Rafale jet deal
-
రాఫెల్ కుంభకోణానికి ప్రధాని మోదీనే బాధ్యుడు
సాక్షి, హైదరాబాద్: రాఫెల్ ఎయిర్క్రాఫ్ట్ల కొనుగోళ్ల కుంభకోణానికి ప్రధాని నరేంద్ర మోదీనే బాధ్యుడని ఏఐసీసీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా ఆరోపించారు. రక్షణ శాఖ కొనుగోళ్ల విషయంలో ప్రధానికి అధికారం ఉండదని, అయినా మోదీ రాఫెల్ ఎయిర్క్రాఫ్ట్ల విషయంలో జోక్యం చేసుకున్నారని ఆరోపించారు. పీఎంవో జోక్యం తగదంటూ రక్షణశాఖ లేఖలు రాసినా పట్టించుకోలేదన్నారు. దీన్ని బట్టి ప్రధాని మోదీనే ఈ కుంభకోణానికి పూర్తి బాధ్యుడని అర్థమవుతోందని పేర్కొన్నారు. ఈ కుంభకోణానికి సంబంధించిన గతంలోనే పలు వాస్తవాలు వెలుగులోకి వచ్చాయని, గతవారం ఫ్రెంచ్ మీడియాలో వచ్చిన కథనంతో ఇది దేశంలోనే అతిపెద్ద కుంభకోణమని నిర్ధారణ అయిందని వ్యాఖ్యానించారు. మంగళవారం గాంధీభవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2019, మార్చిలో ఈడీ అధికారులు సుశేన్గుప్తా ఇంటిపై దాడి చేసినప్పుడు ఈ కుంభకోణానికి సంబంధించిన పలు కీలక డాక్యుమెంట్లు లభించాయని, రక్షణ శాఖ వద్ద ఉండాల్సిన పత్రాలు ఆయన ఇంట్లో ఎలా దొరికాయని ప్రశ్నించారు. దేశానికి రూ.41,205 కోట్ల నష్టం రక్షణ శాఖ వద్ద ఉండాల్సిన డాక్యుమెంట్లు సుశేన్గుప్తా అనే దళారి ఇంట్లో ఉన్నాయంటే డసాల్ట్ కంపెనీకి, కేంద్రానికి మధ్య ఆయన పోషించిన పాత్ర ఏంటో అర్థమవుతుందని పవన్ ఖేరా అన్నారు. అప్పటి నుంచి 2021, నవంబర్ వరకు సుశేన్గుప్తాపై కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోలేదో, రాఫెల్ కంపెనీపై సీబీఐ, ఈడీ ఎందుకు విచారణ చేయలేదో చెప్పాలని నిలదీశారు. యూపీఏ హయాంలో 126 ఎయిర్క్రాఫ్ట్లను రూ.526 కోట్ల చొప్పున కొనుగోలు చేయాలని రాఫెల్తో ఒప్పందం కుదిరితే, మోదీ అధికారంలోకి వచ్చాక ఎయిర్క్రాఫ్ట్ల సంఖ్యను 36కి తగ్గించి ఒక్కో ఎయిర్క్రాఫ్ట్ ధరను రూ.1,670 కోట్లకు పెంచిందని, తద్వారా దేశానికి రూ.41,205 కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పారు. సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్రెడ్డి, నల్లగొండ ఎంపీ ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్కుమార్గౌడ్, సీనియర్ ఉపాధ్యక్షుడు వేం నరేందర్రెడ్డి పాల్గొన్నారు. -
రాహుల్ క్షమాపణ చెప్పాల్సిందే: లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్ : ఆధారాలు లేని ఆరోపణలు చేసి బీజేపీపై బురద చల్లాలని అనుకుంటే చూస్తూ ఊరుకోమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్షణ్ హెచ్చరించారు. రఫెల్ వ్యవహారంపై రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు నిరసనగా అంబేద్కర్ విగ్రహం వద్ద బీజేపీ నాయకులు శనివారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. రాహుల్ తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్ క్షమాపణ చెప్పేదాకా దేశ ప్రజలు వదిలిపెట్టరని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆకాశం, పాతాళంలో కూడా కాంగ్రెస్ అవినీతి ఉంటుందని, కాంగ్రెస్ ఒక బెయిల్ గాడీ అని విమర్శించారు. పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్కు కర్రు కాల్చి వాత పెట్టారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఆలీబాబా దొంగల ముఠాలంటిదని, దేశ సంపదను దోచుకొని విదేశాల్లో దాచుకున్నారని దుయ్యబట్టారు. అర్థం లేని విమర్శలు చేస్తున్నారు రాహుల్ చిన్న పిల్లల మనస్తత్వంతో విమర్శలు చేస్తున్నారని, రఫెల్పై సుప్రీంకోర్టు చెంపపెట్టులాంటి తీర్పు ఇచ్చిందని లక్ష్మణ్ స్పష్టం చేశారు. క్షమాపణ చెప్పడం కాదు, నోరు అదుపులో పెట్టుకోవాలని కోర్టు సూచించిందని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ నాయకులు పాకిస్తాన్ భాష మాట్లాడుతున్నారని, కోడిగుడ్డుపై ఈకలు పీకే రాజకీయాలు నడవవని మండిపడ్డారు. దేశ భద్రత కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచిస్తూంటే రాహుల్ మాత్రం అర్థంలేని విమర్శలు చేస్తున్నారని, మోదీకి మంచి పేరు వస్తుందనే రఫెల్పై రివ్యూ పిటిషన్ వేశారని ఎమ్మెల్సీ రాంచందర్ రావు విమర్శించారు. ప్రజలు కాంగ్రెస్కు బుద్ది చెప్పి మోదీకి మద్దతుగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. ధర్నాలో లక్ష్మణ్తో పాటు ఎమ్మెల్సీ రామచందర్రావు, పొంగులేటి సుధాకర్రెడ్డి పాల్గొన్నారు. -
రాహుల్కు సుప్రీం షాక్
సాక్షి, న్యూఢిల్లీ : రఫేల్ తీర్పుపై కాపలాదారే దొంగ అంటూ కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై సర్వోన్నత న్యాయస్దానం మంగళవారం ఆయనకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. రఫేల్ ఒప్పందానికి సంబంధించి వెలువడిన తీర్పుపై రాహుల్ వ్యాఖ్యలు తమ ఉత్తర్వులను వక్రీకరించేలా ఉన్నాయని ఆయనపై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. రఫేల్ కేసుపై తీర్పును సమీక్షించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లతో కలిపి ఈ అంశాన్ని ఈనెల 30న విచారణకు చేపడతామని కోర్టు పేర్కొంది. కాగా తనపై బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్ను కొట్టివేయాలన్న రాహుల్ అప్పీల్ను కోర్టు తిరస్కరించింది. రాఫెల్ తీర్పుపై రాహుల్ చేసిన ప్రకటనపై ఇప్పటికే క్షమాపణ తెలిపారని ఆయన న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి కోర్టుకు తెలిపారు. ఇది చట్టం దృష్టిలో క్షమాపణ కిందకు రాదని బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి న్యాయవాది ముకుల్ రోహత్గీ పేర్కొన్నారు. రఫేల్ ఒప్పందంపై సుప్రీం తీర్పును పూర్తిగా పరిశీలించకుండానే ఎన్నికల ప్రచారంలో పొరపాటుగా సుప్రీం కోర్టు పేరును ప్రస్తావించానని రాహుల్ గాంధీ అంగీకరించిన సంగతి తెలిసిందే. -
రాహుల్ వివరణ ఇవ్వాలి: సుప్రీంకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి సుప్రీం కోర్టు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. చౌకీదార్ చోర్ (కాపలాదారే దొంగ) అనే వ్యాఖ్యలను తమకు ఆపాదించినందుకు గాను ఈ నెల 22 లోపు వివరణ ఇవ్వాలని రాహుల్ను ఆదేశించింది. రఫేల్ తీర్పుపై రాహుల్ గాంధీ ‘కాపలాదారే దొంగ’ అంటూ చేసిన వ్యాఖ్యలకు గాను బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి ఆయనపై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసును సుప్రీం కోర్టు ఈ రోజు (సోమవారం) విచారణ చేపట్టింది. కాపలాదారే దొంగ అని మేము ఎప్పుడూ అనలేదని సుప్రీం కోర్టు తెలిపింది. ఆ వ్యాఖ్యలను సుప్రీంకోర్టుకు ఆపాదించవద్దని రాహుల్ గాంధీకి స్పష్టం చేసింది. సుప్రీంకోర్టుకు ఆపాదిస్తూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఏప్రిల్ 22 కల్లా వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసులు జారీ చేసింది. చదవండి : రాహుల్పై కోర్టు ధిక్కరణ పిటిషన్ ఇటీవల ఎన్నికల సభలో ప్రధాని మోదీని ఉద్దేశించి..చౌకీదార్ చోర్ అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని రాహుల్ వ్యాఖ్యానించారు. అనిల్ అంబానికి రూ.40 వేల కోట్లు రఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు విషయంలో లబ్ధి జరిగిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించినట్లుగా ఎన్నికల సభలో రాహుల్ పేర్కొన్నారు. సత్యాన్ని ఎవరూ మార్చలేరని, ప్రతి ఒక్కరూ కాపలాదారే దొంగ అంటున్నారని మోదీని ఉద్దేశించి రాహుల్ ఆరోపణలు చేశారు. -
రఫేల్ డీల్ : కేంద్రంపై మరో బాంబు
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రకంపనలు పుట్టిస్తున్న రఫేల్ కుంభకోణంలో మరో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. ఈ ఒప్పందంలో భాగంగా అనిల్ అంబానీకి కోట్ల రూపాయల పన్నును ఫ్రెంచ్ అధికారులు మాఫీ చేశారంటూ ఫ్రెంచి పత్రిక లీ మాండె మరో బాంబు వేసింది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి లబ్ది చేకూర్చడం కోసమే రిలయన్స్ డిఫెన్స్ కంపెనీకి డీల్ను కట్టబెట్టారన్న ఆరోపణలకు తోడు, ఈ సంచలన కథనం మరింత కలకలం రేపుతోంది. దీంతో రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంలో సుప్రీంకోర్టు తాజా ఆదేశాలతో ఇబ్బందుల్లో పడిన నరేంద్రమోదీ ప్రభుత్వానికి ఎన్నికల వేళ లీ మాండె రూపంలో మరో గట్టి ఎదురు దెబ్బ. భారత వ్యాపారవేత్త అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ అట్లాంటిక్ ఫ్లాగ్ ఫ్రాన్స్ అని పిలిచే టెలికాం సంస్థకు అనుకూలంగా ఫ్రెంచ్ అధికారులు సుమారు రూ.11,27 కోట్లు (143.7 మిలియన్ యూరోలు లేదా 162.6 మిలియన్ డాలర్ల ) పన్నులను రద్దు చేసారని అక్కడి జాతీయ వార్తాపత్రిక లీ మాండే నివేదించింది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్తో రాఫెల్ ఒప్పందాన్ని ప్రకటించిన కొన్ని నెలల తరువాత ఈ పరిణామం చోటు చేసుకుందని రిపోర్ట్ చేసింది. లీ మాండే ప్రకారం డస్సాల్ట్ ఏవియేషన్ రఫేల్ ఒప్పందంలో చర్చల సందర్బంగా అనిల్ అంబానీ పన్నుల వివాదానికి 2015, అక్టోబర్లో పరిష్కారం లభించిందని తెలిపింది. ఏప్రిల్, 2015 ప్రధాని మోదీ ఫ్రాన్స్లో అధికారిక పర్యటన సందర్బంగా 36 రఫేల్ ఫైటర్ జెట్ల కొనుగోలు డీల్ను ప్రకటించడం గమనార్హం. 2007 - 2010 మధ్య కాలంలో అంబానీ రిలయన్స్ అట్లాంటిక్ ఫ్లాగ్ ఫ్రాన్స్ కంపెనీ 60 మిలియన్ల యూరోలు పన్నుల ఎగవేతపై అక్కడి పన్ను అధికారులు దర్యాప్తు చేపట్టారు. అయితే 7.6 మిలియన్ యూరోలు చెల్లించేందుకు కంపెనీ ప్రతిపాదించింది. దీన్ని తిరస్కరించిన అధికారులు దర్యాప్తు చేపట్టారని, కానీ ఈ వివాదానికి 2015లో ముగింపు పలికారని లీమాండే నివేదించింది. ఈ కథనంపై అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ అధికారికంగా స్పందించాల్సి ఉంది. కాగా రఫేల్ తీర్పుపై రివ్యూ పిటిషన్లపై కేంద్ర ప్రభుత్వం లేవనెత్తిన అభ్యంతరాలను సుప్రీకోర్టు ఇటీవల తోసిపుచ్చింది. రివ్యూ పిటిషన్ల విచారణకు అంగీకరించిన సర్వోన్నత న్యాయస్థానం త్వరలో విచారణ తేదీని నిర్ణయిస్తామని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. Breaking : French authorities waived taxes worth 143,7 million euros for Anil Ambani's French-based company just a few months after PM Modi announced his plans to buy 36 Rafale fighter jets from Dassault. Our story with @annemichel_LMhttps://t.co/Tpw50cJg0c — julien bouissou (@jubouissou) April 13, 2019 -
రాహుల్పై కోర్టు ధిక్కరణ పిటిషన్
సాక్షి, న్యూఢిల్లీ : రఫేల్ తీర్పుపై కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ‘కాపలాదారే దొంగ’ అంటూ చేసిన వ్యాఖ్యలకు గాను బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి ఆయనపై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును ఈనెల 15న విచారణకు చేపట్టేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది. రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంపై రివ్యూ పిటిషన్ పట్ల కేంద్రం లేవనెత్తిన అభ్యంతరాలను సుప్రీం కోర్టు తోసిపుచ్చిన మీదట కాపలాదారే దొంగ అని సుప్రీం కోర్టు పేర్కొందని రాహుల్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. మరోవైపు కోర్టు ఉత్తర్వుల్లో కనీసం ఒక పేరా కూడా రాహుల్ చదవలేదని తాము భావిస్తున్నామని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ మండిపడ్డారు. తీర్పును పరిశీలించకుండానే రఫేల్ ఒప్పందంలో అవినీతి చోటుచేసుకున్నట్టు కోర్టు చెప్పినట్టుగా, కాపలాదారే దొంగ అని తీర్పు ఇచ్చినట్టు రాహుల్ మాట్లాడటం కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. మై భీ చౌకీదార్ పేరిట ప్రధాని నరేంద్ర మోదీ చొరవతో బీజేపీ చేపట్టిన క్యాంపెయిన్పైనా రాహుల్ భగ్గుమన్న సంగతి తెలిసిందే. సత్యాన్ని ఎవరూ మార్చలేరని, ప్రతి ఒక్కరూ కాపలాదారే దొంగ అంటున్నారని మోదీని ఉద్దేశించి రాహుల్ ఆరోపణలు గుప్పిస్తున్నారు. -
ప్రభువుల రహస్యాలపై ప్రజావిజయం
రఫేల్ యుద్ధవిమానాల కొనుగోల్మాల్ ఆరోపణలపైన సమరం ఇది. ఈ ఒప్పందం గందరగోళంపై దర్యాప్తుకు ఆదేశించాలని బీజేపీ సీనియర్ నాయ కులు, మాజీ మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరీ, ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సుప్రీంకోర్టును కోరారు. అందుకు కారణాలేమీ లేవని సుప్రీంకోర్టు డిసెంబర్ 2018లో కొట్టేసింది. రఫేల్ కొనుగోలు కోసం బేరసారాలు దారి తప్పాయని తెలిపే మూడు కీలకమైన పత్రాలు పత్రికల్లో బయటపడ్డాయి. వెల్లడయిన రక్షణ కొనుగోలు దస్తావేజులు చూపుతూ పిటిషనర్లు సుప్రీం కోర్టు తీర్పును మరోసారి పరిశీలించాలని రివ్యూ పిటి షన్ వేశారు. సుప్రీంకోర్టు ముందుకు కొన్ని కీలకమైన పత్రాలను ప్రభుత్వం తీసుకురాలేదని వాదించారు. అందుకు ఆధారాలుగా ఈ పత్రాలను చూపారు. కీలకమైన ఒప్పందంలో అత్యంత కీలకమైన రహస్య పత్రాలను దొంగిలించడం నేరమని, ఆ పత్రాలను ప్రచురించిన పాత్రికేయులను, ఆ పత్రాల ఆధారంగా పిటిషన్ వేసిన లాయర్లను క్రిమినల్ కోర్టులో ప్రాసిక్యూట్ చేస్తామని అటార్నీ జనరల్ కె. వేణుగోపాల్ కోర్టులో చెప్పడం సంచలనం కలిగించింది. తరువాత పాత్రికేయులను, న్యాయవాదులను ప్రాసిక్యూట్ చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని అటార్నీ జనరల్ ప్రకటించారు. మరికొన్నాళ్లకు తమ రహస్య దస్తావేజులన్నీ భద్రంగా ఉన్నాయని వాటినెవరూ దొంగిలించలేదని మరో వివరణ ఇచ్చారాయన. కానీ అత్యంత రహస్య పత్రాలను కాపీ చేయడం, లీక్ చేయడం నేరాలే అని అందుకు కారణమైన వారిపై దర్యాప్తు జరిపిస్తామని హెచ్చరించారు. మరోవైపు సుప్రీంకోర్టులో ప్రభుత్వ పక్షాన వాదిస్తూ అధికార రహస్యాల చట్టం, సాక్ష్య చట్టం ప్రకారం అక్రమ రహస్య పత్రాలు సాక్ష్యాలే కాబోవని, ఈ రహస్య పత్రాలను ప్రచురించే హక్కు పత్రికలకు లేదని, అక్రమంగా సంపాదించిన ఈ పత్రా లను పరిశీలించే అధికారం కోర్టులకు కూడా లేదని అటార్నీ జనరల్ తీవ్ర అభ్యంతరాలు లేవనెత్తారు. ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్, సంజయ్ కిషన్ కౌల్, కెం.ఎం. జోసెఫ్ వాటిని కొట్టివేస్తూ, పత్రికా స్వాతంత్య్రాన్ని, సమాచార హక్కును నిలబెడుతూ ఏప్రిల్ 10న ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకం. పత్రికలు ఇటువంటి పత్రాలు ప్రచురించకుండా నిషేధించాలని ప్రభుత్వం కోరింది. కానీ, ఆర్టికల్ 19(1)(ఎ) ప్రకారం పత్రికాస్వాతంత్య్రాన్ని అరికట్టే విధానమని, అది సంవిధానానికి విరుద్ధమని కొట్టివేసింది. సాక్ష్య చట్టం సెక్షన్ 123 ప్రకారం ప్రభుత్వం ప్రచురించని పత్రాలను ఆ శాఖ అధినేత అనుమతి లేకుండా సాక్ష్యంగా కోర్టులు పరిశీలించడానికి వీల్లే దని అటార్నీ జనరల్ మరో లా పాయింట్ లేవదీసారు. ఈ పత్రాలు ఇదివరకే హిందూ తదితర పత్రికల్లో ప్రచురితమైన తరువాత వీటిని అప్రచురిత పత్రాలని ఏవిధంగా అంటారు? మొత్తం ప్రజానీకానికి తెలిసిన పత్రాలను రహస్యాలని ఎలా అంటా రని ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రివిలేజ్ కింద ఈ పత్రాలను దాచుకోవాలనుకోవడం కూడా చెల్లదని సుప్రీంకోర్టు చెప్పింది. సమాచార హక్కు చట్టం వచ్చిన తరువాత ఇంకా ఈ రహస్యాలకు ఏ విలువ ఉందనేది ప్రశ్న. ప్రభుత్వ పాలనకు కొన్ని రహస్యాలు అవసరమని, వాటిని వెల్లడిస్తే ప్రభుత్వాలను ప్రజలు అనవసరంగా విమర్శిస్తూ ఉంటారని అందువల్ల పాలనలో ఇబ్బందులు ఏర్పడతాయని ప్రభుత్వ వాదన. ప్రభుత్వపాలనకు కొన్ని రహస్యాలను కాపాడడం అవసరమైతే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ కార్యకలాపాల గురించి తెలుసుకునే ప్రజల హక్కు కూడా ముఖ్యమే. ఈ రెండు అంశాల మధ్య సమతుల్యాన్ని సాధించడానికే సమాచార హక్కు చట్టం ఉపయోగించాలని ఆ చట్టం పీఠిక వివరిస్తున్న విషయాన్ని సుప్రీంకోర్టు ప్రస్తావించింది. సెక్షన్ 8(1)ఎ ప్రకారం సమాచారం వెల్లడిస్తే భారత భద్రతకు, సమగ్రతకు, విదేశీ స్నేహసంబంధాలకు హాని కలుగుతుందని భావిస్తే సమాచారం ఇవ్వాల్సిన పని లేదు. కానీ సెక్షన్ 8(2) ప్రకారం ప్రజాప్రయోజనాన్ని పరిశీ లించి, సమాచారం వెల్లడిస్తే వచ్చే ప్రయోజనం, దాచడంవల్ల కలిగే హానికన్నా అధికమైతే వెల్లడించాల్సి ఉంటుంది. సెక్షన్ 22 ప్రకారం రహస్యాల చట్టంగానీ, మరే ఇతర చట్టంగానీ సమాచార హక్కు చట్ట నియమాలకు విరుద్ధమయితే ఆ మేరకు సమాచార హక్కు చట్టమే చెల్లుతుందని చాలా స్పష్టంగా తేల్చి చెప్పింది. ఐబి, రా వంటి కొన్ని సంస్థలను సమాచార హక్కు చట్టం కిందనుంచి పూర్తిగా తప్పించిన సెక్షన్ 24లో కూడా రెండు మినహాయింపు లున్నాయి. అవినీతికి సంబంధించిన సమాచారాన్ని, మానవహక్కుల ఉల్లంఘన సమాచారాన్ని ఆ సంస్థలు కూడా ఇవ్వాల్సి ఉంటుందని కనుక వెల్లడిపై ఆంక్షలు చెల్లవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇది ప్రభువుల రహస్యాల మీద ప్రజా విజయం. వ్యాసకర్త : మాడభూషి శ్రీధర్, బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార శాఖ మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com -
పారదర్శకతకు నీరాజనం
అనవసరమైన అంశాల్లో గోప్యత పాటిద్దామని ప్రయత్నిస్తే వికటిస్తుంది. రఫేల్ ఒప్పందం పెద్ద కుంభకోణమంటూ ప్రచారం చేస్తున్న ప్రతిపక్షాలకు పారదర్శకంగా వ్యవహరించి దీటైన జవాబి వ్వాల్సిన కేంద్ర ప్రభుత్వం దాన్ని అధికార రహస్యాల మాటున, దేశ రక్షణ మాటున దాచడానికి ప్రయత్నించి భంగపడింది. ఈ వ్యవహారంలో లోగడ వెలువరించిన తీర్పును పునస్సమీక్షిం చాలంటూ దాఖలైన పిటిషన్కు విచారణార్హత లేదని కేంద్రం చేసిన వాదనను బుధవారం సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. అలాగే రఫేల్ ఒప్పందానికి సంబంధించిన పత్రాలను దొంగిలించి ఆంగ్ల దిన పత్రిక ‘ది హిందూ’ కథనాలు రాసిందని, ఇది అధికార రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించడమే అవు తుంది గనుక వాటిని సాక్ష్యాధారాలుగా పరిగణించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం చేసిన వాద నను కూడా తిరస్కరించింది. ఈ తీర్పులో మరో కీలకమైన అంశం– ‘ది హిందూ’ రఫేల్ పత్రాలను ప్రచురించడం రాజ్యాంగం కల్పించిన భావప్రకటనా స్వేచ్ఛలో భాగమేనని, దానికి ఆ హక్కు ఉన్న దని తేల్చిచెప్పడం. రఫేల్ ఒప్పందంపై సమగ్రమైన దర్యాప్తును కోరుతూ దాఖలైన వ్యాజ్యాలను నిరుడు డిసెంబర్లో సుప్రీంకోర్టు తోసిపుచ్చాక ఆ సమస్య ముగిసినట్టేనని కేంద్రం భావించింది. కానీ ‘ది హిందూ’ ప్రచురించిన మూడు కథనాలతో విషయం మొదటికొచ్చింది. అంతక్రితం ఏం చెప్పినా ఆ కథనాలు వెలువడ్డాకైనా ప్రజలకు వాస్తవాలు వెల్లడించి ఉంటే బాగుండేది. ఆ పత్రిక తప్పుడు కథనాలు ప్రచురించిందని భావిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకోవచ్చు అందుకు భిన్నంగా పత్రాలు దొంగిలించారని, ఇది నేరమని వాదించడం అర్ధరహితం. రఫేల్ ఒప్పందంలో జవాబు చెప్పాల్సిన అంశాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా రఫేల్ యుద్ధ విమానాలపై ఏక కాలంలో మన ప్రభుత్వానికి చెందిన రెండు బృందాలు ఫ్రాన్స్తో మంతనాలు జరపడంలోని సహేతుకత ఏమిటో వివరించాలి. అలాగే దీనివల్ల మనకు చాలా నష్టం జరిగిందని రక్షణ మంత్రిత్వ శాఖ తరఫున చర్చలు జరిపిన బృందం వ్యక్తం చేసిన అభిప్రాయంలో నిజమెంతో చెప్పాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంది. ఇదేవిధంగా ఒప్పందానికి బ్యాంకు గ్యారెంటీ తీసు కోనట్టయితే భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తుతాయని కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ ఇచ్చిన సల హాకు భిన్నంగా ఎందుకు వ్యవహరించాల్సివచ్చిందో చెప్పాలి. ఫ్రాన్స్ ప్రధాని ఇచ్చిన ‘లెటర్ ఆఫ్ కంఫర్ట్’ సరిపోతుందని ఎలా అనుకున్నారో వివరించాలి. వీటన్నిటికీ సమాధానాలు ఇవ్వకుండానే సమస్య ముగిసిపోయిందని, సుప్రీంకోర్టు తమకు క్లీన్చిట్ ఇచ్చిందని కేంద్రం భావించడం వల్లనే అది మరింత జటిలంగా మారింది. కొత్త అంశాలు వెల్లడైనప్పుడు ఏ కేసునైనా న్యాయస్థానాలు తిర గదోడతాయి. అలాంటి అవకాశం ఎప్పుడూ ఉంటుందని ప్రభుత్వం ఎందుకు గుర్తించలేకపో యిందో అనూహ్యం. ఒకవేళ దీనిపై పునర్విచారణ అనవసరమనుకుంటే దానికి మద్దతుగా బల మైన వాదనలు వినిపిస్తే వేరుగా ఉండేది. అందుకు భిన్నంగా దొంగిలించారని ఒకసారి... కాదు, వాటి నకళ్లు తీసుకున్నారని మరోసారి వాదించడం ద్వారా ఆ పత్రాల ఆధారంగా వెలువడిన కథ నాల్లో వాస్తవమున్నదని అంగీకరించినట్టయింది. పోనీ అలా అంగీకరించి, ఆ నిర్ణయాలను సహే తుకంగా సమర్ధించుకుంటే ఎవరూ అభ్యంతరపెట్టరు. ఆ జోలికి పోకుండా దొంగిలించిన పత్రాలు గనుక అసలు వాటిని పరిగణనలోకే తీసుకోరాదన్న తర్కానికి దిగింది. దీనికి ధర్మాసనం అంగీ కరించలేదు. తాము వెల్లడించదల్చుకోని అంశాలన్నిటినీ గంపగుత్తగా అధికార రహస్యాలుగా పరిగణిం చడం ప్రభుత్వాలకు అలవాటుగా మారింది. గోప్యత పేరు చెప్పి ప్రజాప్రయోజనంతో ముడిపడి ఉండే అనేక అంశాలను ప్రభుత్వాలు వెల్లడి కానీయడం లేదు. సమాచారాన్ని తెలుసుకునే హక్కు వాక్స్వాతంత్య్రంలో భాగమేనని సర్వోన్నత న్యాయస్థానం పలు సందర్భాల్లో చెప్పింది. కనుక అధి కార రహస్యాల చట్టం కింద కేసులు పెట్టడం వాక్ స్వాతంత్య్రాన్ని, భావవ్యక్తీకరణ స్వేచ్ఛను హరించడమే అవుతుంది. మన రాజ్యాంగంలోని 19(2) అధికరణ వాక్ స్వాతంత్య్రంపై ఆంక్షలు విధించడానికి సహేతుకమైన కారణాలు చెప్పమంటున్నది. కానీ అధికార రహస్యాల చట్టం దీన్ని విస్మరించింది. ప్రభుత్వాలకు బయటపెట్టడం ఇష్టం లేని ఏ అంశమైనా ఈ చట్టం పరిధిలోకొస్తుంది. వెనువెంటనే దానికింద చర్యలు మొదలవుతాయి. ఒకపక్క ప్రజాస్వామిక దేశమని ఘనంగా ప్రక టించుకుంటూ ఇలా విచక్షణారహితంగా వ్యవహరించే ధోరణి సరికాదు. నిజానికి మన దేశంలో సాగుతున్న స్వాతంత్య్రోద్యమాన్ని అణిచేయడానికి బ్రిటిష్ పాలకులు తెచ్చిన చట్టమిది. ఈ సందర్భంగా పెంటగాన్ పత్రాల విషయంలో అక్కడి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును న్యాయ మూర్తులు ఉదాహరించారు. వియత్నాం యుద్ధంపై ప్రభుత్వం పౌరులకు అసత్యాలు చెబుతున్న దని చెబుతూ అందుకు సాక్ష్యంగా ‘న్యూయార్క్టైమ్స్’ అధికారిక పత్రాలను ప్రచురించింది. వీటిని అడ్డుకోవడం చెల్లదని అమెరికా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ధర్మాసనంలోని ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ కౌల్ అభిప్రాయాలతో ఏకీభవిస్తూనే జస్టిస్ కేఎం జోసెఫ్ విడిగా రాసిన తీర్పు పత్రికాస్వేచ్ఛకు నీరాజనాలు పట్టింది. అదే సమయంలో మీడియా నిర్వహిం చాల్సిన, నిర్వహిస్తున్న పాత్రపై నిశితంగా వ్యాఖ్యానించింది. చలనశీలమైన ప్రజాస్వామ్యం వర్థిల్ల డానికీ, అది బలపడటానికి మీడియా నిర్వహిస్తున్న పాత్రను కొనియాడుతూనే దానిద్వారా ప్రస రించే సమాచారమంతా సత్యనిష్టకు లోబడి ఉండాలి తప్ప ఇతరత్రా అంశాలతో కలుషితం కాకూ డదని తీర్పు హితవు చెప్పింది. అలా కలుషితం కావొద్దని డిమాండ్ చేసే హక్కు వినియోగదారు లకు ఉంటుందని కూడా గుర్తుచేసింది. ఈ విషయంలో మీడియా ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవ సరం ఉందని వేరే చెప్పనవసరం లేదు. ఏదేమైనా రఫేల్ వివాదం సాధ్యమైనంత త్వరగా ముగిసి మన రక్షణ దళాలు కోరుకున్న యుద్ధ విమానాలు సకాలంలో వారికి చేరుతాయని ఆశిద్దాం. -
రఫేల్ కేసు : కేంద్రానికి సుప్రీం షాక్
సాక్షి, న్యూఢిల్లీ : రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంలో కేంద్రానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రఫేల్ తీర్పుపై రివ్యూ పిటిషన్లపై కేంద్ర ప్రభుత్వం లేవనెత్తిన అభ్యంతరాలను సర్వోన్నత న్యాయస్ధానం తోసిపుచ్చింది. రివ్యూ పిటిషన్ల విచారణకు అంగీకరించిన సుప్రీం త్వరలో విచారణ తేదీని నిర్ణయిస్తామని స్పష్టం చేసింది. రఫేల్ ఒప్పంద పత్రాలను తస్కరించారన్న కేంద్ర ప్రభుత్వ అభ్యంతరాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్, జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్లతో కూడిన ధర్మాసనం తోసిపుచ్చుతూ తీర్పును వెలువరించింది. రఫేల్ ఒప్పందంలో విచారణ చేపట్టాల్సిన అంశాలేమీ లేవని గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ విపక్షాలు సర్వోన్నత న్యాయస్ధానాన్ని ఆశ్రయించి రివ్యూ పిటిషన్ను దాఖలు చేసిన సంగతి తెలిసిందే. నూతన అంశాలతో పిటిషనర్లు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్లపై విచారణ కొనసాగిస్తామని కోర్టు తేల్చిచెప్పింది. -
వాద్రాతో పాటు మోదీనీ విచారించాలి : రాహుల్
చెన్నై : ఆరోపణలు ఎదుర్కొనే ప్రతి ఒక్కరినీ విచారించే హక్కు ప్రభుత్వానికి ఉందని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ అన్నారు. చట్టం ప్రతి ఒక్కరికీ వర్తించాలని, కేవలం ఎంపిక చేసుకున్న కొందరికే కాదని ప్రధాని మోదీకి చురకలు అంటించారు. రఫేల్ ఒప్పందంపై ప్రధాని సమాంతర చర్చలు జరిపారని ప్రభుత్వ పత్రాల్లోనే వెల్లడైందని, ఆరోపణలు వచ్చిన ప్రతిఒక్కరిపై వాద్రా అయినా ప్రధాని మోదీ అయినా అందరినీ విచారించాలని డిమాండ్ చేశారు. రాహుల్ బుధవారం చెన్నైలోని స్టెల్లా మేరీస్ కళాశాలలో పెద్దసంఖ్యలో హాజరైన విద్యార్థినులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నడైనా 3000 మంది మహిళల మధ్యలో నిలుచుని ఇలా మాట్లాడారా..? మీరు అడిగే ప్రశ్నలకు బదులిచ్చారా అని నిలదీశారు. దేశంలో ప్రస్తుతం రెండు భిన్న సిద్ధాంతాల మధ్య పోరాటం సాగుతోందని, ప్రజలంతా కలిసిమెలిసి ఐక్యంగా జీవించాలన్నది ఒక సిద్ధాంతమైతే, తమ భావజాలాన్ని దేశంపై రుద్దాలని మోదీ సర్కార్ అనుసరిస్తున్న మరో సిద్ధాంతమని చెప్పుకొచ్చారు. -
‘రఫేల్ ఒప్పంద పత్రాలు భద్రం’
సాక్షి, న్యూఢిల్లీ : రఫేల్ ఒప్పంద పత్రాలు గల్లంతు వ్యవహారం కలకలం రేపడంతో ప్రభుత్వం నష్టనివారణ చర్యలు చేపట్టింది. రఫేల్ ఒప్పంద పత్రాలు రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి చోరీకి గురికాలేదని, వాటి నకళ్లను మాత్రమే పిటిషనర్లు తమ దరఖాస్తుల్లో వాడారని మాత్రమే తాను సుప్రీం కోర్టు ఎదుట పేర్కొన్నానని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ వివరణ ఇచ్చారు. రఫేల్ యుద్ధ విమాన ఒప్పంద పత్రాలు చోరీ అయ్యాయని బుధవారం సర్వోన్నత న్యాయస్ధానంలో ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. సున్నితమైన సమాచారం కలిగిన ఈ పత్రాలు మాయం కావడంపై విచారణ జరిపించాలని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి రఫేల్ పత్రాలు చోరీకి గురయ్యాయని విపక్షాలు చేస్తున్న ఆరోపణలు సత్యదూరమని కేకే వేణుగోపాల్ పేర్కొన్నారు. రఫేల్ తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేసిన యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరీ, ప్రశాంత్ భూషణ్లు తమ దరఖాస్తులో అనుబంధంగా ఒరిజినల్ పత్రాల ఫోటోకాపీలను వాడారని వేణుగోపాల్ పేర్కొన్నారు. కాగా అటార్నీ జనరల్ చోరీ అనే పదాన్ని వాడకుండా ఉండాల్సిందని అధికార వర్గాలు సైతం వ్యాఖ్యానించాయి. మరోవైపు ఈ పత్రాల ఆధారంగా కథనాలను ప్రచురించినందుకు అధికార రహస్యాల చట్టం కింద కేసు నమోదు చేస్తామని ప్రభుత్వం ది హిందూ వార్తాపత్రికను హెచ్చరించింది. -
రఫేల్ ‘దొంగ’ రహస్యం!
రఫేల్ యుద్ధవిమానాల కొనుగోలు సంగతులు దర్యాప్తు చేయాలా, వద్దా అనే అంశంలో సుప్రీంకోర్టు కీలకమైన విచారణ మళ్లీ జరపవలసి వచ్చింది. రఫేల్ డీల్ అమలు, విమానాల కొనుగోలు, ధరల విషయంలో ఏ మార్పు లేకుండా కొనసాగించవచ్చని సుప్రీంకోర్టు తొలుత భావించింది. కానీ ఆ నిర్ణయానికి రావడానికి ఆధారమైన పత్రాలలో అనుమానాలు ఉండడం వల్ల సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై తీవ్రవాదనలు ప్రతి వాదనలువిన్నారు. పునఃసమీక్షా పిటిషన్ కొట్టి వేయాలని అటార్నీ జనరల్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రార్థించింది. హిందూ తదితర పత్రికల్లో వచ్చిన కీలక పత్రాలను పిటిషనర్లు ఉటంకిస్తూ ఈ కేసును తిరగతోడవలసిందేనని కోరారు. భారత అటార్నీ జనరల్ కె.కె. వేణుగోపాల్ చేసిన వాదనల ప్రభావం ఏవిధంగా ఉంటుందో అనే చర్చ సాగుతున్నది. రెండు పత్రికలలో ప్రచురించిన పత్రాలను ఆధారం చేసుకుని ప్రశాంత్ భూషణ్, అరుణ్ శౌరీ, యశ్వంత్ సిన్హా వాదిస్తున్నారనీ, ఆ పత్రాలను ప్రస్తుత లేదా మాజీ పబ్లిక్ సర్వెంట్లు దొంగిలించి వారికి ఇచ్చి ఉంటారని, ఇవి రఫేల్ డీల్కు చెందిన రహస్య పత్రాలనీ ఏజీ వేణుగోపాల్ అన్నారు. ఈ రహస్యపత్రాలు దొంగిలించిన వారి మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటామని కూడా సుప్రీంకోర్టుకు వివరించారు. అంటే హిందూ ఎడిటర్ ఎన్ రాం మీద, ప్రశాంత్ భూషణ్ మీద అధికార రహస్యాల చట్టం కింద క్రిమినల్ కేసులు ఉంటాయా? ముందు ఆ పత్రాలు దొంగిలించిన వారి మీద చర్యలు తీసుకుంటామని చెప్పినా ఆ తరువాత కాసేపటికి జర్నలిస్టుల మీద, లాయర్లమీద చర్యలు ఉండబోవని అటార్నీ జనరల్ వివరణ ఇచ్చారు. అంటే రక్షణ శాఖ నుంచి బయటకి ఈ రహస్యాలు పొక్కడానికి కారకులైన అధికారులపై చర్యలు తీసుకుంటారేమో? ఏ దేశంలోనూ రక్షణ ఒప్పందాలమీద కోర్టుల్లో కేసులు వేయరని, కోర్టులు విచారించవని కూడా ఆయన అన్నారు. అయితే బోఫోర్స్ కేసుల సంగతేమిటని సుప్రీంకోర్టు అడిగింది. డిఫెన్స్ డీల్లో సంప్రదింపులు బేరసారాలు సాగిస్తున్న ఏడుగురు సభ్యుల బృందంలో ముగ్గురి అసమ్మతి పత్రం పత్రికలలో దర్శనమిచ్చింది. ఆ అసమ్మతి అవాస్తవమని ప్రభుత్వం వాదించడం లేదు. అది దొంగ పత్రం అనడం లేదు. అది దొంగి లించిన పత్రం కనుక ముట్టుకోవద్దంటున్నది ప్రభుత్వం. అవి దొంగ పత్రాలు కావనీ, అంటే అవి నిజాలనీ, ప్రమాదకరమైన నిజాలనీ దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అధికార రహస్యాలన్న పదమే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ప్రభుత్వం అధికారికంగా చేసిన అంశాలు రహస్యాలు ఎందుకవుతాయి? సమాచార హక్కు చట్టం వచ్చినపుడు అధికార రహస్యాల చట్టం పోయిందనుకుని ఎంపీ రాం జెఠ్మలానీ ఆ కఠిన చట్టం తీసివేసినందుకు ప్రభుత్వాన్ని అభినందించారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఈ చట్టాన్ని కాంగ్రెస్, కాంగ్రెసేతర ప్రభుత్వాలు, బీజేపీతో కూడిన ఎన్డీయే ప్రభుత్వాలు కూడా వాడుకుంటున్నాయి. సమాచార హక్కు చట్టంతో అధికార రహస్యాల చట్టం విభేదిస్తే ఆ మేరకు సమాచార హక్కు చట్టం అమలవుతుందే కానీ అధికార రహస్య చట్టం పనిచేయదని సమాచార హక్కు చట్టంలో చాలా స్పష్టంగా వివరించారు. జాతీయ భద్రత కోసం రహస్యాలు కాపాడవచ్చునని, జాతీయ భద్రతతో సంబంధం లేని భాగాలను సమాచార హక్కు చట్టం ప్రకారం వెల్లడించాలని కూడా ఎన్నో సందర్భాలలో నిర్ధారిం చారు. ఒకే పత్రంలో భద్రతా రహస్యాలు, భద్రతకు సంబంధంలేని అంశాలు ఉంటే, రక్షించవలసిన అంశాలు తొలగించి, మిగిలిన సమాచారం ఇవ్వాలని కూడా చట్టంలో స్పష్టంగా ఉంది. రక్షణ రంగం సమాచార హక్కు చట్టం పరిధిలోనే ఉంది. రఫేల్ డీల్లో భారతదేశ భద్రతకు సంబంధిం చిన అంశాలేమయినా ఉంటే ప్రశాంత్ భూషణ్కు, అరుణ్ శౌరీకి, యశ్వంత్ సిన్హాకే కాదు ఎవరికీ ఇవ్వకూడదు. కానీ బేరసారాల విషయంలో వచ్చిన తేఢాలు, భిన్నాభిప్రాయాలు జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలు అవుతాయా? పెంచిన ధరలు, చెల్లించిన డబ్బు కూడా రహస్యాలేనా? విపరీతంగా పెంచిన ధరలు, విమానాల సంఖ్యను 126 నుంచి 36కు తగ్గించడం వెనుక కారణాలు కూడా రహస్యాలేనా? బేరసారాల బృందంలోనే ముగ్గురి తీవ్ర అసమ్మతి కూడా రహస్యమేనా? నేరం జరిగిందని ఆరోపణ రాగానే సాక్ష్యాలేవీ అంటారు. సాక్ష్యం చూపగానే నీకెలా వచ్చిందంటారు. దొంగతనం చేశావంటారు. మా ప్రైవసీని భంగపరిచి సాక్ష్యాలను సేకరిస్తావా? ముందు నీవు జైలుకు వెళ్లు అంటారు. రహస్యాలు, ప్రైవసీ తెరల చాటున నేరాలు, లంచాలు వర్థిల్లడమేనా రాజ్యాంగ పాలన? వ్యాసకర్త: మాడభూషి శ్రీధర్, బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార శాఖ మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com -
అధికారం–రహస్యం!
కేంద్ర ప్రభుత్వమూ, బీజేపీ నేతలూ రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై సాగుతున్న రగడకు ముగింపు పలకాలని ఎంత ప్రయత్నిస్తున్నా అందులో కొత్త కొత్త విషయాలు వెలుగుచూస్తు న్నాయి. ఆ ఒప్పందం విషయంలో దాఖలైన వ్యాజ్యాలను కొట్టేస్తూ గత డిసెంబర్ 14న ఇచ్చిన తీర్పును పునస్సమీక్షించాలని సుప్రీంకోర్టును కోరుతూ ప్రశాంత్ భూషణ్ దాఖలు చేసిన పిటిషన్పై వాదప్రతివాదాలు జరిగిన బుధవారంనాడే ఆంగ్ల దినపత్రిక ‘ద హిందూ’ రాసిన కథనం పెను సంచలనం సృష్టించింది. ఇలాంటి కథనాలు అధికారంలో ఉన్నవారిని సహజంగానే ఇబ్బంది పెడ తాయి. వారు సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ ఆశ్చర్యకరంగా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో విచిత్రమైన వాదన చేసింది. యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం పత్రాలు రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి చోరీ అయ్యాయని, వాటి ఆధారంగా ఆ పత్రిక రఫేల్పై వరస కథనాలు రాస్తూ అధికార రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించిన నేరానికి పాల్పడిందని అటార్నీ జనరల్(ఏజీ) కెకె వేణుగోపాల్ ధర్మాసనానికి చెప్పారు. ఈ దొంగతనం నేరంపై దర్యాప్తు జరుగు తున్నదని వివరించారు. కానీ ఈ క్రమంలో మీడియాలో వెలువడిన కథనం సరైందేనని పరోక్షంగా ఆయన అంగీకరించినట్టయింది. రఫేల్ ఒప్పందంపై కావొచ్చు... మరొక అంశంలో కావొచ్చు మీడియాలో వెలువడుతున్న కథనాలు తప్పయితే వాటిపై అధికారంలో ఉన్నవారు వివరణ ఇవ్వొచ్చు. వాస్తవాలేమిటో ప్రజలకు వివరించవచ్చు. తప్పుడు సమాచారం అందించినందుకు మీడియా సంస్థలపై చట్టప్రకారం చర్య తీసుకోవచ్చు. పొరపాట్లకు మీడియాతో సహా ఎవరూ అతీతులు కాదు. కానీ ఏజీ చేసిన వాదన భిన్నంగా ఉంది. ‘హిందూ’ పత్రిక గత నెల 8న ప్రచురించిన కథనం, ఆ తర్వాత వెలువడిన కథ నాలు, తాజాగా బుధవారం అదే పత్రిక రాసిన కథనం రఫేల్ ఒప్పందంపై ప్రభుత్వం చేస్తున్న వాదనలపై సందేహాలు కలిగించాయి. వీటిలో ఏది నిజమో తెలుసుకోవాలని పౌరులు సహజం గానే కోరుకుంటారు. ఈ సమయంలో సంతృప్తికరమైన వివరణనివ్వకపోగా ఒప్పంద పత్రాలను ఎవరో దొంగిలించారని చెప్పడం వింత కాదా? ఇంతకూ ‘హిందూ’ తాజా కథనం ఏం చెబు తోంది? రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందంపై ఏకకాలంలో సమాంతరంగా రెండు బృందాలు ఫ్రాన్స్తో మంతనాలు జరపడం పర్యవసానంగా కలిగిన నష్టం గురించి రక్షణ మంత్రిత్వ శాఖ బృందం ఒక నివేదికలో ఏకరువు పెట్టిందని తెలిపింది. అలాగే ఒప్పందానికి బ్యాంకు గ్యారెంటీ తీసుకోనట్టయితే మనకు నష్టం జరుగుతుందని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ వ్యక్తం చేసిన అభి ప్రాయానికి భిన్నంగా ఫ్రాన్స్ ప్రధాని ఇచ్చే ‘లెటర్ ఆఫ్ కంఫర్ట్’తో సరిపెట్టుకుని ఒప్పందానికి అంగీకరించారని కూడా ఆ పత్రిక వివరించింది. గ్యారెంటీలుంటే బ్యాంకులు తీసుకునే కమిషన్లు కూడా కలిసి ఒప్పందం తడిసి మోపెడవుతుందని చెప్పినవారు... అటువంటివి లేకుండానే ఒప్పం దం వ్యయాన్ని పెంచేశారని ఆ కథనం వెల్లడించింది. లోగడ అదే పత్రిక వెల్లడించిన కథనం కూడా కీలకమైనదే. రఫేల్ ఒప్పందంపై రక్షణ శాఖ బృందం చర్చిస్తుండగా ప్రధాని కార్యాలయం (పీఎంఓ) అధికారులు కూడా అదే అంశంపై ఫ్రాన్స్తో మంతనాలు జరపడం సరికాదని అప్పటి రక్షణ మంత్రి మనోహర్ పరికర్ దృష్టికి రక్షణ అధికారులు తీసుకొచ్చారని ఆ కథనం వెల్లడించింది. రఫేల్ ఒప్పందంపై సాగుతున్న వివాదం త్వరగా ముగిసిపోవాలని కేంద్రం ఆశిస్తోంది. ప్రజలు ఆశిస్తున్నదీ అదే. కానీ అందుకు పారదర్శకంగా వ్యవహరించడం, అన్ని రకాల సందేహా లకూ సవివరమైన, సహేతుకమైన జవాబులివ్వడం అవసరం. అలాగైతేనే అది సాధ్యమైనంత త్వరగా సమసిపోతుంది. గతంలో రాజీవ్గాంధీ హయాంలో జరిగిన బోఫోర్స్ శతఘ్నుల కొను గోలులో కుంభకోణం జరిగిందని ఆరోపణలొచ్చినప్పుడు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిజాలను తొక్కిపెట్టాలని చూడటంతో అది పెను భూతంలా మారిన సంగతి ఎవరూ మరిచిపోరు.ఈ వ్యవ హారంలో కీలక పాత్రధారి ఒట్టావియో కత్రోకి 2013లో మరణించడంవల్లా, సీబీఐ చేతులెత్తేయడం వల్లా చివరకు అది అటకెక్కింది. అయితే కాంగ్రెస్పై ఈనాటికీ ఆ మచ్చ పోలేదు. రక్షణ కొనుగోళ్ల ఒప్పందాలు వివాదాల్లో చిక్కుకుంటే మన సైనిక దళాల అవసరాలు తీరడంలో జాప్యం జరుగు తుంది. అది దేశ భద్రతకు మంచిది కాదు. పాలకులు పారదర్శకంగా ఉంటే ఈ జాప్యాన్ని నివారిం చడం అసాధ్యమేమీ కాదు. ధర్మాసనం ముందు ఏజీ చేసిన వాదన ఆ దిశగా లేదు సరిగదా... అది మీడియాను బెదిరించే పద్ధతుల్లో ఉంది. దేశంలో వివిధ భాషల్లో పత్రికలు వెలువడటం మొదలవుతున్న దశలో వాటిని నియంత్రిం చడం కోసం, ప్రజలకు వాస్తవాలు అందకుండా చేయడం కోసం 1889లో బ్రిటిష్ వలస పాలకులు ఈ అధికార రహస్యాల చట్టం తీసుకొచ్చారు. దాన్ని 1904లో మరిన్ని కఠిన నిబంధనలు చేరుస్తూ సవరించారు. ప్రస్తుతం ఉనికిలో ఉన్న చట్టం 1923లో సవరించింది. ఈ చట్టం కొనసాగడం మన మహోన్నతమైన స్వాతంత్య్రోద్యమానికి అపచారం చేయడం. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం. కానీ కేంద్రంలో కాంగ్రెస్ మొదలుకొని ఎన్ని పార్టీలు అధికారంలోకొచ్చినా... సమాచార హక్కు చట్టం వచ్చి దాదాపు పదిహేనేళ్లు అవుతున్నా ఈ అప్రజాస్వామిక చట్టం కొనసాగుతూనే ఉంది. మన పార్టీల చిత్తశుద్ధిని, మన ప్రజాస్వామ్యాన్ని వెక్కిరిస్తూనే ఉంది. కాలం చెల్లిన చట్టాలను సమీక్షించి బుట్టదాఖలా చేస్తామని నాలుగేళ్లక్రితం కేంద్రం ప్రకటించినప్పుడు అందరూ హర్షిం చారు. ఆ సమీక్ష ఎంతవరకూ వచ్చిందో తెలియదుగానీ... ఇటువంటి చట్టాలు మాత్రం క్షేమంగా కొనసాగుతున్నాయి. ఈ చట్టం విషయంలో కేంద్రం వైఖరిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ సంధించిన ప్రశ్నలు పాలకుల కళ్లు తెరిపించాలి. రఫేల్ ఒప్పందంలో అన్ని కీలకాం శాలనూ ప్రజలముందు ఉంచడంతోపాటు అధికార రహస్యాల చట్టాన్ని తక్షణం ఎత్తేయాలి. -
మోదీకి రాహుల్ చురకలు
సాక్షి, న్యూఢిల్లీ : రఫేల్ ఒప్పందంలో ప్రధాని నరేంద్ర మోదీని విచారించాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. రఫేల్ ఒప్పందంలో ప్రధాని మోదీ బైపాస్ సర్జరీ చేశారు. అనిల్ అంబానీకి ప్రయోజనం చేకూర్చేలా ఒప్పందంలో జాప్యం చేశారని రాహుల్ వ్యాఖ్యానించారు. 2016లో నోట్ల రద్దు తర్వాత లక్షలాది ఉద్యోగాలు గల్లంతైన తరహాలో రఫేల్ ఒప్పందానికి సంబంధించిన ఫైళ్లు మాయమయ్యాయని రాహుల్ ఎద్దేవా చేశారు. రఫేల్ ఒప్పందానికి సంబంధించి కీలక పత్రాలు చోరీ అయ్యాయని సుప్రీం కోర్టులో ప్రభుత్వం పేర్కొన్న నేపథ్యంలో రాహుల్ వ్యంగ్యాస్ర్తాలు సంధించారు. ‘ఈ రోజుల్లో అన్నీ అదృశ్యమవుతున్నాయి..రెండు కోట్ల మంది ఉద్యోగాలు కనుమరుగయ్యాయి..ప్రజలందరి ఖాతాల్లో రూ 15 లక్షలు జమచేస్తానన్న హామీ మాయామైంది...వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కనుమరుగైంది..ఇప్పుడు రఫేల్ ఫైళ్లు మాయమయ్యా’యని రాహుల్ పేర్కొన్నారు. -
‘రక్షణ’లో రాజీనా?
రఫేల్ యుద్ధవిమానాల కొనుగోలు వ్యవహారంపై ఎన్డీయే ప్రభుత్వానికి అనుకూలంగా కాగ్ నివేదిక ఉన్నప్పటికీ.. గత, ప్రస్తుత ప్రభుత్వాలు భారత రక్షణ ఒప్పందాల్లో అనుసరించిన విధానాలను మాత్రం ఘాటుగానే విమర్శించింది. అధికారంలో ఎవరున్నా.. రక్షణ ఒప్పందాల్లో అవినీతి ఆరోపణలు వస్తుండడం వల్ల నాణ్యత లేని ఆయుధాలు భారత్కు వస్తున్నాయా? అన్న అనుమానం ప్రజల్లో ఎదురవుతోందని కాగ్ పేర్కొంది. సర్వసాధారణంగా రక్షణ ఒప్పందాల్లో నెలకొంటున్న లొసుగులను కాగ్ నివేదిక వివరించింది. వాయుసేన విధానాల్లో లోపాలు విదేశాల నుంచి ఆయుధాలు కొనుగోలు చేయాలంటే భారత వాయుసేన తమ నిబంధనలు, వాతావరణ పరిస్థితుల మేరకు ఎలాంటి ఆయుధాలు ఉండాలో, ఎంత ధర ఉండాలో.. ఎంతమేరకు సైనిక అవసరాలున్నాయో ముందే స్పష్టంగా చెప్పాలి. కానీ వాయుసేనకి ఈ అంశాలపై స్పష్టత కొరవడింది. ఎయిర్ స్టాఫ్ క్వాలిటేటివ్ రిక్వైర్మెంట్స్ (ఏఎస్క్యూఆర్) సూత్రీకరణ విధానాలను మెరుగుపరచుకోకపోవడం వల్ల భారత్ పలు ఆయుధాల ఒప్పందాల్లో తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. అపాచి అటాక్ హెలికాప్టర్లు, చినూక్ హెవీ లిఫ్ట్ హెలికాప్టర్లను అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థ నుంచి కొనుగోలు చేయడానికి 2015లో మోదీ సర్కార్ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే వాటికి బదులుగా రష్యాకు చెందిన మిల్ ఎంఐ–26 హెలికాప్టర్లను కొనుగోలు చేసి ఉంటే భారత్కు ఎంతో ప్రయోజనకరంగా ఉండేదనే చర్చ జరుగుతోంది. యుద్ధ ప్రాంతాలకు సైనికుల్ని, ఆయుధాల్ని చేరవేయడంలో చినూక్ కంటే మిల్ ఎంఐ–26కున్న సామర్థ్యం రెట్టింపని కొందరి వాదన. వాయుసేన తన అవసరాలను తక్కువ చేసి చూపించడంతో ప్రభుత్వం బోయింగ్తో ఒప్పందాన్ని కుదుర్చుకుందని తెలుస్తోంది. ప్రామాణిక ధరల్లో మార్పు ఆయుధాల కొనుగోలు వ్యవహారంలో సర్వసాధారణంగా ప్రభు త్వం ఒక ప్రామాణిక ధరను నిర్ణయించాలి. దానికి అనుగుణంగా వచ్చిన టెండర్లనే తీసుకోవాలి. కానీ ప్రభుత్వం కొందరికి లబ్ధి చేకూర్చేందుకు టెండర్లని విప్పిచూసిన తర్వాత కూడా ఆ ధరల్ని మార్చేస్తుందని కొందరు ఆరోపిస్తున్నారు. డాప్లర్ వెదర్ రాడార్స్, అపాచి అటాక్ హెలికాఫ్టర్ల కొనుగోలులో అత్యంత కీలకమైన వాయుసేన ప్రమాణాలను (ఏఎస్క్యూఆర్) అమ్మకందారులు పాటించకపోయినప్పటికీ కాంట్రాక్టుల్ని అప్పగించారనే విమర్శలున్నాయి. బిడ్లు మార్చుకునే అవకాశం ఆయుధాల కొనుగోలుకు టెండర్లను పిలిచాక విక్రేతలు బిడ్ వేస్తే దాన్ని మార్చే చాన్స్ ఇవ్వకూడదు. కానీ యూపీఏ ప్రభుత్వం యథేచ్ఛగా ఈ నిబంధనను తుంగలో తొక్కిందనే విమర్శలున్నాయి. 2012లో యూపీఏ హయాంలో స్విట్జర్లాండ్కు చెందిన పిలాటస్ కంపెనీకి బిడ్ మార్చుకునే అవకాశం ప్రభుత్వం కల్పించిందని విపక్షాలు ఆరోపించాయి. అప్పుడప్పుడే విమానాల తయారీ రంగంలోకి అడుగుపెట్టిన అతి చిన్న కంపెనీకి అలాంటి అవకాశం ఇవ్వడం వల్ల భారత్కు నాసిరకమైన విమానాలే వచ్చాయి. నిర్వహణ వ్యయంపై అవగాహన లేదు గతంలో.. ఆయుధాలైనా, యుద్ధ విమానాలైనా తక్కువ ధరకి వస్తున్నాయి కదా అని సంస్థ స్థాయిని చూడకుండా కొనుగోలు జరిగింది. వాటి నిర్వహణ వ్యయంపై ప్రభుత్వాలకు కనీస అంచనాలు ఉండకపోవడంతో భారీగా నష్టాలొచ్చాయి. స్విస్ పిలాటస్ విమానాల నిర్వహణ భారాన్ని మోయలేక.. వాటి వాడకాన్ని 2017లో మోదీ సర్కార్ నిలిపివేసింది. అదే ఆ విమానాల కొనుగోలుకు ముందే ఆలోచించి ఉంటే ఆర్థికంగా చాలా మేలు జరిగేది. ఒప్పందాల్లో జాప్యాలు.. రక్షణ ఒప్పందాలు కుదుర్చుకోవడంలో ప్రభుత్వం చేస్తున్న జాప్యాలు కూడా మరో ప్రతికూల అంశమే. నాలుగు ఒప్పందాలకు మూడేళ్ల కంటే ఎక్కువ సమయం పడితే, ఏడు ఒప్పందాలు కుదరడానికి అయిదేళ్ల కంటే ఎక్కువ పట్టింది. వివిధ స్థాయిల్లో అనుమతులు కావాల్సి ఉండడం, అధికారుల్లో నెలకొన్న అలసత్వం వల్లే ఈ జాప్యాలు జరుగుతున్నాయని కాగ్ నివేదిక విమర్శించింది. జాప్యాలతో ధరల భారం.. ఇలా సంవత్సరాల తరబడి జాప్యం జరగడం వల్ల ఆయుధాల ధరలు పెరిగిపోవడంతో.. దేశ ఖజానాపై అదనపు భారం పడుతోంది. రష్యా లేదా కామన్వెల్త్ దేశాల నుంచి ఆయుధాల కొనుగోలులో ప్రతీ ఏడాది జాప్యానికి 5% ధర పెంచడానికి మన ప్రభుత్వం గతంలోనే అనుమతినిచ్చింది. అదే యూరోపియన్ దేశాలకు 3.5% పెంచుకునేలా నిర్ణయించింది. కానీ మార్కెట్ ధరల్ని పరిశీలించి చూస్తే మన దేశం అనుమతించిన దానికి సగానికి సగం తక్కువగా ఉండడం గమనార్హం. అయినప్పటికీ భారత్ ప్రభుత్వం ఏమీ పట్టనట్టు వ్యవహరించడం విమర్శలకు దారి తీస్తోంది. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
చెప్పాల్సిందంతా చెప్పేశాం.. అవన్నీ అబద్ధాలే..
-
అవన్నీ అబద్ధాలే... అంతా చెప్పేశాం..
న్యూఢిల్లీ : రఫెల్ ఒప్పందంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణమంత్రి నిర్మలా సీతారామన్, అనీల్ అంబానీలపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీ శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రఫెల్ కుంభకోణంలో మోదీ పాత్ర ఉందని నిరూపితం అయిందని ఆయన అన్నారు. ఈ అంశంపై ప్రధాని మోదీతో పాటు నిర్మలా సీతారామన్ చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలేనన్నారు. ఫ్రాన్స్ ప్రభుత్వంతో పీఎంవో నేరుగా చర్చలు జరిపిందంటూ... 2017 నాటి రక్షణశాఖ నోట్ను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. దేశానికి చౌకీదారే దొంగ అని రుజువైందంటూ రాహుల్ ఆరోపించారు. రాహుల్ మాట్లాడుతూ.. ‘అనిల్ అంబానీకి రూ.30వేల కోట్లు దోచిపెట్టారు. గత ఏడాది నుంచి మేం అడుగుతున్న ప్రశ్నలకు జవాబు చెప్పడం లేదు. రఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంలో అనిల్ అంబానీ పేరును ప్రధాని మోదీనే సూచించారంటూ ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడే స్వయంగా చెప్పారు. ఈ కుంభకోణంపై పార్లమెంట్ జేఏసీ విచారణ చేయాలి. ఉన్నతస్థాయి కమిటీ చర్చలు జరుపుతున్నప్పుడు మోదీ ప్రమేయం ఎందుకు?. రక్షణ శాఖ వ్యతిరేకించినా ఎందుకు ఒప్పందం చేసుకున్నారు. మోదీ సర్కార్ సుప్రీంకోర్టును కూడా తప్పుదోవ పట్టించింది. మనీ ల్యాండరింగ్ కేసులో రాబర్ట్ వాద్రా, ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరాన్ని ప్రశ్నించుకోవచ్చు. అయితే రఫెల్ కుంభకోణంపై విచారణ జరపాల్సిందే’ అని డిమాండ్ చేశారు. చెప్పాల్సిందంతా చెప్పేశాం: నిర్మలా సీతారామన్ మరోవైపు రఫెల్ ఒప్పందంపై శుక్రవారం లోక్సభలో అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం చోటుచేసుకుంది. కాంగ్రెస్ సభ్యుల నిరసలన మధ్యే ఇదే అంశంపై రక్షణమంత్రి నిర్మలా సీతారామన్ వివరణ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి దేశ రక్షణ వ్యవస్థ పటిష్టంగా ఉండటం ఇష్టంలేదన్న ఆమె... రఫెల్ ఒప్పందంపై రాహుల్ గాంధీ ఆరోపణలు అవాస్తవమన్నారు. ఇందుకు సంబంధించి మీడియాలో వస్తున్న కథనాల్లో ఎలాంటి నిజాలు లేవని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. మల్టీ నేషనల్ కంపెనీల కోసమే రఫెల్ ఒప్పందంపై కాంగ్రెస్ ఆరోపణలు చేస్తోందని ఆమె మండిపడ్డారు. దీనిపై ఇప్పటికే తాము చెప్పాల్సిందంతా చెప్పేశామన్నారు. -
మోదీ పిరికి వ్యక్తి: రాహుల్
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ పిరికివాడని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ వ్యాఖ్యానించారు. రాఫెల్ అంశంతోపాటు జాతీయ భద్రతపై తనతో కనీసం 5 నిమిషాల ముఖాముఖి చర్చకు వచ్చేందుకు మోదీ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. పార్టీ మైనారిటీ విభాగం సమావేశంలో గురువారం ఆయన మాట్లాడారు. ‘గత ఐదేళ్లుగా మోదీతో పోరాడుతున్న నాకు ఆయన అసలు రంగేమిటో తెలిసిపోయింది. ఆయన పిరికి వ్యక్తి. జాతీయ భద్రత, రాఫెల్ అంశాలపై నాతో 5 నిమిషాలు ముఖాముఖి చర్చకు రమ్మనండి’ అంటూ సవాల్ విసిరారు. ‘మీరంతా కలిసికట్టుగా ఉండి, ఆర్ఎస్ఎస్, బీజేపీ, మోదీని శాయశక్తులా ఎదుర్కోండి. వారు పిరికివాళ్లలా పారిపోతారు’ అంటూ కార్యకర్తలకు రాహుల్ పిలుపునిచ్చారు. ‘మోదీ అధికారంలో ఉండగా తమ పని తాము చేసుకోలేమంటూ నలుగురు సుప్రీంకోర్టు జడ్జీలు బహిరంగంగా చెప్పారు. సుప్రీంకోర్టు తన విధులను నిర్వర్తించకుండా చేసేది బీజేపీ చీఫ్ అమిత్ షా అని వారు పరోక్షంగా చెప్పారు’ అని గుర్తు చేశారు. ‘డోక్లాం వద్ద సరిహద్దుల్లోకి చైనా తన బలగాలను మోహరించిన సమయంలోనే ఎటువంటి ఎజెండా లేకుండానే చైనా అధ్యక్షుడితో భేటీకి వెళ్లి మోకరిల్లారు. ఇది చూసి మోదీకి 56 అంగుళాలు కాదు కదా కనీసం 4 అంగుళాల ఛాతీ కూడా లేదని చైనాకు తెలిసిపోయింది’ అని ఎద్దేవా చేశారు. ప్రధానకార్యదర్శిగా తొలిసారి ప్రియాంక రాహుల్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఆయన సోదరి ప్రియాంక గాంధీ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి హోదాలో గురువారం మొదటిసారిగా హాజరయ్యారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ఏర్పాటైన ఈ సమావేశానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇన్చార్జులు హాజరయ్యారు. భేటీలో ముందు వరుసలో రాహుల్, కేసీ వేణుగోపాల్, ఆజాద్, ఖర్గే ఆసీనులు కాగా రాహుల్కు దూరంగా కుడివైపు వరుస మధ్యలో జ్యోతిరాదిత్య సింధియా పక్కన ప్రియాంక కూర్చున్నారు. వీరిద్దరూ ఇటీవల ఉత్తరప్రదేశ్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జులుగా నియమితులయిన విషయం తెలిసిందే. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో రాహుల్ చాంబర్ పక్కనే ఉన్న గదిని ప్రియాంకకు, జ్యోతిరాదిత్యకు కలిపి కేటాయించారు. దీని ద్వారా ఎవరూ ఎక్కువ కాదనే సందేశం పంపించడమే ఉద్దేశమని భావిస్తున్నారు. కాగా, శనివారం పీసీసీల చీఫ్లు, సీఎల్పీ నేతలతో సమావేశమై వచ్చే ఎన్నికలకు సన్నద్ధతపై రాహుల్ సమీక్షించనున్నట్లు సమాచారం. ట్రిపుల్ తలాక్ చట్టం రద్దు చేస్తాం మహిళా కాంగ్రెస్ చీఫ్ సుస్మితా వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఎన్డీయే ప్రభుత్వం తెచ్చిన ట్రిపుల్ తలాక్ చట్టాన్ని రద్దు చేస్తామని ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ చీఫ్ సుస్మితా దేవ్ ప్రకటించారు. ఈ చట్టం ద్వారా ముస్లిం మహిళలు, పురుషుల మధ్య విద్వేష వాతావరణాన్ని ప్రధాని మోదీ సృష్టించారని విమర్శించారు. ‘ట్రిపుల్ తలాక్ బిల్లు ఆమోదం పొందితే ముస్లిం మహిళలకు సాధికారత లభిస్తుందని చాలామంది చెప్పారు. కానీ ముస్లిం పురుషులను జైళ్లలో పెట్టేందుకు ప్రధాని దీన్ని ఓ ఆయుధంగా రూపొందించారు. కాగా, మహిళల సాధికారితకు ఏ ప్రభుత్వం చట్టాన్ని తెచ్చినా మేం సమర్థిస్తాం. ట్రిపుల్ తలాక్ బిల్లును వ్యతిరేకించిన∙ముస్లిం మహిళలను అభినందిస్తున్నా’ అని అన్నారు. -
అది మహా కల్తీ కూటమి
ప్రధాని మోదీ ‘ఎలక్షన్ మోడ్’లోకి వెళ్లిపోయారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చకు లోక్సభలో సమాధానమిస్తూ.. దాదాపు ఎన్నికల ప్రచార ప్రసంగమే చేశారు. ఇన్నాళ్లూ కాంగ్రెస్ సహా విపక్షాలు చేస్తున్న విమర్శలకు.. అంశాలవారీగా ఘాటు సమాధానమిచ్చారు. దాదాపు గంటన్నరకు పైగా చేసిన ప్రసంగంలో.. తీవ్రమైన విమర్శలు, ఆరోపణలతో పాటు వ్యంగ్య వ్యాఖ్యలు, ఛలోక్తులతో కాంగ్రెస్ను చీల్చి చెండాడారు. వ్యవస్థలను ధ్వంసం చేస్తున్నాడంటూ తనపై చేస్తున్న ఆరోపణలకు బదులిస్తూ.. ‘ దేశంలో ఎమర్జెన్సీ విధించింది మీరే.. న్యాయవ్యవస్థను, సీబీఐని, ఈడీని అవమానించింది మీరే.. వైమానిక దళ అధిపతిని గూండాగా అభివర్ణించింది మీరే.. సైన్యం బలోపేతం కాకూడదని కోరుకునేదీ మీరే’ అంటూ తిప్పికొట్టారు. రఫేల్ డీల్ను తప్పుపట్టడంపై స్పందిస్తూ.. ఏ కంపెనీ తరఫున బిడ్డింగ్ చేస్తున్నారంటూ కాంగ్రెస్ను ఎద్దేవా చేశారు. విపక్ష మహా కూటమిని విలువల్లేని, అవసరార్ధం కలిసిన ‘కల్తీ’ కూటమి అని, అందులోని నేతలంతా బెయిల్పై బయట ఉన్నవారేనని, ప్రజలు వారిని తప్పక తిప్పికొడతారని చురకలంటించారు. పనిలో పనిగా, గతంలో కాంగ్రెస్ పార్టీపై మహాత్మా గాంధీ, బీఆర్ అంబేద్కర్ చేసిన వ్యాఖ్యలనూ ప్రస్తావించారు. కాంగ్రెస్తో కలవడం ఆత్మహత్య చేసుకోవడంతో సమానమని అంబేద్కర్ నాడే చెప్పారని, స్వాతంత్య్రం రాగానే కాంగ్రెస్ను రద్దు చేయాలని గాంధీ కోరుకున్నారని గుర్తు చేశారు. ఈ లోక్సభలో బహుశా చివరిదైన ప్రసంగాన్ని.. సభ సాక్షిగా దేశ ప్రజలకు తన వాదన వినిపించేందుకు ప్రధాని సమర్ధంగా ఉపయోగించుకున్నారు. న్యూఢిల్లీ: ‘కాంగ్రెస్ న్యాయ వ్యవస్థను బెదిరించింది. దేశంలో అత్యయిక పరిస్థితి విధించింది. రాజ్యాంగ నిబంధన పేరిట ఎన్నో రాష్ట్రాల్లో ప్రభుత్వాల్ని కూల్చింది. సైన్యాన్ని అవమానించింది. ఆర్మీ చీఫ్ను రౌడీగా చిత్రీకరించింది. కానీ అన్ని వ్యవస్థల్ని మోదీయే నాశనం చేస్తున్నారని రాద్ధాంతం చేస్తోంది’ అని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. ఎన్నికల సీజన్లో లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ప్రధాని పార్లమెంట్ సాక్షిగా కాంగ్రెస్ సహా అన్ని విపక్షాలపై విరుచుకుపడ్డారు. మూకుమ్ముడిగా బెయిల్పై ఉన్న విపక్ష నాయకులు ప్రతిపాదిస్తున్న మహాకూటమి కల్తీమయమని, దాన్ని ఆరోగ్యవంతమైన మన ప్రజాస్వామ్యం తిరస్కరిస్తుందని అన్నారు. 55 నెలలుగా ఎన్డీయే పాలన సేవా దృక్పథంతో కొనసాగుతుండగా 55 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో మునిగితేలిందని చురకలంటించారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవడం సహజమేనని, కానీ మోదీని, బీజేపీని విమర్శిస్తూ కొందరు దేశంపై దాడిచేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై గురువారం లోక్సభలో జరిగిన చర్చకు మోదీ సమాధానమిచ్చారు. ఆ తరువాత తీర్మానాన్ని లోక్సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. నాలుగున్నరేళ్ల ఎన్డీయే పాలనలో జరిగిన అభివృద్ధిని నివేదించిన మోదీ..తమ ప్రభుత్వం అవినీతిని చాలా మటుకు తగ్గించిందని ఉద్ఘాటించారు. సుమారు గంటన్నర సేపు సాగిన మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. కాంగ్రెస్, ఇతర విపక్షాలపై.. ఎన్డీయే పనితనాన్ని ప్రజలు చూశారు. కాబట్టి కొన్ని పార్టీలు కలసి ఏర్పాటు చేయాలనుకుంటున్న అత్యంత కల్తీ అయిన కూటమిని దేశం కోరుకోవడం లేదు. ప్రభుత్వమనేది ప్రజల ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలి. అవినీతికి స్థానం ఇవ్వొద్దు. దేశంలోనైనా, విదేశాల్లో అయినా, పార్లమెంట్ లోపల, వెలుపల అంతటా మేము సత్యమే మాట్లాడతాం. కానీ ఆ నిజాన్ని వినే సామర్థ్యం విపక్షాలకు తగ్గిపోయింది. ఎన్నికల సంఘం పనితీరును, ఈవీఎంలను కాంగ్రెస్ శంకించింది. దేశంలో ఎమర్జెన్సీని విధించింది. ఆర్మీని, ఆర్మీ చీఫ్ను అవమానించారు. ప్రణాళిక సంఘం జోకర్ల బృందమని ఎద్దేవా చేశారు. కానీ మోదీనే అన్ని వ్యవస్థల్ని ధ్వంసం చేస్తున్నారని తిరిగి ఎదురుదాడి చేస్తున్నారు. ఆర్టికల్ 356ను దుర్వినియోగం చేసిన కాంగ్రెస్ చాలా సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వాల్ని రద్దుచేసింది. ఒక్క ఇందిరా గాంధీ హయాంలోనే ఈ ఆర్టికల్ను 50 సార్లు ప్రయోగించారు. రక్షణ రంగంపై... యూపీయే హయాంలో రక్షణ రంగం ఎన్నో ప్రతిబంధకాలు ఎదుర్కొంది. ఆర్మీ సర్జికల్ దాడులు చేసే స్థాయిలో లేకపోయింది. మన ఆర్మీ, వైమానిక దళం బలోపేతం కావడం కాంగ్రెస్కు ఇష్టం లేదు. రఫేల్ రక్షణ కొనుగోళ్లకు సంబంధించి కాంగ్రెస్ ఏదైనా కంపెనీ తరఫున బిడ్డింగ్ వేస్తోందా? అని సూటిగా ప్రశ్నిస్తున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన జాప్యం కారణంగా సైన్యానికి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, సరైన బూట్లు, కమ్యూనికేషన్ ఉపకరణాలు సకాలంలో అందలేదు. ఇదీ ఒక రకంగా దేశాన్ని మోసం చేయడమే అవుతుంది. పొరుగు దేశాలు అధునాతన∙ఆయుధ సంపత్తిని సమకూర్చుకుంటున్న సమయంలో 30 ఏళ్ల పాటు అడ్వాన్స్డ్ జెట్ విమానాల్ని ఎందుకు కొనుగోలు చేయలేదు? ఈ పాపానికి దేశం మిమ్మల్ని క్షమించదు. ముడుపులు లేకుండా రక్షణ ఒప్పందం కుదుర్చుకోవడంపై కాంగ్రెస్ నాయకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వారి దృష్టిలో కమీషన్లు లేకుండా రక్షణ ఒప్పందం జరగడం అసాధ్యం. బీసీ అంటే బిఫోర్ కాంగ్రెస్.. ఏడీ అంటే ఆఫ్టర్ డైనాస్టీ కాలావధుల్ని సూచించే బీసీ(బిఫోర్ క్రైస్ట్), ఏడీ(ఆనో డొమిని)లకు మోదీ కొత్త అర్థాలు చెప్పారు. కాంగ్రెస్కు బీసీ అంటే బిఫోర్ కాంగ్రెస్ అని, ఏడీ అంటే ఆఫ్టర్ డైనాస్టీ అని ఎద్దేవా చేశారు. ‘ కాంగ్రెస్ దృష్టిలో బీసీ, ఏడీలకు వేరే అర్థాలున్నాయి. బీసీ(బిఫోర్ కాంగ్రెస్) అంటే కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు అక్కడేం లేదని, ఏడీ(ఆఫ్టర్ డైనాస్టీ) అంటే తమ కుటుంబం అధికారంలోకి వచ్చాకే అంతా జరిగిందని వారు ప్రచారం చేసుకుంటున్నారు’ అని మోదీ అన్నారు. గడ్కరీకి సోనియా ప్రశంసలు రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీకి లోక్సభలో ఊహించని వ్యక్తి నుంచి ప్రశంసలు లభించాయి. దేశంలో మౌలిక సదుపాయాల కల్పనకు మీ శాఖ తరఫున చేస్తున్న కృషి ప్రశంసనీయమైనదని గడ్కరీని యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ అభినందించారు. గురువారం లోక్సభ ప్రశ్నోత్తరాల సమయంలో గడ్కరీ మంత్రిత్వ శాఖకు సంబంధించి సభ్యులు రెండు ప్రశ్నలు సంధించారు. దీనిపై మంత్రి స్పందిస్తూ, తన శాఖ పరిధిలో చేసిన వివిధ పనుల వివరాలు, రహదారుల అనుసంధానికి చేసిన కృషిని సభకు వివరించారు. ‘పార్టీలతో సంబంధం లేకుండా అన్ని నియోజకవర్గాల్లో మా శాఖ తరఫున పనులు చేపట్టాం. దీనికి అన్ని రాజకీయ పక్షాలకు చెందిన సభ్యులు నన్ను అభినందించాలి’అని గడ్కరీ సమాధానమిచ్చారు. మధ్యప్రదేశ్కు చెందిన బీజేపీ సభ్యుడు గణేశ్సింగ్ లేచి నిలబడి స్పీకర్ను ఉద్దేశించి మాట్లాడుతూ ‘అద్భుత ఫలితాలు సాధించిన గడ్కరీ శాఖను సభ అభినందించాలని’ సూచించారు. మౌనంగా గమనిస్తున్న యూపీఏ చైర్పర్సన్ సోనియా నవ్వుతూ బల్లను చరుస్తూ గడ్కరీని అభినందించారు. ఉద్యోగ కల్పనపై.. రవాణా, ఆతిథ్యం, మౌలిక రంగాల్లో ఈ నాలుగున్నరేళ్లలో కోట్లాది కొత్త ఉద్యోగాలు కల్పించాం. వ్యవస్థీకృత, అవ్యవస్థీకృత రంగాల్లో ఉద్యోగాల సృష్టి జరిగినట్లు జాతీయ భవిష్య నిధి, నేషనల్ పెన్షన్ పథకం(ఎన్పీఎస్), పన్ను రిటర్నుల సమాచారం ధ్రువీకరిస్తోంది. 2018 నవంబర్ వరకు కేవలం 15 నెలల్లో 1.8 కోట్ల మంది తొలిసారిగా ఉద్యోగ భవిష్య నిధిలో చందాదారులుగా చేరారు. అందులో 64 శాతం మంది వయసు 28 ఏళ్ల కన్నా తక్కువే. 2014 సంవత్సరంలో ఎన్పీఎస్ పథకంలో ఉన్న వారి సంఖ్య 65 లక్షలు కాగా, 2018 అక్టోబర్ నాటికి ఆ సంఖ్య 1.2 కోట్లకు పెరిగింది. నాలుగేళ్లలో కొత్తగా 6.35 లక్షల మంది వృత్తి నిపుణులు ఐటీ రిటర్నులు దాఖలు చేశారు. దేశంలో స్వయం ఉపాధిని ప్రోత్సహించడానికి స్కిల్ ఇండియా, స్టాండప్ ఇండియా, డిజిటల్ ఇండియా లాంటి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాల్ని మా ప్రభుత్వం ప్రారంభించింది. అవినీతిపై.. దేశాన్ని దోచుకున్న అవినీతిపరులు నన్ను చూసి భయపడుతూనే ఉన్నారు. 2010 కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించేందుకు ఓ వైపు ఆటగాళ్లు కష్టపడుతోంటే, కాంగ్రెస్ పార్టీలోని కొందరు పెద్దలు తమ సంపదను పెంచుకునేందుకు దీన్ని ఒక అవకాశంగా మలుచుకున్నారు. అగస్టా వెస్ట్ల్యాండ్ కుంభకోణ నిందితుల్ని దేశానికి తీసుకురావడం ద్వారా విపక్షాల్లో కొందరికి వణుకు పుడుతోంది. యూపీఏ హయాంలో ప్రభుత్వ పెద్దల నుంచి ఫోన్లు చేయించుకుని వ్యాపారవేత్తలు రుణాలు పొందిన సందర్భాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ధరలు పెరిగాయి. ధరల్ని అదుపులో ఉంచేందుకు మా ప్రభుత్వం కృషిచేసింది. విధానపర నిర్ణయాలను ప్రభావితం చేసేలా నిధుల సేకరణలో పారదర్శకత పాటించని సుమారు 20 వేల స్వచ్ఛంద సంస్థల్ని మేం మూసివేశాం. -
అనిశ్చితి దాటి కొత్త ఆశల దిశగా..
న్యూఢిల్లీ: తీవ్ర అనిశ్చిత పరిస్థితులు రాజ్యమేలుతున్న సమయంలో 2014లో అధికారం చేపట్టిన ఎన్డీయే ప్రభుత్వం ప్రజల్లో కొత్త ఆశలు చిగురింపజేసిందని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కొనియాడారు. ఆనాటి నుంచి నవభారత నిర్మాణానికి కృషిచేస్తూనే ఉందని తెలిపారు. రైతు సమస్యలకు శాశ్వత పరిష్కారాలు కనుగొనేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. బడ్జెట్ సమావేశాల్ని ప్రారంభిస్తూ కోవింద్ గురువారం ఉభయసభల్ని ఉద్దేశించి ప్రసంగించారు. రఫేల్ ఒప్పందం, వెనకబడిన వర్గాలకు 10 శాతం కోటా, ట్రిపుల్ తలాక్ బిల్లు, పౌరసత్వ బిల్లు, నోట్లరద్దు తదితరాలను ఆయన ప్రస్తావించారు. ప్రభుత్వ అభిప్రాయాలను ప్రతిబింబిస్తూ సాగిన ఆయన ఉపన్యాసం సార్వత్రిక ఎన్నికలకు కొద్ది రోజుల ముందు రావడంతో ప్రాధాన్యత ఏర్పడింది. శుక్రవారం ప్రవేశపెట్టబోయే తాత్కాలిక బడ్జెట్లో రైతులకు పలు ఉపశమన చర్యలు ఉంటాయని ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆయన వ్యవసాయ సంక్షోభాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. రైతులు దేశ ఆర్థిక వ్యవస్థకు పునాదులన్న కోవింద్..2022 నాటికి వారి ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తోందని తెలిపారు. ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు తీసుకున్న నిర్ణయం చారిత్రకమని ప్రశంసించారు. 2016 నాటి సర్జికల్ దాడులను ప్రస్తావించగానే అధికార పార్టీ సభ్యులు బల్లలు చరిచి హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో విజయాల్ని ప్రశంసించిన కోవింద్..తొలి మానవసహిత అంతరిక్ష ప్రయోగం గగన్యాన్ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. పలు అంశాలపై సుమారు గంటసేపు కొనసాగిన కోవింద్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. నవభారత నిర్మాణంపై... 2014 ఎన్నికలకు ముందు దేశంలో అస్థిరత నెలకొంది. ఎన్నికల తరువాత ఈ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టి నవభారత నిర్మాణానికి పూనుకుంది. అవినీతి, జడత్వ, లోపరహిత వ్యవస్థలతో కూడిన దేశ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యం. నాలుగున్నరేళ్లుగా ప్రజల్లో కొత్త ఆశలు, విశ్వాసాన్ని పాదుకొల్పింది. దేశ ముఖచిత్రాన్నే మార్చివేసి సామాజిక, ఆర్థిక మార్పును తీసుకొచ్చింది. రైతు సమస్యలపై.. పవిత్ర పార్లమెంట్ తరఫున నేను మన అన్నదాతల్ని అభినందిస్తున్నా. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి ప్రభుత్వం రేయింబవళ్లు కష్టపడుతోంది. రైతుల సమస్యల్ని శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తోంది. పౌరసత్వ బిల్లుపై.. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్లలో వేధింపులకు గురై భారత్కు వలసొచ్చే ముస్లిమేతరులకు ఈ బిల్లు న్యాయం చేస్తుంది. పౌరులకు సామాజిక, ఆర్థిక న్యాయం కల్పించడమే లక్ష్యంగా న్యాయ వ్యవస్థను సంస్కరించేందుకు పాటుపడుతోంది. ఆర్థిక వ్యవస్థపై.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ వాటా 2014లో 2.6 శాతం ఉండగా, 2017 నాటికి 3.3 శాతానికి ఎగబాకింది. నాలుగున్నరేళ్లుగా నమోదవుతున్న వృద్ధిరేటే దీనికి కారణం. సగటున వార్షిక వృద్ధిరేటు 7.3 శాతంగా నమోదైంది. దీంతో భారత్..ప్రపంచంలో ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. నోట్లరద్దుపై.. అవినీతి, నల్లధన వ్యతిరేక పోరులో నోట్లరద్దు కీలక ఘట్టంగా నిలిచిపోయింది. ఈ నిర్ణయంతో సమాంతర ఆర్థిక వ్యవస్థ మూలాలు దెబ్బతిన్నాయి. సంక్షేమ పథకాలపై.. పీఎం జీవిత బీమా పథకంతో సుమారు 21 కోట్ల మంది, సౌభాగ్య పథకంతో 2 కోట్ల కుటుంబాలు లబ్ధిపొందాయి. స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా 9 కోట్ల టాయిలెట్లు నిర్మించాం. -
‘మోదీ వాయు దళాన్ని అమ్మేశారు’
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి మండిపడ్డారు. భారతీయ వాయు దళాన్ని (ఐఏఎఫ్) ఆయన అమ్మేశారని, తన స్నేహితుడు, వ్యాపారవేత్త అనిల్ అంబానీకి రూ. 30 కోట్లను చౌర్యం చేసి కట్టబెట్టడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు లేకుండా చేశారని ఆరోపించారు. యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో యువక్రాంతి మేళా యాత్ర పేరిట తల్కతోర స్టేడియంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో రాహుల్ మాట్లాడారు. రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంపై ప్రభుత్వంలోనే అసమ్మతి ఉందని, దీంతో ప్రధాని మోదీకి నిద్ర పట్టడం లేదని ఆరోపించారు. తాను ప్రధాని మోదీని మూడు, నాలుగు ప్రశ్నలు అడిగానని, ఆయన అటు, ఇటు, క్రింద, పైన చూశారని, అయితే తనవైపు, తన కళ్లలోకి కళ్లు పెట్టి మాత్రం చూడలేకపోయారని అన్నారు. ‘‘కాపలాదారు నా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడలేకపోయారు’’ అని విమర్శించారు. మోదీ ప్రభుత్వంపై పార్లమెంటులో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా జరిగిన సంఘటనను రాహుల్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంపై రాహుల్ గాంధీ ప్రసంగించినపుడు చెప్పిన మాటలను ప్రస్తావించారు. దొంగతనం చేసినవాళ్ళు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేరన్నారు. దేశాన్ని విభజించడమే లక్ష్యంగా మోదీ పనిచేస్తున్నారని ఆరోపించారు. ఈశాన్యంతోపాటు కశ్మీర్ను రావణకాష్టం చేసేశారని అన్నారు. తాము అధికారంలోకి వస్తే ప్రజలకు కనీస ఆదాయ హక్కు కల్పిస్తామంటూ రాహుల్ హామీ ఇచ్చారు. ఆ ఆదాయాన్ని నేరుగా పేదల ఖాతాల్లో వేస్తామని, ఇందులో మధ్యవర్తులెవరూ ఉండబోరని ఆయన స్పష్టం చేశారు. -
గోవా సీఎం పారికర్తో రాహుల్ భేటీ
పనాజీ : గోవా సీఎం మనోహర్ పారికర్తో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ మంగళవారం సమావేశమయ్యారు. వీరి మధ్య ఏయే అంశాలపై చర్చలు జరిగాయనే వివరాలు వెల్లడికాలేదు. పారికర్తో తాను కేవలం మర్యాదపూర్వకంగానే భేటీ అయ్యానని, ఇది వ్యక్తిగత పర్యటనగా రాహుల్ వెల్లడించారు. నేటి ఉదయం గోవా సీఎం మనోహర్ పారికర్ను తాను కలిశానని, ఆయన సత్వరం కోలుకోవాలని ఆకాంక్షించానని రాహుల్ ట్వీట్ చేశారు. గోవా శాసన సభ ప్రాంగణంలోని సీఎం చాంబర్లో పారికర్తో రాహుల్ సమావేశమయ్యారు. పారికర్తో ముచ్చటించిన అనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో రాహుల్ అసెంబ్లీలోని విపక్ష లాబీలో సమావేశమయ్యారు. కాగా రాఫెల్ ఒప్పందానికి సంబంధించిన కీలక పత్రాలు గోవా సీఎం వద్ద ఉన్నాయని కాంగ్రెస్ చీఫ్ ఆరోపించిన మరుసటి రోజే పారికర్తో రాహుల్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు పారికర్తో రాఫెల్ ఒప్పందంపై రాహుల్ ఎలాంటి చర్చలూ జరపలేదని, కేవలం ఆయన ఆరోగ్య పరిస్ధితిని వాకబు చేసేందుకే కలిశారని గోవా విపక్ష నేత చంద్రకాంత్ కవ్లేకర్ వివరణ ఇచ్చారు. పారికర్ను రాహుల్ కేవలం మర్యాదపూర్వకంగానే కలిశారని చెప్పుకొచ్చారు. మనోహర్ పారికర్ పాంక్రియాటిక్ వ్యాధితో బాధపడుతూ 2018 ఫిబ్రవరి నుంచి పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. -
‘పార్టీ మారితే చావుడప్పు కొడతాం’
సాక్షి, హైదరాబాద్: రాఫెల్ కుంభకోణంపై టీఆర్ఎస్ ఎంపీలు ఎందుకు మౌనం వహిస్తున్నారని కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకే విభజన హామీలపై పోరాడుతున్నట్లు టీఆర్ఎస్ ఎంపీలు నటిస్తున్నారని విమర్శించారు. ఆదివారం ఆయన కరీంనగర్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాఫెల్ కుంభకోణంలో వాస్తవాలను ప్రజలకు వివరిస్తామన్నారు. రూ.526 కోట్లకు వచ్చే విమానాలను 1600 కోట్లకు ఎందుకు కొన్నారో తెలపాలని పొన్నం డిమాండ్ చేశారు. రాఫెల్ తయారికి హెచ్ఎఎల్లాంటి నవరత్న కంపెనీని కాదని ఎలాంటి అనుభవంలేని రిలయన్స్ కు ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. సమావేశంలో పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ‘‘రాఫెల్ విషయంలో కేంద్రం సుప్రీంకోర్టును తప్పదోవ పట్టించింది. రాఫెల్ ఒప్పందంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయడానికి ప్రధాని మోదీ ఎందుకు భయపడుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 108 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయిన బీజేపీ ఇక దుకాణం మూసుకోవాలి. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించకుండా కేసీఆర్ ఫ్రెంట్ కోసం తిరుగుతున్నారు. మంత్రివర్గ విస్తరణ కోసం కాంగ్రెస పార్టీ ఎమ్మెల్యేల కోసం చూస్తున్నారు. టీఆర్ఎస్లో సమర్థులు లేరా?. శాసనమండలి సభ్యులను టీఆర్ఎస్లో విలీనం చేయడం సరికాదు. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన నేతల ఇంటి ముందు చావు డప్పుకొట్టి శవయాత్రలు చేయాలని పార్టీని కోరాను. ఓటమితో మేం కుంగిపోలేదు. ఓటమికి కారణలేంటో విశ్లేషిస్తున్నాం. రాష్ట్రపతి రాక కోసం ఖర్చుపెట్టిన ఆరు కోట్లతో ఆసుపత్రి నిర్మించి ఉంటే ప్రజలకు ఉపయోగపడేది. -
ఈవీఎంలపై మాకు అనుమానాలున్నాయ్: లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: భారత్ అత్యాధునిక యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించిన వివాదం పై సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ప్రజలకు, సైన్యానికి క్షమాపణలు చెప్పాలని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కే. లక్ష్మణ్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రధాని నరేంద్ర మోదీ అవినీతి రహిత పాలనను చూసి ప్రతిపక్షాలు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనపడుతుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ సైనికుల ఆత్మస్థైర్యం దెబ్బతిసేవిధంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. వంద ఏళ్ల కాంగ్రెస్ పార్టీ కనీసం విలువలు పాటించడం లేదని విమర్శించారు. సైనికులకు మనో నిబ్బరం ఇవ్వాల్సింది పోయి ఇలాంటి మాటలు మాట్లాడటం సిగ్గు చేటన్నారు. 2014 లో సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాఫెల్ డీల్ ఎందుకు ఫైనల్ చెయ్యలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయంలో బ్రోకర్లతో మాత్రమే కొనుగోలు ఉండేదని ఆరోపించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల తీర్పును శిరసావహిస్తున్నామన్నారు. కాంగ్రెస్తో చంద్రబాబు నాయుడు కుట్ర పూరిత పొత్తు పెట్టుకున్నారు వ్యాఖ్యానించారు. తెలంగాణలో జరిగిన ఎన్నికలు చంద్రబాబు వెర్సస్ కేసీఆర్ అన్నట్టుగా మారాయని వ్యాఖ్యానించారు. ఎన్నికల నిర్వహించడంలో ఎన్నికల కమిషన్ పూర్తిగా విఫలమైందన్నారు. ఒక్క క్షమాపణతో ఎన్నికల కమిషన్ తమ తప్పును తుడిచేసుకుందని విమర్శించారు. తాము ఓటమి మీద పూర్తి స్థాయిలో విశ్లేషణ చేస్తామన్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల కోసం పార్టీ సిద్ధం అవుతుందని లక్ష్మణ్ తెలిపారు. జనవరి 11, 12 ఢిల్లీలో జరిగే జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో వ్యూహం రూపొందిస్తామని పేర్కొన్నారు. తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాల్లో ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాలు స్వయంగా సమీక్ష చేస్తారని చెప్పారు. 2014 ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా 17 కోట్ల ఓట్లు బీజేపీకి వచ్చాయని,ఈ సారి 30 కోట్ల ఓట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ఓటమితో కార్యకర్తలు అధైర్య పడవద్దని లోపాలు సరిదిద్దుకొని ముందుకు పోవాలి సూచించారు. 2019 వచ్చే ఎన్నికల్లో మరోసారి మోదీని ప్రభుత్వాన్ని తీసుకురావడామే తమ లక్ష్యమన్నారు. కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉండి తెలంగాణకు చేసింది ఏమిటో ప్రజలకు ప్రజలకు తెలుసునన్నారు. కుమార పట్టాభిషేకం ..ఇప్పుడిప్పుడే కదా అయింది కొన్ని రోజుల తరువాత ప్రభుత్వం మీద స్పందిస్తాం. ఈవీఎంల సాంకేతిక మీద మా అభ్యర్థులు కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. దానిపై ఒక కమిటీ వేస్తామని చెప్పారు. తెరాస సెంటిమెంట్తో గట్టెక్కిందని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో వచ్చిన దాని కన్నా ఎక్కువ సెంటిమెంట్ ఈ ఎన్నికల్లో వచ్చింది. సెంటిమెంట్తో మాకు రావాల్సిన ఓట్లు కూడా తెరాసకు వెళ్లాయని లక్ష్మణ్ పేర్కొన్నారు. -
సుప్రీం తీర్పుతో కొత్త అనుమానాలు
సాక్షి, న్యూఢిల్లీ : వేలాది కోట్ల రూపాయలను వెచ్చించి ఫ్రాన్స్ నుంచి ‘రఫేల్’ యుద్ధ విమానాలను కొనుగోలు చేయడం సమంజసమా, కాదా? అన్న విషయాన్ని తాము విచారించదల్చుకోలేదని, అది ప్రభుత్వానికి సంబంధించిన పాలనాపరమైన విషయమంటూ సుప్రీంకోర్టు శుక్రవారం 36 పిటిషన్లను కొట్టివేస్తూ కొత్త అనుమానాలను ముందుకు తెచ్చింది. ఒప్పందంలోని ‘అధిక ధర’ అంశాన్ని కాగ్ క్షుణ్నంగా పరిశీలించి నివేదికను రూపొందించడం, ఆ నివేదికను పార్లమెంట్ ప్రజాపద్దుల కమిటీ ఆమోదించినందున దాన్నీ తాము పరిశీలించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పును చూసి ముందుగా నోరెళ్లబెట్టిన పార్లమెంట్ ప్రజాపద్దుల కమిటీ చైర్మన్ మల్లిఖార్జున ఖర్గే, వెంటనే తేరుకొని కాగ్కు ఫోన్ చేసి ‘మీరు రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై నివేదికను పంపించారా?’ అంటూ ప్రశ్నించారు. ఇంకా నివేదిక పూర్తి కాలేదని, పూర్తయ్యాక సమర్పిస్తామంటూ కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటరల్ జనరల్) నుంచి సమాధానం వచ్చింది. ఇప్పవరకు ఉన్నతాధికారులు 60 సార్లు కాగ్ను కోరిన ఇప్పటికీ నివేదిక తయారు కాకపోవడం గమనార్హం. యాభై వేల కోట్ల రూపాయల లోపే 126 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు 2014లో దాదాపు ఒప్పందం కుదరగా అది 2016 నాటికి కేవలం 36 యుద్ధ విమానాల కొనుగోలుకే దాదాపు 59 వేల కోట్ల రూపాయలకు ఎలా పెరిగింది? ఈ యుద్ధ విమానాలను సరఫరా చేసే డసౌ సంస్థ, ఒప్పందానికి కొన్ని రోజుల ముందే ఆవిర్భవించిన తన భారత భాగస్వామిగా రిలయన్స్ డిఫెన్స్ సంస్థను ఎలా ఎంపిక చేసుకొంది? యుద్ధ విమానాలను పక్కనపెట్టి మామూలు పౌర విమానాల తయారీలో కూడా ఎలాంటి అనుభవం లేని రిలయన్స్ అంబానీ కంపెనీకి ఏకంగా 30 వేల కోట్ల రూపాయల పెట్టుబడులను తరలించేందుకు ఎందుకు ముందుకు వచ్చింది? భారత ప్రభుత్వం ఒత్తిడి మేరకే రిలయన్స్ కంపెనీని చేర్చుకోక తప్పలేదని నాటి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయీస్ మిలాండ్ మీడియా ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించడంలో నిజం లేదా? అంటూ ఆ మంది 36 పిటిషనర్లు సుప్రీంకోర్టును ప్రశ్నించారు. వారిలో మాజీ బీజేపీ నాయకులు అరుణ్ శైరీ, యశ్వంత్ సిన్వాలతోపాటు సామాజిక కార్యకర్త, న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కూడా ఉన్నారు. ఈ సందేహాల్లో ఏ ఒక్కటి సుప్రీంకోర్టు తీర్చకపోగా కొత్త సందేహాలను లేవనెత్తింది. యుద్ధ విమానాల ధరల పట్ల కాగ్ సంతృప్తి పడిందని, ఆ నివేదికను పార్లమెంట్ ప్రజాపద్దుల కమిటీ ఆమోదించినాక ఇంకా సందేహాలు ఎందుకని? సుప్రీంకోర్టు ప్రశ్నించింది. తయారుకానీ నివేదిక పట్ల కాగ్ సంతృప్తి వ్యక్తం చేసినట్లు, అందని నివేదికను పార్లమెంట్ పద్దుల కమిటీ ఆమోదించినట్లు సుప్రీంకోర్టుకు ఎవరు చెప్పారు? ఈ ప్రశ్నలకు సమాధానాన్ని సులభంగానే ఊహించవచ్చు. ఒప్పందం విషయంలో సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం సమర్పించిన రహస్య నివేదికలో ఈ విషయాలను కేంద్రమే పొందుపరిచి ఉంటుంది. ఆ విషయం తెలియక సుప్రీంకోర్టు తప్పులో కాలేసింది. రహస్య నివేదికలో కూడా కేంద్రం విమానాల బేసిక్ ధరనే పేర్కొందని, పూర్తి వివరాలు ఇవ్వడం దేశ సార్వభౌమాధికార భద్రతకు భంగం కలిగించడమే కాకుండా ఇలాంటి వివరాలను వెల్లడించకూడదంటూ ఫ్రాన్స్తో చేసుకున్న ఉప్పందాన్ని ఉల్లంఘించినట్లేనంటూ ప్రభుత్వం చేసిన వాదనతో ఏకభవించిన సుప్రీంకోర్టు రోడ్డు, వంతెన నిర్మాణానికి సంబంధించిన టెండర్ అంశాలు కావని వ్యాఖ్యానించింది. అంత చిన్న విషయం కాదు కనుకనే వివరాలు కావాలని పిటిషనర్లు డిమాండ్ చేశారు. ‘మా దగ్గర ఇంతటి శక్తి సామర్థ్యాలు కలిగిన క్షిపణలు, ఉన్నాయి. అంతటి శక్తివంతమైన అణు క్షిపణులను ప్రయోగించే యుద్ధ విమానాలు ఎన్నో ఉన్నాయి’ అంటూ అమెరికా, చైనాలు బహిరంగంగా ప్రకటిస్తున్న నేటిరోజుల్లో, లేని ఆయుధాలు ఉన్నట్టు మన దాయాది దేశం పాకిస్థాన్ చెప్పుకుంటున్నప్పుడు, ఎలాంటి సామర్థ్యం, సాంకేతిక సౌకర్యాలు తమ రఫేల్ యుద్ధ విమానాల్లో ఉన్నాయో డసౌ సంస్థనే వాణిజ్య ప్రకటన చేసుకుంటున్నప్పుడు మన విమానాల గుట్టు విప్పితే తప్పేమిటీ? అసలు యుద్ధ విమానాల ఒప్పందమనేది రెండు దేశాల మధ్య జరిగిన డిఫెన్స్ ఒప్పందమని, అందులో కోర్టులు జోక్యం చేసుకోవడం తగదని, మొదటినుంచి ఈ ఒప్పందాన్ని విచారించేందుకు విముఖత చూపుతున్న సుప్రీంకోర్టు శుక్రవారం పిటిషన్లు కొట్టి వేయగానే బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా స్పందిస్తూ ఒప్పందం విషయంలో కోర్టు ప్రభుత్వానికి క్లీన్చిట్ ఇచ్చిందని, అనుమానించిన, ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేతలతోపాటు పిటిషనర్లు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అసలు ఒప్పందంలోని అంశాలుగానీ, ధర విషయాలుగానీ విచారించడానికి సుప్రీంకోర్టు నిరాకరించినప్పుడు క్లీన్చిట్ ఇవ్వడం ఎందుకు అవుతుంది ? ఒప్పందంలో రిలయన్స్ అంబానీ కంపెనీని చేర్చడంలో ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నట్లు ఆధారాలేవీ లేవని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఆ వ్యాఖ్యలను ప్రాతిపదికగా తీసుకుంటే రిలయన్స్ను ఎంపిక చేయడంలో కేంద్రానికి దురుద్దేశం లేదని చెప్పుకోవచ్చు. కానీ మొత్తం ఒప్పందానికి క్లీన్చిట్ ఇచ్చినట్లు కాదు. అంబానీ డిఫెన్స్ విభాగంలోని ఎయిరోస్ట్రక్చర్ కొత్తగా ఏర్పడిన సంస్థే కావచ్చుగానీ, దాని మాతృసంస్థ 2012 నుంచే ఒప్పందం గురించి జరిగిన చర్చల్లో పాల్గొందికదా! అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ ఎయిరోస్ట్రక్చర్ నష్టాల్లో ఉన్న అనిల్ అంబానీ రిలయన్స్కు సంబంధించినది కాగా, 2012 నుంచి ప్రాథమిక చర్చల్లో పాల్గొని ఆ తర్వాత చర్చల నుంచే పూర్తిగా తప్పుకున్నది ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్, దీన్ని మాతృసంస్థగా పేర్కొనడమే ఇక్కడ గమనార్హం. పైగా ఒప్పందంపై ఫ్రాన్స్ అధ్యక్షుడుగా సంతకం చేసిన ఫ్రాంకోయీస్ మిలాండ్ ఇచ్చిన ఇంటర్వ్యూను పరిగణనలోకి తీసుకోలేమని సుప్రీంకోర్టు చెప్పడం మరింత గమనార్హం. ఏదేమైనా పలు సందేహాలను తీర్చాల్సిన సుప్రీంకోర్టు కొత్త సందేహాలను ముందుకు తెచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రజలకు స్పష్టంగా అర్థం కావాలంటే కేంద్ర ప్రభుత్వం సమర్పించిన రహస్య నివేదికలోని అంశాలు బహిర్గతం కావాల్సిందే! -
కాంగ్రెస్కు చెంప పెట్టు ఈ తీర్పు: అమిత్ షా
రఫేల్ యుద్ధ వివానాల కొనుగోలు ఒప్పందంపై సుప్రీంకోర్టు తీర్పు కాంగ్రెస్, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీల అబద్ధాల రాజకీయాలకు చెంపపెట్టు లాంటిదనీ, ఇన్నాళ్లూ అసత్య ఆరోపణలు చేసి, దేశ భద్రతను ప్రమాదంలో పడవేసినందుకు ఆ పార్టీ ఇప్పుడు దేశ ప్రజలకు, సైనికులకు క్షమాపణ చెప్పాలని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా డిమాండ్ చేశారు. కోర్టు తీర్పుతో రాహుల్ చెప్పిందంతా తప్పుడు సమాచారం, అబద్ధమని బట్టబయలైందని అమిత్ షా అన్నారు. పార్లమెంటులో కాంగ్రెస్ ఈ అంశంపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. మోదీని ‘కాపలాదారుడు’అని సంబోధిస్తూ.. నాడు కాపలాదారుడినని చెప్పుకున్న వ్యక్తి నేడు దొంగగా మారాడని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్గాంధీ గతంలో పలుమార్లు ఆరోపించడం తెలిసిందే. అయితే, నిజమైన దొంగలంతా చేరి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని దొంగ అన్నారన్న విషయం సుప్రీంకోర్టు తీర్పుతో తెలిసొచ్చింద’ ని అమిత్ షా అన్నారు. రాహుల్ మాటలపై మున్ముందు విశ్వాసం ఉండాలంటే ఆయనకు రఫేల్ గురించిన తప్పుడు సమాచారం అంతా ఎక్కడి నుంచి వచ్చిందో బయటపెట్టాలని కోరారు. -
అంబానీ–మోదీ దోస్తీ నిరూపిస్తా!
న్యూఢిల్లీ: రఫేల్ ఒప్పందాన్ని కట్టబెట్టడం ద్వారా రిలయన్స్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీకి ప్రధాని నరేంద్ర మోదీ సాయం చేశారనీ, ఈ విషయాన్ని తాను నిరూపిస్తానని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. రఫేల్ ఒప్పందంపై సుప్రీంకోర్టు తీర్పు అనంతరం రాహుల్ విలేకరులతో మాట్లాడుతూ ‘కాపలాదారుడు (ప్రధాని మోదీని ఉద్దేశించి) ఒక దొంగ. మోదీ.. మీరు పారిపోవచ్చు, దాక్కోవచ్చు. కానీ మిమ్మల్ని మీరు రక్షించుకోలేరు. విచారణ జరిగిన రోజు అంతా బయటకు వస్తుంది’అని పేర్కొన్నారు. 36 రఫేల్ యుద్ధ విమానాల ధరలపై కాగ్ నివేదికను రాహుల్ ప్రస్తావిస్తూ సుప్రీంకోర్టు తీర్పుపై కూడా సందేహం వ్యక్తం చేశారు. ‘కాగ్ నివేదికను ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) పరిశీలించిందనీ, ప్రస్తుతం ప్రజలకు ఇది అందుబాటులో ఉందని కోర్టు అంటోంది. కానీ పీఏసీ చైర్మన్, సీనియర్ కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే సహా ఆ నివేదికను ఎవరూ చూడలేదు. కానీ కాగ్ నివేదిక ఆధారంగానే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. కాగ్ నివేదిక అసలు ఎక్కడుంది. దాన్ని మాకూ చూపించండి. ఫ్రాన్స్ పార్లమెంటుకు గానీ దాన్ని చూపించారా? ప్రధాని మోదీ ప్రతీ స్వతంత్ర, ప్రభుత్వ వ్యవస్థనూ నాశనం చేశారు. అలాగే పీఏసీని కూడా ఆయన నాశనం చేసి తన కార్యాలయంలోనే సొంత పీఏసీని ఏర్పాటు చేసుకున్నారా?’అని రాహుల్ ప్రశ్నించారు. ఈ తీర్పు తర్వాతైనా రఫేల్ ఒప్పందంపై విచారణకు కేంద్రం సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. -
రఫేల్ ఒప్పందం సక్రమమే
న్యూఢిల్లీ: మోదీ సర్కారుకు పెద్ద ఊరట. రఫేల్ ఒప్పందంపై కేంద్రం తీరును సమర్థిస్తూ శుక్రవారం సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో భారీ అవకతవకలు జరిగినట్లు తమకు కనిపించడం లేదని స్పష్టం చేసింది. విమానాల కొనుగోలుకు నిబంధనలను అనుసరించి రక్షణ ఉత్పత్తుల సేకరణ విధానాల (డీపీపీ) ప్రకారమే మోదీ ప్రభుత్వం ముందుకు వెళ్లిందని పేర్కొంది. ఈ ఒప్పందం లో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని కాంగ్రెస్ పార్టీ గత కొన్ని నెలలుగా పదేపదే ఆరోపిస్తుండటం తెలిసిందే. రఫేల్ ఒప్పందాన్ని సవాల్ చేస్తూ వచ్చిన 36 పిటిషన్లను సుప్రీంకోర్టు తాజాగా కొట్టేసింది. ‘ప్రభుత్వ నిర్ణయాన్ని సందేహించాల్సినం తగా మాకు ఈ ఒప్పందంలో తప్పులేవీ కనిపించడం లేదు’అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్ల ధర్మాసనం తెలిపింది. ఒకవేళ చిన్నచిన్న పొరపాట్లేమైనా ఈ ఒప్పందంలో జరిగి ఉంటే అవి ఒప్పందాన్ని రద్దు చేయాల్సిన లేదా క్షుణ్నంగా పరిశీలించాల్సినంత పెద్ద తప్పులేమీ కాదని పేర్కొంది. ఈ తీర్పు అద్భుతమనీ, చాలా మంచి తీర్పనీ, ప్రభుత్వానికి సుప్రీంకోర్టు క్లీన్చిట్ ఇచ్చినట్లుగా ఉందని కేంద్రం తరఫున వాదించిన అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ అన్నారు. కేంద్ర మాజీ మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరీ, సామాజిక కార్యకర్త ప్రశాంత్ భూషణ్, తదితరులు రఫేల్ ఒప్పందంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్లు వేయడం తెలిసిందే. ధరలను పోల్చడం మా పని కాదు.. యూపీఏ హయాంలో కొనుగోలుకు ప్రతిపాదించిన యుద్ధ విమానాలు, బీజేపీ ప్రభుత్వం కొంటున్న యుద్ధ విమానాల ధరలను పోల్చి చూడటం తమ పని కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ వివరాలను రహస్యంగానే ఉంచాలంది. కేవలం విలేకరుల సమావేశాల్లో కొందరు చేసిన వ్యాఖ్యలు లేదా ఇచ్చిన సలహాల ఆధారంగా ఈ ఒప్పందంపై న్యాయ సమీక్ష చేయలేమనీ, అందునా ఆ వ్యాఖ్యలు లేదా సలహాలను ఇరు దేశాల ప్రభుత్వాలు తీవ్రంగా ఖండిస్తున్నప్పుడు మళ్లీ వాటిపై న్యాయ సమీక్ష జరపడం కుదరదని ధర్మాసనం తెలిపింది. భారత ప్రభుత్వ బలవంతంతోనే రిలయన్స్ను డసో ఏవియేషన్ ఆఫ్సెట్ భాగస్వామిగా ఎంపిక చేసుకుందని ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ కొన్ని నెలల క్రితం ఫ్రెంచి మీడియాతో చెప్పడం తెలిసిందే. ‘యూపీఏ హయాంలో అనుకున్నట్లుగా 126 యుద్ధ విమానాలనే కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని మేం బలవంతం చేయలేం. ఈ అంశంలో కోర్టు ప్రభుత్వానికి పై అధికారిగా వ్యవహరిస్తూ ఒప్పందం, విమానాల సేకరణకు సంబంధించిన ప్రతీ అంశాన్నీ క్షుణ్నంగా పరిశీలించడం సరికాదు’అని న్యాయమూర్తులు 29 పేజీలో తీర్పులో పేర్కొన్నారు. భారత వాయుసేనకు ఆధునిక విమానాలు కావాలనీ, శత్రుదేశాలు నాల్గో, ఐదో తరం యుద్ధ విమానాలను కూడా కలిగి ఉన్నందున మన వైమానిక దళానికి కూడా ఆధునిక విమానాలు కావాలని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. అలా కాకుంటే మనం విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా లేకపోవడం లేదా అసంపూర్తిగా సిద్ధం అవడం కిందకు వస్తుందన్నారు. (రఫెల్పై వెనక్కి తగ్గేదిలేదు) రిలయన్స్ ఎంపికలో ప్రభుత్వ పాత్ర లేదు.. రఫేల్ యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పందానికి సంబంధించి పిటిషనర్ల ఆరోపణల్లోని ప్రధానంగా మూడు అంశాలపై విచారణ జరిపామని సుప్రీంకోర్టు తెలిపింది. వాటిలో ఒకటి ప్రభుత్వ నిర్ణయం, రెండోది విమానాల ధరలు కాగా ఇక మూడోది భారత్లో ఆఫ్సెట్ భాగస్వామి ఎంపిక ప్రక్రియ అని పేర్కొంది. ఈ మూడు అంశాలను పరిశీలించిన మీదట ఈ సున్నితమైన కేసులో కోర్టు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని తమకు అనిపించలేదని న్యాయూర్తులు అన్నారు. రఫేల్ విమానాలను ఫ్రాన్స్లోని డసో ఏవియేషన్ కంపెనీ తయారు చేస్తుండగా భారత్లో ఆఫ్సెట్ భాగస్వామిగా రిలయన్స్ను ఆ కంపెనీ ఎంపిక చేసుకోవడం తెలిసిందే. మోదీ ప్రభుత్వ ఒత్తిడితోనే విమానాల తయారీలో అనుభవం ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ హెచ్ఏఎల్ను కాదని కొత్త సంస్థ రిలయన్స్ డిఫెన్స్ను డసో ఏవియేషన్ను తమ ఆఫ్సెట్ భాగస్వామిగా ఎంపిక చేసుకుందని ఆరోపణలున్నాయి. అయితే ఇందుక తగ్గ ఆధారాలేవీ లేవనీ, ప్రభుత్వం వాణిజ్యపరంగా ఆశ్రిత పక్షపాతం చూపిందని నిరూపించేలా సాక్ష్యాలేవీ లేవని కోర్టు పేర్కొంది. ఒప్పందం ప్రకారం ఆఫ్సెట్ భాగస్వామి ఎంపిక నిర్ణయం అసలు ప్రభుత్వం చేతుల్లోనే లేదని ధర్మాసనం తెలిపింది. -
రాహుల్ సుప్రీంకోర్టు కంటే గొప్పవాడా?
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాహుల్ నోటిని అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. దేశ ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికారు. రాఫెల్ డీల్పై విచారణ చేయలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో.. దేశానికి కాపలాదారు (చౌకీదార్)గా ఉంటానన్న ప్రధాని మోదీ పెద్ద దొంగ అని రాహుల్ మీడియా సమావేశంలో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. (ఖర్గేకు తెలియకుండా వేరే పీఏసీ ఉందా : రాహుల్) ‘రాహుల్ తనకు తాను చాలా గొప్పగా ఊహించుకుంటున్నాడు. సుప్రీం తీర్పును గౌరవించకుండా.. దేశ ప్రధాని హోదాను కించపరిచే విధంగా మాట్లాడుతున్నాడు. చౌకబారు వ్యాఖ్యలు చేస్తున్న రాహుల్ నోటిని అదుపులో పెట్టుకో. రాహుల్ సుప్రీంకోర్టు కంటే గొప్పవాడా. కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టు కంటే కూడా గొప్పదని భావిస్తోందా. రాఫెల్ వ్యవహారంలో కాంగ్రెస్ దిక్కుమాలిన రాజకీయాలు చేయాలని చూస్తోంది.’ అని ధ్వజమెత్తారు. -
రాఫెల్ డీల్పై రాహుల్ సూటి ప్రశ్న
సాక్షి, న్యూఢిల్లీ : రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంలో నరేంద్ర మోదీ సర్కారుకు సుప్రీంకోర్టులో ఊరట లభించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ స్పందించారు. రాఫెల్ ఒప్పందంలో మోదీ సర్కార్ అవకతవకలకు పాల్పడిందనే ఆరోపణలపై వెనక్కి తగ్గేది లేదని మరోసారి స్పష్టం చేశారు. భారత ప్రజలకు చౌకీదార్ (కాపలాదారు)గా ఉంటానన్న నరేంద్ర మోదీ పెద్ద దొంగ అని రాహుల్ మీడియా సమావేశంలో విరుచుకుపడ్డారు. రాఫెల్ డీల్పై ఉమ్మడి పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) వేయాలని డిమాండ్ చేశారు. అసలు అప్పుడే పురుడుపోసుకున్న అనిల్ అంబానీ కంపెనీకి రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలు కాంట్రాక్టు ఎలా ఇస్తారని ఆయన సూటిగా ప్రశ్నించారు. ‘ఈ డీల్కు సంబంధించిన నివేదిక కాగ్ ద్వారా పబ్లిక్ కమిషన్ (పీఏసీ)కు చేరాయని సుప్రీం కోర్టు తెలిపింది. కానీ, పీఏసీ చైర్మన్ మల్లిఖార్జున ఖర్గే మాత్రం తమకు ఏ వివరాలు రాలేదని అంటారు. పీఏసీ చైర్మన్కు తెలియని నివేదిక ఉంటుందా. ఖర్గేకు తెలియకుండా వేరే పీఏసీ ఉందా’ అని రాహుల్ ప్రశ్నించారు. తన స్నేహితుడు అనిల్ అంబానీకి ప్రధానమంత్రి అడ్డగోలుగా దోచిపెట్టాడని విమర్శించారు. రాఫెల్ కేసులో మోదీ సర్కార్కు ఊరట -
‘ఏ ముఖం పెట్టుకొని ప్రజల దగ్గరికి వెళతారు’
సాక్షి, హైదరాబాద్: భారత్ అత్యాధునిక యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించిన వివాదం పై సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణ సాగర్ రావు డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాఫెల్ డీల్ మీద సుప్రీం కోర్టు స్పష్టమైన తీర్పునిచ్చిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ రఫెల్ డీల్లో లేనిపోని వివాదం సృష్టింపచి బీజేపీ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేయడం ఇప్పటికైనా మానుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం పై ప్రజలకు బీజేపీ ప్రభుత్వం అవినీతి రహిత సర్కార్ అని క్లారిటీ ఉంది. సుప్రీం కోర్టు తీర్పుతో అది మరింత స్పష్టమైంది. రాహుల్, కాంగ్రెస్ పార్టీ నేతలు చవకబారు రాజకీయాలు చేస్తున్నట్లు సుప్రీం కోర్టు తీర్పుతో బహిర్గతమైంది. అవినీతి లేని ప్రభుత్వాన్ని చూసి కాంగ్రెస్ పార్టీ తల్లడిల్లుతోంది. కుక్క తోక పట్టుకుని గోదారి ఈదుతామని అనుకున్న రాహుల్ గాంధీ కలలు ఆవిరి అయ్యాయి...ఇప్పుడు రాహుల్ ఏ ముఖం పెట్టుకొని ప్రజల దగ్గరికి వెళ్తారని ప్రశ్నించారు. సుప్రీం కోర్టు తీర్పుతో రాహుల్ గాంధీ అసత్యాలు మాట్లాడుతారని చెప్పడానికి ఇదే మంచి ఉదాహరణ అని అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని రాహుల్ అనుకూడని మాటలు అన్నారు. ఈ తీర్పుతో దొంగలు ఎవరో దొరలు ఎవరో తేలిపోయిందని కృష్ణ సాగర్ రావు చెప్పారు. -
‘రాఫెల్పై రాహుల్ క్షమాపణలు చెప్పాలి’
సాక్షి, న్యూఢిల్లీ : రాఫెల్ ఒప్పందంలో జోక్యం చేసుకోబోమని సుప్రీం కోర్టు శుక్రవారం తేల్చి చెప్పడంతో ఎన్డీయే సర్కారుకు ఊరట లభించింది. ఈ డీల్కు వ్యతిరేకంగా దాఖలైన 36 పిటిషన్లను కూడా కోర్టు తోసిపుచ్చింది. దీంతో రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ బీజేపీని టార్గెట్ చేస్తున్న కాంగ్రెస్కు ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు ఢిల్లీలో మీడియాతో మట్లాడతూ... కేంద్ర ప్రభుత్వంపై, రక్షణ వ్యవస్థపై తప్పుడు ఆరోపణలు చేసిన కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ హయాంలోనే 2002లో రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఒప్పందం జరిగిందని గుర్తు చేశారు. (రాఫెల్ కేసులో మోదీ సర్కార్కు ఊరట) కానీ, 2015 వరకు ఆ కొనుగోలు ప్రక్రియ ముందుకు సాగలేదని తెలిపారు. అప్పటికే శత్రుదేశాలు పలు యుద్ద విమానాలు కొనుగోలు చేసి మనకన్నా పటిష్ట స్థితిలో ఉన్నాయనీ, రాఫెల్ డీల్ను కాంగ్రెస్ కావాలనే ఆలస్యం చేసిందిని జీవీఎల్ ఆరోపించారు. రాబర్ట్ వాద్రా, ఆయన మిత్రులకు కమీషన్లు రాలేదనే అక్కసుతోనే రాహుల్ కేంద్రంపై నిరాధార ఆరోపణలు చేశారని మండిపడ్డారు. యుద్ద విమానాల కొనుగోలును ఆలస్యం చేసి దేశ భద్రతకు ముప్పు వాటిల్లే విధంగా కాంగ్రెస్ వ్యవహరించిందని మండిపడ్డారు. మధ్యవర్తులు లేకుండా విమనాలు కొనుగోలు చేయడాన్ని సుప్రీం కోర్టు సమర్థించిందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్తో చేరినందుకు చంద్రబాబు నాయుడిని తెలంగాణ ప్రజలు గట్టి దెబ్బకొట్టారనీ, ఆయనకు మరోసారి దెబ్బ పడడం ఖాయమని జీవీఎల్ జోస్యం చెప్పారు. రాఫెల్ డీల్పై చర్చించేందుకు బీజీపీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని అన్నారు. ఈ విషయాన్ని ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ పార్లమెంట్లో స్పష్టం చేశారని జీవీఎల్ వెల్లడించారు. -
‘దేశంలో దొంగలు పడ్డారు’
సాక్షి, ఢిల్లీ: రాఫెల్పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఇకనైనా ప్రతిపక్షాలకు కనువిప్పుకలగాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్షీనారాయణ వ్యాఖ్యానించారు. రాఫెల్ పిటిషన్ల్ను సుప్రీంకోర్టు తిరస్కరిస్తూ శుక్రవారం ఇచ్చిన తీర్పుపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. దీనిపై మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ నేత కుటుంబరావు పెద్ద స్కాం బయటపెడతానని చెప్పి లేని కుంభకోణాన్ని సృష్టించారని అన్నారు. ఏనుగు పోతుంటే కుక్కుల మొరుగుతుంటాయని ఎద్దేవా చేశారు. ‘‘తెలుగుదేశం పార్టీ పెద్ద డ్రామా కంపెనీ. ఆ కంపెనీకి డైరెక్టర్ చంద్రబాబు నాయుడు. ఆయన గురించి పట్టించుకోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు. దేశంలో దొంగలు పడ్డారు. వాళ్లతో జాగ్రత్తగా ఉండాలి. కొందరు బురదలో దొర్లి దానిని ఇతరులకు అంటిచాలని ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబుతో కాంగ్రెస్ పార్టీ స్నేహం చేస్తే తెలంగాణలో చేతులు కాలినట్లు మళ్లీ కాల్చుకుంటారు. కాంగ్రెస్ పార్టీ ఆయన పట్ల జాగ్రత్తగా ఉండాలి. కాపు, వాల్మీకి రిజర్వేషన్ల గురించి కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్, జయల్ ఓరంతో చర్చించాము. చంద్రబాబు వారిని ఏవిధంగా మోసం చేశాడో వివరించాము. త్వరలో రిజర్వేషన్లపై క్లారిటీ వస్తుంది’’ అని అన్నారు. -
రాఫెల్ కేసులో మోదీ సర్కార్కు ఊరట
సాక్షి, న్యూఢిల్లీ : రాఫెల్ ఒప్పందంలో మోదీ సర్కార్కు భారీ ఊరట లభించింది. ఈ ఒప్పందాన్ని సవాల్ చేస్తూ విచారణ కోసం దాఖలైన పిటిషన్ను శుక్రవారం సర్వోన్నత న్యాయస్ధానం కొట్టివేసింది. రాఫెల్ ఒప్పందంలో జోక్యం చేసుకోబోమని సుప్రీం కోర్టు తేల్చిచెప్పింది. రాఫెల్ డీల్కు వ్యతిరేకంగా దాఖలైన 36 పిటిషన్లను కోర్టు తోసిపుచ్చింది. ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన రాఫెల్ విమానాల ధరలను దేశభద్రత దృష్ట్యా రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. విమానాల ధరల విషయం కొనుగోలు కమిటీ చూసుకుంటుందని పేర్కొంది. ఒప్పందంలో అనుమానించాల్సిన అంశాలేమీలేవని జస్టిస్ రంజన్ గగోయ్ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం బెంచ్ స్పష్టం చేసింది. దేశ రక్షణను దృష్టిలో ఉంచుకుని ఒప్పందంపై చర్చ అనవసరమని పేర్కొంది. రాఫెల్ ఒప్పందం ప్రకటించినప్పుడు అభ్యంతరాలు ఎందుకు రాలేదని పిటిషనర్ను కోర్టు ప్రశ్నించింది. రాఫెల్ ఒప్పందంపై దర్యాప్తు అవసరం లేదని స్పష్టం చేసింది. రాఫెల్ ప్రకంపనలు రాఫెల్ ఒప్పందంలో మోదీ సర్కార్ లక్ష్యంగా విమర్శల దాడి ఎక్కుపెట్టిన కాంగ్రెస్కు సుప్రీం కోర్టు తీర్పుతో నిరాశ ఎదురైంది. రూ 56వేల కోట్లతో 36 విమానాల కొనుగోలుకు సంబంధించి భారత్, ఫ్రాన్స్ మధ్య జరిగిన ఒప్పందంలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. ఈ ఒప్పందంలో భాగంగా రిలయన్స్ డిఫెన్స్ను ఆఫ్సెట్ పార్టనర్గా భారత్ సూచనతోనే దసాల్ట్ ఏవియేషన్ ఎంపిక చేసుకుందని ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు హోలాండ్ వెల్లడించడం కలకలం రేపింది. ఈ ఒప్పందంపై విచారణ జరిపించాలని కాంగ్రెస్ సహా విపక్షాలు పట్టుబట్టాయి. -
నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు
న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలకు సర్వం సిద్ధమైంది. నేటి నుంచి వచ్చే ఏడాది జనవరి 8 వరకూ ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్గఢ్, మిజోరం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా మంగళవారం వెలువడనున్న నేపథ్యంలో సమావేశాలు వాడీవేడిగా సాగనున్నాయి. ఈ సమావేశాల్లో ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాజీనామా, సీబీఐలో అంతర్గత కుమ్ములాటలు, రఫేల్ ఒప్పందంపై కేంద్రాన్ని ఇరుకున పెట్టేందుకు విపక్షాలు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. అయోధ్యలో రామాలయం నిర్మాణంపై మిత్రపక్షం శివసేన నుంచే బీజేపీకి ఇబ్బందులు ఎదురుకానున్నాయి. మరోవైపు అగస్టా కుంభకోణం కేసులో మధ్యవర్తి మిషెల్ను దుబాయ్ నుంచి భారత్కు తీసుకురావడం, విజయ్మాల్యా అప్పగింతపై బ్రిటన్ కోర్టు తీర్పును ఈ సమావేశాల్లో ఎన్డీయే ప్రధా న అస్త్రంగా వాడుకోనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ట్రిపుల్ తలాక్, నేషనల్ కమిషన్ ఫర్ హోమియోపతి తదితర 45 కీలక బిల్లులను ఈ సమావేశాల్లోనే ఆమోదింపజేసుకోవాలని కేంద్రం కృతనిశ్చయంతో ఉంది. -
‘రఫేల్’లో రాహుల్ ఫెయిల్
సాక్షి, హైదరాబాద్: దేశ రక్షణ విషయంలో బీజేపీ ఎక్కడా వెనకడుగు వెయ్యదని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్సింగ్ స్పష్టం చేశారు. రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు కోసం గత యూపీఏ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందంతో పోలిస్తే దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మెరుగైన ఒప్పందాన్ని ఫ్రాన్స్తో కుదుర్చుకున్నామని రాజ్నాథ్ తెలిపారు. కానీ కొంత మంది నాయకులు పడుకున్నా, నిల్చున్నా రఫేల్ డీల్ అని కలవరిస్తున్నారని, అందులో రా.. ఫెయిల్... రాహుల్ (గాంధీ) ఫెయిల్ అయ్యారని ఎద్దేవా చేశారు. 2019 ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) భవిష్యత్తు కార్యాచరణను ఖరారు చేసేందుకు సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో ‘విజయ్లక్ష్య 2019 యువ మహాధివేశన్’పేరుతో యువ సమ్మేళనాన్ని నిర్వహించింది. బీజేవైఎం జాతీయ అధ్యక్షురాలు పూనం మహాజన్ అధ్యక్షతన జరిగిన ఈ సమ్మేళనానికి రాజ్నాథ్సింగ్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ రాఫెల్ ఒప్పందంపై ప్రతిపక్షాలు ఒకే అబద్ధాన్ని వందసార్లు ప్రచారం ప్రజలను నమ్మించాలని చూస్తున్నాయని మండిపడ్డారు. దేశంలో విశ్వసనీయతగల ఏకైక పార్టీ బీజేపీయేనన్నారు. సామాజిక, రాజకీయ కార్యకర్తలుగా సమాజ సేవ చేసేది కేవలం బీజేపీ మాత్రమేనన్నారు. స్వచ్ఛ భారత్, బేటీ బచావో, బేటీ పడావో లాంటి పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. సంకుచిత మనసుతో గొప్ప ఆలోచనలు రావన్న అటల్ బిహారీ వాజ్పేయి మాటలు ఎప్పుడూ బీజేపీకి ఆచరణీయమన్నారు. యువతతోనే మార్పు సాధ్యం... యువత ఎప్పుడూ యాచకులు కావద్దని, ఎదుటివారికి పెట్టే స్థాయికే ఎదగాలన్నదే బీజేపీ లక్ష్యమని రాజ్నాథ్ చెప్పారు. దేశంలో యువతను సరైన దిశలో తీసుకువెళ్లే నాయకత్వ లక్షణాలు పూనం మహజన్లో ఉన్నాయన్నారు. తన తండ్రి ప్రమోద్ మహాజన్ లాంటి గొప్ప నాయకుడి నుంచి ఆమె నాయకత్వ లక్షణాలను పుణికిపుచ్చు కుందన్నారు. దేశంలో ఏ మార్పు రావాలన్నా అది యువత వల్లనే సాధ్యం అవుతుందని, యువశక్తి ఎక్కువగా ఉన్న ఏకైక దేశం భారత్ మాత్రమేనని రాజ్నాథ్ తెలిపారు. విపక్షాలకు దేశాభివృద్ధి పట్టదు... నేషన్ ఫస్ట్, పార్టీ నెక్ట్స్, సెల్ఫ్ లాస్ట్ అనే నినాదంతో అన్ని వర్గాలకు సమన్యాయం అందించేందుకు బీజేపీ కృషి చేస్తుంటే కాంగ్రెస్ మాత్రం రాజకీయాలే ప్రధానం అన్నట్లుగా వ్యవహరిస్తోందని రాజ్నాథ్ విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తుంటే కాంగ్రెస్ బురద జల్లే ప్రయత్నం చేస్తోందని దుయ్యబట్టారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని, అన్ని పక్షాలు ఒక్కటైనా ప్రధాని మోదీని, బీజేపీని ఏమీ చేయలేరని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడు కాంగ్రెస్తో జట్టుకట్టే పార్టీలు తరువాత ‘మీటూ’ఉద్యమం చేయాల్సి వస్తుందని ఎద్దేవా చేశారు. మోదీ నేతృత్వంలో భారత్ విశ్వగురువుగా అవతరించాలంటే 2019 ఎన్నికల్లో బీజేపీ 350 సీట్లు గెలవాలని, ఈ లక్ష్యం సాధించే వరకు కార్యకర్తలు అహర్నిశలు పనిచేయాలని రాజ్నాథ్ పిలుపునిచ్చారు. వందల ఎకరాలు ఉన్న వారికే రైతు బంధుతో లబ్ధి: త్రిపుర సీఎం తెలంగాణలో వందల ఎకరాలు ఉన్న వారే రైతు బంధు పథకం ద్వారా ఎక్కువగా లబ్ధి పొందుతున్నారని త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్ కుమార్ దేవ్ విమర్శించారు. ఈ పథకం వల్ల చిన్న రైతులకు పెద్దగా ప్రయోజనం చేకూరడం లేదన్నారు. ఒక ఎకరం భూమి ఉన్న వారికి రూ. 8 వేలే ఇస్తూ వందల ఎకరాలు ఉన్న వారికి ఎకరానికి రూ. 8 వేల చొప్పున ఇస్తున్నారన్నారు. అందులో పంట పండిస్తున్నారా లేదా అనేది చూడకుండానే ఇస్తున్నారన్నారు. దీంతో ఎక్కువ భూమి ఉన్న వారికే అధిక ప్రయోజనం చేకూరుతోందన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా కేంద్రం దేశంలో అందరికీ రూ. 5 లక్షల చొప్పున వైద్య సదుపాయం, ఆరోగ్య బీమా కల్పిస్తోందన్నారు. బీజేపీకి 1.25 శాతం ఓటింగ్ ఉన్న త్రిపురలో పార్టీ అధ్యక్షునిగా ఉన్న తనను అమిత్ షా వ్యూహాలతో సీఎంను చేశారన్నారు. ఆయన వ్యూహాల వల్లే త్రిపురలో 25 ఏళ్ల వామపక్ష ప్రభుత్వాన్ని గద్దె దించగలిగామన్నారు. రాజకీయం అంటే వెన్నుపోట్లు కాదు.. రాజకీయాలు అంటే మోసం, నమ్మకద్రోహం, వెన్నుపోట్లు కాదని రాజ్నాథ్సింగ్ పేర్కొన్నారు. రాజనీతి అంటే ఇప్పుడున్న అర్థం మార్చి దాని గొప్పదనం పెంచాలన్నారు. సన్మార్గంవైపు నడిపించేదే రాజకీయమని, అందుకు బీజేపీ కృషి చేస్తుందన్నారు. కాంగ్రెస్ మాత్రం స్వార్థ రాజకీయాలు చేస్తోందన్నారు. స్వాతంత్య్రం వచ్చాక కాంగ్రెస్ పార్టీని రద్దు చేయాలన్న గాంధీజీ మాటలను ఆ పార్టీ నేతలు పట్టించుకోలేదని విమర్శించారు. ఇందిరాగాంధీ హయాంలో పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో భారత్ గెలిచినప్పుడు ఆమెను వాజ్పేయి పొగిడారని రాజ్నాథ్ గుర్తుచేశారు. దేశం కోసం ఆలోచించినప్పుడే ఇందిర గెలిచారని, కానీ ఆ తరువాత సంతుష్టీకరణ రాజకీయాలు పెరగడంతో ఆమె ఓడి పోయారన్నారు. 2019 ఎన్నికల్లో 350 సీట్లే మన సంకల్పం: పూనం మహాజన్ వచ్చే ఏడాది జరిగే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 350 సీట్లు సాధించి మరోసారి అధికారంలోకి వచ్చేందుకు యువమోర్చా కృషి చేయాలని బీజేవైఎం జాతీయ అధ్యక్షురాలు పూనం మహాజన్ పిలుపునిచ్చారు. కార్యకర్తలంతా మరోసారి మోదీ విజయం కోసం దీక్షబూనాలన్నారు. బీజేపీ గెలుపు కోసం ప్రతి పోలింగ్ బూత్లో కమలం యూత్ ఉండాలన్నారు. భారత్ను, మోదీని విశ్వగురువును చేసేందుకు, మరో 15 ఏళ్లు బీజేపీని అధికారంలో ఉంచేందుకు యువ మోర్చా పని చేయాలని పూనం కోరారు. దేశంలో పేదల కోసం పని చేసేది బీజేపీ మాత్రమేనని, దేశ వ్యతిరేక శక్తులను ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బీజేవైఎం తెలంగాణ, ఏపీ అ«ధ్యక్షులు భరత్గౌడ్, రమేష్ నాయుడు, ఇతర రాష్ట్రాల బీజేవైఎం అధ్యక్షులు ప్రసంగించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్, మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు, మాజీ ఎమ్మెల్యే కిషన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గుజరాత్ నుంచే పరువు నష్టం దావాలు?
సాక్షి, న్యూఢిల్లీ : రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు కుంభకోణానికి సంబంధించి వార్తా కథనాన్ని ప్రచురించినందుకు ‘ది సిటిజెన్’ పత్రిక సంపాదకురాలు సీమా ముస్తఫాపై అనిల్ అంబానీకి చెందిన రిలయెన్స్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ లిమిటెడ్ తాజాగా ఏడువేల కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేసింది. ఇదే కంపెనీ గత వారం ఇదే కారణంతో ‘ఎన్డీటీవీ’పైన పది వేల కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేసింది. ఇదే రాఫెల్ యుద్ధ విమానాల స్కామ్కు సంబంధించి అంబానీ కంపెనీ పలువురు కాంగ్రెస్ నాయకులు, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు సంజయ్ సింగ్, మీడియా సంస్థలపై మొత్తం 75 వేల కోట్ల రూపాయల మేరకు పరువు నష్టం దావాలు వేసింది. అన్ని దావాలు కూడా గుజరాత్లోని అహ్మదాబాద్ నగరంలోనే దాఖలు చేయడం గమనార్హం. భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు అమిత్ షా కుమారుడు జయ్ షా కూడా 2017లో ‘ది వైర్’ మీడియాపై వంద కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేసింది కూడా అహ్మదాబాద్ నుంచే. పరువు నష్టం దావాలకు, గుజరాత్కు లింకేమిటీ? ఎందుకు అక్కడి నుంచే దావాలు వేస్తున్నారు? 2004లో గుజరాత్ ప్రభుత్వం తీసుకొచ్చిన కోర్టు రుసుముల చట్టం ప్రకారం ఎంత పెద్ద మొత్తానికి పరువు నష్టం దావా వేసినా గరిష్టంగా చెల్లించాల్సింది 75 వేల రూపాయలు మాత్రమే. ఉత్తుత్తి పరువు నష్టం దావాలను నిరుత్సాహ పర్చేందుకుగాను దేశంలోని పలు రాష్ట్రాలు పరువు నష్టం దావా రుసుములను పెంచాయి. పేద వారికి న్యాయం జరగాలనే ఉద్దేశంతో గుజరాత్ రాష్ట్రం అన్నింటికన్నా పరువు నష్టం రుసుములను తక్కువగా పేర్కొంది. అందుకని భారీ మొత్తాలకు పరువు నష్టం దావాలను వేయాలనుకున్న వారు గుజరాత్ను ఆశ్రయిస్తున్నారు. ముఖ్యంగా గుజరాత్లో బ్రాంచీలున్న కంపెనీలు అలా చేస్తున్నాయి. పైగా ఎక్కడో ఉన్న నిందితుడిని కోర్టు విచారణ పేరిట గుజరాత్ వరకు రప్పించి తిప్పించవచ్చన్నది కూడా వారి కుట్రలో ఓ భాగం. గుజరాత్ హైకోర్టుకు సివిల్ జురిడిక్షన్ హోదా లేకపోవడం కూడా కలిసిసొచ్చే అవకాశమే. ఈ హోదా లేకపోవడం వల్ల అన్ని సివిల్ పరువు నష్టం దావాలను అహ్మదాబాద్ సిటీ సివిల్ కోర్టులోనే దాఖలు చేయాలి. అప్పీల్కు మాత్రమే హైకోర్టుకు రావాలి. బాంబే, కలకత్తా, ఢిల్లీ, మద్రాస్, హిమాచల్ ప్రదేశ్లోని ఐదు హైకోర్టులు మాత్రమే సివిల్ జురిడిక్షన్లో ఉన్నాయి. వీటి పరిధిలో ఓ పరిమితికి మించి పరువు నష్టం దావాలు వేయాలంటే హైకోర్టులనే నేరుగా ఆశ్రయించాల్సి ఉంటుంది. తమిళనాడులోని సిటీ సివిల్ కోర్టులో 25 లక్షల రూపాయల వరకు పరువు నష్టం కేసు దాఖలు చేయవచ్చు. పది లక్షల నుంచి 25 లక్షల వరకు మూడు శాతం చొప్పున కోర్టు ఫీజు చెల్లించాలి. 25 లక్షలకు మించిన పరువు నష్టం దావాలయితే మద్రాస్ హైకోర్టులోనే దాఖలు చేయాలి. ఎంత మేరకైనా పరువు నష్టం దావా వేయవచ్చు. అయితే అందులో ఒక శాతం మొత్తాన్ని కోర్టు రుసుము కింద చెల్లించాలి. 2015లో సవరణల ప్రకారం ఢిల్లీలో దిగువ కోర్టులు రెండు కోట్ల రూపాయల వరకు, అంతకుమించితే హైకోర్టులో పరువు నష్టం దావాలు వేయాల్సి ఉంటుంది. రిలయెన్స్ కంపెనీ ‘ఎన్డీటీవీ’పైన మద్రాస్ నుంచి పరువు నష్టం దావా వేసి ఉన్నట్లయితే కోర్టు రుసుము కింద వంద కోట్ల రూపాయలను చెల్లించాల్సి వచ్చేది. గుజరాత్లో గరిష్ట రుసుము 75 వేల రూపాయలే కనుక ఆ మొత్తాన్ని చెల్లించి పదివేల కోట్ల రూపాయలకు దావా వేసింది. పేదలను దృష్టిలో పెట్టుకొని కోర్టు రుసుములను అతి తక్కువగా నిర్ణయిస్తే రిలయెన్స్ లాంటి పెద్దలు, రాజకీయ నాయకులకే ఎక్కువగా ఉపయోగపడుతుంది. అందుకు ఎక్కువగా మీడియా సంస్థలే నష్టపోవాల్సి వస్తోంది. సామాన్యులు చాలా వరకు పరువు నష్టం దావాల జోలికి వెళ్లరని తెల్సిందే. -
సీబీఐలో వరుస పరిణామాలపై రాహుల్ స్పందన
-
ఎన్డీటీవీకి రాఫెల్ సెగ : రూ.10వేల కోట్ల దావా
సాక్షి,న్యూఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టిన రాఫెల్ డీల్ సెగ ఎన్డీటీవీని తాకింది. రాఫెల్ ఫైటర్ జెట్స్ కొనుగోలు వివాదంలో ఒక కార్యక్రమాన్ని ప్రసారం చేసినందుకు అనీల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ ఎన్డీటీవీపై కోట్ల రూపాయల దావా వేసింది. రాఫెల్ డీల్కు సంబంధించి అవాస్తవాలను, కట్టుకథలను ప్రసారం చేసిందని ఆరోపిస్తూ గుజరాత్లోని అహ్మదాబాద్ కోర్టులో రిలయన్స్ గ్రూపు పదివేల కోట్ల రూపాయలకు దావా వేసింది. అక్టోబరు 26న దీనిపై విచారణ జరగనుంది. ఎన్టీవీలో సెప్టెంబరు 29 న ప్రసారం చేసిన వీక్లీ ప్రోగ్రాం ‘ట్రూత్ వెర్సస్ హైప్స్’పై ఈ కేసు ఫైల్ చేసింది. అయితే దీనిపై ఎన్డీటీవీ స్పందించింది. న్యాయపరమైన పోరాటానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపింది. రిలయన్స్ చేసిన పరువు నష్టం ఆరోపణలను తిరస్కరించింది. ఒక వార్తా సంస్థగా సత్యాన్ని బయటపెట్టే బాధ్యత తమకుందనీ, స్వతంత్ర, న్యాయమైన జర్నలిజానికి తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. అంతేకాదు ఇది మీడియాకు ఒక హెచ్చరిక అని ఎన్డీటీవీ వ్యాఖ్యానించింది. కాగా రాఫెల్ ఒప్పందంపై అధికార, ప్రతిపక్షం మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం జోరుగా సాగుతోంది. దివాలా తీసిన అనిల్ అంబానీకి బిల్లియన్ల డాలర్లను కట్టబెట్టేందుకే ప్రభుత్వరంగ సంస్థను కాదని మరీ రిలయన్స్ డిఫెన్స్కు ఈ కాంట్రాక్టును అప్పగించిందని నరేంద్రమోదీ సర్కార్పై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ వివాదానికి ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలెండ్ వ్యాఖ్యలతో మరింత అగ్గి రగిలింది. ‘దేశ్ కీ చౌకీదార్, అనిల్ అంబానీ కా చౌకీదార్ బన్గయా’ అంటూ మోదీపై రాహుల్ విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. -
రాఫెల్: రాహుల్ స్ట్రాటజీ వర్కవుట్ అవుతుందా?
సాక్షి, న్యూఢిల్లీ : ‘దేశ్ కీ చౌకీదార్, అనిల్ అంబానీ కా చౌకీదార్ బన్గయా’ అంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి అవకాశం దొరికినప్పుడల్లా విరుచుకుపడుతున్నారు. రానున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోపాటు వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకు ‘రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోల్మాల్’ను సజీవంగా ఉంచి లబ్ధి పొందాలని రాహుల్ చూస్తున్నారు. ఆయన వ్యూహం ఫలించేనా? 1437 కోట్ల రూపాయల బోఫోర్స్ ఆయుధాల కొనుగోల్మాల్లో కేవలం 65 కోట్ల రూపాయల ముడుపులు చేతులు మారాయన్న ఆరోపణల కారణంగా నాడు రాజీవ్ గాంధీ ప్రభుత్వం కుప్పకూలి పోయింది. నేడు ఏకంగా 58 వేల కోట్ల రూపాయల కొనుగోళ్లలో వేలాది కోట్లు చేతులు మారుతున్నాయన్న ఆరోపణలపై నరేంద్ర మోదీ ప్రభుత్వం పడిపోతుందా? అసలు ఈ ఆరోపణలను జనం నమ్ముతారా? నమ్మితే ఎంతవరకు? బోఫోర్స్ కుంభకోణాన్ని జనంలోకి తీసుకెళ్లడంలో నాడు వీపీ సింగ్ విజయం సాధించారు. నాడు మీడియా కూడా కుంభకోణాన్ని ఊదరగొట్టింది. నేడు వీపీ సింగ్ లాంటి నాయకుడు లేరు. నాటి లాగా నేటి మీడియా లేదు. నాడు రాజీవ్ గాంధీని సమర్థుడైన నాయకుడని మధ్యతరగతి ప్రజలు నమ్మలేదు. నేడు నాలుగేళ్ల పాలనలో చెప్పుకోతగ్గ అభివద్ధి ఏమీ సాధించకపోగా, పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ లాంటి నిర్ణయాలు భూమరాంగ్ అయినా మోదీని ఇప్పటికీ మధ్య తరగతి ప్రజలు విశ్వసిస్తున్నారు. రాహుల్ గాంధీని ఇంకా విశ్వాసంలోకి తీసుకోవడం లేదు. రాఫెల్ యుద్ధ విమానాల్లో భారీ కుంభకోణం జరిగిందంటూ రాహుల్ గాంధీ సహేతుకంగానే ఆరోపణలు చేస్తున్నప్పటికీ అది సామాన్య ప్రజల్లోకి వెళ్లకపోవడానికి ఈ కారణాలతోపాటు ఆయన ఉపన్యాస ధోరణి కూడా కారణమే. ఈ మధ్య కాస్త ఆవేశంగా మాట్లాడుతున్నప్పటికీ అది రాయించుకున్న స్క్రిప్టును వల్లెవేసినట్లుగా ఉంటుందని తోటి కాంగ్రెస్ నాయకులే అంటున్నారు. ఆయన ఉపన్యాస ధోరణి పట్టణ ప్రజలను ఆకర్షించకపోగా గ్రామీణ ప్రజలకు అర్థం కావడం లేదు. రాహుల్ గాంధీ ఫ్రాన్స్ నుంచి తీసుకొచ్చిన ఈ ‘రఖేల్’ వివాదం ఏమిటని తమను గ్రామీణ ప్రజలు అప్పుడప్పుడు అడుగుతుంటారని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని యూపీ కాంగ్రెస్ నాయకుడొకరు చెప్పారు. రాఫెల్ వివాదానికి సంబంధించి రాహుల్ గాంధీ చేస్తున్న ప్రధాన ఆరోపణలు రెండు. ఒకటి యూపీఏ ప్రభుత్వంలో చర్చలు జరిపినప్పటితో పోలిస్తే ఒప్పందం విలువ అనూహ్యంగా పెరిగిపోవడం, రెండు, ఒప్పందంలో మార్గదర్శకాలను మార్చి ఫ్రాన్స్ కంపెనీ భారతీయ భాగస్వామి కంపెనీగా అనిల్ అంబానీ కంపెనీని ఎంపిక చేసుకోవడం, అందులోనూ యుద్ధ విమానాల ఉత్పత్తిలో అణు మాత్రం అనుభవంలేని, అప్పటికీ పుట్టని అనిల్ అంబానీ కంపెనీని ఎంపిక చేయడం. వివాదాన్ని సజీవంగా ఉంచాలనే.. రాఫెల్ యుద్ధ విమానాల కుంభకోణాన్ని రానున్న సార్వత్రిక ఎన్నికల వరకు సజీవంగా ఉంచాలనే కాంగ్రెస్ పార్టీ దీన్ని సుప్రీం కోర్టుకు తీసుకెళ్లింది. ఈ కేసును బుధవారం నాడు విచారించిన సుప్రీంకోర్టు, ఒప్పందం చేసుకోవడానికి అనుసరించిన చర్చల ప్రక్రియ ఏమిటో తెలియజేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. సీల్డ్ చేసిన కవర్లో వీటి వివరాలను అక్టోబర్ 29వ తేదీలోగా అందజేయాని, 31 నాడు విచారణ జరుగుతుందని తెలిపింది. ఒప్పందం విలువ అనూహ్యంగా పెరగడానికి కారణాలనుగానీ, హెచ్ఏఎల్కు బదులు రిలయెన్స్ను ఎంపిక చేయడానికి కారణాలుగానీ అడగకుండా జనాంతికంగా చర్చల ప్రక్రియను సుప్రీంకోర్టు కేంద్రాన్ని కోరిందంటే కేసు కూడా ఎక్కువ కాలం నిలబడక పోవచ్చు. అదేపనిగా ప్రచారం తోటి ప్రతిపక్ష పార్టీల నాయకులెవరూ రాఫెల్ ఒప్పందాన్ని పట్టించుకోకపోయినా రాహుల్ గాంధీయే ప్రధాన ఆయుధంగా ప్రచారం చేస్తున్నారు. అది పార్లమెంట్ వేదికైనా, ఎన్నికల ర్యాలీ అయినా, లండన్ యూనివర్శిటీ విద్యార్థులతో మాట్లాడినా రాఫెల్ వివాదాన్నే అందుకుంటున్నారు. రిలయెన్స్ కంపెనీని ఎంపిక చేసుకోవడం తమకు తప్పనిసరైందంటూ రాఫెల్ యుద్ధ విమానాలను ఉత్పత్తిచేసే డిసౌ కంపెనీ ప్రతినిధులు చెప్పడాన్ని ఉటంకిస్తూ తాజాగా ఫ్రెంచ్ వెబ్సైట్ ‘మీడియాపార్ట్’ ప్రత్యేక వార్తా కథనాన్ని ప్రచురించినప్పుడు కూడా రాహుల్ ఈ వివాదాన్ని అందుకున్నారు. ఈ వివాదం గ్రామీణ జనం వరకు వెళ్లగలదా? విజయాన్ని సాధించపెట్టగలదా? అన్నది ఇప్పటికైతే అనుమానమే! -
సాహెబ్ కా కమాల్ దేఖో..!
న్యూఢిల్లీ: ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ప్రధాని మోదీపై విమర్శనాస్త్రాలు సంధించటం ఆపలేదు. పెరుగుతున్న చమురు ధరలు, రాఫెల్ ఒప్పందం, పడిపోతున్న రూపాయి విలువ అంశాలుగా శనివారం ట్విట్టర్లో ఒక హిందీ కవితను పేరడీగా మలిచారు. ప్రధాని మోదీని సాహెబ్ అని సంబోధించారు. మధ్యప్రదేశ్ పర్యాటక శాఖ ప్రకటనల్లో ఉన్న ఒక లైన్ను ఆధారంగా చేసుకుని సాహెబ్ కా కమాల్ దేఖో.. అంటూ ప్రారంభించి ముంబై, ఢిల్లీల్లో అత్యధిక పెట్రోల్ ధరలను, డాలర్పై రూపాయి విలువ పతనాన్ని ప్రస్తావించారు. రాఫెల్ ఒప్పందం ఒక కుంభకోణం అని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్లోని మంద్సౌర్లో ఓ టీచర్ను బీజేపీ అనుబంధ విద్యార్థి విభాగం నేతలు వేధిస్తున్నట్లుగా ఉన్న ఓ వీడియోనూ షేర్ చేశారు. -
రాఫెల్ రగడ.. మరో కీలక నేత రాజీనామా
సాక్షి, ముంబై : రాఫెల్ డీల్పై ప్రధాని నరేంద్ర మోదీకి అనుకూలంగా మాట్లాడిన ఎన్సీపీ అధినేత శరద్పవార్కు మరో ఎదురుదెబ్బ తలిగిలింది. పార్టీ జనరల్ సెక్రటరీ మునాఫ్ హకీమ్ ఎన్సీపీకి శుక్రవారం రాజీనామా చేశారు. రాఫెల్ కుంభకోణంపై దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీల నుంచి బీజేపీ ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో శరద్పవార్ పవార్ భిన్నంగా స్పందించిన విషయం తెలిసిందే. రాఫెల్ ఒప్పందం విషయంలో ప్రధాని నరేంద్ర మోదీపై ప్రజలకు ఎలాంటి అనుమానాలు లేవని పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో రక్షణశాఖ మంత్రిగా పనిచేసిన పవార్ ఓ మరాఠి న్యూస్ చానల్తో మాట్లాడుతూ.. యుద్ధ విమానాలకు సంబంధించిన సాంకేతిక వివరాలను వెల్లడించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయడం అంతగా ప్రభావం చూపడం లేదన్నారు. ఏది ఏమైనా యుద్ధ విమానాల ధరలు బహిర్గతం చేయడం వల్ల ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది కలగబోదని ఆయన పేర్కొన్నారు. (రాఫెల్ డీల్పై శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు) కాగా, పవార్ వ్యాఖ్యలకు నిరసనగా ఎన్సీపీ వ్యవస్థాపక సభ్యుడు, ఎంపీ తారీఖ్ తన పదవికి రాజీనామా చేశారు. తాజాగా.. మునాఫ్ హకీమ్ కూడా అదే బాటలోనే నడిచారు. పార్టీ సభ్యత్వానికి, జనరల్ సెక్రటరీ పదవికి శుక్రవారం రాజీనామా చేశారు. పార్టీ వ్యవస్థాపక సభ్యుడైన తారీఖ్కు మాటమాత్రమైనా చెప్పకుండా రాఫెల్ ఒప్పందంపై అనుకూలంగా మాట్లాడిన పవార్పై హకీమ్ నిరసన వ్యక్తం చేశారు. అధ్యక్షుడు మాటలు ఎన్సీపీ ప్రతిష్టను దిగజార్చేదిగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. (చదవండి : రాఫెల్ డీల్ వ్యాఖ్యలు: సీనియర్ ఎంపీ రాజీనామా) -
దేశ రక్షణనూ వదలని జూదక్రీడ
మన రక్షణ కొనుగోళ్లలో కచ్చితంగా భారీ కుంభకోణం చోటు చేసుకున్నట్లే మరి. మనం దేన్నీ కొనలేని అసమర్థులం. దీనికి బలయ్యేది మాత్రం మన సాయుధ బలగాలే. ప్రపంచవ్యాప్తంగా ప్రైవేట్ రంగ ఉత్పత్తిదారులు రక్షణ రంగంలో బలంగా పాదం మోపుతున్నప్పటికీ భారత్ మాత్రం వ్యతిరేకత తెలుపుతూ సొంత యుద్ధవిమానం తయారీ విషయంలో వెనుకంజ వేస్తోంది. మనది మూర్ఖుల దేశం అంటూ జస్టిస్ మార్కండేయ ఖట్జూ కొన్ని సందర్భాల్లో చెప్పినది నిజమే అని భావించవచ్చు. భారత్లో ఆయుధాల తయారీకి మనం ప్రైవేట్ రంగాన్ని అనుమతించం. అదే సమయంలో ప్రపంచ ప్రైవేట్ రంగం నుంచి అవే ఆయుధాలను కొనడానికి వెంపర్లాడతాం. ఈ కథనం 1998 ఆరం భానికి సంబంధించినది. అప్పుడే జార్జి ఫెర్నాం డెజ్ అటల్ బిహారీ వాజ్పేయి కేబినెట్లో రక్షణ మంత్రిగా నియమితులయ్యారు. ఇది ఎవరూ ఊహించని విషయమేగాదు, ఆయన అసలేం చేస్తా రనే ప్రశ్న తలెత్తింది. నలిగిన కుర్తా, పైజామా, మామూలు చెప్పులు ధరించే ఈ వింత పోకడల కార్మిక నాయకుడు సాదాసీదాగా నడిచే భారత రక్షణ శాఖను ఎలా నడుపుతారని పలువురు ప్రశ్నించారు. ఫెర్నాండెజ్ మాత్రం చాలా వేగంగా తనదైన మార్గంలో బాగా పనిచేస్తూ మనల్ని ఆశ్చర్యపరి చారు. ‘నేనేమీ చేయను–మిమ్మల్నేమీ చేయనీయను’ అనే ధోరణి ఉన్న ఉన్నత ఉద్యోగవర్గంతో నిండిన విషవలయాన్ని మొదట ఛేదించడం ఆయనకు తొలి సవాలు అయింది. నాస్తికుడైన ఫెర్నాండెజ్కు సియా చిన్ గ్లేసియర్ ప్రాంతం ఇష్టమైన పుణ్యతీర్థమైంది. ‘భారత రక్షణశాఖలో వారు(అధికారులు) అవునని గాని, లేదనిగాని చెప్పరు. వారు ఫైళ్లను ఓ కక్ష్యలో పడేస్తారు. మనం దాని వెంటపడతూ ఉండాల్సిందే. ఈ లోగా యుద్ధాలొస్తాయి, పోతాయి. వాటిని గెల వచ్చు, గెలవకపోవచ్చు. ఫైల్లోని విషయం మాత్రం తేలదు. ఇది నేను గుర్తించిన చిరాకుపుట్టించే వాస్త వం’ అని సియాచిన్లో నాకిచ్చిన ఇంటర్వ్యూలో జార్జి చెప్పారు. సియాచిన్ మంచుకొండల్లో వేగంగా కదలడానికి సైనిక దళాలకు విదేశీ స్నోమొబైల్ ఫోన్లు, స్కూటర్లు అత్యవసరమని ఆయన ఈ ప్రాంతానికి వెళ్లిన ఓ సందర్బంలో గుర్తించారు. ఇవి కొనుగోలు చేయడానికి పంపిన ఫైలు కూడా పైన చెప్పినట్టు కక్ష్యలో తిరుగుతూనే ఉంది. రాజధానికి తిరిగి వచ్చాక ఈ ఫైలు ముందుకు జరగకుండా తొక్కిపట్టిన ఉన్నతాధికారులెవరో జార్జి గుర్తించారు. వెంటనే సియాచిన్కు వెళ్లాలని వారిని ఆదేశించారు. సైనికులకు ఈ స్కూటర్ల అవసరం ఎంత ఉందో తెలుసుకునే వరకూ వారు అక్కడే గడపాలని కూడా మంత్రి కోరారు. దురదృష్టవశాత్తూ ఇప్పుడు ఇలాంటి విషయాలపై ఆయన మాట్లాడే స్థితిలో లేరు. అందుకే, రాఫెల్ యుద్ధవిమానాల కొనుగో లుకు సంబంధించిన ఫైలుపై తమ అసమ్మతి తెలుపుతూ తమ వ్యాఖ్యలు రాసిన రక్షణశాఖలోని జాయింట్ సెక్రెటరీ గురించి మనం అంచనాలకే పరిమితం కాకతప్పదు. ఈ అధికారి నోట్ను ఫెర్నాం డెజ్ చదివితే, వెంటనే ఆయనను ‘అత్యంత నైపుణ్య మున్న రాకెట్ సైంటిస్టు’గా ప్రకటించేవారు! ఎందు కంటే ఎంతో అవసరమైన రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలును కూడా ముందుకు సాగనీయకుండా అడ్డుపడడం మామూలు విషయం కాదు. ఇది రక్షణ శాఖ ఉన్నతాధికారుల నైజం. ఒక్క రాఫెల్తో ఆరు సుఖోయీ విమానాలా! ఈ సందర్భంగా ఈ రక్షణశాఖ అధికారి తెలివితేట లను ప్రశ్నించే సాహసం చేస్తున్నాను. 36 రాఫెల్ విమానాల కొనుగోలుకు ఫ్రెంచ్ కంపెనీ డాసోకు చెల్లించే సొమ్ముతో హెచ్ఏఎల్ నుంచి మరెన్నో సుఖోయి యుద్ధవిమానాలు కొనవచ్చని సూచిస్తూ ఆయన ఇచ్చిన నివేదిక నన్నెంతో ఆకట్టుకుంటోంది. తక్కువ ధరకు లభించేపక్షంలో హెచ్ఏఎల్ నిర్మించే సుఖోయి విమానాలు మనకు సరిపోతే మనం విదే శాల నుంచి ఎందుకు యుద్ధవిమానాలు కొనుగోలు చేయాలి? ‘‘ఒక రాఫెల్ విమానానికి చెల్లించే ధరతో హెచ్ఏఎల్ నుంచి ఆరు మిగ్–21 విమానాలు ఎందుకు కొనకూడదు?’’ అని ఫెర్నాండెజ్ ఈ అధికా రిని ప్రశ్నించేవారే! అంతేకాదు, మిగ్ విమానాలపై శిక్షణ ఇచ్చే కేంద్రానికి ఆయనను బదిలీచేసేవారు. అంతటితో ఆగకుండా, రోజూ ఉదయం మిగ్ విమా నంలో పైలట్ వెనుక (బెల్టుతో కటి)్ట ఈ అధికారిని కూర్చుని విహరించాలని కూడా ఆదేశించేవారు! ఒక రాఫెల్ ధరకు మరెన్నో సుఖోయి విమానాలొస్తా యని భావించే ఉన్నతాధికారి(సివిల్ సర్వెంట్) ఎవ రైనా ఆయనకు ఇలాంటి ‘శిక్షణ’ అవసరం. సైనిక సంబంధ విషయాలపై నైపుణ్యంలేని ఇలాంటి సివిల్ సర్వెంట్లపై సైనికాధికారులకు అపనమ్మకం ఎక్కువ. ఆయుధాల కొనుగోలుకు సంబంధించిన ఏ కుంభ కోణంలోనూ ఎవరికీ ఏ కోర్టులో శిక్షలు పడినట్టు నేను వినలేదు. బోఫోర్స్ శతఘ్నుల కుంభకోణం చూసిన ఆ తరం ప్రముఖులు నేనీ మాటలు అన్నం దుకు నన్ను నిందిస్తారని తెలుసు. అయితే, ఆయు ధాల లావాదేవీల్లో చేతులు మారిన ముడుపుల సొమ్ము ఏదీ ఇండియాకు రాలేదనేది వాస్తవం. బోఫోర్స్ కుంభకోణం నాటి రాజీవ్గాంధీ తర్వాత అధికారంలోకి వచ్చిన వీపీ సింగ్, వాజ్పేయీ ప్రభు త్వాలు సైతం శతఘ్నుల కొనుగోలు వ్యవహారంలో దళారులుండరని హామీ ఇచ్చిన స్వీడన్ సర్కారును సైతం మాట నిలబెట్టుకోవాలని ఒత్తిడి చేయలేక పోయారు. అంటే, బోఫోర్స్లో కుంభకోణం ఏదీ లేదనుకోకూడదు. ఈ కుంభకోణానికి ముగింపు పల కకుండా దాన్ని ఎన్నికల్లో వాడుకుని ఓట్లు సంపాదిం చుకోవాలనే ఆలోచనే దాన్ని ఇంకా బతికిస్తోంది. ఈ కుంభకోణంలో ముడుపులు తీసుకున్నవారి నుంచి సొమ్ము రాబట్టి, కొందరు దోషులను జైలుకు పంపా లనే ఆసక్తి ఎవరికీ లేదు. బోఫోర్స్ దెబ్బతో నిలిచిపోయిన కొనుగోళ్లు! బోఫోర్స్ కుంభకోణం ఫలితంగా రష్యా మినహా ఇతర దేశాల నుంచి మన ఆయుధాల కొనుగోళ్లు దాదాపుగా నిలిచిపోయాయి. 1982లో ఇందిరా గాంధీ మిరాజ్–2000 విమానాల కొనుగోలుకు ఆదేశాలు జారీచేశాక, మళ్లీ ఇన్నేళ్లకు రష్యా మినహా ఇతర దేశాల నుంచి కొంటున్న తొలి యుద్ధవిమానం రాఫెల్ మాత్రమే. కొత్త ఆయుధాల కొనుగోలుకు ఏమాత్రం చొరవ చూపకుండా అడ్డుకట్ట వేసే రక్షణ శాఖ ‘సంప్రదాయాని’కి రాఫెల్ ఒప్పందం కూడా బలి అయితే ఇది నిజంగా విషాదమే అవుతుంది. 20 ఏళ్ల తర్జనభర్జన తర్వాత అత్యంత అవసరమైన ఆధు నిక యుద్ధవిమానం(రాఫెల్) కొనుగోలుకు నిర్ణయం తీసుకోగానే కొన్ని వదంతులు వ్యాపించాయి. ఈ వివాదం కారణంగా నేతలు ఒకరినొకరు ‘నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ’ అని దూషించుకుంటు న్నారు. ఈ ఒప్పందం వ్యవహారంలో దోషులుగా ఎవరూ పట్టుపడలేదు. ఏమీ జరగనే లేదు. కాని అంతులేని గోల. ఫలితంగా, రాఫెల్ విమానాల కొనుగోలుకు మొదటి ఆర్డరు తర్వాత మళ్లీ ఇవి కావాలని ఏ ప్రభుత్వం కూడా ఫ్రెంచి కంపెనీని అడిగే ధైర్యం చేయకపోవచ్చు. దీంతో మన రక్షణ బలగాలు అవసరమైన యుద్దవిమానాలు లేక ఇబ్బం దులు పడకతప్పదు. ఈ గొడవ కారణంగా రాఫెల్ విమానాల కొనుగోలు కూడా ముందుకు సాగదు. తగినన్ని ఆధునిక ఆయుధాలు, యుద్ధవిమానాలు లేక వైమానిక దళం అల్లాడిపోక తప్పదేమో! రాఫెల్ వివాదం ఫలితంగా లోక్సభ ఎన్నికల సమయంలో దేశంలో ప్రభుత్వరంగ సంస్థ హిందూస్తాన్ ఏరోనా టిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్)కు ఎనలేని ప్రచారం, గౌరవం దక్కడం అత్యంత ఆసక్తికరమైన అంశం. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్–ఆడాగ్ సంస్థతో పోల్చితే నేడు హెచ్ఏఎల్ గొప్ప కంపెనీగా కనిపిస్తుందని నేను అంగీకరిస్తాను. కాని, ఈ అత్యంత భారీ భారత సర్కారీ ఆయుధాల కంపెనీ ఏం చేస్తోందో చూద్దాం. ప్రపంచంలోనే నాలుగో అతి పెద్ద సైనిక దళం ఇండియాకుంది. 75 శాతం వైమానికి దళం, నూరు శాతం ఆర్మీ, 66 శాతం నౌకాదళం, నూరు శాతం కోస్ట్ గార్డ్ దళాల వైమానికి సంబంధ అవసరాలను హెచ్ఏఎల్ తీరుస్తోంది. వాటికి అవసరమైనవాటిని తయారుచేసి సరఫరా చేస్తోంది. అయితే, వ్యాపారం విలువ ఎంతో చూద్దాం. దీని టర్నోవర్ రూ. 18,000 కోట్లు. అంటే దేశంలో అతి పెద్ద లారీ తయారీ కంపెనీల్లో ఒకటైన అశోక్ లేలాండ్ టర్నోవర్లో సగమే. ఇండిగో ఎయిర్ లైన్స్, హిందూజాల యాజమాన్యంలోని చిన్న బ్యాంకు ఇండస్ఇండ్ టర్నోవర్ల కన్నా తక్కువే. బడా కంపెనీలకు స్థానం లభించే ఫార్చ్యూన్ 500 ఇండియా జాబితాలో హెచ్ఏఎల్ పేరు ఎక్కడో వెనుక ఉంటుంది. తన రంగంలో పూర్తి గుత్తాధి పత్యంతోపాటు తన దగ్గర మాత్రమే ఉత్పత్తులను తప్పక కొనుగోలు చేసే ఖాతాదారులన్న ఈ ప్రభుత్వ రంగం పనితీరు ఇంత గొప్పగా ఉంది. దీని వార్షిక ఎగుమతులు రూ. 300 కోట్లు దాటవు. మీర్జాపూర్, పానిపట్లోని కొందరు చేనేతదారులు అంతకన్నా ఎక్కువ మొత్తంలో ఎగుమతులు చేస్తున్నారు. ఇప్ప టికి హెచ్ఏఎల్ నాలుగు వేలకు పైగా విమానాలు తయారుచేసింది. అవన్నీ కూడా ఇతర దేశాల నుంచి లైసెన్స్తో విదేశీ కంపెనీల విమానాలను చూసి తయారుచేసినవే. ఇంకా ఇండియా పూర్తిగా దేశంలో నిర్మించే హెచ్ఫ్–24 మారుత్ విమానాలు దాదాపు 150 వరకూ హెచ్ఏఎల్ నిర్మించింది. అయితే, ఈ విమానం విఫలమైంది. ఈ కంపెనీ అతి సునాయా సమైన పద్ధతిలో పనిచేస్తోంది. ప్రభుత్వ ఓ విదేశీ యుద్ధవిమానాన్ని కొనుగోలు చేస్తుంది. ఆ విదేశీ కంపెనీతో కలిసి దీన్ని దేశంలో తయారు చేయడానికి ఒప్పందం చేసుకుని ఆ పని హెచ్ఏఎల్కు అప్పగి స్తుంది. ఈ ప్రభుత్వ కంపెనీ ఇన్నేళ్లుగా ఇలాగే నెట్టుకొస్తోంది. మన రక్షణ కొనుగోళ్లలో కచ్చితంగా భారీ కుంభ కోణం చోటు చేసుకున్నట్లే మరి. మనం దేన్నీ కొన లేని అసమర్థులం. దీనికి బలయ్యేది మాత్రం మన సాయుధ బలగాలే. ప్రపంచవ్యాప్తంగా ప్రైవేట్ రంగ ఉత్పత్తిదారులు రక్షణ రంగంలో బలంగా పాదం మోపుతున్నప్పటికీ భారత్ మాత్రం వ్యతిరేకత తెలు పుతూ సొంత యుద్ధవిమానం తయారీ విషయంలో వెనుకంజ వేస్తోంది. భారత్లో ఆయుధాల తయారీకి మనం ప్రైవేట్ రంగాన్ని అనుమతించం. అదే సమ యంలో ప్రపంచ ప్రైవేట్ రంగం నుంచి అవే ఆయు ధాలను కొనడానికి వెంపర్లాడతాం. యూపీఏ హయాంలో నాటి రక్షణమంత్రి ఏకే ఆంటోనీ ఆయుధాల కొనుగోళ్లకు ప్రయత్నించడానికే భయపడిపోయారు. ప్రపంచంలోని ప్రతి ప్రధాన ఆయుధ ఉత్పత్తిదారుల సంస్థలనూ నిషేధించడం లోనే ఆయన కాలం గడిపేశారు. మోదీ ప్రభుత్వం ప్రైవేట్ రంగాన్ని ముందుకు తీసుకురావడానికి సిగ్గుపడలేదు. కానీ రిలయన్స్–అడాగ్స్తో ఇన్నింగ్స్ మొదలెట్టమని దానికి ఎవరు చెప్పినట్లు? పారదర్శ కత, సత్యం అనేవి ఉత్తమ ఆత్మరక్షణ పద్ధతులు కాగా అహంకారం, లెక్కలేనితనంలో ప్రభుత్వం ఎందుకు మునిగి తేలుతున్నట్లు? శేఖర్ గుప్తా వ్యాసకర్త ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ -
రాఫెల్ డీల్ : ఎంపీ తారీఖ్ అన్వర్ రాజీనామా
-
రాఫెల్ డీల్ వ్యాఖ్యలు: సీనియర్ ఎంపీ రాజీనామా
పట్నా : లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బిహార్లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. రాష్ట్రంలో ఆ పార్టీకి ఉన్న ఏకైక ఎంపీ తారీఖ్ అన్వర్ లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. అదేవిధంగా పార్టీలోని అన్ని పదవుల నుంచి వైదొలగుతున్నట్లు పేర్కొన్నారు. రాఫెల్ ఒప్పందం విషయంలో తమ పార్టీ అధినేత శరద్ పవార్ వైఖరి నచ్చకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. రాఫెల్ ఒప్పందం గురించి ప్రధాని నరేంద్ర మోదీపై ప్రజలకు ఎటువంటి అనుమానాలు లేవంటూ శరద్ పవార్ వ్యాఖ్యానించడం తనను తీవ్రంగా బాధించిందన్నారు. స్పష్టంగా అర్థమవుతోంది కదా! ‘రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం కేవలం వ్యక్తిగత ప్రయోజనాల కోసమే జరగినట్లు స్పష్టంగా కన్పిస్తోంది కదా. ఇది దేశ భద్రతకు సంబంధించిన అంశం. ఈ ఒప్పందం విషయంలో ప్రజలకు, ప్రతిపక్షాలకు ఒక స్పష్టమైన అవగాహన వచ్చింది. కానీ శరద్ పవార్ మాత్రమే మోదీకి అనుకూలంగా మాట్లాడటం విడ్డూరంగా ఉంది. అందుకే పార్టీని వీడాలని నిర్ణయించుకున్నాను’ అని అన్వర్ వ్యాఖ్యానించారు. తదుపరి ఏ పార్టీలో చేరాలన్న విషయంపై తన అనునాయులతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటానన్నారు. దీంతో రాఫెల్ ఒప్పందం విషయంలో ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపై నిలబడి ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న తరుణంలో.. మోదీకి అనుకూలంగా మాట్లాడిన ఎన్సీపీ అధినేత శరద్ పవార్ భారీ మూల్యమే చెల్లించుకున్నట్లయింది. ఎన్సీపీ వ్యవస్థాపక సభ్యుడిగా విదేశీ మహిళ(సోనియా గాంధీ)ను పార్టీ అధ్యక్షురాలిగా ఎన్నుకోవడాన్ని నిరసిస్తూ.. కాంగ్రెస్ పార్టీని వీడి శరద్ పవార్ ఎన్సీపీని స్థాపించిన సమయంలో అన్వర్ ఆయనకు అండగా నిలిచారు. వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరిగా పార్టీలో కీలక పాత్ర పోషించారు. తొమ్మిది పర్యాయాలు(లోక్సభ- ఐదుసార్లు, రాజ్యసభ- రెండుసార్లు) ఎంపీగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం కతియార్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న అన్వర్ రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. శరద్ పవార్తో విభేదించిన నేపథ్యంలో.. అన్వర్ తిరిగి సొంత గూటికి(కాంగ్రెస్) చేరే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
రాఫెల్ డీల్పై శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: రాఫెల్ యుద్ద విమానాల కొనుగోలు ఒప్పందంపై ప్రతిపక్షాలన్నీ బీజేపీపై ఎదురుదాడికి దిగితే.. ఎన్సీపీ అధినేత శరద పవార్ మాత్రం అందుకు భిన్నంగా స్పందించారు. ఈ ఒప్పందం విషయంలో ప్రధాని నరేంద్ర మోదీపై ప్రజలకు ఎలాంటి అనుమానాలు లేవని కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో రక్షణశాఖ మంత్రిగా పనిచేసిన పవార్ ఓ మరాఠి న్యూస్ చానల్తో మాట్లాడుతూ.. యుద్ధ విమానాలకు సంబంధించిన సాంకేతిక వివరాలను వెల్లడించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయడం అంతగా ప్రభావం చూపడం లేదన్నారు. ఏది ఏమైనా యుద్ధ విమానాల ధరలు బహిర్గతం చేయడం వల్ల ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది కలగబోదని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలో రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వ్యవహరించిన తీరు మాత్రం ప్రజలను గందరగోళానికి గురిచేసేలా ఉందని తెలిపారు. అందుకే కేంద్రం ప్రస్తుతం ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రభుత్వం తరఫున స్పందించే అవకాశం ఉందన్నారు. మరోవైపు ఈ ఒప్పందం ద్వారా మోదీ నేతృత్వంలోని బీజేపీ భారీగా అక్రమాలకు పాల్పడుతోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్న నేపథ్యంలో పవార్ మోదీని సమర్థించేలా వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కు కాకుండా.. ఇతర సంస్థలను(తమకు అనుకూలమైన) ఈ ఒప్పందంలో భాగస్వాములుగా చేర్చడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థపై పెను భారం పడటమే కాకుండా.. దేశ భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. -
నేనప్పుడు పదవిలోకి రాలేదు
ఐక్యరాజ్య సమితి: భారత్–ఫ్రాన్స్ దేశాల మధ్య రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పందం కుదిరే సమయానికి తాను పదవిలోకి రాలేదని ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రన్ అన్నారు. రాఫెల్ ఒప్పందం రెండు ప్రభుత్వాల మధ్య కుదిరిందని, ఇది కేవలం వాణిజ్య సంబంధమే కాదని, వ్యూహాత్మకమైనది అని అన్నారు. ‘ఒప్పందంపై సంతకాలు జరిగినప్పుడు నేను అధికారంలో లేను. ప్రధాని మోదీ కొన్ని రోజుల క్రితం ఏం చెప్పారో నేనూ అదే చెప్పాలనుకునుకుంటున్నా’ అని మాక్రన్ అస్పష్ట సమాధానం ఇచ్చారు. ప్రతిదానిలో లాగుతున్నారు: వాద్రా నాలుగేళ్లుగా బీజేపీ నిరాధార ఆరోపణలతో తనపై రాజకీయ కక్షసాధింపునకు పాల్పడుతోందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బావ రాబర్ట్ వాద్రా ఆరోపించారు. రూపాయి పతనం, ఇంధన ధరల పెరుగుదల, రాఫెల్ వివాదం..ఇలా ఎప్పుడు ఇరకాటంలో పడినా ప్రతిసారి అధికార పార్టీ తన పేరును తెరపైకి తెస్తోందని మండిపడ్డారు. -
బురద జల్లడమే వారి పని
భోపాల్: ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా పెట్టుకుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విపక్ష కాంగ్రెస్ను విమర్శించారు. అభివృద్ధిపై చర్చించడం కన్నా వారికి బురద జల్లడమే తేలికైన పని అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. అయితే, ఎంత బురదజల్లితే కమలం అంత వికసిస్తుందని, ఇన్నాళ్లూ అదే జరిగిందని వ్యాఖ్యానించారు. రాఫెల్ ఒప్పందంపై కాంగ్రెస్ ఆరోపణల జోరు పెంచిన నేపథ్యంలో పరోక్షంగా ప్రధాని తొలిసారి స్పందించడం గమనార్హం. జెట్ గేట్(రాఫెల్ డీల్) కుంభకోణాన్ని సరిగ్గా ప్రచారం చేస్తే భారత్ తదుపరి ప్రధాని రాహుల్ గాంధీనే అంటూ పాకిస్తాన్ మాజీ హోంమంత్రి రెహ్మాన్ మాలిక్ చేసిన వ్యాఖ్యలను పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ఇప్పుడు విదేశాల నుంచి మద్దతు కోసం చూస్తోందని కాంగ్రెస్ను ఎద్దేవా చేశారు. ‘మన తదుపరి ప్రధాని ఎవరనేది వేరే దేశాలు నిర్ణయిస్తాయా?’ అని వ్యాఖ్యానించారు. ‘కాంగ్రెస్ పరిస్థితి ఎంత దిగజారిందంటే.. ఇప్పుడా పార్టీని సూక్ష్మదర్శినిలో మాత్రమే చూడగలం’ అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. 125 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన పార్టీ ఇప్పుడు చిన్నాచితక పార్టీలతో పొత్తుల కోసం వెంపర్లాడే పరిస్థితి వచ్చిందన్నారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో మంగళవారం నిర్వహించిన ర్యాలీలో మోదీ మాట్లాడారు. కార్యక్రమంలో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్సింగ్ చౌహాన్ పాల్గొన్నారు. ఎంత బురద జల్లితే.. అంత వికసించాం ‘అధికారం కోల్పోయాక కాంగ్రెస్లో సమతౌల్యం లోపించింది. అందుకే ప్రభుత్వంపై బురదజల్లుతోంది. కానీ నేను వాళ్లకు ఒక్కటే చెప్పదలచుకున్నా. మీరు ఎంతగా బురద జల్లితే కమలం(బీజేపీ గుర్తు) అంతగా వికసించింది. అభివృద్ధిపై చర్చకు రావాలని ఆహ్వానించినా వారు రాలేదు. ఎందుకంటే బురద జల్లటమే సులభమని భావిస్తున్నారు. 2001లో నేను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి మీ శక్తినంతా కూడదీసుకుని తిడుతూనే ఉన్నారు. ఇక తిట్టడానికి డిక్షనరీలో కూడా పదాల్లేవు’ అని అన్నారు. స్వదేశంలో విపక్షాల కూట మి ఏర్పాటులో విఫలమైన కాంగ్రెస్ విదేశాల మద్దతు కోసం చూస్తోందన్నారు. ‘దురహంకారంతో బలహీనపడి దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్న 125 ఏళ్ల పార్టీలో ఇప్పుడే మీ మిగల్లేదు. సూక్ష్మదర్శినితోనే కాంగ్రెస్ను చూడగలం’ అని ఎద్దేవా చేశారు. రెండు దశాబ్దాలుగా తనని అప్రతిష్టపాలు చేయడానికి కాంగ్రెస్ పన్నిన కుయుక్తులు ఫలించలేదన్నారు. చెదపురుగుల్లా ఓటుబ్యాంకు రాజకీయాలు దేశానికి కాంగ్రెస్ భారంగా మారిందని, ఆ పార్టీ నుంచి భారత్ను కాపాడే బాధ్యత బీజేపీ కార్యకర్తలపై ఉందని అన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలు సమాజాన్ని చెదపురుగుల్లా నాశనం చేస్తున్నాయని, ఆ పీడ నుంచి దేశాన్ని కాపాడుకోవడం మ నందరి బాధ్యత అని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమానికి పాటుపడకుండా, వారి కుర్చీ ని కాపాడుకోవడానికి కొందరు సమాజాన్ని విభజించారన్నారు. ట్రిపుల్ తలాక్ అంశాన్ని ప్రస్తావిస్తూ..మహిళా(సోనియా గాంధీని ఉద్దేశించి) నేతృత్వంలోని పార్టీయే ముస్లిం మహిళల బాగోగులపై శ్రద్ధచూపడంలేదని, ఈ వైఖరి ఓటుబ్యాం కు రాజకీయాల వికృతరూపమన్నారు. -
ముందు ముందు మరిన్ని నిజాలు
న్యూఢిల్లీ: రాఫెల్ ఒప్పందంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపణల తీవ్రత పెంచారు. రాఫెల్ ఒప్పందంతోపాటు విజయ్మాల్యా తదితరులకు సంబంధించిన మరికొన్ని నిజాలు త్వరలోనే వెలుగులోకి వస్తాయని అన్నారు. సొంత నియోజకవర్గం అమేథీలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అమేథీలో కూడా హెచ్ఏఎల్ ప్లాంట్ ఉంది. ‘ప్రభుత్వ రంగ సంస్థకు దక్కాల్సిన రాఫెల్ కాంట్రాక్టును అంబానీకి కట్టబెట్టడం వల్ల హెచ్ఏఎల్, యువత అవకాశాలను లాగేసుకున్నారనే విషయాన్ని గ్రహించాలి. నిజాన్ని మీకు చెబుతున్నా. ఏది న్యాయమో మీరే నిర్ణయించండి’ అని అన్నారు. తన సన్నిహిత మిత్రుల జేబులు నింపేందుకే ప్రధాని మోదీ రాఫెల్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారని ఆరోపించారు. లోక్పాల్ అంబుడ్స్మెన్ నియామకంలో జాప్యానికి రాఫెల్ వివాదంపై ప్రధాని మోదీ మౌనమే కారణమని రాహుల్ ఆరోపించారు. ప్రజలకు హామీ ఇచ్చిన విధంగా అచ్చే దిన్(మంచి రోజు)ను ఎప్పటికీ తేలేకపోయినా కనీసం సచ్చే దిన్(నిజమైన రోజు) వచ్చేలా ఈ ఒప్పందంలో నిజాలను వెల్లడించాలని మోదీని డిమాండ్ చేశారు. దోపిడీ దారులను చట్టం ముందు నిలబెడతానంటూ ట్విటర్లో వివిధ వర్గాల ప్రజలకు హామీ ఇచ్చారు. ‘సైనిక జవాన్లు, ఎయిర్ ఫోర్స్ అధికారులు, అమరవీరుల కుటుంబాలతోపాటు హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) సిబ్బంది ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసు. వారిని దోచుకుని, అవమాన పరిచిన వారిని దోషులుగా నిలబెడతా’ అని ట్విటర్లో పేర్కొన్నారు. ‘కాపలాదారుగా ఉంటానని చెప్పి అంబానీ జేబును రూ.30వేల కోట్లతో నింపారు. మీరు దేశానికా లేక అంబానీకి ప్రధానా? ఇప్పటివరకు ఆలీబాబా 40 నలబై దొంగల కథ విన్నాం. మోదీ బాబా, 40 దొంగలు ఏం సమాధానం చెబుతారని ఇప్పుడు అడుగుతున్నాం’ అని కాంగ్రెస్ నేత రణ్దీప్ సూర్జేవాలా అన్నారు. దేశంలో ఎన్నడూ జరగనంతటి పెద్ద కుంభకోణం ఇది అని మరో నేత కపిల్ సిబల్ అన్నారు. హెచ్ఏల్ను పక్కనబెట్టడం వల్ల ఏమిటి ప్రయోజనం? దాని నుంచి ఎవరు లబ్ధి పొందారు?. తను ఇష్టం వచ్చినట్లుగా చేయడానికే ప్రజలు అధికారం ఇచ్చినట్లు మోదీ అనుకుంటున్నట్లుంది. అది ఆమోదయోగ్యం కాదు’ అని సిబల్ అన్నారు. -
అంబానీ జేబులోకి పేదల సొమ్ము
న్యూఢిల్లీ: రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందం విషయంలో ప్రధాని మోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. పేదల డబ్బు దోచుకుని పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీకి ధారపోస్తున్నారని ఘాటు విమర్శలు చేశారు. ‘దేశానికి కాపలా దారుగా (చౌకీదార్) ఉన్న వ్యక్తి పేద ప్రజలు, అమరవీరులు, జవాన్ల జేబుల్లో నుంచి రూ. 20 వేల కోట్లు తీసుకుని.. వాటిని అంబానీ జేబులో పెట్టారు. ప్రధాని అవ్వగానే ‘చౌకీదార్జీ’ నేరుగా ఫ్రాన్స్ వెళ్లి ఆ దేశాధ్య క్షుడితో ఒప్పందం చేసుకున్నారు. హెచ్ఏఎల్ను కాదని అనిల్ అంబానీకి కాంట్రాక్టు ఇవ్వమని కోరారు’ అని ఆరోపించారు. అమేథీ నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఆయన సోమవారం మాట్లాడుతూ.. రాఫెల్ ఒప్పందం విలువను ఎందుకు బయటపెట్టడం లేదని, అంబానీకి కాంట్రాక్టు ఎలా దక్కిందో మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కుట్రలో పాకిస్తాన్ పాత్ర: బీజేపీ రాఫెల్ ఒప్పందం రద్దుకు జరుగుతున్న అంతర్జాతీయ కుట్రలో రాహుల్ గాంధీ పాత్ర ఉందని, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకొయిస్ హోలండ్ అందులో భాగమని బీజేపీ ఆరోపించింది. బావ రాబర్ట్ వాద్రాకు సంబంధమున్న కంపెనీకి సాయం చేసేందుకు ఒప్పందం రద్దును రాహుల్ కోరుకుంటున్నారని బీజేపీ నేత, కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ అన్నారు. వాద్రాకు సంబంధమున్న కంపెనీని రాఫెల్ ఒప్పందంలో మధ్యవర్తిగా తీసుకోకపోవడంతో అప్పట్లో యూపీఏ ప్రభుత్వం ఒప్పందాన్ని రద్దుచేసుకుందన్నారు. ఈ కుట్రలో పాకిస్తాన్ పాత్ర ఉందని కూడా షెకావత్ చెప్పారు. తదుపరి భారత ప్రధాని రాహుల్ అంటూ పాకిస్తాన్ మాజీ మంత్రి రెహమాన్ మాలిక్ ట్వీట్ చేయడమే అందుకు నిదర్శనమన్నారు. తనపై ఆరోపణల్ని వాద్రా తోసిపుచ్చారు. నిజాలు నిగ్గుతేల్చండి: రాఫెల్ ఒప్పందంలో అవినీతి ఆరోపణలపై కేసు నమోదు చేసి నిజానిజాలు నిగ్గుతేల్చాలని కేంద్ర విజిలెన్స్ కమిషనర్(సీవీసీ)కు కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది. ఆ మేరకు కాంగ్రెస్ ప్రతినిధుల బృందం సీవీసీ కేవీ చౌదరీకి పూర్తి వివరాలతో మెమొరాండం సమర్పించింది. ఖజానాకు ప్రభుత్వం నష్టం చేకూర్చిందని, కొందరు వ్యాపారవేత్తలకు లాభం చేకూర్చేందుకు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్)ను పక్కనపెట్టి దేశ భద్రతను కేంద్రం ప్రమాదంలో పడేసిందని కాంగ్రెస్ బృందం అందులో ఆరోపించింది. ‘రాఫెల్ ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద రక్షణ రంగ కుంభకోణం. రోజుకొక అంశం వెలుగులోకి వస్తూ అవినీతి జాడలు బయటపడుతున్నా.. రక్షణ శాఖ నుంచి ఎలాంటి సమాధానం లేదు. రాఫెల్ ఒప్పందంలోని అవినీతి, ఆశ్రిత పక్షపాత దుర్గంధం రోత పుట్టిస్తోంది. ఇందులో మీరు అత్యవసరంగా జోక్యం చేసుకోవాలి’ అని కాంగ్రెస్ కోరింది. -
ఆయన స్నేహంతోనే.. మోదీపై విమర్శలు?
సాక్షి, విజయవాడ: ప్రతిపక్ష పార్టీలన్నీ ప్రధాని నరేంద్ర మోదీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో స్నేహం చేయడం వలన మోదీపై గాలి విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. 2007లో యూపీఏ హయాంలోనే రాఫెల్ యుద్ద విమానాల కోసం టెండర్లు పిలిచారని గుర్తుచేశారు. విమానాల కొనుగోలుకు మోదీకి ఎటువంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు. లోకల్ అసిస్టెన్సీ కోసమే రిలయన్స్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒక జరగిన కుంభకోణాన్ని జరిగినట్లు చిత్రీకరణ చేస్తున్నారని మండిపడ్డారు. ధర విషయంలో అనుమానాలుంటే కాగ్తో విచారణ జరిపించుకోవాలని ఆరుణ్ జైట్లీ విసిరిన సవాల్ను స్వీకరించాలన్నారు. ఒక ఏజెన్సీ పిలిస్తే చంద్రబాబు అమెరికా పర్యటన వెళ్లారని.. అంతేకానీ ఐక్యరాజ్యసమితి సమావేశానికి వెళుతున్నట్లు నాటకాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు మళ్లీ వ్యవస్యాయం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. నదుల్లో చెరువుల్లో మట్టిని, ఇసుకను తవ్విన చంద్రబాబు పర్యావరణ గురించి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. అరకు ఎమ్మెల్యే కిదారి సర్వేశ్వరావు, సోమను మావోయిస్టులు చంపాడాన్ని బీజీపీ తరుపున ఖండిస్తున్నామన్నారు. రాష్ట్రంలో పోలీసు, ఇంటెలిజెన్సు వ్యవస్థ విఫలమైందన్నారు. తెలంగాణలో ఎన్నికల సర్వేల కోసం, సొంత ప్రయోజనాల కోసం టీడీపీ వాడుకోంటోందని విమర్శించారు. -
‘రాఫెల్’ ఒప్పందం రద్దు ప్రశ్నేలేదు
న్యూఢిల్లీ/పారిస్: రాఫెల్ ఒప్పందంపై అధికార, ప్రతిపక్షం మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం కొనసాగుతోంది. తాజాగా, ‘రాఫెల్’ ఒప్పందం రద్దు ప్రసక్తే లేదని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. రాఫెల్ యుద్ధ విమానాలు తయారు చేసే డసో ఏవియేషన్, రిలయన్స్ డిఫెన్స్ లిమిటెడ్ (ఆర్డీఎల్) ఒప్పందం విషయంలో భారత, ఫ్రెంచి ప్రభుత్వాలకు ఎటువంటి ప్రమేయం లేదని పేర్కొన్నారు. కాగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ స్పందిస్తూ.. ప్రధాని, జైట్లీ అబద్ధాలు మాని, నిజానిజాలు తేల్చేందుకు జేపీసీని నియమించాలని డిమాండ్ చేశారు. ఓ టీవీ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాఫెల్ ఒప్పందంపై అరుణ్జైట్లీ మాట్లాడుతూ..ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలండ్ చేసిన పొంతనలేని ప్రకటనలే అనుమానాలకు తెరలేపాయన్నారు. ‘రిలయన్స్తో ఒప్పందం చేసుకోవాలని డసోను భారత ప్రభుత్వమే కోరిందని రెండ్రోజుల క్రితం హోలండ్ ప్రకటించారు. ఇప్పుడు భారత ప్రభుత్వం లాబీ చేసిందో లేదో తనకు తెలియదంటూ ఆయన మాటమార్చారు. హోలండ్ ప్రకటనలకు, రాహుల్ విమర్శలకు సంబంధం ఉంది. రాఫెల్ ఒప్పందంపై ఫ్రాన్స్లో బాంబులు పేలనున్నాయంటూ ఆగస్టు 30నే రాహుల్ ట్వీట్ చేశారు. వారి అనుబంధం విషయంలో నా వద్ద ఆధారాలు లేనప్పటికీ, ఏదో లంకె ఉందనే అనుమానం మాత్రం ఉంది. హోలండ్ ముందుగా ఒక ప్రకటన, దానికి విరుద్ధమైన మరో ప్రకటన చేశారు. ఈ విషయం రాహుల్కు 20 రోజులకు ముందుగానే ఎలా తెలిసింది?’ అని జైట్లీ ప్రశ్నించారు. 2019 ఎన్నికల నేపథ్యంలో రాఫెల్ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటారా అని ప్రశ్నించగా..‘ఒప్పందం నుంచి వైదొలిగే ప్రశ్నేలేదు’ అని స్పష్టం చేశారు. హోలండ్ మొదటి ప్రకటనను ఫ్రెంచి ప్రభుత్వం, డసో ఏవియేషన్ సంస్థ ఇప్పటికే ఖండించాయని జైట్లీ తెలిపారు. కాగా డసోతో తమ కాంట్రాక్టు విషయంలో ప్రభుత్వ జోక్యం ఏమాత్రం లేదని రిలయన్స్ గ్రూప్ స్పష్టం చేసింది. అసత్యాలు మానండి: రాహుల్ రాఫెల్ ఒప్పందం విషయంలో ప్రధాని మోదీ, జైట్లీ అబద్ధాలు చెప్పడం మానాలని రాహుల్ అన్నారు. ఈ ఒప్పందం విషయంలో నిజాలు నిగ్గు తేల్చేందుకు సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)ని నియమించాలని డిమాండ్ చేశారు. ‘తాను చెప్పిందే నిజమని వాదించగల పటిమ, నిజాలను అబద్ధాలుగా నమ్మించగల సామర్థ్యం జైట్లీ ప్రత్యేకత. ప్రధాని, రక్షణ మంత్రి అబద్ధాలు ఆపాలి’ అని రాహుల్ ట్విట్టర్లో పేర్కొన్నారు. రాఫెల్ వివరాల్ని అనిల్ అంబానీకి వెల్లడించి రాజ్యాంగంపై చేసిన ప్రమాణాన్ని ప్రధాని ఉల్లంఘించారని కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ విమర్శించారు. ఫ్రాన్స్ ఆందోళన రాఫెల్ ఒప్పందంపై హోలండ్ వ్యాఖ్యలు భారత్లో తీవ్ర రాజకీయ దుమారం రేపడంపై ఫ్రాన్స్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇది భారత్తో సంబంధాలపై ప్రభావం చూపుతోందని భావిస్తోంది. ఫ్రాన్సు ఉప విదేశాంగ మంత్రి జీన్–బాప్టిస్ట్ లెమోయెన్ స్పందిస్తూ.. ‘హోలండ్ వ్యాఖ్యలు ఎవరికీ ఉపయోగకరం కాదు..ముఖ్యంగా ఫ్రాన్సుకు విదేశాలతో సంబంధాల విషయంలో ఇబ్బందికరంగా మారుతాయని అనుకుంటున్నా. పదవిలో లేని వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు’ అని అన్నారు. -
‘మోదీని దించేందుకు అంతర్జాతీయ ఒప్పందమా’
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా నిప్పులు చెరిగారు. రాఫెల్ ఒప్పందంపై రాహుల్ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ‘మోదీని దించేద్దాం’ అని రాహుల్ మోదీపై విమర్శలు చేస్తుంటే.. దానికి పాకిస్తాన్ మంత్రి ఫవాద్ హుస్సేన్ మద్దతు పలకడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీని దించేందుకు పాకిస్తాన్తో కలిసి కాంగ్రెస్ అంతర్జాతీయ కూటమి ఏర్పాటు చేస్తుందా? అని చురకలంటించారు. ‘మోదీ హటాటో’ (మోదీని దించేయండి) అంటూ రాహుల్ గాంధీ, ఫవాద్ హుస్సేన్ చేసిన ట్వీట్లను ఉటంకిస్తూ షా ఈ వ్యాఖ్యలు చేశారు. తన ట్వీట్లో పాకిస్తాన్వద్దు, కాంగ్రెస్వద్దు (#NaPakNaCongress) అనే హాష్టాగ్ని షా జతచేశారు. కాగా, మేకిన్ ఇండియాలో భాగంగా రాఫెల్ డీల్లో రిలయన్స్ డిఫెన్స్ లిమిటెడ్కు భాగం చేశారంటూ ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ వెల్లడించిన నేపథ్యంలో దేశ రక్షణశాఖపై మోదీ సర్జికల్ స్ట్రైక్స్ చేశారని రాహుల్ ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. Rahul Gandhi says ‘Modi Hatao’ Pakistan says ‘Modi Hatao’ Now Pakistan also supports Rahul Gandhi’s baseless allegations against PM Modi. Is Congress forming an International Mahagathbandhan against PM Modi?#NaPakNaCongresshttps://t.co/eHBs0DGfBP — Amit Shah (@AmitShah) September 22, 2018 -
ప్రధాని మోదీ సిగ్గుపడాలి: రాహుల్ తీవ్ర విమర్శలు
న్యూఢిల్లీ/పారిస్: రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంపై ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలండ్ చేసిన వ్యాఖ్యలు భారత్లో రాజకీయ దుమారాన్ని రేపాయి. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధాన్ని రాజేశాయి. ఈ భారీ కాంట్రాక్ట్ విషయంలో కావాలనే వివాదాన్ని సృష్టిస్తున్నారని కేంద్ర ప్రభుత్వం మండిపడింది. రాఫెల్ ఒప్పందంలో రిలయన్స్ డిఫెన్స్ లిమిటెడ్ (ఆర్డీఎల్)ను చేర్చే విషయంలో తమ ప్రమేయం లేదని తెలిపింది. రాఫెల్ యుద్ధ విమానాలు తయారుచేసే డసో ఏవియేషన్ (ఫ్రెంచ్ కంపెనీ) కూడా వివాదం అవసరమే లేదని తన భారత భాగస్వామిని ఎన్నుకోవడం తమ సంస్థ తీసుకున్న నిర్ణయమని పేర్కొంది. రాఫెల్, ఆర్డీఎల్ భాగస్వామ్య ఒప్పందంలో తమ ప్రమేయం లేదని ఫ్రెంచ్ ప్రభుత్వం పేర్కొంది. ఈ వివాదంపై కాంగ్రెస్ చీఫ్ రాహుల్.. కేంద్రంపై చేస్తున్న విమర్శల జడి కొనసాగుతోంది. మళ్లీ మళ్లీ అదే చెబుతున్నాం.. రూ.58వేల కోట్ల భారీ ఒప్పందంలో మేకిన్ ఇండియా భాగస్వామిగా భారత ప్రభుత్వం రిలయన్స్ను ప్రతిపాదించిందని హోలండ్ వ్యాఖ్యానించడం వివాదమైంది. ఈ వ్యాఖ్యలను శనివారం విడుదల చేసిన ప్రకటనలో రక్షణ శాఖ ఖండించింది. ‘ఆర్డీఎల్ను స్వదేశీ భాగస్వామిగా ఎంచుకోవడంలో డసో ఏవియేషన్కు భారత ప్రభుత్వం ఎలాంటి ప్రతిపాదన చేయలేదని గతంలోనే చెప్పాం. ఈ ఒప్పందంలో వివాదాలకు తావులేదు. తన ప్రమాణాలకు తగ్గట్లుగా ఆర్డీఎల్ ఉందా? లేదా? అని నిర్ధారించుకున్నాకే డసో ఈ ఒప్పందం కుదుర్చుకుంది. విమానాల తయారీకోసం జాయింట్ వెంచర్కు సిద్ధమైంది. దీంతో ప్రభుత్వానికి సంబంధం లేదు’ అని ప్రకటనలో పేర్కొంది. ‘హోలండ్ ప్రకటన పూర్తిపాఠాన్ని సరిగ్గా చదవాల్సిన అవసరం ఉంది. మాజీ అధ్యక్షుడైన హోలండ్కు సన్నిహితంగా ఉండే వ్యక్తులపై పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశాన్ని లేవనెత్తేందుకు ఫ్రాన్స్ మీడియా చేసి న ప్రయత్నమిది’ అని రక్షణ శాఖ పేర్కొంది. మేమే నిర్ణయించాం: డసో ఆర్డీఎల్ను భాగస్వామిగా తీసుకోవడం పూర్తిగా తమ సంస్థ నిర్ణయమేనని డసో ఏవియేషన్ స్పష్టం చేసింది. ‘2016 రక్షణరంగ సేకరణ నిబంధనలు (డీపీపీ) ప్రకారమే ఆర్డీఎల్తో ఒప్పందం కుదిరింది. భారత ప్రభుత్వ విధానమైన మేకిన్ ఇండియాను అమలుచేసేందుకు స్థానిక కంపెనీతో ఒప్పందంలో భాగంగా రిలయన్స్తో జట్టుకట్టాం. ఇది పూర్తిగా డసో ఏవియేషన్ నిర్ణయమే’ అని ఆ సంస్థ శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. డసో, ఆర్డీఎల్ సంయుక్తంగా నాగ్పూర్లో ఫాల్కన్, రాఫెల్ విమానాల విడిభాగాల తయారీ కేంద్రాన్ని నిర్మిస్తున్నాయని వెల్లడించింది. అయితే డసో, ఆర్డీఎల్ భాగస్వామ్యంలో తమ పాత్ర ఏమీ లేదని ఫ్రెంచ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. తమ ప్రభుత్వ విధానాల ప్రకారం ఫ్రెంచ్ కంపెనీలు విదేశాల్లో తమ భాగస్వాములను ఎంపిక చేసుకోవడంలో పూర్తి స్వేచ్ఛను కల్పించామని పేర్కొంది. భారత ప్రభుత్వంతో పలు రంగాల్లో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పెట్టుబడులు పెట్టామని.. ప్రతిచోటా భారత నిబంధనలకు అనుగుణంగానే అక్కడి కంపెనీల సామర్థ్యాన్ని సమీక్షించాకే ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. నువ్వంటే నువ్వే! రాఫెల్ వివాదంపై రాహుల్ గాంధీ విమర్శల జోరు పెంచారు. మోదీ, అంబానీ సంయుక్తంగా భద్రతా బలగాలపై రూ.1.3లక్షల కోట్ల సర్జికల్ స్ట్రైక్ చేశారని ఆరోపించారు. హోలండ్ ప్రకటనను ఆధారంగా చేసుకుని.. ‘అమరులైన సైనికుల రక్తాన్ని మోదీ అగౌరవ పరిచారు. ప్రధాని సిగ్గుపడాలి, భారతీయతను మోసం చేశారు’ అని రాహుల్ విమర్శించారు. ‘రాఫెల్ ఒప్పందంలో అవినీతి ఉందనేది స్పష్టమైంది. ప్రధాని ఎందుకు మౌనంగా ఉన్నారు. ఆయన అవినీతికి పాల్పడ్డారని మేం మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. హోలండ్ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ బహిరంగ ప్రకటన చేయాలి’ అని ఆయన డిమాండ్ చేశారు. రాహుల్ వ్యాఖ్యలను బీజేపీ తిప్పికొట్టింది. రాహుల్ సరైన సమాచారం లేకుండా అవినీతి వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదమన్నారు. యూపీఏ హయాంలో ముడుపులు ఆశించే చర్చలు జరిపినా.. రాఫెల్ ఒప్పందం కుదుర్చుకోలేదన్నారు. డసో, ఆర్డీఎల్మధ్య 2012లోనే ఒప్పందం కుదిరిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. పాకిస్తాన్, చైనాలు ఆడించినట్లుగా రాహుల్ ఆడుతున్నారని ఘాటుగా విమర్శించారు. ఢిల్లీలో రాఫెల్ వివాదంపై నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ కార్యకర్తను అరెస్టుచేస్తున్న దృశ్యం -
‘ప్రధానిగా కొనసాగే అర్హత లేదు’
సాక్షి, అనంతపురం : సైనికుల ప్రాణాలను పణంగా పెట్టిన నరేంద్ర మోదీకి ఒక్క క్షణం కూడా ప్రధానిగా కొనసాగే అర్హత లేదని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం నీలకంఠపురంలో విలేకరులతో మాట్లాడిన రఘువీరా.. ‘హెచ్ఏఎల్ను కాదని రిలయన్స్ వారికి రాఫెల్ యుద్ధ విమానాల కాంట్రాక్ట్ ఇవ్వమని భారత ప్రధాని చెప్పారని.. ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే చాలా స్పష్టంగా చెప్పారు. దేశ రక్షణను పణంగా పెట్టి 41 వేల కోట్ల రూపాయలు రిలయన్స్కు దోచి పెట్టిన నరేంద్ర మోదీ నిజ స్వరూపం బయటపడిందని’ వ్యాఖ్యానించారు. ఈ కుంభకోణంపై వెంటనే జాయింట్ పార్లమెంట్ కమిటీ వేసి, వెనువెంటనే ప్రధాని రాజీనామా చేయాలని రఘువీరా డిమాండ్ చేశారు. -
రాఫెల్ వివాదం : రాహుల్కు కేంద్రమంత్రి కౌంటర్
సాక్షి, న్యూఢిల్లీ: రాఫెల్ డీల్ తాజా వివాదంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కేంద్ర న్యాయశాఖమంత్రి రవిశంకర్ ప్రసాద్ ఘాటుగా స్పందించారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒక పార్టీ ప్రెసిడెంట్ దేశ ప్రధానమంత్రిపై ఇలాంటి పదాలను ఉపయోగించడం ఇంతకుముందెన్నడూ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు కాంగ్రెస్ కుటుంబ చరిత్ర తప్ప రాహుల్గాంధీకి ఎలాంటి అర్హత లేదని మండిపడ్డారు. రాహుల్ నుంచి ఇంతకంటే మనం ఏమీ ఆశించలేమంటూ ఎద్దేవా చేశారు. ఈ భాగస్వామ్యం డసాల్ట్ ఏవియేషన్కు, రిలయన్స్కు మధ్య జరిగిన డీల్ అని తేల్చి చెప్పారు. అలాగే ఒప్పందానికి సంబంధించి డసాల్ట్, రిలయన్స్ డిఫెన్స్ మధ్య స్పష్టమైన ఎంవోయూ ఉందని చెప్పారు. ఈ సందర్భంగా రాఫెల్ డీల్కు సంబంధించిన వివరాలను మీడియాకు వివరించారు. రాహుల్ గాంధీ టీంకు పెద్ద భయం పట్టుకుందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అవినీతికి పాల్పడ్డారన్న రాహుల్ వ్యాఖ్యలను ఆయన తిప్పికొట్టారు. అసలు కాంగ్రెస్ పార్టీనే అవినీతికి పుట్టిల్లు లాంటిదని మండిపడ్డారు. అనేక స్కాంల కారణంగా పలు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు రాజీనామాలు చేశారని, మాజీ ప్రధాని మన్మోహన్ విచారణను ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. దేశ ఆయుధ వ్యవస్థ గురించి సమాచారాన్ని వెల్లడించడం ద్వారా శత్రువులను అప్రమత్తం చేయాలని ఆయన కోరుకుంటున్నారంటూ దుయ్యబట్టారు. ఈ వివరాలను బహిర్గతం చేయడం ద్వారా పాకిస్తాన్తో చేతులు కలుపుతున్నారంటూ రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు. మరోవైపు రాఫెల్ డీల్ పై వివాదం చెలరేగిన నేపథ్యంలో కేంద్రం స్పందించింది. రిలయన్స్ డిఫెన్స్ కంపెనీని భాగస్వామిగా ఎంపికచేయడంతో ప్రభుత్వ పాత్ర ఏదీ లేదని భారత రక్షణ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. మాజీ ఫ్రాన్స్ అధ్యక్షుడి మాటలపై అనవసర వివాదాలు సృష్టిస్తున్నారని వ్యాఖ్యానించింది. ఇది డసాల్ట్కు రిలయన్స్ డిఫెన్స్కు మధ్య జరిగిన వాణిజ్య ఒప్పందమని రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. -
‘మోదీకి అంబానీ బ్రోకర్’
సాక్షి, న్యూఢిల్లీ: రాఫెల్ యుద్ద విమానాల కోనుగోలు ఒప్పందంలో అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలు తాజాగా నిజమయ్యాయని ఏఐసీసీ అధికార ప్రతినిధి జైపాల్ రెడ్డి శనివారం మీడియాకు వివరించారు. రాఫెల్ స్కామ్ జరిగింది నిజమని.. ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయీస్ హొలాండే వ్యాఖ్యలతో తేలిపోయిందన్నారు. రాఫెల్ డీల్తో నాలుగేళ్లలో అంబానీకి లక్ష కోట్ల లబ్ధి జరుగుతందన్నారు. లక్షల కోట్ల రాఫెల్ డీల్లో ప్రధాని నరేంద్ర మోదీ వెంట ఒక్క మంత్రి లేరని, కానీ అంబానీ మాత్రం ఉన్నారని ఎద్దేవ చేశారు. అప్పటి రక్షణ మంత్రి పారికర్కు కూడా తెలియకుండా, ప్రధానే నేరుగా ఎలా ఒప్పందం చేసుకుంటారని ప్రశ్నించారు. మోదీ ఒత్తిడితోనే అంగీకరించామని ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడి కామెంట్స్పై బీజేపీ ఏం చెబుతుందని ప్రశ్నించారు. రాఫెల్తో మోదీ పతనం ఈ ఒప్పందంపై మంత్రులు అరుణ్ జైట్లీ, నిర్మలా సీతారామన్లు పార్లమెంట్లో అబద్దం చెప్పారని మండిపడ్డారు. జాతికి అబద్దం చెప్పినందుకు వారు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ పతనం ఈ స్కాంతో ప్రారంభమైందన్నారు. దేశానికి సంబంధించిన డీల్ను మరో దేశ ప్రభుత్వం ఖండించడం దేశ చరిత్రలోనే మొదటిసారని పేర్కొన్నారు. నోరు తెరిస్తే బయటపడతాననే ప్రధాని రాఫెల్పై మాట్లాడటం లేదని, ఆయన నాటకం తేలిపోయిందని విమర్శించారు. మోదీకి జైట్లీ లాయల్ లాయర్ నరేంద్ర మోదీ క్రోనీ క్యాపిటలిజంతో కావల్సిన వారికి వేల కోట్లు దోచిపెడుతున్నారని విమర్శించారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ.. మోదీకి లాయల్ లాయరని అంతేకాని దేశానికి కాదన్నారు. ఈ డీల్ పారదర్శికంగా ఉండాలన్నదే కాంగ్రెస్ వాదన అని వివరించారు. ప్రభుత్వ రంగ సంస్థ హెచ్ఈఎల్కు కాకుండా అంబానీకి ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. గతంలో ఏ రక్షణ ఒప్పందంలో కూడా హెచ్ఈఎల్కే నాటి ప్రభుత్వాలు భాగస్వామ్యం కల్పించాయన్నారు. నిజాలు ఆపలేరని, రాఫెల్లో జరిగిన అవినీతిని ప్రజలు గుర్తిస్తున్నారని తెలిపారు. -
మోదీ మౌనం వీడాలి : శివసేన
సాక్షి, ముంబై : దేశ వ్యాప్తంగా రాఫెల్ ఒప్పందం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో మోదీపై వస్తున్న ఆరోపణలకు ఆయన మాత్రమే సమాధానం చెప్పాలంటూ బీజేపీ మిత్రపక్షం శివసేన డిమాండ్ చేసింది. రాఫెల్ ఒప్పందంపై ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలెండ్ శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ శనివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. రాఫెల్ ఒప్పందంపై కేంద్ర ప్రభుత్వం, రక్షణశాఖ మంత్రి కానీ సమాధానం చెప్పరని.. కేవలం ప్రధాని నరేంద్ర మోదీ మాత్రమే సమాధానం చెప్పాల్సిన అవసరమ ఉందని రౌత్ వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలకు కాకపోయిన దేశ ప్రజల కోసమైన ఆయన మౌనం వీడి, ఆరోపణలపై స్పందించాలని ఆయన కోరారు. 25 ఏళ్ల క్రితం జరిగిన బోఫోర్స్ కుంభకోణమే మరోసారి భారత రాజకీయాలను పట్టిపీడిస్తున్నట్లు తనకు అనిపిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా హోలెండ్ ప్రకటనతో రాఫెల్ ఒప్పందంపై దేశ వ్యాప్తంగా రాజకీయ దుమారం చేలరేగుతున్న విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు కురిపిస్తున్నారు. -
రాఫెల్ డీల్ : రగులుతున్న రగడ
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన రాఫెల్ డీల్పై ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయీస్ హొలాండే తాజా వ్యాఖ్యలు ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. ఆయన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలన్న డిమాండ్ ఊపందుకుంది. హోలెండ్ ప్రకటనతో తమ వాదనే నిజమని తేలిందని మోదీ సర్కార్పై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి తన దాడిని ఉధృతం చేశారు. ఈ స్కాంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జవాబు చెప్పాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. అనిల్ అంబానీ కంపెనీ ఎంపిక భారత ప్రభుత్వానిదేనని హోలెండ్ స్పష్టం చేయడంతో భారత ప్రధాని అవినీతిపరుడని తేలిపోయిందంటూ రాహుల్ ధ్వజమెత్తారు. ఈ స్కాం ద్వారా భారీ అవినీతికి పాల్పడి దేశానికి కాపలాదారుడుగా ఉంటానన్న మోదీ దొంగలా (దేశ్ కా చౌకీదార్ చోర్ హై) మారిపోయారని ధ్వజమెత్తారు. ఇంత జరుగుతున్నా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎందుకు మౌనం వీడడం లేదని ప్రశ్నించారు. హోలెండ్ ప్రకటన నిజమని అంగీకరించాలి లేదా ఫ్రెంచ్ మాజీ అధ్యక్షుడి మాటలు అబద్ధమని అయినా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. అనిల్ అంబానీకి మేలు చేయడంకోసమే ప్రధాని మోదీ ఈ కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. దివాలా తీసిన అనిల్ అంబానీకి బిల్లియన్ల డాలర్లను కట్టబెట్టేందుకే మోదీ తెరవెనుక రాఫెల్ డీల్ మార్చారన్నారు. మాజీ రక్షణ మంత్రి మనోహర్ పారికర్ గానీ, ప్రస్తుత మంత్రి నిర్మలా సీతారామన్గానీ ఈ డీల్పై సంతకాలు చేయలేదని స్వయంగా మోదీనే సంతకాలు చేశారని వెల్లడించారు. అలాగే ఈ డీల్ గురించి తనకు తెలియదని పారికర్ చెప్పారంటూ.. మరి ఆయన గోవా ఫిష్ మార్కెట్లో చేపలు కొంటున్నారా అంటూ ఎద్దేవా చేశారు. రాఫెల్ స్కాంపై ప్రధాని మోడీ మౌనం వీడాలని మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ ఒప్పందానికి సంబంధించిన విషయాలు అప్పటి దేశ రక్షణ శాఖ మంత్రి పారికర్కి తెలియదని స్పష్టం చేశారు. ప్రధాని మోదీకి ఈ కుంభకోణంలో అన్న విషయాలు తెలుసని ఆయన ఆరోపించారు. ఒప్పంద సమయంలో కార్యదర్శులు, మంత్రులు ఎవరూ లేరనీ, అనిల్ అంబానీ మాత్రమే ఉన్నారని తెలిపారు. తనకు కావాల్సిన వారికి బెనిఫిట్ చేయటం కూడా అవినీతే అని జైపాల్ రెడ్డి విమర్శించారు. నా ప్రకటనకు కట్టుబడి ఉన్నా: హోలెండ్ రాఫెల్ ఒప్పందం విషయంలో తాను చెప్పిన మాటలకు కట్టుబడి ఉన్నానని ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు హలెండ్ ప్రకటించారు. రాఫెల్ ఒప్పందంలో రిలయన్స్ పేరును భారత ప్రభుత్వమే సూచించిందని, అందువల్లే గత్యంతరం లేక తాము ఆ కంపెనీతో ఒప్పందం చేసుకున్నామని హోలెండ్ స్పష్టం చేయడం గమనార్హం. -
రాఫెల్ వివాదంలో మరో మలుపు
-
రాఫెల్ వివాదంలో ఎన్ని మలుపులో!
సాక్షి, న్యూఢిల్లీ : ఫ్రాన్స్తో నరేంద్ర మోదీ ప్రభుత్వం చేసుకున్న రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంపై గత రెండేళ్లకు పైగా సాగుతున్న వివాదంలో ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయీస్ హొలాండే ఆజ్యం పోశారు. భారత భాగస్వామ్య కంపెనీగా అనిల్ అంబానీకి చెందిన రిలయెన్స్ డిఫెన్స్ను ఎంపిక చేయడంలో తమ ప్రమేయం లేదని, ఆ కంపెనీ పేరును భారత ప్రభుత్వమే సూచించిందని హొలాండ్ శుక్రవారం బాంబు పేల్చిన విషయం తెల్సిందే. యుద్ధ విమానాల ఒప్పందం ప్రకారం భారత్లోని 72 కంపెనీల్లో ఏ కంపెనీనైనా భాగస్వామి కంపెనీగా ఎంపిక చేసుకొనే అవకాశం డసాల్ట్ కంపెనీకి ఉన్నప్పటికీ భారత ప్రభుత్వం సూచించిన రిలయెన్స్ డిఫెన్స్ కంపెనీని ఎంపిక చేసుకోక తప్పలేదని కూడా ఆయన వివరించారు. రిలయెన్స్ కంపెనీ ఎంపికలో తమ ప్రమేయం లేదని, భారత్లో ఏ కంపెనీని ఎంపిక చేసుకోవాలన్నది రాఫెల్ యుద్ధ విమానాలను తయారు చేసే డసాల్ట్ కంపెనీ ఇష్టమని, ఈ మేరకు ఒప్పందంలో కూడా వెసులుబాటుందని భారత ప్రభుత్వ మొదటి నుంచి చెబుతూ వస్తోంది. ఈ విషయంలో మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఆరోపణలను ఖండిస్తూ వస్తోన్న కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ వారం అంటే వారం క్రితమే మళ్లీ ఇదే పాట పాడారు. ‘రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంలో డసాల్ట్ కంపెనీ భారత దేశ భాగస్వామ్య కంపెనీ ఏదో కూడా నాకు తెలియదు. దానికంటూ ఓ ప్రత్యేకమైన నిబంధనావళి ఉంటుంది. సామర్థ్యం కలిగిన కంపెనీల్లో ఏ కంపెనీని ఎంపిక చేసుకోవాలన్నది డసాల్ట్ కంపెనీ ఇష్టం. నేను ఈ విషయంలో ఫలానా కంపెనీని ఎంపిక చేయాల్సిందిగా సూచించలేను. ఆమోదించలేను. అలా అని తిరస్కరించనూ లేను’ అంటూ సీతారామన్ చేసిన వ్యాఖ్యలు ఇక్కడ అత్యంత గమనార్హం. ఫ్రాంకోయిస్ హొలాండ్ శుక్రవారం వెల్లడించిన ఈ తాజా అంశాలపై ఇటు నిర్మలా సీతారామన్గానీ అటు ప్రధాని కార్యాలయంగానీ స్పందించలేదు. ‘ఈ అంశాన్ని పరిశీలిస్తున్నాం’ అని రక్షణ శాఖ అధికార ప్రతినిధి మాత్రం ముక్తిసరిగా స్పందించారు. హొలాండ్ వ్యాఖ్యలను గుడ్డిగా ఖండించడం కుదరదు. ఎందుకంటే ఆయన దేశాధ్యక్షుడిగా ఉన్నప్పుడే ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ‘మేకిన్ ఇండియా’లో భాగంగా ఈ యుద్ధ విమానాల ఒప్పందం చేసుకున్నారు. ఎందుకీ బాంబు పేల్చారు? ఫ్రెంచ్ మాజీ అధ్యక్షుడు హొలాండే జీవిత భాగస్వామియే కాకుండా నిర్మాత కూడా అయిన అందాల తార ఫ్రెంచి నటి జూలి గయెత్తో అంబానీ గ్రూప్ ‘రిలయెన్స్ ఎంటర్టైన్మెంట్’ ఫ్రెంచ్లో ఓ సినిమా తీసేందుకు చర్చలు జరిపింది. 2016, జనవరి 24వ తేదీన ఈ మేరకు జూలి గయెత్కు చెందిన ‘రోగ్ ఇంటర్నేషనల్’ సంస్థతో రిలయెన్స్ ఎంటర్టైన్మెంట్ ఒప్పందం కూడా కుదుర్చుకుంది. ఆ తర్వాత రెండు రోజులకే అంటే, 2016, జనవరి 26వ తేదీన భారత్తో రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంపై హొలాండే సంతకం చేశారు. ఇప్పుడు ఈ అంశం ఫ్రెంచ్ రాజకీయాలను వేడిక్కించింది. జూలి గయెత్తో సినిమా ఒప్పందం కుదుర్చుకున్నందునే రిలయెన్స్ డిఫెన్స్ కంపెనీని హొలాండ్ ఎంపిక చేశారంటూ ఫ్రెంచ్ మీడియాలో దుమారం రేగింది. ఈ నేపథ్యంలోనే రిలయెన్స్ డిఫెన్స్ కంపెనీని భారత ప్రభుత్వమే ఎంపిక చేసిందనే విషయాన్ని ఆయన వెల్లడించాల్సి వచ్చింది. ఈ రాఫెల్ యుద్ధ విమానాలకు సంబంధించి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చర్చలు జరిపినప్పుడు భారత భాగస్వామ్య కంపెనీగా ప్రభుత్వరంగ సంస్థ ‘హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్’ను సూచించింది. మోదీ అధికారంలోకి వచ్చాక సీన్ పూర్తిగా మారింది. 28వేల కోట్ల రూపాయల ఒప్పందం కాస్త 51 వేల కోట్ల రూపాయలకు చేరింది. 2017, అక్టోబర్ నెలలో యుద్ధ విమానాల ప్రాజెక్ట్ను సంయక్తంగా చేపడుతున్నామని డసాల్ట్, రిలయెన్స్ కంపెనీలు సంయుక్త ప్రకటన చేశాయి. అదే నెలలో నాగపూర్లో ప్రాజెక్ట్ నిర్మాణానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ శంకుస్థాపన చేశారు. ఆ కార్యక్రమలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఫ్రెంచ్ రక్షణ మంత్రి ఫోరెన్సీ పార్లీలు పాల్గొన్నారు. అయినా రిలయెన్స్ వ్యవహారం మన నిర్మలా సీతారామన్కు తెలియదట. ఆమెను పిలవనందుకు అలిగి అలా చెబుతున్నారని అనుకోవాలా!! -
యూపీలో కీలక సర్వే.. బీజేపీకి కష్టమే!
న్యూఢిల్లీ: 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి అధికారం రావడంలో కీలకపాత్ర పోషించిన యూపీలో విపక్ష మహా కూటమి ప్రభావం స్పష్టంగా ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తమైంది. ప్రజల్లో మోదీ పాలనపై సానుకూలత ఉన్నప్పటికీ.. ఎస్పీ–బీఎస్పీ కలిసి పోటీచేస్తే బీజేపీకి చిక్కులు తప్పవని స్పష్టమైంది. 47% మంది ప్రాంతీయ పార్టీలు ఏకమైతే బీజేపీ ఇప్పుడున్న స్థానాల్లో కొన్నింటిని కోల్పోవాల్సి వస్తుందని అభిప్రాయపడగా.. 32% మంది కూటమి ప్రభావం ఉండదని.. 21% మంది చెప్పలేమని పేర్కొన్నారు. ఇండియాటుడే సంస్థ సెప్టెంబర్ 15–19 మధ్యలో 30,400 మంది అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఈ సర్వే నిర్వహించింది. దీని ప్రకారం యూపీలో 48% మంది మళ్లీ మోదీనే ప్రధానిగా కావాలని కోరుకోగా.. 22% మంది రాహుల్ గాంధీ వైపు మొగ్గుచూపారు. 9% మంది మాయావతి ప్రధాని కావాలని అభిప్రాయపడగా.. అఖిలేశ్కు 7% మంది ఓకే చెప్పారు. 80 ఎంపీ స్థానాలున్న యూపీలో 2014 ఎన్నికల్లో బీజేపీ 71 స్థానాల్లో విజయ దుందుభి మోగించి కేంద్రంలో అధికారాన్ని చేపట్టింది. ప్రధానిగా మోదీ భేష్ : వారణాసి ఎంపీగా ఉన్న నరేంద్ర మోదీ పాలనపై 53% మంది సంతృప్తి వ్యక్తం చేయగా.. 16%మంది పర్వాలేదన్నారు. 28% మాత్రం కేంద్రం పాలన బాగాలేదని అభిప్రాయపడ్డారు. ఎస్సీల్లో 39% మోదీకే జై కొట్టగా.. మాయావతికి 24%, రాహుల్కు 20%, అఖిలేశ్కు 4%మంది మద్దతు తెలిపారు. రాఫెల్ ఒప్పందం విషయంలో కేంద్రంపై విపక్షాలు చేస్తున్న విమర్శల ప్రభావం యూపీలో పెద్దగా కనిపించలేదు. 79% మంది తమకు రాఫెల్ వివాదం గురించి తెలియదని వెల్లడించారు. సీఎంగా యోగి ఓకే! ఉత్తరప్రదేశ్ తదుపరి సీఎంగా యోగికి 43% మంది మద్దతు తెలుపగా.. అఖిలేశ్కు 29%, మాయావతికి 18% మంది ఓటేశారు. సీఎంగా యోగి పాలనపై 41% సంతృప్తి చెందుతుండగా.. 20%మంది పర్వాలేదన్నారు. 37% మందిలో మాత్రం అసంతృప్తి వ్యక్తమైంది. అఖిలేశ్, మాయావతిలతో పోలిస్తే.. ఓబీసీలు, బ్రాహ్మణులు, ఎస్టీల్లో ఎక్కువ మంది యోగికే మద్దతు తెలిపారు. ముస్లింలు అఖిలేశ్కు (71%), ఎస్సీలు మాయావతికి (49%) మద్దతు ప్రకటించారు. పీఎం ఓకే.. కానీ ముఖ్యమంత్రే? ఉత్తరాఖండ్లో బీజేపీకి భిన్నమైన పరిస్థితి ఎదురవుతోంది. ప్రధానిగా మోదీ పనితీరుపై సంతృప్తిగానే ఉన్నా.. సీఎం త్రివేంద్ర సింగ్ రావత్పై స్వల్ప వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మొత్తంగా ప్రధానిగా మోదీకి 57% మంది, రాహుల్కు 32%మంది మద్దతు తెలిపారు. మోదీ పాలనపై 45% సంతృప్తి వ్యక్తం చేయగా.. 23% పర్వాలేదని, 24% బాగాలేదని అభిప్రాయపడ్డారు. అయితే సీఎంగా రావత్ పనితీరుపై 35% మంది అసంతృప్తిని వ్యక్తం చేయగా.. 30% బాగుందని, 29% పర్వాలేదని పేర్కొన్నారు. యూపీలో బీఎస్పీ–ఎస్పీ జోడీ ప్రభావం బీజేపీపై ఉంటుందా? అన్నప్రశ్నకు అవును అని 47% మంది, చెప్పలేమని 21% మంది, ప్రభావం ఉండదని 32%మంది అభిప్రాయపడ్డారు. -
రఫెల్ డీల్: బాంబు పేల్చిన హోలాండే
రఫెల్ డీల్లో అనిల్ అంబానీ కంపెనీని ఎంచుకున్నది డస్సాల్ట్ ఏవియేషన్ కంపెనీయేనని నరేంద్ర మోదీ సర్కార్ పదే పదే చెబుతుండగా ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే బాంబు పేల్చారు. రాఫెల్ జెట్ ఒప్పందంలో అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ డిఫెన్స్ ఇండస్ట్రీస్ను ఇండియన్ పార్టనర్గా నియమించాలని భారత ప్రభుత్వమే ఫ్రెంచ్ ప్రభుత్వాన్ని కోరిందంటూ స్థానిక మీడియాపార్ట్ ఒక వ్యాసం ప్రచురించింది. ఇందులో ఈ డీల్ సందర్భంగా భాగస్వామి ఎంపికలో తమ ప్రభుత్వ పాత్ర ఏమీలేదని హోలాండే స్పష్టం చేసినట్టుగా నివేదించింది. సర్వీస్ ప్రొవైడర్గా అనిల్ అంబానీ కంపెనీ పేరును భారత ప్రభుత్వం ప్రతిపాదించిందని డస్సాల్ట్ కంపెనీ ఎంచుకోలేదని పునరుద్ఘాటించినట్టు తెలిపింది. రఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ బీజేపీ సర్కార్పై తీవ్ర విమర్శలను ఎక్కుపెడుతున్నారు. రఫెల్ ఒప్పందం నుండి హెచ్ఎఎల్ను తొలగించి, అంబానీకి కట్టబెట్టడంపై మండిపడుతున్నారు. ఇవి తప్పుడు ఆరోపణలంటూ ఈ విమర్శలను కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కొట్టిపారేస్తూ వస్తున్నారు. ఫ్రాన్స్తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం, సర్వీస్ ప్రొవైడర్గా అంబానీ కంపెనీని డస్సాల్ట్ కంపెనీయే ఎంచుకుందనీ, అలాగే రఫెల్ విమానాల ధర గత యూపీఏ ప్రభుత్వం అంగీకరించిన ధర కంటే 9 శాతం తక్కువని సీతారామన్ వాదిస్తున్నారు. కాగా 2016లో భారత ప్రభుత్వం, ప్రాన్స్ ప్రభుత్వంతో డస్సాల్ట్ కంపెనీకి చెందిన 36 రఫెల్ ఫైటర్ జెట్ విమానాల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. అయితే ఎవరు హెచ్ఏల్ను తొలగించారు.. ఎవరు అంబానీకి అప్పగించారు అనేది కీలక ప్రశ్నగా మారింది. హోలాండ్ వ్యాఖ్యలు నిజమని తేలితే మోదీ సర్కార్ ఇరుకు పడినట్టేనని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు తాజా పరిణామంపై మాజీ కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరం స్పందించారు ఈ వ్యవహారంలో కేంద్రం వాస్తవాలను దాచిపెడుతోందని మండిపడ్డారు. అటు ఈ అంశంపై స్పందించేందుకు న్యూఢిల్లీలోని ఫ్రెంచ్ ఎంబసీ నిరాకరించింది. -
ఆయన నోరుతెరిస్తే అసత్యాలే..
సాక్షి, న్యూఢిల్లీ : రాఫెల్ డీల్పై కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ పదేపదే అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆరోపించారు. ఒక అవాస్తవాన్ని అదే పనిగా చెబుతుంటే దాన్నే నిజమని ప్రజలు విశ్వసిస్తారనే వ్యూహరంతో రాహుల్ ఇలా చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎన్డీఏ పాలనను విమర్శించేందుకు కాంగ్రెస్కు ఎలాంటి అంశాలు దొరకడం లేదని ఈ ఉదంతం వెల్లడిస్తోందని జైట్లీ ఎద్దేవా చేశారు. రాఫెల్ డీల్లో అక్రమాలు జరిగాయనేది అబద్ధమని, 15 మంది పారిశ్రామికవేత్తలు బ్యాంకులకు బకాయిపడిన రూ రెండున్నర లక్షల కోట్లను ప్రధాని మోదీ మాఫీ చేశారనేది మరో అసత్యమని చెప్పుకొచ్చారు. రాహుల్ చెప్పే ప్రతి మాట అవాస్తవాలతో కూడుకున్నదని అన్నారు. రాఫెల్ డీల్పై, ఎన్పీఏలపై అసత్యాలు చెబుతున్న రాహుల్ కన్నుగీటడం, కౌగిలింతల వంటి తన చౌకబారు చేష్టలతో ప్రజాస్వామాన్ని అపహాస్యం చేస్తున్నారని దుయ్యబట్టారు. -
‘ఈ శతాబ్దపు అతి పెద్ద స్కాం’
సాక్షి, హైదరాబాద్: ఎన్డీఏ ప్రభుత్వం ఫ్రాన్స్తో చేసుకున్న రాఫెల్ ఒప్పందం 21వ శతాబ్దపు అతి పెద్ద కుంభకోణమని కాంగ్రెస్ జాతీయ నాయకుడు, రాజ్యసభ ప్రతిపక్షనేత గులాంనబీ ఆజాద్ ఆరోపించారు. బుధవారం గాంధీ భవన్లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ కేబినెట్లో చర్చించకుండా, కనీసం రక్షణ శాఖ మంత్రికి కూడా తెలియకుండా తన ఇష్టానుసారంగా రాఫెల్ డీల్ చేశారని ఆరోపించారు. రాఫెల్ డీల్ గురించి అజాద్ చెప్పిన పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే.. నోరు మెదపని ప్రధాని ‘దేశంలో ఏ ప్రభుత్వమైనా ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. కానీ కేంద్రప్రభుత్వాన్ని అనేక సార్లు ప్రశ్నిస్తున్నా రాఫెల్ పై సమాదానం లేదు. లోక్సభ, రాజ్యసభలో ఎక్కడైనా నో అన్సర్. గతంలో ఏ ప్రధానియైనా ఆరోపణలు వస్తే వాటిపై స్పందించారు. కానీ తొలిసారి ఈ ప్రధాని మాత్రం నోరు మెదపటం లేదు. హైదరబాద్ నా రెండవ ఇళ్లు. అందుకే ఇక్కడ మీడియాతో రాఫెల్ ఒప్పందం గురించి పూర్తి వివరాలు వివరిస్తున్నా. చైనా బలపడుతోంది, పాకిస్తాన్ మరింత వైరుధ్యం పెంచుకొంటోంది. ఈ రెండు ప్రమాదమే అందుకే యూపీఏ హయాంలో డిఫెన్స్ కౌన్సిల్ ఆయుదాలకొనుగోలు చేయాలని తెలిపింది. అందులో 126 యుద్ద విమానాల అవసరం అని తెలపగా టెండర్లకు 6 కంపెనీలు పాల్గొన్నాయి. 8 రెడీ గా ఉన్నవి, 108 మన దేశంలో తయారుచేసేలా ఫ్రెంచ్ కంపెనీతో ఒప్పందం జరిగింది. మేము ఒక్కో విమానానికి 523 కోట్లు పెట్టి కొనుగోలు చేస్తే.. 108 యుద్ద విమానాలు మన దేశంలో తయారు చేసేలా హిందుస్తాన్ ఏరో నాట్స్, ఫ్రెంచ్ కంపెనీల మధ్య ఒప్పందం కూడా జరిగి పనులు ప్రారంభమయ్యాయి. అయితే ఏప్రిల్ 2015 లో మోదీ ఫ్రాన్స్ వెళ్లారు. అక్కడ మీడియాతో విమానాల కొనుగోళ్లపై ఎలాంటి చర్చ జరగలేదన్నారు. అయితే తర్వాత తేలిందేంటంటే పాత అగ్రీమెంట్ రద్దు చేసి కొత్త ఒప్పందం చేసుకున్నట్లు తేలింది. అది డిఫెన్స్ మంత్రి, విదేశీ వ్యవహారాల మంత్రి ఇతరులెవరికీ తెలియదు. కేవలం మన ప్రధాని ఫ్రాన్స్ ప్రభుత్వానికి తప్ప ఎవరికి తెలియదు. మేం 523 కోట్లకు చేసిన డీల్ సేమ్ అదే విమానానికి 1670 కోట్లతో ఒప్పందం చేసుకున్నారు. హిందుస్తాన్ ఏయిర్ క్రాఫ్ట్ తో ఉన్న అగ్రిమెంట్ సైతం రద్దు చేసి మరో ప్రైవేట్ కంపెనీకి ఇచ్చారు. యూపీఏ హయాంలో లక్ష రూపాయలు అవినీతి జరిగినా పెద్ద అంశమే.. డిఫెన్స్ కౌన్సిల్ నిర్ణయించిన 127 విమానాల కొనుగోలును అప్పుటి మన్మోహన్ ప్రభుత్వం అంగీకరిస్తే.. ఎవరినీ సంప్రదించకుండా మోడీ ఎలా వాటిని 36 చాలు అని నిర్ణయిస్తారు. కేబినెట్ నిర్ణయం తీసుకోలేదు.. కనీసం ప్రకటించేంత వరకు దానిపై ప్రధాని సంతకం కూడా జరగలేదు. 36 యుద్దవిమానాలకు అధనంగా 41 వేల కోట్లు చెల్లించారు. 21 వ శతాబ్దంలో ఇది అత్యంత పెద్ద స్కాం. 4060 పైగా విమానాలు తయారు చేసిన ప్రభుత్వ సంస్థను కాదని, హెచ్ఈఎల్ కంపెనీని కాదని కనీసం రిజిస్ట్రేషన్ కూడా జరగని ప్రైవేట్ కంపెనీకి ఇచ్చారు. టెండర్ దక్కిన తర్వాతే ఆ కంపెనీ రిజిస్ట్రేషన్ జరిగింది. యూపీఏ హయాంలో లక్ష రూపాయాల అవినీతి చాలా పెద్ద అంశం.. అదే ఎన్డీఏ ప్రభుత్వంలో 25 వేల కోట్ల పై కూడా లెక్క లేకుండా పోయింది. వాళ్ల పొట్టలు పెద్దవి అందుకే బాగా తింటున్నారు’అంటూ నరేంద్ర మోదీ నియంతృత్వ ధోరణిపై ఆజాద్ నిప్పులు చెరిగారు. -
ఏ పార్టీతోనూ పొత్తు ఉండదు : వీరప్ప మొయిలీ
సాక్షి, విజయవాడ : రాష్ట్రంలో ఏ పార్టీతోనూ కూడా పొత్తు పెట్టుకునే ఉద్దేశం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీ స్పష్టం చేశారు. మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ... రక్షణ సంబంధమైన అంశాల్లో నరేంద్ర మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మొయిలీ విమర్శించారు. దేశ రక్షణ కోసం 126 హెలికాప్టర్లను కొనుగోలు చేసేందుకు.. రాఫెల్ ఒప్పందం ద్వారా కేంద్ర ప్రభుత్వం భారీ అవినీతికి తెరతీసిందని ఆరోపించారు. ఈ ఒప్పందం ద్వారా రిలయన్స్ కంపెనీకి ఎన్డీయే ప్రభుత్వం లబ్ది చేకూర్చిందన్నారు. ఈ కాంట్రాక్టుకు 12 రోజుల ముందు అనిల్ అంబానీ కంపెనీ ఏర్పాటు చేశారని... తద్వారా 61 వేల కోట్ల రూపాయల భారీ కాంట్రాక్టును దక్కించుకున్నారని పేర్కొన్నారు. ఎటువంటి అనుభవం లేని ఇలాంటి కంపెనీలకు కాంట్రాక్టు ఇవ్వడమంటే రక్షణ రంగాన్ని నిర్వీర్యం చేయడమేనని మొయిలీ విమర్శించారు. పార్టీ తరపున మెమోరాండం ఇస్తాం.. రాఫెల్ కుంభకోణంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విచారణ జరపాలని కోరిన విషయాన్ని మొయిలీ గుర్తుచేశారు. ప్రతీ వేదికపై రాహుల్ ఈ విషయాన్ని లేవనెత్తుతున్నా.. మోదీజీ మాత్రం మౌనంగానే ఉండటం దేనికి సంకేతమని ప్రశ్నించారు. ఈ విషయమై సెప్టెంబరు 12న రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్లకు కాంగ్రెస్ పార్టీ నాయకులు మెమోరాండం అందిస్తారని తెలిపారు. అదే విధంగా 24న గవర్నర్ను కలిసి కాంగ్రెస్ పార్టీ తరపున మెమోరాండం అందజేస్తామని పేర్కొన్నారు. -
‘మోదీ అబద్దాలు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చారు’
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ అబద్దాలు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చారని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ హనుమంతరావు విమర్శించారు. గురువారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. యూత్ కాంగ్రెస్ నేతృత్వంలో ప్రధాని నరేంద్ర మోదీ నివాసాన్ని ముట్టడించామన్నారు. నివాసాన్ని ముట్టడి చేసే ప్రయత్నంలో పోలీసులు తమని అడ్డుకున్నారని తెలిపారు. రాఫెల్ డీల్ను దేశంలోనే అతి పెద్ద కుంభకోణంగా ఆయన అభివర్ణించారు. మోదీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఇప్పటివరకు నెరవేర్చలేదని మండిపడ్డారు. రక్షణ శాఖ మంత్రికి తెలియకుండానే రాఫెల్ డీల్ కుంభకోణం జరిగిందని ఆరోపించారు. రాఫెల్ డీల్లో జరిగిన అవినీతి గురించి కాంగ్రెస్ పార్టీ గ్రామ గ్రామానికి.. ప్రజల్లోకి తీసుకెళ్తుందని పేర్కొన్నారు. రాఫెల్ డీల్పై తమ అధ్యక్షుడు రాహూల్ గాంధీ పార్లమెంట్ లోపల పార్లమెంట్ బయట నిలదీశారని అన్నారు. అనిల్ అంబానికి ఎలాంటి అనుభవం ఉందని ఈ డీల్ ఇచ్చారని ప్రశ్నించారు. అనిల్ అంబాని అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత కంపెనీ పెట్టినట్లు తెలుస్తోందన్నారు. -
రాఫెల్.. మోదీ, అంబానీల డీల్: కాంగ్రెస్
సాక్షి, న్యూఢిల్లీ: రాఫెల్ డీల్ ప్రధాని మోదీకి అనిల్ అంబానీకి మధ్య కుదిరిన ఒప్పందమని కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తింది. ఏఐసీసీ అధికార ప్రతినిధి ఎస్.జైపాల్రెడ్డి మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ‘2015 ఏప్రిల్ 15న రాఫెల్ ఒప్పందం కుదిరింది. దీనికి రెండు రోజుల ముందు కూడా విదేశాంగ కార్యదర్శికి ఈ విషయం తెలియదు. నాటి రక్షణ మంత్రి మనోహర్ పారికర్ ఫ్రాన్స్లో లేరు. డీల్పై సంతకం అయ్యాక పారికర్ చేసిన ప్రకటన చూస్తే ఆయన ఆ డీల్కు కావాలనే దూరంగా ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. ఈ ఒప్పందం భారత ప్రధాని, ఫ్రాన్స్ అధ్యక్షుడి మధ్య కుదిరిన ఒప్పందంగా పారికర్ చెప్పారు. అయితే ఈ దేశంలో ప్రధాని కాకుండా ఈ ఒప్పందం జరుగుతుందని తెలిసిన మరో వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క అనిల్ అంబానీ మాత్రమే’ అని జైపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఒప్పందానికి సరిగ్గా 12 రోజుల ముందు అనిల్ అంబానీ తన కంపెనీని రిజిస్టర్ చేయించారని వివరించారు. అంటే 12 రోజుల ముందే ఈ ఒప్పందం కుదురుతుందని, అది తనకే దక్కుతుందని అనిల్ అంబానీకి తెలుసని వివరించారు. -
అందుకే ప్రధాని నా కళ్లలోకి చూడలేరు..
సాక్షి, బెంగళూర్ : రాఫెల్ డీల్కు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ మరోసారి టార్గెట్ చేశారు. దొంగతనానికి పాల్పడిన వారు తన కళ్లలోకి చూడలేరని వ్యాఖ్యానించారు. మోదీ సర్కార్కు వ్యతిరేకంగా పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ఫ్రాన్స్తో జరిగిన విమాన ఒప్పందంపై తాను ప్రసంగించిన సంగతి ప్రస్తావిస్తూ ఆ సమయంలో ప్రధాని నేరుగా తన కళ్లలోకి చూడలేకపోయారని ఎద్దేవా చేశారు. కర్ణాటకలోని బీదర్లో సోమవారం జరిగిన ర్యాలీనుద్దేశించి రాహుల్ మాట్లాడారు. రాఫెల్ ఒప్పందంనపై సమగ్ర చర్చకు రాహుల్ ప్రధాని మోదీకి సవాల్ విసిరారు. రాఫెల్ డీల్పై ఎన్ని గంటలు చర్చించినా ప్రధాని ఒక్క క్షణం కూడా దానిపై మాట్లాడలేరని రాహుల్ ఆరోపించారు. మోదీ సర్కార్ బ్యాంకు స్కాంలు, రాఫెల్ కుంభకోణం వంటి పలు స్కాంలతో అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు. -
రాఫెల్ డీల్ : రాహుల్కు అంబానీ లేఖ
సాక్షి, న్యూఢిల్లీ: రాఫెల్ కుంభకోణం వివాదం బీజేపీ సర్కార్ను చిక్కుల్లో నెట్టింది. రాఫెల్ యుద్ధ విమానాలు కొనుగోలు విషయంలో ఇప్పటికే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలకు దిగారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంలో భారీగా లబ్ది పొందారని ఆరోపణలు ఎదుర్కొంటున్న పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీ గతంలో రాసిన ఒక లేఖ ఇపుడు హాట్టాపిక్గా మారింది. కాంగ్రెస్ పార్టీ, రాహుల్ వ్యాఖ్యలకు స్పందించిన అంబానీ గత ఏడాది డిసెంబర్లో ఈ లేఖ రాశారు. డసాల్ట్ కంపెనీ, రిలయన్స్ డిఫెన్స్ లిమిటెడ్తో జాయింట్ వెంచర్గా ఏర్పడటంలో ప్రభుత్వం పాత్ర ఎంత మాత్రం లేదని అంబానీ వివరణ ఇచ్చారు. ఇది రెండు కార్పొరేట్ కంపెనీల మధ్య కుదిరిన ప్రయివేటు ఒప్పందని తెలిపారు. అయితే మోదీ ప్రభుత్వంపై రాహుల్ విమర్శలు గుప్పించడం వ్యక్తిగతంగా తనను చాలా బాధించిందని అనిల్ అంబానీ పేర్కొన్నారు. అంతేకాదు తమ కుటుంబానికి గాంధీ కుటుంబంతో గత నాలుగు దశాబ్దాలుగా గౌరవనీయ సంబంధాలు ఉన్నాయని గుర్తు చేసుకున్నారు. తనపైనా, తన కుటుంబంపైనా కాంగ్రెస్ పార్టీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమన్నారు. అలాగే రక్షణ రంగంలో తమ కంపెనీ అనుభవం లేదన్న విమర్శలను ఆయన తిప్పి కొట్టారు. రిలయన్స్ డిఫెన్స్ లిమిటెడ్, పలు రక్షణ ప్రాంతాల్లో లీడర్గా వెలుగొందుతోందనీ, గుజరాత్లోని పిపావావ్ ప్రైవేటు రంగంలో అతిపెద్ద షిప్ యార్డ్ తమ సొంతమని చెప్పారు. భారత నావికాదళంలో ఐదు నావెల్ ఆఫ్షోర్ పెట్రోల్ వెస్సల్స్ నిర్మాణంతోపాటు, ఇండియన్ కోస్ట్ గార్డ్కు సంబంధించి మొత్తం 14 ఫాస్ట్ పెట్రోల్ వెస్సల్స్ నిర్మించడంలో తమ సంస్థ పాల్గొందని అనిల్ అంబానీ లేఖ ద్వారా తెలిపారు. అమెరికా నేవీకి చెందిన వంద నౌకల నిర్వహణ కాంట్రాక్టు తమకే దక్కిందన్నారు. కాగా రిలయన్స్ కంపెనీ యజమాని అనిల్ అంబానీకి లాభం చేకూర్చేలా రాఫెల్ జెట్ల కొనుగోలు ధరను ఎన్డీయే ప్రభుత్వం అమాంతం పెంచేసిందన్నది కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఆరోపణ. రాఫెల్ డీల్ ఒక భారీ కుంభకోణమనీ, ఇందులో మోదీ మ్యాజిక్ ఉందంటూ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ధ్వజమెత్తారు. 35వేల కోట్ల రూపాయల అప్పుల్లో ఉన్న ఓ ప్రైవేటు సంస్థకు రూ.45వేల కోట్ల లబ్ధి చేకూర్చారనీ, ‘ఓ వ్యాపారవేత్త’కు లబ్ధి చేకూర్చడానికే గతంలో యూపీఏ చేసిన ఒప్పందాన్ని రద్దు చేసి తాజా డీల్ కుదుర్చుకున్నారని రాహుల్ సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాదు ప్రభుత్వ రంగ కంపెనీ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ను ఎందుకు పక్కనపెట్టారో చెప్పాలని రాహుల్ గాంధీ ప్రశ్నించిన సంగతి తెలిసిందే. -
ఆ డీల్పై పార్లమెంటరీ కమిటీ విచారణ..
సాక్షి, న్యూఢిల్లీ : భారత్-ఫ్రాన్స్ మధ్య జరిగిన రాఫెల్ ఒప్పందం పరిశీలించి వాస్తవాలను వెల్లడించేందుకు సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. భోఫోర్స్ తరహాలో రాఫెల్ డీల్పైనా పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని సీనియర్ కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖర్గే కోరారు. ఈ ఒప్పందంపై పాలక బీజేపీ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రకటనలు చేస్తోందని విమర్శించారు. రాఫెల్ జెట్స్ చౌకవే అయితే పార్లమెంట్లో ప్రధాని ఆ వివరాలు వెల్లడించి ఉండాల్సిందని, ఇప్పుడు బీజేపీ నేతలు కప్పిపుచ్చుకునే వ్యాఖ్యలు చేయడం అర్థరహితమన్నారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండగానే ప్రధాని ఐదు రోజుల విదేశీ పర్యటన చేపట్టడం అభ్యంతరకరమన్నారు. మరోవైపు రాఫెల్ డీల్పై పార్లమెంట్ను ప్రధాని, రక్షణ మంత్రి తప్పుదారి పట్టించేలా ప్రకటనలు చేయడంపై వారిపై కాంగ్రెస్ సభా హక్కుల ఉల్లంఘన తీర్మనాన్ని ప్రవేశపెట్టింది. కాగా, రాఫెల్ విమానాల ధరలను వెల్లడించడం కుదరదని, ఒప్పందంలో రహస్య క్లాజ్ ఉందని ప్రభుత్వం చెబుతుండటంపై సీనియర్ కాంగ్రెస్ నేతలు ఏకే ఆంటోనీ, ఆనందర్ శర్మ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. యుద్ధవిమానాల ధరలను వెల్లడించడంపై ఫ్రెంచ్ ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని స్వయంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీతో స్పష్టం చేశారని ఆనంద్ శర్మ చెప్పారు. -
‘రూ . 36 వేల కోట్లు మింగేశారు’
సాక్షి, న్యూఢిల్లీ : రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోళ్ల కుంభకోణంపై కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ మరోసారి మోదీ సర్కార్పై విరుచుకుపడ్డారు. ఈ స్కాంలో రూ 36,000 కోట్లు ఖజానాకు నష్టం వాటిల్లిందని ఆరోపించారు. సైన్యం రక్షణ కేటాయింపులపై ప్రాధేయపడుతుంటే ప్రభుత్వం యుద్ధ విమానాల కొనుగోళ్లలో కుంభకోణానికి పాల్పడిందని దుయ్యబట్టారు. ఈ యుద్ధ విమానాలను తయారుచేసిన దాసాల్ట్ ఏవియేషన్ విమాన ఖరీదుపై భారత రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ అవాస్తవాలు చెప్పారని పేర్కొనడాన్ని రాహుల్ ప్రస్తావించారు. మోదీ ప్రభుత్వం ఒక్కో యుద్ధ విమానాన్ని రూ 1670 కోట్లకు కొనుగోలు చేసిందని, ఒక్కో ఎయిర్క్రాఫ్ట్పై రూ1100 కోట్ల చొప్పున 36,000 కోట్లు వృధా అయ్యాయని ఆరోపించారు. రక్షణ బడ్జెట్లో పది శాతం వాటాను పాలకులు జేబులో వేసుకున్నారని విమర్శించారు. రాఫెల్ యుద్ధవిమానాల కుంభకోణంలో ప్రధాని మోదీ మౌనాన్ని రాహుల్ ప్రశ్నించారు. Dassault called RM's lie and released prices paid per RAFALE plane in report: Qatar = 1319 Cr MODI = 1670 Cr MMS = 570 Cr 1100 Cr per plane or 36,000 Cr i.e 10 % of our Defence budget, in the pocket. Meanwhile, our Army begs our Govt. for money. pic.twitter.com/fE5tj4IaeN — Office of RG (@OfficeOfRG) 16 March 2018 -
'మోదీజీ.. పనికిమాలిన యుద్ధ విమానాలు కొనొద్దు'
రఫల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంలో ప్రధాని నరేంద్రమోదీ అహేతుకంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి ఫైర్ అయ్యారు. ప్రస్తుతం ఫ్రాన్స్లో పర్యటిస్తున్న మోదీ.. 36 రఫల్ యుద్ధవిమానాల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. డస్సాల్ట్ ఏవియేషన్ సంస్థ రూపొందించే రఫల్ యుద్ధవిమానాలు అత్యంత పనికిమాలినవని, ప్రపంచంలోని మిగతా దేశాలేవీ ఆ విమానాలని కొనుగోలు చేసేందుకు ముందుకురాలేదని స్వామి చెప్పారు. 'రఫల్ ఫైటర్ల ఇంధన సామర్థ్యం చాలా తక్కువ. ఇక పనితీరు గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. పైగా మొదట ఆ డీల్ కుదుర్చుకుంది గత యూపీయే ప్రభుత్వం! వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ఆ యుద్ధవిమానాల్ని కొనొద్దని మోదీకి విన్నవిస్తున్నా' అని అన్నారు. శనివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఒకవేళ ఈ విషయంలో ప్రభుత్వ మొండిగా వ్యవహరిస్తే కోర్టును ఆశ్రయిస్తానన్నారు. ఒప్పంద పత్రాలు పరిశీలించిన అనంతరం ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేస్తానని చెప్పారు.