AP Assembly Budget Session 2020
-
ఇళ్ల యజ్ఞం పూర్తి చేస్తాం
చరిత్ర ఎరుగని రీతిలో పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణం వల్ల 30 రకాల వృత్తుల వారికి ఉపాధి లభిస్తోంది. తొలి దశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణానికి 71 లక్షల టన్నుల సిమెంట్, 7.56 లక్షల టన్నుల స్టీల్, 312 లక్షల టన్నుల ఇసుక, 1,250 కోట్ల ఇటుకలు అవసరం. కార్మికులకు 21.4 కోట్ల పని దినాల ఉపాధి లభిస్తుంది. వృత్తి నైపుణ్య కార్మికులకు అదనంగా మరో 10.60 కోట్ల పని దినాలు లభిస్తాయి. ఇవన్నీ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఎంతగానో దోహద పడతాయి. రాష్ట్ర జీఎస్డీపీ పెరుగుదలలో కీలక పాత్ర పోషిస్తాయి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎవరెన్ని కుట్రలు పన్నినా రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ ఇళ్లు సొంతం చేసి తీరతామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. వివిధ దశల్లో ఈ మహాయజ్ఞాన్ని పూర్తి చేసి, నిరుపేదలందరినీ ఇంటి యజమానులు చేయాలన్న లక్ష్యంతో అడుగులు ముందుకు వేస్తున్నామని చెప్పారు. ‘పేదలందరికీ ఇళ్లు’ పథకంపై శాసనసభలో గురువారం జరిగిన చర్చలో ఆయన ప్రసంగించారు. ‘దాదాపు 30.76 లక్షల ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేశాం. 17,005 వైఎస్సార్ జగనన్న కాలనీల్లో దశల వారీగా ఇళ్ల నిర్మాణం సాగుతుంది. తొలి దశలో 10,067 కా>లనీల్లో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణం మొదలైంది. రూ.28 వేల కోట్లతో పనులు జరుగుతున్నాయి. పేదవాళ్లకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం కోసం ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, అధికారులు అందరం కలిసికట్టుగా ఒక మహాయజ్ఞం చేశాం. ఇందుకోసం 71,811 ఎకరాల భూమిని వివిధ రూపాల్లో సేకరించాం. ఈ భూమి విలువే కనీసం రూ.25 వేల కోట్లు ఉంటుంది. పూర్తి నాణ్యత ప్రమాణాలతో నిర్మిస్తున్న 17,005 కాలనీల్లో మౌలిక వసతుల కోసమే రూ.32,909 కోట్లు వెచ్చించనున్నాం. నిర్మాణాలు పూర్తయితే రూ.4 లక్షల కోట్ల సంపద పేదల చేతుల్లో ఉంటుంది. ఒక్కొక్కరికి గరిష్టంగా రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల విలువైన ఆస్తి సమకూరుతుంది’ అని తెలిపారు. ఎన్ని కష్టాలు, ఇబ్బందులు ఎదురైనా సరే ఈ మిషన్ను పూర్తి చేస్తామని చెప్పారు. అక్కచెల్లెమ్మల ఫొటోతో సహా పట్టాను ఇస్తున్నప్పుడు వారి కళ్లల్లో కనిపించే ఆనందమే తమకు శక్తినిస్తుందని, తమను ముందుకు నడిపిస్తుందని అన్నారు. సీఎం వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. సొంతింటితో సామాజిక హోదా ► త్వరితగతిన ఇళ్ల నిర్మాణం పూర్తయ్యాక సొంత ఇల్లుతో అక్కచెల్లెమ్మలకు సామాజిక హోదా వస్తుంది. భద్రతతో పాటు భరోసా వస్తుంది. ► ఇటువంటి భద్రత ప్రతి అక్క, చెల్లెమ్మకు ఇవ్వాలని, ఆత్మ విశ్వాసం పెంచే గొప్ప ఆస్తిని వారి చేతిలో పెట్టాలని మా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. తద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అగ్రవర్ణ పేదలకు కూడా మేలు జరుగుతుంది. ఎమ్మెల్యేలు గర్వపడే పరిస్థితి ► ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో తిరిగితే పెన్షన్ రాలేదనో.. ఇల్లు లేదనో.. ఫలానా పథకం అందలేదనో.. అర్హత ఉన్నా ఇవ్వలేదనో ఇలా.. గతంలో రకరకాల ఫిర్యాదులు వినిపించేవి. ► ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లోకి వెళ్లడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితులు ఉండేవి. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు ప్రతి ఎమ్మెల్యే సగర్వంగా, కాలర్ ఎగరేసుకునే పరిస్థితులు తీసుకువచ్చాం. ప్రతి పథకం పారదర్శకంగా అమలు చేస్తూ లంచాలు, వివక్షకు తావు లేకుండా అందిస్తున్నాం. ► అర్హత ఉంటే చాలు మన పార్టీయా, మరో పార్టీయా అని ఎక్కడా చూడటం లేదు. కులం, ప్రాంతం, మతం, పార్టీ చూడకుండా అర్హులు అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. ఇళ్లు కాదు.. ఊళ్లు నిర్మిస్తున్నాం ► 30.76 లక్షల ఇళ్లలో టిడ్కోకు సంబంధించినవి 2.62 లక్షల ఇళ్లు ఉన్నాయి. అందులోనూ అన్ డివైడెడ్ షేర్ అప్ ల్యాండ్ లబ్ధిదారులకు వస్తుంది. రాష్ట్రంలో ప్రస్తుతం దాదాపు 13 వేల పంచాయతీలు ఉంటే.. మా ప్రభుత్వం కొత్తగా 17,005 కాలనీలు నిర్మిస్తోంది. ► కొన్ని చోట్ల ఆ కాలనీలు చూస్తే.. మున్సిపాల్టీలు, నగర పంచాయతీలు, మేజర్ పంచాయితీల సైజులో కనిపిస్తున్నాయి. ఇవాళ మేం కడుతోంది ఇళ్లు కాదు.. ఊళ్లు కడుతున్నాం అని చెబుతున్నా. ► ఈ స్థాయిలో ఇళ్ల స్థలాలు సేకరించగలిగాం కాబట్టే కేంద్రం నుంచి కూడా మనకు సహాయం అందుతుంది. అందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కూడా కృతజ్ఞతలు చెప్పాలి. 17,005 కాలనీల్లో తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, విద్యుత్, ఇంటర్నెట్.. తదితర మౌలిక సదుపాయాలతో పాటు పాఠశాలలు, ఆస్పత్రులు, సచివాలయాలు, ఆర్బీకేలు, డిజిటల్ లైబ్రరీలు ఏర్పాటు చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ► ఈ మౌలిక సదుపాయాల కోసమే రాబోయే రోజుల్లో రూ.32,909 కోట్లు ఖర్చు చేయబోతున్నాం. కొన్ని సంవత్సరాల పాటు ఈ మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసే కార్యక్రమాలు నిర్వహిస్తాం. సకల వసతులు, నాణ్యతతో నిర్మాణం ► గతంలో చంద్రబాబు హయాంలో ఇంటి విస్తీర్ణం గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 215 చదరపు అడుగులు. ఇవాళ మనం కడుతున్న ఇంటి విస్తీర్ణం 340 చదరపు అడగులు. ప్రతి ఇంట్లో బెడ్ రూమ్, లివింగ్ రూమ్, కిచెన్, బాత్రూమ్ కమ్ టాయ్లెట్, వరండా.. ఇవన్నీ ఉంటాయి. ► ప్రభుత్వమే దగ్గరుండి తొలుత 20 ఇళ్లు కట్టించింది. ఎంత ఖర్చవుతుందో లెక్క వేసేందుకు ఆ పని చేశాం. ఆ తర్వాత నిర్మాణ వ్యయాన్ని ఏ విధంగా అయినా తగ్గించగలిగితే పేదలకు మెరుగ్గా ఇళ్లు కట్టంచగలుగుతామని రకరకాల ఆలోచనలు చేసి ఒక కార్యాచరణ రూపొందించాం. ► సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ విధానం ద్వారా ఇంటి తలుపులు, పెయింటింగ్, శానిటరీ, ఎలక్ట్రికల్ పరికరాలు వంటి 14 రకాల నాణ్యమైన సామగ్రిని తీసుకువచ్చాం. సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ అయితే రివర్స్ టెండరింగ్కు ఆస్కారం ఉంటుంది. నాణ్యత కూడా ఉంటుంది. సామగ్రిని పెద్ద ఎత్తున కొనుగోలు చేయడంతో ధరలు కూడా తగ్గుతాయి. ► ఒక్కో ఇంటికి 90 బస్తాల సిమెంట్ పడుతుంది. మార్కెట్లో సిమెంట్ బస్తా రూ.350 నుంచి రూ.400 ఉంది. సిమెంట్ కంపెనీలతో మాట్లాడి పేదల ఇళ్లకు మాత్రం పీపీసీ సిమెంట్ బస్తా రూ.225, ఓపీసీ బస్తా రూ.235కే సరఫరా చేసేట్లు ఒప్పించాం. ప్రతి లబ్ధిదారుడికి అవసరమైన 20 టన్నుల ఇసుకను కూడా ఉచితంగా డోర్ డెలివరీ చేస్తున్నాం. దాదాపు 7.50 లక్షల టన్నుల స్టీల్ను రివర్స్ టెండరింగ్ ద్వారా మార్కెట్ రేటు కన్నా తక్కువకే కొనుగోలు చేశాం. 300 చదరపు అడుగుల టిడ్కో ఇళ్లు ఉచితం ► టిడ్కో ద్వారా 2.62 లక్షల ఇళ్లను జీ ప్లస్ త్రీ పద్ధతిలో మూడు కేటగిరీల్లో నిర్మిస్తున్నాం. 300, 365, 430 చదరపు అడుగుల విస్తీర్ణంతో ఆ ఇళ్లు కడుతుండగా, వాటిలో 300 చదరపు అడుగుల ఇంటిని పేదలకు పూర్తిగా ఉచితంగా ఇస్తున్నాం. ► ఇవే ఇళ్లకు చంద్రబాబు హయాంలో.. ఒక చదరపు అడుగుకు రూ.2 వేల చొప్పున ఒక్కో ఇంటి వ్యయం రూ.6 లక్షలుగా లెక్కేశారు. అందులో కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ రూ.1.50 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీ రూ.1.50 లక్షలు పోగా, మిగిలిన రూ.3 లక్షలు బ్యాంకు రుణం ఇప్పించే వారు. ఆ రుణం తీర్చేందుకు పేద కుటంబం నెలకు రూ.3 వేల చొప్పున ఏకంగా 20 ఏళ్ల పాటు వాయిదాలు కట్టాల్సి వచ్చేది. ఇవాళ మన ప్రభుత్వం అవే ఇళ్లకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా రిజిస్ట్రేషన్ చేసి పేదలకు ఇస్తోంది. ► 365 చదరపు అడుగుల ఇళ్లకు రూ.25 వేల చొప్పున, 430 చదరపు అడుగుల ఇళ్లకు రూ.50 వేల చొప్పున సబ్సిడీ ఇస్తున్నాం. ఆ విధంగా వారికి కూడా మేలు చేస్తున్నాం. టిడ్కో ఇళ్లలో ఇప్పటికే 1,07,814 ఇళ్లు పూర్తి కాగా, మరో 63,306 ఇళ్లు పూర్తయ్యే దశలో ఉన్నాయి. ఈ ఇళ్ల పంపిణీని గత జనవరిలో మొదలు పెట్టాం. వచ్చే డిసెంబర్ నాటికి పూర్తి చేస్తాం. ఎప్పటికప్పుడు బిల్లులు ► ప్రభుత్వ పని అంటే నాసిరకం అని గతంలో పేరు ఉండేది. అయితే ప్రస్తుత ప్రభుత్వం ఏ పని చేసినా పూర్తి నాణ్యత ఉంటుందనే పేరు తెచ్చుకున్నాం. పూర్తి నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నాం. ఇళ్ల నిర్మాణ పర్యవేక్షణ కోసమే ప్రతి జిల్లాలో ప్రత్యేకంగా ఒక జాయింట్ కలెక్టర్ను నియమించాం. ► అధికారులు, సచివాలయాల్లో ఉన్న ఇంజనీర్లు ఎప్పటికప్పుడు ఇళ్ల నిర్మాణాలను పర్యవేక్షించాలని నిర్దేశించాం. గతంలో ఇళ్లు కట్టిన తర్వాత బిల్లులు రావడం కాదు కదా.. చివరకు ఆ బిల్లులు తయారు చేయడం కూడా గగనమై పోయేది. ఇవాళ సచివాలయాల్లో ఆ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. ఇంటి నిర్మాణం పురోగతిని బట్టి ఇంజినీరింగ్ అసిస్టెంట్లు ఎప్పటికప్పుడు బిల్లులు జనరేట్ చేస్తున్నారు. ఆ వెంటనే సకాలంలో బిల్లులు చెల్లిస్తున్నాం. పుట్టగతులు ఉండవనే టీడీపీ కుట్ర ఈ యజ్ఞం పూర్తయితే రాజకీయంగా పుట్టగతులు ఉండవనే ఆందోళనతోనే టీడీపీ ఈ పథకాన్ని అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతోందని విమర్శించారు. ► ఈ మహాయజ్ఞానికి ఆటంకం కలిగించేందుకు తెలుగుదేశం పార్టీ శాయశక్తులా ప్రయత్నించింది. ఈ ఇళ్ల నిర్మాణం పూర్తయితే జగన్కు ఇంకా మంచి పేరు వస్తుంది.. దీంతో తమ అడ్రస్ పూర్తిగా గల్లంతు అవుతుందన్న భయంతో ఏవేవో కారణాలు చూపుతూ కోర్టులను ఆశ్రయించారు. ► నా నియోజకవర్గం పులివెందులతో పాటు విశాఖపట్నం, ఇతర చోట్ల ఇళ్ల పట్టాల పంపిణీ ఆగిపోయింది. ఆ విధంగా ఏడాది పాటు ఈ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. ► విశాఖపట్నంలో భూముల సేకరణకు హైకోర్టు ఇటీవలే క్లియరెన్స్ ఇచ్చింది. దాంతో ఇళ్ల పట్టాల పంపిణీకి సన్నాహాలు చేయండని అధికారులను ఆదేశించాం. ఏప్రిల్లో విశాఖపట్నం వెళ్లి 1.80 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా వెంటనే ఇళ్ల నిర్మాణం మొదలు పెడతాం. -
భారతదేశంలో ఉత్తమ ఉద్యానవనంగా మన రాష్ట్రమే..!!
-
రూ. 40 వేలకోట్లతో ధాన్యాన్ని కొనుగోలు చేశాం..!!
-
ముగిసిన ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ భేటీ
సాక్షి, అమరావతి: అసెంబ్లీలో ప్రతి సభ్యుడి హక్కులు కాపాడాని నిర్ణయం తీసుకున్నామని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సభా హక్కుల కమిటీ ఛైర్మన్ కాకాణి గోవర్థన్రెడ్డి తెలిపారు. ఆయన అధ్యక్షతన బుధవారం అసెంబ్లీ సభా హక్కుల కమిటీ భేటీ అయింది. అనంతరం కాకాణి గోవర్థన్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..టీడీపీ ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడుపై ఇటీవల అసెంబ్లీలో ఇచ్చిన ప్రివిలేజ్ మోషన్పై ఇవాళ విచారణ చేపట్టినట్లు తెలిపారు. వారి వివరణ కోసం పది రోజుల సమయం ఇస్తున్నామని పేర్కొన్నారు. స్పీకర్పై చేసిన ఆరోపణలకు సంబంధించి అచ్చెన్నాయుడుపై ఎమ్మెల్యే జోగి రమేష్, శ్రీకాంత్రెడ్డి ప్రివిలేజ్ మోషన్ ఇచ్చారని తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడుపై సభలో చేసిన తీర్మానం ఆధారంగా రిఫర్ చేశారని కాకాణి తెలిపారు. ఈ అంశంపై చర్చించి వివరణ కోరామని, కమిటీ ముందుకు నాలుగు అంశాలు మాత్రమే వచ్చాయని, వాటిపై విచారణ జరిపామని తెలిపారు. ఈ భేటీలో కమిటీ సభ్యులు శిల్పా చక్రపాణిరెడ్డి, మల్లాది విష్ణు, చినఅప్పలనాయుడు పాల్గొన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడుపై ఇటీవల అసెంబ్లీలో ఇచ్చిన ప్రివిలేజ్ మోషన్పై కమిటీ విచారణ చేపట్టింది. టీడీపీ ఫిర్యాదులు విచారించలేదన్నది అవాస్తవమని, కమిటీ సమావేశంలో టీడీపీ సభ్యుడు కూడా ఉన్నారన్నారు. ఆ సభ్యులు కూడా తమ నిర్ణయంతో ఏకీభవించారన్నారు. టీడీపీ సభ్యులు కూడా ఫిర్యాదులు చేసిందని తమ దృష్టికి తెచ్చారని, స్పీకర్ ఎప్పుడు రిఫర్ చేస్తే అప్పుడు విచారిస్తామని పేర్కొన్నారు. -
పోలవరం నేనే పూర్తి చేస్తా
సాక్షి, అమరావతి: ‘రాష్ట్ర ప్రజల దశాబ్దాల స్వప్నం పోలవరం ప్రాజెక్టును మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభిస్తే.. ఆయన కొడుకుగా ప్రాజెక్టును నేనే పూర్తి చేసి తీరుతా’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు పనుల్లో కమీషన్ల కక్కుర్తితో చంద్రబాబు అక్రమాలకు పాల్పడ్డారని.. ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యాలే అందుకు తార్కాణమన్నారు. బుధవారం శాసనసభలో పోలవరం ప్రాజెక్టుపై జరిగిన చర్చలో సీఎం వైఎస్ జగన్ మాట్లాడారు. 2014 – 2019 మధ్య పోలవరం ప్రాజెక్టు పనులు 70 శాతం చేశామని చంద్రబాబు అవాస్తవాలు వల్లె వేశారని.. వాస్తవంగా ఆయన హయాంలో జరిగింది కేవలం 20 శాతం పనులేనని ఎత్తిచూపారు. చంద్రబాబు చేసిన పాపాలను కడిగేస్తూ.. 2022 ఖరీఫ్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేసి ఆయకట్టుకు నీళ్లందిస్తామని పునరుద్ఘాటించారు. సీఎం ఇంకా ఏమన్నారంటే.. పోలవరం ప్రాజెక్టు ఒక కల – స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి పోలవరం ప్రాజెక్టు అన్నది ఒక కల. ఏ సీఎం ఈ కలను సాకారం చేయాలని అనుకోలేదు. 2004లో మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే పోలవరం ప్రాజెక్టును సాకరం చేస్తూ పనులను పరుగులెత్తించారు. ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువ కోసం 10,627 ఎకరాలు (86 శాతం) సేకరించారు. కుడి కాలువ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. – 2014లో చంద్రబాబు తిరిగి సీఎం అయ్యాక కుడి ప్రధాన కాలువలో సేకరించిన భూమి కేవలం 1,700 ఎకరాలు మాత్రమే. కేవలం 14 శాతం. నిజానికి 2005లో భూసేకరణకు వ్యతిరేకంగా చంద్రబాబు కోర్టులో కేసులు వేయించి పనులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. – ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ కోసం వైఎస్ హయాంలో 10,342 ఎకరాలు (98 శాతం) భూసేకరణ జరగ్గా, 2014లో చంద్రబాబు సీఎం అయ్యాక కేవలం 95.32 ఎకరాలు (0.89 శాతం) మాత్రమే సేకరించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి తన హయాంలోనే పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన అన్ని అనుమతులు తెచ్చారు. వైఎస్సార్ కుడి ప్రధాన కాలువను పూర్తి చేయకపోయి ఉంటే.. చంద్రబాబు పట్టిసీమ ఎత్తిపోతలతో నీటిని ఎలా తరలించే వారు? ఎక్కడికి తీసుకుపోగలిగేవారు? అప్పుడెందుకు నోరు పెగల్లేదు బాబూ? – 2016 సెప్టెంబరు 7న అరుణ్జైట్లీ అర్ధరాత్రి ఢిల్లీలో మీటింగ్ పెట్టి స్పెషల్ ప్యాకేజీ ఇస్తున్నట్లు ప్రకటించారు. అప్పుడు ఆయన పక్కనే టీడీపీ మంత్రి సుజానాచౌదరి, ఎంపీ సీఎం రమేష్, నాటి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఉన్నారు. – అదే రాత్రి చంద్రబాబు కూడా ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి.. అరుణ్జైట్లీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. – 2016 సెప్టెంబరు 30న కేంద్ర ఆర్థిక శాఖ ఒక మెమొరాండంను కేంద్ర జల శక్తి శాఖకు పంపించింది. 2014 ఏప్రిల్ 1 నాటికి పోలవరం ప్రాజెక్టులో మిగిలిపోయిన నీటి పారుదల విభాగం పనులకు అయ్యే వంద శాతం వ్యయాన్ని మాత్రమే ఇస్తామని అందులో స్పష్టంగా ఉంది. అయినా అప్పుడు చంద్రబాబు ఎందుకు స్పందించలేదు? అదే సమయంలో ఇక్కడ అసెంబ్లీలో నేను ఆ విషయాన్ని ఆ రోజు ప్రస్తావించాను. (ఆ రోజు ఏం మాట్లాడింది వీడియో చూపారు.) – 2016 సెప్టెంబర్ 7న అర్ధరాత్రి అరుణ్జైట్లీ చెప్పిన దాని ప్రకారం పోలవం ప్రాజెక్టుకు రూ.16 వేల కోట్లు మాత్రమే వస్తుందని తెలిసినప్పుడు చంద్రబాబు ఎందుకు ఒప్పుకున్నారో తెలియదు. అందులో 2014 ఏప్రిల్ 1కి ముందు చేసిన ఖర్చు రూ.5,500 కోట్లు ఇవ్వం అని, పవర్ హౌస్, తాగునీటి సరఫరా వ్యయం రూ.2,800 కోట్లు ఇవ్వలేమని, కేవలం నీటి పారుదల విభాగం వ్యయం రూ.7,500 కోట్లు మాత్రమే ఇస్తామని చెప్పినప్పుడు చంద్రబాబు ఎందుకు ఒప్పుకున్నారు? – అసలు ఈ మనిషికి ఇంగ్లిష్ వస్తుందా? రాదా? అన్నది అర్థం కావడం లేదు. ఏ ప్రాజెక్టు పనుల్లో అయినా ధరలు ఒకే విధంగా ఉండవు. ఇదే అంశాన్ని నేను శాసనసభలో లేవనెత్తి, నిలదీసే ప్రయత్నం చేస్తే అప్పటి స్పీకర్ మా గొంతు నొక్కారు. అప్పుడే చంద్రబాబు స్పందించి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. అసెంబ్లీలో మాట్లాడుతున్న సీఎం జగన్ ప్రాజెక్టు పూర్తి కావాలంటే రూ.37,883 కోట్లు అవసరం – ఇలాంటి పరిస్థితుల్లో మేము అధికారంలోకి వచ్చాం. చంద్రబాబు చేసిన పాపాలను కడిగేస్తున్నాం. అన్యాయమైన పరిస్థితులను మారుస్తూ వస్తున్నాం. భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ కోసమే రూ.26,585 కోట్లు కావాలి. ఇతర సివిల్ పనులకు రూ.7,174 కోట్లు, పవర్ ప్రాజెక్టుకు మరో రూ.4,124 కోట్లు కావాలి. ఆ విధంగా మొత్తం రూ.37,883 కోట్లు కావాలి. – పోలవరం ప్రాజెక్టులో నెలకొన్న పరిస్థితులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాం. ఒకటికి రెండు సార్లు జల శక్తి మంత్రి, ఆర్థిక మంత్రులను కలిశాం. వాస్తవ పరిస్థితులను వివరించాం. చివరకు వారు 2013–14 ధరలతో ప్రాజెక్టు పూర్తి కాదని అంగీకరించారు. కేంద్రం కూడా దేవుడి దయతో సానుకూలంగా స్పందిస్తోంది. అందుకు కేంద్రానికి కృతజ్ఞతలు. – ఇంటి పెద్దగా చెబుతున్నాను. ప్రాజెక్టు ఎత్తు ఒక్క అంగుళం కూడా తగ్గదు. మొత్తం 45.72 మీటర్లు కడతాం. యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతాయి. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలు కూడా ఎక్కడా ఆపం. సీడబ్ల్యూసీ ప్రొటోకాల్ ప్రకారమే నీరు నిల్వ చేస్తాం. – తెలుగు జాతి ప్రజల కోరిక మేరకు.. మన ఎమ్మెల్యేల తీర్మానం మేరకు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని 100 అడుగుల ఎత్తుతో ప్రాజెక్టు వద్ద ప్రతిష్టిస్తాం. – ప్రాజెక్టు పనుల్లో ఒక్క పైసా కూడా మేం వృథా చేయడం లేదు. గత ప్రభుత్వం బస్సులు పెట్టి, ప్రజలు సందర్శించినట్లు రాసుకుంటూ ఏకంగా రూ.83.45 కోట్లు ఖర్చు చేసింది. (ప్రజలను తీసుకుపోయి జయము..జయము చంద్రన్నా అంటూ చిడతలతో మహిళలు పాడిన పాటల వీడియో ప్రదర్శించారు. ఈ పాట వస్తున్నంత సేపూ సభలో సభ్యులంతా విరగబడి నవ్వారు.) రివర్స్ టెండరింగ్లో ఆదా ఇలా.. కమీషన్ల కోసం పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ఏటీఎంగా మార్చుకున్నారని ప్రధాని అన్నారు. పోలవరం, ఇతర సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి చంద్రబాబు హయాంలో పిల్చిన టెండర్లను రద్దు చేసి.. యాపిల్ టు యాపిల్ పద్ధతిలో తొలుత రివర్స్ టెండర్లు పిలిస్తే రూ.1,142 కోట్లు ఆదా అయ్యాయి. రివర్స్ టెండరింగ్ విధానంలో ఆ తర్వాత చేపట్టిన ప్రాజెక్టుల పనుల్లో మరో రూ.201 కోట్లు ఆదా అయ్యాయి. ఆ రెండూ కలిపితే అక్షరాలా రూ.1,343 కోట్లు పోలవరం పనుల్లో ఆదా అయ్యాయి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జయము.. జయము చంద్రన్నకు రూ.83 కోట్లు ‘పోలవరం ప్రాజెక్టు పూర్తయిపోయిం ది.. రండి.. రండి.. చూసొద్దురు కానీ.. మేమే తీసుకెళ్తాం.. తీసుకొస్తాం.. మంచి భోజనం పెడతాం..’ అంటూ గత ప్రభుత్వ హయాంలో బస్సులు పెట్టి, జనాన్ని తరలించిన ఆర్భాటం అంతా ఇంతా కాదు. తీరా చూస్తే.. ‘ఆలూ లేదు.. చూలూ లేదు.. కొడుకు పేరు సోమలింగం’ అన్నట్లుంది వ్యవహారం. పునాదుల్లో ఉన్న ప్రాజెక్టును చూపించి, కీర్తనలు పాడించుకుని తరించిపోయారు అప్పటి (అ)ధర్మ ప్రభువులు. ఇలాంటి సీన్ల కోసం రూ.లక్ష కాదు.. రూ.కోటి కాదు.. ఏకంగా రూ.83.45 కోట్లు ఖర్చు చేశారు. అలా ప్రాజెక్టు వద్దకు తరలించి ‘జయము.. జయము చంద్రన్నా.. అంటూ మహిళలు పాడుతూ భజన చేస్తున్న ఓ పాటకు సంబంధించిన వీడియోను బుధవారం అసెంబ్లీలో ప్రదర్శించినప్పుడు సభ్యులు పొట్ట చెక్కలయ్యేట్లు విరగబడి నవ్వడం కనిపించింది. -
కుట్రతోనే ద్రవ్య బిల్లుకు మోకాలడ్డు
సాక్షి, అమరావతి: శాసన మండలిలో టీడీపీ సభ్యులు కుట్రపూరితంగానే ద్రవ్య వినిమయ బిల్లును అడ్డుకున్నారని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ అగ్రహం వ్యక్తంచేశారు. స్వయం ప్రకటిత మేధావి, అసెంబ్లీ రూల్స్ బుక్ తానే తయారుచేసినట్లు ఫీలయ్యే యనమల రామకృష్ణుడు.. బిల్లులను మండలిలో అడ్డుకుని తీరుతామని ముందే చెప్పారన్నారు. చంద్రబాబు తీరు అసెంబ్లీలో ఒక రకంగా, మండలిలో ఒక రకంగా ఉందన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. ► సంఖ్యాబలం ఉందని మండలిలో టీడీపీ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తోంది. ► నారా లోకేశ్ చౌదరి ప్రోత్సాహంతోనే టీడీపీ సభ్యులు దీపక్రెడ్డి, బీద రవిచంద్ర తనపై, మంత్రులు కన్నబాబు, అనిల్కుమార్ యాదవ్పై గూండాల్లా దాడి చేశారు. ► ఫొటోలు తీయొద్దని చెప్పినందుకు లోకేశ్ దాడికి తెగబడ్డారు. ► ప్రజా కోర్టులో చంద్రబాబు ఎప్పటికీ దోషిగా మిగిలిపోతారు. ► గతంలో చైర్మన్ విచక్షణాధికారం అని చెప్పి రూల్స్కు విరుద్ధంగా ప్రవర్తించారు. ఇప్పుడు డిప్యూటీ చైర్మన్ కూడా అదే రీతిలో ప్రవర్తించారు. ► చైర్మన్ సీట్లో కూర్చొన్న వ్యక్తి టీడీపీ సభ్యులను ఉద్దేశించి ‘మా వాళ్లు’ అని సంబోధించడం ఎంతవరకు సమంజసం? ► తనను ఓడించిన ప్రజల మీద పగ తీర్చుకోవాలనే ఉద్దేశంతోనే యనమల నిన్న సభలో నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించాడు. ► చైనా సరిహద్దుల్లో ప్రాణాలర్పించిన తెలుగు వ్యక్తి కల్నల్ సంతోష్బాబుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున, వైఎస్సార్సీపీ తరఫున నివాళులర్పిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. లోకేశ్ డైరెక్షన్లోనే దాడి చంద్రబాబు, లోకేశ్ తప్పులను ఎప్పటికప్పుడు ఎత్తిచూపుతున్నందుకే చంద్రబాబు తనయుడు లోకే‹శ్ నాయుడు తనపై కక్షగట్టి ప్రవర్తిస్తున్నారని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. తిరుమలలో అన్యమత ప్రార్థనలు అంటూ దుష్ప్రచారం చేసిన లోకేశ్కు దమ్ముంటే వాటిని నిరూపించాలని ఆనాడు సవాల్ విసిరానని.. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కౌన్సిల్ వేదికగా లోకేశ్ దాడులు చేయించారని వెలంపల్లి అన్నారు. ఆర్యవైశ్యుడినని.. మాటల్లో చెప్పలేని విధంగా తనపై దాడి చేశారని గురువారం ఆయన ‘సాక్షి’తో అన్నారు. ల్యాండ్ మాఫియా గూండా దీపక్రెడ్డి వెల్లోకి వచ్చి మంత్రులను బయటకు నెట్టేయాలంటూ మాట్లాడారని తెలిపారు. రూల్స్కు విరుద్ధంగా లోకేశ్ సెల్ఫోన్లో ఫొటోలు తీయడం.. వీడియో రికార్డింగ్ను అడ్డుకునేందుకు ప్రయత్నించినందుకే నాపై టీడీపీ నేతలు దాడిచేశారని.. ఇదంతా మీడియా వారు లాంజ్లో నుంచి చూశారని మంత్రి వివరించారు. లోకేశ్, దీపక్రెడ్డి, బీద రవిచంద్ర మీద డిప్యూటీ చైర్మన్ చర్యలు తీసుకోవాలని వెలంపల్లి డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం సమన్వయంతో ఉండాలని సీఎం వైఎస్ జగన్ చెప్పారు కాబట్టే సమన్వయంతో ఉంటున్నామని ఆయన అన్నారు. -
‘మా మౌనాన్ని చేతకానితనంగా చూడొద్దు ’
సాక్షి, విజయవాడ : శాసనమండలిలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్పై టీడీపీ నేతల దాడిని వైఎస్సార్సీపీ నేత, విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇంచార్జి దేవినేని అవినాష్ తీవ్రంగా ఖండించారు. టీడీపీ నేతల దాడిని ఖండిస్తూ గుణదలలోని అతని నివాసం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్లు, డివిజన్ల కార్పొరేటర్ అభ్యర్థులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. పెద్దల సభలో టీడీపీ సభ్యులు రౌడీల్లా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. మంత్రి వెల్లంపల్లిపై దాడికి పాల్పడిన సభ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీగా అర్హత లేని టీడీపీ సభ్యులు మండలిలో ఉన్నారని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన బిల్లులను మండలికి పంపితే వాటిని అడ్డుకోవడం హేయమైన చర్య అని అవినాష్ పేర్కొన్నారు. ప్రజలకు మంచి చేయాలని చూస్తుంటే.. టీడీపీ నేతలు వ్యవస్థలను, కోర్టులను అట్టుపెట్టుకొని అభివృద్ధికి ఆటంకాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. దాడిని టీడీపీ నాయకులు హీరోయిజంగా చెప్పుకుంటున్నారని, ఇంతకన్నా సిగ్గుమాలిన చర్య మరొకటి లేదన్నారు. వైఎస్సార్సీపీ నేతల మౌనాన్ని చేతకానితనంగా చూడొద్దని హెచ్చరించారు. దాడి చేనినవారిపై చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్కు రిప్రజెంటేషన్ ఇస్తామన్నారు. రాష్ట్రంలో విధ్వంసాలు సృష్టించాలని కుట్రలు చేస్తే.. రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోబోదని దేవినేని అవినాష్ హెచ్చరించారు. బిల్లులను అడ్డుకోవడం దురదృష్టకరం : బొప్పన భవకుమార్ రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన బిల్లులు పాస్ కాకుండా టీడీపీ నేతలు అడ్డుకోవడం దురదృష్టకరమని వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు బొప్పన భవకుమార్ అన్నారు. పెద్దల సభలో రౌజీయిజం చేయడం టీడీపీ పార్టీ నిరంకుశ వైఖరికి నిదర్శనమని పేర్కొన్నారు. శాసనమండలిలో మంత్రిపై దాడి చేయడం దేశ చరిత్రలో ఎప్పుడూ చూడలేదన్నారు. టీడీపీ సభ్యులు రౌడీలు, గుండాలుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. విధ్వంశాలు చేస్తే వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చూస్తూ ఉరుకోదని హెచ్చరించారు. -
‘టీడీపీ ఎమ్మెల్సీలు క్షమాపణ చెప్పాలి’
సాక్షి, గుంటూరు : శాసనమండలిలో టీడీపీ నేతలు తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉందని ఆ పార్టీ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ విమర్శించారు. ద్రవ్యబిల్లును పెట్టనీయకుండా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్పై దాడి చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..పేదల కోసం ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలను టీడీపీ అడ్డుకుంటోందని మండిపడ్డారు. మంత్రి వెల్లంపల్లిపై దాడి చేయడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. (చదవండి : మండలిలో మరోసారి దుష్ట సంప్రదాయం!) మంత్రి వెల్లంపల్లికి టీడీపీ సభ్యులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నలభై ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబుకు ద్రవ్యబిల్లు ప్రాధాన్యత తెలియదా అని ప్రశ్నించారు. సభ్యులు ఎక్కువగా ఉన్నారనే ఉద్దేశంతో రౌడీయిజానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు చాంబర్లో కూర్చొని సభ్యులను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. ఇప్పటికైనా చంద్రబాబు మారకుంటే టీడీపీ భూస్థాపితం కాకతప్పదని ఎమ్మెల్యే గిరిధర్ వ్యాఖ్యానించారు. -
మండలిలో మాటల యుద్ధం
సాక్షి, అమరావతి: శాసన మండలిలో బుధవారం రాష్ట్ర వార్షిక బడ్జెట్పై చర్చ కొనసాగుతున్న సమయంలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటా మాట పెరిగి కొద్ది సేపు సభా కార్యక్రమాలు వాడీవేడిగా కొనసాగాయి. బడ్జెట్పై చర్చలో టీడీపీ ఎమ్మెల్సీలు దీపక్రెడ్డి, నాగజగదీశ్వరరావులు మంత్రులపై చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆ వ్యాఖ్యల పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన మంత్రులు.. టీడీపీ సభ్యులకు దీటుగా జవాబిచ్చారు. మంత్రులు గెడ్డాలు పెంచి గత సమావేశాల సమయంలో సభలో రౌడీల మాదిరి వ్యవహరించారని టీడీపీ ఎమ్మెల్సీ దీపక్రెడ్డి వ్యాఖ్యానించారు. మంత్రి బొత్స జోక్యం చేసుకొని సభ్యులు అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని తీవ్ర స్థాయిలో అభ్యంతరం చెప్పారు. దీంతో చైర్మన్ షరీఫ్.. సభ్యులు బడ్జెట్పై చర్చకే పరిమితం కావాలని సూచించారు. ఆధారాలుండటం వల్లే అచ్చెన్నాయుడి అరెస్ట్ ► టీడీపీ నేత అచ్చెన్నాయుడు అరెస్టు వ్యవహారాన్ని ఆ పార్టీ ఎమ్మెల్సీ నాగజగదీశ్వరరావు ప్రస్తావిస్తూ.. ఈ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తోందన్నారు. ఈ వ్యాఖ్యలను ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు, జల వనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తీవ్రంగా తప్పుపట్టారు. ► అవినీతి కేసుల్లో ప్రాథమిక ఆధారాలు ఉండడం వల్లే అచ్చెన్నాయుడును పోలీసులు అరెస్టు చేశారని మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు. దొంగతనం చేస్తే, అవినీతి చేస్తే బీసీలు కదా అని వదిలి వేయాలా అని ఆయన ప్రశ్నించారు. టీడీపీ ఒక్క బీసీ నేతకు కూడా రాజ్యసభ సీటు కేటాయించ లేదని, సీఎం జగన్ ఇప్పుడు ఒకేసారి ఇద్దరు బీసీ నేతలకు రాజ్యసభ సీట్లు ఇచ్చారని చెప్పారు. ► పేద కార్మికులకు సంబంధించిన రూ.150 కోట్ల వ్యవహారంలో అవినీతి జరిగిందని తేలడంతో అచ్చెన్నాయుడు అరెస్టు జరిగిందని, తప్పు చేయకుంటే చట్టం ముందు ఆయన తన నిజాయితీని నిరూపించుకోవాలని మంత్రి అనిల్కుమార్ సవాల్ విసిరారు. తప్పుచేసే బీసీల పట్ల ఒక తీరుగా, అగ్రవర్ణాల పట్ల మరో తీరుగా వ్యవహరించడం చట్టంలో లేదన్నారు. గత ప్రభుత్వంలో కాపు నాయకుడు ముద్రగడ దీక్ష చేస్తుంటే అక్కడ 3 వేల మంది పోలీసులను దించి దిగ్బంధనం చేశారన్నారు. చంద్రబాబుకు, చైర్మన్కూ గెడ్డం ఉంది.. ► ‘మంత్రులు గెడ్డాలు పెంచుకుంటే రౌడీలన్నట్టు టీడీపీ ఎమ్మెల్సీలు మాట్లాడుతున్నారు.. చంద్రబాబుకు గెడ్డం ఉంది.. చైర్మన్కు కూడా గెడ్డం ఉంది.. వాళ్లు రౌడీలవుతారా’ అని అనిల్కుమార్ యాదవ్ ప్రశ్నించారు. ► మంత్రి అనిల్ మాట్లాడే సమయంలో టీడీపీ ఎమ్మెల్సీ నాగజగదీశ్వరరావు జోక్యం చేసుకుని, మంత్రిపై క్రికెట్ బెట్టింగ్ కేసు ఉందనడంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. ► గత ప్రభుత్వంలో పోలీసులు కేవలం నోటీసులిచ్చారని, తాను తప్పు చేయలేదు కాబట్టి విచారణకు హాజరై తన నిజాయితీని నిరూపించుకున్నానని అనిల్ అన్నారు. పోలీసు రికార్డులు పరిశీలించుకోవచ్చని చెప్పారు. గత ఎన్నికల్లో అప్పటి ప్రభుత్వం వంద కోట్లు ఖర్చు పెట్టి తనను ఓడించడానికి ప్రయత్నించిందని, అయినా తనను ఏమీ చేయలేకపోయారని చెప్పారు. ► సభలో గొడవ ముదిరే పరిస్థితికి దారితీస్తుండటంతో చైర్మన్ సభను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత కూడా కొద్దిసేపు టీడీపీ ఎమ్మెల్సీ నాగజగదీశ్వరరావు, మంత్రి అనిల్ మధ్య వాగ్వాదం సాగింది. -
దొంగలను అరెస్ట్ చేయొద్దా?
సాక్షి, అమరావతి: దొంగలను అరెస్టు చేయకుండా.. దండలు వేసి ఊరేగించాలా అంటూ టీడీపీ సభ్యులపై మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర బడ్జెట్పై శాసన మండలిలో బుధవారం చర్చ జరుగుతుండగా.. టీడీపీ సభ్యుడు రాజేంద్రప్రసాద్ కలుగజేసుకొని తమ పార్టీ నాయకులను అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు. దీంతో మంత్రి బొత్స స్పందిస్తూ.. ‘ఈఎస్ఐలో జరిగిన కుంభకోణంలో అచ్చెన్నాయుడే ప్రధాన పాత్రధారుడనే విషయం ఏసీబీ దర్యాప్తులో తేలింది. అలాగే జేసీ ప్రభాకర్రెడ్డిని కూడా అక్రమాలకు పాల్పడినందునే అరెస్టు చేశారు’ అని వివరించారు. ఫైబర్ గ్రిడ్లో ఏం జరిగిందో.. వాటి స్కామ్లకు సంబంధించిన అవినీతిని కూడా బయటకు తీస్తామని చెప్పారు. అవినీతిపరులపై ప్రభుత్వం విచారణ చేయకుండా ఎలా ఉంటుందని ప్రశ్నించారు. చంద్రబాబుకు ధైర్యముంటే టీడీపీ హయాంలో అవినీతి జరగలేదని సభలో చెప్పాలంటూ సవాల్ విసిరారు. -
రాష్ట్రానికి భారీ పెట్టుబడులొచ్చాయ్!
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చాయని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చెప్పారు. బుధవారం శాసన మండలిలో బడ్జెట్పై చర్చ అనంతరం సభ్యుల ప్రశ్నలకు సమాధానమిస్తూ.. భారీగా పెట్టుబడులు రావడం వల్ల పెద్దఎత్తున ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించినట్టు తెలిపారు. బుగ్గన ఇంకా ఏమన్నారంటే.. ► ఈ బడ్జెట్లో సంక్షేమం, అభివృద్ధికి సమన్యాయం కల్పించాం. విభజన సమయంలో కేంద్రం నుంచి రావాల్సిన రెవెన్యూ గ్రాంట్లు రావడం లేదు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నాం. ► భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణానికి గత ప్రభుత్వం జీఎమ్మార్కు 2,700 ఎకరాలను కేటాయించింది. ఇప్పుడు 2,200 ఎకరాల్లోనే విమానాశ్రయ నిర్మాణానికి ఆ సంస్థ అంగీకరించింది. తాజా ఒప్పందం ప్రకారం ప్రభుత్వానికి 500 ఎకరాలు మిగిలింది. ► రాష్ట్రంలో 15 చోట్ల టూరిజం అభివృద్ధి పనులు చేపట్టనున్నాం. నూతన పథకాలకు రూ.20 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నాం. ► నవంబర్లో కరోనా వైరస్ పీక్ స్టేజ్ (గరిష్ట దశ)కు చేరుకుంటుందని వైద్య నిపుణుల అంచనా. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో అభివృద్ధి పనులు ఎప్పటిలోగా పూర్తి చేస్తామని అడిగితే చెప్పలేని పరిస్థితి దాపురించింది. ► కరోనా వేళ సభ నడపటానికే ఇబ్బందికర పరిస్థితులుంటే ప్రతిపక్ష సభ్యులు బడ్జెట్ అంశాలు కాకుండా ఏవేవో మాట్లాడుతూ సమయం వృథా చేస్తున్నారు. శాసనమండలిలో బడ్జెట్పై చర్చ సందర్భంగా వైఎస్సార్సీపీ, పీడీఎఫ్, టీడీపీ, బీజేపీ ఎమ్మెల్సీలు మాట్లాడారు. సభ్యులు ఏమన్నారంటే.. ఏ వర్గాన్నీ నిర్లక్ష్యం చేయని బడ్జెట్ అన్నివర్గాల అభ్యున్నతే లక్ష్యంగా జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఏడాది పాలన కొనసాగింది. ఈ బడ్జెట్లోనూ ఏ ఒక్క వర్గాన్ని నిర్లక్ష్యం చేయకుండా కేటాయింపులు చేశారు. అధికారం చేపట్టిన ఏడాదిలోపే 4 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపారు. – జంగా కృష్ణమూర్తి, వైఎస్సార్సీపీ సభ్యుడు తేడా కనిపిస్తోంది బడ్జెట్ అంచనాలకు, వాస్తవ పరిస్థితులకు చాలా తేడా కనిపిస్తోంది. – దీపక్రెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ ఎక్కువ నిధులు రాబట్టాలి బడ్జెట్ ప్రతిపాదనలకు, వాస్తవానికి పొంతన లేదు. కేంద్రం నుంచి ఎక్కువ నిధులను రాబట్టాల్సిన అవసరం ఉంది. ఏడాది కాలంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు పేదలకు ఊరట కలిగిస్తాయి. పేదలను శాశ్వతంగా అభివృద్ధి చేసే కార్యక్రమాలను కూడా కొనసాగించాలి. – లక్ష్మణరావు, పీడీఎఫ్ ఎమ్మెల్సీ మా పార్టీ సమర్థిస్తోంది ఏడాది పాలనలో 3.58 కోట్ల ప్రజలకు ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలను చేరువ చేసింది. ఈ బడ్జెట్లోనూ సంక్షేమ పథకాలకు చేసిన కేటాయింపులను మా పార్టీ సమర్ధిస్తోంది. రాష్ట్ర ఆదాయం పెంచే మార్గాలను బడ్జెట్లో ఎక్కడా పొందుపరచలేదు. -
ఎన్పీఆర్, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా తీర్మానం
సాక్షి, అమరావతి: జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్), జాతీయ పౌర పట్టిక(ఎన్ఆర్సీ)కు వ్యతిరేకంగా రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది. గతంలో ప్రకటించిన విధానానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. ఎన్పీఆర్లో కేంద్రం కొత్తగా చేర్చిన అంశాలతో ముస్లింలలో భయాందోళన నెలకొని ఉందని పేర్కొంది. 2010 నాటి ఫార్మాట్ అమలు చేయాలంటూ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లాడారంటే.. ► కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన ఎన్పీఆర్, ఎన్ఆర్సీలపై ముస్లింలలో అభద్రతా భావముంది. ► రాష్ట్రంలో ఎట్టి పరిస్థితిలోనూ ఎన్పీఆర్ను అమలు చేయబోమని సీఎం వైఎస్ జగన్ గతంలో స్పష్టం చేశారు. ► ఎన్పీఆర్లో కొన్ని కాలమ్స్ ముస్లింలకు ఆందోళన కలిగించేవిగా, భయపెట్టేవిగా ఉన్నాయి. ► తల్లిదండ్రుల వివరాలు, పుట్టిన తేదీ, ప్రదేశానికి సంబంధించిన వివరాలతో పాటు మాతృభాషకు సంబంధించి కొన్ని అభ్యంతరాలున్నాయి. ► 2010లో ఎన్పీఆర్ నిర్వహించారు. అయితే ఇప్పుడు నిర్వహిస్తున్న ఫార్మాట్లో అభ్యంతరాలున్నాయి. ► 2010 ఫార్మాట్ ప్రకారమే ఎన్పీఆర్ను కొనసాగించాలని తీర్మానంలో చెప్పాం. ► మార్చి 4న జరిగిన మంత్రివర్గ సమావేశంలో కూడా ఎన్పీఆర్, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా తీర్మానం చేశాం. సీఎం వైఎస్ జగన్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ముస్లింలకు భరోసా వచ్చింది. -
పల్నాటి ప్ర'జల కల'
సాక్షి, అమరావతి: తీవ్ర దుర్భిక్షంతో తల్లడిల్లుతున్న ‘పల్నాటి సీమ’ను సుభిక్షం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. రూ.1,750 కోట్లతో వరికపుడిశెల ఎత్తిపోతల పథకం, రూ.6,020 కోట్లతో వైఎస్సార్ పల్నాడు ఎత్తిపోతల పథకం పనులను ‘వైఎస్సార్ పల్నాడు దుర్భిక్ష నివారణ మిషన్’ కింద చేపట్టి వరద జలాలను తరలించడం ద్వారా పల్నాడును సస్యశ్యామలం చేయాలని నిర్ణయించింది. ఈ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు నిధుల సమీకరణ కోసం ఎస్పీవీ(స్పెషల్ పర్పస్ వెహికల్)ను ఏర్పాటు చేయాలని జలవనరుల శాఖను ఆదేశించింది. పల్నాటి ప్రజల 70 ఏళ్ల స్వప్నం.. వరుసగా వర్షాభావంతో పల్నాడు కరవు కోరల్లో చిక్కుకుపోయింది. గుక్కెడు తాగునీటికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న దుస్థితి నెలకొంది. పల్నాడు ప్రజల ఏడు దశాబ్దాల స్వప్నమైన వరికపుడిశెల ఎత్తిపోతల పథకాన్ని సాకారం చేయడం, పోలవరం కుడి కాలువ ద్వారా ప్రకాశం బ్యారేజీకి తరలించిన గోదావరి జలాలను వైఎస్సార్ పల్నాడు ఎత్తిపోతల పథకం ద్వారా అందచేసి ఆ ప్రాంత తాగు, సాగునీటి కష్టాలను కడతేర్చ డానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జలవనరుల శాఖను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. వైఎస్సార్ పల్నాడు ఎత్తిపోతల పథకం ఇదీ.. ► పోలవరం కుడి కాలువ నుంచి ప్రకాశం బ్యారేజీకి తరలించిన జలాల్లో కృష్ణా డెల్టాకు విడుదల చేయగా మిగులుగా ఉన్న ఏడు వేల క్యూసెక్కులను ప్రకాశం బ్యారేజీ జలవిస్తరణ ప్రాంతం నుంచి నాగార్జున సాగర్ కుడి కాలువలోకి(80 కి.మీ. వద్దకు) ఎత్తి పోస్తారు. కుడి కాలువ ఆయకట్టుకు నీటిని అందిస్తూనే పల్నాటి సీమకు గోదావరి జలాలను తరలిస్తారు. ► ప్రకాశం బ్యారేజీ నుంచి గోదావరి జలాలను నాగా ర్జునసాగర్ కుడి కాలువలోకి ఎత్తిపోసే పనులను రెండు ప్యాకేజీలుగా చేపడతారు. వైఎస్సార్ పల్నాడు ఎత్తిపోతల పథకం మొదటి ప్యాకేజీ పనులను రూ.2,845 కోట్ల వ్యయంతో, రెండో ప్యాకేజీ పనులను రూ.3,175 కోట్ల వ్యయంతో చేపట్టాలని జలవనరుల శాఖ అధికారులు చేసిన ప్రతిపాదనకు సీఎం వైఎస్ జగన్ ఆమోదముద్ర వేశారు. వరికపుడిశెల ఎత్తిపోతల పథకం ఇదీ.. వరికపుడిశెల వాగు వరద జలాలను ఒడిసి పట్టి పల్నాటి సీమను సస్యశ్యామలం చేయాలనే ప్రతిపాదన ఏడు దశాబ్దాలుగా కాగితాలకే పరిమితమైంది. ఈ ఎత్తిపోతల పథకానికి సీఎం వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వరికపుడిశెల ఎత్తిపోతల పథకం తొలిదశను రూ.350 కోట్లతో, రెండో దశను రూ.1,400 కోట్లతో చేపట్టే ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేశారు. వైఎస్సార్ పల్నాడు దుర్భిక్ష నివారణ మిషన్కు శ్రీకారం.. వరికపుడిశెల ఎత్తిపోతల పనులను రూ.1,750 కోట్లతోనూ, వైఎస్సార్ పల్నాడు ఎత్తిపోతల పథకం పనులను రూ.6,020 కోట్లతో వెరసి రూ.7,770 కోట్ల వ్యయంతో వైఎస్సార్ పల్నాడు దుర్భిక్ష నివారణ మిషన్ కింద చేపట్టాలని సీఎం వైఎస్ జగన్ జలవనరుల శాఖను ఆదేశించారు. ఈ పనులను వేగంగా పూర్తి చేయడానికి నిధుల సమీకరణ కోసం ఎస్పీవీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అంతర్జాతీయ, జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి తక్కువ వడ్డీకే రుణాలు తెచ్చి ఈ ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేసి పల్నాడులో రెండు లక్షల ఎకరాలకు నీళ్లందించడం ద్వారా సుభిక్షం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం వైఎస్ జగన్కు కృతజ్ఞతలు ముఖ్యమంత్రిని కలిసిన పల్నాడు ప్రజాప్రతినిధులు పల్నాడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలు తీర్చే వరికపుడిశెల ఎత్తిపోతల పథకానికి బడ్జెట్లో నిధులు కేటాయించినందుకు సీఎం వైఎస్ జగన్కు ఆ ప్రాంత ప్రజాప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం అసెంబ్లీలోని ముఖ్యమంత్రి చాంబర్లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని జలవనరుల శాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్తో కలిసి నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు, నంబూరి శంకరరావు, అంబటి రాంబాబు కలిశారు. పల్నాటి ప్రజల చిరకాల స్వప్నమైన వరికపుడిశెల ఎత్తిపోతల పథకాన్ని సాకారం చేసే దిశగా చర్యలు చేపట్టినందుకు సీఎం జగన్కు ధన్యవాదాలు తెలిపారు. 70 ఏళ్లుగా పల్నాటి ప్రజలకు కలగా మిగిలిన వరికపుడిశెల లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని త్వరగా పూర్తి చేసేందుకు వైఎస్సార్ పల్నాడు దుర్బిక్ష నివారణ మిషన్లో విలీనం చేయడం గొప్ప విషయమన్నారు. -
ద్రవ్య వినిమయ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
సాక్షి, అమరావతి: ద్రవ్య వినిమయ బిల్లు (అప్రాప్రియేషన్ బిల్)కు బుధవారం అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 2,28,738 కోట్ల బడ్జెట్ వినియోగానికి సంబంధించిన ఈ బిల్లును సభలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశపెట్టారు. అలాగే గడిచిన మూడు మాసాలకు గానూ బడ్జెట్ వినియోగానికి ఇచ్చిన ఆర్డినెన్స్కూ సభ ఆమోద ముద్ర వేసింది. 2019–20 ఆర్థిక సంవత్సరానికి అనుబంధ వ్యయాలు (సప్లిమెంటరీ ఎస్టిమేట్స్)కు శాసనసభ ఆమోదం తెలిపింది. ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోద ముద్ర వేసిన అనంతరం స్పీకర్ తమ్మినేని సీతారాం శాసనసభను నిరవధికంగా వాయిదా వేశారు. ► అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 5.58 గంటల పాటు జరిగినట్లు స్పీకర్ చెప్పారు. ► ద్రవ్య వినిమయ బిల్లుతో సహా 15 బిల్లులు పాస్ చేసినట్టు పేర్కొన్నారు. ► ద్రవ్య వినిమయ బిల్లు పాస్ చేసే సమయంలో స్పీకర్.. మీకేమైనా వేతనాలు తగ్గాయా అంటూ ఛలోక్తి విసిరారు. దీనికి సభ్యులు ఒక్కసారిగా నవ్వి.. తమకు ఎలాంటి కోతలూ లేవని అన్నారు. ► ఈ సమావేశాల్లో వైఎస్సార్ సీపీ తరఫున 151 మంది, టీడీపీ తరఫున 23 మంది, జనసేన పార్టీ తరఫున ఒకరు పాల్గొన్నారని స్పీకర్ తెలిపారు. ► 2020–21 బడ్జెట్కు సంబంధించి వివిధ శాఖల పద్దులను కూడా శాసనసభ ఆమోదించింది. ► రాష్ట్ర బడ్జెట్కు అనుగుణంగా వివిధ శాఖల పద్దులను విడివిడిగా ఆమోదించాల్సిందిగా అన్ని శాఖల తరఫున ఆర్థిక మంత్రి శాసనసభను కోరారు. ► అనంతరం సభాపతి స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ఆయా శాఖల పద్దులకు సభ ఆమోదం తెలిపిందని ప్రకటించారు. -
ఆక్వా బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఏపీఎస్ఏడీఏ (ఏపీస్టేట్ ఆక్వా డెవలప్మెంట్ అథారిటీ) బిల్లును బుధవారం శాసనసభ ఆమోదించింది. రాష్ట్రంలో చేపలు, రొయ్యల సాగు అభివృద్ధికి సంబంధించిన ప్రాధికార సంస్థ బిల్లును మత్స్య, పశు సంవర్ధక శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణారావు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. బిల్లు ఆమోదం పొందిన అనంతరం మంత్రి మోపిదేవి మాట్లాడారు. ఆయన ఏం చెప్పారంటే.. ► ఆక్వా ఉత్పత్తుల్లో ఏపీ అగ్రస్థానంలో ఉండగా, దేశ ఎగుమతుల్లో 50 శాతం రాష్ట్రం నుంచి అవుతున్నాయి. కరోనా కష్టకాలంలోనూ 80 వేల మెట్రిక్ టన్నుల ఉత్పత్తులకు గిట్టుబాటు ధర నిర్ణయించి కొనుగోలు చేయించాం. ► ఆక్వా రంగానికి ప్రధానమైన విద్యుత్ యూనిట్ రేటు గతంలో రూ. 3.50 ఉండగా, దాన్ని రూ. 1.50 తగ్గించాం. ► 9 జిల్లాల్లో 8 మేజర్ ఫిషింగ్ హార్బర్లు, 4 మైనర్ ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు రూ. 3,200 కోట్లతో నిర్మించేందుకు సీఎం నిర్ణయం తీసుకున్నారు. ► ఆక్వా రంగంలో తీసుకున్న నిర్ణయాలతో 18 లక్షల మంది నిరుద్యోగ యువకులకు పరోక్షంగానూ, ప్రత్యక్షంగాను ఉపాధి లభిస్తోంది. ► వేల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించి పెడుతున్న ఈ రంగం అసంఘటిత రంగంగా ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఆ రంగంలో ఉన్నవారికి భరోసా కల్పిస్తున్నాయి. ► వైఎస్ జగన్ పాదయాత్ర సమయంలో ఆక్వారైతుల సమస్యలు విన్నారు. అధికారంలోకి రాగానే సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు సమస్యలు పరిష్కరించారు. ఆక్వా ప్రాధికార సంస్థతో ప్రయోజనాలు ఇవే ► చేపలు, రొయ్యల పెంపకంలో నూతన వ్యాపార మార్గాలను సృష్టించడం ► ఆక్వా పెంపకానికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి జిల్లా, రాష్ట్రస్థాయిలో ఫోరం ఏర్పాటు ► ఆక్వా రైతులకు మార్కెట్ ఇంటిలిజెన్స్ సేవలు. చేపలు, రొయ్యలకు వచ్చే వ్యాధులపై నిఘా, నియంత్రణ చర్యలు ► సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతులపై మార్కెట్ సమాచారాన్ని సేకరించి ఎప్పటికప్పుడు రైతులకు ప్రయోజనం చేకూర్చడం. నాణ్యతా ప్రమాణాలు పాటించేందుకు తనిఖీలు..ఆడిట్లు ► సీడ్ హేచరీస్, ఫీడ్ ప్లాంట్ మేనేజ్మెంట్, ఆక్వా ఉత్పత్తి చేసే రైతులు, ప్రాసెసింగ్ చేసే ఎగుమతిదారులూ భాగస్వాములను చేయడం ► ఇప్పటికే రైతు భరోసా కేంద్రాల్లో 36 చోట్ల రూ.50 కోట్ల వ్యయంతో ఆక్వా టెస్టింగ్ లాబ్స్ ఏర్పాటు. క్వాలిటీ మెటిరియల్ అందించి రైతులు నష్టపోకుండా పర్యవేక్షణ విధానాన్ని ఏర్పాటు చేయడం ► ఆక్వా ఉత్పత్తుల నిల్వకు కోల్డ్ స్టోరేజీ ప్లాంట్లను ఏర్పాటు చేయడం ► అసంఘటిత రంగంగా ఉన్న ఈ రంగాన్ని సంఘటిత రంగంగా మార్చడం జగన్ సర్కారు వచ్చాక తీసుకున్న నిర్ణయాలు ఇవే ► కోవిడ్ సమయంలో 1.10 లక్షల మందికి రూ. 10 వేలు చొప్పున సాయం. ► డీజిల్ సబ్సీడీని 6 రూపాయల నుంచి 9 రూపాయలకు పెంచి వేటకు వెళ్లిన రోజునే స్మార్ట్ కార్డు ద్వారా వారి ఖాతాల్లో జమచేయడం ► చేపల వేట నిషేధం సమయంలో ఇచ్చే రూ.4వేల పరిహారాన్ని రూ.10వేలకు పెంచడం. చనిపోయిన వ్యక్తులకు పరిహారం రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకూ పెంచడం ► తూర్పు గోదావరి జిల్లాలో గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్ ఆయిల్ కోసం చేపల వేటపై నిషేధం విధించిన సమయంలో వాళ్లు ఇస్తానన్న పరిహారం చెల్లించకపోతే ఏపీ ప్రభుత్వమే రూ.80 కోట్లు చెల్లించడం ► సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన హామీ మేరకు ఉత్తరాంధ్రకు చెందిన 22 మంది మత్స్యకారులు గుజరాత్ వలస వెళ్లి పాకిస్తాన్ కోస్ట్గార్డ్ అధికారులు అరెస్టు చేస్తే.. వారిని నాలుగు మాసాల్లోనే విడిపించి స్వరాష్ట్రానికి తీసుకురావడం ► ఆక్వా రైతులకు కరెంటు చార్జీలు తగ్గించి రూ.720 కోట్ల అదనపు భారాన్ని ప్రభుత్వమే భరించడం. మండలిలో ఆమోదం పొందిన బిల్లులు ► ఏపీ పంచాయతీ రాజ్ చట్టం – 1994 సవరణ బిల్లు ► ఏపీ విలువ ఆధారిత పన్ను చట్టం – 2005 సవరణ బిల్లు.. రాష్ట్ర జీఎస్టీ చట్ట సవరణ బిల్లు (జీఎస్టీ 38వ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం మేరకు) ► ఏపీ ఆబ్కారీ చట్టం –1968 సవరణ బిల్లు ► ఏపీ మద్య నిషేధ చట్టం –1995 సవరణ బిల్లు ► పురపాలక కార్పొరేషన్ల చట్టం – 1955, ఏపీ పురపాలికల చట్టం – 1965 సవరణ బిల్లు. ► ఏపీ ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ చట్ట సవరణ బిల్లు ► తిరుమల ఆలయం తలుపులు తెరిచి తొలి దర్శనం చేసుకొనే ‘సన్నిధి యాదవ్’కు వారసత్వ హక్కు కల్పిస్తూ దేవదాయ చట్ట సవరణ బిల్లు ► ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ – జూన్ వరకు బడ్జెట్ కేటాయింపులకు వీలుగా తెచ్చిన ఆర్డినెన్స్ బిల్లు. రాష్టంలో 8 దేవాలయాల ట్రస్టు బోర్డుల నియామకాల్లో మార్పులు చేస్తూ బిల్లు -
అమరవీరులకు శాసనసభ సంతాపం
సాక్షి, అమరావతి: గాల్వన్ లోయ వద్ద చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో అమరులైన వీర జవానులకు రాష్ట్ర శాసనసభ సంతాపం ప్రకటించింది. బుధవారం ఉదయం శాసనసభ ప్రారంభం కాగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమర వీరులకు సంతాపం తెలుపుతూ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దేశ సమగ్రత, సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు విధి నిర్వహణ చేస్తూ.. గాల్వన్ లోయ వద్ద జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు అమరులయ్యారని.. వారికి రాష్ట్ర ప్రజల తరఫున శాసనసభ ఘన నివాళులర్పిస్తోందన్నారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియచేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్బాబు త్యాగం తెలుగు ప్రజలకు ఎప్పటికీ గుర్తుండి పోతుందన్నారు. వీర మరణం పొందిన సైనికులకు ఆత్మశాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేర్కొన్నారు. అనంతరం రెండు నిమిషాల పాటు సభ మౌనం పాటించింది. అలాగే శాసనమండలిలో కూడా బీజేపీ సభ్యుడు మాధవ్ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సభ్యులు మూడు నిమిషాలు మౌనం పాటించి అమర వీరులకు నివాళులర్పించారు. మండలి చైర్మన్ షరీఫ్ మాట్లాడుతూ.. వీర మరణం పొందిన భారత సైనికులకు ఆత్మశాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నామన్నారు. -
అప్రజాస్వామికం.. అమానుషం
సాక్షి, అమరావతి: శాసనమండలిలో టీడీపీ సభ్యులు నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే.. చైర్మన్, డిప్యూటీ చైర్మన్ అప్రజాస్వామికంగా వ్యవహరించి సభ నడిపారని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్చంద్రబోస్, మంత్రులు కురసాల కన్నబాబు, ఆదిమూలం సురేష్, మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు. యనమల రామకృష్ణుడు తన తెలివితేటలతో సభను విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం సభ నడపమని వేడుకునే దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. మండలి నిరవధిక వాయిదా అనంతరం వారంతా మీడియాతో మాట్లాడారు. ఉప ముఖ్యమంత్రి బోస్ ఏమన్నారంటే.. ► రూల్–90 ప్రకారం ఏదైనా అంశంపై చర్చ చేపట్టాలంటే ఒకరోజు ముందే నోటీసు ఇవ్వాలి. చైర్మన్, సభా నాయకుడితో మాట్లాడి పరిగణనలోకి తీసుకోవాలి. ఇవేమీ పట్టించుకోకుండా చైర్మన్ రూల్–90ని పరిగణనలోకి తీసుకున్నారు. ► ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదిస్తే తప్ప ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి. ప్రభుత్వ ఖజానా నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేం. ► ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లో పెట్టాలన్న ఆలోచనతోనే టీడీపీ వ్యవహరించింది. ఉన్నత లక్ష్యాల కోసం ఏర్పడ్డ పెద్దల సభను అప్రతిష్ట పాల్జేశారు. టీడీపీకి రాజకీయమే ప్రాధాన్యత. రాష్ట్ర ప్రజల బాగోగులు అవసరం లేదు. ► ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ చేతులు జోడించి వేడుకున్నా పట్టించుకోలేదు. 33వేల ఎకరాల్లో వ్యాపారం చేసుకోవడం కోసమే ప్రభుత్వ బిల్లులను అడ్డుకున్నారు. ► యనమల రామకృష్ణుడిది పైశాచిక ఆనందం. టీడీపీ సభ్యులు వారి మాట వినకపోతే విధ్వంసం సృష్టిస్తామని బెదిరిస్తున్నారు. సభా సంప్రదాయాలు, నిబంధనలు వారికి అవసరం లేదు. శాసన మండలి సమావేశం ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న చీఫ్ విప్ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు. చిత్రంలో మంత్రులు, వైఎస్సార్ సీపీ ప్రజాప్రతినిధులు చరిత్రలో దుర్దినం : మంత్రి కన్నబాబు ► టీడీపీ సభ్యులు సభా నిబంధనల్ని ఉల్లంఘించారు. మెజార్టీ ఉందని ఇష్టానుసారం వ్యవహరించారు. చరిత్రలో ఇది దుర్దినం. ► మంత్రి వెలంపల్లి శ్రీనివాస్పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. ఫొటోలు తీయొద్దని చెప్పినందుకు లోకేష్ దాడికి దిగారు. సభలో ఫొటోలు తీసి లోకేష్ సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ► దీనిపై కచ్చితంగా సభా నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలి. లోకేష్ విధానం సరికాదని చైర్మన్ కూడా చెప్పారు. ► మండలి నిరవధిక వాయిదా వెనుక యనమల ప్లాన్ ఉంది. మెజార్టీ ఉందని సభను అడ్డుకుంటున్నారు. ► డిప్యూటీ చైర్మన్ తీరు ఆక్షేపణీయం. టీడీపీకి తప్ప ఏ ఇతర పార్టీ సభ్యులకు అవకాశం ఇవ్వలేదు. ► మూడ్ ఆఫ్ ద ఫ్లోర్ తీసుకోవాలని నాలుగు గంటలు కోరాం. బీజేపీ, పీడీఎఫ్, ఇతర సభ్యుల అభిప్రాయాలనూ పరిగణనలోకి తీసుకోలేదు. దాడికి దిగారు: మంత్రి ఆదిమూలపు ► టీడీపీ సభ్యులు సభ నియమ, నిబంధనల్ని తుంగలో తొక్కారు. మంత్రులపై ఒక్కసారిగా దాడికి తెగబడ్డారు. ► పాస్ చేయాల్సిన బిల్లులను అడ్డుకున్నారు. సంక్షేమ కార్యక్రమాల్ని టీడీపీ అడ్డుకుంటోంది. వాయిదా వేయడం శోచనీయం: చీఫ్ విప్ ఉమ్మారెడ్డి ► శాసనమండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్ నిర్ణయాలు అప్రజాస్వామికంగా ఉన్నాయి. టీడీపీ సభ్యులు కుట్రతోనే వచ్చారు. ► కీలక బిల్లులు ఆమోదించకుండానే సభను వాయిదా వేయడం శోచనీయం. టీడీపీ సభ్యులు చరిత్ర హీనులుగా మిగిలిపోతారు. ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదానికి అవకాశం ఇవ్వలేదు. సభను విచ్ఛిన్నం చేయడానికి టీడీపీ ప్రయత్నించింది. గత సమావేశాల్లో మాదిరిగానే చైర్మన్ వ్యవహరించారు. ఇపుడు ఏం జరగనుంది? ద్రవ్య వినిమయ బిల్లు ► ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించకుండా మండలిలో అడ్డుకోవడంవల్ల మహా అయితే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, ఇతర చెల్లింపులు ఒకటి రెండు రోజులు ఆలస్యం కావడం మినహా ఎలాంటి సమస్య ఉండబోదని ఆర్థిక రంగ నిపుణులు అంటున్నారు. ► శాసనసభ ఆమోదించిన ఆర్థిక బిల్లులను మండలి 14 రోజులు జాప్యం చేయగలదు తప్ప అంతకుమించి ఎలాంటి అధికారం లేదు. ► ‘ద్రవ్య వినిమయ బిల్లును శాసనసభ ఈనెల 17న ఆమోదించింది. ఇక 14 రోజులు అంటే ఈ నెలాఖరుతో గడిచిపోతాయి. వచ్చే నెల ఒకటి లేదా రెండో తేదీ నుంచి యథా ప్రకారం చెల్లింపులు చేయవచ్చు’ అని నిపుణులు తెలిపారు. సీఆర్డీఏ రద్దు.. వికేంద్రీకరణ ► ఆర్థికేతర బిల్లులను రెండోసారి మండలిలో అడ్డుకోవడంవల్ల నెల రోజులు అవి చట్టరూపం దాల్చ కుండా ఆగిపోతాయి. నెల రోజుల్లో మండలి ఆమోదించినా, తిరస్కరించినా రాజ్యాంగంలోని ఆర్టికల్ 197 ప్రకారం ఆ బిల్లులు ఆమోదం పొందినట్లే. ► ఏదైనా బిల్లును శాసనసభ ఆమోదించి మండలికి పంపితే అది మూడు నెలలు మాత్రమే దానిని ఆపగలదు. మూడు నెలల్లో తిరస్కరించినా, వెనక్కు పంపినా మళ్లీ అసెంబ్లీ ఆమోదించి పంపవచ్చు. ఇలా వచ్చిన బిల్లును మండలి నెల రోజుల్లోగా ఆమోదించి పంపాలి. ఒకవేళ ఆమోదించకపోయినా తిప్పి పంపకపోయినా ఎలాంటి సవరణలు లేకుండా ఆమోదం పొందినట్లేనని ఆర్టికల్ 197 స్పష్టంగా చెబుతోంది. ► పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు, విద్యా హక్కు చట్ట సవరణ బిల్లులను అసెంబ్లీ ఆమోదించి మండలికి పంపించి మూడు నెలలు దాటిపోయింది. ఇప్పుడు మళ్లీ అసెంబ్లీ ఆమోదించి మండలికి పంపింది. వీటిని మండలిలో చర్చకు రాకుండా అడ్డుకున్నంత మాత్రాన ఒరిగేదేమీలేదని,అవి ఆమోదం పొందినట్లేనని న్యాయ నిపుణులంటున్నారు. -
మండలిలో గూండాగిరి
సాక్షి, అమరావతి: శాసనమండలిలో తనకున్న సంఖ్యా బలాన్ని చూసుకుని బుధవారం టీడీపీ దౌర్జన్యకాండకు దిగింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి ప్రజాస్వామ్య విలువలను మంటగలిపింది. అసెంబ్లీలో ఆమోదం పొంది వచ్చిన బిల్లుల్ని ప్రభుత్వం బుధవారం మండలిలో ప్రవేశపెట్టే క్రమంలో టీడీపీ అడుగడుగునా అడ్డంకులు సృష్టించింది. సాక్షాత్తు రాష్ట్ర మంత్రిపై నిండు సభలో టీడీపీ ఎమ్మెల్సీలు కాళ్లతో దాడి చేసి బీభత్సం సృష్టించారు. అడ్డుకున్న పలువురు మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్సీలపైనా దౌర్జన్యం చేసి తోసివేశారు. టీడీపీ ఎమ్మెల్సీల దాదా గిరితో సభలో అరగంట సేపు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రెచ్చగొట్టే వ్యాఖ్యలు.. నినాదాలు ► ద్రవ్య వినిమయ బిల్లు, అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల్లో ఏది మొదట తీసుకోవాలనే విషయంపై వివాదం ఏర్పడి సభ మూడు గంటలపాటు స్తంభించింది. ఏ నిర్ణయం తీసుకోకుండా ప్రతిష్టంభన నెలకొన్న సమయంలో టీడీపీ ఎమ్మెల్సీలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు. ► చైర్మన్ పోడియం వద్దకు వచ్చి నినాదాలు చేశారు. ఏమీ జరక్కుండానే తమకు అనుకూలంగా జరిగినట్లు బల్లలు చరిచి అధికార పక్ష సభ్యులను రెచ్చగొట్టారు. ► ఈ దశలో దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్తో పలువురు ఎమ్మెల్సీలు గొడవకు దిగారు. చివరికి ఆయనపై ఒక్కసారిగా దాడి చేశారు. ► బీద రవిచంద్ర వెలంపల్లిని కాళ్లతో తన్నగా, మంతెన సత్యనారాయణరాజు ఆయన మెడ పట్టుకుని తోసివేశారు. మరో మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి వచ్చి వారిని ఆపి, మంత్రిని పక్కకు తీసుకువచ్చారు. ► ఆ తర్వాత కూడా బీద రవిచంద్ర మంత్రిపైకి దూసుకువచ్చి మళ్లీ దాడి చేసే ప్రయత్నం చేశారు. ఈలోపు మిగిలిన మంత్రులు వచ్చి అడ్డుకున్నారు. ఫొటోలు, వీడియోలు తీసిన లోకేష్ ► నారా లోకేష్ ఫొటోలు, వీడియోలు తీయడమే ఈ గొడవకు కారణమైంది. డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యంతో మంత్రులు నిబంధనల గురించి పోడియం ఎదుట నిలబడి మాట్లాడుతుండగా లోకేష్ వెనుక నుంచి ఫొటోలు, వీడియో తీశారు. మధ్యాహ్నం నుంచి సభ జరుగుతున్నంత సేపు ఆయన తన ఫోన్తో ఫొటోలు, వీడియోలు తీయడమే పనిగా పెట్టుకున్నారు. ► ఈ క్రమంలో ఎందుకు ఫొటోలు తీస్తున్నారని వెలంపల్లి ప్రశ్నించడంతో బీద రవిచంద్ర, మంతెన సత్యనారాయణ రాజు ఆయనపై దాడి చేశారు. దాడి సమయంలోనూ లోకేష్ ఫొటోలు తీస్తూనే ఉన్నారు. చైర్మన్ స్థానంలో ఉన్న డిప్యూటీ చైర్మన్ ఫొటోలు తీయొద్దని పదేపదే లోకేష్ను కోరినా ఆయన పట్టించుకోలేదు. ► మంత్రులు బొత్స సత్యనారాయణ, అనిల్కుమార్లు లోకేష్ ఫోన్లో తీసిన ఫొటోలు, వీడియోలు తొలగించాలని డిప్యూటీ చైర్మన్ను అడుగుతున్నప్పటికీ, ఆయన వెనుక నుంచి ఇంకా ఫొటోలు తీస్తూనే ఉన్నారు. ► ఇలా ఫొటోలు తీసి మంత్రులు, అధికారపక్ష సభ్యుల్ని రెచ్చగొట్టి, ఘర్షణకు కారణమైన లోకేష్.. చివర్లో గొడవ మరింత పెద్దదైన సమయంలో మెల్లగా బయటకు వెళ్లిపోయారు. ఆ తర్వాత అధికార, ప్రతిపక్ష పార్టీ సభ్యుల మధ్య కొద్దిసేపు తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో సభ అదుపులో లేదు కాబట్టి నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు డిప్యూటీ చైర్మన్ ప్రకటించి వెళ్లిపోయారు. సంప్రదాయాన్ని ఎందుకు పాటించాలి? ► బిల్లులపై ఓటింగ్ పెట్టాలని యనమల డిమాండ్ చేయగా, ఇవి కరోనా సమయంలో అత్యవసరంగా పెట్టిన అసెంబ్లీ సమావేశాలని.. ప్రభుత్వ బిజినెస్ కోసమే జరుగుతున్నాయని మంత్రి బుగ్గన అన్నారు. ► మధ్యలో ద్రవ్య వినిమయ బిల్లు పెడితేనే సహకరిస్తామని, లేకపోతే తాను వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై ఇచ్చిన రూలు 90 నోటీసు తీసుకోవాలని యనమల కోరారు. ► బుగ్గన దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. అజెండా ప్రకారం సభ నడపకుండా ఆరు బిల్లుల్ని పెండింగ్లో పెట్టడం సరికాదన్నారు. శాసన మండలి ఉన్నది ప్రభుత్వం పని చేయకుండా ఉండేందుకా అని ప్రశ్నించారు. ఎటూ తేలక సభ స్తంభించడంతో డిప్యూటీ ఛైర్మన్ సభను కొద్దిసేపు వాయిదా వేశారు. ► అనంతరం మళ్లీ ఇదే వివాదం నెలకొంది. డిప్యూటీ చైర్మన్ మాట్లాడుతూ ఏకాభిప్రాయం రానప్పుడు తాను నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. ద్రవ్య వినిమయ బిల్లు చివర్లో పెట్టాలనే సంప్రదాయం పాటించాల్సిన అవసరం లేదని, ఈ సభలోనే కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుడతానని తెలిపారు. ఫ్లోర్ లీడర్ల అభిప్రాయం తీసుకోండి ► మంత్రి బొత్స సత్యనారాయణ జోక్యం చేసుకుంటూ.. సభ మూడ్ను పరిగణనలోకి తీసుకోవాలని, మిగిలిన పార్టీ ఫ్లోర్ లీడర్ల అభిప్రాయాలు తీసుకుని నిర్ణయం తీసుకోవాలని కోరారు. ప్రతి చిన్న విషయానికి కీచులాటకు దిగడం సరికాదని, ఫ్లోర్ లీడర్లతో మాట్లాడి నిర్ణయం తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ కోరారు. ► సభలో మిగిలిన పక్షాల అభిప్రాయాలు ఎందుకు తీసుకోరని, కేవలం టీడీపీ అభిప్రాయమే ఎందుకు తీసుకుంటారని బుగ్గన ప్రశ్నించారు. ► ఒక దశలో తనకు ఈ ప్రభుత్వం ఎస్కార్టు తీసివేసిందని డిప్యూటీ చైర్మన్ చెప్పగా, టీడీపీ హయాంలో తాను ప్రతిపక్ష నేతగా ఎన్నికైనా.. నెల రోజులు ధృవీకరించకుండా ఇంకెవరైనా వైఎస్సార్సీపీ సభ్యులు టీడీపీలోకి వస్తే తనకు ఆ అవకాశం లేకుండా చేయాలని చూసిన విషయాన్ని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా రూలు 90 తీసుకున్న యనమల ► చర్చ జరుగుతుండగానే రూలు 90పై తనకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అంటూ.. టీడీపీ పక్ష నేత యనమల రామకృష్ణుడు వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుపై అభ్యంతరం చెప్పారు. ఆ రెండు బిల్లులపై రూలు 90 ప్రకారం తాను చెప్పిన విషయాలు రికార్డుల్లోకి వెళ్లిపోయాయని తెలిపారు. ► అసలు చైర్మన్ అనుమతివ్వకుండా ప్రతిపక్ష నేత ఎలా దాన్ని పెడతారని బుగ్గన ప్రశ్నించగా డిప్యూటీ చైర్మన్ అది రికార్డుల్లోకి వెళ్లిపోయిందని చెప్పారు. ► అసలు రూలు 90 తీసుకోవడానికే లేదని, దాన్ని ఒకరోజు ముందు ఇవ్వాలని, కానీ ఈరోజే ఇచ్చారని, అలాగే సభా నాయకుడు, శాసనసభా వ్యవహారాల మంత్రిని సంప్రదించిన తర్వాతే ఆ నోటీసుపై నిర్ణయం తీసుకోవాలని రూలు 94 చెబుతోందని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ నిబంధనావళిని చదివి వినిపించారు. అసలు రూలు 90ని ఎలా అడ్మిట్ చేశారు? ► ప్రతిపక్ష నేత చెప్పిన విషయాలను రికార్డుల్లోంచి తొలగించాలని బుగ్గన, బొత్స, పిల్లి సుభాష్చంద్రబోస్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులు కోరారు. ► ‘ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు రూల్ బుక్ను వల్లెవేస్తారు కానీ పాటించరు. టీడీపీ ఇచ్చిన రూలు 90 నోటీసును చైర్మన్ ఎలా అనుమతిస్తారు? దానిపై ఎలా హక్కు ఉంటుంది? చైర్మన్ అనుమతించాడు కాబట్టి మేం దాన్ని సభలో పెట్టేస్తామంటే కుదరదు. విచక్షణాధికారం ఎప్పుడు పడితే అప్పుడు ఇష్టం వచ్చినట్లు వినియోగించకూడదు. రూలు 90ని అనుమతించేటప్పుడు సభా నాయకుడిని సంప్రదించాలనే రూలు 94ని రద్దు చేయడానికి చైర్మన్ ఎవరు? ప్రతిపక్ష నేత యనమల సభను తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తున్నారు. శాసన మండలి టీడీపీ కార్యాలయం కాదు. అక్కడ చేసినట్లు ఇక్కడ చేస్తే కుదరదు. రూలు 94 బతికుందో.. చచ్చిపోయిందో చెప్పాలి. రూల్సు అమలు చేయనప్పుడు ఈ పుస్తకాలు ఎందుకు?’ అని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్చంద్రబోస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ► రూలు 90 తీసుకున్నాం కాబట్టి మిగిలిన బిల్లులు పెట్టాలని డిప్యూటీ చైర్మన్ కోరగా, మీ అనుమతి లేకుండా చెప్పిన విషయాలను రికార్డుల్లోంచి తొలగించాకే ఆ బిల్లులు పెడతామని బుగ్గన రాజేంద్రనాథ్ స్పష్టం చేశారు. సభ ఉన్నది ప్రభుత్వ బిజినెస్ జరగాడానికా, లేక ఎక్కడి నుంచో తెచ్చిన రూలు 90 కోసమా అని డిప్యూటీ చైర్మన్ను ప్రశ్నించారు. ఏ సభలో అయినా ప్రభుత్వ బిజినెస్కు టాప్ ప్రయారిటీ ఉంటుందని చెప్పారు. ► మంత్రులు, అధికార పక్ష సభ్యులు దీనిపై ఎంత అడిగినా డిప్యూటీ చైర్మన్ వినకుండా టీడీపీ పక్షం చెప్పిందే వినడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. ► ఈ పరిస్థితుల్లో టీడీపీ సభ్యులు గొడవ పెట్టుకుని అధికారపక్షంపై దాడికి దిగారు. అదే సమయంలో యనమల సూచన మేరకు డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ద్రవ్య వినిమయ బిల్లు సహా ఆరు బిల్లులు ఆమోదం పొందకుండా నిలిచిపోయాయి. మండలిలో టీడీపీ శకునిపాత్ర ► శాసన మండలిలో తెలుగుదేశం పార్టీ మరోసారి శకునిపాత్ర పోషించింది. చైర్మన్ స్థానంలో ఉన్న డిప్యూటీ చైర్మన్పై ఒత్తిడి తెచ్చి అసెంబ్లీ ఆమోదించిన ఆరు బిల్లులకు అడ్డుపడి చివరికి అవి ఆమోదం పొందకుండా చేసింది. తెలుగుదేశం పార్టీ రాజకీయంతో బడ్జెట్ సమావేశాల్లో అతి కీలకమైన ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందలేదు. ► వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులతోపాటు మరో మూడు బిల్లుల్ని ముందు ప్రవేశపెడతామని, చివర్లో ద్రవ్య వినిమయ బిల్లు ప్రవేశపెడతామని ఆర్థిక మంత్రి బుగ్గన తెలిపారు. కానీ యనమల.. ముందు ద్రవ్య వినిమయ బిల్లు పెట్టాలని పట్టుబట్టారు. ► ఎంతో అనుభవం ఉందని చెప్పే యనమల.. ఎప్పుడైనా ద్రవ్య వినిమయ బిల్లును చివర కాకుండా ముందు ప్రవేశపెట్టిన దాఖలా ఉందా? ఉంటే చూపాలని మంత్రి బుగ్గన కోరారు. ద్రవ్య వినిమయ బిల్లు తర్వాత ఇక ఏ బిజినెస్ జరగదని, అదే సంప్రదాయమన్నారు. -
‘ఇలాంటి వాటిని సీఎం జగన్ సహించరు’
సాక్షి, అమరావతి : నేతల్లో ఎవరికైనా ఇబ్బంది ఉంటే పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్లాలని శాసన మండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. పార్టీలో జరుగుతున్న అంతర్గత వివాదాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివేదిక తెప్పించుకున్నారన్నారు. శాసన మండలి వద్ద బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒకరిపై మరొకరు నేతలు చేసుకుంటున్న విమర్శలపై పార్టీ చాలా సీరియస్గా తీసుకుందన్నారు. ఇలాంటి వాటిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సహించరని స్పష్టం చేశారు. పార్టీ నేతలు క్రమశిక్షణ ఉల్లంగిస్తే కఠిన చర్యలు తప్పవని ఉమ్మారెడ్డి హెచ్చరించారు. (శాసన మండలిలో టీడీపీ హడావుడి) ఇబ్బందులు ఉంటే పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లాలని, హద్దు మీరితే ఎలాంటి చర్యలకైన వెనకాడమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పినట్లు వెల్లడించారు. నాయకులు ఒకరిపై మరొకరు సవాల్ విసురుకోవడం మానుకోవాలని హితవు పలికారు. నరసాపురంలో జరిగిన సంఘటనపై సీఎం వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు. తప్పెవరిది అనే దానిపై అధిష్టానం నివేదిక తెప్పించుకుంటుందని, పార్టీ అనుమతి లేనిదే ఎవరూ మీడియా సమావేశాలు నిర్వహించరాదని పేర్కొన్నారు. నేతలకు ఇబ్బంది ఉంటే అధిష్ఠానం దృష్టికి తీసుకురావాలని, ఎమ్మెల్యేలు ఎంపీలకే కాదు అందరికి ఇదే వర్తిస్తుందని తెలిపారు. సీఎం జగన్ సమయం ఇవ్వడం లేదనేది అవాస్తవమని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కొట్టిపారేశారు. (ఎన్ఆర్సీపై ఏపీ అసెంబ్లీలో తీర్మానం) ఎంపీ వ్యవహారం అందరూ చూశారు: ప్రసాదరాజు ఎమ్మెల్యేలను పందులు గుంపుగా ఎంపీ రఘురామ కృష్ణంరాజు పోల్చడం సరికాదని నరసాపురం ఎమ్మెల్యే ప్రసాదరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరుష పదజాలంతో పార్టీకి నష్టం జరిగేలా ప్రవర్తించారని, ఇబ్బంది ఉంటే అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లాలని సూచించినట్లు పేర్కొన్నారు. ఎంపీ వ్యవహారాన్ని అందరూ చూశారని, ధైర్యం ఉంటే ఆయనే రాజీనామా చేసి గెలవాలని సవాల్ విసిరారు. పార్టీ లేకపోతే రఘురామ కృష్ణంరాజు గడ్డి పరకతో సమానమన్నారు. (‘ఎంతమందికి చికిత్స అయినా ప్రభుత్వం సిద్ధం’) -
‘చంద్రబాబు ఆ ఆరోపణలను ఎందుకు ఖండించలేదు’?
సాక్షి, అమరావతి: ఆర్టీసీ బస్సుల కొనుగోలు స్కాం, ఫైబర్ గ్రిడ్ స్కామ్లకు సంబంధించిన అవినీతిని బయటకు తీస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. బుధవారం రెండో రోజు జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అవినీతి పరులపై విచారణ చేయకుండా ఎలా ఉంటామని ప్రశ్నించారు. ప్రభుత్వం అవినీతి జరిగిందని నిర్ధారించిందని తెలిపారు. ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు తమ ప్రభుత్వ హయాంలో అవినీతి జరగలేదని ఎందుకు ఖండించలేదని బొత్స నిలదీశారు. ఇతర రాష్ట్రాల్లో వాహనాలు కొనుగోలు చేయలేదని చెప్పండి అని సవాల్ విసిరారు. అప్పుడే తొందరపడితే ఎలా... ముందుంది ముసళ్ల పండుగ అని టీడీపీని ఉద్దేశించి బొత్స వ్యాఖ్యానించారు. ('దొంగలా తాళాలు వేసుకొని ఉంటే అరెస్ట్ చేయరా') -
ఏపీ శాసనసభ నిరవధిక వాయిదా
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్ 2020-21 కు శాసనసభ బుధవారం ఆమోదం తెలిపింది. దాంతోపాటు ద్రవ్యవినిమయ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఇక రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్ఆర్సీ (నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్)ను అమలు చేయబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ఎన్ఆర్సీ, ఎన్పీఆర్కు సంబంధించి రాష్ట్ర శాసనసభ నేడు ఒక తీర్మానం ఆమోదించింది. భోజన విరామం తర్వాత సభలో ఈ తీర్మానాన్ని ఉప ముఖ్యమంత్రి అంజాద్బాషా ప్రవేశపెట్టారు. ఇదిలాఉండగా.. బడ్జెట్ ఆమోదానికి ముందు సరిహద్దుల్లో వీరమరణం పొందిన సైనికుల కుటుంబాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సభ్యులు రెండు నిముషాలపాటు మౌనం పాటించారు. అనంతరం శాసనసభను నిరవధిక వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ తమ్మినేని సీతారం ప్రకటించారు. (చదవండి: నేను కూడా డిప్రెషన్ను ఎదుర్కొన్నాను) -
అమర జవాన్లకు ఏపీ అసెంబ్లీ నివాళి
సాక్షి, అమరావతి : భారత్-చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణలో అమరులైన వీరసైనికులకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ బుధవారం సంతాపం తెలిపింది. భారత జవాన్ల మృతికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించింది. ఈ సంతాప తీర్మాణాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టారు. ‘దేశసమగ్రత, సార్వభౌమత్వాన్ని కాపాడే విధి నిర్వహణ చేస్తూ, ఇండియా – చైనా సరిహద్దులోని గాల్వాన్ లోయవద్ద ఘర్షణలో అమరులైన 20 మంది మనదేశ వీర సైనికులకు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున ఈ శాసనసభ ఘనమైన నివాళులు అర్పిస్తోంది. మొత్తం దేశంతోపాటు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వారందరి కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తోంది. తెలుగువాడు, పక్కరాష్ట్రం తెలంగాణలోని సూర్యాపేట వాసి కల్నల్ సంతోష్బాబు త్యాగం ఎప్పటికీ తెలుగు ప్రజలకు గుర్తుండిపోతుంది. వీరమరణం పొందిన మన సైనికులకు ఆత్మశాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాం’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. -
గడ్డంపై చర్చ: టీడీపీ ఎమ్మెల్సీకి మంత్రి కౌంటర్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ బడ్జెట్(2020-21) సమావేశాల్లో భాగంగా రెండో రోజు శాసనమండలిలో అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీవేడీగా చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో టీడీపీ ఎమ్మెల్సీ దీపక్రెడ్డి మంత్రుల గడ్డాలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో టీడీపీ ఎమ్మెల్సీకి మంత్రి అనిల్కుమార్ యాదవ్ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. తాము గడ్డాలు పెంచితే రౌడీలు అంటున్నారని, గడ్డం పెంచితే రౌడీలేనా అని మంత్రి అనిల్కుమార్ యాదవ్ ప్రశ్నించారు. శాసనమండలి ఛైర్మన్కు, చంద్రబాబుకు కూడా గడ్డం ఉందని పేర్కొన్న మంత్రి వాళ్లు కూడా రౌడీలేనా అని కౌంటర్ అటాక్ చేశారు. అంతేకాకుండా పురాణాలను పరిశీలిస్తే మునులు, రుషులు గడ్డాలు పెంచారని, వాళ్లను కూడా రౌడీలు అంటారా అని టీడీపీ ఎమ్మెల్సీ దీపక్రెడ్డిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు. (అభివృద్ధి.. సంక్షేమంతో నవశకం) శాసనమండలి చైర్మెన్ అధ్యక్షతన బుధవారం రోజు 12 నిమిషాలు ఆలస్యంగా సభ ప్రారంభమైంది. సభ ప్రారంభం కాగానే.. తూర్పు లద్దాఖ్లోని గాల్వన్ లోయ ప్రాంతంలో భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబుకు శాసనమండలి సంతాపం తెలిపింది. బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ ఈ సంతాప తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. కల్నల్ మృతిపై మండలి రెండు నిమిషాలు మౌనం పాటించింది. (జనతా పద్దు.. కొత్త పొద్దు) -
మండలి ముందుకు కీలక బిల్లులు
సాక్షి, అమరావతి : మరి కొద్దిసేపట్లో వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులు ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ముందుకు రానున్నాయి. ఈ నేపథ్యంలో మండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు. మండలిలో అవలంభించాల్సిన వ్యూహం గురించి వారితో చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘బిల్లులను సెలెక్ట్ కమిటీకి ఇచ్చే అవకాశం లేదు. గతంలోనే రూల్ ప్రకారం జరగలేదని చైర్మన్ చెప్పారు. కేవలం విచక్షణ అధికారం ఉందనే సెలెక్ట్ కమిటీ పంపిస్తానని చెప్పారు. సభ అభిప్రాయం తీసుకోకుండానే వాయిదా వేసి వెళ్లిపోయారు. యనమల ఇష్టం వచ్చినట్లు రూల్స్ మార్చి చెబుతున్నారు. ఆయన చెప్పిందే రూల్స్ అన్నట్లు మాట్లాడుతున్నారు. యనమల వాదనలకు తలా తోక ఉండదు. పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓటింగ్ పెట్టి రిజెక్టు చేసినా నెలలో బిల్లులు పాస్ అయిపోతాయ’ని అన్నారు. చదవండి : రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు -
'దొంగలా తాళాలు వేసుకొని ఉంటే అరెస్ట్ చేయరా'
సాక్షి, అమరావతి : ఏపీ బడ్జెట్ రెండో రోజు శాసనమండలి సమావేశాల్లో భాగంగా టీడీపీ సభ్యులు లేవనెత్తిన ప్రశ్నకు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ధీటుగా సమాధానమిచ్చారు. అచ్చెనాయుడు అరెస్టును నిరసిస్తూ టీడీపీ సభ్యులు క్రికెట్ బెట్టింగ్ అంశాన్నిలేవనెత్తారు. దీనిపై అనిల్ స్పందిస్తూ..' చట్టం అనేది అందరికి సమానమే... రూ. 150 కోట్లకు పైగా అవినీతి జరిగింది.. బీసీ అయితే అరెస్ట్ చేయకుడదా.. 300 మంది పోలీసులతో అచ్చెనాయుడును అరెస్ట్ చేయడానికి వెళ్లారని టీడీపీ నేతలు గగ్గోలు పెడుతున్నారు. అచ్చెనాయుడు దొంగ లాగా ఇంట్లో దాక్కుని తాళాలు వేసుకుంటే పోలీసులే ఇంటికి వెళ్లాల్సి వచ్చింది.(ఏపీ శాసనమండలి సమావేశాలు ప్రారంభం) కాపు ఉద్యమ సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు ముద్రగడ ఇంటికి మూడువేల మందిని పంపి భయానక వాతావరణం సృష్టించారు. అంతేగాక ఉద్యమానికి సంఘీభావం ప్రకటించేందుకు వచ్చిన మహిళలపై అమానుషంగా దాడులు చేశారు. నాపై గత ప్రభుత్వం క్రికెట్ బెట్టింగ్ విషయంలో నోటీసులు ఇచ్చిన మాట నిజమే. కానీ నేను ధైర్యంగా విచారణకు హాజరయ్యాను. ఈ వ్యవహారంలో నాకు క్లీన్చిట్ లభించింది. ఆ సమయంలో నోటీసులు ఇచ్చి నా ఇమేజ్ డామేజ్ చేయడానికి ప్రయత్నం చేశారు' అంటూ పేర్కొన్నారు. -
కల్నల్ సంతోష్ మృతికి ఏపీ మండలి సంతాపం
సాక్షి, అమరావతి: ఏపీ శాసనమండలి సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. శాసనమండలి చైర్మెన్ అధ్యక్షతన బుధవారం రోజు 12 నిమిషాలు ఆలస్యంగా సభ ప్రారంభమైంది. సమావేశాలు మొదలు కాగానే సీఆర్డీఏ రద్దు, వికేంద్రీకరణ బిల్లులు మండలి ముందుకు వచ్చినట్లు మండలి ఛైర్మన్ షరీఫ్ తెలిపారు. మొదట బడ్జెట్పై చర్చ మొదలుపెట్టి.. ఆ తర్వాత బిల్లులపై చర్చ చేపడదామని ఆయన పేర్కొన్నారు. మరోవైపు తూర్పు లద్దాఖ్లోని గాల్వన్ లోయ ప్రాంతంలో భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబుకు శాసనమండలి సంతాపం తెలిపింది. బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ ఈ సంతాప తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. కల్నల్ మృతిపై మండలి రెండు నిమిషాలు మౌనం పాటించింది. -
రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. బుధవారం సమావేశాలు ప్రారంభం కాగానే ముందుగా మాజీ స్పీకర్ అగరాల ఈశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పేర్ల శివారెడ్డి, వై. రాజారామచంద్రల మృతికి సభలో సంతాపం తెలియజేశారు. అనంతరం ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పలు శాఖల డిమాండ్లను ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ద్రవ్య వినిమయ బిల్లునుప్రవేశపెట్టనున్నారు. -
అగ్రిగోల్డ్ బాధితులకు మరో 200 కోట్లు
సాక్షి, అమరావతి : అగ్రి గోల్డ్ బాధితులను ఆదుకోవడం.. పోలీసుల సంక్షేమం.. మహిళల రక్షణకు బడ్జెట్ కేటాయింపుల్లో ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చింది. రాష్ట్ర హోం శాఖకు రూ.5,988.72 కోట్లు కేటాయించగా.. న్యాయ శాఖకు 913.76 కోట్లు కేటాయించింది. పాదయాత్ర సందర్భంగా అగ్రి గోల్డ్ బాధితులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకునేలా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఈ బడ్జెట్లో మరో రూ.200 కోట్లు కేటాయించింది. గతేడాది రూ.264 కోట్లు కేటాయించగా.. రూ.10 వేలలోపు డిపాజిట్లు చేసిన బాధితులకు సొమ్ము చెల్లించారు. ఇంటి వద్దకే నాణ్యమైన బియ్యం పేద ప్రజలకు ఇంటి వద్దే నాణ్యమైన బియ్యం అందేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఇందుకోసం బడ్జెట్లో పౌరసరఫరాలశాఖకు రూ. 3,100 కోట్లు కేటాయించింది. దారిద్య్ర రేఖకు దిగువనున్న 1.48 కోట్ల కుటుంబాలు దీని ద్వారా లబ్ధి పొందుతాయి. వైఎస్సార్ నవశకం పథకంలో భాగంగా ప్రభుత్వం అర్హులైన కుటుంబాలకు కొత్తగా బియ్యం కార్డులు జారీ చేస్తోంది. ►సరుకుల పంపిణీ కోసం కొత్తగా డోర్ డెలివరీ వ్యవస్థను అమల్లోకి తెచ్చింది. ►దీని ద్వారా నాణ్యమైన బియ్యంతో పాటు పంచదార, కందిపప్పు ప్రజల ఇంటి వద్దకే చేరుతున్నాయి. ►ఎటువంటి అవకతవకలకు తావులేని విధంగా గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా వీటిని పంపిణీ చేస్తున్నారు. ►సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 2019 సెప్టెంబర్ 6న శ్రీకాకుళం జిల్లాలో ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. ►ఈ ఏడాది సెప్టెంబర్ 1 నుంచి అన్ని జిల్లాల్లోనూ పేదలకు ఇంటి వద్దే సరుకులు అందేలా ప్రభుత్వం ప్రణాళిక సిద్దం చేసింది. ►నాణ్యమైన బియ్యం సబ్సిడీ కోసం రూ. 3,000 కోట్లు, పేదలకు ఉచితంగా ఇవ్వనున్న సంచుల కోసం రూ. 100 కోట్లు కేటాయించింది. -
పరిశ్రమాభివృద్ధిరస్తు
సాక్షి, అమరావతి : రాష్ట్ర బడ్జెట్లో పరిశ్రమలు, ఐటీ, మౌలిక వసతుల కల్పన, నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట వేస్తూ ఏకంగా రూ.4,455 కోట్లు కేటాయించారు. ఇందులో రూ.1,826.04 కోట్లు పారిశ్రామిక రాయితీలు, పరిశ్రమల ప్రోత్సాహకానికి కేటాయించడం విశేషం. కడప ఉక్కు కర్మాగారం నిర్మాణానికి రూ.250 కోట్లు కేటాయించారు. స్థానిక యువతకు ఉపాధి కల్పించే విధంగా పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించడానికి రూ.856.64 కోట్లు కేటాయించింది. రంగాలవారీగా కేటాయింపులు ఇలా.. పెట్టుబడుల ఆకర్షణకు మౌలిక వసతుల కల్పనకు.. 696.61 కోట్లు ►ఈ మొత్తంలో ఓడరేవుల అభివృద్ధికి రూ.63.82 కోట్లు కేటాయింపు ►ఎయిర్పోర్టుల అభివృద్ధికి రూ.632.79 కోట్లు ►సాగరమాల ప్రాజెక్టులో భాగంగా కాకినాడ యాంకరేజ్ పోర్టులో మౌలిక వసతుల అభివృద్ధి ►ఈ ఏడాది మచిలీపట్నం, రామాయపట్నం, భావనపాడు పోర్టుల నిర్మాణం ►భోగాపురం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దగదర్తిలో ఎయిర్పోర్టుల నిర్మాణం చేపట్టడం ►ఈ ఏడాది 600 టెలికాం టవర్ల నిర్మాణం ►కడప ఎయిర్పోర్టులో నైట్ ల్యాండింగ్ సదుపాయం ►ఓర్వకల్లు విమానాశ్రయం పనులు పూర్తి చేసి ఈ ఏడాది అందుబాటులోకి తీసుకురావడం పరిశ్రమలకు భారీ ప్రోత్సాహకాలు ►పెట్టుబడులను ఆకర్షించే విధంగా కొత్త పారిశ్రామిక విధానం తీసుకురావడం ►అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందే విధంగా ఇండస్ట్రియల్ క్లస్టర్ల ఏర్పాటు ►సూక్ష్మ, చిన్నతరహా, మధ్యతరహా పరిశ్రమ (ఎంఎస్ఎంఈ)ల మౌలిక వసతుల కల్పనకు రూ.100 కోట్లు ►ఏపీ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కు రూ.180.77 కోట్లు ఐటీలో 25 వేల మందికి ఉపాధి లక్ష్యం ►ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగం కోసం రూ.197.37 కోట్ల బడ్జెట్ కేటాయింపులు ►ఐటీ రంగంలో కొత్త పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ఎగుమతులు పెంచుకోవడంపై ప్రత్యేక దృష్టి ►పారదర్శకత పెంచడానికి పరిపాలనలో నూతన టెక్నాలజీ వినియోగం పెంచడం ►స్టార్టప్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు ►ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగంలో ఈ ఏడాది 25 వేల మందికి ఉపాధి కల్పన లక్ష్యం ►ఎలక్ట్రానిక్స్ రంగంలో రూ.2,000 కోట్లు, ఐటీ రంగంలో రూ.250 కోట్ల పెట్టుబడుల ఆకర్షణ స్కిల్ డెవలప్మెంట్కు రూ.856.64 కోట్లు ►ఈ మొత్తంలో వ్యవసాయ రంగంలో స్కిల్ డెవలప్మెంట్ కోసం రూ.279.09 కోట్లు కేటాయింపు ►ఐటీఐల్లో మౌలిక వసతుల పెంపునకు రూ.229.24 కోట్లు ►పాలిటెక్నిక్ కాలేజీల అభివృద్ధికి రూ.348.31 కోట్ల కేటాయింపు ►ఎస్టీలకు అరకు, చింతపల్లి, భద్రగిరి, సీతంపేట, కేఆర్ పురంలో ఐటీఐల ఏర్పాటు ►మాచర్ల, కడపలో ఎస్సీల కోసం రెండు రెసిడెన్షియల్ ఐటీఐల నిర్మాణం ►టెక్నికల్ కాలేజీల్లో కాలానికి అనుగుణంగా ప్రతి ఐదేళ్లకు సిలబస్ మార్పు ఇతరాలు.. ►జౌళి శాఖ, సహకార చక్కెర కర్మాగారాలు, ఆహార శుద్ధి, తదితరాలకు రూ.347.56 కోట్లు -
అక్క, చెల్లెమ్మలకు అండగా..
సాక్షి, అమరావతి : మహిళాభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో పెద్దఎత్తున నిధులు కేటాయించింది. పిల్లల్ని చక్కగా చదివించి.. వారిని ఉన్నతులుగా తీర్చిదిద్దటం మహిళల వల్లే సాధ్యమవుతుందన్న ఉద్దేశంతో వివిధ పథకాల కింద భారీ కేటాయింపులు చేసింది. మహిళా సాధికారత దిశగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే ముందుకు సాగుతోంది. అమ్మ ఒడికి రూ.6 వేల కోట్లు ►జగనన్న అమ్మ ఒడి పథకం కింద 42,33,098 మంది తల్లులకు ఏటా రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు బడ్జెట్లో రూ.6 వేల కోట్లు కేటాయించారు. ►జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాల కింద విద్యార్థి తల్లి బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం ఏటా నిధులు జమ చేస్తోంది. వసతి దీవెన కింద ఏడాదికి రూ.20 వేలు, విద్యా దీవెన కింద కాలేజీ ఫీజు ఎంతైతే అంత తల్లి బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయి. ఈ రెండు పథకాల కోసం రూ.5,009 కోట్లను బడ్జెట్లో ప్రభుత్వం ప్రతిపాదించింది. ►వైఎస్సార్ చేయూత పథకం కింద 45–60 ఏళ్ల మధ్య వయసు గల మహిళలకు ఆర్థిక సాయాన్ని అందించి.. వారిని పరిపుష్టం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆ దిశగానే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజిక వర్గాలమహిళల కోసం ఈ ఏడాది రూ.3,000 కోట్లు కేటాయింపులు చేశారు. డ్వాక్రా మహిళలకూ భారీ నిధులు ►స్వయం సహాయక సంఘాల్లో ఉంటూ పొదుపు చేసుకుంటున్న మహిళలకు తగిన సార్థకత చేకూర్చేందుకు వైఎస్సార్ ఆసరా పథకాన్ని ప్రభుత్వం చేపట్టింది. 2019 ఏప్రిల్ 11వ తేదీ నాటికి డ్వాక్రా మహిళలు బ్యాంకులకు బకాయిపడిన రుణం రూ.27,168.83 కోట్లను 2020–21 నుంచి నాలుగు విడతలుగా ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇందుకోసం ఈ ఏడాది రూ.6,300 కోట్లు ప్రతిపాదించింది. ►వైఎస్సార్ కాపు నేస్తం పథకం కింద 45 నుంచి 60 సంవత్సరాల లోపు వయసు గల ప్రతి కాపు మహిళకు జీవనోపాధి కోసం ఏటా రూ.15 వేల చొప్పున ప్రభుత్వం ఇస్తోంది. ఇందుకోసం ఈ బడ్జెట్లో రూ.350 కోట్లు కేటాయించారు. ►వడ్డీలేని రుణాల ద్వారా పొదుపు సంఘాల మహిళలకు ఆర్థిక పరిపుష్టి చేకూర్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతుంది. ఇందులో భాగంగా వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద బడ్జెట్లో రూ.1,365.08 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. మహిళా, శిశు సంక్షేమానికి 3,456 కోట్లు బడ్జెట్ కేటాయింపుల్లో మహిళా, శిశు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అగ్రతాంబూలమిచ్చింది. మహిళలు అభివృద్ధి పథంలో పయనించినప్పుడే రాష్ట్రాభివృద్ధి మరింత ముందుకెళుతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అనేకసార్లు చెప్పారు. ఇందుకు అనుగుణంగానే మహిళలు, శిశువులు, విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖకు ఈ ఏడాది బడ్జెట్లో రూ.3,456 కోట్లు కేటాయించారు. అంగన్వాడీ భవనాల నిర్మాణం, పట్టణ, గ్రామీణ, గిరిజన ప్రాంతాల అంగన్వాడీల్లోని పిల్లలు, గర్భిణుల్లో రక్తహీనత సమస్యను తొలగించే లక్ష్యంతో పోషకాహార పంపిణీ నిమిత్తం ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధులు, హిజ్రాల సంక్షేమానికి పథకాలను తెచ్చింది. కోవిడ్–19 విపత్తు సమయంలోనూ అంగన్వాడీల ద్వారా చిన్నారులు, గర్భిణులు, బాలింతల ఇళ్లకే పోషకాహారాన్ని సరఫరా చేస్తున్న ప్రభుత్వం.. గత ఏడాది కంటే ఈసారి అధికంగా నిధులను ఆ వర్గాల వారి కోసం వెచ్చించనున్నట్లు బడ్జెట్లో స్పష్టం చేసింది. కేటాయింపుల్లోని కొన్ని.. ►రాష్ట్రంలో 257 ఐసీడీఎస్ ప్రాజెక్టులను ప్రభుత్వం నిర్వహిస్తోంది. వీటి పరిధిలో 48,770 అంగన్వాడీలు, 6,837 మినీ అంగన్వాడీ కేంద్రాలు పని చేస్తున్నాయి. ►అంగన్వాడీ పిల్లల్లో పోషణ లోపం, పెరుగుదల ఆగిపోవడం, తక్కువ బరువు ఉండటం, మహిళల్లో రక్తహీనత సమస్యల పరిష్కారానికి వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకాన్ని చేపడుతోంది. ఈ పథకానికి బడ్జెట్లో రూ.1,250 కోట్లు కేటాయించింది. ►దీంతోపాటు వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకానికి రూ.250 కోట్లు కేటాయించింది. 7 సమగ్ర గిరిజనాభివృద్ది సంస్థల పరిధిలో విస్తరించిన 77 గిరిజన ప్రణాళిక, షెడ్యూల్ మండలాల్లోని 0.66 లక్షల మంది గర్భిణులు, బాలింతలు, 6 నెలల నుంచి 72 నెలల్లోపు వయసు గల 3.18 లక్షల మంది చిన్నారులు ఈ పథకం కింద లబ్ధి పొందుతారు. ►జగనన్న అమ్మ ఒడి : రూ.6 వేల కోట్లు ►ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు రూ.3,000 కోట్లతో ‘వైఎస్సార్ చేయూత’ ►డ్వాక్రా మహిళల బ్యాంక్ బాకీలు తీర్చేందుకు ‘వైఎస్సార్ ఆసరా’ కింద రూ.6,300 కోట్లు ►జగనన్న విద్యా దీవెన, వసతి దీవెనకు రూ.5,009 కోట్లు ►‘కాపు నేస్తం’ కింద రూ.350 కోట్లు ►వైఎస్సార్ సున్నా వడ్డీ రూ.1,365.08 కోట్లు ►దిశ బిల్లు అమలుకు రూ. 50 కోట్లు ►మహిళా సంక్షేమ భవనాల నిర్మాణాలకు రూ. 72 కోట్లు ►వైఎస్సార్ సంపూర్ణ పోషణ రూ.1,250 కోట్లు ►వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ రూ.250 కోట్లు ►జాతీయ మహిళా పోష్టకాహార పథకం రూ.1,577 కోట్లు ►ఏ డబ్యూసీ భవనాల నిర్మాణాలకు రూ. 194.62 కోట్లు ►అంగన్వాడీ భవనాల నిర్మాణానికి రూ. 23.98 కోట్లు ►విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమం రూ.76.01కోట్లు -
ఆరోగ్యానికి అభయం
సాక్షి, అమరావతి: పేదలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా కనీవినీ ఎరుగని రీతిలో వైద్య, ఆరోగ్య రంగానికి సర్కార్ బడ్జెట్లో ఏకంగా రూ.11,419.47 కోట్లు కేటాయించింది. 1.42 కోట్ల కుటుంబాలకు అపర సంజీవనిగా ఉన్న వైఎస్సార్ ఆరోగ్యశ్రీకి రూ.2,100 కోట్లు కేటాయించారు. ఇది గతేడాది కంటే 33 శాతం అధికం కావడం గమనార్హం. ► రూ.5 లక్షలు వార్షికాదాయం లోపు ఉన్న అందరూ ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి వస్తారు. ఆస్పత్రిలో రూ.1,000 బిల్లు దాటితే వారిని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చే కార్యక్రమం ఇప్పటికే పశ్చిమ గోదావరి జిల్లాలో అమలవుతుండగా దశలవారీగా మిగతా జిల్లాల్లోనూ అమలు చేయనున్నారు. ► గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది వైద్య, ఆరోగ్య శాఖకు 54 శాతం అధికంగా నిధుల కేటాయింపు ► 108, 104 పథకాల నిర్వహణకు రూ.470.29 కోట్లు కేటాయింపు. గతంతో పోలిస్తే ఈ మొత్తం 130 శాతం అధికం ► మండలానికొక 108 వాహనం. ఘటన జరిగిన 20 నిమిషాల్లోనే బాధితుల ముందుకు 108 వాహనం వచ్చేలా పథకాన్ని తీర్చిదిద్దుతారు. అలాగే ప్రతి పల్లెకూ 104 వాహనం వెళ్లేలా లక్ష్యం నిర్దేశించారు. ► ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే ప్రతి పేదవాడికి 510 రకాల మందులు అందుబాటులో ఉంచడానికి రూ.400 కోట్లు నిధుల కేటాయింపు ► జాతీయ ఆరోగ్య మిషన్కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా కింద రూ.1,800.03 కోట్లు కేటాయింపు. ఇది గత బడ్జెట్తో పోలిస్తే 45 శాతం ఎక్కువ. వివిధ కేంద్ర పథ కాల అమలు (టీకాల నుంచి గర్భిణులకు మందులు ఇచ్చే వరకు)కు నిధుల పెంపు ఉపయోగపడనుంది. -
చదువే భవితకు పెట్టుబడి
సాక్షి, అమరావతి: కోవిడ్ నేపథ్యంలో ఆదాయమార్గాలు సన్నగిల్లి ఆర్థిక పరిస్థితి మందగమనంలో ఉన్నప్పటికీ ప్రభుత్వం విద్యా శాఖకు భారీగా కేటాయింపులు చేసింది. 2020–21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్లో విద్యా శాఖకు రూ.25,737.62 కోట్లు కేటాయించింది. ► ఇందులో పాఠశాల విద్యకు ఏకంగా 22,604.01 కోట్లు కేటాయించింది. రాష్ట్ర ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగాన్నే మానవ వనరుల అభివృద్ధి, విద్యాభివృద్ధి ద్వారా మెరుగైన సమాజాభివృద్ధి అంశాలతో ప్రారంభించడం విశేషం. ► అమ్మ ఒడి, జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన వంటి పథకాల ద్వారా ప్రభుత్వం ఈ అంశాలను నొక్కిచెప్పింది. ► ప్రభుత్వ పాఠశాలల్లో తొమ్మిది రకాల మౌలిక వసతుల కల్పనకు ‘మన బడి నాడు–నేడు’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ► కుల, మత, వర్గ, ప్రాంత వివక్ష లేకుండా 1 నుంచి ఇంటర్మీడియెట్ వరకు చదువులు కొనసాగించడానికి దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాల పిల్లల తల్లులకు అమ్మ ఒడి కింద ఏటా రూ.15 వేల ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. ► నాడు–నేడు పథకం కింద తొలి దశలో 15,715 ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.3 వేల కోట్లు ప్రతిపాదించింది. ► 2020–21 విద్యా సంవత్సరంలో 1 నుంచి 10వ తరగతి వరకు ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులకు మూడు జతల యూనిఫామ్, పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, స్కూలు బ్యాగును కిట్గా జగనన్న విద్యాకానుక కింద అందించనున్నారు. ► విద్యార్థులకు జగనన్న గోరుముద్ద కింద నాణ్యమైన, శుచికరమైన పౌష్ఠికాహారాన్ని అందిస్తున్నారు. బెల్లం, చిక్కీ, పులిహోర, పొంగలి, కూరగాయల పలావు తదితరాలు వడ్డిస్తున్నారు. వంట పని వారికి నెలవారీ పారితోషికం రూ.వేయి నుంచి రూ.3 వేలకు పెంచారు. ► జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన పథకాల కింద ఉన్నత విద్యకు కూడా ప్రభుత్వం అధిక ప్రాధాన్యం కల్పిస్తోంది. ► ఆంధ్రా విశ్వవిద్యాలయాన్ని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్గా ఎంపిక చేసి రూసా పథకం కింద నిధులు కేటాయించనుందని ప్రభుత్వం పేర్కొంది. ► ఉన్నత విద్యకు బడ్జెట్లో రూ.2,276.97 కోట్లు కేటాయించడం విశేషం. ► సాంకేతిక నైపుణ్యాభివృద్ధికి ప్రభుత్వం రూ.856.64 కోట్లు కేటాయించింది. యూనివర్సిటీలకు నిధుల వరద ► ప్రభుత్వం ప్రతి వర్సిటీ న్యాక్ గ్రేడ్,, నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్) వంటివి సాధించి ఉన్నత ప్రమాణాలతో ముందుకు వెళ్లాలన్న ఉద్దేశంతో రెవెన్యూ గ్రాంటుతోపాటు కేపిటల్ గ్రాంట్ను కూడా కేటాయించింది. ► అరకులో వైఎస్సార్ ట్రైబల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయనుంది. ► కడపలో వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైనార్ట్స్ యూనివర్సిటీ, ఒంగోలులో ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం యూనివర్సిటీల ఏర్పాటుకు వీలుగా కేటాయింపులు చేసింది. ► ఇవే కాకుండా కొత్తగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ స్టడీస్ అనే సంస్థకు కూడా రూపకల్పన చేసి నిధుల కేటాయింపులు జరిపింది. ► ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్చ్ఠులను సాధించేందుకు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలకు కేపిటల్ గ్రాంట్ను కేటాయించింది. మానవాభివృద్ధే అసలైన అభివృద్ధి ‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విద్య, వైద్య రంగాలకు ప్రాముఖ్యతనిస్తూ నిర్దిష్ట ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. అందులో భాగంగానే ఈ బడ్జెట్లో విద్యకు ఇతోధిక కేటాయింపులు చేశారు. ముఖ్యంగా జాతీయంగా, అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని నిధులు కేటాయించారు. ప్రభుత్వ విద్యా సంస్థలన్నీ బలోపేతం కావాలన్న లక్ష్యం ప్రభుత్వంలో కనిపిస్తోంది. మానవాభివృద్ధే అసలైన అభివృద్ధి’ అని అంటున్నారు.. ఆర్జీయూకేటీ చాన్సలర్ ప్రొఫెసర్ కేసీ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై ఆయన ఏమన్నారంటే.. ► నాడు–నేడు, ఇంగ్లిష్ మీడియం, డిగ్రీ కళాశాలల అభివృద్ధితో ఆంధ్రప్రదేశ్ ఒక ఎడ్యుకేషన్ హబ్గా మారబోతోంది. ► గతంలో విద్యారంగానికి కేటాయింపులు ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా ముక్కలు ముక్కలుగా చేసేవారు. ఇప్పుడు అలా కాకుండా సమగ్రంగా చేస్తున్నారు. ► పరిశ్రమలు ఎవరు పెట్టాలన్నా భూమి, విద్యుత్ వంటివే కాకుండా నైపుణ్యం కలిగిన మానవ వనరులు కూడా ఎంతో అవసరం. దీనికోసం ముఖ్యమంత్రి పాఠశాల స్థాయి నుంచే ఒక ప్రణాళికాబద్ధ కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. ► ఈ నేపథ్యంలో ప్రస్తుత బడ్జెట్ పునాది వంటిది. రాబోయే నాలుగైదేళ్లలో మంచి పరిణామాలు కనిపిస్తాయి. ► పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయిలో నైపుణ్యాభివృద్ధి కేంద్రాలతోపాటు విశాఖ కేంద్రంగా నైపుణ్యాభివృద్ధి యూనివర్సిటీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ► నాలుగు త్రిబుల్ ఐటీల్లోని నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏకీకృతం చేసి సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళిక చేపడుతోంది. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను విద్యార్థులకు నేర్పడమే లక్ష్యంగా ఈ నైపుణ్యాభివృద్ధి ప్రణాళిక ఉంటుంది. ► విద్యారంగ బడ్జెట్ ఒక్కటే కాకుండా నవరత్నాల్లోని పలు సంక్షేమ కార్యక్రమాలు విద్యకు, తద్వారా మానవాభివృద్ధికి దోహదపడేవే. వాటిని కూడా కలుపుకుంటే విద్యా కేటాయింపులు మరింత ఎక్కువవుతాయి. సంక్షేమంపై చాలా ఎక్కువ కార్యక్రమాలు చేస్తున్నారు. బడ్జెట్, పలు బిల్లులకు మంత్రివర్గం ఆమోదం ఉభయ సభలు ప్రారంభం కావడానికి ముందు మంగళవారం ఉదయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో బడ్జెట్ను ఆమోదించారు. శాసనసభలో ప్రవేశపెట్టిన బిల్లులకు కూడా కేబినెట్ ఆమోదముద్ర వేసింది. అరగంట పాటు జరిగిన మంత్రివర్గ సమావేశంలో గవర్నర్ ప్రసంగాన్ని, సాధారణ, వ్యవసాయ బడ్జెట్లను, పలు బిల్లులను ఆమోదించారు. అత్యుత్తమ బడ్జెట్ విద్యారంగానికి 6.4 శాతం బడ్జెట్ కేటాయిస్తున్న నార్వే దేశాన్ని ప్రపంచంలోనే మొట్ట మొదటి స్థానంగా చెప్పుకుంటాం. మన భారత దేశ బడ్జెట్లో కూడా విద్యకు కేటాయిస్తున్నది 3.4 శాతమే. మన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యకు అత్యధికంగా రూ.22,604 కోట్లు, అంటే 10.05 శాతం కేటాయించడం చాలా సంతోషం. ప్రజలందరూ హర్షించదగ్గ విషయం. సమాజంలో ఉన్న అన్ని రుగ్మతలకు, అసమానతలకు ఏకైక మార్గం విద్యే అనే జగమెరిగిన సత్యాన్ని, మన ముఖ్యమంత్రి జగన్ ఆచరణలో చూపించారు. – డాక్టర్ బీవీఎస్ కుమార్, చైర్మన్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, కృష్ణా జిల్లా -
బడ్జెట్పై సంక్షేమ సంతకం
సాక్షి, అమరావతి: సంక్షేమ రంగాలకు భారీగా నిధులు కేటాయించి పేదలకు అండగా ఉన్నామనే భరోసాను ప్రభుత్వం కల్పించింది. 2020–21 బడ్జెట్లో గత సంవత్సరం కంటే కేటాయింపులు పెరిగాయి. లబ్ధిదారుల సంఖ్య కూడా పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎంత మందికి లబ్ధి చేకూరుస్తామనే వివరాలు (టార్గెట్) కూడా బడ్జెట్లో పొందుపరిచారు. ప్రధానంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల అభ్యున్నతికి తీసుకుంటున్న చర్యలు ఈ బడ్జెట్ ద్వారా వెల్లడయ్యాయి. ఇప్పటికే సంక్షేమ పథకాలు ఎదురు లేకుండా అమలవుతున్నాయి. కేటాయింపులు ఘనంగా ఉన్నా ఖర్చు చేస్తారనే నమ్మకం లేదని విమర్శించేందుకు తావే లేదు. ఎందుకంటే ఆయా పథకాల లబ్ధిదారుల జాబితాలను ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించారు. బీసీ సంక్షేమం ► బీసీల సంక్షేమానికి 2020–21 బడ్జెట్లో కాంపోనెంట్ ద్వారా రూ.25,331.30 కోట్లు కేటాయించారు. ఇంత భారీ మొత్తంలో కేటాయించడం ఇదే మొదటి సారి. ► గత సంవత్సరం రూ.15,061.64 కోట్లు కేటాయించారు. అంటే ఈ సంవత్సరం 68.18 శాతం ఎక్కువ బడ్జెట్ కేటాయింపు జరిగింది. నవరత్నాల ద్వారా రూ. 23,458.8 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఎస్సీ సంక్షేమం ► షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి కోసం 2020–21 బడ్జెట్లో రూ.15,735.68 కోట్లు కేటాయించారు. ఇది గత సంవత్సరం బడ్జెట్ కంటే 4.90 శాతం ఎక్కువ. ► గత ఏడాది రూ.15,000.85 కోట్లు కేటాయించారు. 47 ప్రభుత్వ శాఖల ద్వారా ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు వివిధ పథకాల కోసం ఖర్చు చేస్తారు. నవరత్నాల అమలుకు రూ.7,525.02 కోట్లు ఖర్చు చేస్తారు. ఎస్టీల సంక్షేమం ► గిరిజనుల సంక్షేమానికి 2020–21 బడ్జెట్లో ప్రభుత్వం రూ. 5,177.53 కోట్లు కేటాయించింది. 2019–20 బడ్జెట్తో పోలిస్తే 3.79 శాతం ఎక్కువ. ► నవరత్న పథకాల అమలుకు రూ.1,840.71 కోట్లు ఖర్చు చేయనున్నారు. మైనార్టీల సంక్షేమం ► రాష్ట్రంలోని మైనార్టీల సంక్షేమానికి 2020–21 బడ్జెట్లో ప్రభుత్వం రూ.2,050.22 కోట్లు కేటాయించింది. ► 2019–20 బడ్జెట్తో పోలిస్తే ఇది 116.10 శాతం ఎక్కువ. ఇంత భారీ స్థాయిలో మైనార్టీల సంక్షేమానికి నిధులు కేటాయించడం ఇదే మొదటి సారి. ► మైనార్టీలకు నవరత్నాల అమలుకు ఈ సంవత్సరం రూ.1998.56 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ నిధుల ఖర్చు ఇలా.. ► వివిధ పథకాలకు సంబంధించి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ లబ్ధిదారులను ఇప్పటికే ఎంపిక చేశారు. వైఎస్సార్ నవశకం ద్వారా ప్రతి సంవత్సరం కొత్తగా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది. ఆయా వర్గాల విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, తదితర పథకాలకు ఈ నిధులు ఖర్చు చేస్తారు. ► అంబేద్కర్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ పథకం (విదేశీ విద్య) ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రూ.15 లక్షలు, ఈబీసీలకు రూ.10 లక్షలు ప్రభుత్వం ఇస్తుంది. డిగ్రీ పాసైన వారికి బీసీ, ఎస్సీ స్టడీ సర్కిళ్ల ద్వారా రూ.6 లక్షల లోపు ఆదాయం ఉన్న విద్యార్థినీ విద్యార్థులకు యూపీఎస్ఈ, గ్రూప్1, 2, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఏపీపీఎస్సీ, ఇతర ఎంట్రెన్స్ పరీక్షలకు కోచింగ్ ఇస్తారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ రెసిడెన్సియల్ స్కూళ్లలో డిజిటల్ క్లాస్ రూమ్లను ఏర్పాటు చేస్తారు. ► వైఎస్సార్ పెళ్లి కానుక ద్వారా బీసీలకు రూ.75 వేలు, ఎస్సీ, ఎస్టీలకు రూ.1,00,000, దివ్యాంగులకు రూ. 1.20 లక్షలు ఇస్తుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ న్యాయవాదులకు ఆర్థిక సాయం అందజేస్తారు. ► బీసీలు, ఎస్సీలు, ఎస్టీ, ఈబీసీ, ఎంబీసీలకు సామాజిక భవనాల నిర్మాణాలు, పెళ్లిళ్లు, ఇతర సభలు, సమావేశాలు నిర్వహించుకునేందుకు అవకాశం కల్పిస్తారు. ► సంక్షేమ కార్పొరేషన్ల ద్వారా ఆర్థికంగా స్థిరపడేందుకు ఆర్థిక సహాయ పథకాలు అమలు చేస్తారు. ► 28.59 లక్షల మంది బీసీలకు పెన్షన్ కానుక, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, మైనార్టీలకు కూడా పెన్షన్ కానుక. ► ప్రీమెట్రిక్, పోస్టు మెట్రిక్ హాస్టళ్లలో ఉంటున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఈబీసీ విద్యార్థుల వసతి సౌకర్యాలకు ప్రత్యేక కేటాయింపులు. ► బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, కాపు విద్యార్థుల తల్లులకు అమ్మ ఒడి పథకం కింద ఒక్కొక్కరికి రూ.15 వేల వంతున నిధుల కేటాయింపు. ► బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఈబీసీల్లోని ఆటో, ట్యాక్సీ, మాక్సీ క్యాబ్ డ్రైవర్లకు రూ.10 వేల ఆర్థిక సాయం. ఆయా వర్గాల్లోని రైతులకు ఉచితంగా బోర్లు. రైతులకు వడ్డీ లేని రుణాలు. ► వైఎస్సార్ ఆసరా ద్వారా డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు ఆర్థిక సాయం. ► వృత్తిని నమ్ముకుని బతుకుతున్న చేనేతలకు రూ.24 వేల ఆర్థిక సాయం. ► వైఎస్సార్ చేయూత పథకం ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల్లో 45 నుంచి 60 సంవత్సరాలలోపు మహిళలకు ఒక్కొక్కరికి రూ.18,750ల లెక్కన నాలుగేళ్ల పాటు రూ.75 వేలు ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుంది. ► వైఎస్సార్ రైతు భరోసా కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీలకు ఆర్థిక సాయం అందిస్తారు. కాపు కార్పొరేషన్కు రూ.2845.60 కోట్లు కాపు సామాజిక వర్గానికి ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఈ బడ్జెట్లో గత ఏడాది కంటే రూ.830.95 కోట్లను అధికంగా కేటాయించింది. ఈ మేరకు బడ్జెట్లో రూ.2845.60 కోట్లు కేటాయించింది. గత ఏడాది రూ.2014.65 కోట్లు కేటాయించింది. కాపు నేస్తం పథకం కింద మహిళలు చిన్న చిన్న వ్యాపారులు చేసుకోడానికి సాలీనా రూ.15 వేలు చొప్పున ప్రతి కాపు మహిళకు జీవనోపాధి నిమిత్తం బడ్జెట్లో రూ.350 కోట్లు కేటాయించింది. రాష్ట్రంలో ఉన్న 1.20 కోట్ల కాపులు ఈ కేటాయింపుల పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
ప్రగతి పథంలో పరుగులు
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక స్థాయి నుంచి ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడం భావితరాల అభ్యున్నతికి కీలక చర్య. 97 శాతం మంది తల్లిదండ్రులు ఇంగ్లిష్ మీడియాన్ని ఆమోదించారు. మంచి విషయం విరోధులకు ఇబ్బందిగా ఉంటుంది. అడ్డంకులు అన్నీ తొలగిపోతాయని ఆశిస్తున్నా పాలనను క్షేత్రస్థాయి వరకు వికేంద్రీకరించేందుకు ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను నెలకొల్పింది. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే నాలుగు లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించడం సీఎం జగన్ దార్శనికతకు నిదర్శనం. రైతుల కోసం ‘వైఎస్సార్ జనతా బజార్లు’ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది సాక్షి, అమరావతి: రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి పరిపాలనా వికేంద్రీకరణ కీలకమని, అందుకోసమే రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నంలో పరిపాలనా రాజధాని, అమరావతిలో శాసన రాజధాని, కర్నూలులో న్యాయ రాజధానులను ఏర్పాటు చేసేందుకు శాసన ప్రక్రియ చేపట్టిందని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా శాసనసభ, శాసన మండలి సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి గవర్నర్ మంగళవారం రాజ్భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చరిత్రాత్మక పాదయాత్ర స్ఫూర్తితో రాష్ట్రం సంక్షేమ పథంలో సాగుతోందని, అన్ని రంగాల్లో పురోగమిస్తోందని చెప్పారు. జాతీయ సగటు కంటే మెరుగైన వృద్ధి రేటుతో ఏపీ ప్రగతిపథంలో పరుగులు తీస్తోందన్నారు. కరోనా మహమ్మారి కట్టడిలో రాష్ట్రం సమర్థంగా వ్యవహరిస్తోందన్నారు. మున్ముందు మంచి రోజులు వస్తాయని, ప్రజా జీవితం సజావుగా సాగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగంలో ముఖ్యాంశాలు ఇవీ.. దేశ సగటు కంటే మెరుగ్గా రాష్ట్ర ఆర్థిక వృద్ధి... ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం నెలకొన్నా కోవిడ్–19కు ముందు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అద్భుతమైన పురోగతి సాధించింది. 2019–20లో 8.16 శాతం వృద్ధిరేటు సాధించడం విశేషం. జాతీయ వృద్ధి రేటు 5 శాతం కంటే ఏపీ అదనంగా 3.16 శాతం వృద్ధి సాధించింది. సేవల రంగంలో 9.1 శాతం, వ్యవసాయ, అనుబంధ రంగాలు 8 శాతం, పారిశ్రామిక రంగం 5 శాతం వృద్ధిరేటు నమోదు చేశాయి. 2018–19లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1,51,173 ఉండగా 2019–20లో 12 శాతం పెరిగి రూ.1,69,519కు చేరింది. గవర్నర్ ప్రసంగాన్ని వింటున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, మంత్రులు, సభ్యులు ఉన్నత భవితకే ఆంగ్లం.. ► విద్యార్థులకు బ్రిడ్జ్ కోర్సులు, పాఠ్యపుస్తకాలకు అనుగుణంగా ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం ద్వారా ఆంగ్లంలో నైపుణ్యాలు సాధించేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోంది. మన బడి నాడు–నేడు కార్యక్రమం కింద పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించేందుకు తొలిదశగా 15,715 పాఠశాలలను ఎంపిక చేసి రూ.3,387కోట్లు మంజూరు చేశాం. మూడేళ్లలో 45 వేల పాఠశాలలను సదుపాయాలతో తీర్చిదిద్దుతాం. మహాభాగ్యంగా ఆరోగ్యం వైద్య చికిత్స ఖర్చు రూ.వెయ్యి దాటితే వైఎస్సార్ ఆరోగ్యశ్రీ వర్తించేలా ప్రభుత్వం ఇప్పటివరకు రూ.1,534 కోట్లు ఖర్చు చేసి 6.25 లక్షల మందికి ప్రయోజనం చేకూర్చింది. 12 వేల వైఎస్సార్ క్లినిక్లను ప్రారంభించడానికి ప్రణాళిక రూపొందించింది. ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేసేందుకు రూ.15,337 కోట్లు కేటాయించాం. ప్రస్తుతం ఉన్న 11 బోధనాసుపత్రులకు అదనంగా మరో 16 ఆసుపత్రులను ప్రభుత్వం నెలకొల్పనుంది. పండగలా వ్యవసాయం... ► వైఎస్సార్ రైతు భరోసా ద్వారా 49.44 లక్షల మంది రైతులకు ప్రయోజనం కల్పిస్తూ రూ.10,209.32 కోట్లు పెట్టుబడి సాయంగా ప్రభుత్వం అందించింది. దేశంలో మునుపెన్నడూలేని విధంగా కౌలు రైతులకు కూడా లబ్ధి చేకూర్చింది. విత్తనం నుంచి విక్రయం వరకు రైతుల అవసరాలను తీర్చేందుకు గ్రామాల్లో వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసింది. ► ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాల పునరావాసం కోసం ప్రభుత్వం రూ.7 లక్షల చొప్పున ఆర్థిక సహాయం చేస్తోంది. గత ప్రభుత్వంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు పరిహారం చెల్లించేందుకు నిరాకరించగా మా ప్రభుత్వం వారికి కూడా పరిహారం చెల్లించింది. ► రూ.7 వేల కోట్లతో 30 లక్షల మంది పేదలకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు సమకూరుస్తోంది. నాలుగేళ్లలో 25 లక్షల ఇళ్లను నిర్మిస్తుంది. 15 లక్షల ఇళ్ల పనులు ఆగస్టులో మొదలవుతాయి. మహిళా సాధికారిత లక్ష్యంగా.. ► పొదుపు సంఘాల మహిళల కోసం ప్రభుత్వం రూ.1,400 కోట్లు జమ చేసింది. ప్రతి సంఘం రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు పొందుతోంది. సున్నావడ్డీ పథకంతో 91 లక్షల మంది ప్రయోజనం పొందారు. పొదుపు సంఘాల రుణాలు రూ.27 వేల కోట్లను నాలుగు వాయిదాల్లో చెల్లిస్తాం. ► వైఎస్సార్ చేయూత ద్వారా 45 – 60 ఏళ్లలోపు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ప్రభుత్వం నాలుగేళ్లలో రూ.75 వేల చొప్పున ఆర్థిక సాయం అందించనుంది. ► మహిళా సాధికారితకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. నామినేటెడ్ పదవులు, నామినేషన్ పనుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించింది. ► జలయజ్ఞం పనుల కింద 54 సాగునీటి ప్రాజెక్టులు చేపట్టాం. 14 ప్రాజెక్టులు పూర్తి చేశాం. ఇతర ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. ఈ ఏడాదే వెలిగొండ, సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీ, వంశధార రెండో దశ, వంశధార– నాగావళి అనుసంధానం, అవుకు రెండో సొరంగం పూర్తి చేస్తాం. 2021 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేసేలా ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. పోలవరం కుడి ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 50 వేల క్యూసెక్కులకు పెంచేందుకు చర్యలు చేపట్టింది. త్వరలో నూతన పారిశ్రామిక విధానం.. ► గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిన రూ.4 వేల కోట్ల పారిశ్రామిక పోత్సాహకాలను మా ప్రభుత్వం చెల్లించింది. అతి త్వరలోనే కొత్త పారిశ్రామిక విధానం తెస్తాం. ఏపీఐఐసీ ద్వారా 1,466కుపైగా కంపెనీలకు భూమి కేటాయించాం. రూ.11,548 కోట్ల కచ్చితమైన పెట్టుబడులు రానున్నాయి. రూ.24 వేల కోట్లకుపైగా పెట్టుబడితో నెలకొల్పే 39 భారీ, మెగా పరిశ్రమలతో 36,810 ఉద్యోగాలు లభించనున్నాయి. ► కాంట్రాక్టు పనుల్లో అవినీతికి తావు లేకుండా చేసేందుకు రివర్స్ టెండరింగ్ విధానాన్ని తెచ్చి ఇప్పటికే రూ.2,200 కోట్ల ప్రజాధనాన్ని ఆదా చేశాం. సమర్థంగా కరోనా కట్టడి ► కరోనా పరీక్షల్లో దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో ఉంది. టెస్టింగ్ ల్యాబ్లను ఒకటి నుంచి 13కు పెంచి రోజుకు 15 వేల పరీక్షలు నిర్వహిస్తున్నారు. కరోనా మరణాలు రేటు జాతీయ సగటు కంటే ఏపీలో తక్కువగా ఉంది. చరిత్రాత్మక శాసనాలు ► ప్రభుత్వం శాశ్వత ప్రాతిపదికన రాష్ట్ర బీసీ కమిషన్ను ఏర్పాటు చేసింది. ► ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నామినేటెడ్ పదవులు, నామినేషన్ పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించింది. ► దేవదాయశాఖ పరిధిలోకి వచ్చే అన్ని పాలకమండళ్లలో 50 శాతం రిజర్వేషన్ కల్పించింది. ► పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకు కల్పిస్తూ చట్టం చేసింది. ► రూ.100 కోట్లు దాటిన అన్ని టెండర్లను విశ్రాంత న్యాయమూర్తి ద్వారా పరిశీలించేందుకు జ్యుడీషియల్ ప్రివ్యూ కమిటీని ఏర్పాటు చేసింది. ► మహిళలపై నేరాలకు పాల్పడిన వారిని 21 రోజుల్లోనే విచారించి శిక్షించేందుకు దిశ బిల్లును తెచ్చింది. 18 దిశ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. దశలవారీగా మద్య నియంత్రణ... ► ప్రభుత్వం అధికారంలోకి రాగానే 43 వేల బెల్ట్ దుకాణాలను తొలగించింది. 4,300 పర్మిట్రూంల అనుమతులు రద్దు చేసింది. మద్య పానాన్ని నిరుత్సాహపరిచేందుకు విక్రయ వేళలు తగ్గిస్తూ ధరలను భారీగా పెంచింది. 90 % హామీలు అమలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన సుదీర్ఘ పాదయాత్రలో ప్రజలు తమ దుస్థితిని, అవసరాలను ఆయన దృష్టికి తెచ్చారు. సంక్షేమ పథకాలను సచివాలయాల వ్యవస్థ ద్వారా ప్రజల ముంగిటికే తేవడం ద్వారా ప్రభుత్వం నూతన అధ్యాయానికి నాంది పలికింది. మేనిఫెస్టోలోని 90 శాతం హామీలను మొదటి సంవత్సరంలోనే అమలు చేశాం. మేనిఫెస్టోలో లేని 40 నూతన హామీలను కూడాఅమలు చేశాం. ఈ ఏడాది వివిధ పథకాల కింద 3.98 కోట్లమందికి ప్రయోజనం కల్పిస్తూ ప్రభుత్వం రూ.42 వేల కోట్లు ఖర్చు చేసింది. 10.68 కోట్ల పని దినాలకు పైగా కల్పించి ఉపాధి హామీ పనుల్లో రాష్ట్రం దేశంలోనే మొదటిస్థానంలో ఉంది. అదనంగా 62 వేలకుపైగా కొత్త జాబ్ కార్డులిచ్చాం. అందరికీ సంక్షేమ ఫలాలు ► వైఎస్సార్ పింఛన్ కానుక ద్వారా 58.62 లక్షలమంది లబ్ధిదారులకు రూ.14,438 కోట్లు చెల్లించింది. ► వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద 91 లక్షల మంది డ్వాక్రా మహిళలకు రూ.1,400 కోట్లు అందించాం. ► వైఎస్సార్ వాహన మిత్ర పథకంతో రెండు దఫాలుగా రూ.500 కోట్లు చెల్లించాం. ► అగ్రిగోల్డ్ బాధితులకు రూ.236.53 కోట్లు చెల్లించాం. ► వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకం కింద రూ.211.70 కోట్లు పంపిణీ చేశాం. ► నేతన్న నేస్తం కింద 81,703 మంది లబ్ధిదారులకు రూ.197కోట్లు పంపిణీ చేశాం. చిన్నతరహా, మధ్య తరహా పరిశ్రమల రీస్టార్ట్ ప్యాకేజీ, న్యాయనేస్తం పథకం కింద రూ.963 కోట్లు వెచ్చించాం. విద్యా వెలుగులు ► అమ్మ ఒడి పథకం కింద రూ.15 వేల చొప్పున 42.33 లక్షల మంది తల్లుల ఖాతాలో రూ.6,350 కోట్లు జమ చేశారు. ► జగనన్న విద్యాకానుక పథకంతో విద్యార్థులకు మూడు జతల యూనిఫారాలు, పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, బ్యాగులు, షూలు, సాక్సులతో కూడిన కిట్లు ఇస్తున్నారు. 39,70,899 మంది విద్యార్థులకు కిట్ల కోసం రూ.656 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ► జగనన్న గోరుముద్ద పథకంతో రూ.1,105.36 కోట్లు వెచ్చిస్తూ దాదాపు 39,70,899 మంది విద్యార్థులకు పోషకాహారంతో కూడిన మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నారు. ► జగనన్న విద్యా దీవెన కింద ఫీజు రీయింబర్స్మెంట్గా 18.51 లక్షలమంది విద్యార్థులకు రూ.3,857 కోట్లు చెల్లిస్తున్నారు. ► జగనన్న విద్యా వసతి దీవెన పథకం కింద 15.57 లక్షలమంది హాస్టల్ విద్యార్థులకు రూ.1,221 కోట్లు చెల్లించారు. రెండు వాయిదాల్లో దాదాపు రూ.2,200 కోట్లు నేరుగా తల్లుల ఖాతాల్లో జమ చేస్తారు. -
అభివృద్ధి.. సంక్షేమంతో నవశకం
‘వడ్డించే వాడు మనోడైతే పంక్తిలో ఎక్కడ కూర్చుంటేనేం’ అన్న జగమెరిగిన సామెత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి అతికినట్లు సరిపోతుంది. రాష్ట్ర ప్రజలందరూ నా వాళ్లే అనుకున్న మంచి మనసున్న ముఖ్యమంత్రి పాలనలో ఎవరికి ఏమి కావాలో.. ఎంత కావాలో.. వారు అడక్కుండానే విస్తర వేసి విందు భోజనం వడ్డిస్తున్నారు. తాడిత, పీడిత, బడుగు, బలహీన, మైనార్టీ, ఇతర వర్గాల్లోని పేదలందరి అభ్యున్నతే లక్ష్యంగా, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధే ధ్యేయంగా 2020–21 బడ్జెట్లో నిధులు కేటాయించారు. ‘ల’కేత్వమివ్వనేరడు.. ‘ద’కును కొమ్మివ్వనేరడు.. (‘లేదు’ అని చెప్పలేకపోవడం) అన్నట్లు సర్వ జన రంజకంగా బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ప్రభుత్వం అంటే ప్రజాధనానికి ధర్మకర్త అని దృఢంగా విశ్వసిస్తున్నాం. అందుకే ఈ ప్రభుత్వం ప్రజాధనం వృథాకు అడ్డుకట్ట వేసింది. రైతులు, కౌలు రైతులు, తల్లులు, యువత, బడుగు వర్గాల ఆకాంక్షలను నెరవేర్చడానికి అంచనాలకు మించి ప్రభుత్వం కృషి చేస్తోంది. – ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సాక్షి, అమరావతి: అన్ని రంగాల సమగ్రాభివృద్ధి, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాల ద్వారా రాష్ట్రంలో నవశకం ఆవిష్కరణే లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికా బద్ధంగా ముందుకెళుతోందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పేర్కొన్నారు. పారిశ్రామిక ప్రగతికి బాటలు, అన్ని ప్రాంతాలకు సాగునీటి వనరుల కల్పన, విద్యా వెలుగులు, అందరికీ ఇళ్లు, నాడు – నేడు ద్వారా ఆస్పత్రులు, పాఠశాలల రూపురేఖల మార్పు, ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలతో ఆర్థిక ప్రగతి లక్ష్యాలుగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని ఉద్ఘాటించారు. ఎన్నికల మేనిఫెస్టోలోని 90 శాతంపైగా హామీలను మొదటి ఏడాదిలోనే అమలు చేయడాన్ని బట్టే ఇచ్చిన మాట నెరవేర్చుకోవడంపై మా ప్రియతమ నేత, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎంత నిబద్ధత ఉందో అందరికీ స్పష్టంగా అర్థమైందని బుగ్గన వివరించారు. 2020 – 21 ఆర్థిక సంవత్సరానికి రూ.2,24,789.18 కోట్లతో బడ్జెట్ను మంగళవారం ఆయన శాసనసభలో ప్రవేశపెట్టారు. ప్రపంచమంతా కోవిడ్ –19 వల్ల సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో మన ముఖ్యమంత్రి సమర్థవంతమైన నాయకత్వం వల్ల మన ప్రభుత్వం ఈ పోరాటంలో ముందుందన్నారు. మంత్రి బుగ్గన ఇంకా ఏమన్నారంటే.. వికేంద్రీకరణతో ప్రజల గడప వద్దకే సేవలు ► ప్రభుత్వ సేవలను ప్రజల గడప వద్దకు తీసుకెళ్లడమే లక్ష్యంగా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలను తీసుకొచ్చాం. కోవిడ్ –19 లాంటి సంక్షోభ సమయంలోనూ ప్రతి నెలా ఒకటో తేదీ ఉదయమే 99 శాతం మంది అవ్వాతాతలకు పింఛన్లు అందజేశాం. ► గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా అధికార వికేంద్రీకరణ ఫలాలు ప్రజల గడపకు చేరాయనడానికి ఇది నిదర్శనం. కోవిడ్ –19 సమయంలో ముందు వరసలో నిలబడి నిస్వార్థంగా సేవలందిస్తున్న వైద్య ఆరోగ్య శాఖ, గ్రామ, వార్డు సచివాలయాలు, పోలీసు, పంచాయతీరాజ్, మున్సిపల్ సిబ్బందికి ధన్యవాదాలు. ► రైతులు, కౌలుదార్లు, తల్లులు, యువత, బడుగు వర్గాల ఆకాంక్షలను నెరవేర్చడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. ► 2019 జూన్లో అధికారం చేపట్టే నాటికి అనేక సమస్యలు, అవరోధాలు, పెను సవాళ్లు మనముందున్నాయి. గత ప్రభుత్వం వదిలివెళ్లిన బకాయిలు రూ.60 వేల కోట్ల మేరకు పెండింగు బిల్లుల రూపంలో సునామీలా వచ్చిపడుతూనే ఉన్నాయి. ► 2019–20, 2020– 21 సంవత్సరాల్లో కేంద్ర పన్నుల బదలాయింపులో తగ్గుదల, 2020 – 21లో డివిజినల్ పూల్లో తగ్గిన వాటా, లాక్డౌన్తో ఆర్థిక సమస్యలు తీవ్రమయ్యాయి. ► ప్రభుత్వం అంటే ప్రజాధనానికి ధర్మకర్త అని దృఢంగా విశ్వసిస్తున్నాం. అందుకే ఈ ప్రభుత్వం ప్రజాధనం వృథాకు అడ్డుకట్ట వేసింది. రైతు భరోసాతో అన్నదాతల అభివృద్ధికి బాటలు వేశాం. ► రాష్ట్రాన్ని చదువుల బడిగా మార్చేందుకు జగనన్న అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, జగనన్న గోరుముద్ద లాంటి అద్భుత పథకాలు ప్రవేశ పెట్టాం. అందరికీ దృష్టి సమస్యలు తొలగించేందుకు ‘కంటి వెలుగు’ కార్యక్రమం చేపట్టాం. అన్నంపెట్టే రైతన్న ఆకలితో అలమటించకూడదనేది మా లక్ష్యం. అందుకే మాది రైతుల ప్రభుత్వం. పేదల్లో చిరునవ్వుల కోసమే ‘నవరత్నాలు’ ► కష్టాల్లో ఉన్న బడుగు, బలహీన వర్గాలకు కొత్త వెలుగు ప్రసాదించనప్పుడు అభివృద్ధికి అర్థమే ఉండదనే ఉద్దేశంతోనే నవరత్నాలను మేనిఫెస్టోలో పెట్టి అమలు చేస్తున్నాం. ► గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ అనేవి వికేంద్రీకరణ పథంలో మేం వేసిన గొప్ప ముందడుగు. వీటి ద్వారా 1.20 లక్షల మందికిపైగా యువతకు ఉద్యోగాలు ఇచ్చాం. 2.5 లక్షల మందిని వలంటీర్లుగా నియమించాం. ► ఒకే సంవత్సరంలో రూ.8,000 కోట్లతో 30 లక్షల మందికి ఇళ్ల స్థల పట్టాలు ఇచ్చేందుకు ప్రణాళిక వేశాం. ఇలాంటి చరిత్ర ప్రపంచంలోనే లేదు. 2020–21లో 6.25 లక్షల ఇళ్లు నిర్మించాలని ప్రతిపాదిస్తున్నాం. ► మహిళా సంక్షేమం, మహిళలకు రక్షణ మా ప్రభుత్వ ధ్యేయాలు. ‘దిశ’ చట్టం, దీని కింద తీసుకున్న చర్యలే ప్రత్యక్ష నిదర్శనాలు. ► ప్రతి కుటుంబానికి కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ► వైఎస్సార్ పింఛన్లు, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ వాహన మిత్ర, వైఎస్సార్ నేతన్న నేస్తం, కాపునేస్తం లాంటి సంక్షేమ పథకాలన్నీ అన్ని వర్గాల సంక్షేమం పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు నిదర్శనాలు. ► 2020–21లో గ్రామీణాభివృద్ధికి రూ.16,710.38 కోట్లు కేటాయించడం రాష్ట్ర చరిత్రలో రికార్డు. తగినంత సాగునీరే లక్ష్యం ► రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు తగినంత సాగు నీరు అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవధార లాంటి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. రాయలసీమ దుర్భిక్ష నివారణ మిషన్ ఆ ప్రాంతానికి వరం. జగజ్జీవన్ రామ్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, వంశధార – నాగావళి అనుసంధానం ద్వారా ప్రభుత్వం ఉత్తరాంధ్ర రైతులకు బాసటగా నిలుస్తోంది. ► ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్టుమెంట్ ఏర్పాటు చేయడం చరిత్రాత్మక నిర్ణయం. ► విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పీపీపీ పద్ధతిలో భోగాపురం వద్ద అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందించాం. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సమీక్షించి 500 ఎకరాలను రాష్ట్రం కోసం ప్రభుత్వం తీసుకుంది. గత ప్రభుత్వం విద్యుత్తు రంగాన్ని సంక్షోభంలోకి నెట్టగా, ఈ ప్రభుత్వం గాడిన పెడుతోంది. 5 కోట్ల మందితో కూడిన రాష్ట్రమనే కుటుంబ ఆకాంక్షలను నెరవేర్చడానికి ప్రభుత్వం శాయశక్తులా కృషి చేస్తోంది. -
జనతా పద్దు.. కొత్త పొద్దు
సాక్షి, అమరావతి: కోవిడ్–19తో ఆర్థిక వ్యవస్థ మందగించినప్పటికీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చడమే లక్ష్యంగా నవరత్నాలతో కూడిన జనరంజక బడ్జెట్ను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం శాసనసభకు సమర్పించింది. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల ఆంకాంక్షలను నేరవేర్చడమే లక్ష్యంగా 2020–21 ఆర్థిక సంవత్సరం పూర్తి స్థాయి బడ్జెట్కు రూపకల్పన చేశారు. సంక్షేమం, వ్యవసాయం, విద్య, వైద్యం, సాగునీరు, మౌలిక రంగాలకు బడ్జెట్లో పెద్దపీట వేశారు. 2019–20 వార్షిక బడ్జెట్లోనే ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 90 శాతం అమలుకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం.. ఇప్పుడు మిగతా హామీలన్నింటికీ బడ్జెట్లో కేటాయింపులు చేసింది. నవరత్నాల్లోని వివిధ పథకాల ద్వారా నేరుగా లబ్ధిదారులకు నగదు బదిలీ కోసం ఏకంగా రూ.37,659 కోట్లు కేటాయించింది. ► పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన మాట మేరకు వారి రుణాల చెల్లింపునకు వైఎస్సార్ ఆసరా కింద రూ.6,300 కోట్లు కేటాయించారు. 45–60 ఏళ్లలోపు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు వైఎస్సార్ చేయూత కింద రూ.3 వేల కోట్లు కేటాయించారు. ► వైఎస్సార్ పెన్షన్ కానుకకు ఏకంగా రూ.16,000 కోట్లు కేటాయించారు. సంక్షేమాన్ని, అభివృద్ధిని సమ్మిళితం చేస్తూ గతంలో లేని విధంగా అన్ని వర్గాల ప్రజలను సంతృప్తి పరిచే స్థాయిలో ప్రతిపాదించారు. ► ఏ రంగాలకు, ఏ వర్గాలకు, ఏ పథకాలకు ఎన్ని నిధులు కేటాయించారో వివరించారు. సంక్షేమంతో పాటు అభివృద్ధికీ ప్రాధాన్యత ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉప ప్రణాళికలకు భారీగా నిధులు కేటాయించారు. ► మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో 2020–21 రాష్ట్ర వార్షిక బడ్జెట్ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. ► అభివృద్ధి, సంక్షేమంలో కీలక పాత్ర పోషిస్తున్న గ్రామ, వార్డు వలంటీర్లు, గ్రామ, పట్టణ సచివాలయాలకు బడ్జెట్లో రూ.3,798 కోట్లు కేటాయించారు. వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ► వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్ రూ.29,159.97 కోట్లు కేటాయించారు. ఇందులో వైఎస్సార్ రైతు భరోసా కింద ఒక్కో రైతు కుటుంబానికి పెట్టుబడి సాయంగా ఏటా రూ.13,500 (ఇప్పటికే ఒక్కో రైతుకు రైతు భరోసా కింద ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.7,500 ఇచ్చేశారు) చొప్పున ఇచ్చేందుకు వీలుగా బడ్జెట్లో రూ.3,615.60 కోట్లు కేటాయించారు. రైతులకు వడ్డీ లేని (సున్నా వడ్డీ) రుణాలకు, రైతులకు ఉచితంగా బోర్లు వేయడానికి, ధరల స్థిరీకరణ నిధి, ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ, ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు ఎక్స్గ్రేషియా, గోదాముల నిర్మాణం, సబ్సిడీపై విత్తనాలు సరఫరా, పంటల బీమా ప్రీమియంకు కేటాయింపులు చేశారు. ► కృష్ణా, గోదావరి నదుల్లో రాష్ట్రానికి ఉన్న వాటా నీళ్లను వినియోగించుకుని దుర్భిక్ష ప్రాంతాలను సస్యశ్యామలం చేసేందుకు పెద్ద పీట వేశారు. జల వనరుల శాఖకు రూ.11,805.85 కోట్లు కేటాయించారు. విద్యా రంగానికి ప్రాధాన్యత ► పట్టణ, గ్రామీణ పేదల గృహ నిర్మాణాలకు భారీగా కేటాయించారు. అన్ని రకాల గృహాల నిర్మాణాలకు రూ.6,190.33 కోట్లు కేటాయించారు. ఇందులో వైఎస్సార్ గృహ వసతికి రూ.3 వేల కోట్లు కేటాయించారు. ► ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు, ఈబీసీ, దివ్యాంగ విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన, వసతి దీవెనకు (ఫీజు రీయింబర్స్మెంట్కు) రూ. 5 వేల కోట్లు కేటాయించారు. ► విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. సాధారణ విద్యకు బడ్జెట్లో 25,201.35 కోట్ల రూపాయలు కేటాయించారు. జగనన్న అమ్మ ఒడి కింద సాయం అందించేందుకు రూ. 6,000 కోట్లు కేటాయించారు. ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సదుపాయాల కల్పనకు నాడు–నేడు కింద రూ.3,000 కోట్లు కేటాయించారు. ► వైద్య రంగానికి బడ్జెట్లో పెద్ద పీట వేశారు. ఏకంగా రూ.11,418 కోట్ల కేటాయింపులు చేశారు. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య శ్రీకి బడ్జెట్లో రూ.2,100 కోట్లు కేటాయించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయల కల్పనకు నాడు–నేడు కింద రూ.1,528 కోట్లు కేటాయించారు. ► కాపుల సంక్షేమానికి బడ్జెట్లో రూ.2,845.60 కోట్లు కేటాయించారు. ఎస్సీ ఉప ప్రణాళిక కింద 15,735.68 కోట్లు, ఎస్టీ ఉప ప్రణాళిక కింద రూ.5,177.53 కోట్లు, బీసీ ఉప ప్రణాళిక కింద రూ.25,331.30 కోట్లు కేటాయింపులు చేశారు. ► కడపలో స్టీల్ ప్లాంటు ఏర్పాటుకు బడ్జెట్లో రూ.250 కోట్లు కేటాయించారు. ► మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలకు పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు కలిపి రూ.1,365.08 కోట్లు కేటాయించారు. గ్రామీణాభివృద్ధికి రూ.15,112.74 కోట్లు, సంక్షేమానికి రూ.41,456.29 కోట్లు కేటాయించారు. ఇటు సంక్షేమం ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఇప్పటికే 90 శాతం నెరవేర్చిన ప్రభుత్వం మిగతా హామీలన్నింటికీ నిధులు కేటాయించింది. నవరత్నాల్లోని వివిధ పథకాల ద్వారా ప్రజలకు సాయం అందించేందుకు రూ. వేలాది కోట్లు కేటాయించింది. వ్యవసాయం, విద్య, వైద్యం తదితర రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో పెద్ద ఎత్తున కేటాయింపులు చేసింది. అటు అభివృద్ధి కృష్ణా, గోదావరి నదుల్లో రాష్ట్రానికి హక్కుగా సంక్రమించిన వాటా నీళ్లను వినియోగించుకుని దుర్భిక్ష ప్రాంతాలను సస్యశ్యామలం చేసేందుకు బడ్జెట్లో పెద్ద పీట వేశారు. అలాగే గ్రామీణాభివృద్ధితో పాటు పలు రంగాలకు భారీగా నిధులు కేటాయించారు. -
ఏపీ బడ్జెట్ 2020-21ప్రత్యేక చిత్రాలు
-
జగన్ సంకల్పానికి ప్రకృతి సహకరిస్తోంది..
సాక్షి, అమరావతి: బడ్జెట్లో వ్యవసాయానికి అత్యధికంగా నిధులు కేటాయించిన ఘనత వైఎస్ జగన్ ప్రభుత్వానికే దక్కుతుందని ఏపీ వ్యవసాయ మిషన్ వైఎస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులకు మేలు చేసేలా సంకల్ప బలంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుకెళ్తున్నారన్నారు. ప్రకృతి కూడా సహకరించి గత పది సంవత్సరాల్లో లేని విధంగా ఆహార ధాన్యాలు దిగుబడి గత ఏడాది కంటే పెరిగాయని పేర్కొన్నారు. ఉత్పత్తులు పెరగడమే కాదని.. సరాసరి దిగుబడులు కూడా పెరిగాయని తెలిపారు. కరోనా సంక్షోభం మూలంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఏడాది ఆదాయం పెరిగే అవకాశం లేనందున, మొత్తం బడ్జెట్ గత ఏడాది కంటే 1.4 శాతం తగ్గిందని వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరం రూ.2,24,789.18 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారని.. అందులో వ్యవసాయానికి 29,159.97 కోట్లు కేటాయించారన్నారు. రెండో సంవత్సరం కూడా రెండంకెల శాతం వ్యవసాయ రంగానికి అధికంగా నిధులు కేటాయించారన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. -
ఏపీ: కీలక బిల్లులకు అసెంబ్లీ ఆమోదం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర శాసన సభ పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. అభివృద్ధి వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమానాభివృద్ధి బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లు, దేవాదాయ చట్టంలో రెండు సవరణ బిల్లులకు శాసనసభ మంగళవారం ఆమోదం తెలిపింది. వీటితోపాటు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రవేశపెట్టిన పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును శాసనసభ ఆమోదించింది. స్థానిక సంస్థల ఎన్నికల సంస్కరణల బిల్లు, జీఎస్టీ సవరణ బిల్లు, వ్యాట్ సవరణ బిల్లు, 2020 ఎక్సైజ్ సవరణ బిల్లు, ప్రొహిబిషన్ చట్ట సవరణ బిల్లు, ఉన్నత విద్యాకమిషన్ సవరణ బిల్లు, 2020 ఓటాన్ అకౌంట్ బడ్జెట్కు శాసనసభ ఆమోదం తెలిపింది. ఇదిలాఉండగా.. దేవాదాయ చట్టంలో సవరణలకు సంబంధించి ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చొరవతోనే టీటీడీలో సన్నిధి గొల్లలకు వారసత్వ హక్కు లభించిందని అన్నారు. చట్టంలో సన్నిధి యాదవులని మార్చినందుకు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. ఇక బిల్లులకు ఆమోదం తెలిపిన తర్వాత స్పీకర్ తమ్మినేని సీతారాం సభను రేపటికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. (చదవండి: బీఏసీ సాక్షిగా బయటపడ్డ టీడీపీ డ్రామాలు) -
ఏపీ బడ్జెట్: వ్యవసాయానికి మంచి రోజులు
సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రధానంగా వ్యవసాయిక ఆర్థిక వ్యవస్థగా మారిపోయింది. వ్యవసాయ రంగం ఆర్థికాభివృద్ధిలో ప్రధాన పాత్ర వహించడమే కాకుండా, ఆహార భద్రతను సమకూరుస్తుంది. నాలుగింట మూడు వంతుల కార్మికులకు ఉపాధి కల్పిస్తోంది. రైతు సంక్షేమమే ధ్యేయంగా వైఎస్ జగన్ ప్రభుత్వం కొత్త పథకాలు ప్రారంభించడమే కాకుండా, మరెన్నో పథకాలకు ఆర్థిక సాయం పెంపుదల చేసింది వైఎస్సార్ రైతు భరోసా: పీఎం కిసాన్ పథకం 2019 అక్టోబర్ 15న ప్రారంభమయ్యింది. ఇందులో భాగంగా ప్రతి రైతు కుటుంబానికి వారి వ్యవసాయ అవసరాల నిమిత్తం రూ.13,500 వార్షిక పెట్టుబడి ప్రభుత్వ సమకూర్చుతుంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 46 లక్షల 51 వేల అర్హులైన రైతు కుటుంబాలకు ఈ పథకం కింద ఆర్థిక సాయం అందగా, ఇందులో లక్ష 58వేలు కౌలు దారు కుటుంబాలు ఉన్నాయి. ఈ పథకం కొనసాగించడానికి 2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ.3,615.60 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. (ఏపీ వ్యవసాయ బడ్జెట్) వైఎస్సార్ పంటల ఉచిత బీమా పథకం: పీఎంఎఫ్బివై,ఆర్డబ్ల్యూబీసీఐఎస్ల కింద గుర్తించబడిన అన్ని పంటలకు 2019 ఖరీఫ్ కాలానికి బీమా నిమిత్తం రైతు వాటా ప్రీమియం చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పంటల బీమా పథకాన్ని ఇన్సూరెన్స్కంపెనీలకు బదులు ప్రభుత్వమే భరిస్తుంది. ఈ పథకం కింద రైతులకు మేలుచేకూర్చే లక్ష్యంతో ఈ బడ్జెట్లో రూ. 500 కోట్లు ప్రతిపాదించారు. (ఏపీ బడ్జెట్: పేద బిడ్డలకు చదువుల వెలుగు) వడ్డీలేని రుణాలు: పంటల నిమిత్తం తీసుకున్న అప్పులను సకాలంలో చెల్లించే అలవాటు రైతుల్లో పెంపొందించడానికి లక్ష రూపాయల వరకు పంట రుణాలపై ప్రభుత్వమే వడ్డీ చెల్లిస్తోంది. ఇందుకు గాను 2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ.1,100 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. రైతు భరోసా కేంద్రాలు: రాష్ట్రంలోని అన్ని గ్రామ సచివాలయాలోనూ 11,158 రైతు భరోసా కేంద్రాలను నెలకొల్పాడానికి ప్రభుత్వం సంకల్పించింది. ఈ కేంద్రాలు ఒక వైపు రైతులకు అవసరమైన వస్తు సామాగ్రి సరఫరా బాధ్యతతో పాటు, మరొవైపు ఉత్తమ వ్యవసాయిక విధానాలకు సంబంధించి పరిజ్ఞానాన్ని రైతులకు చేరవేసే బాధ్యత కూడా నిర్వర్తిస్తాయి. మల్టీ బ్రాండ్ నాణ్యమైన ఇన్పుట్ల సరఫరా, ఎంఎస్పీ సమాచారం, సాంకేతిక వ్యవహారాల్లో మార్గదర్శకం, వ్యవసాయ పనిముట్లు అద్దెకు తీసుకోవటం.. నేల, విత్తనాల పరీక్ష, బ్యాంకు నుంచి రుణాలు తీసుకోవటంపై శిక్షణ ఇచ్చే విధంగా ఇవి పనిచేస్తాయి. రైతు భరోసా కేంద్రాల స్థాపనకు ప్రభుత్వం రూ.100 కోట్లను కేటాయించింది. నాణ్యతా పరీక్షా కేంద్రాలు: నాసిరకమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు సరఫరాను అరికట్టడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. ఇందుకుగాను వ్యవసాయ క్షేత్రాలకు సమీపంలోనే నాణ్యతా పరీక్షా కేంద్రాలను నెలకొల్పడానికి నిర్ణయించింది. రాష్ట్రం అంతటా 160 వైఎస్సార్ వ్యవసాయ పరీక్షా కేంద్రాలను నెలకొల్పడానికి ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇందులో 147 లేటోరేటరీలు గ్రామీణ ప్రాంతాల్లోని నియోజకవర్గాలు,13 జిల్లా కేంద్రాల్లోనూ ప్రారంభించనున్నారు.వీటితో పాటు విత్తనాలు,ఎరువులు, పురుగు మందుల నాణ్యతను పరిశీలించచడానికి నాలుగు ప్రాంతీయ కోడింగ్ కేంద్రాలను కూడా నెలకొల్పనున్నారు. ‘వైఎస్సార్ అగ్రి టెస్టింగ్ లేబోరేటరీల ఏర్పాటుకు ఈ బడ్జెట్లో రూ.65 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. ధరల స్థిరీకరణ నిధి: కనీస మద్దతు ధర కలిగిన పంటల అమ్మకాలకు అవకాశాలు పెంపొందించడానికీ, కనీస మద్దతు ధర లేని పంటలు సాధారణ ధర కన్నా తక్కువగా అమ్ముడు పోకుండా ఉండటానికి ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసింది. రూ.3000 కోట్ల ఈ నిధి ఏర్పాటు రాష్ట్ర చరిత్రలో చారిత్రాత్మక నిర్ణయం. ఉల్లి,మిర్చి,పసుపు, అరటి,నారింజ,చిరు ధాన్యాలను కనీస మద్దతు ధర ప్రకటించిన ఏకైక ప్రభుత్వం. రైతుల సమస్యలను పరిష్కరించడం కోసం ప్రభుత్వం ‘1907’ టోల్ ఫ్రీ నంబర్ను కూడా ఏర్పాటు చేసింది. ధరల స్థిరీకరణ నిధి ద్వారా పచ్చిశనగ రైతులకు రూ.96.11 కోట్లు, ఉల్లి రైతులకు రూ.63.12 కోట్లు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించింది. మార్క్ఫెడ్ ద్వారా రూ.2,138 కోట్ల వ్యవసాయ ఉత్పత్తులను, అందులో రూ.1500 కోట్ల ఉత్పత్తులు లాక్డౌన్ సమయంలో ప్రభుత్వం సేకరించింది. ఈ బడ్జెట్లో వ్యవసాయ రంగానికి రూ.11,891.20 కోట్లు ప్రభుత్వం ప్రతిపాదించింది. పశుగణాభివృద్ధి-మత్స్యపరిశ్రమకు రూ.1,279.78 కోట్లు పశుగణాభివృద్ధి, మత్స్యరంగాల అభివృద్ధికి 2020-21 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం రూ.1,279.78 కోట్లు కేటాయించింది. నవరత్నాలలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.50 కోట్లతో పశుగణ నష్టపరిహార నిధిని ఏర్పాటు చేసింది. ఆవులు, గేదెలు మొదలైన వాటికి రూ.15వేలు నుంచి రూ.30 వేలు, మేకలు,గొర్రెలకు ఆరువేలు దాకా రైతులకు నష్టపరిహారం అందజేస్తుంది. వైఎస్సార్ మత్స్యకార భరోసా ఏపీలో మత్స్యరంగం దాదాపు 14.5 లక్షల మందికి ఉపాధి కల్పిస్తుంది. దేశం నుంచి ఎగుమతి అవుతున్న సముద్ర సంబంధమైన ఆహార ఉత్పత్తుల్లో 36 శాతం రాష్ట్రం నుంచే ఎగుమతి అవుతుంది. మత్స్యరంగం మీద ఆధారపడ్డ కుటుంబాల సంక్షేమం కోసం ప్రభుత్వం వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకాన్ని అమలు చేస్తోంది. చేపల నిషేధం అమలు అయ్యే కాలంలో మత్స్యకార కుటుంబాలకు అందించే ఆర్థిక సాయాన్ని రూ.4 వేలు నుంచి 10వేలకు ప్రభుత్వం పెంచింది. ఈ పథకం ద్వారా ఇప్పటిదాకా 1,02,332 సముద్రతీర మత్స్యకార కుటుంబాలు లబ్ధిపొందాయి. ఫిషింగ్ బోట్ల డీజిల్ ఆయిల్ మీద ఇచ్చే సబ్సిడీలను కూడా ప్రభుత్వం రూ.6.03 నుంచి రూ.9కి ప్రభుత్వం పెంచింది. తద్వారా 2019-20 ఆర్థిక సంవత్సరంలో 19,796 బోట్లు లబ్ధిపొందాయి. ఆక్వా రైతులందరికీ విద్యుత్ ఛార్జీలలో కూడా మినహాయింపులు ఇచ్చింది. తద్వారా 53,500 మంది ఆక్వా రైతులు లబ్ధిపొందారు. చేపలు పెట్టే సమయంలో ఆకస్మికంగా మృతిచెందే మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున అందించే ఆర్థిక సాయాన్ని రూ.5 లక్షల నుంచి 10 లక్షలకు ప్రభుత్వం పెంచింది. ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి రూ.142.66 కోట్లు 974 కిలోమీటర్ల పొడవైన తీర రేఖతో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే రెండో స్థానంలో నిలుస్తుంది. మత్స్యరంగాన్ని మరింత అభివృద్ధి పరచడం కోసం జువ్వలదిన్నె, నిజాంపట్నం మచిలిపట్నం, ఉప్పాడ,బుడగట్లపాలెం, పూడిమెడక,కొత్తపట్నం, బియ్యపు తిప్పల్లో ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టనున్నారు. ఇందుకు గాను ఈ బడ్జెట్లో రూ.142.66 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. -
బీఏసీ సాక్షిగా బయటపడ్డ టీడీపీ డ్రామాలు
సాక్షి, అమరావతి : బీఏసీ సమావేశం సాక్షిగా మరోసారి టీడీపీ డ్రామాలు బయటపడ్డాయి. శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన మంగళవారం జరిగిన బీఏసీ సమావేశంలో టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సాధ్యం కాని అంశాలను లేవనెత్తాడు. వర్చువల్ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. అయితే వర్చువల్ అసెంబ్లీ సాధ్యం కాదని, దీనిపై పార్లమెంట్ ఇంకా నిర్ణయం తీసుకోలేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. 50 రోజులైనా అంసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సీఎం జగన్ పేర్కొన్నారు. (చదవండి : లైవ్ అప్డేట్స్: ఏపీ వ్యవసాయ బడ్జెట్) ‘మేం చేసిన కార్యాక్రమాలను ప్రజలకు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. 3.98 కోట్ల మందికి వివిధ పథకాల ద్వారా 42 వేల కోట్ల రూపాయలను బదిలీ చేశాం. ఈ విషయాలను ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది. బయట పరిస్థితులు అందరికి తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా అసెంబ్లీ నడపాలని టీడీపీ కోరితే మాకు అభ్యంతరం లేదు. ఎన్ని రోజులు నడపాలో అడగండి.. నిర్వహిస్తాం. కాకపోతే వర్చువల్ అసెంబ్లీ సాధ్యం కాదు. దీనిపై పార్లమెంట్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు’ అని సీఎం జగన్ స్పష్టం చేయడంతో టీడీపీ ఎమ్మెల్యేలు మౌనంగా ఉండిపోయారు. (చదవండి : ఏపీ బడ్జెట్ హైలైట్స్) -
ఏపీ వ్యవసాయ బడ్జెట్ హైలైట్స్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ బడ్జెట్ 2020-21ను ఆ శాఖ మంత్రి కన్నబాబు శాసనసభలో మంగళవారం సాయంత్రం ప్రవేశపెట్టారు. గతేడాది కాలంలో వ్యవసాయ రంగంలో సమూల మార్పులు చోటుచేసుకున్నాయని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. దీర్ఘకాలికంగా రైతులకు మేలు చేసేలా నిర్ణయాలు తీసుకున్నామని మంత్రి తెలిపారు. ఆయన శాసనసభలో ప్రసంగిస్తూ.. ‘రైతు సంక్షేమం అంటే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గుర్తొస్తారు. రైతుల కోసం నాన్న ఒకడుగు ముందుకేస్తే తాను రెండడుగులు ముందుకేస్తానని చెప్పి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆచరణలో చూపుతున్నారు. ఒత్తిడిలేని వ్యవసాయమే ఆయన సంకల్పం. పెట్టుబడి తగ్గిస్తూ ఉత్పత్తుల నాణ్యతను, రైతుల నికరా ఆదాయాన్ని పెంచడం ద్వారా రైతన్నల ముఖాల్లో సంతృప్తిని చూడటమే లక్ష్యంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ముందుకెళ్తోంది’అని మంత్రి కన్నబాబు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున వ్యవసాయ, అనుబంధ రంగాలకు 2020-21 ఏడాదికి గాను రూ. 29,159.97 కోట్ల బడ్జెట్ ప్రతిపాదిస్తున్నామని అన్నారు. రైతు భరోసా-పీఎం కిసాన్ పథకం ద్వారా రూ.12,500 ఇస్తామని చెప్పి రూ.13,500 ఇస్తున్నామని ఆయన వెల్లడించారు. శాసనమండలిలో మంత్రి మోపిదేవి వెంకటరమణ వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టారు. వ్యవసాయ బడ్జెట్లో కేటాయింపులు.. 3 వేల కోట్ల తో ధరల స్థిరీకరణ నిధి రైతు భరోసా కేంద్రాల కు 100 కోట్లు వైఎస్సార్ ఉచిత పంటల బీమాకు 500 కోట్లు వైఎస్సార్ వడ్డీ లేని పంట రుణాలను 1100 కోట్లు రైతులకు ఎక్స్ గ్రేషియో కు 20 కోట్లు రాయితీ విత్తనాల కోసం 200 కోట్లు వ్యవసాయ యాంత్రీకరణ కు 207.83 కోట్లు ప్రకృతి వ్యవసాయానికి 225.51 కోట్లు ప్రకృతి విపత్తు నిధి 2000 కోట్లు ఎన్జీ రంగా యూనివర్సిటీ కి 402 కోట్లు ఉద్యాన వన అభివృద్ధి కి 653.02 కోట్లు వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ కి 88.60 కోట్లు పట్టు పరిశ్రమ అభివృద్ధి కి 92.18 కోట్లు పశు సంవర్థక శాఖ కు854.77 కోట్లు వెంకటేశ్వర పశు వైద్య శాల కు 122.73 కోట్లు మత్స్య అభివృద్ధి కి 299.27 కోట్లు సహకార శాఖ కు 248.38 కోట్లు వ్యవసాయ విద్యుత్ సబ్సిడీకి 4450 కోట్లు వ్యవసాయ అనుబంధ ఉపాధి హామీకి 6270 కోట్లు వెంకటేశ్వర పశు వైద్యశాలకు 122.73 కోట్లు మత్స్య అభివృద్ధి కి 299.27 కోట్లు సహకార శాఖ కు 248.38 కోట్లు వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ కి 4450 కోట్లు వ్యవసాయ అనుబంధ ఉపాధి హామీకి 6270 కోట్లు చదవండి: ఏపీ బడ్జెట్ హైలైట్స్ -
ఏపీ బడ్జెట్: పేద బిడ్డలకు చదువుల వెలుగు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ను చదువుల బడిగా మార్చేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం దృఢ సంకల్పంతో ముందుకెళ్తోంది. సామాజికంగా పేదల గడపల్లో చదువుల వెలుగులు పంచే గొప్ప దార్శనికతతో కూడిన పథకంగా ‘అమ్మ ఒడి పథకానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారు. పేద బిడ్డల చదువుల వెలుగుగా ‘అమ్మ ఒడి’ నిలిచిపోతుంది. ఈ పథకం ద్వారా కుల,మత,వర్గ, ప్రాంత వివక్ష లేకుండా పేద కుటుంబాల పిల్లలు 1 నుంచి ఇంటర్ వరకు గుర్తింపబడిన ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో చదువుకోవడం సాధ్యమవుతుంది. (ఏపీ బడ్జెట్ సమావేశాలు) సదుపాయాల కల్పనే లక్ష్యంగా.. ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాల కల్పనే లక్ష్యంగా మొదటి దశలో ఎంపిక చేసిన 15,715 పాఠశాలల్లో తల్లిదండ్రుల భాగస్వామ్యం ద్వారా ‘మన బడి నాడు-నేడు’ పథకాన్ని అమలు పరచడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 2020-21 బడ్జెట్లో ఈ పథకానికి రూ.3,000 కోట్లు కేటాయించింది. ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలో 1 నుంచి పదో తరగతి విద్యార్థులకు 3 జతల యూనిఫామ్లు, నోటు, పాఠ్య పుస్తకాలు, ఒక జత బూట్లు, 2 జతల సాక్సులు,బెల్టు స్కూల్ బ్యాగ్ మొత్తం స్టూడెంట్ కిట్గా ’ జగనన్న విద్యాకానుక’ పేరిట అందించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. (ఏపీ బడ్జెట్: పేదల ఆరోగ్యానికి కొండంత భరోసా) చిన్నారుల ఆరోగ్య ప్రమాణాల పెంపుదలపై ప్రత్యేక శ్రద్ధ ‘జగనన్న గోరుముద్ద’ పథకం ద్వారా చిన్నారుల ఆరోగ్య ప్రమాణాల పెంపుదలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది. పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు రుచి, పుష్టికరమైన ఆహారం అందించాలని మధ్యాహ్న భోజన పథకం మెనూ అమలుకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ కొత్త మోను ఈ ఏడాది జనవరి 21 నుంచి అమలవుతోంది. వీటితో పాటు మధ్యాహ్న భోజనం వండి పెట్టే వంట మనుషులకు ఇచ్చే నెలవారీ పారితోషికాన్ని రూ.1000 నుంచి రూ.3000కు ప్రభుత్వం పెంచింది. సెకండరీ, ఇంటర్ విద్యాశాఖల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం రూ.22,604 కోట్లు కేటాయించింది. (విశాఖనే పరిపాలన రాజధాని) ఉన్నత విద్యావకాశాలు మెరుగుకోసం.. విద్యార్థుల ఉన్నత విద్యావకాశాలను మెరుగుపర్చడం కోసం జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన పథకాలు అమలు చేయడంతో పాటు ఉన్నత స్థాయి నిపుణుల సంఘం వారి సూచనల ప్రకారం పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టుగా ఇంజనీరింగ్ కరికులంను సరిదిద్దింది. రాష్ట్ర విశ్వ విద్యాలయాల్లోనూ, వాటి అనుబంధ కళాశాలలోనూ కొత్త కరికులం 2019-20 విద్యా సంవత్సరం నుంచి జరుగుతోంది. ఆంధ్రా యూనివర్శిటీకి రూసా పథకం కింద నిధులు మంజూరు చేయనున్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఉన్నత విద్యారంగానికి రూ.2,277 కోట్లు కేటాయించారు. -
ఏపీ బడ్జెట్: పేదల ఆరోగ్యానికి కొండంత భరోసా
సాక్షి, అమరావతి: బడ్జెట్లో ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. పేదలకు పూర్తి స్థాయి ఆరోగ్య సేవలను అందించడమే లక్ష్యంగా వైఎస్ జగన్ ప్రభుత్వం ముందుకెళ్తుంది. ‘వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం’ పరిధిని విస్తరించింది. ఇప్పటికే అందుబాటులో ఉన్న 1059 ఆరోగ్య విధానాలతో పాటు, అదనంగా 1000 ఆరోగ్య విధానాలను కూడా ప్రవేశపెట్టింది. ఈ ఏడాది జనవరి నుంచి స్మార్ట్ హెల్త్ కార్డుల పంపిణీ మొదలయ్యింది. దాదాపు కోటి 42 లక్షలు మేరకు కార్డులు పంపిణీ కానున్నాయి. పేద కుటుంబాలకు చెందిన రోగులకు శస్త్ర చికిత్సలు అవసరమైనప్పుడు వారు కోలుకోవటానికి పట్టే కాలంలో ఉపాధి లభించడం కష్టం కాబట్టి, ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి ‘వైఎస్సార్ ఆరోగ్య ఆసరా పథకం’ కింద రోజుకు 225 రూపాయలు మేరకు శస్త్రచికిత్స అనంతర భత్యాన్ని మంజూరు చేస్తున్నారు. రాష్ట్ర సరిహద్దుల్లో నివసిస్తున్న పేద కుటుంబాల సౌకర్యం కోసం తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కింద 130 ఆసుపత్రులను ఎంపిక చేశారు. (ఏపీ బడ్జెట్ హైలైట్స్) కంటి వెలుగుకు రూ.20 కోట్లు.. అందరికీ కంటి పరీక్షలు నిర్వహించి తగిన చికిత్సలు, సదుపాయాలు అందించాలనే ఉద్దేశ్యంతో గత ఏడాది అక్టోబర్ 10న కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో మొదటి విడతగా 69 లక్షలు, రెండో విడతగా 4 లక్షల 60 వేల మంది పాఠశాల విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. మూడో దశలో 60 ఏళ్లు పైబడిన వారందరికీ పరీక్షలు నిర్వహించడంతో పాటు కళ్లద్ధాలు కూడా అందించనున్నారు. తదుపరి రాష్ట్ర ప్రజలందరూ కంటి వెలుగు పథకం కింద లబ్ధిపొందనున్నారు. 2020-21 సంవత్సరానికి గాను రూ.20 కోట్లు బడ్జెట్ను ప్రతిపాదించారు. (ఏపీ బడ్జెట్ : గిరిజన జీవితాల్లో వెలుగులు) అత్యవసర సేవలకు 1000 కొత్త వాహనాలు అత్యవసర వైద్యసేవలను ప్రజలకు సకాలంలో అందించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. ఇందుకుగాను ‘108 అంబులెన్స్ పథకం’ కింద 439 అంబులెన్స్లను ప్రతి మండలానికి ఒక్కొక్కటి చొప్పున కేటాయించనున్నారు. సంచార వైద్య వాహనాలను కూడా పెంచనున్నారు. 1000 కొత్త వాహనాలను ఈ ఏడాది ప్రారంభించనున్నారు. 108, 104 సేవల కింద రూ.470.29 కోట్లు బడ్జెట్ను ప్రతిపాదించారు. వైఎస్సార్ హెల్త్ క్లినిక్లు వైద్య ఆరోగ్య రంగంలో ‘నాడు-నేడు’ పథకం కింద సబ్ సెంటర్ల నుంచి టీచింగ్ ఆసుపత్రుల దాకా మౌలిక సదుపాయాలు,వైద్య సామాగ్రి, అదనపు మానవ వనరుల కల్పనకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గ్రామ,వార్డు స్థాయిలో 11,000కు పైగా వైఎస్సార్ హెల్త్ క్లినిక్లు నెలకొల్పనున్నారు. రాష్ట్రం అంతటా దశలవారీగా 15 కొత్త వైద్య కళాశాలలను ప్రారంభించనున్నారు. క్యాన్సర్, మూత్రపిండ సంబంధింత సమస్యల చికిత్సలకు ‘నాడు-నేడు’ పథకం కింద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను కూడా నిర్మించనున్నారు. ఈ పథకం కింద మొత్తం 1145 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 195 కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు, 28 ప్రాంతీయ వైద్యశాలలు, 13 జిల్లా ఆసుపత్రులు, 11 బోధన ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలను ఆధునీకరించనున్నారు. వైద్య ఆరోగ్య శాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేయడానికి 9,700 మంది ఆరోగ్య సిబ్బందిని ప్రభుత్వం నియమించనుంది. వైద్య ఆరోగ్య శాఖలో ఇంత పెద్ద ఎత్తు నియామకాలు చేపట్టడం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమం. ఆరోగ్యశాఖకు ఈ బడ్జెట్లో రూ.11,419.44 కోట్లును ప్రతిపాదించారు. -
ఏపీ బడ్జెట్: 1.4 శాతం తగ్గిన అంచనాలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రెండోదఫా వార్షిక ఆర్థిక బడ్జెట్ను (2020–21) అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. శాసనసభలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, శాసన మండలిలో ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్చంద్రబోస్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఆర్థిక మంత్రి బుగ్గన బడ్జెట్ ప్రవేశపెడుతూ.. కరోనా మహమ్మరి కారణంగా ఈసారి బడ్జెట్ అంచనాలు 1.4 శాతం తగ్గాయని వెల్లడించారు. 2020-21 ఏడాదికిగాను రూ.2,24,789.19 కోట్ల అంచనా వ్యయంతో సంక్షేమ బడ్జెట్ను ప్రభుత్వం రూపొందించిందని తెలిపారు. ఇందులో రెవిన్యూ లోటు రూ.18,434.14 కోట్లుగా అంచనా వేసినట్టు తెలిపారు. ఆర్థిక లోటు దాదాపు రూ. 48,295.58 కోట్లు ఉండవచ్చని అంచనా వేశారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 4.78 శాతం ఆర్థిక లోటు, 1.82 శాతం రెవిన్యూ లోటుగా ఉంటుందని చెప్పారు. (చదవండి: ఏపీ బడ్జెట్ హైలైట్స్) 2019-20, 2020-21 సంవత్సరాల్లో కేంద్ర పన్నుల బదలాయింపులో తగ్గుదల, 2020-21 సంవత్సారానికి సంబంధించి డివిజబుల్ పూల్లో తగ్గిన వాటాతోపాటు, కోవిడ్-19 వల్ల ప్రకటించిన లాక్డౌన్ చర్యలతో తగ్గుముఖం పట్టిన ఆదాయ వనరులు మన ఆర్థిక సమస్యను మరింత తీవ్రతరం చేశాయని అన్నారు. అయితే, నేను ఈ సమస్యలను మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లినప్పుడు వారు నెల్సన్ మండేలా గారి కింది వ్యాఖ్యల్ని గుర్తు చేశారు. ‘ఎవరైనా తాము చేపట్టాలనుకుంటున్న మార్పును సాధించడానికి పరిపూర్ణంగా అంకితమైతే ప్రతికూల పరిస్థితుల్ని అధిగమించి విజయం సాధిస్తారు’ అని సీఎం వైఎస్ జగన్ చెప్పిన మాటల్ని ఆర్థిక మంత్రి బుగ్గన ఉటంకించారు. 2020-21 బడ్జెట్ అంచనాలు 2,24,789.19 కోట్లతో బడ్జెట్ 1,80,392.65 కోట్ల రెవెన్యూ వ్యయం 44,396.54 కోట్ల పెట్టుబడి వ్యయం సవరించిన అంచనాలు 2019-20 రెవెన్యూ వ్యయం రూ. 1,37,518.07 కోట్లు మూలధన వ్యయం రూ. 12,845.49 కోట్లు రెవెన్యూ లోటు దాదాపుగా రూ. 26,646.92 కోట్లు ఆర్థిక లోటు దాదాపుగా 40,493.46 కోట్లు ఇవి రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో 2.47 శాతం, 3.75 శాతం -
ఏపీ బడ్జెట్ : స్త్రీ, శిశు సంక్షేమానికి పెద్దపీట
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో మహిళలు అభివృద్ధి పథంలో పయనించిప్పుడే రాష్ట్ర అభివృద్ధి మరింత ముందుకెళుతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నోసార్లు పేర్కొన్నారు. ఇందుకు అనుగుణంగా మహిళా,శిశు సంక్షేమానికి పెద్దపీట వేస్తామని చెప్పిన విధంగానే 2020-21 బడ్జెట్లో ఈ రంగానికి పెద్ద ఎత్తున కేటాయింపులు జరిపారు. మంగళవారం రాష్ట్ర శాసనసభలో రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ప్రభుత్వ విధాన లక్ష్యాల్లో అత్యంత ముఖ్యమైన వాటిలో స్త్రీ అభ్యున్నతి ఒకటని ఆయన పేర్కొన్నారు.(ఏపీ బడ్జెట్ హైలైట్స్) జగనన్న అమ్మ ఒడి బడి ఈడు పిల్లల నూటికి నూరు శాతం బడిలో చేరాలని, వాళ్లు బడి మానకుండా ఉండాలని, వారి ఆరోగ్య ప్రమాణాలు మెరుగుపడాలని కోరుకుంటూ ప్రభుత్వం జగనన్న అమ్మ ఒడి పథకం ప్రారంభించింది. జగనన్న అమ్మ ఒడి పథకం కింద ఈ ఏడాది బడ్జెట్లో రూ. 6వేల కోట్లు కేటాయిస్తున్నట్లు బుగ్గన తెలిపారు. దీనివల్ల రాష్ట్రంలోని 8,68,233 మంది షెడ్యూల్ కులాల తల్లులకు, 19,65, 589 మంది వెనుకబడిన తరగతులకు చెందిన నిరుపేద తల్లులు, 2,76, 155 గిరిజన మాతృమూర్తులకు , 4, 03, 562 మంది ఆర్థికంగా వెనుకబడిన వారికి , 2,95, 540 మైనారిటీ వర్గాలకు చెందిన వారికి ఈ పథకం కింద సహాయమందనుంది. వైఎస్సార్ చేయూత రాష్ట్రంలో 45 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్కులైన స్రీలకు ఆర్థిక సహాయాన్ని పరిపుష్టం చేయడం కోసం వైఎస్సార్ చేయూత పథకం ఏర్పాటు చేశారు. ఈ పథకం కింద 2020-21 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ . 3వేల కోట్లు కేటాయించారు. ఈ పథకం కింద 2020-21 ఆర్థిక సంవత్పరంతో మొదలైన నాలుగు సంవత్సరాల పాటు షెడ్యూల్ కులాలు, షెడ్యూలు తెగలు, వెనుకబడిన తరగతులు, మైనారిటీ సామాజిక వర్గాలకు చెందిన మహిళకు రూ. 18750 వార్షిక సహాయం అందించబడుతుంది. (ఏపీ బడ్జెట్ : గిరిజన ప్రాంతాలకు శుభవార్త) వైఎస్సార్ ఆసరా స్వయం స్వహాయక ఆర్థిక బృందాల కార్యకలాపాల్లో పెద్ద ఎత్తున గ్రామీణ, అసంఘటిత ఆర్థిక వ్యవస్థలో ఎంతో మంది స్త్రీలు ఆధారపడ్డారు. వీరిని దృష్టిలో పెట్టుకొని రూపొందించిన పథకమే వైఎస్సార్ ఆసరా. ఇందుకుగానూ 2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ. 6,300 కోట్లు కేటాయించారు. 2019 ఏప్రిల్ 11 నాటికి డ్వాక్రా మహిళలకు ఉన్న రుణం రూ. 27,168.83 కోట్ల బకాయిలను చెల్లించేందుకు నాలుగు దశల్లో ఆర్థిక సహాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2020–21 ఏడాది నుంచి నాలుగేళ్లపాటు అమలు చేయనుంది.(కరోనా వారియర్స్కు ధన్యవాదాలు) వైఎస్సార్ సంపూర్ణ పోషణ పేదరికం, నిరక్షరాస్యత, వైద్య ఆరోగ్య పద్ధతులపై కనీస పరిజ్ఞానం లేకపోవడం, పోషక ఆహారం గురించి జాగ్రత్తలు తీసుకోకపోవడం, పరిసరాల అపరిశుభ్రత వంటివి దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకాన్ని ప్రారంభించింది. 2020-21 ఏడాదికి గానూ వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకానికి రూ . 1500 కోట్లు కేటాయించారు. దీని ద్వారా 7 సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థల పరిధిలో ఉన్న 0.66 లక్షల గర్భిణీ బాలింత స్త్రీలు, 6 నుంచి 72 నెలల లోపు వయసు కలిగిన 3.18 లక్షల మంది చిన్నారులకు లబ్ధి చేకూరనుంది. దీంతో పాటు స్త్రీలు, శిశువులు, విభిన్న ప్రతిభావంతులు, వయో వృద్ధుల సంక్షేమశాఖ నిమిత్తం 2020-21 సంవత్సరానికి గానూ రూ. 3456 కోట్లు కేటాయించారు. -
కరోనా వారియర్స్కు ధన్యవాదాలు
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి ప్రభుత్వం తరఫును ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. బడ్జెట్ ప్రసంగ సందర్భంగా కోవిడ్ వారియర్స్ ప్రస్తావన తెచ్చిన మంత్రి.. వారి సేవలను కొనియాడారు. ప్రపంచమంతా కోవిడ్-19 మహమ్మారితో కనీవిని ఎరుగని సంక్షోభాన్ని ఎందుర్కొంటోందని, దాని కారణంగా జీవన వ్యవహారమంతా ఒక్కసారిగా ఆగిపోయిందని అన్నారు. (పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు) ‘కరోనా వైరస్తో సాగిస్తున్న సమరంలో ప్రభుత్వం ముందు వరుసలో నిలబడమే కాకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో పూర్తి అంకింతభావంతో శాయశక్తులు ఒడ్డి పోరాడుతోంది. అన్నింటికన్నా ముందు ఈ సమయంలో ముందు వరుసలో నిలబడి నిస్వార్థంగా విధి నిర్వహణ చేస్తున్న వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బందికి, గ్రామ, వార్డు వాలంటీర్లు, సబివాలయ సిబ్బంది, పోలీసు సిబ్బంది, పంచాయతీ రాజ్, మున్సిపల్ సిబ్బంది, ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు చెందిన సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా’ అని అన్నారు. -
ఏపీ బడ్జెట్ : గిరిజన జీవితాల్లో వెలుగులు
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో వెనుకబడిన గిరిజన ప్రాంతాలపై ఇప్పటికే ప్రత్యేక దృష్టి సారించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాజా బడ్జెట్లో వరాల జల్లు కురిపించారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు. వందల సంవత్సరాలుగా అడవుల్లో కొండల్లో నివసిస్తున్న గిరిజనులు సంక్షేమం కాయితాల్లో కనిపిస్తోందిగానీ.. వారి జీవితాల్లో మాత్రం మార్పు రావడం లేదు. వారి కష్టాలను చూసిన వైఎస్ జగన్ సర్కార్.. గిరిజనం బతుకుల్లో వెలుగులు నింపాలని గట్టి సంకల్పంతో ఉంది. దీనిలో భాగంగా గిరిజన ఏజెన్సీ ప్రాంతాల్లో విద్యా, వైద్యం, ఆరోగ్యంపై బడ్జెట్లో ప్రత్యేక చర్యలు తీసుకుంది. 2020-21 బడ్జెట్లో గిరిజన అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. (విశాఖనే పరిపాలన రాజధాని) గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్య సేవలు, మౌలిక సదుపాయాలను మెరుగు పరచడం కోసం విశాఖపట్నం జిల్లా పాడేరులో వైఎస్సార్ వైద్య కళాశాలను మంజూరు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనితో పాటు సీతంపేట, పార్వతీపురం, రంపచోడవరం, చింతూరు, కేఆర్పురం, శ్రీశైలంలో అదనంగా ఆరు మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులను కూడా నిర్మించాలని సంకల్పించింది. ఈ మేరకు తగిననిధులను బడ్జెట్లో ప్రతిపాదించింది. ఇక ఉన్నత విద్యను గిరిజన విద్యార్థులకు మరింతగా అందుబాటులోకి తీసుకురావడానికి గిరిజన సంస్కృతికి, కళలు, ఆర్థిక వ్యవస్థలకు సంబంధించిన పరిశోధనలు చేయడానికి విజయనగరంలో గిరిజన విశ్వవిద్యాలయం నిర్మిస్తోంది. ఈ మేరకు బడ్జెట్ సమావేశాల్లో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వివరాలను వెల్లడించారు. -
ఏపీ బడ్జెట్ హైలైట్స్
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం రెండోదఫా వార్షిక ఆర్థిక బడ్జెట్ను (2020–21) ప్రవేశపెట్టింది. రూ.2,24,789.18 కోట్ల అంచనా వ్యయంతో సంక్షేమ బడ్జెట్ను ప్రభుత్వం రూపొందించింది. అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మండలిలో ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్చంద్రబోస్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అభివృద్ధి, సంక్షేమం సమ్మిళితం చేసేలా బడ్జెట్ను రూపొందించారు. అచ్చమైన తెలుగు కవితతో అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగాన్ని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రారంభించి విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలి కవితతో ముగించారు. గంటన్నరకు పైగా బుగ్గన బడ్జెట్ ప్రసంగం అద్యంతం ఎంతో ఆసక్తికరంగా సాగింది. ఏపీ బడ్జెట్(2020-21) ప్రధాన అంశాలు మీకోసం.. రూ.2,24,789.18 కోట్ల అంచనా వ్యయంతో బడ్జెట్ రెవెన్యూ వ్యయం అంచనా రూ.1,80,392.65 కోట్లు మూలధన వ్యయం అంచనా రూ.44,396.54 కోట్లు ఈ సారి బడ్జెట్లో ఈ రంగాలకు భారీగా అదనపు కేటాయింపులు బీసీ సంక్షేమానికి గతేడాది కంటే 270 శాతం అదనంగా కేటాయింపులు మైనార్టీ సంక్షేమానికి గతేడాది కంటే 115 శాతం అదనంగా కేటాయింపులు సాంఘిక సంక్షేమానికి గతేడాది కంటే 110 శాతం అదనంగా కేటాయింపులు మహిళా, శిశు సంక్షేమానికి గతేడాది కంటే 28 శాతం అదనంగా కేటాయింపులు వివిధ రంగాల వారీగా బడ్జెట్ కేటాయింపులు వ్యవసాయ రంగానికి రూ. 11,891 కోట్లు ఆరోగ్య రంగానికి రూ.11,419.44 కోట్లు పశుగణాభివృద్ధి, మత్స్యరంగానికి రూ.1279.78 కోట్లు గృహ నిర్మాణ రంగానికి రూ.3,691.79 కోట్లు హోంశాఖకు రూ.5,988.72 కోట్లు జలవనరుల శాఖకు రూ. 11,805.74 కోట్లు పెట్టుబడులు, మౌలిక వసతుల రంగానికి రూ.696.62 కోట్లు ఐటీ రంగానికి రూ. 197.37 కోట్లు కార్మిక సంక్షేమానికి రూ. 601.37 కోట్లు పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్కు రూ. 16710.34 కోట్లు న్యాయశాఖకు రూ. 913.76 కోట్లు మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖలకు రూ. 8150.24 కోట్లు స్కిల్ డెవలప్మెంట్కు రూ. 856.64 కోట్లు పౌరసరఫరాల శాఖకు రూ. 3,520.85 కోట్లు ఆర్థిక రంగానికి రూ. 50,703 కోట్లు విద్యుత్ రంగానికి రూ. 6,984.72 కోట్లు ప్రాథమిక ఉన్నత విద్యకు రూ. 22,604.01 కోట్లు సోషల్ వెల్ఫేర్ కోసం రూ.12,465.85 కోట్లు ట్రాన్స్పోర్టు, ఆర్అండ్బీ కోసం రూ.6,588.58 కోట్లు మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల కోసం రూ.3456.02 కోట్లు మైనార్టీ సంక్షేమానికి రూ.2,055.63 కోట్లు ప్రణాళిక రంగానికి రూ.515.87 కోట్లు పర్యావరణం, అటవీశాఖకు రూ.457.32 కోట్లు సాధారణ పరిపాలనకు రూ.878.01 కోట్లు ఎస్సీల సంక్షేమానికి రూ.15,735 కోట్లు గిరిజనుల సంక్షేమానికి రూ.5,177.54 కోట్లు కాపుల సంక్షేమానికి రూ.2,846.47 కోట్లు ఎస్సీ, ఎస్టీ గృహాల ఉచిత విద్యుత్కు రూ.425.93 కోట్లు 104, 108 వాహన సేవలకు రూ.470.29 కోట్లు గ్రామీణాభివృద్ధికి రూ.16,710 కోట్లు సాగునీటి పారుదల శాఖకు రూ.11,805 కోట్లు రవాణా రంగానికి రూ.6,588 కోట్లు డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కోసం రూ. 2100 కోట్లు నేషనల్ హెల్త్ మిషన్ కోసం రూ. 1808.03 కోట్లు సవరించిన అంచనాలు 2019-20 సవరించిన అంచనాల ప్రకారం రెవెన్యూ వ్యయం రూ. 1,37,518.07 కోట్లు మూలధన వ్యయం రూ. 12,845.49 కోట్లు రెవెన్యూ లోటు దాదాపుగా రూ. 26,646.92 కోట్లు ఆర్థిక లోటు దాదాపుగా 40,493.46 కోట్లు ఇవి రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో 2.47 శాతం, 3.75 శాతం వివిధ పథకాలు, మౌలిక వసుతుల కోసం బడ్జెట్ కేటాయింపులు వైఎస్సార్ లా నేస్తం కోసం రూ. 12. 75 కోట్లు రైతులకు విత్తనాల పంపిణీ కోసం రూ.200 కోట్లు జగనన్న విద్యాకానుక కోసం రూ.500 కోట్లు ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం కోసం రూ. 55.15 కోట్లు కొత్త రాజధానిలో మౌలిక వసతుల కోసం రూ. 500 కోట్లు ప్రతిభ స్కాలర్షిప్స్ కోసం రూ. 10.54 కోట్లు నేషనల్ హార్టీకల్చర్ మిషన్ రూ. 150.99 కోట్లు పట్టణ స్వయం సహాయక బృందాల కోసం రూ. 389.89 కోట్లు రైతులకిచ్చే నష్ట పరిహారం కోసం రూ. 20 కోట్లు గ్రామ సచివాలయాల కోసం రూ. 1633 కోట్లు అమరావతి-అనంతపురం నేషనల్ హైవే కోసం రూ. 100 కోట్లు వైఎస్సార్ గృహ వసతి కోసం రూ. 3 వేల కోట్లు డ్రగ్స్, మందుల కేంద్రీకృత కొనుగోళ్ల కోసం రూ. 400 కోట్లు కుటుంబ సంక్షేమ కేంద్రాల కోసం రూ. 242.15 కోట్లు వ్యవసాయ మార్కెట్ల మౌలిక సదుపాయాల నిధి రూ. 100 కోట్లు అగ్రిగోల్డ్ బాధితులకు రూ.200 కోట్లు వైఎస్సార్ సంపూర్ణ పౌషణ పథకానికి రూ.1500 కోట్లు డ్వాక్రా మహిళల సున్నా వడ్డీ పథకానికి రూ.1365.08 కోట్లు వైఎస్సార్ పెన్షన్ కానుకకు రూ.16వేల కోట్లు జగనన్న అమ్మఒడి పథకానికి రూ.6వేల కోట్లు వైఎస్సార్ చేయూత పథకానికి రూ.3వేల కోట్లు వైఎస్సార్ ఆసరా పథకానికి రూ.6,300 కోట్లు వైఎస్సార్ వాహనమిత్ర పథకానికి రూ.275.52 కోట్లు వైఎస్సార్ నేతన్ననేస్తం పథకానికి రూ.200 కోట్లు జగనన్న తోడు పథకానికి రూ.930 కోట్లు జగనన్న చేదోడు పథకానికి రూ.247 కోట్లు గ్రామ,వార్డు సచివాలయ వాలంటీర్ల వ్యవస్థకు రూ.46.46 కోట్లు రియల్ టైం గవర్నెన్స్ కోసం రూ.54.51 కోట్లు వ్యవసాయ ల్యాబ్లకు రూ.65 కోట్లు వైఎస్ఆర్ రైతుభరోసా - పీఎం కిసాన్కు రూ.3,615.60 కోట్లు డాక్టర్ వైఎస్ఆర్ పంటల ఉచిత బీమా పథకానికి రూ.500 కోట్లు జగనన్న విద్యా దీవెన, వసతి దీవెనలో ఉన్నత విద్యకు రూ.2,277 కోట్లు డాక్టర్ వైఎస్సార్ పంటల ఉచిత బీమా పథకానికి రూ.500 కోట్లు వడ్డీలేని రుణాల కోసం రూ.1100 కోట్లు 2018-19లో స్థూల ఉత్పత్తి 8 శాతమే పెరిగింది బడ్జెట్ ప్రసంగంలో బుగ్గన పలుకులు.. దేశప్రజలు గొప్పవాళ్లయితేనే దేశం గొప్పదవుతుంది. అలాగే పాలకులు, కార్యాశీలురు మరియు ప్రజా సేవాపారయణులు అయితేనే మంచి పనులు జరుగుతాయి. ప్రజలు మెచ్చే మంచి పనులు చేసేందుకు పాలకుడి ఉత్సాహం, పట్టుదల, నిబద్దత, ప్రయత్నం ఉంటే చాలు.. తండ్రి వెంట బిడ్డల్లా జనం పాలకుడితో కదిలి వస్తారు. అడగకుండానే స్నేహహస్తం అందిస్తారు అని స్వామి వివేకానంద సూక్తులను ఆర్థిక మంత్రి గుర్తుచేశారు. కష్టాల్లో ఉన్న బడుగు బలహీన వర్గాల ప్రజలకు సాయం చేయనప్పుడు వారి ముఖాల్లో చిరునవ్వు వెలిగించనప్పుడు వారి జీవితాలకు కొత్త వెలుగు ప్రసాదించనప్పుడు అభివృద్దికి అర్థమే లేదు మాట ఇచ్చేముందు ఆలోచిస్తాను ఇచ్చాక ఆలోచించేది ఏముంది ముందుకు వెళ్లాల్సిందే అన్ని దివంగత మహానేత వైఎస్సార్ చెప్పిన సూత్రాన్ని మన ప్రభుత్వం పాటించుకుంటూ వెళుతుంది. ఎవరైనా తాము చేపట్టాలనుకుంటున్న మార్పుని సాధించడానికి అంకితమైతే ప్రతికూల పరిస్థితుల్ని అధిగమించి విజయం సాధిస్తారు. మానవభివృద్ది సూచికల ప్రకారం రాష్ట్రాన్ని అత్యున్నత స్థానంలో నిలపడం కన్నా మించిన కర్తవ్యం మన ప్రభుత్వానికి మరొకటి లేదు. కరోనా మహమ్మారిపై పోరాటంలో ముందున్నాం కరోనా విపత్తు పరిస్థితుల్లోనూ ఆర్థిక వ్యవస్థ కుంటుపడకుండా చూశాం కరోనా సంక్షోభం సమయంలోనూ సంక్షేమంపై వెనకడుగు వేయలేదు రైతులకు సాయం చేయడం ద్వారా ప్రాథమిక రంగానికి ఊతం గత ప్రభుత్వం చెప్పిన రెండంకెల వృద్ది బూటకం పేద ప్రజల కష్టాలను తీర్చడానికి నవరత్నాలను అమలు చేస్తున్నాం. పేద ప్రజల కష్టాలను తీర్చడానికి నవరత్నాలను అమలు చేస్తున్నాం. ‘అన్నిరకాల సంపదల్లో పేదలకు భాగం కల్పించినవాడే నిజమైన నాయకుడు’ అంటూ బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించిన ఆర్థిక మంత్రి అచ్చమైన తెలుగు కవితతో అసెంబ్లీలో ప్రసంగాన్ని ప్రారంభించిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతున్న మంత్రి బుగ్గన గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం పెట్టిన చీఫ్ విప్ శ్రీకాంత్రెడ్డి -
టీడీపీ వ్యతిరేకించినట్టా? స్వాగతించినట్టా
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మధ్య సమన్వయ లోపం బయటపడింది. బడ్జెట్పై గవర్నర్ ప్రసంగాన్ని వ్యతిరేకిస్తూ నల్లచొక్కాలు ధరించిన టీడీపీ ఎమ్మెల్యేలు శాసనసభలో వాకౌట్ చేశారు. మరోవైపు మండలిలో మాత్రం గవర్నర్ ప్రసంగానికి వ్యతిరేకంగా మండలిలో నిరసన తెలిపారు. ఇదే అంశంపై అసెంబ్లీ లాబీల్లో చర్చ జరిగింది. అసెంబ్లీలో వాకౌట్ చేసిన టీడీపీ సభ్యులు మండలిలో ఎందుకు చేయలేదంటూ బీజేపీ, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ఆరా తీస్తున్నారు. (విశాఖనే పరిపాలన రాజధాని) అసెంబ్లీ సమావేశాల్లో నిరసన తెలిపి బయటకు వచ్చేయాలని, కౌన్సిల్లో మాత్రం రెండురోజులు చర్చలో పాల్గొనాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిపై పలువురు సభ్యలు భిన్నవాదనలు వినిపించినట్లు సమాచారం. దీనిపై బీజేపీ బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ స్పందిస్తూ.. వాకౌట్ విషయంలో టీడీపీలో సమన్వయ లోపం కన్పించిందన్నారు. వాకౌట్ విషయమై టీడీపీ ముందుగా చర్చించుకోలేదేమోనని అభిప్రాయపడ్డారు. గవర్నర్ ప్రసంగాన్ని టీడీపీ వ్యతిరేకించినట్టా..? స్వాగతించినట్టా అని సభ్యులు చర్చించుకుంటున్నారు. (అసెంబ్లీలో నిరసన.. కౌన్సిల్లో ఘర్షణ!) మరోవైపు అసెంబ్లీలో ఆమోదించిన బిల్లును శాసనమండలిలో అడ్డుకోవాలని ప్రతిపక్షం భావిస్తోంది. దీనిలో భాగంగానే మండలిలో మెజార్టీ ఉన్నందున సభ్యులంతా పాల్గొనాలని చంద్రబాబు వారికి దిశానిర్ధేశం చేశారు. మూడు రాజధానుల సహా ముఖ్యమైన బిల్లులు మళ్లీ కౌన్సిల్లోకి వచ్చే అవకాశం ఉంటుందని, వస్తే వాటిని అడ్డుకోవాలని సభ్యులకు సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ బిల్లుపై ప్రభుత్వం ముందుకు వెళ్లకుండా చూడాలని హితబోధ చేశారు. -
విశాఖనే పరిపాలన రాజధాని
సాక్షి, అమరావతి : పరిపాలన వికేంద్రీకరణ అత్యంత కీలకమైన అంశంగా ప్రభుత్వం భావిస్తోందని గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన మూడు రాజధానులు ఏర్పాటు శాసన ప్రక్రియలో ఉందని స్పష్టం చేశారు. శాసన రాజధానిగా అమరావతి, కార్యానిర్వాహక రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలు ఉంటుందని మరోసారి గుర్తుచేశారు. శాసనసభ, మండలి బడ్జెట్ సమావేశాలను పురస్కరించుకుని ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో గవర్నర్ ఈ అంశాన్నిపునరుద్ఘాటించారు. (ఏపీ బడ్జెట్: 3.98 కోట్ల మందికి లబ్ధి) గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పరిపాలన వికేంద్రీకరణకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రణాళిలు రచించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే ఇప్పటికే అభివృద్ధిలో దూసుకుపోతున్న విశాఖను పరిపాలన రాజధానిగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే వెనుకబడిన రాయలసీమకు పూర్వవైభవం తీసుకువచ్చేలా, కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేసి న్యాయ రాజధానిగా గుర్తించాలని సంకల్పించింది. ప్రభుత్వ నిర్ణయానికి ప్రతిపక్ష టీడీపీ నిత్యం అభ్యంతరం వ్యక్తం చూస్తూ కోర్టులో కేసులు వేస్తున్నా, ప్రజా శ్రేయస్సు దృష్ట్యా మూడు రాజధానులకే ముఖ్యమంత్రి జగన్ కట్టుబడి ఉన్నారు. ఈ మేరకు సంబంధిత బిల్లుకు రాష్ట్ర శాసనసభ సైతం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. -
పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు
సాక్షి, అమరావతి : గడిచిన ఏడాది కాలంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వలోని ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిందని గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ పేర్కొన్నారు. గడిచిన ఏడాది కాలంలో ప్రభుత్వం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలతో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని తెలిపారు. కుల, మత, పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని స్పష్టం చేశారు. విద్యా, వైద్యం ఆరోగ్యం రంగాల్లో సమూల మార్పులకు శ్రీకారం చుడుతూ ప్రభుత్వం ముందుకు వెళ్తోందని కితాబిచ్చారు. ప్రభుత్వం స్వచ్ఛమైన, అవినీతిరహితమైన పాలనకు కట్టుబడి ఉందని, రివర్స్ టెండరింగ్ విధానం ద్వారా సుమారు రూ.2,200 కోట్లు ఆదా చేశామని గుర్తుచేశారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 8.16 శాతం వృద్ధి రేటు సాధించినందుకు సంతోషంగా ఉందన్నారు. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో 8శాతం వృద్ధి రేటు సాధించామని వెల్లడించారు. పారిశ్రామిక రంగంలో 5శాతం వృద్ధిరేటు నమోదు అయ్యిందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ (2020-21) సమావేశాలు సందర్భంగా గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. తొలిసారి ఆన్లైన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగం చేశారు. ఆరోగ్యశ్రీ కింద 6.25 లక్షల మందికి లబ్ధి రాజ్భవన్ నుంచి గవర్నర్ బిశ్వభూషన్ ప్రసంగిస్తూ.. ‘ఎన్నికల హామీలో ఇవ్వని 40 పథకాలను సైతం విజయవంతగా అమలు చేస్తున్నారు. ఈ ఏడాదిలో వివిధ పథకాల కింద 3.98 కోట్ల మంది ప్రజలు లబ్ధి పొందారు. దీని కోసం రూ.42వేల కోట్లు ఖర్చు చేశాం. గత ఏడాదితో పోలిస్తే తలసరి ఆదాయం 12శాతం వృద్ధి సాధించాం. 129 హామీల్లో 77 హామీలు నెరవేర్చారు. 39 హామీలు పరిశీలనలో ఉన్నాయి. మేనిఫెస్టోలో లేని 40 హామీలను కూడా నెరవేర్చడం జరిగింది. పిల్లల చదువు, తల్లుల సంక్షేమం కోసం అమ్మఒడి పథకాన్ని ప్రారంభించాం. నాడు-నేడు మనబడి కార్యక్రమం కింద.. మూడేళ్లలో 48వేల పాఠశాలలను ఆధునికీకరిస్తాం. ఆరోగ్యశ్రీ పథకం కింద 6.25 లక్షల మందికి లబ్ధి చేకూరింది. దీని కోసం రూ.1534 కోట్లు ఖర్చు చేశాం. విద్యార్థులకు పౌష్టికాహారం కోసం జగనన్న గోరుముద్దు పథకం అమలు చేస్తున్నాం. దీనికోసం 1105 కోట్లు ఖర్చు చేశాం. 12వేల వైఎస్ఆర్ క్లినిక్లు జగనన్న వసతి దీవెన కింద 18.51 లక్షల మందికి లబ్ధి చేకూరింది. దీనికోసం 3857 కోట్లు ఖర్చు చేశాం. వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా కింద 1.06 లక్షల మంది పొందారు. దీని కోసం రూ.72.82 కోట్లు ఖర్చు చేశాం. వైఎస్ఆర్ కంటివెలుగు కింద 67.69 లక్షల మందికి లబ్ధి.. దీని కోసం 53.85 కోట్లు ఖర్చు పెట్టాం. గ్రామ సచివాలయాల్లో 12వేల వైఎస్ఆర్ క్లినిక్లు ఏర్పాటు చేసేందుకు.. ప్రణాళికలు సిద్ధం చేశాం. ప్రజా ఆరోగ్యంలో భాగంగా 1060 కొత్త 108, 104 వాహనాలు సిద్ధంగా ఉన్నాయి. నాడు-నేడు కింద ఆస్పత్రులను ఆధునీకరించేందుకు రూ.15337 కోట్లు కేటాయించాం. వైఎస్ఆర్ రైతు భరోసా పథకం మొదటి దశ పూర్తయింది, రూ.12500 ఇస్తామని చెప్పినప్పటికీ.. దీన్ని రూ.13500లకు పెంచాం. మొదటి దశలో 49.44 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుస్తూ.. రూ.10,209.32 కోట్లు ఖర్చు చేశాం. 30 లక్షల మందికి ఇళ్లపట్టాలు కౌలు రైతులకు కూడా ప్రయోజనం కల్పిస్తూ చర్యలు చేపట్టాం. ప్రతి గ్రామ సచివాలయంలోనూ రైతుభరోసా కేంద్రాలను ఏర్పాటు చేశాం. వ్యవసాయ ఉత్పత్తిని పెంచడానికి నియోజకవర్గస్థాయిలో 147 వైఎస్ఆర్ వ్యవసాయ ప్రయోగశాలలను ఏర్పాటు చేశాం. జిల్లాస్థాయిలో 13 ల్యాబ్లను కూడా ఏర్పాటు చేశాం. పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, కరువు పరిస్థితులను అధిగమించేందుకు రూ.2వేల కోట్లతో విపత్తు సహాయ నిధికి రూపకల్పన చేశాం. రూ.7వేల కోట్లతో 30 లక్షల మందికి ఇళ్లపట్టాలు అందిస్తున్నాం. మహిళల పేరిట ఈ స్థలాలను రిజిస్ట్రేషన్ చేయిస్తాం. నాలుగేళ్లలో 25 లక్షల గృహాలను సమకూరుస్తాం. 15 లక్షల ఇళ్లకు సంబంధించి ఆగస్టులో పనులు ప్రారంభమవుతాయి. 36,810 మందికి ఉద్యోగ అవకాశాలు జలయజ్ఞం కార్యక్రమం ద్వారా ఉద్దేశించిన 54 సాగునీటి ప్రాజెక్ట్ల్లో14 ప్రాజెక్ట్ పనులు పూర్తి చేశాం. మిగిలిన ప్రాజెక్ట్ పనులు పురోగతిలో ఉన్నాయి. ఈ ఏడాది పూలసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్, సంగం బ్యారేజీ నెల్లూరు బ్యారేజీ, వంశధార రెండోదశ, వంశధార-నాగావళి అనుసంధానం అవుకు రెండో సొరంగం ప్రాజెక్ట్ పనులు పూర్తి చేస్తాం. విద్యుత్ బకాయిలకు సంబంధించి డిస్కంలకు రూ. 17904 కోట్లు కేటాయించాం. ఏపీఐఐసీ ద్వారా 1466పైగా కంపెనీలకు భూములు కేటాయించాం. దీని ద్వారా 36,810 మందికి ఉద్యోగ అవకాశాలు, రూ.11548 కోట్ల పెట్టుబడులు వస్తాయి. చిన్న, మధ్యతరహా పరిశ్రమల కోసం వైఎస్ఆర్ నవోదయ పథకాన్ని ప్రారంభించాం. భోగాపురం, ఓర్వకల్లు ఎయిర్పోర్టు పనులను వేగవంతం చేశాం. జీఎంఆర్ సంస్థతో రూ.2,300 కోట్ల మేర భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నాం. రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడులో మూడు కొత్త ఓడరేవుల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించాం. రూ. 3200 కోట్ల వ్యయంతో మూడేళ్లలో 8 చేపలు పట్టే ఓడరేవులను నిర్మిస్తాం’ 5.5 లక్షల పరీక్షలు పూర్తి కోవిడ్ వ్యాప్తిని నిరోధించడానికి ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంది. కరోనా పరీక్షల నిర్వహణలో ఇతర రాష్ట్రాలకంటే ఏపీ ముందుంది. రోజుకు దాదాపు 15వేల పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఇప్పటికే 5.5 లక్షల పరీక్షలు పూర్తి చేశాం. రాష్ట్రంలో మరణాల రేటు.. జాతీయ సగటు కంటే చాలా తక్కువగా ఉన్నాయి. రికవరీ రేటు.. జాతీయ సగటు కంటే చాలా ఎక్కువగా ఉంది. ప్రభుత్వం టెస్టింగ్ ల్యాబ్లను 1 నుంచి 13కు పెంచింది. రాష్ట్రంలో 5 ప్రత్యేక కోవిడ్ ఆస్పత్రులున్నాయి. కరోనా నివారణకు జిల్లాల్లో 65 ఆస్పత్రులు. 5,400 ఐసీయూ బెడ్స్, 38వేల ఐసోలేషన్ బెడ్స్ ఆక్సిజన్ సరఫరాతో 15వేల బెడ్స్ ఉన్నాయి’ అని పేర్కొన్నారు. -
ఏపీ బడ్జెట్ సమావేశాలు.. అప్డేట్స్
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం రెండోదఫా బడ్జెట్ను (2020–21) ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమైంది. ఉ.10 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమయ్యాయి. అనంతరం సభ ఎజెండాను రూపొందించేందుకు బీఏసీ సమావేశం కానుంది. దీని తర్వాత రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. గతేడాది రూ. 2,27,975 కోట్లతో బడ్జెట్ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఈ ఏడాది అంతకంటే ఎక్కువ బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈసారి బడ్జెట్లో కూడా సంక్షేమ పథకాలు, నవరత్నాలకే ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అభివృద్ధి, సంక్షేమం సమ్మిళితం చేసేలా బడ్జెట్ను రూపొందించినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. ఏపీ మంత్రివర్గం సమావేశంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగానికి తొలుత ఆమోదం తెలపగగా, 2020-2021 రాష్ట్ర బడ్జెట్కు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. 2019-20 సప్లమెంటరీ బడ్జెట్కు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ యాక్ట్–2020 కోసం ఉద్దేశించిన బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మండలిలో మంత్రి సుభాష్చంద్రబోస్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. (నవరత్నాల వెలుగులు) ఏపీ బడ్జెట్ (2020-21) లైవ్ అప్డేట్స్ మీకోసం.. బీఏసీ సమావేశం అనంతరం శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు. బీఏసీ సమావేశం అనంతరం శాసనమండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. మండలిలో డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్చంద్రబోస్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన బీఏసీ సమావేశం ప్రారంభమైంది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, కన్నబాబు, అనిల్కుమార్ యాదవ్, చీఫ్ విప్ శ్రీకాంత్రెడ్డి, టీడీపీ నుంచి నిమ్మల రామానాయుడు, తదితరులు పాల్గొన్నారు. కాసేపట్లో శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన బీఏసీ సమావేశం ప్రారంభంకానుంది. రెండు రోజుల పాటు శాసనమండలి సమావేశాలు నిర్వహించాలని మండలి బీఏసీలో నిర్ణయం. మండలి బీఏసీ సమావేశం ముగిసింది. శాసనమండలి చైర్మన్ షరీఫ్ నేతృత్వంలో బీఏసీ సమావేశం ప్రారంభమైంది. డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్చంద్రబోస్, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు, తదితరులు పాల్గొన్నారు. ‘టీడీపీ సభ్యుల మధ్య సమన్వయలోపం కనిపించింది’ - బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ ‘టీడీపీ ఈరోజు సభలో ద్వంద్వ విధానాన్ని అవలంభించింది. టీడీపీలో అవగాహన లోపం స్పష్టంగా కనిపించింది. అసెంబ్లీలో వాకౌట్ చేసి.. కౌన్సిల్లో నిరసన చేపట్టింది. గవర్నర్ ప్రసంగం కాబట్టి ఈరోజు జరిగింది ఉమ్మడి సమావేశం. టీడీపీ చేస్తే పూర్తిగా నిరసన కార్యక్రమం చేపట్టాలి. లేదంటే గవర్నర్ ప్రసంగానికి హాజరవ్వాలి’ - విప్ సామినేని ఉదయభాను టీడీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల మధ్య సమన్వయ లోపం శాసనసభలో వాకౌట్ చేసి మండలిలో నిరసన తెలిసిన టీడీపీ గవర్నర్ ప్రసంగాన్ని టీడీపీ వ్యతిరేకించినట్టా స్వాగతించినట్టా అని లాబీల్లో చర్చ కాసేపట్లో బీఏసీ సమావేశం ప్రారంభం కానుంది. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదం తెలిపే తీర్మానం, సమావేశాల అజెండాపై చర్చించనున్నారు ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ముగిసింది ఏపీ 2020-2021 బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగం. ప్రసంగంలోని ప్రధానమైన అంశాలు.. ఏడాదిలో సంక్షేమ పథకాల కోసం రూ.42వేల కోట్లు ఖర్చు చేశాం వివిధ పథకాల కింద 3.98 కోట్ల మందికి లబ్ధి చేకూర్చాం గత ఏడాదితో పోలిస్తే తలసరి ఆదాయం 12శాతం వృద్ధిగా నమోదయింది 129 హామీల్లో 77 హామీలు నెరవేర్చాము. మరో 39 హామీలు పరిశీలనలో ఉన్నాయి 1060 కొత్త 108, 104 వాహనాలు సిద్ధంగా ఉన్నాయి నాడు-నేడు కింద ఆస్పత్రులను ఆధునీకరించేందుకు రూ.15337 కోట్లు కేటాయించాం వైఎస్సార్ రైతుభరోసా పథకం మొదటి దశ పూర్తయింది. రూ.12,500 ఇస్తామని చెప్పినప్పటికీ.. దీన్ని రూ.13,500లకు పెంచాం నాడు-నేడు మనబడి కార్యక్రమం కింద మూడేళ్లలో 48వేల పాఠశాలలను ఆధునికీకరిస్తాం ఆరోగ్యశ్రీ పథకం కింద 6.25 లక్షల మందికి లబ్ధి చేకూరింది. దీని కోసం రూ.1534 కోట్లు ఖర్చు చేశాం విద్యార్థులకు పౌష్టికాహారం కోసం జగనన్న గోరుముద్ద పథకం. దీనికోసం 1105 కోట్లు ఖర్చు చేశాం జగనన్న వసతి దీవెన కింద 18.51 లక్షల మందికి లబ్ధి. దీనికోసం 3857 కోట్లు ఖర్చు వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కింద 1.06 లక్షల మందికి లబ్ధి. దీని కోసం రూ.72.82 కోట్లు ఖర్చుచేశాం. వైఎస్సార్ కంటివెలుగు కింద 67.69 లక్షల మందికి లబ్ధి. దీని కోసం 53.85 కోట్లు ఖర్చు చేశాం. గ్రామసచివాలయాల్లో 12వేల వైఎస్సార్ క్లినిక్లు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి నాడు-నేడు కింద ఆస్పత్రులను ఆధునీకరించేందుకు రూ.15,337 కోట్లు కేటాయించాం మొదటి దశలో 49.44 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుస్తూ రూ.10,209.32 కోట్లు ఖర్చు చేశాం కౌలురైతులకు కూడా ప్రయోజనం కల్పిస్తూ చర్యలు చేపట్టాం ప్రతి గ్రామసచివాలయంలోనూ రైతుభరోసా కేంద్రాలను ఏర్పాటు చేశాం వ్యవసాయ ఉత్పత్తిని పెంచడానికి నియోజకవర్గస్థాయిలో 147 వైఎస్సార్ వ్యవసాయ ప్రయోగశాలలను ఏర్పాటు చేశాం జిల్లాస్థాయిలో 13 ల్యాబ్లను కూడా ఏర్పాటు చేశాం పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, కరువు పరిస్థితులను అధిగమించేందుకు రూ.2వేల కోట్లతో విపత్తు సహాయ నిధిని మా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రూ.7వేల కోట్లతో 30 లక్షల మందికి ఇళ్లపట్టాలు అందిస్తున్నాం, మహిళల పేరిట ఈ స్థలాలను రిజిస్ట్రేషన్ చేయిస్తాం నాలుగేళ్లలో 25 లక్షల గృహాలను సమకూరుస్తాం 15 లక్షల ఇళ్లకు సంబంధించి ఆగస్టులో పనులు ప్రారంభమవుతాయి కుల, మత, పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం 11,158 గ్రామ సచివాలయాలు, 3876 వార్డు సచివాలయాలున్నాయి.. ఒక్కో గ్రామ, వార్డు సచివాలయం 2వేల మంది అవసరాలను తీరుస్తున్నాయి.. ఒక్కో సచివాలయంలో 10 మంది శాశ్వత సిబ్బంది, 40 మంది వాలంటీర్లు ఉన్నారు సున్నావడ్డీ పథకంతో 91 లక్షల మందికి ప్రయోజన చేకూరనుంది 45-60 మధ్య వయసున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు వైఎస్సార్ చేయూత పథకం ద్వారా నాలుగేళ్లలో రూ.75వేల ఆర్ధికసాయం చేస్తున్నాం. రాజకీయ, ఆర్థిక రంగాల్లో మహిళల సాధికారిత కోసం నామినేటెడ్ పదవులు, పనుల్లో 50శాతం రిజిర్వేషన్లు కల్పించాం 51,400 మంది ఉద్యోగులను ప్రజా రవాణా శాఖలోకి తీసుకుంటూ ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశాం ప్రాజెక్టుల గురించి.. జలయజ్ఞం కార్యక్రమం ద్వారా ఉద్దేశించిన 54 సాగునీటి ప్రాజెక్ట్ల్లో 14 ప్రాజెక్ట్ పనులు పూర్తి చేశాం మిగిలిన ప్రాజెక్ట్ పనులు పురోగతిలో ఉన్నాయి ఈ ఏడాది పూలసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్, సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీ, వంశధార రెండోదశ, వంశధార-నాగావళి అనుసంధానం, అవుకు రెండో సొరంగం ప్రాజెక్ట్ పనులు పూర్తి చేస్తాం ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల అభివృద్ది గురించి విద్యుత్ బకాయిలకు సంబంధించి డిస్కంలకు రూ. 17904 కోట్లు కేటాయించాం ఏపీఐఐసీ ద్వారా 1466పైగా కంపెనీలకు భూములు కేటాయించాం దీని ద్వారా 36810 మందికి ఉద్యోగ అవకాశాలు, రూ.11548 కోట్ల పెట్టుబడులు వస్తాయి చిన్న, మధ్యతరహా పరిశ్రమల కోసం వైఎస్ఆర్ నవోదయ పథకాన్ని ప్రారంభించాం.. భోగాపురం, ఓర్వకల్లు ఎయిర్పోర్టు పనులను వేగవంతం చేశాం జీఎంఆర్ సంస్థతో రూ.2,300 కోట్ల మేర భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నాం. రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడులో మూడు కొత్త ఓడరేవుల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించాం 3200 కోట్ల వ్యయంతో మూడేళ్లలో 8 చేపలు పట్టే ఓడరేవులను నిర్మిస్తాం రివర్స్ టెండరింగ్ గురించి.. ప్రభుత్వం స్వచ్ఛమైన మరియు అవినీతిరహితమైన పాలనకు కట్టుబడి ఉంది రివర్స్ టెండరింగ్ విధానం ద్వారా సుమారు రూ.2,200 కోట్లు ఆదా చేశాం 100 కోట్లకుపైబడిన అన్ని టెండర్లను రిటైర్డ్ హైకోర్టు జడ్జి ద్వారా పరిశీలించబడి కమిషన్ ద్వారా ఖరారు చేయబడుతుంది. భూమి హక్కు గుర్తింపు చట్టం ద్వారా రిజిస్ట్రేషన్లలో అవకతవకలను భూ వివాదాలకు తావులేకుండా చేస్తున్నాం మూడు రాజధానులపై గవర్నర్ ఏమన్నారంటే.. పరిపాలన వికేంద్రీకరణ అనేది కీలక అంశం మూడు రాజధానులు ఏర్పాటు శాసన ప్రక్రియలో ఉంది శాసన రాజధానిగా అమరావతి, కార్యానిర్వాహక రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలు ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ది, ఆంగ్లమాధ్యమం గురించి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టాం. 97శాతం మంది తల్లిదండ్రులు ఆంగ్ల మాధ్యమాన్నే కోరుకున్నారు. ఇందులో కొన్ని ఆటంకాలు ఎదురైనప్పడికీ త్వరలోనే తొలగిపోతాయి. ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలను నియంత్రించడానికి చట్టం తీసుకొచ్చాం. జ్యుడీషియల్ ప్రివ్యూ కమిషన్ ఏర్పాటుచేశాం. చారిత్రాత్మకమైన దిశ బిల్లును తీసుకొచ్చాం మహిళలపై జరిగే నేరాలకు సత్వర విచారణ జరిపి 21 రోజుల్లో విచారణ జరిపేలా చట్టం 18 దిశా పోలీస్స్టేషన్లను ఏర్పాటు చేశాం దిశ చట్టం అమలుక ప్రత్యేక న్యాయస్థానాలను కూడా ఏర్పాటు చేస్తాం మద్యపాన నిషేధం దిశగా అడుగులు దశల వారీ మద్యం నిషేధం అమల్లో భాగంగా 43వేల బెల్ట్షాపుల తొలగించాం. 4,300 పర్మిట్ రూమ్లను తొలగించాం కరోనా, లాక్డౌన్, వలసకూలీల గురించి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి.. కరోనా వ్యాప్తిని నిరోధించడానికి ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంది కరోనా పరీక్షల నిర్వహణలో ఇతర రాష్ట్రాలకంటే ఏపీ ముందుంది రోజుకు దాదాపు 15వేల పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఇప్పటికే 5.5 లక్షల పరీక్షలు పూర్తి చేశాం రాష్ట్రంలో మరణాల రేటు.. జాతీయ సగటు కంటే చాలా తక్కువ రికవరీ రేటు.. జాతీయ సగటు కంటే చాలా ఎక్కువగా ఉంది ప్రభుత్వం టెస్టింగ్ ల్యాబ్లను 1 నుంచి 13కు పెంచింది రాష్ట్రంలో 5 ప్రత్యేక కోవిడ్ ఆస్పత్రులున్నాయి కరోనా నివారణకు జిల్లాల్లో 65 ఆస్పత్రులు, 5,400 ఐసీయూ బెడ్స్, 38వేల ఐసోలేషన్ బెడ్స్, ఆక్సిజన్ సరఫరాతో 15వేల బెడ్స్ ఉన్నాయి. లాక్డౌన్ సమయంలో రూ.వెయ్యి ఆర్ధిక సహాయంతో పాటు ఒక్కొక్కరికి 5కిలోల బియ్యం, కిలో పప్పు ఇచ్చాం. వలసకూలీల సమస్యలను పరిష్కరించేందుకు 400 సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసి 1.2లక్షలకు పైగా వలస కూలీలకు ఆహారం వసతి అందించాం ఇతర రాష్ట్రాల్ల్లో చిక్కుకున్న 3.2లక్షల వలస కార్మికులను ఉచితంగా వారి గృహాలకు చేర్చాం, ఆర్టీసీ బస్సులు , శ్రామిక్ రైళ్ల ద్వారా వారిని సొంత గ్రామాలకు తరలించాం కరోనా సమయంలో మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా రూ.2,200 కోట్లతో వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేశాం, ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులకు చర్యలు తీసుకున్నాం, వాలంటీర్ల ద్వారా నాలుగు విడతలుగా ఇంటించి సర్వే చేయించాం. -
అసెంబ్లీలో నిరసన.. కౌన్సిల్లో ఘర్షణ!
సాక్షి, అమరావతి: అసెంబ్లీ సమావేశాల్లో నిరసన తెలిపి బయటకు వచ్చేయాలని, కౌన్సిల్లో మాత్రం రెండురోజులు చర్చలో పాల్గొనాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తన నివాసం నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు సోమవారం టీడీపీ శాసనసభాపక్షం, వ్యూహ కమిటీ సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ సమావేశాల్లో ఎలాంటి వ్యూహం అనుసరించాలనే దానిపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. మొదటి రోజు గవర్నర్ ప్రసంగం తర్వాత ప్రవేశపెట్టే ధన్యవాద తీర్మానంపై చంద్రబాబుకు అవకాశం వచ్చాక అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్రెడ్డి అరెస్టులు అక్రమమని మాట్లాడి ఆ రోజు సమావేశాలను బాయ్కాట్ చేయాలని, అనంతరం గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేయాలని మొదట భావించారు. కానీ అదే రోజు బడ్జెట్ ప్రవేశపెడుతుండడంతో వాకౌట్ చేసి గవర్నర్ను కలిసి తిరిగి బడ్జెట్ సమయంలో సభకు రావాలని నిర్ణయించినట్లు సమాచారం. గవర్నర్ ప్రసంగంపై మాట్లాడేటప్పుడు ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని, అవసరమైతే గొడవకు సిద్ధపడాలని చంద్రబాబు సూచించినట్లు తెలిసింది. రెండో రోజూ సభలో నిరసనలు తెలుపుదామని చెప్పినట్టు తెలుస్తోంది. టీడీపీ నేతల అరెస్టులు, కేసులపైనే ప్రధానంగా మాట్లాడాలని, వైఎస్సార్సీపీ ఏడాది పాలనలో అవినీతి జరిగిందనే విషయాలను లేవనెత్తాలనేది టీడీపీ వ్యూహమని సమాచారం. కౌన్సిల్ కీలకం.. అందరూ రావాలి శాసనమండలిలో మాత్రం రెండు రోజులు సభ్యులంతా పాల్గొనాలని చంద్రబాబు స్పష్టం చేశారు. మూడు రాజధానుల సహా ముఖ్యమైన బిల్లులు మళ్లీ కౌన్సిల్లోకి వచ్చే అవకాశం ఉంటుందని, వస్తే వాటిని అడ్డుకోవాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ బిల్లుపై ప్రభుత్వం ముందుకు వెళ్లకుండా చూడాలని, ఇందుకు సంబంధించిన సాంకేతిక అంశాలన్నింటినీ యనమల చూసుకుంటారని తెలిపారు. -
నవరత్నాల వెలుగులు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న రెండోదఫా పూర్తి బడ్జెట్ జనరంజకంగా ఉండనుంది. రెండో ఆర్థిక ఏడాదిలో కూడా నవరత్నాల హామీలన్నీ నెరవేర్చడమే లక్ష్యంగా బడ్జెట్కు రూపకల్పన చేశారు. మేనిఫెస్టోను బైబిల్, ఖురాన్, భగవద్గీతలా భావిస్తామని సీఎం జగన్ పలు సందర్భాల్లో స్పష్టం చేసిన నేప థ్యంలో బడ్జెట్ దీన్ని ప్రతిబింబించనుంది. అన్నదాతలకు పెద్దపీట వేస్తూ బడ్జెట్ కేటాయింపుల ద్వారా ఇది రైతు పక్షపాత ప్రభుత్వమని మరోసారి నిరూపించనుంది. ఈ ఏడాది మార్చి నుంచి ఇటు రాష్ట్రం, అటు కేంద్రం నుంచి ప్రభుత్వానికి రాబడులు పూర్తిగా తగ్గిపోయాయి. కరోనాతో ఆర్థిక వ్యవస్థ కుదేలైనా గత సర్కారు పెద్దఎత్తున పెండింగ్లో పెట్టిన బిల్లులను చెల్లిస్తూనే రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తోంది. ఆర్థిక వ్యవస్థ ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ జనరంజకంగా బడ్జెట్ను తీర్చిదిద్దటంపై ముఖ్యమంత్రి జగన్, ఆర్థిక మంత్రి బుగ్గన సుదీర్ఘ కసరత్తు చేశారు. నవరత్నాల అమలుకు తేదీలతో క్యాలెండర్.. ► ఆర్ధిక పరిస్థితి దిగజారినప్పటికీ నవరత్నాలకు బడ్జెట్ కేటాయింపుల్లో అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. నవరత్నాల పథకాల అమలుకు సంబంధించి వచ్చే ఏడాది మార్చి వరకు తేదీలతో సహా క్యాలెండర్ను ఇటీవల ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. ఆ పథకాలన్నింటికీ బడ్జెట్లో నిధులు కేటాయించనున్నారు. ► కొన్ని రంగాలకు బడ్జెట్ బయట నుంచి వ్యయం చేయనున్నారు. దీంతో కొన్ని కేటాయింపులు బడ్జెట్లో కనిపించవు. నాబార్డు, ఇతర ఆర్ధిక సంస్థల నిధులతో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేయనున్నారు. దీంతో ఆయా రంగాలపై వ్యయం బడ్జెట్ కేటాయింపుల కన్నా ఎక్కువగానే ఉండనుంది. కానీ ఆ నిధులను బడ్జెట్ కేటాయింపుల్లో చూపలేకపోతున్నారు. ► ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్ను రూపొందించడం రైతుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని చాటి చెబుతోంది. మరోపక్క వృధా, దుబారా, ఆర్భాటపు వ్యయాలకు తెర దించుతూ అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అన్ని రంగాల అభివృద్ధిని సమ్మిళితం చేస్తూ బడ్జెట్లో కేటాయింపులు చేశారు. పలు పథకాలు, ప్రాజెక్టులకు నిధులు.. ► పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల కోసం ‘వైఎస్ఆర్ ఆసరా’ పథకానికి బడ్జెట్లో నిధుల కేటాయింపులు చేస్తున్నారు. 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయసు కలిగిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అక్కల కోసం ‘వైఎస్ఆర్ చేయూత’ పథకానికి కూడా బడ్జెట్లో నిధులు కేటాయింపులు చేస్తున్నారు. అమ్మఒడి, వైఎస్ఆర్ రైతు భరోసా, పేదల గృహాలతో పాటు వ్యవపాయం, సాగునీటి రంగం, విద్య, వైద్య రంగాలకు బడ్జెట్లో ప్రాధానం కల్పించారు. ► ఈ ఏడాది పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించిన అవుకు టన్నెల్–2, వెలిగొండ, నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీ, వంశధార 2వ దశ, వంశధార–నాగావళి అనుసంధానం ప్రాజెక్టులకు తగిన నిధులను బడ్జెట్లో కేటాయింపులు చేశారు. ► రాయలసీమ దాహార్తి తీర్చేందుకు రాయలసీమ ఎత్తిపోతల పథకానికి బడ్జెట్లో కేటాయింపులు చేయనున్నారు. కడప స్టీల్ ప్లాంటుతోపాటు పోర్టుల నిర్మాణాలకు కూడా బడ్జెట్లో నిధులు కేటాయించనున్నారు. కరోనాతో ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నం గత సర్కారు మిగిల్చిన బకాయిలు, అప్పులు తీర్చడంతో పాటు కరోనాతో ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నం అయింది. మార్చి నుంచి రెవెన్యూ రాబడులు పూర్తిగా తగ్గిపోయాయి. మద్య నియంత్రణతో ఆదాయం గణనీయంగా తగ్గింది. ప్రజలకు ఇచ్చిన మాట మేరకు మేనిఫెస్టోలోని హామీలన్నింటినీ నెరవేర్చడం కత్తిమీద సాముగా మారినప్పటికీ ప్రభుత్వం సమతుల్యత పాటిస్తూ సంక్షేమం, అభివృద్ధికి బడ్జెట్ కేటాంపుల్లో ప్రాధాన్యం ఇవ్వడం విశేషం. బడ్జెట్ బయట నిధుల నుంచి వ్యయం... ► ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్ కింద రూ.21 వేల కోట్లకు పైగా వ్యయం చేయనున్నారు. అయితే మరో రూ.10 వేల కోట్లకుపైగా బడ్జెట్ బయట నిధుల నుంచి ఖర్చు చేయనున్నారు. రైతు భరోసా కేంద్రాలు, ఉచిత విద్యుత్ సబ్సిడీ, వైఎస్ఆర్ జనతా బజార్లతోపాటు నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా ఆసుపత్రులు, సూళ్లలో మౌలిక సదుపాయాల కల్పనకు భారీవ్యయం చేయనున్నారు. ఆర్ధిక పరిమితుల దృష్ట్యా ఈ వ్యయం బడ్జెట్లో పూర్తి స్థాయిలో కనిపించకపోయినప్పటికీ బడ్జెట్ బయట నిధులు వ్యయం చేయనున్నారు. ► కేంద్ర, రాష్ట్ర రాబడులు తగ్గిన నేపథ్యంలో 2020–21 పూర్తి స్థాయి బడ్జెట్ను రూ.2.25 లక్షల కోట్లతో రూపొందించినట్లు సమాచారం. మార్చిలో మూడు నెలలకు ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ కరోనా నేపథ్యంలో 2020–21 ఆర్ధిక సంవత్సరానికి మార్చి నెలలో పూర్తి స్థాయి బడ్జెట్ సమావేశాలను నిర్వహించనందున తొలి త్రైమాసికానికి (ఏప్రిల్ – జూన్ వరకు) సంబంధించిన వ్యయానికి ద్రవ్య వినిమయ–ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ను మంత్రివర్గం ఆమోదంతో మార్చిలో గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేసిన విషయం తెలిసిందే. తొలి త్రైమాసికంలో అన్ని రంగాలకు అవసరమైన రూ.70,994.98 కోట్ల వ్యయానికి ఆర్డినెన్స్ వీలు కల్పించింది. నేడు, రేపు బడ్జెట్ సమావేశాలు! కరోనాతో ప్రత్యేక పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు మంగళ, బుధవారాల్లో రెండు రోజులు మాత్రమే జరిగే అవకాశం ఉంది. దీనిపై నేడు ఉదయం జరగనున్న బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. జూలై నుంచి వ్యయం చేయాలంటే తప్పనిసరిగా ఈ నెలలోనే పూర్తి స్థాయి బడ్జెట్ సభ అమోదం పొందాల్సి ఉంది. తప్పనిసరిగా బడ్జెట్ను ఆమోదించాల్సి ఉన్నందున సమావేశాలు జరగనున్నాయి. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గవర్నర్ ప్రసంగం.. ఈ అసాధారణ పరిస్థితుల నేపథ్యంలో మంగళవారం ఉదయం 10 గంటలకు ఉభయ సభల సభ్యులనుద్దేశించి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రాజభవన్ నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించనున్నారు. అనంతరం సభ వాయిదా పడనుంది. ఆ వెంటనే శాసన సభ, మండలి వ్యవహారాల కమిటీలు (బీఏసీ) సమావేశమై సభల అజెండాను, సమావేశాలు నిర్వహించే రోజులను ఖరారు చేయనున్నాయి. ఉభయ సభలు తిరిగి ప్రారంభమై గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి ఆమోదం తెలుపుతాయి. ఆ తరువాత మధ్యాహ్నాం 12–30 నుంచి 1 గంట మధ్యలో ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ అసెంబ్లీలో 2020–21 ఆర్ధిక సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్ను సమర్పిస్తారు. దీంతోపాటు 2019–20 ఆర్ధిక సర్వేను కూడా సభకు సమర్పిస్తారు. ఇదే సమయానికి ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ శాఖ) పిల్లి సుభాష్ చంద్రబోస్ శాసన మండలిలో బడ్జెట్ను చదువుతారు. వ్యవసాయ బడ్జెట్ను అసెంబ్లీలో వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ప్రవేశపెడతారు. ఇదే సమయానికి శాసన మండలిలో వ్యవసాయ బడ్జెట్ను పశుసంవర్థక, మత్స్య శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ చదువుతారు. అనంతరం ఉభయ సభలు బుధవారానికి వాయిదా పడనున్నాయి. పద్దులు, ద్రవ్య వినిమయ బిల్లుకు రేపు ఆమోదం.. – బుధవారం ఉదయం ఉభయ సభల్లో శాఖల పద్దులను ప్రవేశపెట్టడం, ఆమోదించడం జరుగుతుంది. అనంతరం ద్రవ్య వినిమయ బిల్లులను ఆర్ధిక మంత్రి ప్రవేశపెట్టిన తరువాత సభ అమోదం పొందుతుంది. శాసనమండలి కూడా అదే రోజు పద్దులకు, ద్రవ్య వినిమయ బిల్లులకు ఆమోదం తెలుపుతుంది. పలు కీలక బిల్లులకు ఉభయ సభలు ఆమోదం తెలపనున్నాయి. దీంతో బడ్జెట్ సమావేశాలు ముగియనున్నాయి. నవరత్నాలకు పెద్ద పీట: బుగ్గన కరోనా నేపధ్యంలో ప్రభుత్వానికి రెవెన్యూ రాబడులు పూర్తిగా తగ్గిపోయినప్పటికీ ప్రజలకు ఇచ్చిన మాట మేరకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మేనిఫెస్టోలోని నవరత్నాలకు బడ్జెట్లో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పేర్కొన్నారు. వ్యవసాయం, విద్య, వైద్య రంగాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు బడ్జెట్లో అధిక ప్రాధాన్యం ఉంటుందని ఆయన సోమవారం ‘సాక్షి’కి తెలిపారు. ఆర్ధికంగా తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంటున్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన మాటను నెరవేర్చాల్సిందేనని, దీనిపై మరో ఆలోచన చేయరాదనే లక్ష్యంతోనే బడ్జెట్ రూపొందించినట్లు చెప్పారు. పేదల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడంతో పాటు అభివృద్ధి, సంక్షేమం సమతూకంతో బడ్జెట్ ఉంటుందన్నారు. బడ్జెట్ నేపథ్యంలో ప్రధానికి సీఎం జగన్ లేఖ రాజ్యాంగపరమైన ప్రక్రియ మేరకు బడ్జెట్ను తప్పనిసరిగా ఆమోదించుకోవాల్సి ఉండటం, బడ్జెట్ సమావేశాల నిర్వహణ తేదీలను ముందుగానే నిర్ణయించిన నేపథ్యంలో ప్రధాని మోదీతో ఈనెల 16, 17వ తేదీల్లో జరగనున్న ముఖ్యమంత్రుల సమావేశానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరు కాకపోవచ్చని సమాచారం. ఈమేరకు ప్రధానికి ముందుగానే సమాచారం ఇస్తూ ముఖ్యమంత్రి జగన్ లేఖ రాసినట్లు తెలిసింది. -
ప్రతి సీటు శానిటైజ్
సాక్షి, అమరావతి: రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో శాసనసభ, శాసనమండలిలో అడుగడుగునా శానిటైజేషన్ చర్యలు చేపట్టారు. ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా శాసనసభ ప్రాంగణం, లాబీల్లో రద్దీని బాగా తగ్గించాలని నిర్ణయించారు. కోవిడ్ నేపథ్యంలో అసెంబ్లీ, మండలిలో ప్రతి సీటును శానిటైజేషన్ చేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారామ్ తెలిపారు. సభ్యులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు ఇతరులు ఎవరినీ అనుమతించరాదని నిర్ణయించినట్లు చెప్పారు. భౌతిక దూరం పాటిస్తూ సమావేశాల నిర్వహణకు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. బడ్జెట్ సమావేశాలను పురస్కరించుకుని స్పీకర్ తమ్మినేని సీతారామ్ అధ్యక్షతన సోమవారం అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. శాసన మండలి ఛైర్మన్ ఎం.ఏ.షరీఫ్, శాసనసభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, డీజీపీ గౌతమ్ సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి, చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి, విప్లు కొరుముట్ల శ్రీనివాసులు, సామినేని ఉదయభాను, కాపు రామచంద్రారెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో ఉభయ సభల నిర్వహణ, భద్రత, సభ్యుల ఆరోగ్యం తదితర అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో శానిటైజ్ చేస్తున్న సిబ్బంది తక్కువ రోజులే మేలు: బుగ్గన ప్రస్తుత పరిస్థితుల్లో శాసనసభా సమావేశాలను వీలైనంత తక్కువ రోజులు నిర్వహించడమే శ్రేయస్కరమని భావిస్తున్నట్లు శాసనసభా వ్యవహారాలు, ఆర్థిక శాఖల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పేర్కొన్నారు. శాసనసభ వద్ద ఆయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ సమావేశాలను రెండు రోజులకు కుదించే అవకాశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. అసెంబ్లీ సమావేశాలను ప్రత్యేక పరిస్థితుల్లో నిర్వహిస్తున్నామని ఇలా జరగడం ఇదే తొలిసారని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి చెప్పారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కరోనా పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. అన్ని చానెళ్లకు లైవ్ ఫీడ్... ► శాసనసభా సమావేశాల ప్రత్యక్ష ప్రసారాన్ని మీడియా, పత్రికా ప్రతినిధులు తిలకించేందుకు వీలుగా సచివాలయంలోని మీడియా సెల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ► అన్ని చానెళ్లకు లైవ్ ఫీడ్ కూడా ఇవ్వనున్నారు. పత్రికా విలేకరుల గ్యాలరీలోకి 20 మందిని మాత్రమే అనుమతిస్తారు. మీడియా పాయింట్ వద్ద కార్యకలాపాలను పూర్తిగా నిషేధించారు. ► మంత్రులు, క్యాబినెట్ హోదా ఉన్న వారికి ఇద్ద రు సహాయక సిబ్బందిని అనుమతిస్తున్నారు. ► ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సహాయకులు, గన్మెన్లకు బయట ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ► బడ్జెట్, పద్దుల వివరాలను పంపిణీ చేసే ఆర్థిక శాఖ సిబ్బంది కూడా త్వరగా పని ముగించుకుని వెళ్లి పోయే విధంగా ఏర్పాట్లు చేసి రద్దీని తగ్గించేందుకు కృషి చేస్తున్నట్లు లెజిస్లేచర్ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులు తెలిపారు. అసెంబ్లీ సమావేశాలకు పటిష్ట బందోబస్తు అసెంబ్లీ సమావేశాలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కరోనా నేపథ్యంలో అసెంబ్లీ సమీప ప్రాంతాల్లోనూ పోలీస్ ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నారు. అసెంబ్లీ బందోబస్తు ఏర్పాట్లపై డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ సోమవారం సమీక్షించారు. పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు. ► బందోబస్తు కోసం.. గుంటూరుతో పాటు ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిగోదావరి జిల్లాల నుంచి మొత్తం 3,080 మంది పోలీసులు, 105 మంది మార్షల్స్ అసెంబ్లీ ప్రాంతానికి చేరుకున్నారు. గుంటూరు అర్బన్, గుంటూరు రూరల్ ఎస్పీల పర్యవేక్షణలో 17 మంది డీఎస్పీలు, 44 మంది సీఐలు, 78 మంది ఎస్సైలు, పోలీస్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ► అసెంబ్లీ ఆవరణలోను, అసెంబ్లీకి వెళ్లే మార్గంలోను పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. చెక్పోస్టులు ఏర్పాటు చేసి అనుమతి ఉన్న వాహనాలకే దారి ఇవ్వనున్నారు. ► అసెంబ్లీ ప్రాంతంలోను, సమీప ప్రాంతాల్లోను సెక్షన్ 144 అమలులోకి తెచ్చారు.