Advisory
-
జాగ్రత్త.. అలాంటి కంటెంట్ ప్రసారం చేయొద్దు
న్యూఢిల్లీ: ఓటీటీ, సోషల్ మీడియా ఫ్లాట్ఫారమ్లు కఠిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. మరీ ముఖ్యంగా అశ్లీల కంటెంట్ను మితిమీరి ప్రసారం చేస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని, ఇలాంటి ఫిర్యాదులకు చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ మేరకు బుధవారమే కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఓ నోటిఫికేషన్ను రిలీజ్ చేసింది.ఓవర్ ది టాప్(OTT) ఫ్లాట్ఫారమ్లు, సోషల్ మీడియా ఫ్లాట్ఫారమ్లు ఐటీ రూల్స్ (2021) నైతిక విలువలు(Code of Ethics) పాటించాల్సిందే. అలాగే చిన్నారులకు 'ఏ' రేటెడ్ కంటెంట్ అందుబాటులో లేకుండా చూడాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ‘‘ఓటీటీ ప్లాట్ ఫామ్ లు, సోషల్ మీడియాలోని అశ్లీల, అసభ్యకరమైన కంటెంట్పై ఫిర్యాదులు వస్తున్నాయి. అలాంటి ఫిర్యాదులకు కఠిన చర్యలు తప్పవు. .. ఐటీ రూల్స్ లోని 2021 కోడ్ ఆఫ్ ఎథిక్స్ ను తప్పనిసరిగా పాటించాలని పేర్కొంది. ఈ నిబంధనలు మితిమీరి ఏ కంటెంట్ను ప్రసారం చేయొద్దు’’ అని కేంద్రం హెచ్చరించింది. అలాగే వయసు ఆధారిత కంటెంట్ అందుబాటులో ఉండాలని, స్వీయనియంత్రణ కలిగి ఓటీటీలు నైతిక విలువలను పాటించాలని ఆదేశించింది. సంబంధిత శాఖ సలహాదారు కాంచన్ గుప్తా ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా తెలియజేశారు.Advisory to OTT platforms against nisitha, indecency and obscenity:Ministry of Information & Broadcasting has issued an advisory to online curated content publishers (OTT platforms) and self-regulatory Bodies of OTT platforms, to ensure strict adherence to India’s laws and the… pic.twitter.com/xMjddk9ns0— Kanchan Gupta 🇮🇳 (@KanchanGupta) February 20, 2025ఇటీవల ఇండియాస్ గాట్ లాటెంట్ షోలో ప్రముఖ యూట్యూబర్ రణ్ వీర్ అల్హాబాదియా (Ranveer Allahbadia) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ఇటు పార్లమెంట్ లోనూ చర్చ జరగ్గా..అటు సుప్రీం కోర్టు సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ సమయంలో యూట్యూబ్లాంటి ఫ్లాట్ఫారమ్లలో అభ్యంతరకర కంటెంట్పై నియంత్రణ ఉండాలంటూ సర్వోన్నత న్యాయస్థానం పిలుపు ఇచ్చింది. ఈ నేపథ్యంలో కేంద్రం ఇప్పుడు హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం. -
కేంద్రం అలర్ట్.. చైనా డీప్సీక్ వినియోగంపై అడ్వైజరీ!
న్యూఢిల్లీ: కృత్రిమ మేథ రంగంలో సంచలనం సృష్టించిన చైనాలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ‘డీప్సీక్’తో భారతీయ కంప్యూటర్లలో డేటా గోప్యత ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళనలు రేకత్తడంతో కేంద్రం అప్రమత్తమవుతోంది. డీప్సీక్ వంటి ఏఐ వినియోగంపై తగు సూచనలు, సలహాలు, హెచ్చరికలతో అధికారిక అడ్వైజరీని జారీ చేయడానికి కేంద్రం సిద్ధమవుతోంది. సైబర్ సెక్యూరిటీ ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో వినియోగదారులను హెచ్చరిస్తూ ఈ ఉత్తర్వులు తీసుకురానుంది.డీప్సీక్ తన ఏఐ చాట్బాట్ ఆర్1 ద్వారా సున్నితమైన యూజర్ డేటాను ఎలా యాక్సెస్ చేస్తోందనే దానిపై భారత సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ అయిన కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సీఈఆర్టీ–ఇన్) సమగ్రస్థాయిలో దర్యాప్తు చేస్తోంది. దర్యాప్తు పూర్తయ్యాక చర్యలు చేపడుతుంది. యూజర్ ప్రాంప్్ట్స, డివైజ్ ఇన్ఫర్మేషన్, యాప్ ఇంటరాక్షన్స్, కీ స్ట్రోక్లతో విస్తృత శ్రేణి డేటాను డీప్సీక్ సేకరిస్తోందని సీఈఆర్టీ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో వ్యక్తిగత గోప్యత, జాతీయ భద్రతా ప్రయోజనాలు రెండింటినీ దృష్టిలో పెట్టుకుని భద్రతా చర్యలను వేగవంతం చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు.. భారత్ మాత్రమే కాదు ఆ్రస్టేలియా, ఇటలీ, దక్షిణ కొరియాతో సహా అనేక దేశాలు గోప్యత, భద్రతా ప్రమాదాల దృష్ట్యా ప్రభుత్వ విభాగాలు, అధికారిక కంప్యూటర్ల, కీలక వ్యవస్థల్లో డీప్సీక్ టూల్స్ వినియోగంపై ఆయా దేశాల ప్రభుత్వాలు నిషేధం విధించాయి. విడుదల నాటినుంచే ప్రపంచవ్యాప్తంగా డీప్సీక్ సంచలనం సృష్టించడంతోపాటు కొత్త భయాందోళనలకు తెరలేపింది. అత్యద్భుతమైన పనితీరుతో ఏఐ మోడల్ మొదట ప్రశంసలు పొందినా.. దాని డేటా సేకరణ పద్ధతులతో పలు దేశాల ప్రభుత్వాలు ఆందోళనలో పడ్డాయి.ప్రైవసీ, మాల్వేర్ ప్రమాదాల కారణంగా డీప్సీక్ను ఆస్ట్రేలియా నిషేధించింది. తైవాన్ దీనిని దేశ భద్రతా ముప్పుగా పేర్కొంది. యూజర్ డేటాను ఉపయోగించడంలో పారదర్శకతను చూపకపోవడంతో దక్షిణ కొరియా దీనిని జాతీయ భద్రతా ప్రమాదంగా ప్రకటించింది. తమ పౌరుల డేటాను ప్రాసెస్ చేయకుండా ఇటలీ డీప్సీక్ను అడ్డుకుంటోంది. డీప్సీక్ వారి ఆర్1 మోడల్పై దర్యాప్తు ప్రారంభించింది. ఉచిత సేవలు అందించే డీప్సీక్ వంటి యాప్లు యూజర్ల డేటాను సేకరించి దానికి ముడిసరకుగా వినియోగిస్తున్నాయని సైబర్ సెక్యూరిటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాశ్చాత్య టెక్ కంపెనీల మాదిరిగా కాకుండా డీప్సీక్ కేవలం చైనా ప్రభుత్వ చట్టాల ప్రకారం పనిచేస్తుంది. ప్రామాణిక డేటాను మించి.. ప్రామాణిక డేటా సేకరణ పద్ధతులతోపాటు ఇతర మార్గాల్లోనూ వినియోగదారుల ఆన్లైన్, ఆఫ్లైన్ కార్యకలాపాలను డీప్సీక్ ట్రాక్ చేస్తోందని సీఈఆర్టీ పరిశోధనలో తేలింది. చాట్బాట్ ఆర్1 వినియోగించడం మొదలుపెట్టిన తరువాత.. చాట్ జీపీటీ లేదా గూగుల్కు చెందిన జెమినీ వంటి పోటీ యాప్లను యూజర్లు ఉపయోగించడం మానేశారా లేదా అనే విషయాన్ని కూడా ఈ యాప్ చెక్చేస్తోంది. తాము సేకరించిన సున్నితమైన డేటా తమ వద్ద భద్రంగా ఉంటుందని, చైనా ప్రభుత్వానికి చేరబోదు అనే సరైన వివరణ డీప్సీక్ ఇవ్వట్లేదు. దీంతో డీప్సీక్కు జవాబుదారీతనం లేదని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ యాప్తో వ్యక్తిగత డేటా చైనాకు చేరుతోంది. దీంతో డీప్సీక్ యూజర్లు నిఘా లేదా సైబర్ గూఢచర్యం వంటి దుర్వినియోగానికి గురయ్యే ప్రమాదం ఉంది. చాట్జీపీటీ, డీప్ సీక్ వంటి ఏఐ టూల్స్ను ప్రభుత్వ అధికారులు ఉపయోగించరాదని ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఐటీ మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. -
ఫైనాన్స్ కంపెనీ అడ్వైజరీ బోర్డు ఛైర్మన్గా జస్టిస్ శ్రీకృష్ణ
డేటా షేరింగ్ ప్లాట్ఫాం ఈక్వల్, అలాగే ఆ సంస్థ పెట్టుబడులున్న అకౌంట్ అగ్రిగేటర్ వన్మనీ ఏర్పాటు చేసిన అడ్వైజరీ బోర్డు ఛైర్మన్గా సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీఎన్ శ్రీకృష్ణ(Justice B.N. Srikrishna) నియమితులయ్యారు. న్యాయశాస్త్ర, ఆర్థిక(Finance), టెక్నాలజీ తదితర రంగాలకు చెందిన నిపుణులు ఇందులో సభ్యులుగా ఉంటారు. ఆర్బీఐ మాజీ గవర్నర్లు జగదీష్ కపూర్, రాకేష్ మోహన్ .. యూఐడీఏఐ మాజీ చైర్మన్ జె సత్యనారాయణ వంటి ప్రముఖులు ఈ జాబితాలో ఉన్నారు.డేటా షేరింగ్కి సంబంధించి భద్రత, నైతికతకు ప్రాధాన్యమిస్తూ అత్యున్నత ప్రమాణాలు పాటించడంలో ఇరు కంపెనీలకు ఈ బోర్డు మార్గనిర్దేశం చేస్తుంది. వ్యక్తుల హక్కులు, ఆకాంక్షలు, ఆర్థిక వృద్ధి తదితర అంశాల్లో సమతౌల్యత పాటించేందుకు ఉపయోగపడే సొల్యూషన్స్ను రూపొందించడంపై దృష్టి పెట్టనున్నట్లు జస్టిస్ బీఎన్ శ్రీకృష్ణ తెలిపారు. రుణాలు, ఉద్యోగాలు(Jobs), ఆరోగ్య సంరక్షణ సేవలను మరింత మందికి అందుబాటులోకి తేవడానికి కట్టుబడి ఉన్నామని ఈక్వల్ వ్యవస్థాపకుడు కేశవ్ రెడ్డి తెలిపారు. సమ్మిళిత ఆర్థిక వృద్ధి సాధన దిశగా కృషి చేస్తున్నట్లు వన్మనీ వ్యవస్థాపకుడు కృష్ణ ప్రసాద్ చెప్పారు.ఇదీ చదవండి: రేడియో వ్యాపారం మూసివేతబ్రిగేడ్ గ్రూప్ కొత్త ప్రాజెక్ట్రియల్టీ సంస్థ బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ హైదరాబాద్లో కొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. కోకాపేటలో బ్రిగేడ్ గేట్వే పేరుతో 10 ఎకరాల విస్తీర్ణంలో హౌసింగ్, కమర్షియల్ ప్రాజెక్ట్ను అభివృద్ధి చేయనుంది. ఇందుకు రూ.4,500 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్టు ప్రకటించింది. 45 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రానున్న ఈ ప్రాజెక్టులో లగ్జరీ గృహాలను 25 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తారు. హైదరాబాద్, బెంగళూరు, మైసూరు, చెన్నై, కొచ్చిలో కంపెనీ పలు ప్రాజెక్టులను అభివృద్ధి చేసింది. -
బంగ్లాదేశ్కు వెళ్లొద్దు: బ్రిటన్ హెచ్చరిక
లండన్:బంగ్లాదేశ్కు వెళ్లొద్దని బ్రిటన్ తన పౌరులకు సూచించింది. అక్కడ ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని హెచ్చరించింది.ఉగ్రవాదుల దాడులతో పాటు ఆయుధాలతో బెదిరించి దోపిడీ చేయడం,అత్యాచారం,భౌతిక దాడులు జరిగే అవకాశాలున్నాయని తెలిపింది.బంగ్లాదేశ్లో ఉన్న యూకే పౌరులు జాగ్రత్తగా ఉండాలని కోరింది. ఈ మేరకు బ్రిటన్ తాజాగా ఒక అడ్వైజరీ జారీ చేసింది.అక్కడా ఇక్కడా అనే తేడా లేకుండా బంగ్లాదేశ్లో రద్దీ ఎక్కువగా ఉండే అన్ని ప్రదేశాల్లో ముఖ్యంగా విదేశీయులు సంచరించే ప్రాంతాల్లో దాడులు జరగొచ్చని తెలిపింది.దేశంలో ఇస్లాం మతానికి చెందని వారిని కొన్ని గ్రూపులు లక్ష్యంగా చేసుకున్నాయని పేర్కొంది.కాగా, బంగ్లాదేశ్లో షేక్హసీనా ప్రభుత్వం పడిపోయి మధ్యంతర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్కడ శాంతిభద్రతలు పూర్తిగా దిగజారిపోయాయి. ముఖ్యంగా మైనారిటీలైన హిందువులపైన దాడులు పెరిగాయి. -
పాకిస్తాన్ లో హై అలర్ట్.. అమెరికా పౌరులకు హెచ్చరికలు జారీ
వాషింగ్టన్: పాకిస్తాన్ లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ప్రధాని, పీటీఐ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ ను జైలు నుంచి విడుదల చేయాలని పార్టీ మద్దతుదారులు తలపెట్టిన ఆందోళనల కారణంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ లో ఉన్న అమెరికా పౌరులను ఆ దేశ అడ్వైజరీ హెచ్చరించింది. డిసెంబర్ 16వ తేదీ వరకు జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేసింది.పాకిస్తాన్ లో శాంతి భద్రతలు అదుపు తప్పిన నేపథ్యంలో అక్కడ ఉన్న అమెరికా పౌరులను అడ్వైజరీ హెచ్చరించింది. తమ దేశ పౌరులు పెషావర్లోని సెరెనా హోటల్ పరిసర ప్రాంతాల్లోకి వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేసింది. అవసరమైతే తప్ప ఖైబర్ ఫకున్ ఖ్వా ప్రాంతాలకు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచనలు చేసింది. అయితే, సెరెనా హోటల్ పరిసర ప్రాంతాల్లో మిలిటెంట్లు దాడులు చేసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 16వ తేదీ వరకు తాము చేసే సూచనలు తప్పకుండా పాటించాలని ఓ ప్రకటనలో పేర్కొంది.ఇదిలా ఉండగా.. పీటీఐ అధినేత ఇమ్రాన్ ఖాన్ ను జైలు నుంచి విడుదల చేయాలని పార్టీ మద్దతుదారులు నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలో నిరసనల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. పలువురు మరణించగా.. మరికొందరు ఆందోళనకారులు గాయపడ్డారు. దీంతో, దాదాపు పదివేల మంది పీటీఐ మద్దతుదారులను పోలీసులు అరెస్ట్ చేశారు. -
ఈసారి 33 విమానాలకు బెదిరింపులు
న్యూఢిల్లీ: దేశీయ విమానాలకు బాంబు బెదిరింపులు కొనసాగుతున్నాయి. శనివారం మరో 33 విమానాలకు ఈ హెచ్చరికలు అందాయని అధికారవర్గాలు తెలిపాయి. దీంతో, గత 13 రోజుల్లో 300కు పైగా విమానాలకు ఉత్తుత్తి బెదిరింపులు అందినట్లయింది. ఇండిగో, విస్తార, ఎయిరిండియాలకు చెందిన 11 చొప్పున విమానాలకు శనివారం సామాజిక మాధ్య మ వేదికల ద్వారానే చాలా వరకు బెదిరింపులు అందాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సామాజిక మాధ్యమ వేదికలకు అడ్వైజరీ జారీ చేసింది. బెదిరింపులు శాంతియుత వాతావరణానికి, దేశ భద్రతకు భంగం కలిగించడంతోపాటు దేశ ఆర్థిక భద్రతకు ముప్పుగా పరిణమించాయని ఆందోళన వ్యక్తం చేసింది. వీటి వల్ల విమాన ప్రయాణికులు, భద్రతా విభాగాలపై ప్రతికూల ప్రభావం చూపిందని, విమానయాన సంస్థలు తమ సాధారణ కార్యకలాపాలు కొనసాగించ లేకపోయాయని తెలిపింది. ఐటీ నిబంధనల మేరకు ఇటువంటి తప్పుడు సమాచారంపై ఓ కన్నేసి ఉంచాలని, కనిపించిన వెంటనే తొలగించడం లేదా నిలిపివేయాలని కోరింది. భారత సార్వ¿ౌమత్వం, భద్రత, సమగ్రత, ఐక్యతలకు భంగం కలిగించే చర్యలపై ప్రభుత్వానికి సమాచారం అందించడం తప్పనిసరని స్పష్టం చేసింది. ఆయా మాధ్యమ వ్యవస్థలు తమ నియంత్రణ లేదా ఆ«దీనంలో సమాచారాన్ని సాధ్యమైనంత త్వరగా లేదా 72 గంటల్లోగా అందించడంతోపాటు సంబంధిత దర్యాప్తు సంస్థలకు విచారణలో సహకరించాల్సి ఉంటుందని గుర్తు చేసింది. ఏ యూజర్ అయినా చట్ట విరుద్ధమైన లేదా తప్పుడు సమాచారం ప్రచురణ, ప్రసారం, ప్రదర్శించడం, అప్లోడ్, స్టోర్, అప్డేట్, షేర్ వంటివాటిని అడ్డుకునేందుకు తగు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత సామాజిక మాధ్యమ వేదికలదేనని పేర్కొంది. ఉల్లంఘించిన వారిపై ఐటీ చట్టం, భారతీయ న్యాయ సంహిత–2023 ప్రకారం చర్యలుంటాయని తెలిపింది. విషయ తీవ్రత దృష్యా్ట ఈ అడ్వైజరీ జారీ చేస్తున్నట్లు ఎల్రక్టానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ తెలిపింది. విమానయాన సంస్థలకు అందుతున్న ఉత్తుత్తి బెదిరింపులకు సంబంధించిన సమాచారాన్ని అందజేయాలంటూ రెండు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం మెటా, ఎక్స్ వంటి సామాజిక మాధ్యమ వేదికలను కోరడం తెలిసిందే. -
బాంబు బెదిరింపులు.. సోషల్ మీడియాపై కేంద్రం సీరియస్
న్యూఢిల్లీ: ఇటీవల దేశీయ విమానాలతోపాటు అంతర్జాతీయ విమానాలకు నకిలీ బాంబు బెదిరింపులు భారీగా పెరిగాయి. గత 10 రోజుల్లోనే 250కి పైగా భారతీయ విమానాలకు బాంబు బెదిరింపులు రావడం సంచలనంగా మారింది. బెదిరింపులు విమానయాలన సంస్థలకు పెద్ద తలనొప్పిగా మారాయి. ఎయిర్ ఇండియా, ఇండిగో, విస్తారా, స్పైస్ జెట్, ఆకాశ ఎయిర్ లైన్లకు వరుసగా బెదిరింపులు రావడంతో కేంద్రం ఈ అంశంపై దృష్టి సారించింది.ఈ క్రమంలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్పై కేంద్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి బెదిరింపుల వల్ల ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని, తప్పుడు వార్తలు వ్యాప్తి చెందకుండా తగిన చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ శనివారం ఆదేశించింది. కేంద్రం ఆదేశాలను ధిక్కరించినట్లయితే థర్డ్ పార్టీ కంటెంట్ను ఆయా ప్లాట్ఫామ్లు తీసుకునే వెసులుబాటును నిలిపివేస్తామని స్పష్టం చేసింది.నకిలీ బెదిరింపుల వల్ల విమాన సర్వీసులు ఆలస్యం అవ్వడం నిలిచిపోవడం జరుగుతున్నాయని తెలిపింది. ఆకతాయిలు పెట్టే ఫేక్ బెదిరింపు మెసేజ్లను ఎప్పటికప్పుడు గుర్తించి, తొలగించేందుకు చర్యలు చేపట్టాలని పేర్కొంది. ఫేక్ బెదిరింపు మెసేజ్లను ఎప్పటికప్పుడు తొలగించడంలో విఫలమయ్యే సోషల్ మీడియా కంపెనీలను బాధ్యులుగా పరిగణించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది. -
ఇజ్రాయెల్లోని భారతీయులకు అలర్ట్.. అడ్వైజరీ జారీ
టెల్అవీవ్: ఇరాన్ మిసైల్ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్లో ఉన్న భారతీయులను అక్కడి భారత రాయబార కార్యాలయం హెచ్చరించింది. దాడుల నేపథ్యంలో భారతపౌరులు జాగ్రత్తగా ఉండాలని, అనవసర ప్రయాణాలు చేయవద్దని సూచించింది.ఇజ్రాయెల్ అధికార యంత్రాంగం సూచించించిన భద్రతా చర్యలన్నీ పాటించాలని కోరింది. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామని తెలిపింది. మరోపక్క లెబనాన్లోని హెజ్బొల్లా గ్రూపుపై ఇజ్రాయెల్ దాడులు తీవ్రం చేయడంతో అక్కడ నివసిస్తున్న పౌరులకు కూడా ఇటీవల భారత ఎంబసీ అడ్వైజరీ జారీ చేసింది. ఇదీ చదవండి: ఇజ్రాయెల్పై ఇరాన్ భారీ దాడులు -
అసోం మెడికల్ కాలేజీ వివాదాస్పద అడ్వైజరీ రద్దు
గువాహటి: పశ్చిమ బెంగాల్లో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. ఈ నేపథ్యంలో అసోంలోని సిల్చార్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ జారీ చేసిన అడ్వైజరీ(సూచనలు)పై తీవ్రంగా విమర్శలు వ్యక్తం అయ్యారు. దీంతో సదరు ఆస్పత్రి జారీ చేసిన సూచనల అడ్వైజరీని రద్దు చేసినట్లు ప్రకటించింది.ఆస్పత్రి విడుదల చేసిన అడ్వైజరీలో.. ‘మహిళా డాక్టర్లు, విద్యార్థినులు, సిబ్బంది నిర్మానుష్య ప్రాంతాలు, వెలుతురు తక్కువగా, జనాలు లేని ప్రాంతాలకు దూరంగా ఉండాలి. ఒంటరిగా ఉండకుండా చూసుకోవాలి. అత్యంత అవసరమైతే తప్ప రాత్రి సమయాల్లో హాస్టల్స్ విడిచి బయటకు వెళ్లవద్దు. ఒకవేళ వెళ్లాల్సిన పరిస్థితి వస్తే.. అధికారులకు సమాచారం అందించాలి. అనుమానాస్పద వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. మర్యాదపూర్వకంగా మాట్లాడండి. ఏదైనా వేధింపుల సమస్య ఎదురైతే.. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించండి’’ అని పేర్కొంది. ఈ అడ్వైజరీని డాక్టర్లు, విద్యార్థులు తీవ్రగా వ్యతిరేకించారు. అడ్వైజరీలో వాడిన పదజాలం తమను బాధించిదని కాలేజీలోని జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ తెలిపింది.తమను రూంలకే పరిమితం కావాలని చెప్పే బదులు భద్రతా ఏర్పాట్లు మెరుగుపర్చాలని డిమాండ్ చేశారు. క్యాంపస్లో లైటింగ్తో పాటు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా తమను బాధించిన అడ్వైజరీని సైతం వెనక్కి తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. మొదట ఆస్పత్రిలో మహిళా సిబ్బంది ప్రయోజనాలను దృష్టిలో పెట్టకొని ఈ అడ్వైజరీ జారీ చేసినట్లు తెలిపినా.. విద్యార్థుల విమర్శల ఒత్తిడితో వెనక్కి తీసుకున్నట్లు సిల్చార్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ప్రకటించింది. మరోవైపు.. కోల్కతాలో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన నేపథ్యంలో జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ).. దేశవ్యాప్తంగా అన్ని వైద్య కళాశాలలు, హాస్టల్స్లో ఉండేవారి భద్రత కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని వైద్య కళాశాలలకు అడ్వయిజరీ జారీ చేసిన విషయం తెలిసిందే. -
యూకే వెళ్లాలనుకునే భారతీయులకు కేంద్రం అడ్వైజరీ
బ్రిటన్లోని భారతీయులను కేంద్రం అప్రమత్తం చేసింది. ఇటీవల యూకేలో నెలకొన్న నిరసనలు హింసాత్మకంగా మారిన నేపథ్యంలో బ్రిటన్ వెళ్లాలనుకునే వారు అప్రమత్తంగా ఉండాలని భారత పౌరులకు సూచించింది. ఈ మేరకు లండన్లోని భారత హైకమిషన్ మంగళవారం భారతీయులకు ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది.‘యూకేలోని పలు ప్రాంతాల్లో ఇటీవల జరిగిన అల్లర్ల గురించి భారత ప్రయాణికులకు తెలిసే ఉంటుంది. లండన్లోని భారత హైకమిషన్ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోంది. భారత్ నుంచి యూకేకు వచ్చే సందర్శకులు అప్రమత్తంగా ఉండాలి. అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. స్థానిక భద్రతా సంస్థలు, మీడియా సంస్థలు జారీ చేసే సూచనలను అనుసరించాలి. నిరసనలు జరుగుతున్న ప్రాంతాలకు దూరంగా ఉండటం మంచిది’ అని పేర్కొంది. మీ వ్యక్తిగత భద్రత కోసం నిరసనలు జరుగుతున్న ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచించింది.Advisory for Indian Citizens visiting the UK.@VDoraiswami @sujitjoyghosh @MEAIndia pic.twitter.com/i2iwQ7E3Og— India in the UK (@HCI_London) August 6, 2024కాగా వలస వ్యతిరేక గ్రూప్లు బ్రిటన్లోని పలు నగరాలు, పట్టణాల్లో నిరసనలు చేపట్టాయి. ఇవి దేశమంతా విస్తరించిన క్రమంలో హింసాత్మకంగా మారాయి. గతవారం ఓ డ్యాన్స్ క్లాస్లో చిన్నారులపై దుండగులు కత్తితో దాడి చేశారు. ఈ ఘటనలో ముగ్గురు పిల్లలు మృతి చెందారు. దేశవ్యాప్త ఆందోళనలకు కారణమైన ఈ ఘటన మెల్లమెల్లగా వలస వ్యతిరేక నిరసనలకు దారి తీసింది. పలు నగరాల్లో నిరసనకారులు, పోలీసుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఆందోళనకారులు రాళ్లు రువ్వడం, బాణసంచా కాల్చి విసరడం, శరణార్థులకు ఆశ్రయం కల్పిస్తున్న హోటల్స్పై దాడి వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఆందోళనకారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధాని కీర్ స్మార్టర్ అధికారులను ఆదేశించారు. -
లెబనాన్లో యుద్ధమేఘాలు.. పౌరులకు భారత్ అడ్వైజరీ
న్యూఢిల్లీ: గాజాకు పరిమితమైన ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం తాజాగా లెబనాన్కూ పాకే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇజ్రాయెల్పై లెబనాన్ కేంద్రంగా పనిచేసే ఉగ్రవాద సంస్థ హెజ్బొల్లా దాడి చేయడమే ఇందుకు కారణం. హెజ్బొల్లా దాడికి ప్రతిగా లెబనాన్పై ఏ క్షణమైనా ఇజ్రాయెల్ దాడి చేయవచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి. లెబనాన్లోని బీరుట్ ఎయిర్పోర్టుకు విమానాల రాకపోకలు దాదాపుగా నిలిచిపోయాయి. ఈ పరిణామాలతో లెబనాన్లోని భారత రాయబారకార్యాలయం అప్రమత్తమైంది. లెబనాన్లో ఉంటున్న భారతీయులు జాగ్రత్తగా ఉండాలని బీరుట్లోని తమ కార్యాలయంతో టచ్లో ఉండాలని తాజా అడ్వైజరీ జారీ చేసింది. పాలస్తీనాలోని గాజాపై ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరే వాతావరణం ఏర్పడ్డ ప్రస్తుత పరిస్థితుల్లో ఇజ్రాయెల్లోని మజదల్ షమ్స్పై హెజ్బొల్లా దాడి చేసింది. ఈ దాడిలో ఓ 12 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం ఇజ్రాయెల్ ఆగ్రహానికి కారణమైంది. ప్రతిగా ఇజ్రాయెల్ లెబనాన్పై సోమవారం(జులై 29) డ్రోన్లతో దాడి మొదలుపెట్టింది. ఈ ఘటనలో ఇద్దరు చనిపోయినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. -
భారత్లోని ఆ ప్రాంతాలకు వెళ్లొద్దు: అమెరికా
వాషింగ్టన్: భారత్లో ఉగ్రవాదుల కదలికలు అధికంగా కలిగిన మణిపూర్, జమ్ముకశ్మీర్, భారత్-పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాలు, దేశంలోని మధ్య, తూర్పు ప్రాంతాలకు వెళ్లవద్దని అమెరికా తమ దేశ పౌరులకు సూచించింది.అమెరికా తాజాగా భారతదేశంలో పర్యటించే తమ దేశపౌరులకు పలు సలహాలు అందజేసింది. వీటిలో ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన సమాచారాన్ని నవీకరించినట్లు యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ తెలిపింది. నేరాలు, ఉగ్రవాదం, నక్సలిజం కారణంగా, భారతదేశంలో మరింత జాగ్రత్తగా ఉండాలంటూ ఆమెరికా సలహా ఇచ్చింది. కొన్ని ప్రాంతాల్లో ఉగ్రవాద ముప్పు పెరిగిందని పేర్కొంది. ఈశాన్య రాష్ట్రాల్లో ఉగ్రవాదం, హింసాయుత పరిస్థితులు నెలకొన్న కారణంగా అక్కడికు వెళ్లాలనుకునేముందు అమెరికన్లు పునరాలోచించాలని సూచించింది.భారతదేశంలో వేగంగా పెరుగుతున్న నేరాలలో అత్యాచారం ఒకటని అమెరికా ట్రావెల్ అడ్వైజరీ పేర్కొంది. పర్యాటక ప్రాంతాలు, ఇతర ప్రదేశాలలో లైంగిక వేధింపుల వంటి హింసాత్మక నేరాలు జరుగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఉగ్రవాదులు ఎప్పుడైనా దాడి చేయవచ్చు. వారు పర్యాటక ప్రదేశాలు, రవాణా కేంద్రాలు, మార్కెట్లు, షాపింగ్ మాల్స్, ప్రభుత్వ సంస్థలను లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోందని వివరించింది. -
జికా వైరస్ కలకలం.. రాష్ట్రాలకు కేంద్రం సూచనలు
మహారాష్ట్రలో జికా వైరస్ కేసులో ఆందోళన రేపుతున్నాయి. పుణెలో ఇప్పటి వరకు ఆరు కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ సోకిన వారిలో ఇద్దరు గర్బిణీలు కూడా ఉన్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మహారాష్ట్రలో జికా వైరస్ కేసుల పెరుగుల దృష్ట్యా అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలను జారీ చేసింది.గర్భిణీ స్త్రీలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలను కోరింది. నిరంతరం వైరస్ పరీక్షలు నిర్వహించాలని తెలిపింది. జికా వైరస్ పాజిటివ్గా పరీక్షించిన తల్లుల పిండాల పెరుగుదలను పర్యవేక్షించడం ద్వారా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కోరింది.బాధిత గర్భిణీ స్త్రీ పిండంలో జికా మైక్రోసెఫాలీ నాడీ సంబంధిత పరిణామాలతో సంబంధం కలిగి ఉన్నందున, పర్యవేక్షణ కోసం వైద్యులను అప్రమత్తం చేయాలని సూచించింది. ఇంటి ఆవరణలో ఏడిస్ దోమలు లేకుండా చూసేందుకు నోడల్ అధికారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని సూచించింది. నివాస ప్రాంతాలు, కార్యాలయాలు, పాఠశాలలు, నిర్మాణ స్థలాలు, సంస్థలు, ఆరోగ్య సౌకర్యాల్లో కీటకాలు లేకుండా నిఘా పెంచాలని, నియంత్రణ కార్యకలాపాలను తీవ్రతరం చేయాలని రాష్ట్రాలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశించింది.ప్రజల్లో భయాందోళనలను తగ్గించడానికి సోషల్ మీడియా, ఇతర ఫ్లాట్ఫారమ్లలో ముందు జాగ్రత్తగా సందేశాలు పంపి అవగాహన కల్పించాలని రాష్ట్రాలు కోరింది. కాగా జులై 1న పూణెలో ఇద్దరు గర్భిణులు సహా ఆరుగురికి జికా వైరస్ పాజిటివ్ తేలిన విషయం తెలిసిందే. అరంద్వానే ప్రాంతంలో నాలుగు, ముండ్వా ప్రాంతంలో రెండు కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.జికా వైరస్ సోకిన ఆడ ఎడిస్ దోమ కుట్టడం వల్ల వ్యాధి సంక్రమిస్తుంది. ఈ వైరస్ను తొలిసారి 1947లో ఉగాండా అడవుల్లోని ఓ కోతిలో గుర్తించారు. ఆ తర్వాత ఆఫ్రికన్ దేశాలతోసహా భారత్, ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్, థాయ్లాండ్, వియత్నాం లాంటి ఆసియా దేశాలకూ ఈ వ్యాధి వ్యాప్తి చెందింది. ఈ వైరస్ సోకినవారిలో జ్వరం, చర్మంపై దద్దుర్లు, కండరాలు, కీళ్ల నొప్పులు, తలనొప్పి, జీర్ణకోశ సంబంధ సమస్యలు, గొంతు నొప్పి, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయి. -
Kenya: భారతీయులకు అలర్ట్
న్యూఢిల్లీ: భారతీయ విదేశాంగ మంత్రిత్వశాఖ కెన్యాలో ఉంటున్న భారతీయులకు అలర్ట్జారీ చేసింది. పన్నుల పెంపును నిరసిస్తూ అక్కడ దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అప్రమత్తంగా ఉండాలని మార్గదర్శకాలు విడుదల చేసింది.‘‘ప్రస్తుతం కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా.. కెన్యాలోని భారతీయులందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా ప్రయాణాలు చేయొద్దు. పరిస్థితి సద్దుమణిగే వరకు.. నిరసనలు కొనసాగుతున్న ప్రాంతాలకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి. హింసాత్మక ఘటనలు చెలరేగుతున్న ప్రాంతాల వైపు వెళ్లొద్దు’’ అని కెన్యాలోని భారతీయ దౌత్య కార్యాలయం ఎక్స్ ద్వారా సూచించింది. మరింత సమాచారం కోసం స్థానిక వార్త ఛానెల్స్ను, అలాగే.. దౌత్య సంబంధిత వెబ్సైట్ను గమనిస్తూ ఉండాలని సూచించింది.ADVISORY FOR INDIAN NATIONALS IN KENYA In view of the prevailing tense situation, all Indians in Kenya are advised to exercise utmost caution, restrict non-essential movement and avoid the areas affected by the protests and violence till the situation clears up.— India in Kenya (@IndiainKenya) June 25, 2024ఇదిలా ఉంటే.. కెన్యాలో పన్నుల పెంపు చట్టానికి ఆ దేశ పార్లమెంట్ మంగళవారం ఆమోదం తెలిపింది. సరిగ్గా అదే సమయంలోనే పార్లమెంట్ భవనం బయట నిరసనలు కొనసాగాయి. ‘‘కెన్యా ఇంకా వలస పాలనలోనే మగ్గిపోతోందని.. తమ దేశాన్ని తాము రక్షించుకుని తీరతామని’’ నినాదాలు చేస్తూ వేల మంది యువత ఒక్కసారిగా చట్టసభలోకి చొచ్చుకుపోయే ప్రయత్నం చేశారు. పార్లమెంటు ప్రాంగణంలో ఉన్న భవనంలోని కుర్చీలు, బల్లలు, తలుపులు, అద్దాలను ధ్వంసం చేసి నిప్పంటించారు. ఈ క్రమంలో ఆందోళనకారుల్ని అదుపు చేసేందుకు భద్రతా సిబ్బంది కాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో ఐదుగురు మృతి చెందగా, 20 మంది దాకా గాయపడ్డారని ఓ ప్రముఖ వార్తా సంస్థ కథనం ఇచ్చింది. అయితే ఈ సంఖ్యే ఇంకా ఎక్కువే ఉంటుందని సమాచారం.ఆందోళనలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సోదరి, కెన్యా ఉద్యమకారిణి అవుమా ఒబామా కూడా ఉన్నారు. టియర్గ్యాస్ దాడిలో ఆమె సైతం అస్వస్థతకు లోనైనట్లు సమాచారం. ఏమిటీ బిల్లు..కెన్యాలో ప్రతిపాదిత పన్ను సంస్కరణలకు మొదటి నుంచే వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. పన్ను సంస్కరణల పేరుతో బ్యాంకు ఖాతాల నగదు లావాదేవీలపై, డిజిటల్ మనీ చెల్లింపులపై, వంట నూనెలపై, ఉద్యోగుల వేతనాలపై, మోటారు వాహనాలపై పన్నులను పెంచుతూ కెన్యా ప్రభుత్వం మనీ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టింది. అయితే ఆ బిల్లును ఆమోదించవద్దని చట్టసభ్యుల్ని కోరుతూ నిరసనకారులు పార్లమెంటును చుట్టుముట్టారు. ఈ ఆందోళనలు ఇప్పుడు ఉధృత రూపం దాల్చి.. దేశమంతటా విస్తరించాయి. -
కిర్గిజిస్తాన్లో ఘర్షణ: భారతీ విద్యార్థులకు కేంద్రం అలెర్ట్
ఢిల్లీ: కిర్గిజిస్తాన్ దేశంలో విదేశీ విద్యార్థులపై చోటు చేసుకున్న దాడుల నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. కిర్గిజిస్తాన్ రాజధాని నగరం బిష్కెక్లో విదేశీ విద్యార్థులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో భారతీ విద్యార్థులు ఎవ్వరూ బయటకు రావద్దని అక్కడి భారతీయ ఎంబసీ ‘ఎక్స్’వేదికగా అడ్వైజరీ విడుదల చేసింది.‘కిర్గిజిస్తాన్ బిష్కెక్లోని భారతీయ విద్యార్థులతో టచ్లో ఉన్నాం. ప్రస్తుతం ఇక్కడి పరిస్థితి కొంతమేరకు అదుపులోకి వచ్చింది. విద్యార్థులు ఎంబీసీ అధికారులతో టచ్లో ఉండాలని సూచిస్తున్నాం. 24 గంటలు అందుబాటులో ఉంటాం. ఎదైనా సమస్య వస్తే.. 0555710041 నంబర్ను సంప్రదించండి’ అని పేర్కొంది.Monitoring the welfare of Indian students in Bishkek. Situation is reportedly calm now. Strongly advise students to stay in regular touch with the Embassy. https://t.co/xjwjFotfeR— Dr. S. Jaishankar (Modi Ka Parivar) (@DrSJaishankar) May 18, 2024విదేశీ విర్థులపై దాడుల నేపథ్యంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ భారతీయ విద్యార్థులను అప్రమత్తం చేశారు. ‘కిర్గిజిస్తాన్ బిష్కెక్లోని భారతీయ విద్యార్థుల పరిస్థితిని భారతీయ ఎంబీసీ ఎప్పటికప్పుడు కనుకుంటోంది. అక్కడి పరిస్థితి ప్రసుతం సద్దుమణిగింది. విద్యార్థులు ఎవరూ బయటకు రావోద్దు’ అని ‘ఎక్స్’ వేదికగా సూచించారు.మే 13న కిర్గిజిస్తాన్, ఈజిప్ట్ దేశాల విద్యార్థుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణకు సంబంధించిన వీడియోలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఇక్కడి పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారినట్లు తెలుస్తోంది. ఇక.. మెడికల్ యూనివర్సిటీ హాస్టల్ వద్ద చెలరేగిన విద్యార్థుల హింసలో పాకిస్తాన్ను చెందిన పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. -
సొంత వాహనంలో చార్ధామ్ యాత్ర.. విధివిధానాలివే!
మే 10 నుంచి చార్ధామ్ యాత్ర ప్రారంభం కానుంది. ఈ నేపధ్యంలో యాత్రసాగించే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం పలు ఏర్పాట్లు చేస్తోంది. రవాణా శాఖ కూడా ప్రయాణికులకు పలు మార్గదర్శకాలు జారీచేసింది. వీటి ప్రకారం గ్రీన్ కార్డ్ లేని వాహనాలను యాత్రా మార్గంలో అనుమతించరు. అలాగే వాహనాల్లో సంగీతాన్ని ప్లే చేయడంపై నిషేధం విధించారు. దీంతో పాటు వాహనాల్లో ప్రథమ చికిత్స బాక్సు తప్పనిసరి చేశారు.తేలికపాటి వాహనాలకు గ్రీన్కార్డు రుసుముగా రూ.400, భారీ వాహనాలకు రూ.600గా నిర్ణయించారు. చార్ధామ్ యాత్రకు సంబంధించి గురువారం మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అన్ని శాఖల సన్నాహాలను ఉన్నతాధికారులు పరిశీలించనున్నారు. ఏప్రిల్ 10 నుంచి చార్ధామ్ యాత్రకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నాలుగు ధామ్లలో హెలికాప్టర్ సర్వీస్ కోసం బుకింగ్ కూడా కొనసాగుతోంది.ఈ ఏడాది చార్ధామ్ యాత్రపై భక్తుల్లో మరింత ఉత్సాహం నెలకొంది. ఇప్పటి వరకు 16.37 లక్షల మంది ప్రయాణికులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. హోటళ్లను కూడా ముందుగానే బుక్ చేసుకుంటున్నారు. ఈ పరిస్థితులను చూస్తుంటే ఈసారి చార్ధామ్ యాత్ర గత రికార్డులను బద్దలు కొడుతుందని రాష్ట్ర పర్యాటక, దేవాదాయ శాఖ మంత్రి సత్పాల్ మహరాజ్ ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని నాలుగు ధామ్లను దర్శించుకునేందుకు గత ఏడాది 56.31 లక్షల మంది భక్తులు వచ్చారని తెలిపారు. -
ఇరాన్-ఇజ్రాయెల్ హై టెన్షన్.. భారతీయులకు కేంద్రం అలర్ట్
న్యూఢిల్లీ: ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలకు వెళ్లవద్దని భారతీయులకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సూచించింది. ఈ మేరకు శుక్రవారం(ఏప్రిల్ 12) ఒక అడ్వైజరీ జారీ చేసింది. రానున్న 48 గంటల్లో ఇజ్రాయెల్పై ఇరాన్ ఏ క్షణాన్నైనా దాడి చేయొచ్చని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో భారత్ తన పౌరులను అలర్ట్ చేసింది. ఇరాన్, ఇజ్రాయెల్లో ఇప్పటికే ఉన్న భారతీయలు అక్కడున్న భారత రాయబార కార్యాలయాలను సంప్రదించాలని కోరింది. రెండు దేశాల్లో ఉన్న భారత పౌరులు తమ భద్రత పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతేనే బయట తిరగాలని సూచించింది. డజన్ల కొద్దీ క్రూయిజ్ మిసైళ్లు, వందల కొద్దీ డ్రోన్లతో ఇరాన్, ఇజ్రాయెల్పై విరుచుకుపడే అవకాశాలున్నాయని మీడియా కథనాలు వెలువడుతుండటం ప్రపంచవ్యాప్తంగా కలవరం రేపుతోంది. ఇటీవల సిరియాలోని ఇరాన్ కాన్సులేట్పై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఆ దేశ ఆర్మీ టాప్ కమాండర్తో పాటు మొత్తం ఏడుగురు అధికారులు మృతి చెందారు. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్పై దాడి చేయక తప్పదని ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ప్రకటించారు. అనవసర ప్రయాణాలు చేయవద్దని ఇప్పటికే ఇజ్రాయెల్లోని అమెరికన్ ఎంబసీ తన కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులను కోరింది. ఇదీ చదవండి.. ఇజ్రాయెల్కు టెన్షన్.. ఇరాన్ సంచలన ప్రకటన -
Election Commission: కులం, మతం, భాష పేరుతో ఓట్లడగొద్దు
సాక్షి, న్యూఢిల్లీ: కులం, మతం, భాష ప్రాతిపదికన ఓట్లు అడగవద్దని, ఇతర మతాల దేవుళ్లను, దేవతలను కించపరచరాదని పార్టీలకు, నేతలకు కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది. నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ శుక్రవారం అడ్వైజరీ విడుదల చేసింది. గతంలో నియమావళిని ఉల్లంఘించి నోటీసులందుకున్న స్టార్ క్యాంపెయినర్లు, అభ్యర్థులు మరోసారి తప్పిదానికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవంది. ప్రచార సమయంలో మర్యాదలు, సంయమనం పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రత్యర్థులను కించపరిచడం, అవమానించడం, సదరు పోస్ట్లను సోషల్ మీడియాలో షేర్ చేయడం కూడదని పేర్కొంది. విద్వేషానికి వ్యాఖ్యలకు పార్టీలు దూరంగా ఉండాలని కోరింది. ‘‘స్టార్ క్యాంపెయినర్లు, అభ్యర్థులు నియమావళిని ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉల్లంఘించరాదు. వీటిని నిశితంగా పరిశీలిస్తుంటాం. సమాజంలో వర్గ విభేదాలను, శత్రుత్వాన్ని పెంచే మాటలు, చర్యలకు దూరంగా ఉండాలి. ఓటర్లను తప్పుదోవ పట్టించే లక్ష్యంతో తప్పుడు ప్రకటనలు లేదా నిరాధార ఆరోపణలను ప్రచారం చేయవద్దు. వ్యక్తిగత దాడులకు దూరంగా ఉండాలి. దేవాలయం, మసీదు, చర్చి, గురుద్వారా లేదా మరే ఇతర ప్రార్థనా స్థలాలను ఎన్నికల ప్రచారానికి ఉపయోగించరాదు’’ అని స్పష్టం చేసింది. మహిళల గౌరవం, గౌరవానికి భంగం కలిగించే ఎటువంటి చర్యలు లేదా ప్రకటనలను నివారించాలని ఈసీ కోరింది. సోషల్ మీడియాలో సంయమనం పాటించాలని, ప్రత్యర్థుల ప్రతిష్టకు భంగం కలిగించేలా పోస్ట్లను షేర్ చేయడం మానుకోవాలని పేర్కొంది. శుక్రవారం లఖ్నవూలో ఎన్నికల కాఫీ టేబుల్ బుక్ విడుదల చేస్తున్న సీఈసీ రాజీవ్ కుమార్ -
రష్యాలోని భారతీయులకు కేంద్రం కీలక సూచన
న్యూఢిల్లీ: రష్యాలోని భారతీయులు రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి దూరంగా ఉండాలని కేంద్ర విదేశాంగశాఖ సూచించింది. ఈ మేరకు ఒక అడ్వైజరీని జారీ చేసింది. ఈ విషయమై శుక్రవారం విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. కొందరు భారతీయులు రష్యాలో సైనికులకు సహాయకులుగా ఉండేందుకు అంగీకరిస్తూ కాంట్రాక్టులపై తెలియక సంతకాలు చేశారని జైస్వాల్ చెప్పారు. తాము ఈ విషయమై రష్యా ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. రష్యాలో ఆర్మీ హెల్పర్లుగా పనిచేస్తున్న భారతీయులను విడుదల చేయించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నారు. కాగా, ఇప్పటికే ఎంఐఎం చీఫ్,ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా ఈ అంశాన్ని ఇప్పటికే విదేశీ వ్యవహారాల శాఖ దృష్టికి తీసుకొచ్చారు. భారత్ నుంచి మొత్తం 12 మంది యువకులు దళారుల మాటలు విని మోసపోయి రష్యాకు వెళ్లారని తెలిపారు. వీరిలో తెలంగాణ వాసులు ఇద్దరు ఉన్నట్లు తెలిపారు. మిగిలినవారు కర్ణాటక, గుజరాత్, కశ్మీర్, యూపీలకు చెందినవారన్నారు. రష్యాలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ వీరందరినీ ఏజెంట్లు మోసం చేశారని ఆరోపించారు. బాధిత కుటుంబాలు తనకు మొరపెట్టుకోవడంతో విదేశాంగశాఖ మంత్రి జైశంకర్తో పాటు రష్యాలో భారత రాయబారికి కూడా లేఖలు రాశానన్నారు. ప్రభుత్వం చొరవ చూపి వారిని స్వస్థలాలకు తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇదీ చదవండి.. ప్రధాని మోదీపై గూగుల్ జెమిని వివాదాస్పద సమాధానం -
ఐటీ శాఖ పంపింది నోటీసా.. సమాచారమా?
Income tax department: మీరు ట్యాక్స్ పేయరా..? ఐటీ రిటర్న్స్ దాఖలు చేశారా? అయితే ఆదాయపు పన్ను శాఖ నుంచి మీకేదైనా సమాచారం వచ్చిందా..? వస్తే అది నోటీసా లేక సమాచారమా? ఐటీ శాఖ ఏం చెప్పింది? పన్ను చెల్లింపుదారులు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ (ITR)లో వెల్లడించిన వివరాలు, రిపోర్టింగ్ ఎంటిటీల నుంచి అందిన సమాచారం మధ్య అసమతుల్యతపై ఆదాయపు పన్ను శాఖ కొంతమంది ట్యాక్స్ పేయర్స్కు సమాచారం పంపింది. రిపోర్టింగ్ ఎంటిటీలు అంటే ఐటీ శాఖ సమాచారం తీసుకునే బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, స్టాక్ మార్కెట్ సంస్థలు, మ్యూచువల్ ఫండ్లు, ప్రాపర్టీ రిజిస్ట్రార్లతో సహా పలు ఏజెన్సీలు. "ఇది పన్ను చెల్లింపుదారులందరికీ పంపిన నోటీసు కాదు. ఐటీఆర్లో వెల్లడించిన వివరాలు, రిపోర్టింగ్ ఎంటిటీ నుంచి అందిన సమాచారం మధ్య స్పష్టమైన అసమతుల్యత ఉన్న సందర్భాల్లో మాత్రమే పంపిన సలహా" అని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ‘ఎక్స్’ (ట్విటర్)లో పేర్కొంది. ఇదీ చదవండి: ట్యాక్స్ పేయర్స్కు అలర్ట్.. 2024-25 ఐటీఆర్ ఫారాలు విడుదల ఐటీ శాఖ కంప్లయన్స్ పోర్టల్లో తమ అభిప్రాయాన్ని అందించడానికి, అవసరమైతే ఇప్పటికే దాఖలు చేసిన రిటర్న్లను సవరించడం లేదా ఇప్పటివరకు దాఖలు చేయకపోతే రిటర్న్స్ దాఖలు చేయడానికి పన్ను చెల్లింపుదారులకు అవకాశం కల్పించడమే ఈ సమాచారం లక్ష్యమని ఆదాయపు పన్ను శాఖ వివరించింది. ఇది అందినవారు ప్రాధాన్యతగా తీసుకుని ప్రతిస్పందించాలని అభ్యర్థించింది. Some references have come to the notice of the Income Tax Department regarding recent communication sent to taxpayers pertaining to transaction(s) made by them. Taxpayers may pl note that such communication is to facilitate the taxpayers & make them aware of the information… — Income Tax India (@IncomeTaxIndia) December 26, 2023 -
Advisory: భారత్లో ఉన్న ఇజ్రాయెల్ పౌరులకు అలర్ట్
జెరూసలెం: భారత్లోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని ఇజ్రాయెల్ ప్రభుత్వం హెచ్చరించింది. పబ్లిక్ ప్లేసులకు, జనాలు ఎక్కువగా పాల్గొనే ఈవెంట్లకు వెళ్లొద్దని సూచించింది. ఈ మేరకు ఇజ్రాయెల్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ బుధవారం హిబ్రూ భాషలో ఒక అడ్వైజరీ జారీ చేసింది. ‘ఢిల్లీలోని దేశ ఎంబసీ ఆఫీసు వద్ద బాంబు పేలుడు సంభవించింది. భారత్లో ఉన్న పౌరులు ముఖ్యంగా రాజధాని ఢిల్లీలో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. మాల్లు,మార్కెట్లు లాంటి జనం ఎక్కువగా ఉండే పబ్లిక్ ప్రదేశాలకు వెళ్లొద్దు’ అని ఆ దేశ పౌరులకు ఇజ్రాయెల్ అడ్వైజరీ జారీ చేసింది. ఢిల్లీ ఎంబసీ వద్ద జరిగిన పేలుడు బహుశా దాడి అయి ఉండొచ్చని ఇజ్రాయెల్ అనుమానిస్తోంది. అయితే పేలుడులో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. పేలుడుపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఎంబసీ ఆఫీసు వెనకాల ఉన్న పృథ్వీరాజ్ రోడ్డులో మంగళవారం అత్యంత శబ్ద తీవ్రత కలిగిన బాణాసంచా పేలిందని అందుకే శబ్దం వచ్చిందని ప్రాథమిక విచారణలో తేలినట్లు సమాచారం. పాలస్తీనాపై ఇజ్రాయెల్ చేస్తున్న దురాగతాలు తమకు తెలుసని పేలుడు ప్రాంతంలో ఒక లేఖ దొరికినట్లు తెలుస్తోంది. ఇదీచదవండి..తీరానికి కొట్టుకొచ్చిన వింత మెటల్ షీట్లు -
‘మెఫ్తాల్’ ఔషధ రియాక్షన్లతో జాగ్రత్త
న్యూఢిల్లీ: నెలసరి, రుమటాయిడ్ ఆర్థరైటిస్ సందర్భాల్లో సాధారణంగా వినియోగించే మెఫ్తాల్ ఔషధానికి సంబంధించిన ప్రతికూల ప్రభావా(రియాక్షన్)లను గమనించి, అప్రమత్తమవ్వాలని ఆరోగ్యరంగ వృత్తి నిపుణులు, వ్యాధిగ్రస్తులకు కేంద్రం సూచించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నవంబర్ 30వ తేదీన ఒక అడ్వైజరీని జారీ చేసింది. సాధారణంగా రుమటాయిడ్ ఆర్థ్రరైటిస్, ఆస్టియో ఆర్ర్థరైటిస్, మహిళల్లో నెలసరి సమయంలో సంభవించే డిస్మెనోరోయియా, నొప్పి, వాపు, జ్వరం, దంతాల నొప్పి వంటి చికిత్సలో మెఫేనమిక్ యాసిడ్ పెయిన్ కిల్లర్ను వినియోగిస్తుంటారు. ఈ పెయిన్ కిల్లర్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఇండియన్ ఫార్మాకోపియా కమిషన్(ఐపీసీ) తాజాగా ఔషధ భద్రత హెచ్చరికను జారీ చేసింది. ఫార్మకోవిజిలెన్స్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇండియా(పీవీపీఐ) వారి డేటాబేస్ను ప్రాథమికంగా విశ్లేíÙంచగా కొత్త విషయాలు వెలుగుచూశాయి. ఈ ఔషధాన్ని వినియోగించిన సందర్భాల్లో ఇసినోఫిలియా, సిస్టెమిక్ సింప్టమ్స్(డ్రెస్) సిండ్రోమ్ వంటి డ్రగ్ రియాక్షన్లు కనిపించాయి. పెయిన్ కిల్లర్ను వాడిన సమయంలో ఏమైనా దుష్ప్రభావాలు కనబడితే వెంటనే పీవీపీఐ అధికారిక ఠీఠీఠీ. జీpఛి.జౌఠి.జీn వెబ్సైట్ లేదా హెల్ప్లైన్ నంబర్ 1800–180–3024ను సంప్రదించవచ్చు. -
రెచ్చగొట్టే ప్రసంగాలు చేయొద్దు.. సీఎం కేసీఆర్కు ఈసీ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో జరిగిన దాడి ఘటనపై స్పందిస్తూ ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ చేసిన ప్రసంగంపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. భిన్న కులమతాలు, వర్గాల ప్రజల మధ్య వైషమ్యాలు పెంపొందించే విధంగా ముఖ్యమంత్రి ప్రసంగం ఉందని, ఇది ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘననే అని స్పష్టం చేసింది. ఇకపై అలాంటి రెచ్చగొట్టే ప్రసంగాలు చేయరాదని హితవు పలికింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్యకార్యదర్శి అవినాష్ కుమార్ శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్కు అడ్వైజరీ జారీ చేశారు. కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడిపై స్పందిస్తూ గత నెల 30న నిజామాబాద్ జిల్లా బాన్స్వాడలో చేసిన ఎన్నికల ప్రసంగంలో కేసీఆర్ రెచ్చగొట్టేలా ప్రసంగించారంటూ యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయగా, ఈసీ విచారణకు ఆదేశించింది. స్థానిక రిటర్నింగ్ అధికారి విచారణ చేసి ఈ నెల 14న కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక పంపించారు. దీంతో ఇకపై రెచ్చగొట్టే ప్రసంగాలు చేయొద్దని ఈసీ అడ్వైజరీ జారీ చేసింది. చదవండి: తెలంగాణ రాజకీయాల్లో ‘డ్రామా’ లేదు: రాంగోపాల్వర్మ -
కాన్సులేట్ సేవలు నిలిపేసిన కెనడా
న్యూఢిల్లీ: ఖలిస్తానీ వేర్పాటువాది హర్ప్రీత్సింగ్ నిజ్జర్ హత్య విషయమై భారత్, కెనడా మధ్య నెలకొన్న విభేదాలు కొత్త మలుపు తిరుగుతున్నాయి. కెనడాలోని మన దౌత్యవేత్తలను ఆ దేశం బహిష్కరించడం, బదులుగా 41 మంది దౌత్యవేత్తలను దేశం వీడాల్సిందిగా కేంద్రం ఆదేశించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో చండీగఢ్, ముంబై, బెంగళూరుల్లోని కాన్సులేట్లలో ఇన్ పర్సన్ సేవలను నిలిపేయాలని కెనడా నిర్ణయించింది. విదేశాంగ మంత్రి మెలానీ జోలీ గురువారం ప్రకటించారు. 41 మంది దౌత్య సిబ్బందిని వెనక్కు పిలవాల్సి రావడంతో సిబ్బంది కొరత ఏర్పడ్డ కారణంగా ఈ చర్యకు దిగాల్సి వచి్చందని ఆమె చెప్పడం విశేషం. ప్రస్తుతం 21 మంది కెనడా దౌత్యవేత్తలు, వారి కుటుంబాలు మాత్రమే భారత్లో ఉన్నట్టు వివరించారు. భారత్లో థర్డ్ పార్టీ కాంట్రాక్టర్ల ద్వారా కొనసాగుతున్న 10 వీసా దరఖాస్తు కేంద్రాలపై తమ నిర్ణయం ప్రభావం పడబోదని తెలిపారు. ఇంతేకాకుండా, చండీగఢ్, ముంబై, బెంగళూరుల్లోని కాన్సులేట్లలో ఇన్ పర్సన్ సేవలను నిలిపేయడమే గాక, ఆ నగరాల్లో అత్యంత జాగ్రత్తగా ఉండాలంటూ కెనడా తాజాగా తమ పౌరులకు అడ్వైజరీ కూడా జారీ చేసింది. -
కెనడాలో నివసిస్తున్న భారత పౌరులకు కేంద్రం హెచ్చరిక
-
పాకిస్థాన్ నుంచి కాల్స్.. వాట్సాప్ యూజర్లకు ఇండియన్ ఆర్మీ హెచ్చరిక!
భారతదేశంలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్స్తో సహా చాలా మంది విద్యార్థులకు పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్ నుంచి కాల్స్, వాట్సాప్ మెసేజ్లు వస్తున్నాయి. ఇండియన్ ఆర్మీ వర్గాలను ఉటంకిస్తూ వచ్చిన నివేదికల ప్రకారం.. కొన్ని నంబర్ల నుంచి విద్యార్థులకు వస్తున్న కాల్స్, మెసేజ్లలో వారిని సోషల్ మీడియా గ్రూపులలో చేరాలని, సున్నితమైన సమాచారాన్ని పంచుకోవాలని కోరుతున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్నకు చెందిన గ్యాడ్జెట్స్ నౌ కథనం పేర్కొంది. ఇలా కాల్స్ చేస్తున్నవారు తమను పాఠశాల ఉపాధ్యాయులుగా చెప్పుకొంటూ కొత్త క్లాస్ గ్రూప్లలో చేరాలని విద్యార్థులను కోరుతున్నారు. ఈ నెపంలో వారికి ఓటీపీలను పంపుతున్నారు. తాము ఉపాధ్యాయులేనని నమ్మించేందుకు విద్యార్థులకు తెలిసిన వారి పేర్లు చెబుతున్నారు. ఈ అనుమానాస్పద కాల్స్, మెసేజ్లు వాట్సాప్ ద్వారానే వస్తున్నాయి. ఇలాంటి రెండు అనుమానాస్పద నంబర్లను అధికారులు గుర్తించారు. అవి 8617321715, 9622262167. ఈ కాల్స్ గురించి విద్యార్థులు, సిబ్బందిని ఆర్మీ పబ్లిక్ స్కూళ్ల ప్రిన్సిపాళ్లు హెచ్చరించారు. ఇదీ చదవండి ➤ వాషింగ్టన్ పోస్ట్ సీటీవోగా వినీత్ ఖోస్లా విద్యార్థులు గ్రూపుల్లో చేరిన తర్వాత వారి నుంచి సున్నితమైన సమాచారాన్ని సేకరిస్తున్నారు. విద్యార్థుల తండ్రి ఉద్యోగం, ఉపాధ్యాయుల పేర్లు, వారికి సంబంధించిన సమాచారం అడుగుతున్నారు. పాఠశాలలు, కళాశాలలు దీని గురించి ఉపాధ్యాయులు, విద్యార్థులను చైతన్యపరచాలని ఆర్మీ స్కూళ్ల అధికారులు కోరుతున్నారు. ఆ రెండు నంబర్ల నుంచే కాకుండా ఇతర నంబర్ల నుంచి కూడా కాల్స్, మెసేజ్లు రావచ్చని, అనుమానాస్పద కాల్స్ పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. -
కరోనా కాదు.. యాంటీబయాటిక్స్ వాడొద్దు!
కరోనా తర్వాత.. చాన్నాళ్లకు ఆ తరహా లక్షణాలు చాలామందిలో ఇప్పుడు కనిపిస్తున్నాయి. అయితే కరోనా కాదు.. కరోనా లాంటి లక్షణాలు మాత్రమే!. ఇన్ఫ్లూయెంజా లక్షణాలతో కేసులు దేశంలో విపరీతంగా నమోదు అవుతున్నాయి. గత రెండు నెలలుగా ఈ కేసులు దేశంలో దాదాపు అన్నిచోట్లా రికార్డు అయినట్లు కేంద్రం గణాంకాలను సేకరించింది. దగ్గు, జలుబుతో పాటు చాలాకాలంగా జ్వరం, ఒళ్లు నొప్పులు, తలనొప్పుల సమస్యతో బాధపడుతున్నారు చాలామంది. ఈ నేపథ్యంలో కేంద్రం పరిధిలోని వైద్య విభాగాలు కీలక మార్గదర్శకాలను విడుదల చేశాయి. దేశంలో గత కొన్నివారాలుగా జ్వరం, జలుబు, దగ్గు కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. కరోనా ఏమో అనే భయాందోళనతో చాలామంది యాంటీ బయాటిక్స్ను తెగ వాడేస్తున్నారు. అయితే అది శరీరానికి ఏమాత్రం మంచిది కాదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ హెచ్చరిస్తోంది. అది కరోనా కాదని.. ఇన్ఫ్లూయెంజా A సబ్టైప్ H3N2 వైరస్.. దేశంలో ప్రస్తుతం కేసుల పెరుగుదలకు కారణమని స్పష్టం చేసింది. H3N2 వైరస్ ఇతర ఉప రకాల కంటే ఎక్కువ ప్రభావం చూపెడుతుంది. ఆస్పత్రి పాలుజేస్తుంది. కానీ, ఏమాత్రం ప్రాణాంతకం కాదు. గత రెండు రెండు, మూడు నెలలుగా దేశంలో కేసులు అధికంగా నమోదు కావడానికి కారణం కూడా ఇదేనని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది. ► ఈ వైరస్ కారణంగా దగ్గు, జలుబు, జ్వరం.. లక్షణాలు ఉంటాయి. కొన్ని కేసుల్లో ఇవి దీర్ఘకాలికంగా కనిపిస్తాయి. వీటితో పాటు ఒళ్లు నొప్పులు, డయేరియా, వాంతులు తదితర లక్షణాలు కనిపిస్తాయి. ► ఈ లక్షణాలు తీవ్రంగా ఉంటాయి(అందుకే కరోనా అని కంగారు పడిపోతున్నారు). పేషెంట్లు కోలుకోవడానికి కొంచెం టైం పడుతుంది. ► వాయు కాలుష్యం కూడా ఇది త్వరగతిన వ్యాపించడానికి ఒక కారణం. ► ఇదేం ప్రాణాంతకం కాదు. కానీ, ఆస్పత్రి పాలుజేస్తుంది. కొందరిలో మాత్రం శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఇబ్బందిపెడుతుంది. ► ఐసీఎంఆర్తో పాటు ఇండియన్ మెడికల్ అసోషియేషన్(ఐఎంఆర్) కూడా పలు కీలక సూచనలు చేస్తోంది. ► మరోవైపు, దేశవ్యాప్తంగా దగ్గు, జలుబు, వికారం కేసులు పెరుగుతున్న నేపథ్యంలో యాంటీబయాటిక్స్ను ఇష్టానుసారం వాడకూడదని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ప్రజలను హెచ్చరిస్తోంది. ► యాంటీబయాటిక్స్ కాకుండా రోగలక్షణాలకు ఆధారంగా చికిత్సను అందించాలని, మందులను మాత్రమే సూచించాలని అసోసియేషన్ వైద్యులను కోరింది. ► కరోనా సమయంలో అజిత్రోమైసిన్, ఐవర్మెక్టిన్లను జనాలు ఇష్టానుసారం వాడారు. ఇది కూడా తీవ్ర ప్రభావం చూపెట్టింది. యాంటీబయాటిక్స్ సూచించే ముందు ఇన్ఫెక్షన్ అనేది బాక్టీరియల్ అవునా? కాదా? అని నిర్ధారించుకోవడం కూడా అవసరం అని ఐఎంఏ ఒక ప్రకటనలో తెలిపింది. లక్షణాలు గనుక కనిపిస్తే.. చేతులు శుభ్రంగా కడుగుతూ ఉండాలి. ముఖానికి మాస్క్ ధరించడం, గుంపులోకి వెళ్లకపోవడం మంచిది. ముక్కు, నోరును చేతులతో ముట్టుకోకుండా ఉండేందుకు ప్రయత్నించండి. దగ్గు, తుమ్మేప్పుడు ముక్కు, నోరుకు ఏదైనా అడ్డుపెట్టుకోండి ఇవి చేయకుండా ఉండడం బెటర్ ఇతరులకు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం, బహిరంగంగా ఉమ్మేయడం, చీదిపడేయడం గుంపుగా కలిసి తినకుండా ఉండడం సొంత వైద్యం.. ఇది ఒక్కోసారి ప్రాణాల మీదకు కూడా తేవొచ్చు. కానీ, సంబంధిత వైద్యులను సంప్రదించాకే మందులు వాడాలి. ముఖ్యంగా యాంటీ బయాటిక్స్ విషయంలో.. Influenza A subtype H3N2 is the major cause of current respiratory illness. ICMR-DHR established pan respiratory virus surveillance across 30 VRDLs. Surveillance dashboard is accessible at https://t.co/Rx3eKefgFf@mansukhmandviya @DrBharatippawar @MoHFW_INDIA @DeptHealthRes pic.twitter.com/3ciCgsxFh0 — ICMR (@ICMRDELHI) March 3, 2023 Fever cases on rise - Avoid Antibiotics pic.twitter.com/WYvXX70iho — Indian Medical Association (@IMAIndiaOrg) March 3, 2023 -
నా కూతురి పెళ్లికి సీఎం జగన్ కానుక ఇచ్చారు : అలీ
-
టమాటో ఫ్లూపై కేంద్రం అలర్ట్.. రాష్ట్రాలకు కీలక సూచనలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో టమాటో ఫ్లూ వ్యాధి నాలుగు రాష్ట్రాలకు వ్యాపించింది. ఇప్పటివరకు కేరళ, తమిళనాడు, హర్యానా, ఒడిశాలో ఈ కేసులు వెలుగుచూశాయి. 100మందికిపైగా చిన్నారులు ఈ వ్యాధి బారినపడి ఉంటారని అంచనా. ఈ నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. వ్యాధిని నియంత్రించేందుకు రాష్ట్రాలకు కీలక సూచనలు చేసింది. ► హ్యాండ్, ఫుట్, మౌత్ డీసీజ్(హెచ్ఎఫ్ఎండీ) వ్యాధినే టమాటో ఫ్లూ అంటారు. ఇది 10 ఏళ్లలోపు చిన్నారులకు ఎక్కువగా వ్యాపిస్తుంది. పెద్దలకు కూడా వ్యాపించే అవకాశముంది. ► టమాటో ఫ్లూ వ్యాధి గురించి చిన్నారులకు అవగాహన కల్పించాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. దాని వల్ల కలిగే దుష్ప్రభావాలను కూడా వివరించాలని పేర్కొంది. ► టమాటో ఫ్లూ లక్షణాలు ఇతర వైరల్ ఇన్ఫెక్షన్లలాగే ఉంటాయి. ఈ వ్యాధి సోకిన చిన్నారుల్లో జ్వరం, అలసట, ఒంటి నొప్పులు, చర్మంపై దద్దుర్లు వంటి లక్షణాలు ఉంటాయి. ► టమాటో ఫ్లూకు కోవిడ్, మంకీపాక్స్, డెంగ్యూ, చికున్గున్యా వంటి వ్యాధులతో ఎలాంటి సంబంధం లేదు. ► అపరిశుభ్ర ఉపరితలాన్ని తాకడం, పండ్లు, వస్తువులను శుభ్రం చేయకుండా నేరుగా నోట్లో పెట్టుకోవడం వంటి కారణాలతో ఈ వ్యాధి సోకవచ్చు. ► టమాటో ఫ్లూ సోకిన, లక్షణాలు కన్పించిన చిన్నారులను ఐదు రోజుల పాటు ఐసోలేషన్లో ఉంచాలి. ► జ్వరం, దద్దుర్లు ఉన్న చిన్నారులు ఇతరులను తాకడం, కౌగిలించుకోవడం చేయవద్దని తల్లిదండ్రులు చెప్పాలి ► నోట్లో వేలు పెట్టుకునే అలవాటు ఉన్న పిల్లలకు దాన్ని మాన్పించాలి. ► ఎప్పుడూ వేడి నీటితోనే పిల్లలకు స్నానం చేయించాలి. పోషక పదార్థాలున్న ఆహారాన్నే ఇవ్వాలి. ► పిల్లలకు విశ్రాంతి, తగినంత నిద్ర ఉండేలా చూసుకోవాలి. చదవండి: దారుణం.. చావు ఇంట్లో నవ్వులు.. ఫ్యామిలీ ఫోటోపై ట్రోలింగ్.. -
సరికొత్త విధానంలో ట్రాఫిక్పై అవగాహన కార్యక్రమం
న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ఢిల్లీ పోలీసులు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. అయినా నిత్యం ఎక్కడో ఒకచోట ప్రమాదాలు జరుగుతూనే ఉంటున్నాయి. దీంతో పోలీసులు సరికొత్త విధానంలో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ మేరకు ఒక సోషల్ మీడియాలో ఒక వీడియోని పోస్ట్ చేశారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే వేగంగా ఒక కారు రహదారిపై వెళ్లిపోతూ ఉంటుంది. ఎవరతను నన్ను చూసి ఆగడం లేదంటూ కరీన కపూర్ ఐకానిక్ క్యారెక్టర్ రెడ్లైట్పై కనిపిస్తోంది. ఇది బాలీవుడ్ సినిమా కభీ ఖుషీ కభీ ఘమ్లో కరీనా కపూర్ పూ క్యేరెక్టర్ అది. ఆ సినిమాలో అతడెవరూ నన్ను చూసి తిరగలేదు అనే ప్రసిద్ధ డైలాగ్ . ఈ అవగాహన కార్యక్రమానికి సంబంధించిన వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతుంది. మీరు కూడా ఓ లుక్కేయండి. Who's that traffic violator? Poo likes attention, so do the traffic lights !#RoadSafety#SaturdayVibes pic.twitter.com/ZeCJfJigcb — Delhi Police (@DelhiPolice) July 16, 2022 (చదవండి: చెస్ బోర్డు మాదిరి బ్రిడ్జ్... ఎక్కడుందో తెలుసా!) -
మొదటి డోస్ తర్వాత కరోనా వస్తే.. వ్యాక్సిన్ ఎపుడు తీసుకోవాలి!
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా బారిన పడి కోలుకున్నవారు వ్యాక్సిన్ తీసుకోవడానికి సంబంధించి పలు అనుమానాలున్న తరుణంలో నిపుణుల కమిటీ కీలక సలహాలిచ్చింది. కరోనా నుంచి కోలుకున్నవారు ఆరు నెలలకు వ్యాక్సిన్ తీసుకోరాదని నిపుణుల ప్యానెల్ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అలాగే కోవిషీల్డ్ రెండు డోసుల మధ్య గ్యాప్ 12-16 వారాలకు పెంచాలని కేంద్రానికి జాతీయ సాంకేతిక సలహా బృందం కీలక సూచనలు చేసింది. నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ ఇటీవల నిర్వహించిన సమావేశంలో ఈ సిఫారసులు చేసినట్టు తెలుస్తోంది. అయితే దేశవ్యాప్తంగా వినియోగిస్తోన్న మరో టీకా కోవాగ్జిన్కు సంబంధించి డోసుల మధ్య అంతరంపై ఎలాంటి సూచనలు ఇవ్వలేదు. కోవాగ్జిన్ డోసుల్లో మార్పులేదని స్పష్టం చేసింది. కోవీషీల్డ్ టీకా డోసుల మధ్య వ్యవధిని గతంలోనే కేంద్రం పొడిగించిన సంగతి తెలిసిందే. కరోనా టీకా డోసుల మధ్య వ్యవధిని 28 రోజుల నుంచి 6-8వారాలకు పెంచుతూ మార్చిలో నిర్ణయం తీసుకుంది. గర్భిణి స్త్రీలు తాము ఏ వ్యాక్సిన్ వేసుకోవాలో నిర్ణయించుకోవచ్చని తాజాగా కమిటీ సూచించింది. డెలివరీ తర్వాత, పాలిచ్చే సమయంలో వ్యాక్సిన్ తీసు కోవచ్చునని పేర్కొంది. టీకా మొదటి మోతాదు తీసుకున్న తరువాత కోవిడ్ పాజిటివ్ వస్తే ..రెండవ డోసు తీసుకునేందుకు కోలుకున్న తరువాత నాలుగు నుండి ఎనిమిది వారాల వరకు వేచి ఉండాలని ప్యానెల్ సిఫారసు చేసినట్లు తెలిసింది. అలాగే, మోనోక్లోనల్ యాంటీబాడీస్ లేదా ప్లాస్మా తీసుకున్న కోవిడ్ బాధితులు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన మూడు నెలల వరకు టీకాను వాయిదా వేయాలి. హాస్పిటలైజేషన్ లేదా ఐసీయూలో చికిత్స లాంటి ఇతర తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న వారు కూడా తదుపరి టీకా తీసుకునే ముందు నాలుగు నుండి ఎనిమిది వారాల వరకు వేచి ఉండాలి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రస్తుత ప్రోటోకాల్ ప్రకారం, కోవిడ్ సంక్రమణ నుండి కోలుకున్న నాలుగు నుంచి ఎనిమిది వారాల తర్వాత ఈ టీకా తీసుకోవాలి. చదవండి : కరోనా: సీనియర్ వైద్యుల మూకుమ్మడి రాజీనామా రెండు రోజులుగా ఆకలితో.. అమ్మ, సోదరుడి శవాల పక్కనే -
మయన్మార్ సంక్షోభం : ఎంబసీ కీలక సూచనలు
సాక్షి, న్యూఢిల్లీ : మయన్మార్లో తలెత్తిన రాజకీయ సంక్షోభం నేపథ్యంలో భారత రాయబార కార్యాలయం కీలక ప్రకటన విడుదల చేసింది. ఇటీవలి పరిణామాల దృష్ట్యా, భారతీయ పౌరులందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు మంగళవారం ఒకప్రకటన విడుదల చేసింది. అత్యవసరమైతే తప్ప సాధ్యమైనంత వరకు ప్రయాణాలకు దూరంగా ఉండాలని, రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని వెల్లడించింది. (మయన్మార్లో ఎమర్జెన్సీ: బందీగా ఆంగ్ సాన్ సూకీ ) కాగా కొన్ని రోజులుగా అక్కడి ప్రభుత్వంతో విభేదిస్తున్న సైన్యం నిన్న (సోమవారం) మరోసారి తిరుగుబాటు చేసింది. నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ నాయకురాలు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆంగ్ సాన్ సూకీ సహా ఆ పార్టీ కీలక నేతలను అరెస్ట్ చేసింది. ఏడాదిపాటు ఎమర్జెన్సీ విధించింది. దేశం తమ పాలనలోకి వచ్చినట్టు ఆర్మీ ప్రకటించింది. ఈ ఉదంతాన్ని భారత్ సహా ప్రపంచంలోని పలు దేశాలు ఖండించిన సంగతి తెలిసిందే. (మిలటరీ గుప్పెట్లో మయన్మార్ ) -
కశ్మీర్లో ఆంక్షల ఎత్తివేత
శ్రీనగర్: పర్యాటకులపై విధించిన ఆంక్షలను జమ్మూకశ్మీర్ ప్రభుత్వం ఎత్తివేసింది. ఉగ్రవాద ప్రమాద నేపథ్యంలో పర్యాటకులంతా కశ్మీర్ నుంచి తక్షణమే వెళ్లిపోవాలంటూ ఆగస్ట్ 2న జారీ చేసిన హెచ్చరికను ఎత్తివేస్తున్నట్లు గవర్నర్ సత్యపాల్ మాలిక్ ప్రకటించారు. ఇది అక్టోబర్ 10 నుంచి అమల్లోకి వస్తుందన్నారు. జమ్మూకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేస్తూ ఆగస్ట్ 5న కేంద్రం నిర్ణయం తీసుకోవడానికి మూడు రోజుల ముందు ఈ ఆంక్షలను విధించారు. అక్టోబర్ 24న జరగాల్సిన బ్లాక్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఎన్నికలకు సంబంధించి నిర్ణయం తీసుకునేందుకు వీలుగా జైళ్లలో ఉన్న ఆయా పార్టీల నేతలను కలుసుకునేందుకు ఇతర నేతలకు అనుమతినిస్తున్నట్లు కూడా గవర్నర్ ప్రకటించారు. ప్రభుత్వ ఆంక్షల నేపథ్యంలో వరుసగా 65వ రోజు కశ్మీర్లోయలో జనజీవనం స్తంభించింది. మార్కెట్లు, ఇతర దుకాణాలు మూసివున్నాయి. ప్రజా రవాణా వ్యవస్థకు చెందిన వాహనాలు ఇంకా రోడ్డెక్కలేదు. ప్రైవేటు వాహనాలు, టాక్సీలు, ఆటోలు మాత్రమే తిరుగుతున్నాయి. కశ్మీర్లో లాండ్లైన్ టెలిఫోన్ సేవలను పునరుద్ధరించారు. చాలా ప్రాంతాల్లో ఇంకా సెల్ఫోన్ సర్వీసులు అందుబాటులోకి రాలేదు. కాగా, మాజీ సీఎంలు, ఎన్సీ అధ్యక్ష, ఉపాధ్యక్షులు ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా తదితర ప్రధాన పార్టీల నేతలను గృహ నిర్బంధం కొనసాగుతోంది. (చదవండి: కశ్మీర్ ప్రగతి ప్రస్థానం షురూ) -
రసాభాసగా తుంగభద్ర అడ్వైజరీ బోడు భేటీ
-
ముక్కుసూటిగా వెళుతున్నారా?
ముక్కుసూటిగా వెళ్లేవాడికి అన్నీ ఆటంకాలే ఎదురవుతాయి. లౌక్యం తెలుసుకుని అందరితో కలివిడిగా ఉంటే నలుగురు మెచ్చుతారు. అలా కాకుండా ‘ఎస్ నేనంటే నేనే’ అనుకుంటే ‘అబ్బ ఛ’ అని పక్కవారంటారు. నేను చెప్పిందే అందరూ వినాలంటే ‘అది జరగదులే’ అంటారు. ఈ ఆటిట్యూడ్ ఉన్నవారికి దాదాపుగా ప్రతి పనిలో ఆటంకాలు ఎదురవుతాయి. మీరూ ముక్కుసూటిగా వెళుతున్నారా? లేక ఒక పని చేసేముందు ఆలోచిస్తారా? ఎప్పుడూ చిర్రుబుర్రులాడుతూ లేని తంటాలు తెచ్చుకుంటుంటారా? ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. 1. మీ ప్రవర్తన మార్చుకోమని తల్లిదండ్రులతో పాటు శ్రేయోభిలాషులు చెప్తుంటారు. ఆ సమయంలో సరే అని చెప్పినా తర్వాత మీ పంథా ఎప్పటిలానే ఉంటుంది. ఎ. అవును బి. కాదు 2. మీకు మీరే గొప్పతనాన్ని ఆపాదించుకుంటారు. ఎ. అవును బి. కాదు 3. చిన్నతనం నుంచి ఎవరైనా పని చెప్తే మీకు నచ్చదు. సలహాలను పట్టించుకోరు. ముక్కుసూటిగా వెళ్లటం మీకు అలవాటు. ఎ. అవును బి. కాదు 4. మీ సూటితనం వల్ల మీ పనులు ఎక్కడివక్కడే ఆగిపోతుంటాయి. దీనివల్ల అసహనం, కోపం మీ వెంటే ఉంటుంది. ఎ. అవును బి. కాదు 5. వెనకా ముందు ఆలోచించకుండా మాట్లాడటం వల్ల మీరంటే ఎవరికీ ఇష్టం ఉండదు. ఎ. అవును బి. కాదు 6. మీ మాటలు, చేష్టలతో ఇతరులను నొప్పిస్తూ ఉంటారు. ఇతరుల భావాలను ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. ఎ. అవును బి. కాదు 7. బొత్తిగా మీకు లౌక్యం తెలియదు. దీనివల్ల మీ అభివృద్ధి ముందుకు జరగదు. ప్రమోషన్లు దాదాపు మీకు దూరంగా ఉంటాయి. ఎ. అవును బి. కాదు 8. మీ ప్రవర్తన వల్ల మీ కుటుంబ సభ్యులు కూడ ఇబ్బందుల పాలవుతుంటారు. మీతో ప్రేమగా ఉండటానికి సంకోచిస్తుంటారు. ఎ. అవును బి. కాదు 9. మీ ఆటిట్యూడ్ వల్ల పొరుగువారితో, సహచరులతో, చివరికి ప్రయాణాలప్పుడు కూడ విభేదాలు, గొడవలు వస్తుంటాయి. ఎ. అవును బి. కాదు 10. ముక్కుసూటితనం వల్ల మీకు పరిచయాలు చాలా తక్కువగా ఉంటాయి. మిమ్ములను అర్థం చేసుకున్నవారే మీతో ఉంటారు. కొత్తవారు మీకు దాదాపు దగ్గర కారు. ఎ. అవును బి. కాదు ‘ఎ’ సమాధానాలు ఏడు దాటితే మీరు స్ట్రైట్ ఫార్వర్డ్గా వెళుతుంటారు. దీనివల్ల మీకు ఇబ్బందులు ఎదురవుతుంటాయి. మీరు పెరిగిన వాతావణ పరిస్థితులు కూడా మీ ప్రవర్తనకు కారణం కావచ్చు. ముక్కుసూటితనం ఎప్పటì కైనా ప్రమాదమే. దీనివల్ల కొన్నిసార్లు మీ పక్కవారికి కూడ ప్రమాదం జరగవచ్చు. మీలో ఇలాంటి లక్షణాలుంటే వాటికి వెంటనే ఫుల్స్టాప్ పెట్టండి. పదిమందితో కలివిడిగా ఉండటం నేర్చుకోండి. మీకు ‘బి’ సమాధానాలు ‘ఎ’ కంటే ఎక్కువగా వస్తే మీలో స్ట్రెట్ఫార్వర్డ్ తత్వం లేనట్లే. -
అంతర్జాతీయ విత్తన సలహామండలి అధ్యక్షునిగా కేశవులు
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ విత్తన సలహా మండలి అధ్యక్షునిగా రాష్ట్ర విత్తన, సేంద్రియ ధ్రువీకరణ సంస్థ సంచాలకుడు డాక్టర్ కె.కేశవులు ఎంపికయ్యారు. విత్తన భాండాగారంకోసం కృషి చేస్తున్న తెలంగాణకు ఇది అరుదైన అవకాశమని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. ఈ సలహామండలిలో 8 మంది ఓఈసీడీ, ఇస్టా, ఐఎస్ఎఫ్ వంటి అంతర్జాతీయ విత్తన సంస్థల అధికారులు, విత్తన పరిశ్రమల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. ఈ సలహా మండలి విత్తన పరిశ్రమ అవసరాలు, పరిశోధన అంశాలు, జాతీయ, అంతర్జాతీయ విత్తన నాణ్యత, అంతర్జాతీయ ఎగుమతి, దిగుమతులు, నియమ నిబంధనల రూపకల్పన తదితర విషయాలలో కీలక పాత్ర పోషించనుంది. డాక్టర్ కేశవులు నియామకంతో దేశీయంగా విత్తన పరీక్షా కేంద్రాలను బలోపేతం చేయడం, విత్తన రంగంలో జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాల మధ్య సమతుల్యత సాధించడం సులభతరమవుతుంది. నాణ్యమైన విత్తనోత్పత్తికి అవకాశం ఉంటుందని, విదేశాలకు విత్తన ఎగుమతులు గణనీయంగా పెరుగుతాయని కేశవులు తెలిపారు. కేశవులు నియామకం పట్ల వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి హర్షం వ్యక్తంచేశారు. రైతాంగానికి నాణ్యమైన విత్తనాలను అందించటానికి కేశవులు చేస్తున్న కృషిని ప్రశంసించారు. మన రాష్ట్రానికి చెందిన విత్తన శాస్త్రవేత్తకు ఈ హోదా దక్కడం అరుదైన విషయమన్నారు. విత్తన భాండాగారం సాధనకు విశేష కృషి జరుగుతున్న ఈ తరుణంలో ఇది శుభసూచకమని వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారథి, కమిషనర్ జగన్మోహన్ అన్నారు. -
మీరు ఇతరులపై ఆధారపడతారా?
సెల్ఫ్చెక్ ‘‘అమ్మో ఒంటరిగా వెళ్లాలంటే నాకు భయం! ప్లీజ్... తోడు రాకూడదూ!’’ అని ఎవరో ఒకరిని తోడు తీసుకువెళ్లే సందర్భాలు మీ జీవితంలో ఉన్నాయా? మొహమాటంతోనో, బిడియంతోనో ఒంటరిగా ఏ పనీ చేయలేక ఇతరులపై ఆధారపడుతున్నారా? ఆధారపడే మనస్తత్వం మీలో ఎంత? 1. మార్కెట్కి వెళ్లేటప్పుడు కచ్చితంగా ఎవరో ఒకర్ని తీసుకెళ్తారు. ఎ. అవును బి. కాదు 2. ఎంతమంది మధ్య ఉన్నా వారిలో మీకు పరిచితులు ఒక్కరూ లేకుంటే అసౌకర్యంగా ఫీలవుతారు. ఎ. అవును బి. కాదు 3. క్లిష్టమైన పరిస్థితుల్లో ఆప్తుల సలహా తీసుకోనిదే నిర్ణయం తీసుకోరు. ఎ. అవును బి. కాదు 4. ఒక అంశం మీద వాగ్వివాదం జరుగుతున్నప్పుడు అందులో మీ తప్పు లేకపోయినప్పటికీ మీకు సపోర్ట్ చేసేవాళ్లు లేకపోతే మౌనంగా ఉంటారు. ఎ. అవును బి. కాదు 5. ఇంటికి అతిథులు వచ్చినప్పుడు వారిని పలకరించడానికి జంకుతారు. ఎ. అవును బి. కాదు 6. షాపింగ్కి వెళ్లినప్పుడు మీకు రెండు, మూడు డ్రెస్లు నచ్చుతాయి. వాటిలో దేనిని తీసుకోవాలో తేల్చుకోలేక మీఫ్రెండ్ చెప్పిన డ్రెస్నే కొంటారు. ఎ. అవును బి. కాదు 7. ఏదైనా కొత్త విషయాన్ని తెలుసుకోవాలన్నా, కొత్తపని చేయాలన్నా జంకుతారు. ఎ. అవును బి. కాదు 8. ఫంక్షన్స్లో అతిథులతో కలివిడిగా ఉండరు. ఎ. అవును బి. కాదు 9. బయటకి వెళ్లినప్పుడు కంటికి ఇంపుగా ఏదైనా కనిపించి తేవాలనిపించినా, ఇంట్లోవాళ్లని సంప్రదించనిదే తీసుకోలేరు. ఎ. అవును బి. కాదు 10. ఏటిఎమ్లో డబ్బు డ్రా చెయ్యవలసినప్పుడు జీవితభాగస్వామిని సంప్రదించనిదే డ్రా చేయరు. ఎ. అవును బి. కాదు ‘ఏ’లు ఏడు దాటితే... మీరు ఎప్పుడూ ఎవరో ఒకరి మీద ఆధారపడుతూనే ఉంటారు. మీకంటూ భావాలున్నా వాటిని పక్కన పెట్టి, పక్కవాళ్ల మీదే నిరంతరం ఆధారపడుతుంటారు. ఇలా ప్రతిదానికీ ఇతరుల పై ఆధారపడటం వల్ల జీవితంలో మీరు కనీస ప్రత్యేకతను కూడా కోల్పోతారు. ఈ ధోరణిని మీరు ఎంత త్వరగా మార్చుకుంటే అంత బెటర్. ‘బి’ లు ఏడు దాటితే మీకు నచ్చిన రీతిలో మీరుంటారు. ఎప్పుడో అత్యవసర పరిస్థితుల్లో తప్పితే పక్కవారి మీద పెద్దగా ఆధారపడరు. మీ సొంత భావాలకు విలువనిచ్చి మీకంటూ ఒక ప్రత్యేకతని సంతరించుకుంటారు. అంతే కాకుండా మీ ప్రెజెన్స్ని ఇతరులు కోరుకునేలా ఉంటారు. -
'జవాన్లూ.. సోషల్ మీడియాతో జాగ్రత్త'
చండీగఢ్: ఆర్మీ జవాన్లు సోషల్ మీడియాలో జాగ్రత్తగా ఉండాలని.. ఫేస్బుక్, ఇతర వెబ్సైట్లలో పోర్న్ వీడియోలు, చిత్రాలు చూడొద్దని అధికారులు ఆదేశాలు జారీచేశారు. ఇటీవల రంజిత్ సింగ్ అనే వ్యక్తిని ఐఎస్ఐ ఏజెంట్గా అనుమానిస్తున్న ఓ యువతి హనీట్రాప్ చేసి.. భద్రతా సమాచారాన్ని రాబట్టిన నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆన్లైన్లో జవాన్లు చేయకూడని పది పనులను పేర్కొంటూ ఆర్మీ అధికారులు ఓ జాబితాను విడుదల చేశారు. దీనిలో.. ఫేస్బుక్ లేదా ఇతర సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో పోర్న్ చిత్రాలు చూడరాదు. యూనిఫామ్ ధరించిన ఫొటోను వాట్సప్, ఫేస్బుక్ వంటి వాటిల్లో ప్రొఫైల్ ఫొటోగా పెట్టరాదు. లాటరీలు, ప్రైజులు తగిలాయంటూ వచ్చిన మెసేజ్లను ఓపెన్ చేయరాదు. వ్యక్తిగత సమాచారం, హోదా లాంటి విషయాలను సోషల్ మీడియాలో ఉంచొద్దు. పరిచయం లేని వ్యక్తుల నుంచి వచ్చిన ఫ్రెండ్ రిక్వెస్టులను అనుమతించొద్దు. జవాన్ల కుటుంబ సభ్యులు సైతం వృత్తిని తెలిపే వివరాలను పోస్ట్ చేయరాదు. వ్యక్తిగత ల్యాప్టాప్లు, కంప్యూటర్లలో మిలటరీకి సంబంధించిన సమాచారం ఉంచొద్దు. ఇలాంటి సూచనలు ఉన్నాయి. -
నిరుపేదల కోసం ఉచిత న్యాయసలహా
భార్యాభర్తల మధ్య వివాదాలు ఏర్పడ్డా, అత్తగారింటి లో వేధింపులు ఎదురవుతున్నా, తన కాపురాన్ని, బిడ్డల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సాధారణంగా భార్యే ఎలాగోలా సర్దుకుపోవాలని చూస్తుంది. అయితే ఆ వివాదాలు చినికి చినికి గాలివానగా మారినప్పుడు, భర్త లేదా అత్తమామల నుంచి వేధింపులు అంతకంతకూ పెరిగిపోతూన్నప్పుడు న్యాయసలహా కావాలనుకుంటుంది. అయితే కోర్టుకు వెళ్లడం సాధారణ గృహిణికి అంత సులువుగా సాధ్యమయ్యే పని కాదు. లాయర్ ఫీజే బోలెడంత. ఇతరత్రాఖర్చులు ఎలానూ తప్పవు. వాటిని భరించే స్తోమత లేక తనలో తాను కుమిలి పోతూ, నిర్వేదానికి, నిస్పృహకు లోనవుతుంది. ఇలాంటి వారి ఇబ్బందులను, సాధక బాధకాలను దృష్టిలో ఉంచుకుని ఆంధ్ర, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత న్యాయసలహాను అందించేందుకు న్యాయసలహా సదన్లను ఏర్పాటు చేశాయి. ఒక్క మహిళలే కాదు... వికలాంగులు, ఎస్.సి, ఎస్.సీలు, నిరుపేదలు (లక్షరూపాయల వార్షిక ఆదాయానికి మించని వారు) తమ సమస్యలను లీగల్ సర్వీస్ అథారిటీకి తెలిపి, వారి నుంచి ఉచిత సలహా పొందవచ్చు. ఇంతకూ సమస్యలను తెలిపేదెలాగంటారా... మీ సమస్యను రాతపూర్వకంగా/ఫోన్ ద్వారా/ నేరుగా లీగల్ సర్వీస్ అథారిటీ కార్యదర్శికి తెలియజేయవచ్చు. దీనికి అడ్వకేట్తో అవసరం లేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో మొత్తం 207 లీగల్ సర్వీస్ అథారిటీలు పని చేస్తున్నాయి. సామాన్యులు ఈ సేవలను ఎలా వినియోగించుకోవచ్చో తెలియజేయడానికి ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ సహకారంతో వినియోగదారుల సంక్షేమ సంఘం పని చేస్తుంది. రాష్ట్ర, జిల్లా స్థాయిలోని న్యాయ సలహా కేంద్రాలు పని చేస్తాయి. రాష్ర్టస్థాయి న్యాయసలహా కేంద్రం ఫోన్ నంబర్లు... రాష్ట న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి: 04023446700 హైకోర్టు న్యాయసేవాధికార సంఘ కార్యదర్శి: 04023446704 రాష్ర్ట న్యాయసేవాధికార సంస్థ పాలనాధికారి: 04023446703. పై నంబర్లను సంప్రదించడం ద్వారా అవసరమైన సమాచారాన్ని పొందవచ్చు. అయితే ఉచితం కదా అని ప్రతి చిన్న విషయానికీ పదే పదే ఫోన్ చేసి అధికారుల సహనాన్ని పరీక్షించటం మాత్రం భావ్యం కాదని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి.