ప్రిజన్ లీగల్ ఎయిడ్ క్లినిక్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జడ్జి ఖైదీలతో మాట్లాడి వారి కేసు వివరాలను, ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఉచిత న్యాయ సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మానసిక వ్యాధిగ్రస్తులైన ఖైదీలతో మాట్లాడారు. సకాలంలో డాక్టర్ సలహాలు తీసుకుంటూ మందులు వాడాలన్నారు. అనంతరం కారాగారం పరిసరాలను, టాయిలెట్లను, వసతి గదులను, రిజిస్టర్లను పరిశీలించి తగు సూచనలను సలహాలను ఇచ్చారు. ఫిర్యాదుల పెట్టెను పరిశీలించడం జరిగినది, ప్రిజన్ లీగల్ ఎయిడ్ క్లినిక్ ప్రాధాన్యతను తెలియజేశారు. కారాగారం లోపల ఖైదీల హక్కులు, ఉచిత న్యాయ సహాయము, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టం మొదలగు అంశాలను వివరించారు. లీగల్ సర్వీసెస్ హెల్ప్లైన్ నెంబర్ 15100 పై ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పురుషుల కేంద్ర కారాగారము సూపరింటెండెంట్ రాజేశ్వరరావు, మహిళ కారాగారపు సూపరింటెండెంట్ కృష్ణవేణి, డాక్టర్లు, పారా లీగల్ వలంటీర్లు పాల్గొన్నారు. కడప అగ్రికల్చర్ : పంటలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్న అన్నదాతలపై ప్రకృతి కన్నెర్ర చేసింది. మొన్న చక్రాయపేట మండలంలో ఈదురు గాలులకు 2700 ఎకరాలకుపైగా అరటి పంట నేలవాలి దెబ్బతిని రూ.50 కోట్లకుపైగా రైతులకు నష్టం వాటిల్లింది. ఆ సంఘటన మరువకముందే మళ్లీ గురువారం సాయంత్రం ఉన్నట్లుండి కురిసిన అకాల వర్షంతోపాటు ఈదురు గాలులతో రైతులకు అపారనష్టం కలిగింది. జిల్లాలోని ఖాజీపేట, సికెదిన్నె మండలాల్లో పలువురు రైతులకు చెందిన అరటి చెట్లు నేలకొరిగాయి. దీంతో రైతులకు రూ.10 లక్షలకుపైగా నష్టం వాటిల్లినట్లు ఉద్యానశాఖ అధికారులు ప్రాథమిక పంట నష్టాన్ని అంచనా వేశారు. ఇందులో ఖాజీపేట మండలంలో 30 మంది రైతులకు సంంధించి 71.5 ఎకరాల్లో అరటి పంట పూర్తిగా నేలకొరిగింది. దీంతో 7.15 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు అధికారులు గుర్తించారు. అలాగే సికె దిన్నె మండలంలో 20 మంది రైతులకు సంబంధించి 35 ఎకరాల్లో ఆరటి పంట నెలకొరిగింది. దీంతో వారికి రూ. 3.5 లక్షల మేర నష్టం వాటిల్లింది. ఇలా మొత్తంగా 50 మంది రైతులకు సంబంధించి 106.5 ఎకరాల్లో అరటి పంట దెబ్బతినడంతో రూ.10.65 లక్షల నష్టం జరిగిందని ఉద్యానశాఖ అధికారులు ప్రాథమిక నష్ట పరిహారాన్ని గుర్తించారు. మార్కెట్యార్డులో తడిసిన పసుపు కడప మార్కెట్యార్డులోకి వర్షపునీరు చేరి ఎండు పసుపు తడిచి ముద్దయింది. అమ్మకం కోసం మార్కెట్యార్డుకు తెచ్చిన పసుపును కుప్పలుగా పోసుకుని ఉండగా.. ఉన్నట్లుండి కురిసిన వర్షంతో నీరంతా పసుపు కొమ్ముల కుప్పల అడుగుభాగంలో చేరి తడిచిపోయింది. వర్షం ప్రారంభం కాగానే పసుపు కుప్పలసై పట్టలు కప్పినా అడుగుభాగంలోకి వర్షపు నీరు చేరడంతో ఎండు కొమ్ములు తడిచాయని గోపులాపురానికి చెందిన వెంకటరెడ్డి, రామాంజనేయరెడ్డి, అప్పరాజుపల్లికు చెందిన విశ్వనాథరెడ్డి, కొత్తపేటకు చెందిన సుబ్బరాయుడులతోపాటు పలువురు రైతులు తెలిపారు. వర్షపునీటితో కొమ్ములు తడవటంతో పసుపు నాణ్యత తగ్గడంతోపాటు బరువు కూడా తగ్గుతుందని వారు వాపోయారు. తడిచిన పసుపు కొమ్ములను మళ్లీ ఆరబెట్టి అమ్ముకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్ యార్డులో సరైన వసతులు లేక పోవడంతోనే ఎండు పసుపు తడిచిందని పేర్కొన్నారు. ఈ విషయమై యార్కెట్యార్డు సెక్రటరీ సుజాతతో మాట్లాడగా.. పసుపు తడిచినట్లు రైతులెవరూ తమ దృష్టికి తేలేదని తెలిపారు. ఈదురు గాలులతో.. చింతకొమ్మదిన్నె : మండలంలో గురువారం మధ్యాహ్నం వీచిన ఈదురు గాలుల ధాటికి అరటి రైతులకు పెద్ద ఎత్తున నష్టం కలిగింది. నాగిరెడ్డిపల్లె, గూడావాండ్లపల్లె, బుగ్గలపల్లె, లింగారెడ్డిపల్లి తదితర గ్రామాలలో తోటలలో గెలలతో ఉన్న అరటి చెట్లు.. ఈదురుగాలికి చాలా చోట్ల నేలకొరిగాయి. అమృతపాణి రకం అరటి చెట్లు ఎత్తుగా పెరగడం వల్ల నేలపై వాలిపోయాయి. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ ఆరుగాలం శ్రమించి పెద్దమొత్తంలో పెట్టుబడులు పెట్టి పంట సాగు చేశామని, తీరా చేతికి వచ్చే తరుణంలో ఈదురు గాలులు తమకు శాపంగా మారాయన్నారు. అరటికి పెద్ద ఎత్తున నష్టం వాటిల్లడంతో ప్రభుత్వం తమను అఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు. దెబ్బతిన్న నువ్వుల కట్టె వేముల : అకాల వర్షాలతో నువ్వుల రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. డిసెంబర్, జనవరి నెలలో సాగు చేసిన రైతులు.. నువ్వుల కట్టెను కోతలు కోసి కల్లాలకు తరలించారు. అక్కడ మూడు రోజులపాటు మగ్గిన తర్వాత నువ్వుల కట్టెను నూర్పిళ్ల కోసం వేశారు. ఎండలు బాగా ఉంటే రెండు, మూడు రోజులలో నువ్వుల కట్టెను తీసి వేసి.. నువ్వులను వేరు చేసేందుకు రైతులు సిద్ధమయ్యారు. అయితే ఈలోగా అకాల వర్షాలు రావడంతో కల్లాల్లో ఉన్న నువ్వుల కట్టె తడిసి ముద్దమైంది. నువ్వుల కట్ట కింద ఉన్న నువ్వులు తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట సాగు చేసి మూడు నెలలపాటు కాపాడుకుంటే నోటికాడికి వచ్చిన తర్వాత వర్షార్పణం కావడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. నేలకొరిగిన అరటి చెట్లు లబోదిబోమంటున్న రైతులు -
వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యాంగ వ్యతిరేకం
కడప సెవెన్రోడ్స్: కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యాంగ వ్యతిరేకమని మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్బాష విమర్శించారు. బుధవారం తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 15, 25, 26 స్ఫూర్తికి వక్ఫ్ సవరణ బిల్లు తూట్లు పొడుస్తోందన్నారు. ప్రజాస్వామ్య, సెక్యులర్ దేశంలో ముస్లింలను ద్వితీయ శ్రేణి పౌరుల స్థాయికి దిగజార్చేందుకు ఎన్డీఏ ప్రయత్నిస్తోందన్నారు. 1954 నుంచి అమలులోకి వచ్చిన వక్ఫ్ చట్టానికి గతంలో జరిగిన సవరణలకు, నేటి సవరణలకు చాలా వ్యత్యాసముందన్నారు. గత ప్రభుత్వాలు ముస్లిం మత పెద్దలతో చర్చించాకే సవరణలు చేసిన సంగతి ఆయన గుర్తు చేశారు. మసీదులు, దర్గాలు, అషుర్ఖానాలు, స్మశానాల నిర్వహణ కోసం తమ పూర్వీకులు భూములను దానంగా ఇచ్చారని తెలిపారు. అవి అల్లాహ్కు సంబంధించిన ఆస్తులుగా తాము భావిస్తామన్నారు. కానీ నేటి ఎన్డీయే ప్రభుత్వం దాని అర్థాన్నే మార్చేస్తోందన్నారు. వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన ఆధార పత్రాలు చూపమంటే ఎవరు చూపగలరని ప్రశ్నించారు. ఎవరు వక్ఫ్ చేయాలన్నా వారు ఐదేళ్లు ముస్లింగా ప్రాక్టీస్ చేసి ఉండాలని, ఇందుకు సంబంధించిన డిక్లరేషన్ను కోరడం ఏమిటంటూ ఆయన మండిపడ్డారు. వక్ఫ్ ట్రిబ్యునల్, సర్వే కమిషన్లా అధికారాలను తొలగించి కలెక్టర్లకు కట్టబెట్టడం తగదన్నారు. ఇప్పటివరకు వక్ఫ్ ఆస్తులకు సంబంధించి టైటిల్ నిర్ధారించే హక్కు వక్ఫ్ ట్రిబ్యునల్, కమిషన్కు మాత్రమే ఉండేదని, దాన్ని కలెక్టర్లకు కట్టబెట్టడం ఏమాత్రం సమంజసం కాదన్నారు. ఎందుకంటే కలెక్టర్లు అధికారంలో ఉన్న వారికి అనుకూలంగా ఉంటారని తెలిపారు. డిఫెన్స్, రైల్వే తర్వాత వక్ఫ్ బోర్డుకే అధికంగా ఆస్తులు ఉన్నాయంటూ కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు మాట్లాడటం సహేతుకం కాదన్నారు. ప్రభుత్వం రైల్వే, డిఫెన్స్లకు భూములు కేటాయించింది తప్ప వక్ఫ్కు కేటాయించలేదన్నారు. వక్ఫ్బోర్డు పరిధిలో ఉన్న భూములు తమ పూర్వీకులు దానం చేసినవన్న విషయాన్ని మరవరాదన్నారు. బీజేపీ తన రాజకీయ లబ్ధికోసం దేశాన్ని ముక్కలు చేసేందుకు వక్ఫ్ సవరణ బిల్లు తెలుస్తోందని ఆరోపించారు. సవరణ బిల్లు ద్వారా వక్ఫ్కు ఆదాయం పెంచుతామని ప్రభుత్వం మాట్లాడటం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. ఇప్పటివరకు వచ్చే ఆదాయంలో ముతవల్లీలు ఏడు శాతం వక్ఫ్కు చెల్లించేవారని, ఇప్పుడు సవరణ బిల్లులో దాన్ని ఐదు శాతానికి తగ్గించారన్నారు. ఇందువల్ల వక్ఫ్కు ఆదాయం తగ్గుతుందేగానీ ఎలా పెరుగుతుందో ప్రభుత్వమే చెప్పాలన్నారు. వక్ఫ్బోర్డులో నాన్ మైనార్టీలకు అవకాశం కల్పిస్తూ సవరణలు చేయడం అన్యాయమన్నారు. తిరుమల–తిరుపతి దేవస్థానం తదితర పాలక మండళ్లలో మైనార్టీలకు అవకాశం కల్పించనప్పుడు వక్ఫ్బోర్డులో ఇతరులకు ఎలా అవకాశం కల్పిస్తారని ప్రశ్నించారు. ఇటీవల జరిగిన ఇఫ్తార్ విందులో ముస్లింలకు రక్షణగా ఉంటానన్న మఖ్యమంత్రి చంద్రబాబు బిల్లుకు మద్దతు ఇవ్వడం ద్వారా ముస్లిం ద్రోహిగా చరిత్రలో మిగిలిపోతారన్నారు. టీడీపీలోని మైనార్టీలు పునరాలోచించుకోవాలని, లేదంటే వారిని ముస్లింలు వెలివేస్తారని హెచ్చరించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ముస్లింల కోసం రిజర్వేషన్లను తీసుకొచ్చారని తెలిపారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మైనార్టీలకు పెద్దపీట వేశారని కొనియాడారు. మైనార్టీల సంక్షేమానికి రూ. 26 వేల కోట్లు ఖర్చు చేసిన ఘనత ఆయనదేనన్నారు. హజ్ యాత్రికుల కోసం ఎంబార్కేషన్ పాయింట్ను తీసుకొచ్చారన్నారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీలో వక్ఫ్ సవరణ బిల్లును తమ పార్టీ వ్యతిరేకించిందన్నారు. ఈ సమావేశంలో హజ్ కమిటీ మాజీ చైర్మన్ గౌసులాజం, కార్పొరేటర్లు షఫీ, అక్బర్ అలీ, మైనార్టీ నాయకుడు బీహెచ్ ఇలియాస్ తదితరులు పాల్గొన్నారు. వక్ఫ్ ఆస్తులు ముస్లింల పూర్వీకులు ఇచ్చినవి ఆధార పత్రాలు చూపాలంటే ఎలా సాధ్యం వక్ఫ్ చేయడానికి డిక్లరేషన్ కోరడం అసంబద్ధం ట్రిబ్యునల్, సర్వే కమిషన్ అధికారాల తొలగింపు తగదు బిల్లుకు మద్దతు ఇచ్చిన చంద్రబాబు మైనార్టీ ద్రోహి మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్బాష -
కార్యాలయాలన్నీ ఒకే చోట ఉండటం సౌకర్యవంతం
ప్రొద్దుటూరు రూరల్: గ్రామీణ ప్రాంతాల్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకే చోట ఉండటం ప్రజలకు చాలా సౌకర్యవంతమని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. మండలంలోని కొత్తపల్లె గ్రామ పంచాయతీ కానపల్లె గ్రామ సచివాలయ నూతన భవన సముదాయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల వద్దకే ప్రభుత్వ సేవలు అనే అంశంతో సచివాలయం, రైతు సేవా కేంద్రం, విలేజ్ హెల్త్ క్లినిక్ లను ఒకే ప్రాంగణంలో నిర్మించాలన్న ఆలోచన చేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని అభినందిస్తున్నానన్నారు. సంపదను సృష్టించడం నాయకుడి ప్రధాన లక్షణమని, ఉన్న ఊరు సొంత ప్రాంతాన్ని చక్కపెడితే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినట్లే అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచంలో 11వ స్థానంలో ఉన్న దేశ ఆర్థిక పరిస్థితిని 4వ స్థానంలోకి తీసుకురావడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం 3,260 విలేజ్ హెల్త్ క్లినిక్లను మంజూరు చేసిందని, ఆగిపోయిన విలేజ్ హెల్త్ క్లినిక్లను పూర్తి చేస్తామని తెలిపారు. జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ మాట్లాడుతూ స్వర్ణాంధ్రలో భాగంగా ప్రజలు, దాతలు భాగస్వాములతో అట్టడుగున ఉన్న పేదలను అత్యున్నతంగా ఉన్న సంపన్నుల ద్వారా అభివృద్ధి చేయడం పీ4 కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే లు నంద్యాల వరదరాజులరెడ్డి, ఆదినారాయణరెడ్డి, డీఎంహెచ్ఓ డాక్టర్ నాగరాజు, ఆర్డీఓ సాయిశ్రీ, డీఎస్పీ భావన, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడు డాక్టర్ వరుణ్కుమార్రెడ్డి, సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి, సంస్కృతి స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి ఒంటేరు శ్రీనివాసులరెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నంద్యాల కొండారెడ్డి, మాజీ ఎంపీపీ నంద్యాల రాఘశరెడ్డి, వీఎస్ ముక్తియార్, కొనిరెడ్డి హర్షవర్ధన్రెడ్డి, తహసీల్దార్ గంగయ్య, ఎంపీడీఓ సూర్యనారాయణరెడ్డి, మండల వ్యవసాయాధికారి శివశంకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ -
పది మూల్యాంకనానికి సర్వం సిద్ధం
● నేటి నుంచి ప్రారంభం.. 9వ తేదీ వరకు నిర్వాహణ ● ఏర్పాట్లు చేసిన విద్యాశాఖ అధికారులు ● జిల్లాకు చేరిన సమాధాన పత్రాలు ● 1337 మంది సిబ్బందితో మూల్యాంకనం కడప ఎడ్యుకేషన్: జిల్లా వ్యాప్తంగా మార్చి 17వ తేదీ నుంచి ప్రారంభమైన పదవ తరగతి పరీక్షలు ఏప్రిల్ 1వ తేదీకి ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలో 161 పరీక్షా కేంద్రాలలో 28,700 మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలను రాశారు. కాగా.. సమాధాన పత్రాల మూల్యాంకనం ఏప్రిల్ 3వ తేదీ నుంచి కడపలోని మున్సిపల్ హైస్కూల్ మొయిన్లో నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ ప్రక్రియ ఏప్రిల్ 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఇప్పటికే వివిధ జిల్లాల నుంచి వచ్చిన పరీక్ష పేపర్లకు కోడింగ్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. బుధవారం సాయంత్రం వరకు అన్ని సబ్జెక్టులకు కోడింగ్ ముగియగానే చివరగా సోసియల్ సబ్జెక్టుకు కోడింగ్ జరుగుతోంది. సిబ్బందికి వసతుల ఏర్పాటు... మూల్యాంకనం చేసేందుకు జిల్లావ్యాప్తంగా 1337 మంది సిబ్బందిని విధులకు ఏర్పాటు చేశారు. ఇందులో ఛీప్ ఎగ్జామినర్లు 121 మంది, అసిస్టెంట్ ఎగ్జామినర్లు 732 మందిని, స్పెషల్ అసిసెంట్లుగా 484 మందిని ఇలా మొ త్తంగా 1337 మందిని నియమించారు. విధులకు హాజరయ్యే సిబ్బందికి అన్ని రకాల మౌలిక వసతులను ప్రభుత్వ పరీక్షల విభాగం ఏర్పాటు చేసింది. పక్కాగా నిబంధనలు అమలు: మూల్యాంకనంలో పాల్గొనే సిబ్బందికి గుర్తింపు కార్డులు జారీ చేశారు. ఈ కార్డు ఉన్న వారినే ఆ ప్రాంతంలోకి అనుమతించనున్నారు. మూల్యాంకనం జరుగుతున్న అన్ని రోజులు అటువైపు ఇతరులు రాకుండా ఆంక్షలు విధిస్తున్నారు. ● విడతల వారిగా.. ఈ ఏడాది వివిధ జిల్లాల నుంచి వచ్చిన 1,72,172 జవాబు పత్రాలను ఇక్కడ మూల్యాంకనం చేయనున్నారు. ఇందుకోసం 1,337 మంది సబ్జెక్టు టీచర్లను విద్యాశాఖ నియమించింది. ఈ మూల్యాంకన కేంద్రంలో జిల్లా విద్యా శాఖ అధికారి క్యాంపు ఆఫీసర్గా, డిప్యూటీ ఈఓ రాజగోపాల్రెడ్డి, ప్రభుత్వ పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్లు డిప్యూటీ క్యాంపు ఆఫీసర్లుగా, మరో ఏడు మంది అసిస్టెంట్ క్యాంపు ఆఫీసర్లుగా వ్యవహరిస్తారు. వీటితోపాటు ప్రతి గ్రూపునకు ఒక ఛీప్ ఎగ్జామినర్ (సీఈఓలు), ఆరుగురు సహాయ ఎగ్జామినర్లు (ఏఈలు), ఇద్దరు స్పెషల్ అసిసెంట్లు (ఎస్పీఏ) పాల్గొంటారు. ప్రతి సహాయక ఎగ్జామినర్ రోజుకు 40 పేపర్లను మూల్యాంకనం చేయాల్సి ఉంటుంది. -
సమస్యల సాధనకు ఉద్యమిస్తాం
కడప ఎడ్యుకేషన్ : ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించిన ఆమోదయోగ్యమైన పెన్షన్ విధానం, పీఆర్సీ, ఐఆర్లపై ప్రభుత్వ నిర్ణయం ప్రకటించాలని ఫ్యాప్టో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మల్లు రఘనాథరెడ్డి డిమాండ్ చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల సాధన కోసం బుధవారం రాష్ట్ర ఫ్యాప్టో పిలుపు మేరకు కడప కలెక్టరేట్ ఎదుట జిల్లా ఫ్యాప్టో చైర్మన్ ఎస్ఎండి ఇలియాస్ బాషా అధ్యక్షతన నిరసన కార్యక్రమాన్ని ర్వహించారు. ఈ సందర్భంగా రఘునాథరెడ్డి మాట్లాడుతూ సీపీఎస్, జపీపీఎస్ల స్థానంలో ఆమోదయోగ్యమైన పెన్షన్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే 12వ పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మధ్యంతర భృతి(ఐ.ఆర్) ప్రకటిస్తామన్న ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు చెల్లించాల్సిన ఆర్థిక బకాయిలు రూ.30 వేల కోట్లు ఉండగా ఇటీవల రెండు విడతలుగా రూ.7300 కోట్లు చెల్లించారన్నారు. మిగిలిన సుమారు రూ.23 వేల కోట్ల చెల్లింపునకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్సీ, ఏఐఎస్టీఎఫ్ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కత్తి నరసింహారెడ్డి మాట్లాడుతూ ఏకీకృత సర్వీసు రూల్స్ సమస్యను పరిష్కరించి, పర్యవేక్షణాధికారి పోస్టులను భర్తీ చేసి ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం నిర్లిప్త ధోరణితో వ్యవహరిస్తోందన్నారు. తెలుగు భాషా ప్రయుక్త రాష్ట్రమైన మన రాష్ట్రంలో తెలుగు మాధ్యమం కొనసాగించాలని పోరాటం చేయాల్సి రావడం శోచనీయమన్నారు. అనంతరం కలెక్టరేట్ నుంచి మహావీర్ సర్కిల్ మీదుగా మళ్లీ కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి కలెక్టర్ ఏవీఓకు వినతిపత్రం అందజేశారు. ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా సెక్రెటరీ జనరల్ రాళ్లపల్లె అబ్దుల్లా, కో చైర్మెన్ వెంకటసుబ్బారెడ్డి, రామచంద్ర బాబు, మాదన విజయకుమార్, శ్యామలాదేవి, శ్రీనివాసులరెడ్డి, ఫ్యాప్టో రాష్ట్ర నాయకులు లక్ష్మి రాజా, శ్యాంసుందర్ రెడ్డి, ప్రవీణ్ కుమార్ రెడ్డి, కె.సురేష్ బాబు, కంభం బాల గంగిరెడ్డి, జిల్లా నాయకులు సంగమేశ్వర్ రెడ్డి, బి.రాజు, వీరాంజనేయరెడ్డి, ఖాదర్ బాషాతోపాటు పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.కలెక్టరేట్ ఎదుట కదం తొక్కిన ఫ్యాప్టో నాయకులు -
సీపీఎం నేతల చుట్టూ స్థల వివాదం
సాక్షి టాస్క్ఫోర్స్ : కడప భగత్సింగ్ నగర్లోని విలువైన ఓ ప్రభుత్వ స్థలం విషయంలో స్థానిక ప్రజలు, సీపీఎం నాయకుల మధ్య వివాదం మళ్లీ రాజుకుంది. ఆ స్థలం తమ పట్టా అంటూ సీపీఎం జిల్లా మాజీ కార్యదర్శి నారాయణరెడ్డి ఇటీవల చదును చేయడంతో, అది గుడి స్థలమంటూ స్థానికులు అడ్డుచెప్పడంతో పోలీసులు ఇరువర్గాలకు సర్దిచెప్పి పంపారు. గతంలో ఇదే స్థలాన్ని లైబ్రరీ నిర్మాణం కోసం మున్సిపల్ కార్పొరేషన్ జనరల్ బాడీ సమావేశంలో తీర్మానం చేయించిన సీపీఎం, నేడు ఆ పార్టీ మాజీ జిల్లా కార్యదర్శి ఆ స్థలం తమదేనంటుంటే మౌనముద్ర దాల్చడం చర్చనీయాంశంగా మారింది. చిలికి చిలికి ఈ అంశం ఆ పార్టీ రాష్ట్ర కమిటీ దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నేత ప్రభాకర్రెడ్డి ఇటీవల కడపలో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావించినట్లు సమాచారం. స్థల వివాదానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.... చెమ్ముమియాపేట గ్రామ సర్వే నెంబరు 344 లో మున్సిపల్ ప్రాథమిక పాఠశాల దక్షిణం వైపు మూడు సెంట్ల ప్రభుత్వ స్థలం ఖాళీగా ఉంది. సెంటు రూ. 20 లక్షలకు పైగా పలుకుతోంది. ఆ స్థలం విషయంలో చంద్రగిరి నారాయణ ఆధ్వర్యంలో స్థానిక ప్రజలు ఏర్పాటు చేసుకున్న గణేష్ ఉత్సవ కమిటీ, సీపీఎం నాయకుల మధ్య సుమారు పదేళ్లు గా వివాదం ఉంది. 1998 నుంచి ఆ స్థలంలో వినాయక చవితి సందర్భంగా విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు నిర్వహించేవారమని, అక్కడ సీతారామాంజనేయ ఆలయం నిర్మాణాన్ని చేపట్టేందుకు చందాలు పోగు చేసుకుని ఐరన్ ఫిల్లర్లు కూడా ఏర్పాటు చేసుకున్నారని స్థానికుల కథనం. అయితే సీపీఎం నాయకులు కొందరు ఆ స్థలాన్ని ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టేందుకు దౌర్జన్యానికి దిగుతున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలంటూ 2016 డిసెంబరు 20న కడప తాలూకా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే 2001–02లో అప్ప టి తహసీల్దార్ సత్యనారాయణరెడ్డి తమ పార్టీ నా యకుడు బి.నారాయణరెడ్డి సతీమణి పి.పద్మమ్మకు ఆ స్థలాన్ని డీకేటీ పట్టాగా ఇచ్చారని సీపీఎం నాయకుల వాదన. లైబ్రరీ ఏర్పాటు చేసేందుకు ఆమె తన స్థలాన్ని బహుమానంగా ఇచ్చారని వారు చెబుతూ దాన్ని ఆక్రమించేందుకు రాయలసీమ కమ్యూనిస్టు పార్టీకి చెందిన కొంతమంది అక్కడ సీతారాముల విగ్రహాలు ఏర్పాటు చేసి మతపరమైన హింసను ప్రేరేపించడం ద్వారా శాంతికి విఘాతం కల్పిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలంటూ సీపీఎం నాయకుడు 2016 డిసెంబరు 31న కడప తాలుకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసుల నివే దిక ఆధారంగా అప్పటి కడప తహసీల్దార్ ప్రేమంత్కుమార్ ఆ స్థలంలోకి ఎవరూ ప్రవేశించరాదంటూ సెక్షన్ 145 సీఆర్పీసీ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ స్థలం తమ పార్టీ నేత నారాయణరెడ్డి సతీమణిదంటూ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపిన సీపీఎం నాయకులు, చెమ్ముమియాపేట వీఆర్వోకు ఇచ్చిన స్టేట్మెంట్లో ఆ స్థలం బి.సరస్వతమ్మకు ప్రభుత్వం కేటాయించగా, ఆమె అనుమతితో తాము నిర్మాణాలు చేపట్టేందుకు ప్రయత్నించామని పరస్పర విరుద్ధంగా చెప్పడం గమనార్హం. అందుకు సంబంధించిన డాక్యుమెంట్లు చూపాలని వీఆర్వో కోరగా, కనిపించడం లేదని చెప్పారు. తహసీల్దార్ కార్యాలయంలో కూడా అందుకు సంబంఽధించిన రికార్డులు లేవని స్పష్టం చేస్తూ చెమ్ముమియాపేట వీఆర్వో నివేదిక ఇచ్చారు. దాన్ని అప్పటి తహసీల్దార్ 2017 మే 15వ తేదీ ఆర్డీఓకు పంపారు. ఆ స్థలంలో స్థానికుల కోరిక మేరకు గుడి నిర్మాణానికి అనుమతి ఇవ్వాలనే అర్థం స్ఫురించే విధంగా తహసీల్దార్ తన నివేదికలో రాశారు. ఈ క్రమంలో సీపీఎం జిల్లా నాయకత్వం మున్సిపల్ కార్పొరేషన్ జనరల్ బాడీలో తీర్మానం చేయించేందుకు ప్రయత్నించింది. లైబ్రరీ కమిటీ (సుందరయ్య స్మారక కేంద్రం ట్రస్టు)కి అనుమతి ఇస్తూ జనరల్ బాడీ సమావేశం 2017 ఏప్రిల్ 19వ తేది తీర్మానం నెంబరు 155 ఆమోదించింది. అయితే గతనెల 24వ తేది సీపీఎం నాయకుడు నారాయణరెడ్డి ఆ స్థలం తనదేనంటూ జేసీబీతో చదును చేయించగా, శ్రీ సీతారామాలయ కమిటీ చైర్మన్ సి.నారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ స్థలంపై నకిలీ పట్టా సృష్టించి హార్డ్వేర్ షాపు యజమాని సురేంద్రారెడ్డి అనే వ్యక్తికి సీపీఎం మాజీ జిల్లా కార్యదర్శి విక్రయించారని సి.నారాయణ అనే స్థానికుడి అభియోగం. ఈ వ్యవహారంపై విచారణ జరిపి ఆ స్థలాన్ని గుడి నిర్మాణానికి కేటాయించాలని ఆయన అధికారులను కోరారు. సీపీఎం నేతల మౌన ముద్ర భగత్సింగ్ నగర్లోని ప్రభుత్వ ఖాళీ స్థలం విషయంలో ఇంత జరుగుతున్నా సీపీఎం జిల్లా నాయకులు మౌనముద్ర వహించడం విమర్శలకు తావిస్తోంది. ఒకప్పుడు అదే స్థలాన్ని లైబ్రరీ కమిటీకి కేటాయించాలని మున్సిపల్ జనరల్ బాడీలో తీర్మానం చేయించిన ఆ పార్టీ నాయకులు, నేడు అదే పార్టీకి చెందిన మాజీ జిల్లా కార్యదర్శి నారాయణరెడ్డి ఆ స్థలం తన పట్టా అని మాట్లాడుతున్నా మౌనం వహించడం వెనుక ఆంతర్యం ఏమిటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ స్థలం లైబ్రరీకి కేటాయింపు కార్పొరేషన్లో తీర్మానం చేయించిన సీపీఎం నాయకులు నేడు తన పట్టా అంటున్న ఆ పార్టీ జిల్లా మాజీ కార్యదర్శి భగత్సింగ్ నగర్లో స్థానికులు, సీపీఎం నేతల మధ్య ముదిరిన వివాదం -
మహిళ మెడలో గొలుసు లాక్కెళ్లిన దుండగుడు
ఎర్రగుంట్ల : మండల పరిధిలోని మేకలబాలాయపల్లిలో గ్రామంలో వల్లెపు ఆశ అనే మహిళ మెడలో ఉన్న బంగారు గొలుసు లాక్కొని ఓ దండగుడు పరారైన సంఘటన బుధవారం జరిగింది. స్థానికులు, కలమల్ల పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉగాది పండుగ సందర్భంగా మేకలబాలాయపల్లె గ్రామంలోని బంధువుల ఇంటికి సింహాద్రిపురం మండల పరిధిలోని గురిజాల గ్రామానికి చెందిన వల్లెపు ఆశ అనే మహిళ వచ్చింది. ఈ గ్రామంలో ఉగాది పండుగ సందర్భంగా పెద్దమ్మతల్లి, దుర్గమ్మతల్లికి గ్రామ ప్రజలు బోనాలు మూడు రోజులు పాటు నిర్వహిస్తారు. బుధవారం వల్లెపు ఆశ పిల్లలకు ఐస్ కొనుక్కునేందుకు ఇంటి నుంచి బయటకు రోడ్డుపైకి వచ్చింది. ఈ సమయంలోనే ఓ గుర్తు తెలియని వ్యక్తి బైక్లో వచ్చి వల్లెపు ఆశ మెడలో ఉన్న సుమారు రెండు తులాల బంగారు గొలుసును లాక్కొని ప్రొద్దుటూరు వైపు పరారయ్యాడు. వెంటనే బాధితురాలు కలమల్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. వెంటనే పోలీసులు సమీపంలోని సీసీ ఫుటేజ్లు పరిశీలించారు. కొండాపురం సీఐ మహమ్మద్రఫీ మాట్లాడుతూ ఈ సంఘటనపై విచారణ జరుపుతున్నామన్నారు. విద్యార్థిని అదృశ్యం కడప అర్బన్ : కడప నగర శివార్లలోని సాంఘిక సంక్షేమ గిరిజన స్కూల్లో విద్యార్థిని అదృశ్యమైనట్లు పోలీసులు తెలిపారు. వారి వివరాల మేరకు స్కూల్లో ఏడవ తరగతి చదువుతున్న యశోద ఉదయం 7 గంటలకు హాస్టల్ నుంచి బయటకు వచ్చి అదృశ్యమైందన్నారు. విద్యార్థినికి మతిస్థిమితం సరిగా లేదని స్కూల్ ప్రిన్సిపాల్ విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశమన్నారు. -
కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయాలి
కడప సెవెన్రోడ్స్ : రాష్ట్ర ప్రభుత్వం కానిస్టేబుల్ అభ్యర్థులకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించకుండా నిర్లక్ష్యం వహిస్తోందని, సత్వరమే పరీక్షల తేదీ ప్రకటించకుంటే నిరుద్యోగుల పక్షాన చలో విజయవాడ పిలుపునిస్తామని డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ముడియం చిన్ని, వీరనాల శివకుమార్ హెచ్చరించారు. కానిస్టేబుల్ అభ్యర్థులకు మెయిన్స్ పరీక్షల తేదీ ప్రకటించాలని కోరుతూ బుధవారం కడపలోని మహావీర్ సర్కిల్ నుంచి ర్యాలీగా వెళ్లి కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం చేపపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం హయాంలో 2022లో నోటిఫికేషన్ ఇచ్చి మూడు సంవత్సరాలు అవుతున్నా ఇంతవరకు కానిస్టేబుల్ పరీక్షలు నిర్వహించి పోస్టులు భర్తీ చేయలేదన్నారు. ప్రతిపక్షంలో ఉండగా యువగళం పాదయాత్రలో ప్రస్తుత మంత్రి నారా లోకేష్ అధికారంలోకి వచ్చాక ఆరు నెలల్లో కోర్టు కేసులు క్లియర్ చేసి పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారన్నారు. అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అవుతున్నా ఇంతవరకు అతీగతీ లేదన్నారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు రెబ్బ నరసింహులు, నగర కార్యదర్శి విజయ్, నగర సహాయ కార్యదర్శి శ్రీకాంత్, ఉపాధ్యక్షులు వంశీ, విద్యుత్ రామకృష్ణ, నిరుద్యోగ అభ్యర్థులు పాల్గొన్నారు. -
ఎవరిదీ ‘చెత్త’పని?
కడప కార్పొరేషన్ : కడపలో మాజీ ప్రధాన మంత్రి రాజీవ్గాంధీకి అవమానం జరిగింది. నగరంలోని రాజీవ్ పార్కు ఎదురుగా ఉన్న ఆయన విగ్రహం వద్ద స్థానిక వ్యాపారులు చెత్త వేస్తున్నారు. ఎవరి వద్ద ఏర్పడిన చెత్తను వారే ఎత్తాలని నిబంధన ఉన్నా ఎవరికి వారు చెత్త ఎత్తకుండా ఇదిగో ఇక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం ఎదుట వేస్తున్నారు. దీన్ని నగరపాలక సిబ్బంది కొన్ని సార్లు ఎత్తేస్తున్నా వ్యాపారుల్లో మాత్రం మార్పు రావడం లేదు. పదే పదే వారు ఇలాగే వేయడం వల్ల నగరపాలక సిబ్బంది ఎత్తడం మానేసినట్లు తెలుస్తోంది. దీంతో ఇలా విగ్రహం ముందు భాగమంతా చెత్తమయంగా మారింది. -
కత్తితో దాడి చేసిన నిందితులు అరెస్టు
కమలాపురం : కత్తితో పొడిచి ముగ్గురు యువకులను గాయపరిచిన కేసులో నిందితులను అరెస్ట్ చేసినట్లు కమలాపురం సీఐ ఎస్కే రోషన్, ఎస్ఐ ప్రతాప్ రెడ్డి తెలిపారు. బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. గతంలో ఇందిరమ్మ కాలనీకి చెందిన షేక్ సల్మాన్ అనే యువకుడు అక్సా నగర్కు వచ్చి వేగంగా బైక్ నడుపుతుండగా అదే కాలనీకి చెందిన సోహైల్ యాక్సిడెంట్లు జరిగే అవకాశం ఉందని మందలించాడు. దీంతో సల్మాన్ అతనిపై కక్ష పెంచుకుని తండ్రి మహబూబ్ షరీఫ్తో కలసి గత నెల 31వ తేదీన సోహైల్ తన ఇంటి ముందు నిలబడి ఉండగా కావాలనే బైక్ తగిలించాడు. అతడు కిందపడిన తర్వాత కత్తితో పొడిచి బలమైన రక్తగాయం చేశాడు. అదే సమయంలో అతడిని వారించడానికి వచ్చిన షాబాజ్, రియాజ్లను సైతం సల్మాన్ తన తండ్రి సహకారంతో పొడిచి గాయపరిచాడు. ఈ కేసులో నిందితులను బుధవారం పట్టణ పరిధిలోని కంచి వరదరాజ స్వామి ఆలయం వద్ద అరెస్టు చేసి వారి వద్ద నుంచి కత్తితో పాటు బైక్ స్వాధీనం చేసుకున్నామని వివరించారు. కాగా తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అర్ధరాత్రి వరకు పిల్లలు బయట తిరుగుతుంటే తల్లిదండ్రులు మందలించాలన్నారు. ఈ సమావేశంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
లెదర్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటుకు కృషి
బద్వేలు అర్బన్ : మున్సిపాలిటీ పరిధిలోని చెన్నంపల్లె రెవెన్యూ పొలం సర్వే నెంబర్ 1580/బిలో చర్మకారుల సొసైటీకి కేటాయించిన 3.64 ఎకరాల స్థలంలో లెదర్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటుకు కృషి చేస్తానని లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రసన్న వెంకటేష్ పేర్కొన్నారు. బుధవారం బద్వేలు పర్యటనకు వచ్చిన ఆయన ఆర్డీఓ చంద్రమోహన్, తహసీల్దారు ఉదయభాస్కర్రాజుతో కలిసి సొసైటీకి కేటాయించిన స్థలాన్ని పరిశీలించి సొసైటీ సభ్యులతో మాట్లాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ యువత కోసం లెదర్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేసి చర్మకారులకు, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో మాజీ లిడ్క్యాప్ డైరెక్టర్ రాజశేఖర్, చర్మకారుల సొసైటీ సభ్యులు, దళిత ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు. -
ఆలయంలో చోరీకి యత్నం.. పట్టుకున్న గ్రామస్తులు
ముద్దనూరు : మండలంలోని కొర్రపాడు గ్రామంలోని ప్రముఖ శ్రీ లక్ష్మీ చెన్నకేశవ ఆలయ సముదాయంలో బుధవారం పట్టపగలే చోరీకి పాల్పడ్డారు. అయితే గ్రామస్తులు అప్రమత్తంగా ఉండడంతో నిందితుల్లో ఒకరని పట్టుకుని బంధించారు. మరొకరు పారిపోయినట్లు సమాచారం. గ్రామస్తుల కథనం మేరకు గ్రామంలో చెన్నకేశవ ఆలయంతో పాటు శివాలయం, రామాలయం, ఆంజనేయస్వామి ఆలయాలు ఒకే ప్రాంగణంలో ఉన్నాయి. ఉగాది పర్వదినం సందర్భంగా చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. ఈ ఉత్సవాలకు భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారి కల్యాణం చదివింపులు, ఇతర ముడుపులు, కానుకలు రూపంలో భారీగా సొమ్ము హుండీలో చేరింది. బుధవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఇరువురు యువకులు మూడు ఆలయాల్లోకి ప్రవేశించి చోరీకి పాల్పడ్డారు. చెన్నకేశవస్వామి ఆలయంలో నగదు, ఇతర ఆభరణాలను దొంగిలించే యత్నం చేశారు. ఆలయంలోని సుమారు రూ. 50 వేల నగదును ఒక వస్త్రంలో పడేసి మూట కట్టారు. ఇంతలోనే గ్రామస్తులు గుర్తించి దొంగలలో ఒకరిని పట్టుకున్నారు. మరొకరు అప్పటికే పారిపోయాడు. పట్టుబడిన నిందితుడు మైనర్గా గుర్తించి బంధించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. పట్టుబడిన నిందితునిది ప్రొద్దుటూరుగా గుర్తించారు. పోలీసు అధికారులు, ఆలయ ఈఓ దేవాలయాన్ని సందర్శించి చోరీ వివరాలను సేకరించారు. ఆలయంలో జరిగిన ఉత్సవాల సందర్భంగా భారీ సొమ్ము ఉంటుందనే నిందితులు ఈ చోరీకి పాల్పడి ఉంటారని గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు. -
ప్రమాదవశాత్తు బావిలో పడి యువకుడి మృతి
బద్వేలు అర్బన్ : నీరు తాగేందుకు బావిలోకి దిగి ప్రమాదవశాత్తు బావిలో పడి యువకుడు మృతి చెందిన ఘటన బుధవారం మండల పరిధిలోని కోనసముద్రం గ్రామంలో జరిగింది. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. బి.మఠం మండలం టి.రామా పురం గ్రామానికి చెందిన నాగిపోగు హృదయరాజు (32) గొర్రెలు మేపుకుంటూ జీవనం సాగిస్తుండేవాడు. ఈయనకు భార్య దివ్యశ్రీతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. గొర్రెల మేత కోసం పచ్చని గ్రాసం ఉన్న గ్రామాలకు బృందాలుగా వెళుతుంటారు. ఈ క్రమంలో కోనసముద్రం సమీపంలోకి కొందరు గొర్రెల పెంపకందారులు గొర్రెలను మేత కోసం తీసుకువచ్చారు. మధ్యాహ్నం సమయంలో దాహం వేస్తుండటంతో నీరు తాగి వస్తానని చెప్పి బావి వద్దకు వెళ్లాడు. అయితే ఎంత సేపటికి తిరిగి రాకపోవడంతో తోటి కాపరులు బావిలోకి వెళ్లి చూడగా బావిలో నీటిపై తేలియాడుతూ కనిపించాడు. వెంటనే వారు బావిలోకి దిగి హృదయరాజును బయటికి తీసుకురాగా అప్పటికే మృతి చెంది ఉన్నాడు. అయితే హృదయరాజుకు ఈత రాదని తెలిసింది. నీరు తాగే సమయంలో ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెంది ఉండవచ్చని కుటుంబ సభ్యులు, పోలీసులు భావిస్తున్నారు. మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ ఏఎస్ఐ చంద్రమౌళి కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు
బద్వేలు అర్బన్ : బద్వేలు – మైదుకూరు రహదారిలోని తొట్టిగారిపల్లె సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. మండల పరిధిలోని కొత్తచెరువు గ్రామానికి చెందిన చరణ్, చిన్న, రాజేశ్వర్రావులు హైవే రోడ్డు పనులకు కూలీలుగా వెళుతుండేవారు. రోజూ మాదిరే పనులు ముగించుకుని స్వగ్రామానికి వెళుతున్న సమయంలో వేగంగా వచ్చి ఓ ద్విచక్ర వాహనదారుడు ఢీకొట్టి వెళ్లిపోయాడు. ఈ ఘటనలో ముగ్గురూ కిందపడి గాయాలు కావడంతో స్థానికులు 108కు సమాచారమిచ్చారు. అక్కడి నుంచి క్షతగాత్రులను ప్రభుత్వాసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్కు తరలించారు. పలుచోట్ల దొంగతనాలు వేంపల్లె : వేంపల్లెలో గుర్తు తెలియని వ్యక్తులు చిల్లర దొంగతనాలకు పాల్పడుతున్నారు. మంగళవారం రాత్రి వేంపల్లెలోని మెయిన్ బజార్లో ఉన్న అమ్మవారిశాల అంగన్వాడీ కేంద్రానికి ఉన్న తాళాలు తీసి అంగన్వాడీ కేంద్రంలో ఉన్న 35 ప్యాకెట్ల కంది పప్పు, నాలుగు బాక్సులు (40 లీటర్ల) పాల ప్యాకెట్లను దొంగిలించినట్లు అంగన్వాడీ కార్యకర్త తెలిపారు. అలాగే జిల్లా పరిషత్ బాలుర పాఠశాల సమీపంలో ఉన్న ఇందు ట్రావెల్స్ కార్యాలయానికి ఉన్న బీగాలు పగులగొట్టి రూ.45వేల నగదుతోపాటు మూడు పాత సెల్ ఫోన్లు చోరికి గురైనట్లు బాధితుడు సురేష్ తెలిపారు. అంగన్వాడీ కేంద్రం ఉన్న ప్రాంతంలో సాయంత్రం పూట ఎక్కువ మంది ఆకతాయిలు ఉంటారని, వారి పనై ఉంటుందని అంగన్వాడీ కార్యకర్త అనుమానం వ్యక్తం చేశారు. గత రెండు రోజుల క్రితం పులివెందుల బైపాస్ రోడ్డులో కూడా చిన్న, చిన్న దుకాణాల్లో చోరీలు జరిగినట్లు సమాచారం. అలాగే బృందావన కాలనీలో 10 బైకులలో ఉన్న పెట్రోలును దుండగులు దొంగిలించారు. ఈ మేరకు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆటో బోల్తా కొండాపురం : మండల పరిధిలోని కె.సుగుమంచిపల్లె గ్రామ సమీపంలోని నాలుగు వరుసల జాతీయ రహదారిపై ఆటో టైరు పగలడంతో అదుపు తప్పి ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. వివరాలిలా.. మండలంలోని తిమ్మాపురం నుంచి తాడిపత్రి వైపు ప్రయాణిస్తున్న ఆటో దారి మధ్యలో కె.సుగుమంచిపల్లె గ్రామ సమీపం వద్ద జాతీయ రహదారిపై టైర్ పగలడంతో అదుపు తప్పి బోల్తా పడింది. ముగ్గురు గాయపడటంతో 108 వాహనంలో తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో ధర్మవరానికి చెందిన పుల్లయ్యకు తలకు తీవ్ర గాయంతో పాటు కాలు విరిగినట్లు స్థానికులు తెలిపారు. మిగిలిన ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. -
వామ్మో.. ఎలుగుబంటి
అట్లూరు : అట్లూరు మండల పరిధిలోని కొండూరు గ్రామంలో ఎలుగుబంటి సంచారం గ్రామస్తులను హడలెత్తిస్తోంది. అసలే ఎండలు ఆపై ఉక్కపోత తట్టుకోలేక రాత్రివేళల్లో గ్రామస్తులు ఆరుబయట నిద్ర పోతున్నారు. ఈ నేపథ్యంలో గత నాలుగు రోజులుగా నల్లకుంట చెరువు లోని కంపచెట్ల నుంచి రాత్రి వేళల్లో ఎలుగుబంటి వీధుల్లోకి వస్తోంది. దీంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. అయితే కుక్కలు వెంటబడడంతో ఎలుగుబంటి కంపచెట్లలోకి వెళుతోందని, ఎప్పుడు ఎవరిమీద పడి దాడి చేస్తుందో అని గ్రామస్తులు బిక్కుబిక్కుమంటున్నారు.కడప ఉక్కు పరిశ్రమపై స్పందించాలిప్రొద్దుటూరు : కడప ఉక్కు పరిశ్రమపై రాయలసీమ మంత్రులు, ఎమ్మెల్యేలు స్పందించాలని రాయలసీమ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు జగన్ తెలిపారు. స్థానిక పాలిటెక్నిక్ కళాశాలలో మంగళవారం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన చట్టంలో కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారన్నారు. 11 ఏళ్లు అయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కడప ఉక్కు పరిశ్రమ గురించి పట్టించుకోవడం లేదన్నారు. కేవలం ఉక్కు పరిశ్రమను శంకుస్థాపనలకే పరిమితం చేశారన్నారు. రాయలసీమ ప్రజలను ఓట్లు, సీట్ల కోసం వాడుకుంటున్నారే తప్ప అభివృద్ధి చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు.ఉరి వేసుకుని యువతి ఆత్యహత్యపోరుమామిళ్ల : మండలంలోని రాజాసాహేబ్పేట పంచాయతీ తిరువెంగళాపురానికి చెందిన కల్లూరి రామతులసి(25) మంగళవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్యహత్య చేసుకున్నట్లు ఎస్ఐ కొండారెడ్డి తెలిపారు. వివాహ సంబంధాల విషయంలో ఆమె తీవ్ర అసంతృప్తితో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు తండ్రి జయరామిరెడ్డి పోలీసులకు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చెప్పారు.పదో తరగతి విద్యార్థిని అదృశ్యంలక్కిరెడ్డిపల్లి : మండలంలోని కాకులవరం గ్రామానికి చెందిన పదోతరగతి విద్యార్థిని చివరిరోజు పదో తరగతి పబ్లిక్ పరీక్ష రాసి కనిపించలేదని బాలిక తల్లిదండ్రులు లక్కిరెడ్డిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి బాలిక కోసం గాలిస్తున్నట్లు ఎస్ఐ రవీంద్ర బాబు తెలిపారు. -
విద్యార్థిని పట్ల అసభ్య ప్రవర్తనపై విచారణ
బద్వేలు అర్బన్ : పట్టణంలోని శివానగర్లో గల లిటిల్ ఫ్లవర్ స్కూల్లో గత నెల 29న 4వ తరగతి విద్యార్థిని పట్ల అన్వర్బాషా అనే ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించిన ఘటనపై మంగళవారం ఉప విద్యాశాఖాధికారి రాజగోపాల్రెడ్డి విచారణ చేపట్టారు. జిల్లా విద్యాశాఖాధికారి షంషుద్దీన్ ఆదేశాల మేరకు చేపట్టిన ఈ విచారణలో భాగంగా తొలుత పాఠశాలకు వెళ్లి పాఠశాల కరస్పాండెంట్ను, తోటి ఉపాధ్యాయులను విచారించారు. అలాగే అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు ఎన్ని నెలలుగా పాఠశాలలో పనిచేస్తున్నాడనే విషయంపై ఆరాతీశారు. అనంతరం విద్యార్థిని తల్లిదండ్రులను విచారించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విచారణ చేపట్టామని, విచారణలో సేకరించిన వివరాలను నివేదిక రూపంలో జిల్లా విద్యాశాఖాధికారికి అందజేస్తామని తెలిపారు. ఆయన వెంట ఎంఈఓలు చెన్నయ్య, రఘురాములు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఎండీయూ ఆపరేటర్లకు చెక్
ప్రొద్దుటూరు : రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ప్రొద్దుటూరు మండలంలో మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ (ఎండీయూ) ఆపరేటర్లను కాదని చౌకదుకాణాల డీలర్ల ద్వారానే రేషన్ పంపిణీ చేసే విధంగా అధికార పార్టీ నేతలు హుకూం జారీ చేశారు. నేతల ఆదేశాలకు అధికారులు తలూపడంతో అటు కార్డుదారులతోపాటు ఇటు ఆపరేటర్లు నష్టపోతున్నారు. ప్రొద్దుటూరు మండలంలో 144 చౌకదుకాణాలు ఉన్నాయి. ఈ చౌకదుకాణాల పరిధిలో 70వేల రేషన్ కార్డుదారులు ఉన్నారు. రేషన్ తీసుకునేందుకు కార్డుదారులు ఇబ్బందులు పడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎండీయూ ఆపరేటర్ల వ్యవస్థను ఏర్పాటు చేసింది. కొన్ని ప్రాంతాలతోపాటు అసలు రేషన్ షాపులు లేని గ్రామాలు కూడా ఉన్నాయి. ఆపరేటర్ల వ్యవస్థ ద్వారా ఇంటింటికి రేషన్ అందిస్తున్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాదాపుగా రేషన్ షాపులన్నీ టీడీపీ నేతలు దక్కించుకున్నారు. ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి తమ వర్గీయులకు రేషన్షాపులను ఇవ్వాలని అధికారులకు సిఫారసు లేఖలు పంపించారు. ఈ కారణంగా ప్రస్తుతం చౌకదుకాణాలన్నీ టీడీపీ వర్గీయుల చేతిలో ఉండగా ఎండీయూ ఆపరేటర్లు మాత్రం గత ప్రభుత్వంలో నియమించిన వారే ఉన్నారు. సాంకేతిక సమస్యలతోపాటు బ్యాంక్ లోన్ కారణంగా ఆపరేటర్లను తొలగించలేని పరిస్థితి ఏర్పడింది. ఆపరేటర్ల వ్యవస్థ ద్వారా తాము ఆదాయం కోల్పోతున్నామని భావించిన డీలర్లు అధికార పార్టీ నేతలను ఆశ్రయించి ఆపరేటర్లను నిలుపుదల చేస్తూ నేతల ద్వారా మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి స్వయంగా ఈ విషయాన్ని రెవెన్యూ అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది. వాస్తవానికి రాష్ట్ర వ్యాప్తంగా ఎండీయూ ఆపరేటర్ల వ్యవస్థ కొనసాగుతుండగా ప్రొద్దుటూరులో మాత్రమే బ్రేక్ పడింది. మా పొట్ట కొట్టకండి తమను తొలగించి తమ పొట్ట కొట్టొద్దని ఎండీయూ ఆపరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిరుద్యోగులమైన తాము ప్రతి నెల ప్రభుత్వం ఇచ్చే వేతనంతో జీవనం సాగిస్తున్నామన్నారు. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవచ్చని, అందరి పొట్టకొట్టడం సరైన విధానం కాదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆథరైజేషన్ వేస్తేనే పంపిణీ గత ప్రభుత్వంలో అమలు చేసిన నిబంధనల ప్రకారం గోడౌన్ నుంచి డీలర్లు సరుకును ప్రతి నెల తీసుకోవాల్సి ఉంటుంది. డీలర్ తీసుకున్న సరుకును ఎండీయూ ఆపరేటర్కు ఇవ్వడం, ఈ పాస్ మిషన్లో ఆథరైజేషన్ వేసి వారు కార్డుదారులకు పంపిణీ చేయడం జరుగుతోంది. ప్రతి ఎండీయూ ఆపరేటర్కు ప్రతినెల రూ.21వేలు వేతనం ప్రభుత్వం చెల్లిస్తోంది. డీలర్లకు చౌకదుకాణాలను అప్పగిస్తే ఎండీయూల పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది. వ్యాన్లన్నీ ఆపరేటర్ల పేరుతోనే ఉన్నాయి. అన్ని చోట్ల డీలర్లే పంపిణీ చేస్తున్నారు ప్రొద్దుటూరు మండలానికి సంబంధించి 43 మంది ఎండీయూ ఆపరేటర్లు ఉన్నారు. వీరిలో 26 మంది మున్సిపాలిటీ పరిధిలో ఉండగా 17 మంది మండల పరిధిలో ఉన్నారు. తొలి రోజు అన్ని చోట్ల డీలర్లే బియ్యం పంపిణీ చేశారు. ఈ విషయంపై సంబంధిత అధికారి మాట్లాడుతూ ఎండీయూ ఆపరేటర్లకు సంబంధించిన ఈ పాస్ మిషన్ ఆథరైజేషన్ ఫింగర్ వేసి డీలర్లకు అప్పగించాలని చెప్పినట్లు తెలిపారు. రేషన్ షాపుల్లో సరుకులు పంపిణీ చేయడం వల్ల కార్డుదారులు ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. క్యూ లైన్లు ఏర్పాటు చేయడం, గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇంటింటికి రేషన్ పంపిణీ చేయాలి ఎండీయూ ఆపరేటర్ల ద్వారా ఇంటింటికి రేషన్ పంపిణీ చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ దళిత సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు యల్లయ్య, ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా ఇన్చార్జి గడ్డం నరసింహా తదితరులు మంగళవారం మండల రెవెన్యూ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ సాయినాథ్రెడ్డికి వినతి పత్రం అందించారు. బడుగు బలహీన వర్గాల వారు రేషన్ షాపులకు వెళ్లి సరుకులు తీసుకోవడం కష్టంగా ఉంటుందన్నారు. వ్యవస్థను పటిష్టం చేసి సక్రమంగా ఇంటింటికి రేషన్ పంపిణీ చేయాలని కోరారు. రేషన్ షాపుల్లోనే బియ్యం పంపిణీ చేయాలని ఆదేశాలు పొట్టకొట్టొద్దంటున్న ఎండీయూ ఆపరేటర్లు ప్రొద్దుటూరులోనే అమలు కార్డుదారులకు తప్పని ఇబ్బందులు -
గతి తప్పిన రిమ్స్
కడప టాస్క్ఫోర్స్ : కడప నగర శివార్లలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్, రిమ్స్)లో వైద్యులు, ఇతర సిబ్బంది విధి నిర్వహణ గతి తప్పుతోంది. ఇక్కడ పనిచేస్తున్న వైద్యుల్లో చాలామంది తమ విధులను చిత్తశుద్ధితో నిర్వహిస్తుంటారు. వీరుగాక కొందరు వైద్యులు మాత్రం తమకు నచ్చిన, తమను మెచ్చిన వైద్యులతో కలిసి చెట్టాపట్టాలేసుకుని ‘రిమ్స్’ ప్రాంగణంలోనే తిరుగుతూ అందరినీ విస్మయానికి గురిచేస్తున్నారు. కొందరు డాక్టర్లు తమకేమీ పట్టనట్లు బయోమెట్రిక్, ఎఫ్ఆర్ఎస్ వేసిన తరువాత అలా బయటకు వెళ్లి టిఫిన్లు, కాఫీలను ముగించుకుని ఎంచక్కా 9 గంటలకు పైగా తమకు నచ్చిన సమయంలో వచ్చి విధులను నిర్వహిస్తుంటారు. మరికొందరు ఇంటి నుంచి తమ, తమ సొంతకారులో ఐపీ విభాగానికి వారి వార్డులకు వెళ్లి అక్కడ విధులను నిర్వహిస్తున్న హౌస్సర్జన్లు, పీజీలకు విధులను అప్పజెప్పి ‘హాయ్, బాయ్’ అని చెపుతూ తమదారిన తాము కారు పార్కింగ్ దగ్గరకు వచ్చేస్తారు. తరువాత రిమ్స్ ఆవరణంలోనూ, రిమ్స్ ఆవరణం చుట్టూ బైపాస్ రోడ్లలోకి వెళ్లి తమ ‘ఇష్టాలు, కష్టాలు’ పంచుకుని మరలా వైద్యాఽధికారులు రౌండ్స్కు వచ్చే సమయానికి ఎంచక్కా విధులకు హాజరై కాలక్షేపం చేసి సమయం పూర్తికాగానే ఎవరిదారిన వారు వెళ్లిపోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ● మంగళవారం ఓపీ విభాగంలో కొన్ని విభాగాలలో హెచ్ఓడీలు, వైద్యులు ఎంచక్కా విధులకు వస్తే కొన్ని విభాగాలలో మాత్రం హౌస్సర్జన్లు, పీజీ వైద్యులు మాత్రమే వైద్యపరీక్షలను నిర్వహిస్తున్నారు. మహిళా ఆర్థోపెడిక్ విభాగానికి వైద్యులు అస్సలు అరగంటపైగా దాటినా రాకపోవడం గమనార్హం. ఈ విధులకు హాజరుకాని వైద్యులలో ఇద్దరు గతంలో బయోమెట్రిక్కు వేలిముద్రలు మాయం చేసి, అవి అధికారుల దృష్టికి వెళ్లడం, ప్రతి చర్యగా సదరు వైద్యులను కొన్ని నెలలపాటు కలెక్టరేట్లో విధులు నిర్వహించేలా చేసినా వారి పద్ధతిని మార్చుకోలేదనే ప్రజలు అనుకుంటున్నారు. ● పరిపాలనా విభాగంలో ఉద్యోగులకు, పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన మెడికల్ రీ ఎంబర్స్మెంట్ ‘బిల్లులు’ మంజూరు కావాలంటే తప్పనిసరిగా ‘చేయి తడపాల్సిందే’. తమకు అనూకూలంగా పర్సెంటేజీల వంతుగా చేతులు తడిపితే కానీ ఫైళ్లు ముందుకు కదలవనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులైనా, పదవీ విరమణ పొందిన ఉద్యోగులు, వైద్యులకై నా ఈ తిప్పలు తప్పడం లేదంటున్నారు. ● ఇక్కడ పనిచేస్తున్న కొన్ని విభాగాల వైద్య సిబ్బంది విధులకు సంబంధించిన డ్యూటీ చార్ట్లను వేయడంలో కొందరు నకిలీ విలేకరుల ప్రమేయం ఉందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. కొందరు మహిళా అధికారులను ఏకంగా సదరు నకిలీ విలేకరులు, ఫోన్లలో బెదిరించడం సదరు అధికారులు, మహిళా సిబ్బంది తమకు ఏమీ పట్టనట్లుగా, తాము ఎవరికై నా చెప్పుకుంటే తమ పరువు, ప్రతిష్టలకు భంగం కలిగినట్లుగా భావిస్తూ ‘పంటి బిగువు’న ఆ వేధింపులను, వెకిలి చేష్టలను సైతం భరిస్తున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే మనిషినంటూ ఓపీ క్యాంటీన్కు తాళం.. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఓపీలో క్యాంటీన్ సేవలు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉండేవి. ఈ క్యాంటీన్కు వచ్చే రోగులు, వారి సహాయకులు బయటకు వెళ్లకుండానే తక్కువ ధరలకే టీ, కాఫీ, వాటర్ బాటిళ్లు, ఇతర అల్పాహార సేవలను పొందేవారు. ఇక్కడ పనిచేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది కూడా సేవలను అందుకునేవారు. కాస్త ఉపశమనం పొందేవారు. గడువు ముగిసిన తరువాత అధికారులు నిబంధనల మేరకు టెండర్లను పిలవకుండానే.. మంగళవారం ఉదయం ఎమ్మెల్యే మనిషినంటూ ఓ వ్యక్తి వచ్చి క్యాంటీన్కు తాళం వేసి ఎంచక్కా వెళ్లాడు. ఓ ప్రైవేట్ వ్యక్తి వచ్చి తాను ఎమ్మెల్యే మనిషినంటూ క్యాంటీన్కున్న రెండు వాకిళ్లకు తాళాలు వేసుకుని వెళ్లడం ఎంతవరకు సమంజసమని సామాన్య ప్రజలు సైతం తప్పుపడుతున్నారు. ఈ వ్యవహారం తెలిసినా తమకేమీ పట్టనట్లు, తెలియనట్లు అధికారులు సైతం వ్యవహరించడం కొసమెరుపు. ఉదయం 9:20 అవుతున్నా విధులకు రాని ఆర్థోపెడిక్ వైద్యులు వైద్య సిబ్బంది డ్యూటీ చార్ట్లలో నకిలీ విలేకరుల ప్రమేయం మెడికల్ రీ ఎంబర్స్మెంట్ బిల్లుల మంజూరులో ‘చేతులు తడపాల్సిందే’ ఎమ్మెల్యే మనిషినంటూ ఓపీ క్యాంటీన్కు తాళాలు వేసినా పట్టించుకోని అధికారులు -
ఈత కొమ్మలకు భలే గిరాకీ
పులివెందుల రూరల్ : వేసవి కాలంలో ఈత కొమ్మలకు భలే గిరాకీ ఏర్పడింది. రైతులు తమ పంటలను కాపాడుకునేందుకు ఈత కొమ్మలను కొనుగోలు చేసి వాటిని అరటి మొక్కలకు అండగా ఈత కొమ్మలను నాటుతారు. పులివెందుల ప్రాంతంలో అరటిని ఎక్కువ సాగు చేయడంవల్ల అరటి పిలకలు నాటినప్పుడు ఆ పిలకలు ఎండ వేడిమి నుంచి, వివిధ రకాల అడవి జంతువుల బారి నుంచి కాపాడుకునేందుకు ఈత కొమ్మలను రైతులు అరటి పిలకల పక్కనే నాటుతారు. హిందూపురం, పెనుగొండ, సత్యసాయి, అనంతపురం ప్రాంతాల నుంచి ఈత కొమ్మలను చెట్ల నుంచి కోసుకొని వచ్చి పులివెందుల ప్రాంతంలో ఒక్కో ఈత కొమ్మను రూ.5ల చొప్పున విక్రయిస్తున్నట్లు వ్యాపారులు తెలిపారు. గ్యాస్ సిలిండర్ లారీ బోల్తా సంబేపల్లె : చిత్తూరు – కర్నూలు జాతీయ రహదారిపై సంబేపల్లె వద్ద మంగళవారం తెల్లవారుజామున గ్యాస్ సిలిండర్ లారీ బోల్తా పడింది. కడప నుంచి సిలిండర్ ఫుల్ లోడుతో నిమ్మనపల్లెకు వెళుతున్న లారీ మండల కేంద్రంలోని వడ్డపల్లె క్రాస్ రోడ్డు సమీపంలోకి రాగానే అదుపు తప్పి డివైడర్ ఎక్కడంతో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ శివకు గాయాలయ్యాయి. -
కరువు మండలాల ప్రకటనలో అన్యాయం
కడప వైఎస్ఆర్ సర్కిల్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కరువు మండలాల జాబితాలో కడప జిల్లాలోని పడమటి ప్రాంతాలను ప్రధానంగా మెట్ట ప్రాంత మండలాలను విస్మరించిందని సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర అన్నారు. మంగళవారం నగరంలోని సీపీఐ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని 9 మండలాల్లో తీవ్ర కరువు, 1 మండలంలో సాధారణ కరువు ఉన్నట్లు మొత్తం పది మండలాలను కరువు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించిందన్నారు. అయితే ఎలాంటి నీటి పారుదల సౌకర్యం లేని కమలాపురం, పులివెందుల, జమ్మలమడుగు, బద్వేలు నియోజకవర్గాల్లోని మెట్ట (వర్షాధారం) మండలాలను ప్రకటించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. కరువు మండలాల సంఖ్య పెరిగే కొద్దీ పంటల బీమా పెట్టుబడి రాయితీ పరిహారం చెల్లించాల్సి వస్తుందని ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగానే కరువు మండలాలను తగ్గిస్తూ వస్తున్నాయని ఆరోపించారు. ఉచితంగా పశుగ్రాస విత్తనాలు, పశువుల దాణా మంజూరు చేయాలన్నారు. వలసలను నివారించేందుకు ఉపాధి హామీ దినాలను పెంచాలన్నారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కేసీ బాదుల్లా పాల్గొన్నారు. పశ్చిమ మండలాలను విస్మరించారు.. కడప జిల్లా పశ్చిమ ప్రాంతంలోని మండలాల్లో గత ఖరీఫ్, రబీ సీజన్లో అతివృష్టి, అనావృష్టితో రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని ఆ మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్, ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దస్తగిరిరెడ్డి కోరారు. మంగళవారం నగరంలోని సీపీఎం కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. జిల్లాలోని రైతు సంఘాలతో గాని, వివిధ పార్టీల ప్రతినిధులతో గాని మాట్లాడకుండా, జిల్లాలోని అన్ని మండలాలు పర్యటించకుండా, రైతాంగంతో మాట్లాడకుండా, జిల్లా ఉన్నతాధికారులు ఇచ్చిన అరకొర సమాచారంతో కేంద్ర ప్రభుత్వ కరువు బృందం జిల్లాలోని 10 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించిందన్నారు. ఆ మండలాల్లో కడప జిల్లా పశ్చిమ మండలాలు ఏ ఒక్కటీ లేకపోవడం దారుణమన్నారు. జిల్లా వ్యాప్తంగా 36 మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల కరువు విలయతాండవం చేస్తున్నప్పటికీ, కేవలం పది మండలాలనే కరువు ప్రాంతాలుగా గుర్తించడం అన్యాయమన్నారు. -
చిన్నపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడితే చర్యలు
పులివెందుల రూరల్ : చిన్నపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడితే పోక్సో చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటామని జూనియర్ సివిల్ జడ్జి ఎం.చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని పులివెందుల ప్రభుత్వ గిరిజన సమీకృత బాలికల వసతి గృహంలో మండల లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు పోక్సో చట్టంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ చిన్నపిల్లలపై రోజు రోజుకు పెరుగుతున్న అత్యాచారాలు, అఘాయిత్యాలను నిరోధించేందుకు సుప్రీంకోర్టు 2012 నవంబర్ 12వ తేదీన పోక్సో చట్టం ప్రవేశపెట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ కిశోర్ కుమార్ రెడ్డి. పాలగిరి ప్రకాష్, వార్డెన్ కళావతి, పోలీసు సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు. -
నేడు కలెక్టరేట్ ఎదుట నిరసన
కడప ఎడ్యుకేషన్ : ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావాల్సిన పీఆర్సీ, ఐఆర్, డీఏ బకాయిల విడుదల, సరెండర్ లీవ్ ఎన్క్యాష్మెంట్, మెడికల్ బిల్లుల రీఎంబర్స్మెంట్, కారుణ్య నియామకాలు తదితర సమస్యల సాధన కోసం ఫ్యాప్టో రాష్ట్ర సంఘం పిలుపు మేరకు 2వ తేదీ బుధవారం కడప కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు మంగళవారం కడపలోని ఎస్టీయూ కార్యాలయంలో నిరసన కార్యక్రమానికి సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఫ్యాప్టో కార్యవర్గ సభ్యుడు సయ్యద్ ఇక్బాల్ మాట్లాడుతూ 2వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు జిల్లా ఫ్యాప్టో చైర్మన్ ఇలియాస్ బాషా ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద జరిగే నిరసన కార్యక్రమంలో జిల్లాలోని అన్ని ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫ్యాప్టో జిల్లా సెక్రటరీ జనరల్ ఆర్.అబ్దుల్లా, నాయకులు ఖాదర్ బాషా, రాజశేఖర్, నరసింహారావు, సాజిద్, బాలగంగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సోషల్ మీడియా యాక్టివిస్ట్పై టీడీపీ వర్గీయుల దాడి చెన్నూరు(వల్లూరు) : మండల కేంద్రమైన చెన్నూరులో సోమవారం రాత్రి టీడీపీ వర్గీయులు సోషల్ మీడియా యాక్టివిస్ట్ మిట్టా మాధవరెడ్డిపై దాడి చేశారు. టీడీపీ నేతలు, మద్దతుదారులు చేస్తున్న అక్రమాలను వెలుగులోకి తెస్తూ, వారి అక్రమ ధనార్జనకు అడ్డుగా మారాడనే అక్కసుతో ఆ పార్గీకి చెందిన వ్యక్తులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. వివరాలిలా.. చెన్నూరుకు చెందిన మిట్టా మాధవరెడ్డి అనే వ్యక్తి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ మండలంలో టీడీపీ నేతలు, వారి అనుచరులు చేస్తున్న అక్రమాలను సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి తెస్తున్నాడు. అక్రమార్జనే ధ్యేయంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న టీడీపీ వర్గీయులకు ఇది కంటగింపుగా మారింది. తమ ఆదాయాలకు గండి కొడుతున్నాడనే కారణంగా అతనిపై కక్ష పెంచుకున్న టీడీపీ వర్గీయులు అదును కోసం వేచి ఉన్నారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి చెన్నూరులోకి కొత్త రోడ్డులో గల ఒక హోటల్లో ఉన్న మాధవ రెడ్డిపై టీడీపీ వర్గీయులు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన మాధవరెడ్డిని పోలీసులు 108 వాహనంలో కడప రిమ్స్కు తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరామర్శించిన వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు సమాచారం అందుకున్న వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథరెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాధవరెడ్డిని పరామర్శించారు. దాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. -
పోలీస్ స్టేషన్ ఎదుట ట్రాన్స్జెండర్ల ఆందోళన
కడప అర్బన్ : సహచర ట్రాన్స్జెండర్కు మోసం చేసిన కడప నగరం అశోక్ నగర్ చెందిన యువకుడిపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని కడప నగరంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద పలువురు ట్రాన్స్జెండర్లు మంగళవారం ఆందోళన నిర్వహించారు. వివరాలు ఇలా..దేవి అనే ట్రాన్స్జెండర్ను సతీష్ అనే యువకుడు ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుంటానని చెప్పాడన్నారు. అయితే దేవి ఆరోగ్యం బాగా లేదని వదిలేశాడన్నారు. దీంతో తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. న్యాయం జరిగేంత వరకు ఆందోళన విరమించమని కూర్చున్నారు. ఈ ఆందోళనపై స్పందించిన కడప వన్ టౌన్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ బాధితురాలికి న్యాయం జరిగేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో ఫిర్యాదు చేసిన ట్రాన్స్జెండర్లతో పాటు యువకుడిని పిలిపించి సీఐ బి.రామకృష్ణ మాట్లాడారు. సమస్య సద్దుమణగడంతో వారు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో కడప ఒన్టౌన్ ఎస్ఐ అమర్నాథ్రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
మూల్యాంకనానికి వేళాయె
● పదో తరగతి పేపర్లు దిద్దేందుకు ఏర్పాట్లు పూర్తి ● 3 నుంచి 9 వరకు నిర్వహణ కడప ఎడ్యుకేషన్: జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు మంగళవారం ముగిశాయి. విద్యార్థులు రాసిన సమాధాన పత్రాలను దిద్దేందుకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏప్రిల్ 3 నుంచి 9వ తేదీ వరకు ఈ ప్రక్రియ నిర్వహించనున్నారు. కడప మున్సిపల్ హైస్కూల్ (మెయిన్)లో ప్రభుత్వ పరీక్షల విభాగం ఆధ్వర్యంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇక్కడికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 1,80,965 పేపర్లు రానున్నాయి. జిల్లాలో 1515 మంది సిబ్బందిని ఏర్పాటు చేశారు. వీరిలో జవాబు పత్రాలకు మూల్యాంకనం నిర్వహించే అసిస్టెంట్ ఎగ్జామినర్లతోపాటు పరిశీలించేందుకు చీఫ్ ఎగ్జామినర్, స్పెషల్ అసిస్టెంట్లను ఏర్పాటు చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారి షేక్ షంషుద్దీన్ క్యాంపు ఆఫీసర్, డిప్యూటీ డీఈఓ రాజగోపాల్రెడ్డి డిప్యూటీ క్యాంపు ఆఫీసర్గా వ్యవహరించనున్నారు. మరో ఏడుగురు అసిస్టెంట్ క్యాంపు ఆఫీసర్లుగా వ్యవహరించనున్నారు. ఆరుగురు ఏఈలకు ఒక సీఈ, ఇద్దరు స్పెషల్ అసిస్టెంట్లు: విద్యార్థుల సమాధాన పత్రాలను మూల్యాంకనం చేసేందుకు ఆరుగురు చొప్పున అసిస్టెంట్ ఎగ్జామినర్లు(ఏఈ), ఒక చీఫ్ ఎగ్జామినర్తోపాటు ఇద్దరు స్పెషల్ అసిస్టెంట్లను ఒక బృందంగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ బృందంలోని ఒక్కొక్క ఏఈ రోజుకు 40 సమాధాన పత్రాలను మూల్యాంకనం చేస్తారు. ఏఈలు మూల్యాంకనం చేసిన పత్రాలను సీఈలు క్షుణంగా పరిశీలిస్తారు. విద్యార్థులు రాసిన సమాధానాలు సరైనవి, కానివి పరిశీలించి వేసిన మార్కులను నిశిత పరిశీలన చేస్తారు. అదే విధంగా సమాధాన పత్రాలు, ఏఈలు వేసిన మార్కులను కూడి మొత్తం మార్కులను వేసే విధులను స్పెషల్ అసిస్టెంట్లు నిర్వహిస్తారు. నిబంధనలు అమలు పదో తరగతి మూల్యాంకనంలో పాల్గొనే సిబ్బందికి ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేయనున్నారు. మూల్యాంకనం జరుగుతున్న వైపు ఇతరులు రాకుండా ఆంక్షలు విధిస్తున్నారు. విధుల్లో పాల్గొనే సిబ్బంది సెల్ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను వెంట తీసుకెళ్లడానికి వీలు లేకుండా నిబంధనలు జారీ చేయనున్నారు. 1515 మంది సిబ్బంది ఏర్పాటు రాష్ట్ర వ్యాప్తంగా మూల్యాంకనానికి రానున్న దాదాపు 1,80,965 పేపర్లను మూల్యాంకనం చేసేందుకు జిల్లా వ్యాప్తంగా 1515 మంది సిబ్బందిని విధులకు ఏర్పాటు చేశారు. ఇందులో చీఫ్ ఎగ్జామినేటర్లతోపాటు అసిస్టెంట్ ఎగ్జామినర్లను కలిపి 1104 మందిని, స్పెషల్ అసిసెంట్లుగా 411 మందిని నియమించారు. ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మూల్యాంకనం నిర్వహించనున్నారు. విధులకు హాజరయ్యే సిబ్బందికి అన్ని రకాల మౌలిక వసతులను ప్రభుత్వ పరీక్షల విభాగం ఏర్పాటు చేసింది. -
● వైఎస్సార్సీపీ పాలనలో ఆరంభంలోనే..
రైతులు పంటల సాగు కోసం ఎలాంటి ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఖరీఫ్ ఆరంభంలోనే పెట్టుబడి సాయం (వైఎస్సార్ రైతు భరోసా) అందించి అన్నదాతలకు అండగా నిలిచింది. ఏటా క్రమం తప్పకుండా ఈ మొత్తాన్ని అందించింది. పీఎం కిసాన్ సాయం కింద రూ.6 వేలు, వైఎస్సార్ రైతు భరోసా కింద రూ.7500 మొత్తం కలిపి ఏడాదికి రూ.13500 అందజేసింది. ఈ మొత్తాన్ని మూడు విడతల్లో రైతు ఖాతాలకు జమ చేసింది. ఇందులో ఖరీఫ్ ప్రారంభం, రెండవది కోతల సమయం, మూడవది ధాన్యం ఇంటికి చేరే వేళ అందించారు. ఇలా వైఎస్సార్ రైతు భరోసా, పీఎం కిసాన్ కింద ఐదేళ్లపాటు రూ.1191.03 కోట్లను అన్నదాతలకు అందించి అండగా నిలిచింది. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు ఏడాదికి రాష్ట్ర వాటా కింద రూ.14 వేలు అందిస్తామని ప్రకటించింది. అంటే ఏడాదికి కేవలం రాష్ట్ర ప్రభుత్వం అందించే అన్నదాత సుఖీభవ పథకం కింద జిల్లా రైతాంగానికి రూ. 294.67 కోట్లు అందనుంది. అలాగే గత ప్రభుత్వం కంటే అదనంగా ప్రతి రైతులకు ఏడాదికి రూ.6500 చొప్పున లబ్థి చేకూరనుంది. ఈ లెక్కన జిల్లా వ్యాప్తంగా 210481 మంది రైతులకు ఏడాదికి అదనంగా 136.81 కోట్లు అందనుంది. అంటే జిల్లా రైతాంగానికి రైతు భరోసా, పీఎం కిసాన్ రెండు కలిపి ఏడాదికి రూ. 431.48 కోట్లు అందనుంది. ఈ మొత్తాన్ని కూటమి ప్రభుత్వం జిల్లా రైతుల ఖాతాలకు ఏడాదికి జమ చేయాల్సి ఉంటుంది. -
హమ్మయ్య.. అయిపోయాయ్!
కడప ఎడ్యుకేషన్: పదో తరగతి పరీక్షలు నిర్వహణ లోపాటు, ఆటుపోట్ల మధ్య ముగిశాయి. జిల్లా వ్యాప్తంగా గత నెల 17వ తేదీన ప్రారంభమైన పరీక్షలు ఏప్రిల్ 1న ముగిశాయి. జిల్లాలో 161 పరీక్షా కేంద్రాల్లో 27,800 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాశారు. ప్రారంభంలో ప్రశాంతంగా మొదలైనా.. తరువాత పలు ఆరోపణలు ఎదుర్కోవాల్సి వచ్చింది. 19న నిర్వహించిన హిందీ పరీక్షకు సంబంధించి కడప ప్రభుత్వ బాలికల హైస్కూల్ సెంటర్లో ఒక విద్యార్థి ఏకంగా సెల్ఫోన్ను జేబులో ఉంచుకుని హాజరయ్యాడు. దీంతో ఆ విద్యార్థిని డీబార్ చేయడంతోపాటు ఆ పరీక్ష గదిలో విధులు నిర్వర్తించిన ఇన్విజిలేటర్ను సస్పెండ్ చేశారు. అలాగే 24న గణితం పరీక్ష పశ్నాపత్రం వల్లూరు జెడ్పీ హైస్కూల్ కేంద్రంలో వాటర్బాయ్ వాట్సాప్ ద్వారా లీక్ అయింది. ఇందుకుగాను ఆ పరీక్షా కేంద్రంలో ఇన్విజిలేటర్తోపాటు చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ అధికారితో కలిపి ముగ్గురిని సస్పెండ్ చేశారు. అలాగే ఒక విద్యార్థిని కూడా డీబార్ చేశారు. అలాగే ఈ సంఘటనకు సంబంధించి ఇన్విజిలేటర్తోపాటు చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ అధికారితోపాటు మరో ఆరుగురిపై పోలీసు కేసులు నమోదు చేశారు. చివరిరోజు 144 మంది గైర్హాజరు చివరి రోజైన మంగళవారం సాంఘిక శాస్త్రం పరీక్షకు 144 మంది గైర్హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా రెగ్యులర్కు సంబంధించి 27,768 మంది విద్యార్థులకు గాను 27,624 మంది హాజరయ్యారు. ప్రైవేటు విద్యార్థులకు సంబంధించి 22 మందికి గాను 19 మంది హాజరు కాగా ముగ్గురు గైర్హాజరయ్యారు. సిట్టింగ్ స్క్వాడ్ 84 పరీక్షా కేంద్రాలు, 7 స్క్వాడ్ బృందాలు 50 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. జిల్లా నోడల్ ఆఫీసర్ మధుసూధన్రావు నాలుగు, డీఈఓ షేక్ షంషుద్దీన్ 5 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. ముగిసిన పదో తరగతి పరీక్షలు నిర్వహణలో పలు లోపాలు ఇద్దరు ఇన్విజిలేటర్లు, ఒక చీఫీ, డిపార్ట్మెంట్ ఆఫీసర్ సస్పెండ్ ఇద్దరు విద్యార్థులు డీబార్ -
వేగంగా రెవెన్యూ సమస్యల పరిష్కారం
కడప సెవెన్రోడ్స్: జిల్లాలో రెవెన్యూ సమస్యలు వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని బోర్డు మీటింగ్ హాల్ లో పీజీఆర్ఎస్ అర్జీలు, రెవెన్యూ సదస్సులు, రీ సర్వే, గ్రామసభలు, తదితర రెవెన్యూ సమస్యలపై కలెక్టర్ జాయింట్ కలెక్టర్ అదితిసింగ్తో కలిసి జిల్లా రెవెన్యూ అధికారి, రెవెన్యూ డివిజన్ల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రణాళికాబద్ధంగా పని చేయాలని సూచించారు. ఈ సమావేశంలో డీఆర్వో విశ్వేశ్వరనాయుడు, కడప ఆర్డీవో జాన్ ఇర్విన్, పులివెందుల ఆర్డీవో చిన్నయ్య, బద్వేల్ చంద్రమోహన్, జమ్మలమడుగు ఆర్డీవో సాయిశ్రీ, కలెక్టరేట్ ఏవో విజయ్ కుమార్ తదితర రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. ఐటీ పార్కు ఏర్పాటుకు స్థల పరిశీలన జిల్లాలో ఐటీ పార్కు ఏర్పాటు కోసం స్థానిక ఎమ్మెల్యే ఆర్.మాధవిరెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి మంగళవారం రిమ్స్ సమీపంలోని ప్రభుత్వ భూమిని పరిశీలించారు. కడప నగర శివార్లలోని పుట్లంపల్లె పంచాయతీ పరిధిలో పాలకొండ వద్ద ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమికి సంబంధించి రికార్డులు, మ్యాపులను పరిశీలించారు. చుట్టు పక్కల గతంలో ఇతరులకు కేటాయించిన ప్రభుత్వ స్థలాల వివరాలను కూడా జిల్లా కలెక్టర్ రెవెన్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులు రెడ్డి, కడప తహసీల్దార్ నారాయణరెడ్డి, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పాత కలెక్టరేట్, పాత రిమ్స్ పరిశీలన పోటీ పరీక్షలకు సంసిద్ధం అయ్యే విద్యార్థుల కోసం బీసీ వెల్ఫేర్ భవన్ను మరింత వినియోగంలోకి తీసుకురావాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. స్థానిక పాత రిమ్స్, పాత కలెక్టరేట్లోని ప్రాంగణాలు, భవనాలను ఆయన కడప ఆర్టీవో జాన్ ఇర్విన్, సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. ముందుగా పాత రిమ్స్లోని ఖాళీ స్థలాలు, ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం పాత రిమ్స్ వెనుక భాగంలో నూతనంగా నిర్మించిన బీసీ వెల్ఫేర్ భవనాన్ని బీసీ సంక్షేమ శాఖ అధికారితో కలిసి మీటింగ్ హాలు, తరగతి గదులు, ఇతర రూములను పరిశీలించారు. అనంతరం పాత కలెక్టరేట్లోని ప్రాంగణాలు, గదులను పరిశీలించి అక్కడి గత వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ అధికారి భరత్ కుమార్రెడ్డి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి -
గ్రంథాలయ సంస్థ పర్సన్ ఇన్చార్జిగా జేసీ
కడప కల్చరల్: జిల్లా గ్రంథాలయ సంస్థకు పర్సన్ ఇన్చార్జిగా జాయింట్ కలెక్టర్ను నియమించారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలకు కూడా జేసీలకు ఈ బాధ్యతలు అప్పగించారు. వైఎస్సార్ జిల్లా గ్రంథాలయ సంస్థకు కూటమి ప్రభుత్వం వచ్చాక ఇంత వరకు చైర్మన్ను నియమించలేదు. పరిపాలన సౌలభ్యం కోసం జేసీ అదితిసింగ్కు ఈ బాధ్యతలను అప్పగించారు. ఆరు నెలలపాటు ఈ ఉత్తర్వులు అమలులో ఉంటాయని, లేదా కొత్త చైర్మన్ నియామకం వరకు ఈ పరిస్థితి కొనసాగుతుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. నేడు బీజేపీ జిల్లా అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం కడప కోటిరెడ్డిసర్కిల్: భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా జంగిటి వెంకట సుబ్బారెడ్డి బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి బత్తల పవన్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. నగరంలోని హరిత హోటల్ సమావేశ మందిరంలో జరిగే ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి సత్యకుమార్, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేయనున్నారని పేర్కొన్నారు. అలాగే కూటమిలోని ఎమ్మెల్యేలు, బీజేపీ నేతలు, కార్యకర్తలు పాల్గొంటారని ఆయన వివరించారు. కేజీబీవీల్లో అడ్మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం కడప ఎడ్యుకేషన్: జిల్లాలో ఉన్న 17 కేజీబీవీల్లో 6, 11 తరగతులలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సమగ్రశిక్ష ఏపీసీ నిత్యానందరాజులు తెలిపారు. అలాగే 7,8,9,10,12 తరగతులలో మిగిలి ఉన్న సీట్లకు కూడా ఏప్రిల్ 11వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచవ్చని ఆయన పేర్కొన్నారు. మార్చి 31వ తేదీ నాటికి 6వ తరగతిలో 600 సీట్లు, 11వ తరగతిలో 300 సీట్లు, 7వ తరగతిలో 50 సీట్లు, 8వ తరగతిలో 30 సీట్లు, 9వ తరగతిలో 25 సీట్లు, 10వ తరగతిలో 6 సీట్లు, 12వ తరగతిలో ఒక సీటు ఖాళీ ఉన్నట్లు వివరించారు. కావున అర్హులు హెచ్టిటిపిఎస్://ఏపీకేజీబీవీఎ.ఎపిసిఎఫ్ఎస్ఎస్.ఇన్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. నేడు కలెక్టరేట్ ఎదుట ధర్నా కడప వైఎస్ఆర్ సర్కిల్: రాష్ట్ర ప్రభుత్వం కానిస్టేబుల్ అభ్యర్థులకు మెయిన్స్ పరీక్షల తేదీ ప్రకటించాలని బుధవారం కలెక్టరేట్ వద్ద డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నట్లు డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరణాల శివకుమార్ తెలిపారు. నగరంలోని సీపీఎం జిల్లా కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో 2022లో 6100 కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ వచ్చిందని పేర్కొన్నారు. మూడేళ్లు గడుస్తున్నా పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారో తేదీలు ప్రకటించలేదన్నారు. ఇంతకు నిర్వహిస్తారో లేదో తెలియక అభ్యర్థులు అయోమయంలో ఉన్నారన్నారు. కూటమి అధికారంలోకి వస్తే ఆరు నెలల్లో కానిస్టేబుల్ అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించి నియామకాలు చర్యలు చేపడతామని నారాలోకేష్ హామీ ఇచ్చారని, అయినా ఇంత వరకు అమలు చేయలేదని అన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ తీరుకు నిరసనగా ధర్నా నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో డీవైఎఫ్ఐ నగర కార్యదర్శి విజయ్, సహాయ కార్యదర్శి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఆదర్శనీయుడు అంబేడ్కర్ కడప కార్పొరేషన్: ఆదర్శనీయుడు డాక్టర్ బీర్ అంబేడ్కర్ అని నగర మేయర్ కె.సురేష్బాబు, మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా అన్నారు. జై భీమ్ మాల మహాసేన ఆధ్వర్యంలో రూపొందించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి వారోత్సవాల పోస్టర్లను వారు ఆవిష్కరించారు. మంగళవారం జై భీమ్ మాల మహాసేన అధ్యక్షుడు పి.సంపత్ కుమార్, ప్రధాన కార్యదర్శి చైతల్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చిన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 1 నుంచి 14 వరకు ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా రాజ్యాంగంపై అవగాహన కల్పించడానికి విద్యార్థులకు వక్తృత్వ, వ్యాసరచన పోటీలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అంబేడ్కర్ విశిష్టతను స్కూల్ నుంచి కాలేజీ విద్యార్థుల వరకు అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు. అంబేడ్కర్ అందరి వాడని, ఆయన అన్ని వర్గాల వారికి రాజ్యాంగం ద్వారా ఫలాలు ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో జై భీమ్ మాల మహాసేన కార్యవర్గ సభ్యులు వసంత్ పాల్గొన్నారు. -
అక్సానగర్లో కత్తిపోట్ల కలకలం
కమలాపురం : స్థానిక అక్సా నగర్లో ఆదివారం రాత్రి ఇరు వర్గాల యువకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు కత్తి పోట్లకు గురయ్యారు. స్థానికులు, బాధితుల సమాచారం మేరకు..అక్సా నగర్లో గతంలో నివాసమున్న సల్మాన్ ఇటీవల ఇందిరమ్మ కాలనీలో చేరారు. పది రోజుల కిందట అక్సానగర్కు వచ్చి బైక్ను ఎక్కువ స్పీడ్తో రైడ్ చేస్తున్నారు. అదే కాలనీకి చెందిన సొహెయిల్, షాబాజ్ స్పీడ్తో వెళ్లవద్దంటూ మందలించారు. అది మనసులో పెట్టుకున్న సల్మాన్ ఆదివారం రాత్రి అక్సానగర్కు వచ్చి సోహెల్, షాబాజ్లను కత్తితో పొడిచాడు. అడ్డు వచ్చిన రియాజ్పైనా దాడికి దిగాడు. స్థానికులు గుర్తించి వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సొహెయిల్ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం రిమ్స్కు తరలించారు. షాబాజ్, రియాజ్లకు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు ఆసుపత్రికి వచ్చి జరిగిన దాడి గురించి ఆరా తీశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దాడికి పాల్పడిన సల్మాన్ పరారీలో ఉన్నాడు. -
భక్తుల కొంగుబంగారం బలిజపల్లె గంగమ్మ
రాజంపేట టౌన్ : రాజంపేట మున్సిపాలిటీ పరిధిలోని బలిజపల్లెలో స్వయంభువుగా వెలసిన గంగమ్మ ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో ఎంతో విశిష్టత సంతరించుకుంది. రెండు వందల ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ జాతరకు ఏటా లక్ష మందికిపైగా భక్తులు హాజరై అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు సమర్పిస్తారు. అమ్మవారికి వరపడితే తమ కష్టాలు తొలగిపోతాయని, కోరిన కోర్కెలు గంగమ్మ నెరవేరుస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే బలిజపల్లె గంగమ్మ భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతుంది. బుధవారం రాత్రి నుంచి జాతర ప్రారంభం కానుంది. సంప్రదాయాల సమ్మేళనం బలిజపల్లె గంగమ్మ జాతర అనేక సంప్రదాయాల సమ్మేళనం. బలిజపల్లె, తుమ్మల అగ్రహారం, నారపురెడ్డిపల్లె గ్రామ ప్రజలు కలిసి అమ్మవారి జాతర నిర్వహిస్తారు. తొలుత బలిజపల్లె వాసులు తేదీ నిర్ణయించి అనంతరం తుమ్మల అగ్రహారం, నారపురెడ్డిపల్లె నిర్వాహకులతో చర్చిస్తారు. అంగీకారం రాగానే జాతర తేదీ ఖరారు చేశారు. ఆదివారం జాతరకు అంకురార్పణ చేసి గురువారం జాతర నిర్వహించనున్నారు. ఆయా గ్రామాల ప్రజలు అమ్మవారికి వివిధ రకాల సాంగ్యలతో జాతర ఘనంగా నిర్వహిస్తారు. బలిజపల్లెలో అమ్మవారి ప్రతిమ జాతరలో కొలువుదీరే గంగమ్మ ప్రతిమను బలిజపల్లెలోని ఓ వేపచెట్టు కింద దాదాపు ఆరు గంటల పాటు కష్టపడి తయారుచేస్తారు. అనంతరం ప్రతిమను నిర్వాహకులు పూల రథంపై ఊరేగిస్తారు. వేపమండలతో తయారు చేసిన గుండిలో తీసుకొచ్చి కొలువుదీర్చుతారు. అమ్మవారు గుడిలోకి వచ్చే సమయంలో భక్తులు పెద్దఎత్తున నైవేద్యాలు ఎదురుగుంభంగా ఇచ్చేందుకు పోటీపడతారు. యాబై అడుగుల దూరంలో ఉండే గుడిలోకి అమ్మవారిని తీసుకురావడానికి దాదాపు రెండు గంటల సమయం పడుతుంది. బలిజపల్లె నిర్వాహకులు విశేషంగా పూజలు నిర్వహించి సాంగ్యలు సమర్పిస్తారు. అమ్మవారు కొలువుదీరగానే జాతర ఊపందుకుంటుంది. తుమ్మల అగ్రహారం నుంచి గండదీయలు బలిజపల్లెలో కొలువైన గంగమ్మకు తుమ్మలఅగ్రహారం పుట్టినిల్లు అని పెద్దలు చెబుతారు. దీంతో గ్రామ మహిళలు బుధవారం రాత్రి బలిజపల్లె గ్రామానికి గండదీయలను తీసుకెళ్తారు. గురువారం వేకువ జామున గుడిలో కొలువుదీరాక మహిళలు తీసుకొచ్చిన గండదీయలను చెల్లిస్తారు. ఈ సమయంలో గంగమ్మను దర్శించుకునేందుకు వేలాది మంది బారులు తీరుతారు. అగ్రహారం మహిళలకు ప్రత్యేకమైన గౌరవం ఇచ్చి చెల్లించే ఏర్పాట్లుచేస్తారు. నారపురెడ్డిపల్లె నుంచి నవధాన్యాలు జాతర సందర్భంగా గంగమ్మ తల్లికి నారపురెడ్డిపల్లెకు చెందిన జాతర నిర్వాహకులు, ప్రజలు బుధవారం రాత్రి నవ ధాన్యాలు తీసుకొస్తారు. గంగమ్మ సోదరుడైన పోతు రాజును తప్పెట్లతో ఉత్సాహంగా బలిజపల్లెకు తీసుకొస్తారు. పోతురాజు ఊరేగుతూ వచ్చే సమయంలో భక్తులు కర్రసాము, ఐదడుగుల వ్యక్తులు నృత్యాలు చేస్తూ కోలాహలంగా బలిజపల్లెకు చేరుకుంటారు. రేపు రాత్రి నుంచి జాతర ప్రారంభం జాతరకు రెండు వందల ఏళ్ళకు పైగా చరిత్ర -
ఉత్కంఠగా బండలాగుడు పోటీలు
బ్రహ్మంగారిమఠం : మండలంలోని సిద్ధయ్యమఠంలో పెద్దపీరయ్యస్వామి ఆరాధన మహోత్సవాలలో భాగంగా సోమవారం ఏర్పాటు చేసిన బండలాగుడు పోటీలను జిల్లా పరిషత్ చైర్మన్ ముత్యాల రామగోవిందరెడ్డి సోమవారం ప్రారంభించారు. ఆద్యంతం పోటీలు ఉత్కంఠగా సాగాయి. నంద్యాలకు చెందిన కేశవరెడ్డి ఎద్దులు ప్రథమ స్థానంలో నిలవగా యజమానికి రూ.1,00,116 నగదు జెడ్పీ చైర్మన్ రామగోవిందరెడ్డి అందజేశారు. ప్రొద్దుటూరుకు చెందిన మార్తల వెంకటరెడి ఎద్దులు ద్వితీయ స్థానంలో నిలవగా యజమానికి రూ.70 వేల నగదు, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన ఎద్దుల యజమానులకు నగదు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వీరనారాయణరెడ్డి, మండల పార్టీ అధ్యక్షడు మేకల రత్నకుమార్యాదవ్, బొగ్గల సుబ్బిరెడ్డి, రామసుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి చిన్న ఓబుల్రెడ్డి, నేలటూరు వెంకటరామిరెడ్డి, ఈశ్వర్రెడ్డి, గొడ్లవీడు నాగేశ్వర్రెడ్డి, దుగ్గిరెడ్డి, బాలిరెడ్డి, గుండాపురం రమణారెడ్డి, గొడ్లవీడు సిద్దారెడ్డి, జోగయ్య, రామకృష్ణారెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు చెన్నుపల్లె సుబ్బారెడ్డి, కానాల మల్లికార్జునరెడ్డి, జౌకుపల్లె రమణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
దాల్మియాతో ఒప్పందం ప్రజలకు తెలియాలి
● భూముల సంగతి తేల్చాలి ● ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిదిరెండు నాలుకల ధోరణి●● ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి జమ్మలమడుగు : జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిలు దాల్మియా యాజమాన్యంతో ఎటువంటి ఒప్పందం చేశారో.. ప్రజలందరికీ బహిర్గతం చేస్తే బాగుంటుందని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి పేర్కొన్నారు. సోమవారం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో చిన్న కొమెర్ల, నవాబుపేట, దుగ్గనపల్లి రైతులతో కలిసి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి దాల్మియా పరిశ్రమపై రెండు నాలుకల ధోరణి అవలంబిస్తున్నారన్నారు. దాల్మియా ప్రజాభిప్రాయ సేకరణలో వారిని బయటపడేసే విధంగా వ్యవహరించారు. బయటికి వచ్చి ప్రజల సమస్యలు పరిష్కారం చేయనిదే రెండో ప్లాంట్ ముందుకు పోదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. జడ్జి ముందు సాక్ష్యం చెబితే బాధితులకు న్యాయం జరుగుతుందని.. అలా కాకుండా ప్రజాభిప్రాయ సేకరణలో కలెక్టర్ ముందు తప్పుడు సాక్ష్యం చెప్పి, బయటికి వచ్చి న్యాయం చేస్తామనడం రైతులను నట్టేట ముంచడమే అవుతుందన్నారు. దాల్మియా ప్రజాభిప్రాయ సేకరణలో రైతులు తమ సమస్యలన్నీ వివరించారని తెలిపారు. అయినా జిల్లా కలెక్టర్ ముంపునకు గురి అయ్యే భూముల గురించి ఒక్కమాటకూడ చెప్పలేదన్నారు. దాదాపు 400 ఎకరాల భూమి మునకకు గురి అయితే ప్రస్తుతం ఆభూముల్లో సాగుచేయలేని స్థితి ఉందన్నారు. నిజంగా జిల్లా కలెక్టర్ న్యాయం చేయాలని ఉంటే దాల్మియా యాజమాన్యంతో భూములను కొనుగోలు చేసిన తర్వాతనే.. రెండో ప్లాంట్ ముందుకు వెళ్లాలని, విస్తరణ కోసం పెట్టుకున్న దరఖాస్తును తిరస్కరించాలన్నారు. శాసనసభ్యుడు ఆదినారాయణరెడ్డి రైతులకు నిజంగా న్యాయం చేయాలనే ఆలోచన ఉంటే కలెక్టర్కు తన లెటర్ప్యాడ్ పైన రైతుల సమస్యలు పరిష్కారం చేసిన తర్వాతనే విస్తరణ పనులు చేపట్టాలని పర్యావరణ శాఖకు నివేదిక ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో చిన్న కొమెర్ల సర్పంచ్ జగదీశ్వరరెడ్డి, నవాబు పేట భాస్కర్రెడ్డి, హృషికేశవరెడ్డి, బడిగించల జనార్థాన్, గిరిధర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రూ.500 దొంగనోటు ఇచ్చి పరారీ
చాపాడు : మండల కేంద్రమైన చాపాడులో గత రెండు రోజులుగా దొంగ నోట్లు ప్రత్యక్షమవుతున్నాయి. ఆదివారం సాయంత్రం స్థానిక కుందూనది వద్ద చాపాడుకు చెందిన శాంతమ్మ దోస పండ్ల వ్యాపారం చేసుకుంటోంది. ఓ వ్యక్తి బైక్లో వచ్చి రూ.100లకు దోస పండ్లు కొనుగోలు చేశాడు. రూ.500 నోటు ఇచ్చి రూ.400 చిల్లర తీసుకుని వెళ్లాడు. ఇంతలో పిల్లలు అది దొంగ నోటుగా గుర్తించి వెతికేలోగా బైక్లో వచ్చిన వ్యక్తి పరారయ్యాడు. సోమ వారం చాపాడులోని ఓ స్వీట్స్ బేకరిలో స్వీట్లు కొనుగోలు చేసిన వ్యక్తి దొంగనోటు మార్చుకుని పరారైనట్లు తెలిపారు. గత రెండు రోజుల్లో దొంగ నోట్లు చలామణీ కావడంతో చాపాడుకు చెందిన ఎస్.ఓబులేసు ట్రైనీ డీఎస్పీ భవానీకి ఫిర్యాదు చేశారు. -
దాయాదుల మద్య భూ వివాదం
బ్రహ్మంగారిమఠం : భూ వివాదం ఇరు వర్గాల మధ్య పరస్పర దాడులకు దారి తీసింది. ఆ భూములు తమవేనంటూ ఇరువర్గాల దాయాదులు ఘర్షణకు దిగి కత్తులు, రాడ్లతో దాడులు చేసుకోవడంతో ఒకరు మృతి చెందగా.. ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. మండలంలోని సోమిరెడ్డిపల్లె పంచాయతీ మద్దిరెడ్డిపల్లె గ్రామంలో నివాసముంటున్న పెసల నారాయణరెడ్డి, పెసల జయరామిరెడ్డి దాయాదులు. వారికి సోమిరెడ్డిపల్లె పొలం సర్వే నెంబరు 159, 160లో 4.5 ఎకరాల పిత్రార్జిత వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమి తమదంటే తమదే అంటూ ఇరువర్గాలు చిన్న చిన్న ఘర్షణ పడుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో పెసల నారాయణరెడ్డి బద్వేల్ కోర్టును ఆశ్రయించగా.. నారాయణరెడ్డి పొలంలో సాగు చేసుకునేందుకు అనుమతిచ్చింది. రెండు రోజుల కిందట నారాయణరెడ్డి అయన సోదరులు ట్రాక్టర్తో పొలంలో దుక్కులు చేస్తున్నారు. ఇది సహించని జయరామిరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు అడ్డుకోవాలనుకుని సోమవారం సాయంత్రం పొలం వద్దకు వచ్చి ఘర్షణపడ్డారు. జయరామిరెడ్డి ఆయన సోదరులు కత్తులు, రాడ్లు పట్టుకుని ఆగ్రహంతో దాడి చేస్తున్నారని, నారాయణరెడ్డి సోదరులకు తెలిసింది. దీంతో వారు బైకుపై పొలం వద్దకు వచ్చారు. అప్పటికే నారాయణరెడ్డి(60) గాయాలతో కింత పడి ఉన్నారు. ఇది చూసిన నారాయణరెడ్డి సోదరులు వాగ్వాదానికి దిగారు. మాటా మాటా పెరిగి ఘర్షణ తలెత్తడంతో ఇరువర్గాలు దాడులు చేసుకున్నాయి. జయరామిరెడ్డి, ఆయన కుమారుడు సాంబశివారెడ్డి, తమ్ముడు మల్లికార్జునరెడ్డికి తీవ్రగాయాలయ్యాయి. నారాయణరెడ్డి మృతిచెందగా ఆయన బంధువులు శివారెడ్డి, ఆదిలక్ష్మమ్మలకు గాయాలయ్యాయి. బైక్లకు నిప్పు పెట్టడంతో ఐదు బైకులు దగ్ధమయ్యాయి. బి.మఠం ఎస్ఐ చంద్రశేఖర్, సిబ్బంది వెళ్లి ఘర్షణను అడ్డుకున్నాడు. తీవ్రగాయాలతో ఉన్న వారిని కడప ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కత్తులు, రాడ్లతో ఇరువర్గాల దాడులు ఒకరు మృతి, ఐదుగురికి గాయాలు బైక్కు నిప్పు పెట్టడంతో దగ్ధం -
వైభవంగా పల్లకీ సేవ
రాయచోటి టౌన్: రాయచోటి శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి పల్లకీ సేవ సోమవారం రాత్రి వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లకు అర్చకులు ప్రత్యేక పూజలు జరిపారు. పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలతో అందంగా అలంకరించారు. అనంతరం ఉత్సవ మూర్తులను పల్లకీలో కొలువుదీర్చారు. ఆలయ మాఢవీధులు, ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు.కార్యక్రమంలో ఆలయ ఈవో డీవీ రమణారెడ్డి, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. ఆస్తుల రిజిస్ట్రేషన్కు స్లాట్ బుకింగ్ కడపకోటిరెడ్డిసర్కిల్: రిజిస్ట్రేషన్శాఖలో క్రయ, విక్రయాలకు స్లాట్ సదుపాయం అందుబాటు లోకి రానుంది. కక్షిదారులకు సులభతర, వేగవంతమైన సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ సదుపాయాన్ని కల్పిస్తోంది. జిల్లాలో తొలుత కడప ఆర్ఓ కార్యాలయంలో అమలు కానుంది. పనిదినాల్లో ఉదయం 10–30 గంటల నుంచి సాయంత్రం 5–30 మధ్యలో స్లాట్ను బుక్ చేసుకోవచ్చు. ఈ విధానం వల్ల రోజంతా నిరీక్షించే పనితప్పుతుంది. స్లాట్ బుకింగ్ చేసుకున్న వారికి నిర్ణీత సమయంలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాల్సి వుంటుంది. ప్రజలకు ఎలాంటి అసౌక ర్యం లేకుండా రిజిస్ట్రేషన్ సులభతరంగా పూర్తవుతుంది. ఈ విధానం విజయవంతం అయితే రాబోవు రోజుల్లో అన్ని సబ్ రిజిస్ట్ట్రార్ కార్యాలయాల్లో ప్రవేశ పెట్టేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. కాగా కడప ఆర్ఓ కార్యాలయంలో ఏప్రిల్ 4 నుంచి స్లాట్ బుకింగ్ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు.ఈసందర్భంగా జిల్లా రిజిస్టార్ పీవీఎన్.బాబు మాట్లాడుతూ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే సమయం వృథా కాదని తెలిపారు. విభజన హామీలు అమలు చేయాలి కడప రూరల్: ఉమ్మడి రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా జై హింద్ పార్టీ, సమాజ్వాది పార్టీ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్క్లబ్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా జై హింద్ పార్టీ వ్యవ స్థాపక అధ్యక్షులు ఎస్ దశరథరామిరెడ్డి మాట్లాడుతూ హామీల అమలులో భాగంగా కడపకు స్టీల్ ప్లాంట్, దుగ్గిరాజుపట్నం ఎయిర్పోర్ట్, వైజాగ్–చైన్నె ఇండస్ట్రీయల్ కారిడార్, విమానాశ్రయా లను అంతర్జాతీయ స్ధాయిలో అభివృద్ధి చేయడంతోపాటు నీటి ప్రాజెక్ట్లు, విద్యా, పారిశ్రామిక ప్రగతికి చెందిన ఎన్నో అంశాలు అమలు కావాల్సివుందన్నారు. కార్యక్రమంలో సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మర్రి రాజ శ్రీనివాసరావు, చంద్రశేఖర్, సీఆర్వీ ప్రసాద్, ఓబయ్య తదిరులు పాల్గొన్నారు. -
కనికరించని ప్రభుత్వం
కరువు తాండవం.. జిల్లాలో కరువు కరాళ నృత్యం చేసింది. ఖరీఫ్, రబీ సీజన్లలో తీవ్ర వర్షాభావం వెంటాడింది. వాన జాడలేక పంటలు నిట్టనిలువునా ఎండిపోయాయి. భూగర్భ జలాలు అడుగంటాయి. కొంత మంది రైతులు పొలాల్లోనే పంటలు వదిలేసుకుని, సర్వం నష్టపోయారు. పశుగ్రాసం కూడా దక్కలేదు. చివరికి అన్నదాత అప్పుల పాలయ్యాడు. ఆదుకోవాల్సిన కూటమి ప్రభుత్వం అన్యాయమే చేసింది. ● జిల్లా అంతటా దుర్భిక్ష ఛాయలు ● జాబితాలో 10 మండలాలకే చోటు ● ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ● మిగతా మండలాల మాటేమిటి? ● మహానాడు నేపథ్యంలోమభ్యపెట్టేందుకే కంటితుడుపు ప్రకటన కడప సెవెన్రోడ్స్/కడప అగ్రికల్చర్ : రాష్ట్ర ప్రభుత్వం తూతూ మంత్రంగా జిల్లాలో కరువు మండలాలను ప్రకటించింది. రబీ సీజన్లో 10 మండలాలను కరువు జాబితాలో చేరుస్తూ సోమవారం జీఓ ఎంఎస్ నంబరు 3ను జారీ చేసింది. మైదుకూరు, దువ్వూరు, బ్రహ్మంగారిమఠం, ఖాజీపేట, చాపాడు, కాశినాయన, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, తొండూరు మండలాల్లో కరువు తీవ్రత అధికంగా ఉన్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. మైలవరం మండలాన్ని మోడరేట్డ్రాట్ కింద చేర్చింది. మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని మొత్తం మండలాలు కరువు కింద చూపారు. కేసీ కెనాల్ ఆయకట్టు పరిధిలోని మండలాలు ఇందులో అధికంగా ఉండటం గమనార్హం. తీవ్ర వర్షాభావం జిల్లా అంతటా తీవ్ర వర్షాభావం చోటు చేసుకుంది. జిల్లా సాధారణ వర్షపాతంలో 14.1 శాతం లోటు ఏర్పడింది. వరి, పత్తి, జొన్న, మినుము, కంది, తదితర 18 రకాల పంటల సాధారణ సాగు విస్తీర్ణం బాగా తగ్గింది. తీవ్ర వర్షపాత లోటు, డ్రైస్పెల్స్ కారణంగా సాగు చేసిన పంటలు నిలువునా ఎండిపోయాయి. పెద్దముడియం మండలంలో వర్షపాత లోటుతోపాటు రెండు డ్రైస్పెల్స్ అంటే వరుసగా 42 రోజులు వర్షమే పడలేదు. కలసపాడు, తొండూరు, వేంపల్లె మండలాల్లో కూడా రెండు డ్రైస్పెల్స్ చోటు చేసుకున్నాయి. పోరుమామిళ్ల, గోపవరం, అట్లూరు, సిద్దవటం, ఒంటిమిట్ట మండలాల్లో ఒక్కొక్క డ్రైస్పెల్స్ చొప్పున నమోదయ్యాయి. బద్వేలు మండలంలో మాత్రం డ్రైస్పెల్ లేకపోయినా వర్షపాత లోటు ఏర్పడింది. జూన్ 4 నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు రెఫరెన్స్ పిరీయడ్గా తీసుకున్నారు. వర్షపాత లోటు, డ్రైస్పెల్స్లు విపత్తుల నిర్వహణ విభాగం మ్యాండేటరీ ఇండికేటర్స్గా పరిగణిస్తుంది. ఒక మండలాన్ని కరువు కింద ప్రకటించాడానికి ఈ రెండు తప్పనిసరిగా ఉండాలి. పంటల సాగు విస్తీర్ణం, రిమోట్సెన్సింగ్ మాయిశ్చర్ అడక్వేట్ ఇండెక్స్, హైడ్రోలాజికల్ ఇండెక్స్లను ఇంప్యాక్ట్ ఇండికేటర్స్గా తీసుకుంటారు. వీటన్నింటినీ పరినణనలోకి తీసుకొని పరిశీలిస్తే.. జిల్లాలో దాదాపు అన్ని మండలాలను కరువు జాబితా కింద చేర్చాల్సి వుంటుంది. కానీ అప్పట్లో అధికారులు గ్రౌండ్ ట్రూతింగ్ పేరిట ఒక తప్పుడు నివేదికను కమిషనర్ డిజాస్టర్ మేనేజ్మెంట్కు పంపారు. ఆ నివేదిక ఆధారంగా జిల్లాలో ఒక్క మండలాన్ని కూడా కరువు కింద ప్రకటించలేదు. ఆందోళనల నేపథ్యంలో.. ప్రభుత్వ వైఖరిపై జిల్లా రైతాంగంలో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. జిల్లా సమీక్ష కమిటీ సమావేశం ఎదుట సీపీఐ నాయకులు ఆందోళన నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు ఈ అంశాన్ని లేవనెత్తారు. ఆ తరువాత కాలంలో జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారులను నిలదీశారు. కరువు మండలాల ప్రకటన చేయకపోవడంపై జిల్లా అంతటా విమర్శలు వెల్లువెత్తాయి. ప్రజలకు సమాధానం చెప్పలేక జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు తల పట్టుకోవాల్సి వచ్చింది. జిల్లాలో అధిక అసెంబ్లీ స్థానాలను ప్రజలు ఎన్డీఏ కూటమికి కట్టబెట్టినా అభివృద్ధి చేయకపోగా.. కొప్పర్తి ఎంఎస్ఎంఈ, ఏపీజీబీ ప్రధాన కార్యాలయం వంటి వాటిని అమరావతికి ప్రభుత్వం తరలించింది. ఇది కూటమి నేతలను మరింత ఇరకాటంలోకి నెట్టింది. మే నెలలో తెలుగుదేశం పార్టీ కడపలో మహానాడు నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో జిల్లాకు ఏమి చేశారని ఇక్కడ మహానాడు జరుపుతున్నారంటూ ప్రజలు ప్రశ్నించే అవకాశం ఉంది. కనీసం కంటి తుడుపుగా కరువు మండలాలను ప్రకటించాలని భావించే ప్రభుత్వం ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. 10 మండలాలను మాత్రమే కరువు కింద ప్రకటిస్తే మిగతా మండలాల పరిస్థితి ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. -
సీతారాముల కల్యాణానికి పటిష్ట ఏర్పాట్లు
ఒంటిమిట్ట: ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామాలయంలో ఏప్రిల్ 11న జరిగే శ్రీ సీతారాముల కల్యాణానికి పటిష్ట ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ఒంటిమిట్ట టీటీడీ కల్యాణ మండపం సమీపంలోని పరిపాలన భవన సమావేశ మందిరంలో ఎస్పీ అశోక్ కుమార్, టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, డీఆర్ఓ విశ్వేశ్వరనాయుడుతో కలిసి ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు, కల్యాణోత్సవ ఏర్పాట్లపై జిల్లా అధికారులు, టీటీడీ అధికారులతో కలెక్టర్ సమన్వయ సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏప్రిల్ 5 నుంచి ఏప్రిల్ 15 వరకు శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయన్నారు. అందులో భాగంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యాలు లేకుండా జిల్లా, టీటీడీ అధికారులు సంయుక్తంగా, సమన్వయంతో పని చేసి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలన్నారు. ముఖ్యంగా ఏప్రిల్ 11న జరిగే సీతారాముల వారి కల్యాణోత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులతోపాటు ప్రముఖులు రావచ్చనే అంచనాతో అన్ని రకాల ఏర్పాట్లకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. జాగ్రత్తలు తీసుకోవాలిఎక్కడా జనం తొక్కిసలాట జరగకుండా అధికారులు, పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా ప్రసాదం కౌంటర్ల వద్ద ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రతి ఒక్కరికీ తాగునీరు, అన్న ప్రసాదం కొరత లేకుండా అందేలా చూడాలన్నారు. అలాగే కడప, రాజంపేట వైపు నుంచి ఆర్టీసీ బస్సులు పార్కింగ్, అలాగే ఇతర జిల్లాల నుంచి ఎన్ని బస్సులు వస్తున్నాయో తెలుసుకొని పక్కాగా ప్లాన్ రూపొందించుకొని పార్కింగ్ ఏర్పాట్లు చేసుకోవాలని అర్టీసీ అధికారులను ఆదేశించారు. ఒకవేళ పార్కింగ్ దూరంగా ఉంటే అక్కడి నుంచి కల్యాణ వేదిక వద్దకు భక్తులను తీసుకువచ్చేందుకు ఉచిత బస్సులను ఏర్పాటు చేయాలని టీటీడీ జేఈఓకు తెలిపారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ టీటీడీ అధికారులు, జిల్లా యంత్రాంగం, పోలీసులు సమషిగ్టా కృషి చేసి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. ఆలయ దర్శనం అంతకు మునుపు జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ తితిదే అధికారులు, జిల్లా అధికారులతో కలిసి ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అధికారులకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం దేవస్థానం సమీపంలోని శ్రీ కోదండరామస్వామి కల్యాణ వేదికను కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కడప, జమ్మలమడుగు, పులివెందుల ఆర్డీఓలు జాన్ ఇర్విన్, సాయిశ్రీ, చిన్నయ్య, టీటీడీ డిప్యూటీ ఈఓ నగేష్, ఆర్డీఏ పీడీ ఆనంద్ నాయక్, డీఎస్పీ వెంకటేశ్వర్లు, జిల్లా ఫైర్ అధికారి ధర్మారావు, డీఎంహెచ్ఓ డాక్టర్ నాగరాజు, సీపీఓ వెంకటరావు, డీపీఓ, పంచాయతీ రాజ్ ఎస్ఈ శ్రీనివాస్రెడ్డి, ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ రమణయ్య, డీటీసీ, ఆర్టీసీ అధికారులు, టీటీడీ, ఈఓిపీఆర్, పీఆర్ఓలు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఒంటిమిట్టలో 5 నుంచి బ్రహ్మోత్సవాలు 11న వైభవంగా కల్యాణోత్సవం జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి -
కుమార్తెను ఇంటికి పంపమన్నందుకు మామపై అల్లుడు దాడి
రాయచోటి టౌన్ : తన కుమార్తెను రంజాన్ పండగకు పుట్టింటికి పంపమన్నందుకు మామపై అల్లుడు దాడి చేసిన సంఘటన రాయచోటిలో శనివారం చోటుచేసుకొంది. బాధితుల కథనం మేరకు.. రాయచోటి పట్టణంలోని పాత రాయచోటికి చెందిన అజ్మత్ తన కుమార్తె తంజీమ్ను అదే ప్రాంతానికి చెందిన మహబూబ్బాషా కుమారుడు జుబేర్కు ఇచ్చి ఏడాది కిందట వివాహం చేశారు. పెళ్లిరోజున ఇచ్చిన బంగారు ఆభరణాలు అమ్మే శాడని ఇటీవల భార్య, భర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఇంతలో రంజాన్ పండగ రావడంతో అల్లుడు, కుమార్తె, బంధువులను పండగకు పిలిచేందుకు తన కుమార్తె ఇంటికి అజ్మత్ వెళ్లారు. వారు పంపేందుకు నిరాకరించడమేగాక అజ్మత్తో ఘర్షణ పడ్డారు. వాగ్వాదం పెరిగి అల్లుడి బంధువులు అజ్మత్పై దాడి చేసి గాయపరిచారు. పోలీసులకు ఫిర్యాదు చేశామని బాధితులు తెలిపారు. రైతు ఆత్మహత్య పుల్లంపేట : వ్యవసాయంలో నష్టాలు వచ్చి అప్పుల పాలైన రైతు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం తిప్పాయిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. తిప్పాయిపల్లి హరిజనవాడకు చెందిన దార్ల రఘురామయ్య (52)కు ప్రభుత్వం ఐదు ఎకరాలు భూమిని మంజూరు చేసింది. అరటి తోటన సాగు చేసి జీవనం కొనసాగిస్తున్నాడు. వాతావరణం అనుకూలించగా, ఆశించిన దిగుబడి రాకపోవడంతో అప్పులు పెరుగుతూ వచ్చాయి. దీంతో రూ.7లక్షలు అప్పుచేసి తీర్చలేక మనస్థాపం చెందారు. ఆదివారం విష ద్రావణం తాగి ఆత్మహత్యకు పాల్పడగా చికిత్స నిమిత్తం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అపస్మారక స్థితిలోకి చేరి సోమవారం తెల్లవారుజామున మృతి చెందాడు. మృతుడికి ముగ్గరు పిల్లలు ఉన్నారు. మృతుడి భార్య వరలక్ష్మీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైలు పట్టాలపై మృతదేహంరాజంపేట : నందలూరు–రేణిగుంట రైలు మార్గంలో హస్తవరం రైల్వే స్టేషన్ వద్ద సోమవారం 25 ఏళ్ల వయస్సు కలిగిన యువకుడి మృతదేహం స్థానికులు గుర్తించారు. రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వివరాలు తెలియాల్సి ఉంది. వృద్ధులకు గాయాలు ఓబులవారిపల్లె : మద్యం తాగి ఆకతాయిలు రాళ్లు విసరడంతో తేనెటీగలు లేచి ఆశ్రమంలో వృద్ధులపై దాడి చేశాయి. మండలంలోని పాపిరెడ్డిపల్లి గ్రామంలో జీవన జ్యోతి ఆనంద నిలయంలో ఆశ్రయం పొందుతున్న ఏడుగురు వృద్ధులకు స్వల్ప గాయాలయ్యాయి. ఆశ్రమం ప్రక్కనే చెట్టుపై తేనెపట్టు ఉండడం.. ఆకతాయిలు మద్యం తాగి రాళ్లతో కొట్టడంతో అవి వృద్ధులపై దాడి చేయడంతో దిక్కుతోచక వారంతా ఆందోళనకు గురయ్యారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. -
బ్రౌన్ భవన నిర్మాణ పనులు ప్రారంభించండి
కడప కల్చరల్ : సీపీ బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం నూతన భవన నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలని గ్రంథాలయ సలహా మండలి సభ్యులు జానుమద్ది విజయభాస్కర్ విజ్ఞప్తి చేశారు. విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలలో పాల్గొనేందుకు విచ్చేయనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు కడప నగరంలోని బ్రౌన్ గ్రంథాలయ నూతన భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేయాలనిలాయనకోరారు. 2023 డిసెంబర్లో నాటి ప్రభుత్వం రూ.6.87 కోట్ల నిధులు మంజూరు చేసిందని, పలు కారణాలతో ఆగిపోయాయని తెలిపారు. ముఖ్యమంత్రి చొరవచూపి భవన నిర్మాణం ప్రారంభమయ్యేలా చూడాలని కోరారు. కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరిని కలిసి విజ్ఞప్తి చేశారు. ఒంటిమిట్ట పోలీస్ స్టేషన్ తనిఖీ ఒంటిమిట్ట : ఒంటిమిట్ట పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ ఈజీ.అశోక్కుమార్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉమెన్స్ హెల్ప్ డెస్క్పై సిబ్బందికి సూచనలు చేశారు. మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. అనంతరం స్టేషన్ పరిసరాలు పరిశీలించి స్టేషన్ ఆవరణంతా పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పెండింగ్ కేసులు త్వరగా విచారించి పరిష్కరించాలని సూచించారు. సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని, కోదండరాముడి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేయాలని ఆయన ఆదేశించారు. మహిళపై హత్యాయత్నం విఫలంఖాజీపేట : మహిళను హత్య చేసేందుకు వచ్చిన దుండగులు.. ఆమె గట్టిగా కేకలు వేయడం, స్థానికులు రావడంతో పరారయ్యారు. పత్తూరు గ్రామంలో ఒకరిని, రైస్ మిల్లు వద్ద ఒకరిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన చోటు సోమవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.పుల్లూరు పంచాయతీ పరిధిలోని బంగ్లా సమీపంలో భాగ్య అనే మహిళ ఉంది.. ఆమె వడ్డీ వ్యాపారాలతో పాటు, రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా చేస్తోంది. ఆమెను హత్య చేసేందుకు రాత్రి వేళ సుమారు 10 మంది యువకులు ద్విచక్రవాహనాల్లో వచ్చారు. ఇంటి తాళం పగుల కొట్టే ప్రయత్నం చేశారు. వీరిని చూసిన భాగ్య కారు డ్రైవర్కు ఫోన్ చేసింది. గట్టిగా కేకలు వేసింది. దీంతో డ్రైవర్ శివ అక్కడికి చేరుకున్నాడు. స్థానికులు కర్రలు తీసుకుని దుండగులపై దాడికి ప్రయత్నిచారు. దీంతో వారు బైక్లు అక్కడే వదిలి పరారయ్యారు. డ్రైవర్ శివ ఒకరిని పట్టుకున్నారు. రైస్మిల్లు వద్ద మరొకరిని గ్రామస్తులు పట్టుకుని తీసుకొచ్చారు. వచ్చిన వారంతా అక్కడే బైక్లను వదిలి పరారైయ్యారు. దేహశుద్ధి పారిపోతున్న వారిలో ఒకరిని పత్తూరు గ్రామంలో, మరొకరిని రైస్ మిల్లు స్థానికులు పట్టుకున్నారు. దొరికిన వారు కత్తులు చూపి భయపెట్టే ప్రయత్నం చేశారు. దీంతో వారిని పట్టుకున్న తర్వాత ఎందుకొచ్చారని స్థానికులు ప్రశ్నించారు.చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు.. విషయం పోలీసులకు తెలియజేశారు. సమాచారం తెలుసుకున్న చెట్టుకు కట్టేసిన ఇద్దరిని అదుపులోకి తీసుకుని వారి వద్ద ఉన్న కత్తులను స్వాధీనం చేసుకున్నారు. అసలు ఎందుకు వచ్చారు.. హత్య కోసమేనా లేక ఇతర పనుల కోసం వచ్చారా అన్న విషయాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.● స్థానికులు రావడంతో పరారీ ● పత్తూరులో దొరికిన నిందితులు ● వారి వద్ద నుంచి కత్తులు స్వాధీనం -
మత సామరస్యానికి ప్రతీక కడప జిల్లా
కడప అర్బన్ : వైఎస్ఆర్ కడప జిల్లాలోని హిందూ, ముస్లిం సోదరులు కలిసిమెలిసి జీవిస్తూ మత సామరస్యానికి ప్రతీకగా జిల్లాను నిలిపారని జిల్లా ఎస్పీ ఈ.జీ అశోక్ కుమార్ పేర్కొన్నారు. స్థానిక ఉమేష్ చంద్ర స్మారక కల్యాణ మండపంలో ముస్లింలకు, పోలీస్ శాఖలోని ముస్లిం పోలీస్ అధికారులు, సిబ్బందికి రంజాన్ మాసం పురస్కరించుకుని ఆదివారం సాయంత్రం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అమీన్ పీర్ దర్గా ఇమామ్ ఇనాయతుల్లా ప్రత్యేక ప్రార్థన చేశారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఇఫ్తార్ విందు మత సామరస్యాన్ని చాటిందన్నారు. గతంలో కడప డీఎస్పీగా విధి నిర్వహణలో ఉన్నప్పుడు వినాయక చవితి, బక్రీద్, ఉగాది, రంజాన్ పండుగల సమయంలో హిందూ, ముస్లిం సోదరులు అందించిన సహకారం మరువలేనిదన్నారు. ఉగాది సందర్భంగా తాను దేవుని కడప ఆలయానికి వెళ్లినప్పుడు ముస్లింలు పూజలు నిర్వహించడం, అమీన్ పీర్ దర్గాను హిందువులు దర్శించుకోవడం కడప జిల్లా మత సామరస్య ఘనతకు నిదర్శనమన్నారు. అనంతపురం జిల్లాలోని గూగూడు కుళ్లాయి స్వామిని దర్శించుకున్నప్పుడు అక్కడ ముస్లిం సోదరులతో పాటు పెద్ద ఎత్తున హిందూ సోదరులు పూజలు చేయడం సామరస్యతకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచి భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిందన్నారు. జిల్లాలో సోదరభావం, సమైక్యత భావం మున్ముందు కూడా కొనసాగాలని ఆకాంక్షించారు. జిల్లా అదనపు ఎస్.పి (అడ్మిన్) కె.ప్రకాష్ బాబు మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు ఆచరించే ముస్లిం సోదరులకు ఇచ్చే ఇఫ్తార్ విందు లాంటి కార్యక్రమాలు ప్రజలలో సోదర భావాన్ని పెంపొందిస్తాయన్నారు. ముస్లిం ప్రముఖులు మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వం ఉండటం మన దేశ గొప్పతనమని, అందువల్లే ప్రపంచ దేశాలు దేశ కీర్తి ప్రతిష్టలను కొనియాడారు. కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ బి.రమణయ్య, నగరంలోని ముస్లిం ప్రముఖులు, వన్ టౌన్ సి.ఐ రామకృష్ణ, టూ టౌన్ సి.ఐ నాగార్జున, చిన్నచౌకు సి.ఐ ఓబులేసు, ఆర్ఐలు వీరేష్, శ్రీశైల రెడ్డి, శివరాముడు, చిన్నచౌకు ఎస్.ఐ రాజరాజేశ్వర రెడ్డి, టూ టౌన్ ఎస్.ఐ ఎస్.కె.ఎం హుస్సేన్, రిమ్స్ ఎస్.ఐ జయరాముడు, పోలీస్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు దూలం సురేష్, పోలీస్ సిబ్బంది, నగరంలోని ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ ఈ.జి. అశోక్ కుమార్ -
శ్రీ సోమేశ్వరుడి సేవలో జిల్లా జడ్జి
కడప కల్చరల్ : కడప నగరం దేవుని కడపలోని శ్రీ సోమేశ్వరస్వామిని ఆదివారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీదేవి, రామారావు దంపతులు దర్శించుకున్నారు. ఉగాది పండుగ సందర్భంగా వారు కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి విచ్చేశారు. ఆలయ ఏఓ శ్రీధర్ వారికి స్వాగతం పలికారు. ఆత్మహత్యకు యత్నించిన మహిళ మృతికడప అర్బన్ : కడప నగరం అక్కాయపల్లిలో నివాసం ఉంటున్న లక్ష్మిదేవి(32) అనే మహిళ కడప రిమ్స్లో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందినట్లు తాలూకా సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. సీఐ వివరాల మేరకు కర్నూలు జిల్లా దేవనకొండ మండలం బండపల్లి గ్రామానికి చెందిన వడ్డే లక్ష్మీదేవి (32), తన భర్త రాముడుతో కలిసి ఏడాదిన్నర క్రితం జీవనోపాధి కోసం కడపకు వచ్చారు. . ఏడాది నుంచి ఆమె కడుపు నొప్పితో బాధపడుతుండేది. శనివారం రాత్రి కడుపునొప్పి రావడంతో భర్త మాత్రలు తెచ్చేందుకు బయటకు వెళ్లాడు. అంతలోనే ఆమె విషద్రావణం తాగింది. భర్త గమనించి రిమ్స్కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. -
వైభవంగా బలిజపల్లె గంగమ్మ జాతరకు అంకురార్పణ
రాజంపేట టౌన్ : ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో బలిజపల్లె గంగమ్మ జాతర రెండో పెద్ద జాతరగా ప్రసిద్ధిగాంచింది. ఏప్రిల్ 3వ తేదీ జరగనున్న గంగమ్మ జాతరకు ఆదివారం రాత్రి నిర్వాహకులు అంకురార్పణ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. అంకురార్పణ వేడుకను తిలకించేందుకు పట్టణ వాసులే కాక వివిధ గ్రామాల నుంచి కూడా భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. దీంతో బలిజపల్లెలో స్వయంభుగా వెలసిన గంగమ్మ ప్రాంగణం భక్తజనంతో నిండిపోయింది. గంటకు పైగా పూజలు గంగమ్మ జాతర అంకురార్పణ వేడుక సందర్భంగా నిర్వాహకులు గంగమ్మ స్వయంభుకు గంటకు పైగా పూజలు నిర్వహించారు. తొలుత అమ్మవారి స్వయంభును పుష్పాలతో అలంకరించారు. ఒకవైపు పూజా కార్యక్రమాలు జరుగుతుండగా, మరోవైపు తప్పెట్ల దరువులు, కొమ్ము ఊదడం, గంగమ్మ ఆవహించిన భక్తులు ఊగిపోవడం చూసి భక్తులు ఆనందపరవశులయ్యారు. జాతర అంకురార్పణకు ప్రధాన ఘట్టమైన పోతు మెడలో దండ పడగానే భక్తులు పెద్దఎత్తున చప్పట్లు చరించి, ఈలలు, కేకలు వేయడంతో బలిజపల్లె గ్రామం దద్దరిల్లింది. ప్రతి ఏడాది అంకురార్పణకు వేలాది మంది భక్తులు తరలి వస్తారు. దీంతో తోపులాటలు జరిగేవి. అయితే ఏఎస్పీ మనోజ్ రామ్నాథ్ హెగ్డే చొరవ తీసుకోవడంతో ఈఏడాది తోపులాటలు వంటివి జరగకుండా అర్బన్ సీఐ రాజ, ఎస్ఐ ప్రసాద్రెడ్డి చర్యలు తీసుకున్నారు. గంగమ్మ స్వయంభు ప్రాంగణం చుట్టూ రోప్ ఏర్పాటు చేసి తోపులాటలకు చెక్ పెట్టారు. వేలాదిగా తరలి వచ్చిన భక్తులు -
ఉగాది పురస్కారాలు అందుకున్న జిల్లా వాసులు
కడప కల్చరల్ : విశ్వావసు నామ సంవత్సర ఉగాది పురస్కారాలను ఆదివారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ముఖ్యమంత్రి చంద్రబాబు అందజేశారు. ఆయనతోపాటు రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్, దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, అవధాని మాడగుల నాగఫణిశర్మ తదితరులు ఈ పురస్కారాలను కళాకారులకు అందజేశారు. కడప నగరానికి చెందిన డాక్టర్ చింతకుంట శివారెడ్డి, మొగిలిచెండు సురేష్, బద్వేలుకు చెందిన విద్వాన్ గానుగపెంట హనుమంతరావు, ప్రొద్దుటూరు వాసి జింకా సుబ్రమణ్యం, సాహిత్య విభాగంలో ఉగాది పురస్కారాలను అందుకున్నారు. నిర్వాహకులు వారికి తెలుగు తల్లి విగ్రహం, రూ.10 వేలు చెక్కు అందజేసి ఘనంగా సత్కరించారు. రైతు పండింటి కృష్ణమూర్తికి.. కడప అగ్రికల్చర్ : కడప నగర శివార్లలోని ఊటుకూరు కృషి విజ్ఞానకేంద్రం, ఏరువాక కేంద్రం అభ్యుదయ రైతు పండింటి కృష్ణమూర్తి ఉగాది పురస్కారం అందుకున్నారు. వ్యవసాయ సాగులో ఆచరిస్తున్న వినూత్న పద్ధతులకు గుంటూరు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం వారు 2024 సంవత్సరానికి రాయలసీమ ప్రాంతం తరపున ఎంపిక చేశారు. ఉగాది పండుగలను పురస్కరించుకుని ఆదివారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర ఉగాది వేడుకల్లో రైతు పండింటి కృష్ణమూర్తికి ముఖ్యమంత్రి చంద్రబాబు జ్ఞాపిక, ప్రశంసాపత్రంతోపాటు రూ. 5 వేలు నగదు పురస్కారంతో సత్కరించారు. వేంపల్లి షరీఫ్కు..వేంపల్లె : వేంపల్లె పట్టణానికి చెందిన ప్రముఖ కథా రచయిత డాక్టర్ వేంపల్లె షరీఫ్ ఆదివారం ఉదయం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఉగాది పురస్కారాన్ని అందుకున్నారు. పదివేల రూపాయల నగదు, శాలువా, మెమెంటోతో ముఖ్యమంత్రి ఆయనను సన్మానించారు. షరీఫ్ రెండున్నర దశాబ్దాలుగా సాహిత్య రంగంలో ఉన్నారు. ముఖ్యంగా కథా రచనలో కృషి చేస్తున్నారు. ఇప్పటికే ఆయన నాలుగు కథా సంపుటాలు వెలువరించారు. మరో మూడు కథా సంకలనాలకు సంపాదక బాధ్యతలు నిర్వర్తించారు. శ్రీరామ్కుమార్ శర్మకు.. పులివెందుల టౌన్ : ఉగాది సందర్భంగా ఆదివారం కడప కలెక్టరేట్ సభా మండపంలో జరిగిన ఉగాది సంబరాల్లో పులివెందులకు చెందిన వేద పండితుడు, పురోహితుడు, పంచాంగం రామ్కుమార్ శర్మకు పురస్కారం ప్రదానం చేశారు. కార్యక్రమంలో శాసన సభ్యులు నంద్యాల వరదరాజులరెడ్డి, పుట్టా సుధాకర్, యాదవ్, కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, దేవదాయ శాఖ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
కూటమి ప్రభుత్వంలో దళిత, మైనార్టీలకు రక్షణ లేదు
కడప కార్పొరేషన్ : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళితులు, మైనార్టీలకు రక్షణ లేకుండా పోయిందని దళిత ఫోరం జిల్లా చైర్మన్ కిషోర్ బూసిపాటి అన్నారు. ఆదివారం నగరంలోని తన కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పాస్టర్ పగడాల ప్రవీణ్ అనుమానాస్పద రీతిలో మృతి చెందితే కేసు నమోదు విషయంలోనూ, పోస్టుమార్టం చేసే సమయంలోనూ పోలీసులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. అతన్ని అత్యంత దారుణంగా హత్య చేసిన ఆనవాళ్లు ఉన్నప్పటికీ సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు వేగంగా చర్యలు తీసుకోవడంలో విఫలయ్యారన్నారు. దీన్నిబట్టే రాష్ట్రంలో క్రిష్టియన్ మైనార్టీలు స్వేచ్ఛగా, స్వతంత్రంగా తిరిగే పరిస్థితి లేదని అర్థమవుతోందన్నారు. పగడాల ప్రవీణ్ తనకు ప్రాణహాని ఉందని చాలా రోజులుగా చెబుతున్నా ఆయనకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. హత్యపై అన్ని జిల్లాల్లో నిరసనలు వ్యక్తమవుతుంటే సీఎం చంద్రబాబుగానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్గానీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో బీజేపీకి స్తంభాలైన భజరంగ్దళ్, ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్ సిద్ధాంతాలు అమలవుతుండటం వల్ల మైనార్టీలు, క్రిష్టియన్లకు రక్షణ కరువవుతోందన్నారు. ప్రవీణ్ హత్య కేసులో వాస్తవాలు వెలుగులోకి రావాలంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత అంబేడ్కర్ సేన రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యుడు పెంచలయ్య పాల్గొన్నారు. -
సామాజిక అడవిలో మంటలు
కమలాపురం : మండలంలోని రామచంద్రాపురం సమీపంలో ఉన్న సామాజిక అటవీ ప్రాంతంలో ఆదివారం రాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ అటవీ ప్రాంతంలో ఎక్కువగా ఉన్న తాటి చెట్ల నుంచి తాటి పట్టలు రాలి పోయి ఎండిపోయాయి. గుర్తు తెలియని ఆకతాయిలు వాటికి నిప్పు పెట్టడంతో మంటలు ఎగిసి పడుతూ చుట్టు పక్కలకు వ్యాపించాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది ఫైరింజన్తో హుటా హుటిన సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. -
జిల్లా పోలీస్ కార్యాలయంలో ఉగాది సంబరాలు
కడప అర్బన్ : తెలుగు నూతన సంవత్సరాది శ్రీ విశ్వావసు నామ ఉగాది పండుగ సంబరాలను కడపలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. సంప్రదాయ దుస్తుల్లో జిల్లా ఎస్పీ ఈ.జీ అశోక్ కుమార్, అదనపు ఎస్పీ (అడ్మిన్) కె. ప్రకాష్ బాబు, పోలీస్ అధికారులు, సిబ్బంది విచ్చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఉగాది ప్రత్యేక పూజల్లో పాల్గొని ఉగాది పచ్చడి, మిఠాయిలు అందజేశారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఉత్సాహ భరిత వాతావరణంలో ఉగాది సంబరాలు జరిపారు. జిల్లా ప్రజలకు, సిబ్బందికి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏ.ఆర్ అదనపు ఎస్పీ శ్రీ బి. రమణయ్య, ఆర్.ఐ లు ఆనంద్, వీరేష్, శ్రీశైల రెడ్డి, శివరాముడు, ఆర్.ఎస్.ఐ లు, పోలీస్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు దూలం సురేష్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉప్పు శంకర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
ఉన్నత స్థానాలను అధిరోహించాలి
ట్రిపుల్ ఐటీ ఏఓ రవి కుమార్ కమలాపురం : ప్రతి విద్యార్థి గురువులు చెప్పే పాఠాలు విని అవగాహన చేసుకుని మంచి ఫలితాలు సాధించి జీవితంలో ఉన్నత స్థానాలను అధిరోహించాలని ట్రిపుల్ ఐటీ ఆర్కే వ్యాలీ ఇడుపులపాయ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ రవి కుమార్ తెలిపారు. ఆదివారం మండలంలోని భారతి సిమెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ (బీసీసీపీఎల్)లోని డీఏవీ భారతి విద్యా మందిర్ 6వ వార్షికోత్సవ వేడుకలను బీసీసీపీఎల్ సీఎంఓ సాయి రమేష్ పర్యవేక్షణలో ప్రిన్సిపల్ కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ట్రిపుల్ ఐటీ ఏఓ మాట్లాడుతూ విద్యార్థులు ముఖ్యంగా ఏరోజు చెప్పిన పాఠాలను అదే రోజు చదివి అవగాహన చేసుకుని అత్యుత్తమ ఫలితాలు సాధించాలన్నారు. ప్రతి విద్యార్థి లక్ష్యాన్ని నిర్దేశించుకుని దాని సాధనకు కృషి చేయాలన్నారు. జీవితంలో ప్రతి ఒక్కరూ ఉన్నత స్థానాలను అధిరోహించాలన్నారు. వేంపల్లె ఎంఈఓ జాఫర్ సాదిక్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు చెప్పే పాఠాలన్నీ శ్రద్ధగా విని మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని, అప్పుడే తల్లిదండ్రులకు, పాఠశాలకు, గ్రామాలకు మంచి పేరు ప్రతిష్టలు వస్తాయన్నారు. విద్యార్థులు కష్టపడి కాకుండా, ఇష్టపడి చదవాలన్నారు. కోర్ అడ్వైజరీ సుబ్బులక్ష్మీ సాయి రమేష్ మాట్లాడుతూ డీఏవీ భారతి విద్యా మందిర్ ఇటు విద్యలోనూ, అటు క్రీడా పోటీల్లోనూ రాణిస్తోందని, అందుకు కృషి చేస్తున్న ప్రిన్సిపల్ కిషోర్ కుమార్ను అభినందించారు. అలాగే డీఏవీ రీజనల్ ఆఫీసర్ వీఎన్ఎన్కే శేషాద్రి, చీఫ్ మేనేజర్ గోపాల్రెడ్డి, ఐఆర్పీఆర్ చీఫ్ భార్గవ్ రెడ్డి తదితరులు మాట్లాడారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. వివిధ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. -
రోజుకు 4 లీటర్ల నీరు తాగాలి
కలకడ : వేసవిలో వృద్ధులు, చిన్నారులకు, గర్భిణులు, బాలింతలకు ఎక్కువగా వడదెబ్బ తగిలే అవకాశం ఉందని వైద్యులు తెలియజేస్తున్నారు. ఈసమయంలో మంచినీరును అధికంగా తీసుకుని, కొన్ని ఆరోగ్య సూత్రాలు పాటిస్తే వేడిమి నుంచి ఉపశమనం పొందొచ్చని కలకడ పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ మల్లికార్జున సూచిస్తున్నారు. ప్రతి వ్యక్తి రోజుకు నాలుగు లీటర్ల నీరు తాగడం చాలా అవసరం. ప్రతి 2గంటలకు అరలీటరు నీటిని విధిగా తాగాలి. భోజనం తినే సమయంలో తక్కువగా..అరగంట ఆగిన తర్వాత ఎక్కువ నీరు తాగాలని తెలియజేస్తున్నారు. -
ప్రజల జీవితాల్లో కాంతి నింపాలి
కడప సెవెన్రోడ్స్ : శ్రీ విశ్వావసు నామ తెలుగు నూతన సంవత్సరం జిల్లా ప్రజల జీవితాల్లో ఉషస్సు నింపాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆకాంక్షించారు. ఆదివారం కలెక్టరేట్ సభా భవనంలో దేవదాయ ధర్మాదాయశాఖ, పర్యాటక శాఖ సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కొత్త సంవత్సరంలో అందరికీ పరిపూర్ణమైన ఆరోగ్యం సిద్ధించాలన్నారు. వర్షాలు సంవృద్ధిగా కురిసి పల్లె సీమలు పాడి పంటలతో సుభిక్షంగా కళకళలాడాలని అభిలషించారు. అన్ని రంగాలకు శుభసూచికం : విద్వాన్ సొట్టు జ్యోతిష్య శాస్త్ర ప్రకారం శ్రీ విశ్వావసు నామ సంవత్సరం అన్ని రంగాల వారికి శుభసూచికమని సంస్కృతాంధ్ర సాహితీ పురాణ పండిట్ విద్వాన్ సొట్టు సాంబమూర్తి అన్నారు. ఆయన పంచాగ పఠనం చేస్తూ విశ్వావసు నామ సంవత్సరం అంటే విశ్వానికి సంబంధించిందన్నారు. ఈ ఏడాది కరువు కాటకాలు ఉండవని... పంటలు బాగా పండేలా వాతావరణం అనుకూలిస్తుందన్నారు. ఉగాది పచ్చడిలోని షడ్రుచులు జీవితంలో ఎదురయ్యే వివిధ అనుభవాలకు సంకేతాలన్నారు. కొత్త ఏడాదిలో అడుగు పెట్టిన వారంతా మంచి, చెడు ప్రతి అనుభవాన్ని సమానంగా స్వీకరిస్తూ ముందుకు వెళ్లాలన్నదే ఉగాది పచ్చడి తినడం వెనుక ఉన్న పరమార్థమని వివరించారు. అనంతరం రాశిఫలాల గురించి చదివి వినిపించారు. నలుగురు పండితులకు ఉగాది పురస్కారాలు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది వేద పండితులు, అర్చకులు, కవులకు అందించే ఉగాది పురస్కారాలు ఈ యేడు జిల్లాకు చెందిన నలుగురికి వచ్చాయి. ప్రొద్దుటూరుకు చెందిన శ్రీనివాసాచార్యులు, పులివెందులకు చెందిన కలుబండి రామకుమార్శర్మ, కడపకు చెందిన గోపాలకృష్ణశర్మ, సొట్టుసాంబమూర్తిలకు దేవాదాయశాఖ ద్వారా ఒక్కొక్కరికి రూ. 10,116 పారితోషికం, ప్రశంసాపత్రం అందజేసి కలెక్టర్ శ్రీధర్ ఘనంగా సత్కరించారు. అనంతరం ఉత్తమ అర్చకులు ఎస్.నరసింహా భట్టార్, బి.చంద్రమౌళిశర్మ, ఎన్.శశిధర్లకు కలెక్టర్ ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్, డీఆర్వో విశ్వేశ్వరనాయుడు, దేవదాయశాఖ సహాయ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్, పర్యాటకశాఖ అధికారి సురేష్ పాల్గొన్నారు. అలరించిన నృత్య ప్రదర్శనలు ఉగాది వేడుకల సందర్భంగా ముద్ర అకాడమి లహరి బృందం చిన్నారులు ప్రదర్శించిన శాసీ్త్రయ నృత్య ప్రదర్శనలు ఆహుతులను అలరించాయి. అనంతరం వారిని కలెక్టర్ సత్కరించారు. పర్యాటకశాఖ ఆధ్వర్యంలో ఆచార్య మూల మల్లికార్జునరెడ్డి అధ్యక్షతన కవి సమ్మేళనం జరిగింది. చిన్నారి నృత్య ప్రదర్శన కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి కలెక్టరేట్లో ఘనంగా ఉగాది వేడుకలు -
ఎండలు అదరగొడుతున్నాయి. పొగలు కక్కుతున్న భానుడి దెబ్బకు రోడ్లపై సెగలు పుడుతున్నాయి. గతేడాదితో పోలిస్తే సీజన్ ప్రారంభంలోనే ఎండలు చురుక్కుమంటున్నాయి. మార్చి మొదటి వారంలోనే వేడెక్కిన సూరీడు.. నెల దాటేసరికి నిప్పులు కక్కుతున్నాడు. వెరసి జనాలు అల్లాడుతున్నారు.
పులివెందుల రూరల్ : పది రోజులుగా ఎండల ప్రభావం తీవ్రంగా ఉండడంతో ప్రజలు బయటకు రావాలంటేనే భయంతో జంకుతున్నారు. ఎండ తీవ్రతకు గురై చాలా మంది అనారోగ్య సమస్యలతో ఆసుపత్రుల పాలవుతున్నారు. ఎండలో తిరగడంవల్ల జ్వరాలతోపాటు దగ్గు, జలుబు ప్రజలను ఇబ్బందులు పెడుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా వేసవి కాలంలో కూడా దగ్గు, జలుబు, జ్వరాలు రావడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే ఏప్రిల్, మే నెలల్లో ఎలా ఉంటుందోనని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. వడదెబ్బ నివారణకు అప్రమత్తతే ముఖ్యం ఎర్రగుంట్ల : ఎండ తీవ్రత అధికమైంది, ప్రస్తుతం జిల్లాలో 40–42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి. ఎండలో ఎక్కవగా గడిపితే డీహైడ్రేషన్(శరీరంలో నీటి శాతం తగ్గడం) డయేరియా(విరేచనాలు) తదితర సమస్యలతో ఇబ్బంది పడే అవకాశముంది. ఈ నేపథ్యంలో వడదెబ్బ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఎర్రగుంట్ల, చిలంకూరు పీహెచ్సీ వైద్యాధికారులు తెలియజేశారు. ప్రజలు వేసవిలో వీలైనంతగా పని చేయకుండా ఉండడం మంచిదని సూచిస్తున్నారు. ఉదయం సాయంత్రం మాత్రమే ప్రజలు పనులు చేసుకోవడం మేలు. ఎండలో ఎక్కువ సేపు పనిచేస్తే చర్మం పొడి బారడం, కళ్లు ఎరుపెక్కడం, ఒళ్లు మంటలు, నొప్పులు వస్తాయి, ఒక్కోసారి అపస్మారక స్థితిలోకి వేళ్లే అవకాశం ఉంది. నిర్మానుష్యంగా కడప కృష్ణా సర్కిల్ వేడెక్కిన సూరీడు.. ‘ఉక్క’రిబిక్కిరవుతున్న జనాలు అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు -
ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు
– కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి పులివెందుల : జిల్లాలో ని ముస్లిం సోదరులకు కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.నెలరోజులపాటు కఠోర ఉపవాస దీక్షలతో పాటు ప్రత్యేక ప్రార్థనలు, దాతృత్వానికి ప్రాధాన్యత ఇచ్చారని పేర్కొన్నారు. రంజాన్ పండుగను కలిసికట్టుగా ఆనందంగా జరుపుకోవాలని.. అందరికీ శుభాలు అందాలని మనసారా ఆకాంక్షించారు. రాయచోటి వాసికి అవార్డు రాయచోటి టౌన్ : ఒడిశా పోలీసు శాఖ అందించే ప్రతిష్టాత్మకమైన డీజీపీ డిస్క్ అవార్డును రాయచోటి పట్టణానికి చెందిన గుండాల రెడ్డిరాఘవేంద్ర (ఐపీఎస్) అందుకోనున్నారు.ఆయన ప్రస్తుతం ఒడిశాలోని నౌపాడా జిల్లా ఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. 2024–25 సంవత్సరానికి అవార్డును అందుకోవడానికి ఎంపికై న పోలీసు సిబ్బంది పేర్లను ఒడిశా పోలీసు రాష్ట్ర ప్రధాన కార్యాలయం ప్రకటించింది. చలపతిని ఎన్కౌంటర్ చేయడంలో ప్రధాన పాత్ర పోషించడంతో పాటు నక్సల్స్ వ్యతిరేక కార్యకలాపాలను నియంత్రించడంలో కృషి చేసినందుకు అవార్డు అందుకోనున్నారు. అవార్డు గ్రహీతలను 2025 ఏప్రిల్ 1న పోలీసు నిర్మాణ దినోత్సవం సందర్భంగా సత్కరించనున్నట్లు రెడ్డిరాఘవేంద్ర తెలిపారు. ప్రశ్నిస్తే ప్రాణాలు తీస్తారా? కమలాపురం : ప్రశ్నిస్తే ప్రాణాలు తీస్తారా? అని కమలాపురం మండల పాస్టర్ల అసోసియేషన్ అధ్యక్షుడు ప్రభుదాస్ మండిపడ్డారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతిపై కమలాపురం పాస్టర్ అసిసోయేషన్, పట్టణ క్రైస్తవ సంఘాల ఐక్యతతో ఆదివారం శాంతి ర్యాలీ నిర్వహించారు. గ్రామ చావడి నుంచి క్రాస్ రోడ్డు వరకు ర్యాలీ సాగింది. అనంతరం క్రాస్ రోడ్డు వద్ద కొవ్వొతులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సంధర్భంగా ప్రభుదాస్ మాట్లాడుతూ ప్రశ్నిస్తే ప్రాణాలు తీస్తారా? అని ప్రశ్నించారు. ముఖ్యంగా పాస్టర్లపై జరుగుతున్న దాడులను అరికట్టాలన్నారు. పాస్టర్లకు ప్రభుత్వాలు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. పాస్టర్ ప్రవీణ్ మృతి వెనుక ఎవరున్నారో నిగ్గు తేల్చాలన్నారు. కారకులను పట్టుకుని కఠినంగా శిక్షించాలన్నారు. సెక్రటరీ సునీల్దత్, వివిధ చర్చీల పాస్టర్లు పాల్ కుమార్, డేవిడ్ రాజ్, పి. రాజు, విజయ్, సురేంద్ర పాల్, స్టీఫెన్, శౌరీ, హెప్సిబా, రాజ్ కుమార్, జయరాజ్, పి.సామ్యూల్, టిపిఎం బ్రదర్, మనోహర్, అరుల్ ప్రసాద్, యు. సాల్మన్, ఐక్యతరావ్ తదితరులు పాల్గొన్నారు. -
బైకును ఢీకొన్న కారు.. దంపతులు మృతి
కొండాపురం : మండల కేంద్రంలోని తాడిపత్రి– కడప జాతీయ రహదారిలో శనివారం ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొనడంతో దంపతులు మృతి చెందారు. ఎస్ఐ విద్యాసాగర్ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కొండాపురం మండలంలోని ముచ్చుమర్రి గ్రామానికి చెందిన తూర్పింటి రామ్మోహన్(45), సరోజ(40) దంపతులు పాల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించేవారు. కొండాపురం నుంచి వారు తెల్లవారుజామున తాడిపత్రి వైపు ముచ్చుమర్రి గ్రామానికి ద్విచక్రవాహనంలో వెళ్తుండగా.. కొండాపురంలోని జాతీయ రహదారిలో కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో వారిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను వెంటనే 108 వాహనంలో తాడిపత్రిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సరోజను వైద్యుడు పరిశీలించి మృతి చెందినట్లు తలిపారు. రామ్మోహన్ను మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. భార్యాభర్తలు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు దుఃఖ సాగరంలో మునిగారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
వైఎస్ కుటుంబ సహకారంతోనే జెడ్పీ చైర్మన్ స్థాయికి..
చక్రాయపేట : వైఎస్ కుటుంబ సహకారంతోనే తాను జెడ్పీ చైర్మన్ స్థాయికి ఎదగానని జెడ్పీ చైర్మన్ ముత్యాల రామగోవిందరెడ్డి పేర్కొన్నారు. జెడ్పీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేశాక ఆయన కుటుంబ సభ్యులతో కలిసి గండి క్షేత్రానికి విచ్చేశారు. ఈ సందర్భంగా వారికి ఆలయ చైర్మన్ కావలి కృష్ణతేజ, జెడ్పీటీసీ తాటిగొట్ల శివప్రసాదరెడ్డి ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు కేసరి, రాజారమేష్ పూర్ణ కుంభంతో స్వాగతం పలికి, ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం ఆలయ ఆవరణలో భక్తుల సౌకర్యార్థం రూ.2 లక్షల లీటర్ల సామర్థ్యంతో ఓహెచ్ఎస్ఆర్ మంజూరు చేయాలని జెడ్పీ చైర్మన్కు ఆలయ చైర్మన్, జెడ్పీటీసీ వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ బాలయ్య, ఏపీ ఆగ్రోస్ మాజీ అధ్యక్షుడు నందారపు చెన్నకృష్ణారెడ్డి, చక్రాయపేట, వీరపునాయునిపల్లె ఎంపీపీలు మాధవీ బాలకృష్ణ, రమణారెడ్డి, వేముల, కమలాపురం జెడ్పీటీసీలు బయపురెడ్డి, సుమిత్ర రాజశేఖరరెడ్డి, ఎంపీటీసీ మోహన్రెడ్డి, వైఎస్ఆర్సీపీ నేతలు సంబటూరు ప్రసాదరెడ్డి, ఈశ్వరరెడ్డి, శంకర్రెడ్డి, నరసింహారెడ్డి, సుధాకర్రెడ్డి, రామ్మోహన్రెడ్డి, రామచంద్రారెడ్డి, హరినాథ్, శ్రీనివాసులరెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ రామగోవిందరెడ్డి -
‘లోక్ అదాలత్’ సేవలు సద్వినియోగం చేసుకోండి
కడప అర్బన్ : జిల్లాలోని ప్రజలు శాశ్వత లోక్ అదాలత్, పబ్లిక్ యుటిలిటీ సేవలు సద్వినియోగం చేసుకోవాలని కడప శాశ్వత లోక్ అదాలత్, పబ్లిక్ యుటిలిటీ సేవల చైర్మన్ స్వర్ణ ప్రసాద్ తెలిపారు. శనివారం జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.శ్రీదేవి, జిల్లా న్యాయసేవాధికారసంస్థ సెక్రటరీ, జడ్జి ఎస్.బాబా ఫకృద్దీన్ ఆధ్వర్యంలో కడపలోని జిల్లా కోర్టు ఆవరణలో ‘పారా లీగల్ వలంటీర్లు, పర్మినెంట్ లోక్ అదాలత్ ఉద్యోగులకు శాశ్వత లోక్ అదాలత్, పబ్లిక్ యుటిలిటీ సేవలు, సామర్థ్యం, పెంపుదల, శిక్షణ అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ మాట్లాడుతూ ఈ లోక్ అదాలత్లు సంబంధిత జిల్లా ప్రధాన కార్యాలయంలో న్యాయసేవాసదన్ భవన సముదాయాలలో పని చేస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయసేవాధికార సంస్థ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కాలిపోయిన కారు.. తప్పిన ప్రమాదం ప్రొద్దుటూరు క్రైం: మండలంలోని తాళ్లమాపురం గ్రామ సమీపంలో కారు దగ్ధమైంది. తాళమాపురం గ్రామానికి చెందిన నాగార్జున శనివారం ఉదయం కారులో పొద్దుటూరుకు వెళ్లాడు. పని ముగించుకుని రాత్రి పొద్దుటూరు నుంచి కారులో తాళ్లమాపురం గ్రామానికి బయలుదేరాడు. గ్రామ సమీపంలోకి రాగానే కారులోని ఏసీ లోంచి పొగలు వచ్చాయి. అప్రమత్తమైన నాగార్జున వెంటనే కారును ఆపి దిగిపోయాడు. అతను కారు దిగి పక్కకు వెళ్లిన క్షణాల్లోనే మంటలు వ్యాపించడంతో కారు పూర్తిగా కాలిపోయింది. నాగార్జున అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేశారు. -
నేటి నుంచి పెద్ద పీరయ్య ఆరాధనోత్సవాలు
బ్రహ్మంగారిమఠం : కాలజ్ఞాన ప్రభోదకర్త శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి ప్రథమ శిష్యుడు దూదేకుల సిద్దయ్యస్వామి పెద్ద కుమారుడు పెద్దపీరయ్యస్వామి ఆరాధన మహోత్సవాలు ఆదివారం ప్రారంభం కానున్నాయి. ముడుమాలలోని సిద్దయ్యమఠంలో ఏటా ఉగాది సందర్భంగా ఈ ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఆదివారం నుంచి రెండు రోజుల పాటు జరగనున్నాయి. ఇందుకోసం ప్రస్తుత మఠాధిపతులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆదివారం ఉదయం 10 గంటలకు పెద్దపీరయ్యస్వామికి పూలపూజ కార్యక్రమం నిర్వహించనున్నారు. బి.మఠం మండలం గొడ్లవీడు గ్రామానికి చెందిన కనపర్తి నాగిరెడ్డి, కనపర్తి సిద్దారెడ్డిల జ్ఞాపకార్థం వారి కుమారులు రాత్రి గ్రామోత్సవం ఏర్పాటు చేస్తారు. ఉదయం నుంచి రాత్రి వరకు భక్తులకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారు. భజనలు, డ్రామాలు, చిన్నాయపల్లె గ్రామస్తుల ఆధ్వర్యంలో సినీ పాటకచేరి, కోలాటాలు వంటి కార్యక్రమాలు రాత్రి ఉత్సాహ భరితంగా జరుగుతాయి. 31న బండలాగుడు పోటీలు 31న (సోమవారం) మధ్యాహ్నం 2 గంటల నుంచి బండలాగుడు పోటీలు ఉంటాయి. ప్రథమ బహుమతి జౌకుపల్లెకు చెందిన ముత్యాల పిచ్చిరెడ్డి జ్ఞాపకార్థం ఆయన కుమారుడు జెడ్పీ చైర్మన్, బి.మఠం జెడ్పీటీసీ ఎం.రామగోవిందరెడ్డి రూ.1,00,116లు, రెండవ బహుమతి గొడ్లవీడు గ్రామం కనపర్తి రామసుబ్బారెడ్డి కుటుంబ సభ్యులు, సింగల్ విండో అధ్యక్షుడు నేలటూరు సుబ్బారెడ్డి రూ.70,116లు, మూడవ బహుమతి ముడుమాల గ్రామం కొనకొండు ఆచారి కొండయ్య కుమారులు రూ.45,116లు, నాలుగో బహుమతి బసిరెడ్డి దుగ్గిరెడ్డి రూ.30,116లు, 5వ బహుమతి సిద్దయ్యమఠం నిర్వాహకులు రూ.15,116లు ప్రదానం చేయనున్నా రు. 16 మనుముల గుండు ఎత్తిన వారికి ప్రథమ బహుమతి జౌకుపల్లె గ్రామస్తులు రూ.25,116, రూ.2,016, రూ.1,116, 13 మనుముల గుండు ఎత్తిన వారికి బహుమతులు ఇవ్వనున్నారు. ఉత్సవాలను తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచి కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక నుంచి కూడా భక్తులు రానున్నారు. -
● చంద్రకాంతిలో కలువ సోయగం
సాధారణంగా సూర్యకాంతిలో వికసించే అనేక పువ్వులు మనకు తెలుసు, రాత్రిపూట వికసించే కొన్ని పువ్వులు కూడా ఉన్నాయి. వింతలు, విశేషాలకు ప్రకృతి నెలవు. సిద్దవటంలోని అటవీఽశాఖ కార్యాలయంలో రాత్రిపూట చంద్రకాంతిలో కలువపువ్వు వికసించి అందరినీ అబ్బురపరిచింది. సాధారణంగా కలువ పూలు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపు వికసిస్తాయి. కానీ ముదురు ఎరుపు లేదా గులాబీ లేదా ఊదా రంగులో ఉండే ఈ నీటి కలువ.. శనివారం సాయంత్రం సంధ్యా సమయంలో వికసించింది. నీటిలో తేలియాడే ఈ అందమైన ప్రకాశవంతమైన పువ్వు చీకటి నేపథ్యంలో చాలా మర్మంగా కనిపిస్తుంది. 6 నెలల కిందట 8 రకాల కలువ పువ్వులను వివిధ ప్రదేశాల నుంచి తెప్చించి కార్యాలయం ఆవరణంలో మూడు తొట్లలో నాటామని సిద్దవటం రేంజన్ కళావతి తెలిపారు. రాత్రి పూట వికసిస్తూ కనువిందు చేస్తోందని ఆమె చెప్పారు. – సిద్దవటం ధూమపాన డ్రైవర్పై సస్పెన్షన్ వేటుఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం క్షేమకరమని ప్రజలు భావించి, ఇష్టపడుతుంటారు. ఇటువంటి సందర్భంలో డ్రైవర్లు, కండెక్టర్లు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. అయితే శనివారం తెల్లవారుజామున కడప నుంచి విజయవాడకు వెళ్తున్న బస్సులో.. డ్రైవర్ ఎ.రామమోహన్ విధి నిర్వహణలో ప్రయాణికుల భద్రతను విస్మరించి ధూమపానం చేయడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఇలా చేయడం సరికాదని పలువురు ప్రయాణికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆ డ్రైవర్ను విజయవాడలో విధుల నుంచి తప్పించి సస్పెండ్ చేశారు. ఈ విషయాన్ని కడప డిపో మేనేజర్ డిల్లీశ్వరరావు ‘సాక్షి’కి తెలిపారు. బస్సును వేరే డ్రైవర్ సాయంతో కడపకు తీసుకొచ్చేలా ఆదేశాలు ఇచ్చామన్నారు. భవిష్యత్తులో డ్రైవర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. – కడప కోటిరెడ్డిసర్కిల్ -
ఉప సర్పంచ్ పదవి కోసం అరాచకం
ప్రొద్దుటూరు : కేవలం గోపవరం గ్రామ పంచాయతీ ఉపసర్పంచ్ పదవి కోసం ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమాలు, దౌర్జన్యం, అరాచకాలకు పాల్పడ్డారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతిని రాచమల్లు శివప్రసాదరెడ్డి విమర్శించారు. గోపవరం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గురువారం, శుక్రవారం జరిగిన సంఘటనలే ఇందుకు సాక్ష్యమని అన్నారు. ఉపసర్పంచ్ ఎన్నిక సందర్భంగా గురువారం తమ వార్డు సభ్యులను కార్యాలయంలోకి వెళ్లకుండా రాళ్లు విసిరి, మారణాయుధాలతో వెంబడించారన్నారు. శుక్రవారం టీడీపీ వార్డు సభ్యులు తమలో తాము కొట్టుకోవడం, కుర్చీలు విసిరేయడం, మినిట్స్ బుక్ చించడం జరిగిందన్నారు. ఫైనల్గా ఎన్నికల అధికారి రామాంజనేయరెడ్డికి గుండెపోటు వచ్చినట్లు నటింపజేశారన్నారు. గుండెపోటు వచ్చిన రామాంజనేయరెడ్డికి సంబంధించి అధికారులు ఎందుకు హెల్త్ బులెటెన్ విడుదల చేయలేదని ప్రశ్నించారు. ఇదంతా వరద స్టంట్ అని విమర్శించారు. టీడీపీకి ఒకరే వార్డు సభ్యుడు గత ఎన్నికల సందర్భంగా గోపవరం గ్రామ పంచాయతీలో 20 మంది వార్డు మెంబర్లకుగాను ఒకరే టీడీపీ తరఫున ఎన్నికయ్యారని రాచమల్లు తెలిపారు. నాలుగు రోజుల క్రితం మరో ఐదుగురు వైఎస్సార్సీపీ నుంచి వరద వైపు వెళ్లారన్నారు. ఏవిధంగా చూసినా 14 మంది వార్డు సభ్యులు ఉన్న వైఎస్సార్సీపీకి ఉప సర్పంచ్ పదవి దక్కుతుందా.. ఆరుగురు ఉన్న టీడీపీ సభ్యులకు దక్కుతుందా అనే విషయాన్ని ప్రజలు ఆలోచించాలన్నారు. రూ.3–4 లక్షలు ఇస్తామని ప్రలోభపెట్టినా తమ వార్డు సభ్యులెవరూ వరద వైపు వెళ్లలేదన్నారు. జరిగిన గొడవను బట్టి ఇలాంటి వరదరాజులరెడ్డిని ఎమ్మెల్యేగా తాము గెలిపించామా అని ప్రజలు విస్తుపోతున్నారన్నారు. తాను డబ్బు సంపాదించి ఇంటిలో పెట్టుకుంటున్నానని చెప్పిన ఎమ్మెల్యే, ఆయన కుమారుడు సంపాదిస్తున్న డబ్బును గూట్లో పెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. 1980 నుంచి రాజకీయాల్లో ఉన్నా నేటికీ ఆయనలో ఏమాత్రం మార్పు రాలేదని తెలిపారు. ఫ్యాక్షనిజాన్ని పెంచి పోషిస్తున్నారన్నారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని, ఎక్కడా పోలీసు కేసులు నమోదు కాలేదన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి, ఎంపీపీ శేఖర్ యాదవ్, రాజుపాళెం మండలం వైఎస్సార్సీపీ కన్వీనర్ బాణ కొండారెడ్డి, వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు పాల్గొన్నారు.ఎమ్మెల్యే వరదపై మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ధ్వజం -
సమష్టి కృషితోనే నేర నియంత్రణ
కడప అర్బన్ : సమష్టి కృషితో నేరాలు నియంత్రించాలని జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ తెలిపారు. స్థానిక పెన్నార్ పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా పోలీస్ అధికారులతో నెల వారీ నేర సమీక్షా సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు, సిబ్బంది సమన్వయంతో పని చేయాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలు, సైబర్ నేరాలు అరికట్టేందుకు ముమ్మరంగా దాడులు నిర్వహించాలని పేర్కొన్నారు. అనంతరం విధి నిర్వహణలో ప్రతిభ కనబరచిన పోలీస్ అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందచేసి అభినందించారు. సమావేశంలో జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు పాల్గొన్నారు.ఎన్టీఆర్ వైద్య సేవా బిల్లులు విడుదల చేయాలికడప కోటిరెడ్డిసర్కిల్ : రాష్ట్ర వ్యాప్తంగా నెట్వర్క్ ఆస్పత్రులకు సంబంధించి ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద పెండింగ్లో ఉన్న రూ.3 వేల కోట్లకు పైగా బిల్లులు విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ కడప జిల్లా శాఖ ప్రతినిధుల బృందం డీఆర్వో, ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ బాలాంజనేయులను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం ఆస్పత్రులు నిరంతర సేవలు అందించడంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో తక్షణ సాయంగా రూ.1500 కోట్ల నిధులు విడుదల చేయాలని కోరారు. అలాగే మిగిలిన బిల్లుల కోసం ఒక నిర్దిష్ట చెల్లింపు షెడ్యూల్ ప్రకటించాలని విన్నవించారు. ప్రభుత్వం సత్వరమే చర్యలు తీసుకుంటే ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఆస్పత్రులు నిరాటంకంగా సేవలు అందించగలవన్నారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ కడప జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు, కోశాధికారి, వివిధ ఆస్పత్రుల ప్రతినిధులు పాల్గొన్నారు. -
మాపై అసత్య ఆరోపణలు
పోరుమామిళ్ల : ఈనాడు దినపత్రికలో శనివారం ప్రచురించిన కథనంపై ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి తీవ్రంగా స్పందించారు. ‘గోవింద.. ఇదీ నీ బామ్మ ర్ది భూదందా!’ శీర్షికతో ఈనాడు లో వచ్చిన కథనంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు ఇద్దరు బామ్మర్దులు ఉండగా.. ఒకరు శంకర్రెడ్డి ప్రమాదంలో మరణించారని, మరొకరు వెంకట్రామిరెడ్డి అన్నా రు. ఆయనకు భూదందాకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తనకు, తన బామ్మర్ది వెంకట్రామిరెడ్డికి ఎలాంటి సంబంధం లేని వార్త వండి వైఎస్సార్సీపీకి, మాకు అంటగట్టడం కరెక్టు కాదన్నారు. తమ పై చేసిన ఆరోపణలు అసత్యమని తెలిపారు. ఎవరైనా అక్రమాలు, కబ్జాలకు పాల్పడినపుడు చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి అడ్డు చెప్పబోమన్నారు. వాస్తవాలు తెలుసుకొని వార్తలు రాయాలని, ఇలా అడ్డదిడ్డంగా వార్తలు రాసి ఈనాడు పరువు దిగజార్చుకోవద్దని ఆయన సూచించారు.ఈనాడు కథనంపై ఎమ్మెల్సీ గోవిందరెడ్డి ఖండన -
12వ పీఆర్సీ కమిషన్ను నియమించాలి
కడప కార్పొరేషన్ : ఉద్యోగ, ఉపాధ్యాయుల కోసం ప్రభుత్వం 12వ పీఆర్సీ కమిషన్ను వెంటనే నియమించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి కోరారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి పది నెలలు అయినప్పటికీ ఉద్యోగస్థులకు, ఉపాధ్యాయులకు సంబంధించిన 12వ పీఆర్సీ కమిషన్ను ఇంకా ఏర్పాటు చేయకపోవడం సరికాదని విమర్శించారు. వెంటనే కమిషన్ ఏర్పాటు చేసి, కొత్త పి.ఆర్సీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆలోపు ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఐఆర్ ను 25% తగ్గకుండా ప్రకటించాలని కోరారు. ఉద్యోగులకు 4 డీఏలు పెండింగ్లో ఉన్నాయని, వాటిని కూడా వెంటనే విడుదల చేయాలన్నారు. ఎస్.ఎస్.సి. పరీక్షలలో రాష్ట్ర వ్యాప్తంగా సస్పెండ్ చేసిన ఉపాధ్యాయులను తిరిగి విధులలోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎవరో చేసిన తప్పులకు ఉపాధ్యా యులను బలి చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. శ్రీకాకుళం, వల్లూరు, వేంపల్లె (వైఎస్సార్ జిల్లా) ఇతర ప్రాంతాలలో ఎవరో చేసిన తప్పులకు ఉపాధ్యాయులు బలి అయ్యారన్నారు. ప్రభుత్వం అసలైన దోషు లను శిక్షించాలే కాని, ఉపాధ్యాయులను నస్పెండ్ చేసి జైలుకు పంపడం సరియైన పద్ధతి కాదన్నారు. రాబోవు పరీక్షలకై నా ఇలాంటి తప్పిదాలు ఎక్కడా జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. పరీక్షల విధుల్లో ఉన్న ఉపాధ్యాయులను వేధించడం తగదు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి -
కొత్త ఉషస్సుల విశ్వావసు
కడప కల్చరల్ : విశ్వావసు నామ నూతన సంవత్సరాదికి తెలుగు లోగిళ్లు నవ శోభను సంతరించుకున్నాయి. పండగ సామగ్రి కొనడానికి వచ్చిన ప్రజలతో శనివారం మార్కెట్లు కళకళలాడాయి. ప్రజలు ఉదాయన్నే తలంటుస్నానాలు చేసి ఇంటి దైవానికి పూజలు నిర్వహిస్తారు. ఇంటిల్లిపాది షడ్రుచుల సమ్మేళనం అయిన ఉగాది పచ్చడిని సేవిస్తారు. సాయంత్రం దేవాలయాలకు వెళ్లి దైవదర్శనం చేసుకుంటారు. ఆయా దేవాలయాలు ముస్తాబయ్యాయి. జీవితం రుచి తెలిపే పండుగ జీవితాంతం హాయిగా..ఎలాంటి కష్టాలు లేకుండా సాగిపోవాలని అందరూ కోరుకుంటారు. ఎంత వద్దనుకున్నా..ఎంత ధనవంతులకై నా కష్టాలు తప్పవు....జీవితమంటే కష్టసుఖాల కలయిక అని తెలుపుతూ ఉగాది నాడు షడ్రుచులతో ఉగాది పచ్చడి స్వీకరిస్తా రు. జీవితమంటే చేదు, తీపిల కలయిక అని సందేశం ఇవ్వడమే కాకుండా శరీరానికి ఆరోగ్యం చేకూర్చే ఉగాది పచ్చడిని ప్రతి తెలుగింటిలోనూ తప్పక తయారు చేస్తారు. ఈ సీజన్లో వచ్చే ఎన్నో వ్యాధులను ఈ పచ్చడి తినడం ద్వారా నివారించవచ్చని వైద్యులు పేర్కొంటున్నారు. కవుల పండుగ ఉగాదిని కవుల పండుగగా చెప్పవచ్చు. పండుగ నాడు కవి సమ్మేళనాలు నిర్వహించి అంతో ఇంతో సంభావన ఇచ్చి కవులను సత్కరించడం పండుగ సంప్రదాయం. వైఎస్సార్ జిల్లాను కవుల గడపగా పేర్కొంటారు. జిల్లా అంతటా స్వచ్ఛంద సేవా సంస్థలు, సమాజానికి సేవ చేస్తున్న వారికి ఉగాది పురస్కారాలు అందజేస్తుండగా, సాహిత్య సంస్థలు కవులను ఆహ్వానించి కవి సమ్మేళనాలు నిర్వహించి వారిని ఘనంగా సత్కరించనున్నారు. మత సామరస్యానికి ప్రతీక మన జిల్లాను మత సామరస్యానికి మారుపేరుగా పేర్కొంటారు. మొన్నటి ముస్లిం ప్రముఖులు హకీమ్ మంజుమియా నుంచి నేటి పెద్దదర్గా వరకు మత సహనానికి గట్టి పునాదులు వేశాయి. ఉగాది సందర్భంగా దేవునికడప ఆలయంలో పలువురు ముస్లింలు ప్రార్థనలు నిర్వహిస్తారు. ఒంటిమిట్ట, రాయచోటిలలో కూడా ఈ ఆచారం ఉంది. ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం వెలుపల నాటి ముస్లిం ప్రముఖులు తవ్వించిన ఇమామ్ బేగ్ బావి మత సామరస్యానికి మారుపేరుగా నేటికీ నిలిచి ఉంది. కడప బ్రాహ్మణ వీధిలోని జూల ఆంజనేయస్వామి ఆలయాన్ని ముస్లిం సుల్తాన్ నిర్మింపజేసినట్లు తెలుస్తోంది. రుచి తెలిపే పండుగ నేడు ఉగాది -
అవినీతి మచ్చ లేని జీవితం మాది
● కాంట్రాక్టు వర్కులు చేసిన చరిత్ర మా కుటుంబానికి లేదు ● నా ప్రమేయం లేకుండానే వర్థిని కన్స్ట్రక్షన్ రిజిస్ట్రేషన్ ● వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఐఏఎస్ను కమిషనర్గా తెచ్చాం.... ● మీరు మీ బంధువును కమిషనర్గా తెచ్చుకొని ఆటలాడుతున్నారు ● వాసు, మాధవిరెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన మేయర్ సురేష్ బాబు కడప కార్పొరేషన్ : కాంట్రాక్టు వర్కులు చేసిన చరిత్ర తమ కుటుంబానికి లేదని కడప మేయర్ కె. సురేష్ బాబు అన్నారు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన నోటీసులపై శనివారం కార్పొరేషన్ కార్యాలయంలోని తన ఛాంబర్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. తన కుమారుడిది అని చెప్తున్న వర్థిని కాంట్రాక్టు సంస్థను తనకు తెలియకుండానే రిజిస్ట్రేషన్ చేశారని, అది చేసిన మొత్తం వర్కులు కూడా రూ.30లక్షలలోపే అన్నారు. పనుల్లో ఎక్కడా అవినీ తి జరిగినట్లుగానీ, నాణ్యతలో లోపాలున్నాయనిగా నీ నోటీసుల్లో చెప్పలేదన్నారు. పనులు చేయకుండా బిల్లు లు చేసుకున్నట్లు కూడా ఎక్కడా లేదన్నారు. వర్క్ చేసే విధానంలో, కాంట్రాక్టర్ రిజిస్టర్ చేసే విధానంలో తప్పులున్నాయని చెప్పారన్నారు. రూ.10లక్షలు పైబడిన వర్కులు మాత్రమే తన దృష్టికి వస్తాయని, ఆలోపు వర్కులు కమిషనర్ స్థాయిలోనే జరుగుతాయని అందువల్ల ఈ కాంట్రాక్టు పనుల విషయం తనకు తెలియలేదన్నారు. 40 ఏళ్ల నుంచి తన పెదనాన్న, తాను, తన భార్య చిన్నచౌకు సర్పంచులుగా ఉన్నామని, 2001లో జెడ్పీ చైర్మన్గా, రెండు పర్యాయాలు మేయర్గా, కాంగ్రెస్, వైఎస్సార్సీపీల్లో 15 ఏళ్లు జిల్లా అధ్యక్షుడిగా పనిచేశానని, ఎక్కడా చిన్న అవినీతి మచ్చ లేదన్నారు. వైఎస్సార్, వైఎస్ జగన్ ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో జిల్లాల్లో రూ.20 వేలకోట్ల అభివృద్ధి పనులు జరిగాయని, తాను చేయాలని అనుకుంటే వందలకోట్ల కాంట్రాక్టు పనులు చేసేవాడినన్నారు. రాజకీయాల్లోకి వచ్చాక తాము ఆస్తులు అమ్ముకున్నామే తప్పా, ఎక్కడా సంపాదించుకోలేదని స్పష్టం చేశారు. నిత్యం ప్రజాసేవలో ఉన్న తనపై నిందలు వేయడం బాధాకరమన్నారు. ట్రెజరీలో భద్రపరచాల్సిన డాక్యుమెంట్లు వారి చేతికి ఎలా వచ్చాయి 2019లో ఎన్నికల్లో నామినేషన్ వేసిన డాక్యుమెంట్లను ట్రెజరీలో భద్రపరచాల్సి ఉండగా, వాటిని అధికారులతో బయటికి తీయించి, ఒరిజినల్స్ లేకపోయినా ఒక డీఈతో అటెస్టేషన్ చేయించి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్నారు. ఈనెల 28వ తేది సాయంత్రం నోటీసు తనకు అందిందని, ఐదు రోజుల ముందే ఆ నోటీసును ఎమ్మెల్యే మాధవి, శ్రీనివాసులరెడ్డి బహిర్గత పరచడం అధికార దుర్వినియోగానికి పరాకాష్ట అన్నారు. 2019లో అఫిడవిట్లో చూపినప్పుడు తన కుమారుడు ఒక మైనర్ అని, ఇప్పుడతను మేజర్ అని తెలిపారు. ఎలక్షన్ కమిషన్ దాచిన డాక్యుమెంట్లు వారి చేతికి ఎలా వచ్చాయో చెప్పాలని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం రాగానే అందరినీ భయపెట్టి రెండు బార్లను స్వాధీనం చేసుకున్నారని, అడ్డూ అదుపూ లేకుండా ఇసుక, మట్టి దోపిడీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. మట్కా సైతం ఆడిస్తున్నారని విమర్శించారు. ●వాసు అవినీతి ఎవరికి తెలీదు... అధికారంలోకి వచ్చాక మాధవిరెడ్డి అక్రమాలకు లెక్కేలేదు సంధ్యా సర్కిల్లో ఉన్న ఆర్ఎస్ఆర్ స్క్వైర్ మాల్లో 0.04 సెంట్లు ప్రభుత్వ భూమిని వాసు ఆక్రమణ చేశారని, దీనిపై కమిషనర్ నోటీసు ఇస్తే కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారన్నారు. మధుసూదన్రెడ్డి అనే వ్యక్తి తన చెల్లికి పసుపు, కుంకుమ కింద ఇచ్చిన స్థలాన్ని కూడా ఆక్రమించేందుకు వారిని స్టేషన్కు పిలిపించి బెదిరించారన్నారు. ఈ 9 నెలల్లోనే ఎమ్మెల్యే మాధవి, శ్రీనివాసులరెడ్డి ఎన్నో అక్రమాలు చేశారని, 15వ ఆర్థిక సంఘం కింద చేపట్టే పనుల టెండర్లలో ఎవరూ పాల్గొనకుండా కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నారన్నారు. నగరాన్ని అభివృద్ధి చేసేందుకు మాత్రం ప్రభుత్వం నుంచి ఒక్క పైసా నిధులు తేలేదని ఎద్దేవా చేశారు. తనకిచ్చిన నోటీసుపై ప్రభుత్వానికి వివరణ ఇస్తానని, అవసరమైతే న్యాయపోరాటం చేస్తానని తెలిపారు. ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, కార్పొరేటర్లు పాకా సురేష్, మగ్బూల్ బాషా, కె. బాబు, మల్లికార్జున, చంద్రహాసరెడ్డి, బాలస్వామిరెడ్డి, రామలక్ష్మన్రెడ్డి, శ్రీరంజన్రెడ్డి, బసవరాజు పాల్గొన్నారు. 1995లో శ్రీ సాయి కన్స్ట్రక్షన్లో పార్టనర్గా ప్రవేశించిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి అవతవకలకు పాల్పడితే 2004లో ఈఎన్సీ శివారెడ్డి ఆ సంస్థను బ్లాక్లిస్టులో పెట్టారని గుర్తు చేశారు. ఆ తర్వాత ఆర్కే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే ఇంజినీరింగ్ కాంట్రాక్టు సంస్థను కొని దొంగ సర్టిఫికెట్లు పెట్టి కాంట్రాక్టు సంస్థను ఎలా ప్రమోట్ చేసుకున్నారో, ఎంత నల్లధనం వెనకేశారో అందరికీ తెలుసన్నారు. 2014–19లో టీడీపీ ప్రభుత్వంలో గ్రామీణ ప్రాంతాల్లో చేయాల్సిన నీరు–చెట్టు పనులను కడప నగరంలో చేసి...9 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆ బిల్లులను చేసుకునేందుకు ఇరిగేషన్ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. శ్రీనివాసులరెడ్డి కుమారుడిని జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిని చేయాలని మెజార్టీ లేకపోయినా 8 మంది క్రికెట్ అసోసియేషన్ సభ్యులను బ్లాక్మెయిల్ చేసి 6 గంటలు ఇంట్లో నిర్భంధించి సంతకాలు చేయించుకున్నారని...ఇంత దౌర్జన్యం ఎక్కడా చూడలేదని విమర్శించారు. కడపను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఒక ఐఏఎస్ అధికారిని తెచ్చి పాలన చేశామని, కూటమి ప్రభు త్వం అధికారంలోకి వచ్చాక కార్పొరేషన్ స్థాయిని తగ్గించి ఓ కేసులో ఉన్న వాళ్ల బంధువైన గ్రూప్–1 అఽధికారిని కమిషనర్గా తెచ్చుకొని ఆటలాడుతున్నారని ధ్వజమెత్తారు. వీళ్లా అవినీతి గురించి మాట్లాడేదని మండిపడ్డారు. -
ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు
పులివెందుల: కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి జిల్లా ప్రజలకు విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. షడ్రుచుల సమ్మేళనం ఉగాది పండని పేర్కొన్నారు. ఈ ఏడాదంతా జిల్లా ప్రజలు సుఖ సంతోషాలతో వర్థిల్లాలని, సకాలంలో వర్షాలు కురిసి రైతన్నల ఇంట సిరులు కురవాలని, అలాగే అన్ని వర్గాల ప్రలకు మేలు జరగాలని ఆయన ఆకాంక్షించారు. ఐదుగురికి ఉగాది పురస్కారాలు కడప కల్చరల్: ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక విభాగానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత హంస (కళారత్న) పురస్కారాలను విశ్వావసు నామ సంవవత్సర ఉగాది సందర్భంగా ఆదివారం అందజేయనుంది. వైఎస్సార్ కడపజిల్లా నుంచి ఈ పురస్కారానికి ఐదుగురు ఎంపికయ్యారు. వారిలో నాటకానికి సంబంధించి కడప నగరం ఓం శాంతినగర్లోని సింగంశెట్టి అరుణకుమారి హంస (కళారత్న) పురస్కారం, సాహిత్య విభాగం నుంచి విద్వాన్ గానుగపెంట హనుమంతరావు (బద్వేలు), ప్రొద్దుటూరుకు చెందిన జింకా సుబ్రమణ్యం, కడప నగరం బ్రౌన్ గ్రంథాలయ సహాయ పరిశోధకులు డాక్టర్ చింతకుంట శివారెడ్డి, కడప నగరం ప్రకాశ్నగర్లోని మొగిలిచెండు సురేష్ ఉగాది పురాస్కరాలకు ఎంపికై నట్లు ఆ విభాగానికి చెందిన అధికారులు శనివారం జాబితాను ప్రకటించారు. నేడు, రేపు రిజిస్ట్రేషన్ సేవలు కడప కోటిరెడ్డిసర్కిల్ : ప్రధాన పండుగలైన ఉగాది, రంజాన్ పండుగ సందర్భంగా ఈనెల 30, 31 తేదీల్లో సెలవు రోజులయినప్పటికీ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు పనిచేస్తాయని రిజిస్ట్రేషన్శాఖ డీఐజీ ప్రసాద్రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. భూములు, స్థలాల క్రయ విక్రయదారులు ఈ విషయాన్ని గుర్తించి తమ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. నేడు, రేపు విద్యుత్ బిల్లుల చెల్లింపునకు అవకాశంకడప కార్పొరేషన్ : విద్యుత్ వినియోగదారుల సౌకర్యార్థం ఈ నెల 30, 31వ తేదీల్లో జిల్లా వ్యాప్తంగా విద్యుత్ బిల్లుల వసూలు కేంద్రాలు యథాతథంగా పనిచేస్తాయని జిల్లా విద్యుత్ శాఖ పర్యవేక్షక ఇంజినీరు ఎస్. రమణ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని విద్యుత్ బిల్లులు సకాలంలో చెల్లించి సంస్థ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఎంప్లాయీస్, పెన్షనర్ల విభాగంలో నియామకాలు కడప కార్పొరేషన్ : వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఎంప్లాయీస్, పెన్షనర్ల విభాగ అధ్యక్షులను నియమిస్తూ ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. బద్వేల్ ఎంప్లాయీస్ పెన్షనర్ల విభాగం అధ్యక్షుడిగా సింగనమల శ్రీనివాసులరెడ్డి, జమ్మలమడుగు అధ్యక్షుడిగా మల్లు వెంకుట స్వామిరెడ్డి, కడప అధ్యక్షుడిగా షేక్ అబ్దుల్ ఖాదర్, మైదుకూరు అధ్యక్షుడిగా సింగా వీరభద్రుడు, ప్రొద్దుటూరు అధ్యక్షుడిగా లక్కిరెడ్డి వెంకట రమణారెడ్డి, పులివెందుల అధ్యక్షుడిగా బి. వీరారెడ్డి నియమితులయ్యారు. 72 మంది గైర్హాజరు కడప ఎడ్యుకేషన్ : పదో తరగతి పరీక్షల ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్–1లో భాగంగా శనివారం జరిగిన సంస్కృతం, అరబిక్, పర్షియన్తోపాటు ఒకేషనల్ పరీక్షలకు 72 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఈఓ షేక్ షంషుద్దీన్ తెలిపారు. జిల్లావ్యాప్తంగా 45 పరీక్షా కేంద్రాలకుగాను రెగ్యులర్కు సంబంధించి 3915 మంది విద్యార్థులకుగాను 3843 మంది విద్యార్థులు హాజరుకాగా 72 మంది గైర్హారయ్యారు. మూడు ఫ్లయింగ్ స్క్వాడ్ 9 పరీక్షా కేంద్రాలను, సిట్టింగ్ స్క్వాడ్ 39 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశాయని డీఈఓ తెలిపారు. సకాలంలో పన్నులు చెల్లించాలి కడప కోటిరెడ్డిసర్కిల్ : పన్ను చెల్లింపుదారులు జీఎస్టీ, వీఏటీ/సీఎస్టీ పన్నులు సకాలంలో చెల్లించాలని వాణిజ్యపన్నులశాఖ జాయింట్ కమిషనర్ కల్పన శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పన్నులు చెల్లింపునకు ఆన్లైన్ ద్వారా 24 గంటలపాటు వెబ్సైట్ సౌకర్యం ఉందని, వెబ్సైట్లో ఈ–పేమెంట్ గేట్వే ద్వారా పన్నులు సులభంగా చెల్లించవచ్చని పేర్కొన్నారు. అలాగే అసిస్టెంట్ కమిషనర్లు, జాయింట్ కమిషనర్ కార్యాలయాల్లో పన్ను చెల్లింపుదారులకు అవసరమైన సహాయ సహకారాలు, సందేహాల నివృత్తి కోసం సిబ్బంది అందుబాటులో ఉన్నారని తెలిపారు. పన్ను చెల్లింపుదారులు తమశాఖకు తమవంతుగా సహకరించాలని కోరారు. -
కేజీబీవీల్లో ప్రవేశాలకు పిలుపు
గ్రామీణ ప్రాంత నిరుపేద కుటుంబాల బాలికల చదువుకు కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీలు) బాసటగా నిలుస్తున్నాయి. ఉచిత వసతితోపాటు నాణ్యమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తూ ఆదరిస్తున్నాయి. బాలికల ఉజ్వల భవిష్యత్తుకు గట్టిపునాది వేస్తున్నాయి. తాజాగా కేజీబీవీల్లో 6వ తరగతితోపాటు ఇంటర్ ప్రవేశాలకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ను విడుదల చేసిన నేపథ్యంలో ప్రత్యేక కథనం. ● నిరుపేద కుటుంబాల బాలికలకు సదవకాశం ● ప్రారంభమైన ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ● ఆరో తరగతి, ఇంటర్లో ప్రవేశాలకు అవకాశం ● ఏప్రిల్ 11 దరఖాస్తుకు తుది గడువు ● 17 కేజీబీవీల్లో భర్తీకానున్న 1602 సీట్లు కడప ఎడ్యుకేషన్ : జిల్లాలో బాలికల అక్షరాస్యత శాతాన్ని పెంచాలన్న సదాశయంతో బాలికల అక్షరాస్యత తక్కువగా ఉన్న మండలాల పరిధిలో ప్రభుత్వం కేజీబీవీలను ఏర్పాటు చేసింది. ఈ కేజీబీవీలు మొదట్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉండేది. 10వ తరగతి తరువాత విద్యార్థు లు చదువుకు దూరమవుతున్నట్లు తెలియడంతో మళ్లీ ఇంటర్మీడియట్ను ప్రవేశపెట్టారు. 2024–25వ విద్యా సంవత్సరానికి సంబంధించి 17 కేజీబీవీల్లో 6వ తరగతిలో 680, ఇంటర్మీడియట్లో 680 సీట్లను భర్తీ చేయనున్నారు. అలాగే 7వ తరగతిలో ఖాళీగా ఉన్న 23 సీట్లు, 8వ తరగతిలో ఖాళీగా 13 సీట్లు, 9వ తరగతిలో 14 సీట్లు, 10వ తరగతిలో 29 సీట్లు, 12వ తరగతిలో 163 సీట్లు ఇలా మొత్తంగా అన్ని కలిపి 1602 సీట్లు భర్తీకానున్నాయి. అర్హులెవరంటే.. బడిబయటి పిల్లలు, బడి మానేసిన పిల్లలు, అంగవైకల్యం, అనాథలు, పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ దారిద్య్రరేఖకు దిగువన ఉన్న బాలికలకు తొలి ప్రాధాన్యతగా సీట్లు కేటాయిస్తారు. ఆన్లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులను మాత్రమే అడ్మిషన్ కోసం పరిగణిస్తారు. ఎంపికై న బాలికలకు ఫోన్కు మేసేజ్ ద్వారా సమాచారం అందుతుంది. లేదంటే సంబంధింత కేజీబీవీ నోటిఫికేషన్ బోర్డులో నేరుగా చూడవచ్చు. ఏవైనా సమస్యలు సందేహాలు ఉంటే 7075159996, 7075039990 నంబర్లలో సంప్రదించవచ్చు. జిల్లాలో ఇంటర్ ఉన్న కేజీబీవీల వివరాలు జిల్లాలో అట్లూరు, చాపాడు, దువ్వూరు, పెద్దముడియం, పోరుమామిళ్ల, ఎస్ఏ కాశినాయన, సింహాద్రిపురం కేజీబీవీలలో ఎంపీసీ గ్రూపు ఉండగా, బి.కోడూరు, బిమఠం, చక్రాయపేట, ఖాజీపేట, మైదుకూరు, పెండ్లిమర్రి, వల్లూరు, వేముల కేజీబీవీల్లో బైపీసీ, కలసపాడు కేజీబీవీలో హెచ్ఈసీ, జమల్మమడుగు కేజీబీవీలో ఎంపీహెచ్డబ్లూ గ్రూపులు ఉన్నాయి. అడ్మిషన్ల కోసం... విద్యార్థిని తల్లి, తండ్రిలకు సంబంధించిన ఆధార్ కార్డు, తల్లిదండ్రులు లేకుంటే సంరక్షకుల ఆధార్కార్డు, విద్యార్థినికి సంబంధించి 3 పాస్పోర్టు సైజు ఫొటోలు, రేషన్కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రం, స్టడీ సర్టిఫికెట్, మొబైల్ నెంబర్ను ఇవ్వాల్సి ఉంది.ఇందుకు సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ ఈనెల 22 నుంచి ప్రారంభమైంది. ఏప్రిల్ 11వ తేదీ వరకు గడువు విధించారు. -
నటించి.. వాయిదా వేయించి..
ప్రొద్దుటూరు: మండలంలోని గోపవరం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశారు. గురువారం పోలీసు బందోబస్తు ఏర్పాటులో విమర్శలు వెల్లువెత్తడంతో రెండో రోజు పటిష్టంగా నిర్వహించేలా చేశారు. ఉదయం 9 గంటల నుంచే డీఎస్పీ భావన ఆధ్వర్యంలో 144 సెక్షన్, పోలీసు 30 యాక్టు అమలు చేశారు. పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించి కొర్రపాడు రోడ్డులో ట్రాఫిక్ను మళ్లించారు. గ్రామ పంచాయతీ కార్యాలయం చుట్టూ అల్లరిమూకలు లేకుండా తరిమేశారు. ముందుగా టీడీపీ వార్డు సభ్యులు ఏడుగురు ఎన్నికలు నిర్వహించే గోపవరం గ్రామ పంచాయతీ కార్యాలయానికి వెళ్లారు. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి కోరిక మేరకు.. రెండు వాహనాల్లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి దొరసానిపల్లె నుంచి సర్పంచ్ గద్దా మోషాతోపాటు 13 మంది వైఎస్సార్సీపీ వార్డు సభ్యులను గ్రామ పంచాయతీ కార్యాలయానికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా పోలీసు బందోబస్తు ఉన్నా.. టీడీపీ నాయకులు బచ్చల వీరప్రతాప్, ఈవీ సుధాకర్రెడ్డి తదితరులు గ్రామ పంచాయతీ కార్యాలయంలోనికి వెళతామని దగ్గరికి వచ్చారు. లోపలికి వెళ్లేందుకు కుదరదని డీఎస్పీ వెనక్కి పంపారు. మీడియాను అనుమతించకుండా.. ఇంతలోనే ఎన్నికల అధికారి రామాంజనేయరెడ్డి తనకు గుండెపోటు వచ్చిందని గుండె పట్టుకున్నారు. గోపవరం గ్రామ పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ ఆయనను తీసుకొచ్చి తన చాంబర్లో కూర్చోబెట్టారు. ఆ సమయంలో ఎన్నికల అధికారి ప్రశాంతంగా కూర్చున్నట్లు లోపల ఉన్న అధికారులే చెబుతున్నారు. అంతలోనే అంబులెన్స్ను పిలిపించడం.. ఎన్నికల అధికారి రామాంజనేయరెడ్డిని లోపలి నుంచి నడిపించుకుంటూ బయటికి తెచ్చి అంబులెన్స్ ఎక్కించారు. స్థానికంగా అయితే ఎక్కడ అసలు విషయం బటయపడుతుందని భావించి.. ఎన్నికల అధికారిని కడపలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించినట్లు చెబుతున్నారు. కొంత సేపటి తర్వాత పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ.. ఎన్నికల అధికారికి గుండెపోటు రావడంతో ఎన్నిక వాయిదా పడిందని, కలెక్టర్ ఆదేశాల తర్వాత మళ్లీ ఎన్నిక ఉంటుందని మీడియాకు తెలిపారు. కార్యాలయంలోనికి మాత్రం మీడియాను అనుమతించలేదు. కార్యాలయ ప్రాంగణంలో డీఎస్పీ భావన, ఆర్డీఓ సాయిశ్రీ, తహసీల్దార్ గంగయ్య మాట్లాడుకుంటూ ఉండగానే ఈ వ్యవహారమంతా జరిగింది. తర్వాత పోలీసు బందోబస్తుతో టీడీపీ వార్డు సభ్యులు, అనంతరం వైఎస్సార్సీపీ వార్డు సభ్యులను తమ ప్రాంతాలకు పంపించారు. గుండెపోటు రాజకీయం ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి ఆదేశాల మేరకు గుండెపోటు రాజకీయం జరిగిందని స్థానిక ప్రజలు చెప్పుకొంటున్నారు. గతంలో మున్సిపల్ మాజీ ఇన్చార్జి చైర్మన్ వీఎస్ ముక్తియార్ వైఎస్సార్సీపీలో ఉండగా.. ఆయనను మున్సిపల్ చైర్పర్సన్గా చేసేందుకు అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్న రాచమల్లు శివప్రసాదరెడ్డి మద్దతు ఇచ్చారు. ఆ సమయంలో కూడా వరదరాజులరెడ్డి వ్యూహం ప్రకారం.. ఇలాగే వ్యవహరించి ఎన్నికను వాయిదా వేయించారు. ప్రస్తుతం అదే తరహాలో ఉప సర్పంచ్ ఎన్నికను వాయిదా వేయించారని ప్రజలు చర్చించుకుంటున్నారు. వ్యూహం ప్రకారం గొడవ ఉదయం 11 గంటల ప్రాంతంలో ఎన్నిక జరగాల్సి ఉండగా ఒక వ్యూహం ప్రకారం ఎన్నికల కార్యాలయంలో టీడీపీకి చెందిన 7వ వార్డు సభ్యురాలు కాచన రామలక్షుమ్మ, ఉపసర్పంచ్ అభ్యర్థి మండ్ల రమాదేవి వాగ్వాదానికి దిగారు. ఒకరినొకరు దూషించుకున్నారు. వీరు గొడవ పడుతుండగానే 8వ వార్డు సభ్యురాలు గాయత్రి ఎన్నికల అధికారి వద్ద ఉన్న మినిట్స్ బుక్ను చేతిలోకి తీసుకుని చించి వేశారు. ఈ సందర్భంగానే 5వ వార్డు సభ్యుడు ఆదినారాయణరెడ్డి కుర్చీలు విసిరేశాడు. టీడీపీ సభ్యులైన వీరంతా పరిస్థితి ఉద్రిక్తతంగా ఉందనుకునేలా నటించారు. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు హౌస్ అరెస్టు గోపవరం గ్రామ పంచాయతీ ఉపసర్పంచ్ ఎన్నిక సందర్భంగా పోలీసులు వైఎస్సార్సీపీ నేతలను హౌస్ అరెస్టు చేశారు. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్లు పాతకోట బంగారు మునిరెడ్డి, ఆయిల్ మిల్ ఖాజా తదితరులకు పోలీసులు ముందస్తు నోటీసులను ఇచ్చి.. ఇంటి నుంచి బయటికి రాకుండా కాపలా ఉంచారు. గురువారం ఎన్నికల కార్యాలయంలోకి దౌర్జన్యంగా వెళ్లిన టీడీపీ నాయకులు బచ్చల వీరప్రతాప్, ఈవీ సుధాకర్రెడ్డి తదితరులు శుక్రవారం కూడా యథావిధిగా అక్కడికి రావడం గమనార్హం. గోపవరం ఉప సర్పంచ్ ఎన్నిక మళ్లీ వాయిదా వారిలో వారే గొడవకు దిగిన టీడీపీ వార్డు సభ్యులు మినిట్స్ బుక్ చించివేత వంత పాడిన అధికారులు -
ప్రయాణికుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత
కడప కోటిరెడ్డిసర్కిల్ : ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల సమస్యల పరిష్కారానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు జిల్లా ప్రజా రవాణాఽధికారి పొలిమేర గోపాల్రెడ్డి తెలిపారు. శుక్రవారం సాయంత్రం స్థానిక ఆర్ఎం కార్యాలయంలో గోపాల్రెడ్డి డయల్ యువర్ ఆర్ఎం కార్యక్రమాన్ని నిర్వహించారు. ● గాలివీడుకు చెందిన వెంకట రమణ కదిరి నుంచి తిరుపతికి వయా ఎన్పీ కుంట, గాలివీడు, రాయచోటి మీదుగా బస్సును నడపాలని కోరారు. ● మాధవరానికి చెందిన మునెయ్య కొత్త మాధవరం, మాధవరం–1లో ఎక్స్ప్రెస్ బస్సులకు రిక్వెస్ట్ స్టాప్ ఏర్పాటు చేయాలన్నారు. ● అగుడూరుకు చెందిన రమణ, రాజాలు ప్రొద్దుటూరు–సంతకొవ్వూరు మధ్య తిరుగుతున్న సర్వీసును అగడూరు వరకు పొడిగించాలన్నారు. ● బుక్కాయపల్లె రామమునిరెడ్డి దువ్వూరు మండలం బుక్కాయపల్లె గ్రామానికి ప్రొద్దుటూరు లేదా మైదుకూరు డిపో నుంచి బస్సు నడపాలన్నారు. ● జమ్మలమడుగుకు చెందిన సాయిచంద్రారెడ్డి ప్రొద్దుటూరు–జమ్మలమడుగు నాన్స్టాప్ బస్సులకు బుకింగ్ కండక్టర్లు త్వరితగతిన టిక్కెట్లు జారీ చేసేలా చూడాలని కోరారు. ఆయా సమస్యలను ఆర్ఎం సంబంధిత డిపో మేనేజర్లకు బదిలీ చేసి వాటి పరిష్కరించాలని చొరవ చూపాలని సూచించారు. -
వేలిముద్రలు పడక అవస్థలు
ఈకేవైసీ చేయించుకునేందుకు డీలర్ల వద్దకు వెళుతున్న ప్రజల్లో చాలామందికి వేలిముద్రలు పడకపోవడంతో అవస్థలు తప్పడం లేదు. అలాంటి వారికి వీఆర్వో లాగిన్లో ఫేస్ రికగ్నైజేషన్ వెసలుబాటు ఉందని అధికారులు అంటున్నప్పటికీ వీఆర్వోలు అందుబాటులో లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేలిముద్రలు పడకపోతే ఇలాంటి ఆప్షన్ ఉందని తెలియని చాలా మంది నిరక్షరాస్యులు ఇంటికి తిరుగుముఖం పడుతున్నారు. ఇలాంటి వారంతా వచ్చేనెల నుంచి కార్డు కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొంది. మరికొంత గడువు ఇచ్చి సాంకేతిక పరమైన సమస్యలు లేకుండా చూసి అందరూ ఈకేవైసీ చేయించుకునేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. – కె.మునెయ్య, రామరాజుపల్లె, కడప -
ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పోరాటం
● జిల్లా ఫ్యాప్టో నూతన కార్యవర్గం ఎన్నిక ● జిల్లా ఫ్యాప్టో ఛైర్మన్గా ఇలియాస్ బాష కడప ఎడ్యుకేషన్ : ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి రాజీలేని పోరాటం చేస్తామని జిల్లా నూతన ఫ్యాప్టో చైర్మెన్ ఇలియాస్బాష పేర్కొన్నారు. కడపలోని వీణా విజయరామరాజు ఎస్టీయూ భవన్లో మాదన్ విజయ్కుమార్ అధ్యక్షతన ‘ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో)’ వైఎస్ఆర్ కడప జిల్లా నూతన కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశం సందర్భంగా జిల్లా ఫ్యాప్టో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమైక్య (ఫ్యాప్టో) జిల్లా చైర్మన్గా ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు ఎస్.ఎం.డి ఇలియాస్ బాషా(ఎస్టీయూ), సెక్రటరీ జనరల్గా ఆర్.అబ్దుల్లా (ఏ.పీ.టీ.ఎఫ్. 1938),ఆర్థిక కార్యదర్శిగా వి.వి శ్రీనివాసులు రెడ్డి (ఏ.పీ.టీ.ఎఫ్. 257), కో చైర్మన్లుగా జి.వి సుబ్బారెడ్డి (హెచ్.ఎమ్.ఏ), జె.రామచంద్రబాబు (బి.టి.ఎ),ఎం.జుబైర్ అహ్మద్ (రూటా) లు, డిప్యూటీ సెక్రటరీ జనరల్ గా ఎం.విజయకుమార్ (యూటీఎప్), వి.శ్యామలా దేవి (ఆప్టా)లను ఎన్నుకున్నారు. ఈ ఎన్నికలకు పరిశీలకులుగా ఫ్యాప్టో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మల్లు రఘునాథరెడ్డి వ్యవహరించారు. మల్లు రఘునాథ రెడ్డి మాట్లాడుతూ ఈ నూతన కార్యవర్గం రెండేళ్ల పాటు కొనసాగుతుందని తెలిపారు. సైబర్ నేరాలపై అవగాహన కడప అర్బన్ : సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ పోలీసు అధికారులు శుక్రవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఈ.జి అశోక్ కుమార్ ఆదేశాలతో సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ మధుమల్లేశ్వర రెడ్డి, చిన్న చౌకు సీఐ ఓబులేసు, ఎస్.ఐ రాజరాజేశ్వర రెడ్డి, సైబర్ క్రైమ్, ఏ.ఆర్ సిబ్బంది నగరంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా విస్తృతంగా అవగాహన కల్పించారు. కడపలోని చిన్న చౌకు పోలీస్ స్టేషన్ నుండి ప్రారంభమైన ర్యాలీ అప్సర సర్కిల్, వై జంక్షన్, డా.అంబెడ్కర్ సర్కిల్ మీదుగా వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. సైబర్ నేరం జరిగిన తక్షణమే 1930 కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని కోరారు. -
అప్పులబాధ తాళలేక యువకుడు ఆత్మహత్య
బద్వేలు అర్బన్ : అప్పులబాధ తాళలేక యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం బద్వేలులో వెలుగు చూసింది. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని పెద్ద అగ్రహారం గ్రామానికి చెందిన పగడాల చంద్రకుమార్ (36) బద్వేలులో టీ దుకాణం నిర్వహిస్తుండేవాడు. ఇతనికి భార్య సుమతితో పాటు కుమారుడు, కుమార్తె ఉన్నారు. టీ దుకాణం ఏర్పాటు చేసుకునే సమయంలో చేసిన అప్పులతో పాటు దుకాణం సక్రమంగా జరగకపోవడంతో చేసిన అప్పులు తడిసి మోపెడయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 26న ఓ పని నిమిత్తం కడపకు వెళుతున్నానని భార్యకు చెప్పి ఇంటి నుండి వచ్చేశాడు. అదే రోజు నెల్లూరు రోడ్డులోని బైపాస్ రోడ్డు సమీపంలో గల ఓ లాడ్జిలో గది అద్దెకు తీసుకుని ఉన్నాడు. అయితే రెండు రోజులుగా లాడ్జిలోని గది తలుపు తీయకపోవడం, గదిలో నుండి దుర్వాసన వస్తుండటంతో లాడ్జి యజమాని పోలీసులకు సమాచారమిచ్చాడు. వారు వెళ్ళి తలుపులు తెరిచి చూడగా మృతిచెంది ఉన్నాడు. మృతదేహం పక్కన పురుగుల మందు డబ్బా కనిపించడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. మృతుని భార్య సుమతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అర్బన్ ఎస్ఐ ఎం.సత్యనారాయణ కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వ్యసనాలకు బానిసై.. ప్రొద్దుటూరు క్రైం : చెడు వ్యసనాలకు లోనైన ప్రేమ్సాయిరెడ్డి (23) అనే యువకుడు తెలిసిన వారి దగ్గర సుమారు రూ. 8 లక్షల వరకు అప్పులు చేశాడు. బాకీ ఎలా తీర్చాలో అర్థం కాక తీవ్ర మనస్థాపం చెందిన ఆ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వన్టౌన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రామేశ్వరంలోని కాకనూరు నాగేశ్వరరెడ్డి కిరాణాషాపు పెట్టుకొని జీవనం సాగించేవాడు. ఆయనకు కుమారుడు ప్రేమ్సాయిరెడ్డితో పాటు కుమార్తె ఉన్నారు. కుమారుడు బిటెక్ చదువుతూ మధ్యలో మానేసి హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. ఇటీవలే హైదరాబాద్లో ఉద్యోగం మానేసి కడపలోని హెచ్డీఎఫ్సీ బ్యాంకులో ప్రైవేట్గా పని చేసేవాడు. అతను చెడు వ్యసనాలకు లోనై తల్లిదండ్రులకు డబ్బులు పంపమని అడిగేవాడు. అంతేగాక తెలిసిన వారి వద్ద కూడా సుమారు రూ. 8 లక్షల వరకు అప్పు చేశాడు. అప్పు ఎలా తీర్చాలా తరచూ ఆలోచిస్తూ బాధపడుతూ ఉండేవాడు. రెండు రోజుల క్రితం ప్రేమ్సాయిరెడ్డి ప్రొద్దుటూరుకు వచ్చాడు. ఇంటికి వచ్చినప్పటి నుంచి ఏదో ఆలోచిస్తూ దిగులుగా ఉండేవాడు. శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో రేకుల కప్పునకు ఉన్న ఇనుప పైపులకు చీరను కట్టుకొని ఉరేసుకున్నాడు. తర్వాత గుర్తించిన కుటుంబ సభ్యులు ప్రేమ్సాయిరెడ్డిని వెంటనే ప్రైవేట్ హాస్పిటల్కు తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యుడు తెలిపాడు. తండ్రి నాగేశ్వరరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వన్టౌన్ పోలీసులు తెలిపారు. కడుపునొప్పి తాళలేక డిగ్రీ విద్యార్థి.. కడప అర్బన్ : కడప నగరం రామరాజు పల్లెలోని ఎస్సీ కాలనీకి చెందిన డిగ్రీ బీకాం ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడినట్లు తాలూకా సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. సీఐ వివరాల మేరకు రామరాజు పల్లెకు చెందిన రాజశేఖర్ (24) గత ఏడాది నుండి కడుపునొప్పితో బాధపడుతుండేవాడని తెలిపారు. కడుపు నొప్పి తగ్గకపోవడంతో తీవ్ర మనస్థాపానికి చెంది శుక్రవారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృత దేహాన్ని రిమ్స్కు తరలించారు. మృతుడి బంధువులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు తెలిపారు. -
మందక్రిష్ణ మాదిగ చంద్రబాబు తొత్తు
కడప కార్పొరేషన్ : మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు మందక్రిష్ణ మాదిగ సీఎం చంద్రబాబుకు తొత్తు అని వైఎస్సార్సీపీ నేత, సోషల్ వెల్ఫేర్ బోర్డు మాజీ ఛైర్మన్ పులి సునీల్ కుమార్ విమర్శించారు. శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల మందక్రిష్ణ మాదిగ వర్గీకరణ అంశంపై మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని వేలెత్తి చూపేలా మాట్లాడటం సరికాదన్నారు. వర్గీకరణ అంశం ముందుకు పోవడానికి వైఎస్సార్ సహకరించారని, ఆయన అకాల మరణం తర్వాత అది మరుగున పడిందని మాట్లాడిన నోటితోనే రాజకీయ నాయకులను మించి విమర్శలు చేయడం దారుణమన్నారు. వర్గీకరణ చేయమని అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వాన్ని అడక్కుండా, ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ జగన్ను కోరడం సరికాదన్నారు. సుప్రీం కోర్టు నిర్ణయానికి కట్టుబడి ఉంటామని వైఎస్సార్సీపీ స్పష్టంగా చెప్పినప్పటికీ మళ్లీ వైఖరి చెప్పాలనడం విచిత్రంగా ఉందన్నారు. ఎస్సీ కులంలో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అని గతంలో చంద్రబాబు అన్నప్పుడు, ఎస్సీలు స్నానం చేయరు, శుభ్రంగా ఉండరు అని ఆయన మంత్రులు మాట్లాడినప్పుడు మందక్రిష్ణ మాదిగ కనీసం ఖండించలేదన్నారు. ఆయన వర్గీకరణపై తప్పా దళితుల సమస్యలు, వారి ఇబ్బందుల గూర్చి ఏనాడు పోరాడలేదన్నారు. ఇప్పుడు కూడా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మెప్పు కోసం వైఎస్ జగన్ను ఇరుకునపెట్టేలా మాట్లాడారన్నారు. వైఎస్ జగన్ మాదిగల పక్షపాతిగా ఎస్సీల్లో మూడు వర్గాలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, మాదిగలకు మంత్రి పదవులు, కార్పొరేషన్ ఛైర్మన్ల పదవులు ఇచ్చారన్నారు. ఇప్పుడు మాదిగలకు చంద్రబాబు ఎన్ని పదవులు ఇచ్చారో బేరీజు వేయాలన్నారు. గతంలో అన్ని ప్రభుత్వాలు మాదిగలను ఓటు బ్యాంకుగా మాత్రమే ఉపయోగించుకున్నాయని, ఒక్క వైఎస్ జగన్ మాత్రమే వారికి మేలు చేశారని తెలిపారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర కార్యదర్శి త్యాగరాజు, జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, నగర అధ్యక్షుడు కంచుపాటి బాబు, రవి తదితరులు పాల్గొన్నారు. సోషల్ వెల్ఫేర్ బోర్డు మాజీ చైర్మన్ పులి సునీల్ కుమార్ -
1న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
ఒంటిమిట్ట: ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో మంగళవారం ఉదయం కోయిల్ అళ్వార్ తిరుమంజనం ఘనంగా జరగనుంది. ఏప్రిల్ 5 నుంచి 15 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో.. ముందుగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి అర్చన చేసి, ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో గర్భాలయం, శ్రీ ఆంజనేయస్వామి, శ్రీ గరుత్మంతుని సన్నిధి, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేస్తారు. నామకోపు, శ్రీ చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం భక్తులను ఉదయం 11.30 గంటల నుంచి సర్వదర్శనానికి అనుమతిస్తారు. -
‘షాన్దార్’ రంజాన్ కోసం ‘దిల్దార్’ ఏర్పాట్లు
● వరాల పర్వదినానికి ఎదురుచూపులు ● మార్కెట్లకు రంజాన్ కళ ● కొనుగోలుదారులతో దుకాణాలలో రద్దీ ● ఉట్టిపడుతున్న ఆధ్యాత్మిక వాతావరణం కడప కల్చరల్ : పవిత్ర రంజాన్ మాసం దగ్గరకు వచ్చేసింది. పండుగ నిర్వహణ కోసం వస్తువులు కొనుగోలు చేస్తున్న ముస్లింలతో ప్రధాన మార్కెట్లు సందడిగా మారాయి. సాయంత్రం ఐదు గంటల నుంచి దాదాపు దుకాణాలన్నీ మహిళలతో నిండిపోతున్నాయి. మార్కెట్ ప్రధాన వీధులు కూడా జనసందోహంతో కనిపిస్తున్నాయి. పవిత్ర మాసం.. మనిషిని ఉన్నతుడిగా తీర్చిదిద్దే మాసం....ఆత్మార్పణతో అల్లాహ్కు దగ్గరయ్యే అవకాశం గల మాసం. దివ్య గ్రంథం ఖురాన్ భువికి దిగిన మాసం. ప్రతి ముస్లిం జీవితంలో పట్టలేని ఆనందం కలిగించే మాసం. నెల రోజులపాటు ఆధ్యాత్మిక చింతనతో గడిపే అవకాశం కల్పించిన మాసం రంజాన్. సంవత్సర కాలంపాటు ముస్లింలు ఈ పండుగ కోసం ఎదురుచూస్తారు. అలాంటి ఆనందకరమైన రోజు వరాల వసంతాలను కురిపించే రోజు పవిత్ర రంజాన్ పండుగ కేవలం ఒక్క రోజు తర్వాత రానుంది. దీని కోసం భక్తుల నెల రోజుల నిరీక్షణ ముగియనుంది. ముస్లిం లోకం నెల రోజులపాటు భక్తిశ్రద్ధలతో కఠినంగా ఉపవాస దీక్షలు నిర్వహిస్తున్నారు. మరొక్క రోజు తర్వాత దీక్షలు పూర్తయి ఎదురుచూస్తున్న రంజాన్ పండుగ రానుంది. ఈ పండుగను అత్యంత ఘనంగా నిర్వహించుకోవాలన్న భావనతో ఉన్నంతలో మరువలేని విధంగా గడపాలన్న ఆశతో తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మార్కెట్లలో రద్దీ రంజాన్ పండుగ నిర్వహణ కోసం కొనుగోలు చేసేందుకు వచ్చే వారితో మార్కెట్లు కళకళలాడుతున్నాయి. ముఖ్యంగా జిల్లా కేంద్రమైన కడప నగరంలోని వైవీ స్ట్రీట్లో ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచే కొనుగోలుదారుల రద్దీ కనిపిస్తోంది. ఇటీవల ఎండ తీవ్రత పెరుగుతుండడంతో మధ్యాహ్నం 12.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు కొనుగోళ్లు కాస్త పలుచబడుతున్నాయి. సాయంత్రం నుంచి దుకాణదారులు రాత్రి 11 గంటల వరకు కూడా షాపులు తెరిచి పెట్టుకోవాల్సిన అవసరం ఏర్పడింది. వైవీస్ట్రీట్ ప్రధాన రోడ్డు పూర్తిగా ముస్లిం మహిళలే కనిపిస్తున్నారు. ముస్లింలు కుటుంబ సభ్యులతోసహా షాపింగ్ చేసేందుకు తరలి వస్తుండడంతో ఆ రోడ్డులో నడిచేందుకు సమయం పడుతోంది. ముఖ్యంగా ఒకవైపు పండుగ నిర్వహణ కోసం ప్రత్యేక సామాగ్రి, మరోవైపు ఇంటిల్లిపాదికి దుస్తులు, పాదరక్షలు కొనుగోలు హడావుడి కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా రెడీమేడ్ దుకాణాలలో జనం కిటకిటలాడుతున్నారు. ముఖ్యంగా సెంటు, అత్తరు దుకాణాలు, మెహందీ విక్రయించే దుకాణాలు, సేమియా దుకాణాల వద్ద సందడిగా ఉంది. పండగ కళ జిల్లాలోని ముస్లింలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలన్నీ క్రమంగా పండుగ కళను సంతరించుకుంటున్నాయి. ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలోని రాయచోటి, రాజంపేటతోపాటు మన జిల్లాలోని కమలాపురం, ప్రొద్దుటూరు, బద్వేలు, జమ్మలమడుగు తదితర ప్రాంతాలలో మసీదులు, ఈద్గాలకు కొత్త కళ కల్పిస్తున్నారు. ముస్లింలలో భక్తిశ్రద్ధలతోపాటు కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ప్రధాన మార్కెట్లతోపాటు ఇతర మెయిన్రోడ్డులోగల దుస్తుల దుకాణాలు కళకళలాడుతున్నాయి. మరోవైపు నిత్యావసర సరుకులు విక్రయించే దుకాణాలలో రద్దీ అలాగే ఉంది. పండ్ల దుకాణాలు, తోపుడు బండ్లపై పండ్లు విక్రయించే ప్రాంతాలలో కూడా రద్దీ కనిపిస్తోంది. హలీం, తదితర ప్రత్యేక ఇస్లామిక్ వంటకాలు విక్రయించే దుకాణాలు రంగురంగుల విద్యుద్దీపాలతో కళకళలాడుతున్నాయి. పలుచోట్ల మసీదులను సైతం విద్యుద్దీపాలతో కనుల పండువగా అలంకరించి ఆరోజున రంగురంగుల కాంతులు వెదజల్లేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. -
కార్మికుల పక్షపాతి వైఎస్సార్టీయూసీ
కడప కార్పొరేషన్ : వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (వైఎస్ఆర్ టీయూసీ) కార్మికుల పక్షపాతి అని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి అన్నారు. వైఎస్సార్టీయూసీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుక్రవారం స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు జాషువా, నగర అధ్యక్షుడు ఏ1 నాగరాజు ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి, మేయర్ కె. సురేష్ బాబులతో కలిసి ఆయన జెండా ఎగురవేశారు. అనంతరం కార్మికుల మధ్య కేక్ కట్ చేసి, వారికి తినిపించి శుభాకాంక్షలు తె లిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్సార్సీపీకి ఓ చరిత్ర ఉందని, పోరాటాల నుంచి ఆ పార్టీ పుట్టిందన్నారు. ఉద్యోగులు, కార్మికుల సంక్షేమం కో సం వైఎస్సార్టీయూసీ ఆవిర్భవించిందన్నారు. వైఎస్సార్టీయూసీ పోరాటాల ఫలితంగా గత ఐదేళ్లలో కా ర్మికులకు ఎన్నో రకాల మేలు జరిగిందన్నారు. ఏజెన్సీ లు కార్మికులను ఇబ్బంది పెట్టకుండా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి క్ర మం తప్పకుండా ఒకటోతేది వేతనాలు జమ చేసిన ఘ నత వైఎస్ జగన్కే దక్కుతుందన్నారు. అబద్ధాలు, మో సాలతో సాగుతున్న కూటమి ప్రభుత్వంపై పోరాటాని కి ట్రేడ్ యూనియన్ నాయకులు సిద్ధం కావాలన్నారు. ● కమలాపురం నియోజకవర్గ ఇన్చార్జి నరేన్ రామాంజులరెడ్డి మాట్లాడుతూ కార్మికుల ఐక్యత, అభివృద్ధి, సంక్షేమం కోసం వైఎస్సార్టీయూసీ ఏర్పడిందన్నారు. గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 40 శాతం ఓట్లు సాధించడంలో వైఎస్సార్టీయూసీ పాత్ర ఎంతో ఉందన్నారు. కార్మికులకు ఎక్కడ అన్యాయం జరిగినా యూనియన్ నాయకులు ముందుండి పోరాడాలని పిలుపునిచ్చారు. ● ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ ఛైర్మెన్ బాలయ్య, డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు పులి సునీల్, మేసా ప్రసాద్, దాసరి శివప్రసాద్, సీహెచ్ వినోద్, వెంకటేశ్వర్లు, టీపీ వెంకట సుబ్బమ్మ, రత్నకుమారి, మరియలు, క్రిష్ణవేణి, సుశీలమ్మ, మల్లీశ్వరి తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి ఘనంగా వైఎస్సార్టీయూసీ ఆవిర్భావ దినోత్సవం -
డీఈఓ కార్యాలయం ఎదుట ఆందోళన
కడప ఎడ్యుకేషన్ : పదవ తరగతి గణిత పశ్నాపత్రం లీకేజీ సూత్రధారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని ఆర్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు డి.ఎం.ఓబులేసు యాదవ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం డీఈఓ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా డీఓం ఓబులేసు మాట్లాడుతూ ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యం స్వలాభం కోసం ప్రశ్నాపత్రం లీకేజ్ చేశారని ఆరోపించారు. తక్షణం అధికారులు స్పందించి ప్రశ్నాపత్రం లీకేజీపై సమగ్రంగా విచారణ జరిపి బాధ్యుతలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు నవీన్, జిల్లా కార్యదర్శి రెడ్డి సాయి, నాయకులు సన్నీ, హరి, శశి, భార్గవ్, హరికృష్ణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నిత్యపూజస్వామి హుండీ ఆదాయం లెక్కింపు
సిద్దవటం: మండలంలోని వంతాటిపల్లె గ్రామ పంచాయతీ లంకమల అడవీ ప్రాంతంలో వెలసిన శ్రీనిత్యపూజ స్వామి హుండీ ఆదాయాన్ని శుక్రవారం లెక్కించారు. రూ. 72,470 వచ్చిందని ఆలయ ఈఓ శ్రీధర్ తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి 27 నుంచి మార్చి 28వరకు భక్తులు స్వామి వారి హుండీలో వేసిన కానుకలను శుక్రవారం దేవదాయశాఖ రాజంపేట ఇన్స్పెక్టర్ జనార్థన్, సిద్దవటం ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు వారు, పోలీసులు, భక్తుల సమక్షంలో లెక్కించినట్లు ఈఓ తెలిపారు. కార్యక్రమంలో ఏపీజీబీ ఫీల్డ్ ఆఫీసర్ వెంకట సురేంద్రబాబు, మెసింజర్ సతీష్, పోలీసు రమణయ్య, ఆలయ ఉద్యోగి చంద్ర, అర్చకులు సుబ్రమణ్యం శర్మ, వంతాటిపల్లెవాసి వెంకటసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారమే లక్ష్యం
– జిల్లా ఎస్పీ ఈ.జి అశోక్ కుమార్ కడప అర్బన్ : పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం జిల్లా ఎస్పీ ఈ.జి అశోక్ కుమార్ శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు ‘గ్రీవియన్స్ డే’ నిర్వహించా రు. జిల్లాలో వివిధ పోలీసు స్టేషన్లు , ఆయా విభాగాలలో విధులు నిర్వర్తిస్తున్న పోలీసు సిబ్బంది బదిలీలు, వ్యక్తిగత , స్పౌజ్, చిల్డ్రన్న్, మెడికల్ సమస్యల గురించి ఎస్పీకి స్వయంగా విన్నవించుకున్నారు. ఎస్పీ సిబ్బంది సమస్యలను విని, వారి సమస్యలకు తగిన పరిష్కారం చూపుతామని భరోసా కల్పించారు. పంచాయతీ కార్యదర్శిపై దాడి అమానుషం ప్రొద్దుటూరు రూరల్ : వీరపునాయునిపల్లె పంచాయతీ కార్యదర్శి నాగభూషణ్రెడ్డి ఇంటిపై కొందరు దుండగులు దాడి చేయడం అమానుషమని మండల పంచాయతీ కార్యదర్శుల సంఘం ఉపాధ్యక్షుడు మస్తాన్ పేర్కొన్నారు. ఈ మేరకు వారు శుక్రవారం నల్లబ్యాడ్జీలు ధరించి విధులు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి ఘటనలు జరగకుండా గ్రామ పంచాయతీ కార్యదర్శులకు ఉన్నతాధికారులు భరోసా ఇవ్వాలన్నారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయ సూపరింటెండెంట్ బాలన్నకు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శుల సంఘం మహిళా ఉపాధ్యక్షురాలు శిరీష, జనరల్ సెక్రటరీ సుహాసిని, అడిషనల్ సెక్రటరీ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఆశా కార్యకర్తలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి కడప వైఎస్ఆర్ సర్కిల్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆశా కార్యకర్తలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు వేణుగోపాల్ డిమాండ్ చేశారు. శుక్రవారం నగరంలోని హోచిమన్ భవన్లో ఏపీ ఆశా వర్కర్ యూనియన్ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆశాలకు ఇచ్చిన హామీలకు జీవోలు విడుదల చేయాలన్నారు. వేతనాలు పెంచాలని, సాధారణ సెలవులు, ఉద్యోగ భద్రత, మెడికల్ ఉద్యోగులుగా గుర్తించి పెర్మనెంట్ చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ.5 లక్షలు, స్మార్ట్ ఫోన్లు, రూ. 10 లక్షల రూపాయల ఉచిత ప్రమాద ఇన్సూరెన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యలపై ఏప్రిల్ 1వ తేదీ నుండి 21వ తేదీ వరకు ఉద్యమ కార్యచరణ ప్రకటించామన్నారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ నగర అధ్యక్షులు సుబ్బరాయుడు, ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ నగర ప్రధాన కార్యదర్శి బి శాంతమ్మ పాల్గొన్నారు. వాహనం ఢీకొని వృద్ధురాలు మృతి కడప అర్బన్ : ఉక్కాయిపల్లి సమీపంలోని బైపాస్ రోడ్డు వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొని గుర్తు తెలియని వృద్ధురాలు మృతి చెందినట్లు కడప ట్రాఫిక్ సీఐ జావిద్ తెలిపారు. సీఐ వివరాల మేరకు మృతి చెందిన వృద్ధురాలుకు 65 సంవత్సరాలు వయసు ఉంటుందని, గురువారం రాత్రి నడుచుకుంటూ వెళుతున్న ఆమెను వాహ నం ఢీకొట్టడంతో తీవ్ర గాయాలతో మృతి చెందినట్లు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రిమ్స్కు తరలించినట్లు తెలిపారు. మృతురాలి సంబంధీకులు వివరాలకు 91211 00539 లేదా కడప ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వచ్చి వివరాలు తెలుసుకోవాలని కోరారు. -
దాల్మియా దరఖాస్తును తిరస్కరించాలి
జమ్మలమడుగు : ‘దాల్మియా ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా రైతుల సమస్యలు, బాధలు కలెక్టర్ స్వయంగా విన్నారు. అయితే విస్తరణ పనుల వల్ల గ్రామాలకు ఎటువంటి సమస్యలు ఉన్నాయని ప్రశ్నిస్తే దాల్మియా యాజమాన్యం మాత్రం ఎటువంటి సమస్యలు లేవంటూ దరఖాస్తులో తప్పుడు నివేదిక ఇచ్చిందని.. ఈ కారణం చూపుతూ కలెక్టర్ శ్రీధర్ చెరకూరి దాల్మియా పరిశ్రమ విస్తరణ కోసం పెట్టుకున్న దరఖాస్తును వెంటనే తిరస్కరించాలి’ అని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో విలేకరులతో ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మాట్లాడారు. ప్రజాభిప్రాయ సేకరణ బాధిత గ్రామాల్లో కాకుండా దాల్మియా ఫ్యాక్టరీలో నిర్వహించడం ఏమిటని ప్రశ్నించారు. అధికారులు దాల్మియా యాజమాన్యంతో లాలూచి పడి ప్రజాభిప్రాయ సేకరణ చేయడం ప్రజలను మోసం చేయడమే అవుతుందన్నారు. నిజంగా దాల్మియా విస్తరణ పనులు చేపట్టాలంటే మొదటి దశలో నిర్మించిన దాల్మియా ఫ్యాక్టరీ వల్ల ఇబ్బందులు పడుతున్న దుగ్గనపల్లి, నవాబుపేట, చిన్నకొమెర్ల, తలమంచిపట్నం గ్రామాల సమస్యలను పూర్తిగా పరిష్కారం చూపించాలన్నారు. దాదాపు 400 ఎకరాల భూమి ప్రతి ఏడాది వరదల వల్ల నాశనం అవుతుందని.. అసలు వ్యవసాయానికి పనికిరాకుండా పోయిందని రైతులు కలెక్టర్ ముందు ఫోటోలతో సహా వివరించారు. అయితే కలెక్టర్ నుంచి ఎటువంటి సమాధానం రాలేదన్నారు. రైతులకు సంబంధించిన భూములకు పరిహారం ఇస్తామన్న మాట ఎక్కడా పలుకలేదన్నారు. బుధవారం రాత్రే అధికారులు, దాల్మియా యాజమాన్యం గ్రామాల్లోకి వెళ్లి ప్రజాభిప్రాయ సేకరణపై తప్పుడు సమాచారం ఇచ్చారన్నారు. ఉదయం 9 గంటలకు సమావేశాన్ని నిర్వహిస్తామని పర్యావరణ శాఖ చెబితే అధికారులు, దాల్మియా యాజమాన్యం మాత్రం కలెక్టర్ వచ్చే సరికి 12 గంటలు అవుతుంది.. ఆ సమయానికి రావాలంటూ చెప్పడం చూస్తుంటే అధికారు లు ఎవరికి కొమ్ముకాస్తున్నారో తెలుస్తోందన్నా రు. ప్రజలు ఇబ్బందులు పడుతున్నామని లోకయుక్తకు వెళితే దుగ్గనపల్లి గ్రామాన్ని మార్చటానికి దాల్మియా విధిలేని పరిస్థితుల్లో ఒప్పుకుందన్నారు. అయితే వారి కి పరిహారం ఇచ్చి వారికి ఇష్టమైన ప్రాంతంలో గ్రామా న్ని నిర్మించేవరకు స్థానిక ప్రజలకు నమ్మకం లేకుండా పోతోందన్నారు. బాధిత గ్రామాలకు కలెక్టర్ న్యాయం చేయాలనుకుంటే విస్తరణ కోసం దాల్మియా పెట్టుకున్న దరఖాస్తును వెంటనే రిజక్టు చేసి ప్రజల సమస్యలు పరిష్కారం చేసి రెండో ఫ్లాంట్ విస్తరణ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చిన్న కొమెర్ల సర్పంచ్ జగదీశ్వరరెడ్డి, వినయ్రెడ్డి, భాస్కర్ రెడ్డి , మాజీ సర్పంచ్ శివశంకర్ రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి -
వరదది దుర్మార్గపు రాజకీయం
ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి దుర్మార్గపు రాజకీయాలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్రెడ్డి విమర్శించారు. గోపవరం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నిక సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రామల్లు శివప్రసాదరెడ్డికి సంఘీభావం తెలిపేందుకు వైఎస్ఆర్సీపీ జిల్లా నేతలు శుక్రవారం ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ప్రొద్దుటూరులో 1985లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనే బలం లేకున్నా తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి.. తన ఇంటిలో పని చేసే మనుషులను ఓటర్లుగా పెట్టిన చరిత్ర ఉందని అన్నారు. అదే తరహాలోనే ప్రస్తుతం గోపవరం గ్రామ పంచాయతీ ఉపసర్పంచ్ ఎన్నికలో జరిగిందన్నారు. నకిలీ ఐడీ కార్డులు సృష్టించి తన ఇంటి మనుషులను వార్డు సభ్యులుగా చేర్చి విజయం సాధించేందుకు చేసిన ప్రయత్నం సఫలం కాలేదన్నారు. విజయం సాధించినట్లు ఫలితం ప్రకటించాలని అధికారులపై ఒత్తిడి తెచ్చినా వీలు కాలేదన్నారు. రెండో రోజు వైఎస్సార్ జిల్లా కలెక్టర్ అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరించడంతో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తాడిపత్రి మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక సందర్భంగా కేవలం ఒక టీడీపీ సభ్యుడు ఎక్కువ ఉన్నా.. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజకీయం చేయలేదన్నారు. ఫేక్ ఐడీల పన్నాగం విఫలం మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి మాట్లాడుతూ గోపవరం గ్రామ పంచాయతీ ఉపసర్పంచ్ ఎన్నికకు సంబంధించి నిన్న పోలీసులు, నేడు కలెక్టర్ను అడ్డు పెట్టుకుని ఎన్నికను వాయిదా వేశారన్నారు. ప్రతిపక్ష పార్టీకి అడుగు దూరంలో అధికారం దక్కాల్సి ఉండగా, టీడీపీ వ్యూహం ప్రకారం వాయిదా వేయించిందన్నారు. టీడీపీ వార్డు సభ్యులు వారిలో వారే గొడవ పడటం, మినిట్స్ బుక్ చించడం, కుర్చీలు విసరడం, ఎన్నికల అధికారికి గుండెపోటు రావడం అంతా డ్రామా అన్నారు. గురువారం తమ వార్డు సభ్యులపై రాళ్లతో దాడి, కార్లను ధ్వంసం చేశారన్నారు. తమ వార్డు సభ్యులను రక్షించడంలో పోలీసులు విఫలమయ్యారని తెలిపారు. కనీసం ఎన్నికల కార్యాలయానికి తమ సభ్యులను పోలీసులు తీసుకెళ్లలేకపోయారన్నారు. శుక్రవారం అదనపు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి వార్డు సభ్యులందరిని తీసుకెళ్లగా గుండెపోటు డ్రామాతో ఎన్నిక వాయిదా పడిందని తెలిపారు. తమ వార్డు సభ్యులను ఏ ఒక్కరినీ ఆ పార్టీలోకి తీసుకెళ్లలేక పోయారని, దీంతో ఫేక్ ఐడీలతో గెలవాలని చేసిన ప్రయత్నాన్ని తాము అడ్డుకున్నామన్నారు. డీఎస్పీ, ఆర్డీఓ అధికారులు అక్కడే ఉన్నా.. ఎమ్మెల్యే వరద చెప్పినట్టే ఎన్నికను వాయిదా వేశారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మంత్రి పదవులు పొందిన వారు, రాజ్యసభ సభ్యులు పార్టీ మారారని, ఎంత ఒత్తిడి చేసినా తమ వార్డు సభ్యులు నిక్కచ్చిగా వ్యహరించారన్నారు. సమావేశంలో బద్వేలు, రాజంపేట ఎమ్మెల్యేలు డాక్టర్ సుధ, ఆకేపాటి అమరనాథ్రెడ్డి, మైదుకూరు మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి, ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి, జెడ్పీ చైర్మన్ ముత్యాల రామగోవిందరెడ్డి, జెడ్పీ వైస్ చైర్పర్సన్ జేష్టాది శారదతోపాటు గోపవరం పంచాయతీ వార్డు సభ్యులు పాల్గొన్నారు. అధికార యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకుని కుట్రలు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్రెడ్డి -
● కార్డు లేకపోతే సంక్షేమ పథకాలు లేనట్లే
ప్రతి నెల వీధుల్లోకి వచ్చే ఎండీయూ వాహనం వద్ద బియ్యం, చక్కెర, ఇతర సరుకులు తీసుకోవాలంటే రేషన్కార్డు ఉండాలి. అలాగే పెన్షన్, పక్కాగృహం, వైద్య సేవలు, ఫీజు రీయింబర్స్మెంట్లతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన పలు సంక్షేమ పథకాలు అందాలంటే రేషన్కార్డు తప్పనిసరి. దారిద్య్రరేఖకు దిగువ జీవిస్తున్న ప్రజలకు ఎన్నో విషయాల్లో రేషన్కార్డు అండగా ఉందన్న విషయం ఎవరూ కాదనలేని సత్యం. అలాంటి రేషన్కార్డు రద్దయితే ఆ కుటుంబ జీవనం అల్లకల్లోలంగా మారుతుంది. జిల్లాలో ఇప్పటికీ అనేక మంది రేషన్కార్డులేని కుటుంబాలు ఉన్నాయి. అర్హులైన వీరందరికీ కొత్త రేషన్ కార్డులు జారీ చేయాల్సిన అవసరం ఉంది. అలా జారీ చేయకపోగా ఈకేవైసీ పేరుతో, తక్కువ గడువు ఇవ్వడమంటే ఉన్న కార్డులను తొలగించడానికేన్న విమర్శలు సర్వత్రా వెలువడుతున్నాయి. ఎంతమందికి ఈకేవైసీ లేకపోతే అంతమందికి సంక్షేమ పథకాలు అందకుండా పోయే ప్రమాదం ఉంటుంది. కనుక ప్రభుత్వం ఇప్పటికై నా ఈకేవైసీ గడువు పొడిగించాలని ప్రజలు, రాజకీయ పక్షాలు కోరుతున్నాయి. -
వైఎస్.సుశీలమ్మ కుటుంబీకుల దాతృత్వం
పులివెందుల టౌన్ : పట్టణంలోని చవ్వా సుభాకర్రెడ్డి కాలనీలోని వైఎస్.సుశీలమ్మ నేత్రాలను దానం చేసి ఆమె కుటుంబీకులు దాతృత్వం చాటుకున్నారు. బుధవారం సుశీలమ్మ మృతి చెందడంతో ఆమె నేత్రాలు దానం చేసేందుకు భర్త వైఎస్.ఆనంద్ రెడ్డి, కుమారుడు వైఎస్.రాజేష్రెడ్డి, కుమార్తెలు వైఎస్.సునీత, సాధన అంగీకరిస్తూ జిల్లా అంధత్వ నివారణ సంస్థ సభ్యుడు రాజుకు సమాచారం ఇచ్చారు. టెక్నీషియన్ హరీష్తో కలిసి రాజు మృతురాలి ఇంటికి వెళ్లి వైఎస్.సుశీలమ్మ కార్నియాలు సేకరించి హైదరాబాద్లోని డాక్టర్ అగర్వాల్ నేత్ర నిధికి పంపారు. రాజు మాట్లాడుతూ మనిషి మరణానంతరం మట్టిలో కలిసి పోయే నేత్రాలు దానం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు. కుటుంబంలోని వ్యక్తి లేదా సన్నిహితులు, బంధువులు మరణించిన సమయంలో దుఃఖంలో ఉన్నప్పటికీ కుటుంబ సభ్యులు సమయ స్ఫూర్తితో నేత్రదానానికి అంగీకరించి 9866727534, 7093204537 అనే ఫోన్ నెంబర్లకు సమాచారం ఇవ్వాలన్నారు. వైఎస్.సుశీలమ్మకు ఎంపీ నివాళి పులివెందుల రూరల్ : పట్టణంలోని చవ్వాసుభాకర్రెడ్డి కాలనీలో నివాసముంటున్న వైఎస్.ఆనంద్రెడ్డి సతీమణి వైఎస్.సుశీలమ్మ బుధవారం మృతి చెందారు. కడప ఎంపీ వైఎస్.అవినాష్రెడ్డి మృతురాలి ఇంటికి వెళ్లి సుశీలమ్మ భౌతిక కాయానికి పూలమాలవేసి నివాళులర్పించారు. సుశీలమ్మ భర్త వైఎస్.ఆనంద్రెడ్డి, కుమారుడు వైఎస్.రాజేష్రెడ్డి, కుమార్తెలు సునీత, సాధనలను ఎంపీ పరామర్శించారు. అనంతరం పట్టణంలోని డిగ్రీ కళాశాల రోడ్డులోని వైఎస్ సమాధుల తోటలో జరిగిన వైఎస్.సుశీలమ్మ అంత్యక్రియలు జరిగాయి. వైఎస్.ప్రకాష్రెడ్డి, వైఎస్.ప్రతాప్రెడ్డి, వైఎస్.జోసెఫ్రెడ్డి, వైఎస్.మనోహర్రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ వైఎస్.ప్రమీలమ్మ, మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, మార్కెట్యార్డు మాజీ చైర్మన్ చిన్నప్ప, వైఎస్ కుటుంబసభ్యులు జగదీశ్వరరెడ్డి, శ్రీధర్రెడ్డి, బంధువులు పాల్గొన్నారు.నేత్ర దానంతో ఇద్దరు అంధులకు చూపు -
చాలెంజర్స్ ట్రోఫీలో చరణి భేష్
కడప ఎడ్యుకేషన్ : వైఎస్సార్ కడప జిల్లా క్రీడాకారిణి ఎన్.శ్రీచరణి బీసీసీఐ సీనియర్ ఉమెన్స్ చాలెంజర్స్ ట్రోఫీలో భళా అనిపించారు. డెహ్రాడూన్లో నిర్వహిస్తున్న బీసీసీఐ సీనియర్ ఉమెన్స్ చాలెంజర్స్ ట్రోఫీలో యర్రగుంట్ల మండటం యర్రంపల్లె గ్రామానికి చెందిన నల్లపురెడ్డి శ్రీచరణి ఆరు వికెట్లతో ప్రత్యర్థి జట్టును ఇరుకున పెట్టింది. రాజీవ్గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో నిర్వహిస్తున్న మల్టీ డేస్ మ్యాచ్లో టీం–ఎ, టీం–బి జట్లు తలపడగా, టీం–బీ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న శ్రీచరణి 32 ఓవర్లలో 8 మెయిడిన్ ఓవర్లు వేయడంతోపాటు 6 వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టును కట్టడి చేసింది. శ్రీచరణిని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రూ.55 లక్షలకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ అధ్యక్షుడు ఎం.భరత్రెడ్డి, కార్యదర్శి ఎ. రెడ్డిప్రసాద్, ఉమెన్ క్రికెట్ సమన్వయకర్త కల్యాణదుర్గం విష్ణుమోహనరావు, తదితరులు శ్రీచరణికి అభినందనలు తెలిపారు. -
టీడీపీ గూండాల దాష్టీకం
పులివెందుల : పులివెందులలో టీడీపీ గూండాల అరాచకాలు హెచ్చుమీరుతున్నాయి. అధికారాన్ని అడ్డుగా పెట్టుకుని యథేచ్ఛగా అక్రమాలు చేస్తున్న టీడీపీ నాయకులు వైఎస్సార్సీపీ నాయకులపై దాడులకు తెగబడుతున్నారు. గురువారం ఉదయం భాకరాపురంలోని తన ఇంటిలో టిఫిన్ చేస్తున్న వైఎస్సార్సీపీ నాయకుడు, మాజీ మైనింగ్ డైరెక్టర్ ప్రతాప్రెడ్డిని బయటకు లాక్కొచ్చి దాడి చేశారు. దాదాపు 30మంది యువకులు బైకులపై ప్రతాప్రెడ్డి ఇంటి వద్దకు వెళ్లి దాడి చేసినట్లు తెలుస్తోంది. బీటెక్ రవిపై పోస్టులు పెట్టే మగాడివా అంటూ దూషించారని, తనకు అసలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడమే తెలియదని చెబుతున్నా దాడి చేశారని ప్రతాప్రెడ్డి తెలిపారు. దాడి దృశ్యాలు ప్రతాప్రెడ్డి ఇంటి వద్ద ఉన్న సీసీ కెమెరాలలో రికార్డయ్యాయి. వైఎస్సార్సీపీ కార్యకర్త కోసం వెళ్లినందుకే.. బుధవారం టీడీపీకి చెందిన ఓ నాయకుడు వైఎస్సార్సీపీ నాయకుడు ప్రతాప్రెడ్డిని విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. దీన్ని వైఎస్సార్సీపీ కార్యకర్త చిన్న అనే యువకుడు సోషల్ మీడియాలోనే టీడీపీ నాయకుడు పెట్టిన పోస్టును ట్యాగ్ చేస్తూ కౌంటర్ పోస్టు పెట్టాడు. దీంతో అధికార పార్టీ నాయకుల ఒత్తిడి మేరకు చిన్నాను పులివెందుల పోలీసులు అదుపులోకి తీసుకుని అర్బన్ పోలీస్ ష్టేషన్లో ఉంచి అతనిపై నాటు సారా కేసు కట్టేందుకు ప్రయత్నించసాగారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ నాయకుడు ప్రతాప్రెడ్డి పోలీస్స్టేషన్ వద్దకు వెళ్లి అక్కడ ఎస్ఐ, డీఎస్పీలతో చర్చించారు. చిన్నాపై అక్రమ కేసు బనాయించడం అన్యాయమని ప్రతాప్రెడ్డి డీఎస్పీ దృష్టికి తెచ్చారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న టీడీపీ నాయకులు గురువారం తనపై దాడి చేశారని ప్రతాప్రెడ్డి ఆరోపిస్తున్నాడు. ఎలాగైతేనేమి వైఎస్సార్సీపీ కార్యకర్త చిన్నాపై గురువారం నాటు సారా కేసు పోలీసులు నమోదు చేశారు. ప్రతాప్రెడ్డిపై దాడి జరిగిన విషయం తెలుసుకున్న పోలీసులు ఆయన ఇంటి వద్దకు వెళ్లి సీసీ కెమెరాల రికార్డులను పరిశీలించి ప్రతాప్రెడ్డి స్టేట్మెంట్ను రికార్డు చేశారు. ఎస్పీకి ఫోన్ చేసిన ఎంపీ ప్రతాప్రెడ్డిపై టీడీపీ గూండాలు దాడి చేసిన విషయం తెలుసుకున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్కు ఫోన్ చేశారు. జిల్లాలో సర్పంచ్, ఎంపీపీల ఎన్నికల సందర్భంగా గోపవరంతోపాటు ఇతర ప్రాంతాలలో టీడీపీ నాయకులు చేస్తున్న దౌర్జన్యాలను ఆయన దృష్టికి తెచ్చారు. ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. అలాగే ప్రతాప్రెడ్డిపై దాడి చేసిన వారిని చట్టపరంగా శిక్షించాలని కోరారు. వైఎస్సార్సీపీ నాయకుడిపై దాడి ఇంటి వద్దకు వెళ్లి లాక్కొచ్చి దౌర్జన్యం -
బాధితులకు సరైన న్యాయం చేస్తాం: కలెక్టర్
దాల్మియా పరిశ్రమతో నష్టపోతున్న ప్రజలకు న్యాయం చే స్తామని జిల్లా కలెక్టర్ శ్రీధర్చెరకూరి పేర్కొన్నారు. ప్రజాభిప్రాయం సేకరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రెండు, మూడు సార్లు ఆర్డీఓ గ్రామాల్లో పర్యటించి తనకు నివేదిక ఇచ్చారని, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు పలుమార్లు సమస్యను తన దృష్టికి తెచ్చారని అన్నారు. దుగ్గనపల్లి గ్రామ ప్రజలను తాము కోరుకున్న ప్రాంతానికి తరలించటానికి యాజమాన్యం ఒప్పుకుందని, పంట భూములకు సైతం పరిహారం ఇప్పిస్తామని ఆయన పేర్కొన్నారు. ఒప్పుకున్న మేరకు పరిశ్రమ యాజమన్యాం నడుచుకోకపోతే లైసన్సు రద్దు చేయడానికి వెనుకాడబోమన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ సాయిశ్రీ, పర్యావరణశాఖ అధికారి సుధ కురుబ, చీఫ్ ఇంజినీర్ మునిస్వామినాయుడు, దాల్మియా డైరెక్టర్ నిపున్ భార్గవ్, తదితరులు పాల్గొన్నారు. -
పరిశ్రమ నా కుమారుడు, కోడలిని చంపేసింది
దాల్మియా పరిశ్రమతో వెలువడే బూడిద, కెమికల్ వాసనతో నా కోడలికి క్యాన్సర్ సోకి మరణించింది. మా మిరప పంట దిగుబడుల్లో నాణ్యత లేదని గిట్టుబాటు ధర లభించలేదు. అప్పులు తీర్చలేక నా కుమారుడు మోషే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి కారణం ఫ్యాక్టరీ యాజమాన్యమే. ఇప్పుడు ఇద్దరి పిల్లల బాధ్యత నాపై పడింది. – స్వామిదాసు, దుగ్గనపల్లి, మైలవరం మండలం గ్రామంలో ప్రతిఒక్కరూ అనారోగ్యంతో ఉన్నారు పరిశ్రమ నుంచి వెలువడే ధూమ్ము, ధూళి, కెమికల్ వాసనతో ఊపిరి పీల్చుకోలేని పరిస్థితి. మా సమస్యలు దాల్మియా యాజమాన్యం, అధికారులకు వివరించినా ఎవరూ స్పందించలేదు. ఇళ్లలో బూడిద పడడంతో మా ఇళ్లకు బంధువులు రావడం మానేశారు. అదికారులు మా సమస్యలకు పరిష్కారం చూపకపోతే దాల్మియా పరిశ్రమ ఎదుట ఆత్మహత్య చేసుకుంటాం. – మేరి, దుగ్గనపల్లి, మైలవరం మండలం -
గండి హుండీల ఆదాయం రూ.9.07లక్షలు
చక్రాయపేట : మండలంలోని మారెళ్లమడక గ్రామంలోని గండి వీరాంజనేయస్వామి ఆలయంలో హుండీల లెక్కింపు ద్వారా రూ.9,07,554 ఆదాయం వచ్చిందని ఆలయ సహాయ కమిషనర్ వెంకటసుబ్బయ్య తెలిపారు. గండి వీరాంజనేయస్వామి క్షేత్రంలో గురువారం హుండీ లెక్కింపు నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ హుండీల ద్వారా రూ.9,07,554ల నగదు, 005.00గ్రాముల బంగారు, 320.00 గ్రాముల వెండి, అన్నప్రసాద వితరణ హుండీ ద్వారా రూ.14,407ల ఆదాయం వచ్చిందన్నారు. మధ్యాహ్నం బహిరంగ వేలం ద్వారా ఆలయంలో పాలు, పెరుగు, మజ్జిగ ప్యాకెట్ల సరఫరా వేంపల్లెకు చెందిన సుధీర్ దక్కించుకున్నారన్నారు. దేవస్థాన భూములు, షాపింగ్ కాంప్లెక్స్ గదుల లీజు హక్కులకు, ఖాళీ నెయ్యి డబ్బాలు, నిరూపయోగ వస్తువుల విక్రయాలు, కూరగాయల సరఫరా హక్కులకు ఎవరూ డిపాజిట్ కట్టి పాల్గొనకపోవడంతో వాయిదా పడిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు కేసరి, రాజా రమేష్, దేవస్థాన చైర్మన్ కావలి కృష్ణ, బోర్డు సభ్యులు, ఏపీజీబీ సిబ్బంది, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. -
పోలీస్ స్టేషన్లో ఎస్పీ ఆకస్మిక తనిఖీ
జమ్మలమడుగు : మైలవరం మండలం తలమంచిపట్నం పోలీస్ స్టేషన్లో ఎస్పీ జి.అశోక్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. గురువారం మధ్యాహ్నం పోలీస్ స్టేషన్కు వచ్చిన ఆయన రికార్డులను పరిశీలించారు. పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలని, సబ్ డివిజన్లో చోరీలు, ఇతర నేరాలు జరగకుండా గస్తీ నిర్వహించాలని ఆదేశించారు. ఉమెన్ హెల్ప్ డెస్క్పై అవగాహన కల్పించి మహిళలు, చిన్నారులపై ఆఘాయిత్యాలు జరగకుండా నిరోధించాలని సూచించారు. పోలీసులు గ్రామాలకు వెళ్లి ముఖాముఖిగా మాట్లాడి సమస్యలు తెలుసు కోవాల న్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వరరావు, సీఐలు గోపాల్రెడ్డి, లింగప్ప ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. -
ఎంపీటీసీ నుంచి జెడ్పీ చైర్మన్ దాకా..
బ్రహ్మంగారిమఠం : మైదుకూరు నియోజకవర్గంలో వెనుకబడిన బ్రహ్మంగారిమఠం మండలం నుంచి రాజకీయాల్లో రాణిస్తున్నారు రామగోవిందరెడ్డి. ఎంపీటీసీగా ఎన్నికై రాజకీయాల్లో పట్టు సాధించిన ఆయన నేడు జెడ్పీ చైర్మన్గా ఎన్నికయ్యారు. మండలంలోని పలుగురాళ్లపల్లె పంచాయతీ జౌకుపల్లె గ్రామానికి చెందిన ముత్యాల పిచ్చిరెడ్డి మునుసూబుకు 1962 ఫిబ్రవరి, ఒకటో తేదీన ముత్యాల రామగోవిందరెడ్డి జన్మించారు. ఆయన విద్యాభ్యాసం ఒక టి నుంచి ఐదో తరగతి వరకు జౌకుపల్లె ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, ఆరు నుంచి పదో తరగతి వరకు పలుగురాళ్లపల్లె జెడ్పీ హైస్కూల్లో కొత్తపల్లెకు చెందిన పుట్టా సుధాకర్యాదవ్ (ఎమ్మెల్యే)తో కలిసి ఆయన చదువుకున్నారు. ప్రస్తుతం పుట్టా పెద్ద కుమారుడుడు వేలూరు ఎంపీగా ఉన్నారు. పోరుమామిళ్లలో ఇంటర్మీడియట్ చదివి తరువాత 1984లో 23 ఏళ్లలో క్లాస్–1 కాంట్రాక్టర్గా పనులు చేపట్టారు. 2006లో అప్పటి కాంగ్రెస్ పార్టీ తరపున పలుగురాళ్లపల్లె ఎంపీటీసీగా ఏకగ్రీవమయ్యారు. మాజీ సీఎం జగన్, ఎంపీ అవినాష్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎస్.రఘురామిరెడ్డిల ఆధ్వర్యంలో 2014లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు, బి.మఠం జెడ్పీటీసీగా పొటీచేసి టీడీపీ అభ్యర్థి చెంచయ్యగారిపల్లెకు చెందిన పోలిరెడ్డిపై 5000 మెజార్టీతో గెలిచాడు, అప్పుడే జెడ్పీ చైర్మన్ కోసం ప్రయత్నాలు చేసినా దక్కలేదు. 2019లో మళ్లీ జెడ్పీటీసీగా పొటీ చేసి ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. రాజకీయ సమీకణాలతో అప్పటి సీఎం జగన్ రాజంపేటకు అవకాశం ఇచ్చారు. అనంతరం నేడు ఆయన జెడ్పీ చైర్మన్గా అవకాశం దక్కింది. ఇదే పంచాయతీలో మరొరు ఎమ్మెల్యేగా ఉంటే ఈయన జెడ్పీ చైర్మన్గా ఎన్నికవడం విశేషం. 40మంది జెడ్పీటీసీల సభ్యుల ఆమోదంతో జెడ్పీ చైర్మన్ పీఠం ఎక్కారు. రామగోవిందరెడ్డికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉండగా అందరికీ వివాహమైంది.పట్టు సాధించిన ముత్యాల రామగోవిందరెడ్డి -
గంజాయి విక్రేతల అరెస్టు
కడప వైఎస్ఆర్ సర్కిల్ : కడప నగరంలో గంజాయి విక్రయిస్తున్న ఇరువురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు కడప ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సీఐ కృష్ణకుమార్ తెలిపారు. నగరంలోని కడప ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నగరంలోని చిన్న చౌక్ సంజన్న సర్కిల్ వద్ద ఎండు గంజాయి కలిగి ఉన్న దూదేకుల సిద్దు, తాటి నాగసురేశ్కుమార్లను అదుపులోకి తీసుకుని వారి నుంచి 1250 గ్రాముల గంజాయి, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గంజాయి సరఫరా చేసిన గిద్దలూరు వాసి దాసరి నాని పరారీలో ఉన్నారన్నారు. ఈ దాడుల్లో ఎకై ్సజ్ అధికారులు నీలకంటేశ్వరరెడ్డి, టి.మహేంద్ర, కె.నరసింహారావు, టి.సతీష్ పాల్గొన్నారు. -
నా కుమారుడు క్యాన్సర్తో చనిపోయాడు
దాల్మియా పరిశ్రమతో వెలువడే బూడిత, కెమికల్ వాసన పీల్చడంతో నా కుమారుడికి క్యాన్సర్ వచ్చి మరణించినాడు. 1.75 ఎకరాల భూమిని సాగుచేసుకుందామంటే పొలాల్లో నీరు వచ్చి చేరుతోంది. అప్పులు పెరిగిపోవడంతో బయట పనులకు పోతున్నాం. వంకలకు అడ్డంగా దాల్మియా పరిశ్రమ గోడలు కట్టడంతో మా పొలాలకు నీరు చేరుతోంది. నా కుమారుడి మరణానికి పరిశ్రమ యజమానులే కారణం. – శాంతమ్మ, దుగ్గనపల్లి, మైలవరం మండలం ముందు మా సమస్యలు పరిష్కరించాలి 2007లో దాల్మియా పరిశ్రమ ఎర్పడినప్పటి నుంచి నవాబుపేట, దుగ్గనపల్లి రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. వంకల్లో పరిశ్రమ కట్టడంతోపాటు ప్రహరీ నిర్మాణం చేపట్టారు. వంకలో చేరాల్సిన 33 వేల క్యూసెక్కుల నీరు మా గ్రామాలను ముంచేస్తున్నాయి. బ్లాస్టింగ్తో ఇళ్లు దెబ్బతిన్నాయి. గతంలో ఏడుగురు ఇంటిపై నుంచి పడి మరణించారు. మా సమస్యల పరిష్కరించిన తర్వాత విస్తరించాలి. – భాస్కర్రెడ్డి, నవాబుపేట, మైలవరంర మండలం -
దాల్మియా పరిశ్రమ యాజమాన్యంపై ప్రజాగ్రహం
జమ్మలమడుగు/మైలవరం : దాల్మియా సిమెంట్ పరిశ్రమ 4.6 టన్నుల సామర్థ్యంతో 2006లో వంక స్థలంలో కడుతుండగా.. తాము ఇబ్బంది పడతామని చెప్పేందుకు వచ్చిన తమను గేట్లవద్దే అడ్డుకున్నారని దుగ్గనపల్లి, నవాబుపేట, చిన్న కొమెర్ల , పెద్దకొమెర్ల గ్రామాల ప్రజలు ముక్తకంఠంతో ఆరోపించారు. అప్పట్లో ప్రజాభిప్రాయ సేకరణకు రాకుండా తమను అడ్డుకుని పరిశ్రమను స్థాపించేందుకు చర్యలు తీసుకున్నారని తెలిపారు. మైలవరం మండలం నవాబుపేట సమీపంలో ఉన్న దాల్మియా పరిశ్రమను విస్తరింరు నేపత్యంలో కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి గురువారం ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. 15 ఏళ్లుగా తాము దాల్మియా పరిశ్రమ వల్ల ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు కలెక్టర్కు తెలిపారు. తమ సమస్యలను పరిష్కరించిన తర్వాతే విస్తరించాలని, లేనిపక్షంలో తాము అడ్డుకుంటామని ఆయా గ్రామాల ప్రజలు, బాధితులు అధికారులకు విన్నవించారు. వారి అభిప్రాయాలు ఇలా ఉన్నాయి. తమ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని అధికారులకు బాధితుల ఫిర్యాదు -
జగన్మోహన్రెడ్డి దృష్టికి జ్యోతి క్షేత్రం సమస్య
పోరుమామిళ్ల : ఇటీవల అత్యంత చర్చనీయాంశంగా మారిన కాశినాయన జ్యోతి క్షేత్రంలో నిర్మాణాల కూల్చివేత గురించి బుధవారం మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి తీసుకెళ్లి వివరించారు. ఆయన వెంట నియోజకవర్గ బూత్ కన్వీనర్ల సమన్వయకర్త కల్లూరి రమణారెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్రెడ్డి, బి.కోడూరు మాజీ జెడ్పీటీసీ, మండల కన్వీనర్ రామకృష్ణారెడ్డి, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ రాళ్లపల్లె నరసింహులు, కాశినాయన మండల కన్వీనర్ హనుమంతరెడ్డి, గంటా రమణారెడ్డి, మేరెడ్డి రమణారెడ్డి తదితరులున్నారు. మూడు దశాబ్దాలకు పైగా కాశినాయన క్షేత్రంలో జరిగిన అభివృద్ధి, ఆగిపోయిన ఆలయ పనులు వివరిస్తూ.. హఠాత్తుగా ఫారెస్టు అధికారులు, పోలీసులు అక్కడ నిర్మాణాలు అడ్డంగా కూలగొట్టడం, భక్తుల మనోభావాలు దెబ్బతినడం తదితర అంశాలు ఎమ్మెల్సీ గోవిందరెడ్డి మాజీ సీఎంకు వివరించారు. వైయస్ జగన్ సానుకూలంగా స్పందించి త్వరలో ప్రధానమంత్రిని, కేంద్ర మంత్రులను కలసి మాట్లాడతానని చెప్పినట్లు డీసీ గోవిందరెడ్డి తెలిపారు. వైఎస్ జగన్ కూడా కాశినాయన క్షేత్రాన్ని సందర్శిస్తానని చెప్పారన్నారు. -
మత సంప్రదాయాలను గౌరవిస్తూ పండుగలను జరుపుకోవాలి
జిల్లా శాంతి కమిటీ సమావేశంలో జేసీ అదితి సింగ్ కడప సెవెన్రోడ్స్ : మత సంప్రదాయాలను గౌరవిస్తూ శాంతియుత, ఆహ్లాదకర వాతావరణంలో భక్తి భావంతో రంజాన్, ఉగాది, శ్రీరామనవమి పండుగలను నిర్వహించుకునేలా జిల్లా శాంతి కమిటీ సభ్యులు సమన్వయ సహకారాలు అందించాలని జేసీ అదితిసింగ్ తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలో రంజాన్, ఉగాది, శ్రీరామనవమి పండుగల నిర్వహణపై జేసీ అధ్యక్షతన బుధవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో శాంతి కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు, కడప మున్సిపల్ కమిషనర్ మనోజ్ రెడ్డి, కడప, పులివెందుల ఆర్డీఓలు జాన్ ఇర్విన్, చిన్నయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ శాంతియుత ఆనంద వాతావరణంలో ఒకరి మతాచారాలను మరొకరు గౌరవించుకుంటూ భక్తి శ్రద్ధలతో రంజాన్, ఉగాది, శ్రీరామ నవమి వేడుకలను నిర్వహించుకోవాలని శాంతి కమిటీ సంఘం సభ్యులను ఆదేశించారు. పండుగ వేడుకల సమయంలో ఆలయా లు, మజీద్ల వద్ద అన్ని రకాల భద్రతా ఏర్పాట్లను చేపట్టాలని సంబంధిత అధికారులను జేసీ ఆదేశించారు. ఎక్కడైనా ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే అధికారులకు, పోలీసు సిబ్బందికి సమాచారమివ్వాలన్నారు. అనవసరమైన విషయాలను అత్యుత్సాహంతో సోషల్ మీడియాలలో పోస్టు చేయడం వంటి చర్యలను అరికట్టేలా శాంతి కమిటీ సభ్యులు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో శాంతి కమిటీ సభ్యులు, పోలీసు శాఖ, వివిధ శాఖల అధికారులు, మైనారిటీ దేవదాయ శాఖ అధికారులు, పలువురు అలయ అర్చకులు, మౌజన్లు తదితరులు పాల్గొన్నారు. -
అన్నమయ్యపై టీటీడీ చిన్నచూపు!
రాజంపేట: ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలకు జిల్లా విభజనసెగ వెంటాడుతోంది.అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్టలోని కోదండరామాలయం వైఎస్సార్జిల్లాలో ఉన్న తరుణంలో అన్నమయ్య జిల్లా పరంగా తిరుమల తిరుపతి దేవస్ధానం(టీటీడీ) చిన్నచూపు చూస్తోందన్న విమర్శలు ఉన్నాయి.పేరుకే రాజంపేట నియోజకవర్గం అని, బ్రహ్మోత్సవాల్లో వైఎస్సార్ జిల్లా యంత్రాంగానికి టీటీడీ పెద్దపీట వేస్తోందని ఇక్కడి వారి భావన. వైఎస్సార్ జిల్లా కలెక్టర్, ఎస్పీతోపాటు అన్నమయ్య జిల్లా కలెక్టర్, ఎస్పీని భాగస్వాములను చేయకుండా టీటీడీ వ్యవహరిస్తున్న తీరుపై జిల్లా వాసులు పెదవి విరుస్తున్నారు. టీటీడీలో విలీనం కాకముందునుంచి.. ఒంటిమిట్ట కోదండరామాలయం టీటీడీలో విలీనం కాకముందు నుంచి బ్రహ్మోత్సవాలను రాజంపేట నియోజకవర్గ యంత్రాంగమే విజయవంతంగా నిర్వహిస్తోంది. కొత్త జిల్లా ఏర్పాటు క్రమంలో నందలూరు ఒంటిమిట్ట మండలాలు వైఎస్సార్ జిల్లాలో విలీనమయ్యాయి.దీంతో టీటీడీ కూడా తన దిశను మార్చుకుందన్న అపవాదును మూటకట్టుకుంది. స్థానికులతో పాటు రాజంపేట నియోజకవర్గంలోని ఆరుమండలాల ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులకు బ్రహ్మోత్సవాల్లో చోటు లేకుండా చేశారు. ఉభయ వైఎస్సార్ జిల్లాకు చెందిన వారి భాగస్వామ్యంతో చేస్తే ఎలాంటి బేధాభిప్రాయాలు రావన్న వాదన బలంగా వినిపిస్తోంది. రాములోరి కల్యాణోత్సవం సమయంలో పాసులు, ఇతర అనుమతులు విషయంలో అన్నమయ్య జిల్లాకు టీటీడీ మొండిచెయ్యి చూపిస్తోంది. ఇది సరైన విధానం కాదని, రామాలయం మాది.. పెత్తనం వారిదా అన్న అభిప్రాయం అధికారులు, భక్తులలో కూడా వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా టీటీడీ ఒంటిమిట్ట రామాలయం ఉత్సవాల నిర్వహణ విషయంలో వైఎస్సార్, అన్నమయ్య జిల్లాలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలని భక్తులు కోరుతున్నారు. ఏప్రిల్ 6 నుంచి 14 వరకు జరిగే శ్రీ కోదంరామస్వామి బ్రహ్మోత్సవాల నిర్వహణలో లా అండ్ అర్డర్ పగ్గాలు కడప పోలీసులకే టీటీడీ , ప్రభుత్వం అప్పగిస్తోంది. ఉభయ వైఎస్సార్ జిల్లాలకు ఒంటిమిట్ట రామాలయం ప్రధానమైనప్పటికీ లా అండ్ ఆర్డర్ విషయంలో అన్నమయ్య జిల్లా ఖాకీ పెద్దల భాగస్వామ్యం ఉండకపోవడం గమనార్హం. టీటీడీ కడప పోలీసువ్యవస్ధకే ప్రాధాన్యత ఇవ్వడంపై జిల్లా పోలీసువర్గాలు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నాయి. పేరుకే రాజంపేట నియోజకవర్గం రామయ్య బ్రహ్మోత్సవాల్లో వైఎస్సార్ జిల్లా యంత్రాగానికి పెద్దపీట ఈసారైనా టీటీడీ తన వైఖరి మార్చుకోవాలంటున్న రాజంపేట వాసులు జిల్లా యంత్రాంగానికి భాగస్వామ్యం కల్పించాలి ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో టీటీడీ అన్నమయ్య జిల్లాపై చిన్నచూపు చూపుతోంది. రాములోరి కల్యాణోత్సవంలో అన్నమయ్య జిల్లా యంత్రాంగానికి భాగస్వామ్యం కల్పించాలి. ఆలయం రాజంపేట నియోజకవర్గంలో ఉంటే, ఉత్సవాల నిర్వహణ విషయంలో జిల్లాకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం సరికాదు. – కెఎంఎల్ నరసింహా, కన్వీనర్, ఆల్ ఇండియానేషనల్ బీసీ ఫ్రంట్ పూర్వ సంప్రదాయాన్ని కొనసాగించాలి పూర్వం నుంచి ఒంటిమిట్ట కోదండ రాముని బ్రహ్మోత్సవాల్లో రాజంపేటకు చోటు కల్పించేవారు. ప్రస్తుతం వైఎస్సార్ జిల్లా యంత్రాంగానికి కల్యాణోత్సవం నిర్వహణ బాధ్యతలు అప్పగించింది. స్థానికులనే పదం లేకుండా చేయడం సరికాదు. ఈ సారి జరిగే కల్యాణోత్సవంలో పూర్వ సంప్రదాయాన్ని టీటీడీ కొనసాగించాలి. – మర్రి కళ్యాణ్, ఎన్ఆర్ఐ, రాజంపేట -
సమస్యలు అలా.. విస్తరణ ఎలా !
మైలవరం : మైలవరం మండలం నవాబు పేట గ్రామం వద్ద నిర్మించిన దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీ విస్తరణ కోసం గురువారం మూడు గ్రామాల ప్రజలతో ప్రజాభిప్రాయసేకరణకు అధికారుల సిద్ధం చేశారు. ప్రస్తుతం దాల్మియా పరిశ్రమ 4.6 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో సిమెంట్ను ఉత్పత్తి చేస్తోంది. ప్రస్తుతం దాని పరిధిని 12.6 మెట్రిక్ టన్నులకు విస్తరణ చేయాలని దాల్మియా యాజమాన్యం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా జిల్లా కలెక్టర్ , పర్యావరణశాఖ నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. అయితే దాల్మియా బాధిత గ్రామాలైన నవాబుపేట, దుగ్గనపల్లి ,చిన్న కొమెర్ల గ్రామస్తులు తమ సమస్యలను పరిష్కరించకుండానే ప్రజాభిప్రాయ సేకరణ చేయడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. అలాగే సిమెంటు రాయి కోసం బ్లాస్టింగ్ చేస్తున్న దాల్మియా యాజమాన్యం నిబంధనలు పాటించకుండా భారీగా పేలుడుతో రాయిని వెలికి తీస్తున్నారు. దీంతో ఆ పేలుడు ధాటికి తమ ఇళ్లు దెబ్బతింటున్నాయని నవాబుపేట గ్రామస్తులు వాపోతున్నారు. అలాగే ఫ్యాక్టరీ నుంచి వస్తున్న బూడిద కారణంగా పరిసర పంట పొలాలు దెబ్బతినడంతోపాటు దిగుబడి కూడా రావడంలేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. చిన్న కొమెర్లనుంచి నవాబుపేట వరకు రైల్వే ట్రాక్వద్ద నుంచి భారీగా మట్టి కట్ట వేశారు. గతంలో వర్షాలు వచ్చినప్పుడు కిలోమీటరు వెడల్పుతో రెండు మూడు వంకల ద్వారా నీరు ప్రవహించేది. అయితే ఈ మట్టి కట్ట వేయడం వల్ల ఒక వంక నుంచే నీరు ప్రవహించి నీరు రోజుల తరబడి పొలాల్లో నిలిచిపోతోంది. గతంలో 33 వేల క్యూసెక్కుల వర్షపు నీరు వంక ద్వారా ప్రవహించేది. ప్రస్తుతం ఉన్న 8వేల క్యూసెక్కులకు మించి ప్రవాహానికి అనువుగా లేనందున దుగ్గనపల్లి, నవాబుపేట గ్రామాలకు చెందిన పొలాల్లో రోజుల తరబడి నాలుగు నుంచి ఆరు అడుగుల వరకు నీరు ఉండటంతో పొలాలు సాగుకు అనుకూలంగా లేకుండాపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమ ఇంకా విస్తరిస్తే తమ గ్రామాలకు నష్టాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉందని బాధిత గ్రామాల ప్రజలు పేర్కొంటున్నారు. 20 రోజుల క్రితం దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి వచ్చే బుడిద వల్ల దిగుబడి తగ్గి, నాణ్యత లేక, పంట అమ్ముకోలేక మోషే అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇలాంటి సమయంలో దాల్మియా యాజమాన్యం తమ సమస్యలు పరిష్కరించకుండా విస్తరణ పనులు చేపట్టడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేడు దాల్మియా పరిశ్రమ విస్తరణ కోసం ప్రజాభిప్రాయ సేకరణ మెజార్టీ ప్రజల్లో వ్యతిరేకత -
కూలీల పొట్ట కొడుతున్నారు
ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు పరిధిలో ఏపీ స్టేట్ వేర్ హౌస్కు సంబంధించి రామేశ్వరం, వైఎంఆర్ కాలనీ, కానపల్లె గ్రామం వద్ద మూడు గోడౌన్లను నిర్మించారు. ప్రస్తుతం సత్యసాయి, అనంతపురం జిల్లాల పరిధిలో నాఫెడ్ ద్వారా ప్రభుత్వం కందులు కొనుగోలు చేసి ప్రొద్దుటూరుకు పంపిస్తున్నారు. స్థానిక గోడౌన్లలో వీటిని భద్రపరుస్తున్నారు. ప్రస్తుతం వైఎఆర్ కాలనీలోని గోడౌన్ నిండటంతో కానపల్లె గ్రామం వద్ద ఉన్న గోడౌన్లో కందుల బస్తాలను నింపుతున్నారు. కాగా కందుల బస్తాల అన్లోడింగ్కు సంబంధించి ప్రభుత్వం చెల్లించే హమాలి చార్జెస్లో అధికారులు చేతి వాటం ప్రదర్శిస్తున్నారు. బస్తాకు ఎంత కూలి ఇస్తారన్న విషయం రహస్యంగా ఉంచారు. నిబంధనల ప్రకారం ప్రభుత్వం 50 కిలోల బస్తాకు రూ.8 చొప్పున కూలి చెల్లిస్తోంది. ఈ ప్రకారం రోజు సుమారు వంద మంది కూలీలు వేల బస్తాలను వచ్చిన లారీల నుంచి దించి గోడౌన్లో నింపుతున్నారు. రోజు 5 నుంచి 10వేల బస్తాల వరకు సరుకును దింపుతున్నారు. కూలీలకిచ్చే దాంట్లోనే కాకుండా.. ప్రతి లారీ యజమాని నుంచి అదనంగా మామూళ్లు కూడా అందుకుంటున్నారని తెలు స్తోంది. పేదల ఆకలిని ఆసరాగా తీసుకున్న అధికారులు, కాంట్రాక్టర్లు వీరి కూలి చెల్లింపులో మోసం చేస్తున్నారు. తద్వారా రోజుకు అటు కాంట్రాక్టర్, ఇటు అధికారులు కలిపి సుమారు రూ.20వేలు లబ్ధి పొందుతున్నట్లు సమాచారం. సుమారు నెల రోజులుగా ప్రొద్దుటూరులో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. కూలి చెల్లింపు విషయమై అనేక మంది హమాలీలను ‘సాక్షి’ వివరణ కోరగా తాము చుట్టుపక్కల గ్రామాల నుంచి పొట్ట కూటి కోసం ఇక్కడికి వస్తున్నామన్నారు. బస్తాకు కూలి ఎంత వేస్తారనే విషయం తమకు తెలియదని, అడిగితే మరుసటి రోజు ఈ పని కూడా ఉండదన్నారు. పేదలమైన తమకు తప్పనిసరిగా పని ఉంటే తప్ప పొట్ట పోసుకోలేమన్నారు. ప్రతి రోజు సాయంత్రం అవుతూనే ఆ రోజుకు సంబంధించి కూలి ఎంత అనేది లెక్క వేసి చెల్లిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా పలువురు కూలీలు మాట్లాడుతూ శనివారం రూ.1200, ఆదివారం రూ.1340, సోమవారం రూ.700 కూలి చెల్లించాలని తెలిపారు. కూలీలకు సంబంధించి మేస్త్రి వెంకటయ్యను ప్రశ్నించగా.. బస్తాకు ఎంత కూలి అన్న విషయం తనకు కూడా తెలియదని తప్పించుకున్నారు. ఇంత వరకు ప్రభుత్వం నుంచి బిల్లు రాలేదని, బిల్లు వస్తేనే ఎంత కూలి అనేది తేలుతుందన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఏ మేరకు చెల్లించాల్సి ఉందనేది కూడా ఆయన చెప్పలేదు. ఇదే విషయమై గోడౌన్కు సంబంధించిన టెక్నికల్ అసిస్టెంట్ కోటేశ్వరరావును వివరణ కోరగా హమాలీల కూలి చెల్లింపు తమకు సంబంధం లేదన్నారు. కందులు నాణ్యతగా ఉన్నాయా లేదా అనేది మాత్రమే తాను పరిశీలిస్తానన్నారు. అనంతపురం జిల్లాకు చెందిన కాంట్రాక్టర్ రామకృష్ణ కూలీల కాంట్రాక్టును తాత్కాలికంగా దక్కించుకున్నారని తెలిపారు. ఉన్నతాధికారులు విచారణ చేసి కూలీలకు న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రెక్కాడితే కాని డొక్కాడని పరిస్థితి ఆ కార్మికులది. రోజూ ఒళ్లొంచి శ్రమటోడ్చి పనిచేస్తే కానీ వీరికి కూలి రాదు... ఆ డబ్బులొస్తేగానీ పూట గడవదు. వారి శ్రమను కళ్లార చూసిన వారెవరైనా అయ్యో పాపం అనాల్సిందే. రోజూ పల్లెల నుంచి అన్నం తెచ్చుకుని కండలు కరిగించి కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. కూలీలకు సాయం చేయాల్సిన కాంట్రాక్లర్లు వారి శ్రమను దోపిడీ చేస్తున్నారు. అండగా నిలబడాల్సిన అధికారులే వారి పొట్ట కొడుతున్నారు. కూలి చెల్లింపులో చేతి వాటం రోజు రూ.20వేల వరకు అధికారులు, కాంట్రాక్టర్లకు ఆదాయం వేర్ హౌసింగ్ గోడౌన్లలో ఇదీ.. పరిస్థితి -
మత సంప్రదాయాలను గౌరవిస్తూ పండుగలను జరుపుకోవాలి
జిల్లా శాంతి కమిటీ సమావేశంలో జేసీ అదితి సింగ్ కడప సెవెన్రోడ్స్ : మత సంప్రదాయాలను గౌరవిస్తూ శాంతియుత, ఆహ్లాదకర వాతావరణంలో భక్తి భావంతో రంజాన్, ఉగాది, శ్రీరామనవమి పండుగలను నిర్వహించుకునేలా జిల్లా శాంతి కమిటీ సభ్యులు సమన్వయ సహకారాలు అందించాలని జేసీ అదితిసింగ్ తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలో రంజాన్, ఉగాది, శ్రీరామనవమి పండుగల నిర్వహణపై జేసీ అధ్యక్షతన బుధవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో శాంతి కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు, కడప మున్సిపల్ కమిషనర్ మనోజ్ రెడ్డి, కడప, పులివెందుల ఆర్డీఓలు జాన్ ఇర్విన్, చిన్నయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ శాంతియుత ఆనంద వాతావరణంలో ఒకరి మతాచారాలను మరొకరు గౌరవించుకుంటూ భక్తి శ్రద్ధలతో రంజాన్, ఉగాది, శ్రీరామ నవమి వేడుకలను నిర్వహించుకోవాలని శాంతి కమిటీ సంఘం సభ్యులను ఆదేశించారు. పండుగ వేడుకల సమయంలో ఆలయా లు, మజీద్ల వద్ద అన్ని రకాల భద్రతా ఏర్పాట్లను చేపట్టాలని సంబంధిత అధికారులను జేసీ ఆదేశించారు. ఎక్కడైనా ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే అధికారులకు, పోలీసు సిబ్బందికి సమాచారమివ్వాలన్నారు. అనవసరమైన విషయాలను అత్యుత్సాహంతో సోషల్ మీడియాలలో పోస్టు చేయడం వంటి చర్యలను అరికట్టేలా శాంతి కమిటీ సభ్యులు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో శాంతి కమిటీ సభ్యులు, పోలీసు శాఖ, వివిధ శాఖల అధికారులు, మైనారిటీ దేవదాయ శాఖ అధికారులు, పలువురు అలయ అర్చకులు, మౌజన్లు తదితరులు పాల్గొన్నారు.