Belarus
-
US Open 2024: సభలెంకా... విజయ ఢంకా
న్యూయార్క్: గత మూడేళ్లుగా ఊరిస్తున్న యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ సింగిల్స్ టైటిల్ను బెలారస్ స్టార్ అరీనా సబలెంకా నాలుగో ప్రయత్నంలో సొంతం చేసుకుంది. భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్ సబలెంకా 7–5, 7–5తో ప్రపంచ ఆరో ర్యాంకర్ జెస్సికా పెగూలా (అమెరికా)పై గెలిచింది. గంటా 53 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో సబలెంకా కీలకదశలో పాయింట్లు గెలిచి విజయాన్ని ఖరారు చేసుకుంది. విజేతగా నిలిచిన సబలెంకాకు 36 లక్షల డాలర్లు (రూ. 30 కోట్ల 23 లక్షలు), రన్నరప్ జెస్సికా పెగూలాకు 18 లక్షల డాలర్లు (రూ. 15 కోట్ల 11 లక్షలు) ప్రైజ్మనీగా లభించాయి. ఈ టోర్నీలో గత ఏడాది రన్నరప్గా నిలిచిన సబలెంకా 2021, 2022లలో సెమీఫైనల్లో ని్రష్కమించింది. తన కెరీర్లో తొలిసారి గ్రాండ్స్లామ్ ఫైనల్ ఆడిన పెగూలా అనుభవరాహిత్యంతో ఓటమి పాలైంది. తొలి సెట్ కోల్పోయినప్పటికీ రెండో సెట్లో కోలుకున్న పెగూలా 5–3తో ఆధిక్యంలోకి వెళ్లింది. మరో గేమ్ గెలిచిఉంటే పెగూలా రెండో సెట్ను సొంతం చేసుకొని మ్యాచ్లో నిలిచేది. కానీ కెరీర్లో నాలుగో గ్రాండ్స్లామ్ ఫైనల్ ఆడుతున్న సబలెంకా తన ప్రత్యర్థికి అలాంటి అవకాశం ఇవ్వలేదు. ఒక్కసారిగా విజృంభించిన ఈ బెలారస్ స్టార్ వరుసగా నాలుగు గేమ్లు గెల్చుకొని 7–5తో సెట్తోపాటు మ్యాచ్ను కైవసం చేసుకుంది. సబలెంకా కెరీర్లో ఇది మూడో గ్రాండ్స్లామ్ సింగిల్స్ టైటిల్. 2023, 2024 ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్గా నిలిచిన సబలెంకా తొలిసారి యూఎస్ ఓపెన్ టైటిల్ను దక్కించుకుంది. 2019లో నాన్న చనిపోయాక మా ఇంటìæపేరును టెన్నిస్ చరిత్రలో భాగంగా చేయాలనే లక్ష్యంతో ముందుకుసాగాను. నా టెన్నిస్ ప్రయాణం నిరాటంకంగా, ఎల్లవేళలా కొనసాగేందుకు నా కుటుంబ సభ్యులు ఎంతో కృషి చేశారు. గత మూడేళ్లుగా ఈ టోరీ్నలో నేను ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాను. టోర్నీలలో విన్నర్స్ ట్రోఫీపై నా పేరు చూసుకుంటున్నపుడు ఎంతో గర్వంగా అనిపిస్తుంది. –సబలెంకా -
అప్పటికే విడిపోయాం.. నా హృదయం ముక్కలైంది: టెన్నిస్ స్టార్
బెలారస్ టెన్నిస్ స్టార్, వరల్డ్ నంబర్ టూ సీడ్ అరీనా సబలెంక ఉద్వేగానికి లోనైంది. ఐస్ హాకీ మాజీ ఆటగాడు కొన్స్టాంటిన్ కొల్త్సోవ్ అర్ధంతరంగా తనువు చాలించడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసింది. అదే విధంగా.. కొన్ని రోజుల ముందే తామిద్దరం విడిపోయామని ఈ సందర్భంగా స్పష్టం చేసింది. కాగా బెలారస్కు చెందిన కొన్స్టాంటిన్ కొల్త్సోవ్ హాకీ ప్లేయర్గా గుర్తింపు పొందాడు. 2002- 2010 మధ్య దేశం తరఫున పలు టోర్నీల్లో పాల్గొన్న అతడు 2010 వింటర్ ఒలింపిక్స్లోనూ భాగమయ్యాడు. ఈ క్రమంలో 2016లో రిటైర్మెంట్ ప్రకటించిన కొల్త్సోవ్.. ఆ తర్వాత రష్యన్ క్లబ్ అసిస్టెంట్ కోచ్గా పనిచేశాడు. గతంలో జులియా అనే మహిళను వివాహం చేసుకున్న కొన్స్టాంటిన్ కొల్త్సోవ్కు ఆమెతో ముగ్గురు సంతానం కలిగారు. అయితే, అభిప్రాయ భేదాలు తలెత్తడంతో 2020లో భార్యకు విడాకులు ఇచ్చిన 42 ఏళ్ల ఈ మాజీ హాకీ ప్లేయర్.. 25 ఏళ్ల టెన్నిస్ స్టార్ అరీనా సబలెంకతో ప్రేమలో పడ్డాడు. గత మూడేళ్లుగా వీరిద్దరు డేటింగ్ చేస్తున్నట్లు ధ్రువీకరించే ఫొటోలను సబలెంక తన సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ చేస్తోంది. అయితే, దురదృష్టవశాత్తూ కొల్త్సోవ్ మియామీలో మరణించినట్లు వార్తలు రాగా.. బెలారస్ హాకీ ఫెడరేషన్ మంగళవారం ఈ వార్తను ధ్రువీకరించింది. ఈ నేపథ్యంలో విచారణలో భాగంగా కొల్త్సోవ్ది ఆత్మహత్య అని స్థానిక పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే.. కొల్త్సోవ్ మృతి నేపథ్యంలో సబలెంకకు సానుభూతి తెలుపుతూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున పోస్టులు పెట్టారు. అప్పటికే విడిపోయాం ఈ క్రమంలో బుధవారం ఈ విషయంపై స్పందించిన సబలెంక.. కొన్నాళ్ల క్రితమే కొల్త్సోవ్తో తాను విడిపోయినట్లు తెలిపింది. దయచేసి ఈ విషయంలో తన గోప్యతకు భంగం కలగకుండా వ్యవహరించాలని అభిమానులకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఇన్స్టా స్టోరీలో.. ‘‘గత కొన్నాళ్లుగా మేము విడిగా ఉంటున్నాం. ఏదేమైనా.. కొన్స్టాంటిన్ కొల్త్సోవ్ మరణం ఊహించలేని విషాదం. నా హృదయం ముక్కలైంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నాకు, నా కుటుంబ గోప్యతకు భంగం కలగకుండా చూసుకుంటారని భావిస్తున్నా’’ అని సబలెంక ఉద్వేగపూరిత నోట్ షేర్ చేసింది. కాగా రెండుసార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్గా నిలిచిన సబలెంక.. శుక్రవారం మియామీ ఓపెన్ బరిలో దిగేందుకు సిద్ధమవుతోంది. View this post on Instagram A post shared by Australian Open (@australianopen) -
Tennis Tigress: అవమానించిన చోటే అదరగొట్టి.. ‘నేను ఆడ పులిని’!
నాలుగేళ్ల క్రితం.. బెలారస్ దేశంలో ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమం సాగింది. తీవ్ర నిరసనలు, పోరాటాలు జరిగాయి. సహజంగానే ప్రభుత్వం వాటిని అణచివేసేందుకు ప్రయత్నించింది. ఆ దేశంలోని ఎంతో మంది ప్రముఖులు తమ అభిప్రాయాలను వెల్లడించకుండా తటస్థంగా ఉండేందుకే ప్రయత్నించారు. కానీ 22 ఏళ్ల ఒక అంతర్జాతీయ క్రీడాకారిణి మాత్రం గట్టిగా తన గళాన్ని వినిపించింది. దేశాధ్యక్షుడు అలెగ్జాండర్ ల్యుకాన్షెకో వ్యవహరిస్తున్న తీరును తప్పు పట్టింది. మరో రెండేళ్ల తర్వాత ఉక్రెయిన్పై రష్యా యుద్ధం మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా రష్యాపై తీవ్ర విమర్శలు కురుస్తున్న సమయంలో బెలారస్ మాత్రం యుద్ధంలో రష్యాకు మద్దతు పలికింది. ఆ సమయంలోనూ ఆ ప్లేయర్ తమ ప్రభుత్వాన్ని, దేశాధ్యక్షుడిని తీవ్రంగా విమర్శించింది. ‘అమాయకులపై దాడులు చేసే యుద్ధాన్ని నేను సమర్థించను. అందుకే మా ప్రభుత్వాన్ని కూడా సమర్థించను’ అంటూ బహిరంగ ప్రకటన చేసింది. ఈ రెండు సందర్భాల్లోనూ ఆ మహిళా క్రీడాకారిణి తన కెరీర్ను పణంగా పెట్టింది. అంతర్జాతీయ స్థాయిలో అత్యున్నత దశకు వేగంగా ఎదుగుతున్న సమయంలో ఇలాంటి పనులు తనను ఇబ్బంది పెడతాయని తెలిసినా తాను నమ్మినదాని గురించి గట్టిగా మాట్లాడింది. ఆమె పేరే.. అరీనా సబలెంకా. ఈ బెలారస్కు టెన్నిస్ స్టార్ రెండు గ్రాండ్స్లామ్ టైటిల్స్ను సాధించడం, వరల్డ్ నంబర్వన్ కావడం మాత్రమే కాదు.. ఆటతో పాటు తనకో ప్రత్యేక వ్యక్తిత్వం ఉందనీ నిరూపించింది. ‘నేను ఆడ పులిని’.. కెరీర్ ఆరంభంలో సబలెంకా తన గురించి తాను చెప్పుకున్న మాట. అప్పటికి ఆమె పెద్ద ప్లేయర్ కూడా రాదు. ధైర్యసాహసాలు, చివరివరకూ పోరాడే తత్వం వల్ల తనను తాను అలా భావించుకుంటానని చెబుతుంది. ఆమె చేతిపై ‘పులి’ టాటూ ఉంటుంది. ఆ టాటూను చూసినప్పుడల్లా స్ఫూర్తి పొందుతానని అంటుంది. టెన్నిస్ కోర్టులో సబలెంకా దూకుడైన ఆటే అందుకు నిదర్శనం. పెద్ద సంఖ్యలో విన్నర్స్ ద్వారానే పాయింట్లు రాబట్టడం ఆమె శైలి. ఆరడుగుల ఎత్తు.. పదునైన సర్వీస్.. సబలెంకా అదనపు బలాలు. అవమానించిన చోటే అదరగొట్టి.. 2018 ఆస్ట్రేలియన్ ఓపెన్... సబలెంకా తొలి రౌండ్ మ్యాచ్. అప్పటికి ఆమె అనామక క్రీడాకారిణి మాత్రమే. అంతకు ముందు ఏడాది ఇదే టోర్నీలో క్వాలిఫయింగ్ దశలోనే వెనుదిరిగింది. ఈసారి కాస్త ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగింది. ప్రపంచ ర్యాంకింగ్లో 66వ స్థానంలో ఉంది. అయితే అటు వైపున్న ప్రత్యర్థి ఆస్ట్రేలియాకు చెందిన స్టార్ యాష్లీ బార్టీ. చాలా మంది పాతతరం ప్లేయర్ల మాదిరే సబలెంకా కూడా కోర్టులో షాట్ ఆడేటప్పుడు గట్టిగా అరుస్తుంది. ఏ స్థాయికి చేరినా చిన్నప్పటి నుంచి సాధనతో పాటు వచ్చిన ఈ అలవాటును మార్చుకోవడం అంత సులువు కాదు. ఈ మ్యాచ్లోనూ అదే జరిగింది. సబలెంకా దూకుడైన ఆటతోపాటు అరుపులు కూడా జోరుగా వినిపించాయి. ఫలితంగా తొలి సెట్ ఆమె సొంతం. దాంతో బార్టీ ఒక్కసారిగా షాక్కు గురైంది. అరుపులు కొంతవరకు ఓకే గానీ మరీ శ్రుతి మించిపోయాయని ఫిర్యాదు చేసింది. అయితే బార్టీని మించి ఆస్ట్రేలియా అభిమానులు చేసిన అతి సబలెంకాను బాగా ఇబ్బంది పెట్టింది. పూర్తిగా నిండిన గ్యాలరీల్లో అంతా బార్టీ అభిమానులే ఉన్నారు. వారంతా సబలెంకాను గేలి చేయడం మొదలుపెట్టారు. సబలెంకా ప్రతి షాట్కూ వారు పెట్టిన అల్లరి వల్ల ఆమె ఏకాగ్రత చెదిరింది. దాంతో తర్వాతి సెట్లలో ఓడి మ్యాచ్లో పరాజయంపాలైంది. దీనిని సబలెంకా మరచిపోలేదు. అదే వేదికపై తానేంటో నిరూపించుకుంటానని ఈ ‘ఆడ పులి’ ప్రతిజ్ఞ పూనింది. అనుకున్నట్టుగానే తన పట్టుదలను చూపించింది! అరుపులను ఆపలేదు కానీ ఆటలో మాత్రం అద్భుతంగా దూసుకుపోయింది. ఐదేళ్ల తర్వాత 2023లో అదే రాడ్ లేవర్ ఎరీనాలో సబలెంకా తొలి గ్రాండ్స్లామ్ టైటిల్ గెలుచుకుంది. సంవత్సరం తర్వాతా దానిని నిలబెట్టుకొని అదే మెల్బోర్న్ ఫ్యాన్స్ ద్వారా సగర్వంగా జేజేలు అందుకుంది. సీనియర్గానే సత్తా చాటుతూ.. చాలామంది వర్ధమాన టెన్నిస్ స్టార్లతో పోలిస్తే సబలెంకా ప్రస్థానం కాస్త భిన్నం. దాదాపు ప్లేయర్లందరూ జూనియర్ స్థాయిలో చిన్న చిన్న టోర్నీలు ఆడుతూ ఒక్కో మెట్టే ఎక్కుతూ ముందుకు వెళతారు. అయితే ఆమె మాత్రం జూనియర్ టోర్నీల్లో ఆడే వయసు, అర్హత ఉన్నా వాటికి దూరంగా ఉంది. గెలిచినా, ఓడినా ప్రొఫెషనల్ సర్క్యూట్లో సీనియర్ స్థాయిలో పోటీ పడటమే మేలు చేస్తుందన్న కోచ్ మాటను పాటిస్తూ సర్క్యూట్లో పోరాడింది. సబలెంకా తన కెరీర్లో ఒక్క జూనియర్ గ్రాండ్స్లామ్ టోర్నీలో కూడా పాల్గొనకపోవడం విశేషం. 14 ఏళ్ల వయసులో ప్రొఫెషనల్గా ఐటీఎఫ్ విమెన్స్ వరల్డ్ టెన్నిస్ టూర్ టోర్నీల్లో ఆడటం మొదలుపెట్టింది. తొలి రెండేళ్లలో ఐదు టోర్నీలూ సొంతగడ్డ బెలారస్లోనే ఆడింది. టైటిల్స్ దక్కకపోయినా ఆమె ఆట మెరుగుపడుతూ వచ్చింది. 2015 ముగిసే సరికి ప్రపంచ ర్యాంకింగ్స్లో 548వ స్థానంలో ఉన్న సబలెంకా.. 2017లో తన తొలి పెద్ద టోర్నీ (ముంబై ఓపెన్) విజయానంతరం 78వ ర్యాంక్తో ఆ ఏడాదిని ముగించింది. ఆ తొలి మూడేళ్లను మినహాయిస్తే ఆ తర్వాత అమిత వేగంతో సబలెంకా కెరీర్ దూసుకుపోయింది. అప్పటి వరకు అనామకురాలిగానే ఉన్నా.. 2018 ఆరంభంలో 11వ ర్యాంక్కు చేరి.. అప్పటి నుంచి ఇప్పటి వరకు టాప్–10లో తన స్థానాన్ని కొనసాగిస్తూ ఉంది. డబుల్ గ్రాండ్స్లామ్.. 2016 యూఎస్ ఓపెన్ క్వాలిఫయింగ్ టోర్నీలో సబలెంకా ఓడింది. తర్వాతి ఆరేళ్లలో నాలుగు గ్రాండ్స్లామ్లతో కలిపి 22 సార్లు బరిలోకి దిగినా ట్రోఫీకి చేరువగా రాలేకపోయింది. గరిష్ఠంగా మూడుసార్లు సెమీఫైనల్తోనే ఆమె సరిపెట్టుకుంది. అయితే 2023లో సబలెంకా కెరీర్ సూపర్గా నిలిచింది. అప్పటికి సింగిల్స్లో నాలుగు ప్రధాన డబ్ల్యూటీఏ టైటిల్స్ విజయాలతో ఫేవరెట్లలో ఒకరిగా ఆస్ట్రేలియన్ ఓపెన్ బరిలోకి దిగి.. చివరి వరకు దానిని నిలబెట్టుకుంది. స్థాయికి తగ్గ ప్రదర్శనతో తొలి గ్రాండ్స్లామ్ టైటిల్ గెలుచుకోవడంతో పాటు సింగిల్స్, డబుల్స్లలో ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచిన నాలుగో ప్లేయర్గా నిలిచింది. ఈ గెలుపుతో వరల్డ్ నంబర్ 2 ర్యాంక్ ఆమె దరి చేరింది. ఆపై శిఖరానికి చేరేందుకు సబలెంకాకు ఎక్కువ సమయం పట్టలేదు. మిగిలిన మూడు గ్రాండ్స్లామ్లలో సెమీస్ చేరిన ఆమె యూఎస్ ఓపెన్లో రన్నరప్గా నిలిచింది. ఈ ప్రదర్శన కారణంగా ఇదే టోర్నీ ముగిసే సరికి అధికారికంగా సబలెంకా వరల్డ్ నంబర్వన్ స్థానాన్ని అధిరోహించింది. ఫలితంగా సింగిల్స్, డబుల్స్లలో ఏదో ఒక దశలో అగ్రస్థానంలో నిలిచిన అరుదైన క్రీడాకారిణుల జాబితాలో ఆమె చేరింది. కొత్త ఏడాది వచ్చేసరికి ఆమె ఆట మరింత పదునెక్కింది. ఇటీవల ముగిసిన ఆస్ట్రేలియన్ ఓపెన్లో ఏడు మ్యాచ్లలో ఒక్క సెట్ కూడా కోల్పోకుండా విజయఢంకా మోగించింది. రెండో గ్రాండ్స్లామ్ను తన ఖాతాలో వేసుకొని చిరునవ్వులు చిందించింది. దేశం పేరు లేకుండానే.. తన దేశంలో యుద్ధానికి వ్యతిరేకంగా గళమెత్తిన సబలెంకా ఒక క్రీడాకారిణిగా కూడా అదే తరహాలో స్పందించింది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధ సమయంలో క్రీడలను రాజకీయాలకు దూరంగా ఉంచాలంటూ బహిరంగ లేఖ రాసింది. బాధితులైన ఉక్రెయిన్ దేశస్థులకు మద్దతునిస్తున్నానంటూ ఆ దేశపు జాతీయ పతాకంలోని రంగుల బ్యాండ్లను మైదానంలో ధరించింది. తన దేశం అనవసరంగా యుద్ధపిపాసి జాబితాలో చేరడంపై బాధను వ్యక్తం చేసింది. అయితే దురదృష్టం ఏమిటంటే ఆమె బెలారస్ ప్లేయర్ కావడమే. యుద్ధ నేపథ్యంలో రష్యా, బెలారస్ దేశపు ప్లేయర్లపై వేర్వేరు అంతర్జాతీయ క్రీడా సమాఖ్యలు నిషేధం విధించాయి. ఈ జాబితాలో విమెన్ టెన్నిస్ అసోసియేషన్ (డబ్ల్యూటీఏ) కూడా ఉంది. తర్వాత.. యుద్ధంతో ప్లేయర్లకు సంబంధం లేదని భావించి వారికి ఆడే అవకాశాన్నిచ్చాయి. కానీ తమ దేశం పేరును వాడకుండా.. ఏ దేశానికీ ప్రాతినిధ్యం వహించకుండా.. తటస్థులుగా బరిలోకి దిగాలనే నియమంతో! దాంతో చాంపియన్గా నిలిచిన తన దేశం పేరును, జెండాను సగర్వంగా ప్రదర్శించుకునే పరిస్థితి సబలెంకాకు లేకపోయింది. ఇటీవలి ఆస్ట్రేలియన్ ఓపెన్లోనూ అదే కొనసాగడంతో.. ఇప్పటికీ డబ్ల్యూటీఏ వెబ్సైట్లో ఆమె పేరు పక్కన దేశం పేరు లేదు. 26 ఏళ్ల సబలెంకా తాజా ఫామ్ను బట్టి ఈ ప్రతికూలతలన్నింటినీ దాటుకుని మున్ముందు మరిన్ని ఘన విజయాలు అందుకోవడం ఖాయమని తెలుస్తోంది. -మొహమ్మద్ అబ్దుల్ హాది -
వాగ్నర్ అనుభవంతో బెలారస్ బలోపేతం!
మిన్స్క్ (బెలారస్): ఉక్రెయిన్లో రష్యా తరఫున యుద్ధంలో పాల్గొన్న ప్రైవేట్ సైన్యం వాగ్నర్ గ్రూప్ అనుభవాన్ని వాడుకోవాలని బెలారస్ భావిస్తోంది. వాగ్నర్ సేన శనివారం ఆ దేశంలో బెలారస్లో అడుగుపెట్టింది. ఇరు సైన్యాల మధ్య సమన్వయం కోసం సంయుక్త సైనిక విన్యాసాలు తదితరాలకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మెరుపువేగంతో షూటింగ్, ప్రథమ చికిత్సలో బెలారస్ సైనికులకు వాగ్నర్ గ్రూప్ బలగాలు తరీ్ఫదునిస్తున్న వీడియో వైరల్గా మారింది. -
వాగ్నర్ చీఫ్ ప్రిగోజిన్ బెలారస్లో కాదు.. రష్యాలోనే ఉన్నాడు
మిన్స్క్: రష్యా అధినేత పుతిన్పై స్వల్పకాలం తిరుగుబాటు చేసి, పెను సంచలనం సృష్టించిన కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూప్ చీఫ్ యెవ్గెనీ ప్రిగోజిన్ ప్రస్తుతం రష్యాలోనే ఉన్నారని బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకశెంకో గురువారం చెప్పారు. ప్రిగోజిన్ ప్రస్తుతం సెయింట్ పీటర్స్బర్గ్ నగరంలో ఆశ్రయం పొందుతున్నాడని తెలిపారు. ఉక్రెయిన్లో యుద్ధం కోసం రష్యా ప్రభుత్వం అందజేసిన నగదు, ఆయుధాలను వెనక్కిఇచ్చేసే ప్రయత్నంలో ప్రిగోజిన్ ఉన్నాడని వెల్లడించారు. వాగ్నర్ సైనిక దళాలు వారి క్యాంప్ల్లోనే ఉన్నాయని పేర్కొన్నారు. అయితే, ఆయా క్యాంప్లు ఎక్కడున్నాయనే విషయం లుకశెంకో బయటపెట్టలేదు. బెలారస్లోని తమ మిలటరీ స్థావరాలను ఉపయోగించుకోవాలని వాగ్నర్ సభ్యులకు సూచించామని, వారు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు. సెయింట్ పీటర్స్బర్గ్ సిటీలో ప్రిగోజిన్ నివసిస్తున్నట్లు చెబుతున్న ఓ భవంతి ఫొటోలు, వీడియోలను రష్యా ఆన్లైన్ పత్రిక ఫోంటాకా బయటపెట్టింది. అయితే, ప్రిగోజిన్ ప్రస్తుతం రష్యాలోనే ఉన్నట్లు స్పష్టమైన ఆధారాలేవీ లభించలేదు. పుతిన్ క్షమాభిక్ష పెట్టిన తర్వాత ప్రిగోజిన్ బెలారస్కు వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. -
మా ఆర్మీకి శిక్షణ ఇవ్వండి
మిన్స్క్: రష్యాలో స్వల్పకాలిక తిరుగుబాటు విఫలయత్నం అనంతరం తమ దేశానికి చేరుకున్న వాగ్నర్ గ్రూప్నకు బెలారస్ అధ్యక్షుడు ఓ ఆఫర్ ఇచ్చారు. తమ దేశ మిలటరీకి శిక్షణ ఇవ్వాలంటూ ప్రైవేట్ సైన్యం వాగ్నర్ గ్రూప్ను అధ్యక్షుడు లుకషెంకో కోరారు. ‘ఇక్కడికి వచ్చి మన సైన్యానికి యుద్ధ నైపుణ్యంలో శిక్షణ ఇవ్వాలని వాగ్నర్ గ్రూప్ను కోరాం. వారి అనుభవం మాకెంతో అవసరం’అని ఆయన అన్నట్లు అధికార వార్తా సంస్థ బెల్టా వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా పోరాడుతూ సాధారణ పరిస్థితులను నెలకొల్పేందుకు ప్రయతి్నస్తున్న వాగ్నర్ గ్రూప్ను పశి్చమదేశాలు ద్వేషిస్తున్నాయన్నారు. చరిత్రలోనే ఎన్నడూ లేనంతటి స్థాయిలో ప్రపంచ సైనిక–రాజకీయ సంక్షోభం ఏర్పడబోతోందని హెచ్చరించారు. దీనిని పరిష్కరించడానికి చర్చల అవసరాన్ని పశి్చమదేశాలు గుర్తించడం లేదని విమర్శించారు. పోలెండ్ మరో ఉక్రెయిన్ మాదిరిగా మారబోతోందని, ఆ దేశానికి ఈయూ, అమెరికా ఆయుధాలు అందిస్తున్నాయని ఆరోపించారు. -
ఆస్పత్రిలో చేరిన బెలారస్ అధ్యక్షుడు..పుతిన్తో సమావేశం తర్వాతే..
బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ని కలిసిన తర్వాతే ఆస్పత్రిలో చేరినట్లు వార్త కథనాలు గుప్పుమన్నాయి. ఈ మేరకు అమెరికన్ వీక్లీ న్యూస్ మ్యాగజైన్ లుకాషెంకో మాస్కోలోని సెంట్రల్ క్లినికల్ ఆస్పత్రిలో చేరినట్లు ఆ బెలారస్ ప్రెసిడెంట్ అభ్యర్థి వాలెరీ సెప్కలో ఓ టెలీగ్రామ్ పోస్ట్లో పేర్కొన్నట్లు తెలిపింది. అంతేగాదు లుకాషెండో పుతిన్తో సమావేశం అనంతరం అత్యవసరంగా మాస్కోలోని ఆస్పత్రిలో చేరారని, అక్కడే చికిత్స పొందుతున్నట్లు తెలిపారు వాలేరీ. ఐతే అక్కడ అతని పరిస్థితి విషమంగా ఉందని, అందువల్ల అతనిని తీసుకువచ్చేలా వైద్య నిపుణలతో సహా అధికార బృందాన్ని పంపినట్లు తెలిపారు. అక్కడ లుకాషెంకోపై మాస్కో విషప్రయోగం జరిపినట్లు ఊహాగానాలు హల్చల్ చేస్తున్నట్లు కూడా వివరించారు వాలేరీ. అందువల్ల తాము అతనని సతర్వరమే రక్షించేలా అన్ని రకాల వ్యవస్థీకృత చర్యలు తీసుకుంటున్నట్లు వాలేరీ పేర్కోన్నట్లు అమెరికా వీక్లీ న్యూస్ తెలిపింది. నిజానికి మే 9ప మాస్కోలో రెడ్ స్క్వేర్లో జరిగిన విక్టరీ డే వేడుకలో లుకాషెంకో కనిపించిన కొన్ని వారాల తర్వాత ఆయన ఆరోగ్యంపై పుకార్లు రావడం మొదలైంది. ఐతే లుకాషెంకో వాటిని తోసిపుచ్చారు. అంతేగాదు బెలారస్లో వ్యూహాత్మక క్షిఫణుల విస్తరణను లాంఛనప్రాయంగా చేయడానికి లుకాషెంకో ప్రభుత్వంతో రష్యా ఒప్పందం కుదుర్చకున్నట్లు రష్యా మీడియా పేర్కొంది. అందుకు సంబంధించిన పత్రాలపై ఇరు దేశాల నాయకులు సంతకం చేసినట్లు బెలారసియన్ రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. కాగా, ఆ రెండు దేశాలు తీసుకున్న చర్యలు అంతర్జాతీయ చట్టపరమైన బాధ్యతలకు అనుగుణంగా ఉన్నట్లు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అలాగే సమావేశంలో ఇరు దేశాల నాయకులు సైనిక, రాజకీయ పరిస్థితుల తోపాటు సాంకేతిక సహకార సమస్యలపై చర్చించనట్లు అని బెలారసియన్ రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. (చదవండి: దిగుతున్న టైంలో విమానం డోర్ లాక్ అయ్యింది!.పాపం ఆ ప్రయాణికుడు..) -
రష్యా, బెలారస్ టెన్నిస్ ఆటగాళ్లకు ఊరట.. నిషేధం ఎత్తివేత
Russia And Belarus Tennis Players: ఉక్రెయిన్తో రష్యా యుద్ధం నేపథ్యంలో గత ఏడాది రష్యా, బెలారస్ టెన్నిస్ క్రీడాకారులపై ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ క్లబ్ నిషేధం విధించింది. దాంతో ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టోర్నీలో రష్యా, బెలారస్ క్రీడాకారులు పాల్గొనలేకపోయారు. అయితే ఈ ఏడాది రష్యా, బెలారస్ క్రీడాకారులపై ఉన్న నిషేధాన్ని ఎత్తి వేస్తున్నామని, వారు తటస్థ క్రీడాకారుల హోదాలో పాల్గొనవచ్చని ఆల్ ఇంగ్లండ్ క్లబ్ తెలిపింది. దాంతో పురుషుల విభాగంలో స్టార్స్ మెద్వెదెవ్, రుబ్లెవ్, ఖచ నోవ్ (రష్యా), మహిళల విభాగంలో విక్టోరియా అజరెంకా, ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత అరీనా సబలెంకా (బెలారస్) వింబుల్డన్లో ఆడేందుకు మార్గం సుగమమైంది. ఈ ఏడాది వింబుల్డన్ టోర్నీ జూలై 3 నుంచి 16 వరకు జరుగుతుంది. చదవండి: IPL2023 Opening Ceremony: అట్టహాసంగా ఐపీఎల్ ఆరంభ వేడుకలు: దుమ్ములేపిన తమన్నా, రష్మిక.. తెలుగు పాటలతో -
Ales Bialiatski: చెరసాలలో శాంతి కపోతం
అంతర్జాతీయ సమాజం, మానవ హక్కుల సంఘాలు ఊహించినట్లే జరిగింది. దేశంలో కల్లోలానికి కారకుడంటూ మానవ హక్కుల ఉద్యమకారుడు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత అలెస్ బియాలియాట్ స్కీ(60)కు పదేళ్ల జైలు శిక్ష విధించింది బెలారస్ న్యాయస్థానం. 2020లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలకు అలెస్.. ఆర్థిక సహకారం అందించాడని, తద్వారా ఇతర నేరాలకూ కారకుడయ్యాని ప్రభుత్వం మోపిన అభియోగాలను ధృవీకరించింది కోర్టు. అంతేకాదు ఆ సమయంలో అరెస్టయిన వాళ్లకు న్యాయపరమైన సాయం కూడా అందించాడని నిర్ధారించుకుని.. శుక్రవారం ఆయనకు పదేళ్ల జైలుశిక్షను ఖరారు చేసింది. ► బియాలియాట్ స్కీ.. వియాస్నా మానవ హక్కుల సంఘం సహ వ్యవస్థాపకుడు. శాంతియుత పోరాటాలు నిర్వహిస్తుంది ఈ సంస్థ. 2020లో అలెగ్జాండర్ లుకాషెంకో తిరిగి బెలారస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక.. దేశవ్యాప్తంగా తీవ్ర ప్రజావ్యతిరేకత వ్యక్తం అయ్యింది. ఈ నిరసనలకు బియాలియాట్ స్కీ.. ఆయన నిర్వహిస్తున్న ఫౌండేషన్ సూత్రధారి అని, నిరసనకారులకు అన్నివిధాలుగా సహకరించారనేది వెల్లువెత్తిన ఆరోపణలు. దీంతో 2021లో ఆయన్ని, వియాస్నా గ్రూప్కు చెందిన మరో ఇద్దరు సహవ్యవస్థాపకులనూ బెలారస్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. ► ఇదిలా ఉండగానే.. 2021 అక్టోబర్లో బియాలియాట్ స్కీకి నోబెల్ శాంతి ప్రైజ్(రష్యా మానవ హక్కుల సంస్థతో పాటు ఉక్రెయిన్కు చెందిన సంస్థకు సైతం) వరించింది. ► అలెస్ బియాలియాట్ స్కీ.. మానవ హక్కుల ఉద్యమకారుడే కాదు.. సాహిత్యకారుడు కూడా. స్కూల్ టీచర్గా, మ్యూజియం డైరెక్టర్గానూ ఆయన పని చేశాడు. 1980 నుంచి బెలారస్లో జరుగుతున్న పలు ఉద్యమాల్లో ఆయన భాగం అవుతూ వస్తున్నారు. ► సోవియట్ యూనియన్ నుంచి బెలారస్ స్వాతంత్రం కోసం ఉద్యమించిన ప్రముఖుల్లో ఈయన కూడా ఉన్నారు. ► 1990లో బెలారస్ స్వాతంత్ర్యం ప్రకటించుకుంది. 1994లో జరిగిన ఎన్నికల్లో అలెగ్జాండర్ లుకాషెంకో అధ్యక్షుడిగా ఎన్నియ్యాడు. అయితే.. అక్కడ పారదర్శకంగా జరిగిన ఎన్నిక అదొక్కటేనని చెప్తుంటారు మేధావులు. ఆపై దొడ్డిదారిలో ఎన్నికవుతూ.. ఇప్పటికీ ఆయన ఆ దేశ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ► లుకాషెంకో.. పుతిన్కు అత్యంత సన్నిహితుడు. రష్యా అండతోనే బెలారస్.. పాశ్చాత్య దేశాలపైకి కయ్యానికి కాలు దువ్వుతోంది. ఉక్రెయిన్ విషయంలోనూ రష్యాకు మద్దతు ఇస్తోంది. ఈ క్రమంలో తమ దేశంలో రష్యా బలగాలకు ఆశ్రయం కల్పిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. ► 2020 అలర్లకు సంబంధించి రాజకీయ ఖైదీలకు.. బియాలియాట్ స్కీ బహిరంగ మద్దతు ప్రకటించారు. అయితే.. జైల్లో వాళ్లు ఎదుర్కొన్న వేధింపులను ఒక డాక్యుమెంటరీ ద్వారా బయటి సమాజానికి తెలియజేశారు. ఆ కోపంలోనే బెలారస్ సర్కార్ ఆయనపై పగ పెంచుకుని.. ఇబ్బందిపెడుతోందన్నది అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాల వాదన. ► బియాలియాట్ స్కీ జైలుకు వెళ్లడం ఇదేం కొత్త కాదు. 2011 నుంచి మూడేళ్లపాటు ఆయన జైలు శిక్ష అనుభవించారు. వియాస్నా గ్రూప్ ఫండింగ్కు సంబంధించి పన్నుల ఎగవేత నేరంపై అప్పుడు ఆయన శిక్ష అనుభవించారు. అయితే.. ఆ సమయంలోనూ ఆయన నేరారోపణలను ఖండించారు. ► ఇక 2021లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలకుగానూ మరోసారి అరెస్ట్ కాగా.. అప్పటి నుంచి చెరసాలలోనే ఉన్నారు. ఆ సమయంలో ఆయన అరెస్ట్ను మానవ హక్కుల సంఘాలు, బెలారస్ ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండించాయి. అమ్నెస్టీ ఇంటర్నేషనల్ బియాలియాట్ అరెస్ట్ను ప్రభుత్వ ప్రతీకార చర్యగా అభివర్ణించింది. మొత్తం 23 మానవ హక్కుల సంఘాలు ఆయనకు సంఘీభావంగా సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేశాయి. ► తొలుత 12 ఏళ్ల శిక్ష విధించాలని ప్రాసిక్యూటర్లు వాదించారు. అయితే.. కోర్టు మాత్రం పదేళ్ల శిక్ష విధించింది. ఆయనతో పాటు ఉన్న మరో ఇద్దరికి.. ఒకరికి ఏడు, మరొకరికి 9 ఏళ్ల శిక్షలు ఖరారు చేసింది. అఆగే ముగ్గురికి లక్ష నుంచి 3 లక్షల డాలర్ల జరిమానా కూడా విధించింది. ► బియాలియాట్ స్కీ జైలు శిక్ష తీర్పుపై బయటి దేశాల నుంచే కాదు బెలారస్లోనూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. వాదప్రతివాదాలు సహేతుకంగా జరగలేదని విమర్శించారు బెలారస్ ప్రతిపక్ష నేత, బహిష్కృత నేత స్వియాట్లానా. మరోవైపు ఆయన అరెస్ట్కు ఖండిస్తూ.. సంఘీభావంగా పలు చోట్ల శాంతి ర్యాలీలు నిర్వహిస్తున్నారు. -
2024 Paris Olympics: పారిస్ ఒలంపిక్స్ను బహిష్కరించాలి: పోలండ్
వార్సా: 2024 పారిస్ ఒలంపిక్స్లో రష్యా, బెలారస్ల ప్రాతినిధ్యాన్ని అంగీకరిస్తే తీవ్ర పరిణామాలుంటాయని పోలండ్ హెచ్చరించింది. రష్యా, బెలారస్లు ఒలంపిక్స్ పాల్గొనే పక్షంలో పోలండ్, లిథువేనియా, ఎస్టోనియా, లాట్వియా దేశాలు ఆ క్రీడలను బహిష్కరిస్తాయని పోలండ్ మంత్రి కమిల్ చెప్పారు. ఆ రెండు దేశాల క్రీడాకారులకు అవకాశమివ్వాలన్న అంతర్జాతీయ ఒలంపిక్ కమిటీ నిర్ణయాన్ని ఖండించారు. ఈ నెల 10న జరిగే ఐవోసీ భేటీలో ఈయూ, యూకే, అమెరికా, కెనడాలతోపాటు ఉక్రెయిన్పై రష్యా ఆక్రమణను వ్యతిరేకించే 40 దేశాలు గ్రూపుగా ఏర్పడాలన్నారు. ఈ 40 దేశాలు గనుక బహిష్కరిస్తే ఒలంపిక్స్ నిర్వహణకు అర్థమే లేకుండా పోతుందని చెప్పారు. రష్యా పాల్గొంటే తాము ఒలంపిక్స్ను బహిష్కరిస్తామని ఉక్రెయిన్ ఇప్పటికే స్పష్టం చేసింది. -
Aryna Sabalenka: ఎగతాళి చేసిన గడ్డపైనే చప్పట్లు
ఐదేళ్ల క్రితం సబలెంకా తొలిసారి ఆ్రస్టేలియా ఓపెన్ బరిలోకి దిగింది. మొదటి రౌండ్ మ్యాచ్లోనే ఆమె స్థానిక స్టార్ యాష్లీ బార్టీతో తలపడాల్సి వచ్చింది. అయితే షాట్ ఆడే సమయంలో సబలెంకా చేస్తున్న అరుపులు వివాదాన్ని రేపాయి. ప్రేక్షకులు ఆమెను బాగా ఎగతాళి చేశారు. చివరకు ఓటమితో మొదటి రౌండ్లోనే నిష్క్రమించాల్సి వచ్చింది. ఇప్పుడు అదే గడ్డపై ఆమెపై అభినందనలతో చప్పట్ల వర్షం కురుస్తోంది. సబలెంకా దూకుడైన ఆట, పదునైన ఏస్లు తప్ప ఆమె అరుపులు ఎవరికీ వినిపించడం లేదు. సబలెంకా ఎడమ చేతిపై పెద్దపులి టాటూ ఉంటుంది. ‘నేను నాలాగే ఉంటాను. ఎవరినీ లెక్క చేయను. నేను టైగర్ను’ అంటూ తనకు తాను చెప్పుకునే సబలెంకా అలాంటి ధీరోదాత్త ఆటను ప్రదర్శించింది. ఆరడుగుల ఎత్తు ఉన్న సబలెంకా బలం వేగవంతమైన సర్వీస్లో ఉంది. అయితే అదే బలం బలహీనతగా మారి గత టోర్నీలో నాలుగు రౌండ్లలోనే 56 డబుల్ఫాల్ట్లు చేసింది. ఈ సారి తన కోచింగ్ బృందంతో కలిసి ప్రత్యేక దృష్టి పెట్టిన ఆమె ఇప్పుడు 7 మ్యాచ్లలో కలిపి 29 డబుల్ ఫాల్ట్లే చేసింది. సబలెంకా టెన్నిస్ను చాలా ఆలస్యంగా మొదలు పెట్టింది. హాకీ ఆటగాడైన తండ్రి సెర్గీ ప్రోత్సాహంతో ఆటలోకి అడుగు పెట్టిన ఆమె 15 ఏళ్ల వయసు వరకు ఎలాంటి జూనియర్ టోర్నీలు ఆడనే లేదు. 16 ఏళ్ల వయసులో నేషనల్ టెన్నిస్ అకాడమీలో చేరిన తర్వాత ఆమె కెరీర్ మలుపు తిరిగింది. 2019లో తండ్రి ఆకస్మిక మరణం సబలెంకాను కలచివేసింది. ‘మా నాన్న నన్ను వరల్డ్నంబర్వన్గా చూడాలనుకున్నారు’ అని ఆమె గుర్తు చేసుకుంది. ఓపెన్ ఎరాలో గ్రాండ్స్లామ్ టైటిల్ గెలిచిన 58వ మహిళా ప్లేయర్గా నిలిచి రెండో ర్యాంక్కు చేరిన సబలెంకా నంబర్వన్ కావడానికి మరెంతో దూరం లేదు! Your #AO2023 women’s singles champion, @SabalenkaA 🙌@wwos • @espn • @eurosport • @wowowtennis • #AusOpen pic.twitter.com/5ggS5E7JTp — #AusOpen (@AustralianOpen) January 28, 2023 చదవండి: AUS Open 2023: మహిళల సింగిల్స్ విజేత సబలెంకా -
పదేళ్ల తర్వాత మళ్లీ సెమీస్లోకి
మెల్బోర్న్: తన పూర్వ వైభవాన్ని గుర్తుకు తెచ్చేలా ఆడిన బెలారస్ టెన్నిస్ స్టార్ విక్టోరియా అజరెంకా పదేళ్ల తర్వాత ఓ గ్రాండ్స్లామ్ టోర్నీలో సెమీఫైనల్ దశకు అర్హత సాధించింది. సీజన్ తొలి గ్రాండ్స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్లో ప్రపంచ 24వ ర్యాంకర్ అజరెంకా మూడోసారి సెమీఫైనల్కు చేరింది. 2012, 2013లో ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా నిలిచిన అజరెంకా 2013లో ఫ్రెంచ్ ఓపెన్లో సెమీఫైనల్ చేరాక మరే గ్రాండ్స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ దాటలేకపోయింది. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో అజరెంకా 6–4, 6–1తో మూడో సీడ్ జెస్సికా పెగూలా (అమెరికా)పై అలవోకగా గెలిచింది. 97 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్ లో అజరెంకా 17 విన్నర్స్ కొట్టి, ప్రత్యర్థి సర్వీస్ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. మరో క్వార్టర్ ఫైనల్లో 22వ సీడ్ రిబాకినా (కజకిస్తాన్) 6–2, 6–4తో 17వ సీడ్ ఒస్టాపెంకో (లాత్వియా)ను ఓడించి సెమీస్లో అజరెంకాతో పోరుకు సిద్ధమైంది. పురుషుల సింగిల్స్లో మూడో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్), 18వ సీడ్ ఖచనోవ్ (రష్యా) సెమీఫైనల్లోకి ప్రవేశించారు. క్వార్టర్ ఫైనల్స్లో సిట్సిపాస్ 6–3, 7–6 (7/2), 6–4తో లెహచ్కా (చెక్ రిపబ్లిక్)పై నెగ్గగా... ఖచనోవ్ 7–6 (7/5), 6–3, 3–0తో ఆధిక్యంలో ఉన్న దశలో అతని ప్రత్యర్థి సెబాస్టియన్ కోర్డా (అమెరికా) గాయంతో వైదొలిగాడు. ‘మిక్స్డ్’ సెమీస్లో సానియా–బోపన్న జోడీ సానియా మీర్జా–రోహన్ బోపన్న (భారత్) ద్వయం కోర్టులోకి అడుగు పెట్టకుండానే మిక్స్డ్ డబుల్స్లో సెమీఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకున్నారు. సానియా–బోపన్నలతో ఆడాల్సిన ఒస్టాపెంకో (లాత్వియా)–వెగా హెర్నాండెజ్ (స్పెయిన్) జోడీ గాయం కారణంగా బరిలోకి దిగకపోవడంతో భారత జంటను విజేతగా ప్రకటించారు. -
రష్యా, బెలారస్ జాతీయ జెండాలపై నిషేధం
ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్స్లామ్లో భాగంగా రష్యా, బెలారస్ దేశాల జాతీయ జెండాలపై నిషేధం విధించారు. టోర్నమెంట్లోని ఓ టెన్నిస్ కోర్టులో జరిగిన ఘటన ఆధారంగా నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు. మెల్బోర్న్ పార్క్లోకి జాతీయ జెండాలను తీసుకువచ్చేందుకు తొలుత ప్రేక్షకులకు అనుమతి ఇచ్చారు. అయితే ఉక్రెయిన్ ప్లేయర్ కేతరినీ బెయిడా, రష్యా ప్లేయర్ కమిల్లా రఖిమోవా మధ్య మ్యాచ్ జరుగుతున్న సమయంలో కొందరు ప్రేక్షకులు రష్యా జెండాలను ప్రదర్శించారు. దీంతో నిర్వాహకులు తక్షణమే ఆ రెండు దేశాల జెండాలపై బ్యాన్ విధించారు. అంతేకాదు తమ ప్లేయర్ను రష్యన్లు వేధించినట్లు ఉక్రెయిన్ అభిమానులు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని టెన్నిస్ ఆస్ట్రేలియాను కోరారు. దీంతో ఆస్ట్రేలియన్ ఓపెన్ నిర్వాహకులు ఈ రెండు దేశాల జాతీయ జెండాల ప్రదర్శించకుండా నిషేధం విధించింది. చదవండి: షార్ట్ టెంపర్కు మారుపేరు.. అభిమానిపై తిట్ల దండకం సంచలనం.. మాజీ వరల్డ్ నెంబర్ వన్కు బిగ్షాక్ -
ఒక్క సెట్ కూడా కోల్పోకుండా విజేతగా నిలిచిన సబలెంకా
అడిలైడ్: గత ఏడాది ఒక్క టైటిల్ నెగ్గలేకపోయిన బెలారస్ టెన్నిస్ స్టార్, ప్రపంచ ఐదో ర్యాంకర్ సబలెంకా ఈ సంవత్సరాన్ని టైటిల్తో ప్రారంభించింది. ఆదివారం ముగిసిన అడిలైడ్ ఇంటర్నేషనల్–1 ఓపెన్ డబ్ల్యూటీఏ–500 టోర్నీలో ఆమె విజేతగా నిలిచింది. ఫైనల్లో సబలెంకా 6–2, 7–6 (7/4)తో క్వాలిఫయర్ లిండా నొస్కోవా (చెక్ రిపబ్లిక్)పై గెలిచింది. ఈ టోర్నీలో సబలెంకా ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా కోల్పోకపోవడం విశేషం. సబలెంకా కెరీర్లో ఇది 11వ టైటిల్కాగా... ఆమెకు 1,20,150 డాలర్ల ప్రైజ్మనీ (రూ. 98 లక్షల 92 వేలు)తోపాటు 470 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
ఒలింపిక్ మాజీ స్విమ్మర్కు 12 ఏళ్ల జైలుశిక్ష
బెలారస్కు చెందిన మాజీ ఒలింపిక్ స్విమ్మర్ అలియాక్సాండ్రా హెరాసిమేనియాకు 12 ఏళ్ళ జైలుశిక్ష పడింది. దేశ భద్రతకు ముప్పు వాటిల్లేలా ఆమె చర్యలు ఉన్నాయని.. ఆమె వల్ల దేశానికి హాని పొంచి ఉందన్న కారణంతో ఈ శిక్ష విధిస్తున్నట్లు మింక్స్ కోర్టు తెలిపింది. అలియాక్సాండ్రాతో పాటు ఆమె స్నేహితుడు పొలిటికల్ యాక్టివిస్ట్ అలెగ్జాండర్ ఒపేకిన్కు కూడా 12 ఏళ్ల జైలుశిక్ష విధించినట్లు పేర్కొంది. అలెగ్జాండర్ లుకాషెంకో యొక్క నిరంకుశ పాలనను నిరసించడంలో హెరాసిమేనియా, ఒపేకిన్ ముందు వరుసలో నిలిచి అపఖ్యాతిని సంపాదించుకున్నారని.. అందుకే వారి వల్ల దేశ భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని భావించి జైలుశిక్ష విధించారని న్యూస్ బీటీ ఏజెన్సీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇక అలియాక్సాండ్రా మూడుసార్లు ఒలింపిక్ మెడల్స్ సొంతం చేసుకుంది. 2012 లండన్ ఒలింపిక్స్లో 50 మీటర్ల ఫ్రీస్టైల్ విభాగం, 100 మీటర్ల ఫ్రీసైల్ విభాగంలో సిల్వర్ మెడల్ గెలిచిన ఆమె.. 2016 రియో ఒలింపిక్స్లో 50 మీటర్ల ఫ్రీస్టైల్ విభాగంలో కాంస్య పతకం సాధించింది. -
స్వియాటెక్కు సబలెంకా షాక్
టెక్సాస్ (అమెరికా): ఈ ఏడాదిని మరో టైటిల్తో ముగించాలని ఆశించిన ప్రపంచ నంబర్వన్ ఇగా స్వియాటెక్ (పోలాండ్)కు నిరాశ ఎదురైంది. మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) సీజన్ ముగింపు టోర్నీ డబ్ల్యూటీఏ ఫైనల్స్లో టాప్ సీడ్ స్వియాటెక్ పోరాటం సెమీఫైనల్లో ముగిసింది. బెలారస్ ప్లేయర్, ప్రపంచ ఏడో ర్యాంకర్ సబలెంకా 6–2, 2–6, 6–1తో స్వియాటెక్ను ఓడించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. లీగ్ దశలో ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ గెలిచిన స్వియాటెక్ సెమీస్లో మాత్రం సబలెంకా ధాటికి తడబడింది. ఈ ఏడాది స్వియాటెక్ ఫ్రెంచ్ ఓపెన్, యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టైటిల్స్తోపాటు మరో ఆరు టోర్నీలలో విజేతగా నిలిచింది. ఓవరాల్గా ఈ సీజన్లో ఆమె 67 మ్యాచ్ల్లో గెలిచింది. మరో సెమీఫైనల్లో కరోలినా గార్సియా (ఫ్రాన్స్) 6–3, 6–2తో మరియా సాకరి (గ్రీస్)పై గెలిచి ఫైనల్లో సబలెంకాతో టైటిల్ పోరుకు సిద్ధమైంది. సాకరి కూడా లీగ్ దశలో ఆడిన మూడు మ్యాచ్ల్లో గెలిచి కీలకమైన సెమీఫైనల్లో ఓడిపోవడం గమనార్హం. -
మానవ హక్కుల పోరాటాలకు నోబెల్ శాంతి బహుమతి
ఓస్లో: మానవ హక్కుల పరిరక్షణ కోసం కొనసాగుతున్న ఉద్యమాలకు నోబెల్ కమిటీ అత్యున్నత గౌరవాన్ని కల్పించింది. బెలారస్ మానవ హక్కుల ఉద్యమకారుడు అలెస్ బియాల్యాస్కీ(60), రష్యా మానవ హక్కుల సంస్థ ‘మెమోరియల్’, ఉక్రెయిన్ సంస్థ ‘సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీస్’కు సంయుక్తంగా 2022 సంవత్సరానికి గాను నోబెల్ శాంతి బహుమతిని శుక్రవారం ప్రకటించింది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రెండు దేశాల్లోని సంస్థలు ప్రపంచ ప్రతిష్టాత్మక బహుమానానికి ఎంపిక కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఉక్రెయిన్పై దండెత్తుతున్న రష్యా అధినేత పుతిన్ ఏకపక్ష వైఖరిపై ఇదొక నిరసన అని నిపుణులు అంచనా వేస్తున్నారు. బెలారస్, రష్యా, ఉక్రెయిన్లో మానవ హక్కులు, ప్రజాస్వామ్యం, శాంతియుత సహజీవనం వంటి అంశాల్లో గొప్ప చాంపియన్లు అయిన ముగ్గురిని (ఒక వ్యక్తి, రెండు సంస్థలు) శాంతి బహుమతితో గౌరవిస్తుండడం ఆనందంగా ఉందని నార్వే నోబెల్ కమిటీ చైర్మన్ బెరిట్ రీస్–ఆండర్సన్ చెప్పారు. ఆమె మీడియాతో మాట్లాడారు. వారంతా సైనిక చర్యలను వ్యతిరేకిస్తూ మానవీయ విలువలు, న్యాయ సూత్రాల రక్షణ అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని కొనియాడారు. దేశాల మధ్య శాంతి, సౌభ్రాతృత్వం వర్థిల్లాలని ఆల్ఫెడ్ నోబెల్ ఆకాంక్షించారని గుర్తుచేశారు. బియాల్యాస్కీని విడుదల చేయండి జైలులో ఉన్న అలెస్ బియాల్యాస్కీని విడుదల చేయాలని బెలారస్ పాలకులకు బెరిట్ రీస్–ఆండర్సన్ విజ్ఞప్తి చేశారు. బహుమతి బియాల్యాస్కీలో నైతిక స్థైర్యాన్ని పెంచుతుందని, ఆయనపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపించబోదని భావిస్తున్నట్లు తెలిపారు. రష్యా మానవ హక్కుల సంస్థకు శాంతి బహుమతి ప్రకటించడం ద్వారా.. శుక్రవారం 70వ పుట్టినరోజు జరుపుకుంటున్న పుతిన్కు ఉద్దేశపూర్వకంగా ఏదైనా సంకేతం పంపదలిచారా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా... ప్రజలకు మంచి చేసేవారికి బహుమతి ఇస్తుంటామని, అంతేతప్ప తాము ఎవరికీ వ్యతిరేకం కాదని, వ్యక్తుల పుట్టినరోజులతో తమకు సంబంధం లేదని బెరిట్ రీస్–ఆండర్సన్ బదులిచ్చారు. ఈ ప్రైజ్ పొందడం ద్వారా ఆయా సంస్థల వెనుక ఉన్న వ్యక్తులు వారు నమ్మినదాని కోసం మరింత ఉత్సాహంతో కృషి సాగిస్తారన్న నమ్మకం తమకు ఉందన్నారు. గత ఏడాది(2021) నోబెల్ శాంతి బహుమతిని సంయుక్తంగా అందుకున్న రష్యా జర్నలిస్టు దిమిత్రీ మురతోవ్, ఫిలిప్పైన్స్ జర్నలిస్టు మారియా రెస్సా అక్కడి ప్రభుత్వాల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాము పనిచేస్తున్న మీడియా సంస్థల్లో ఉద్యోగాలను కాపాడుకోవడానికి పెద్ద పోరాటమే చేయాల్సి వస్తోంది. భావవ్యక్తీకరణ స్వేచ్ఛ కోసం సాగించిన పోరాటానికి వీరిద్దరికి నోబెల్ లభించింది. యుద్ధంపై ఎక్కుపెట్టిన ఆయుధం ఉక్రెయిన్లోని కొందరు శాంతి కాముకులు 2007లో ‘సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీస్’ను ఏర్పాటు చేశారు. అప్పట్లో దేశంలో అశాంతి రగులుతున్న తరుణంలో మానవ హక్కుల పరిరక్షణ, ప్రజాస్వామ్య ఉద్యమాలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ సంస్థకు శ్రీకారం చుట్టారు. ఉక్రెయిన్ పౌర సమాజాన్ని బలోపేతం తదితరాలు సంస్థ ముఖ్య లక్ష్యాలు. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం మొదలైన తర్వాత ఈ సంస్థ మరింత క్రియాశీలకంగా పనిచేస్తోంది. సాధారణ ప్రజలపై రష్యా యుద్ధ నేరాలను రికార్డు చేసి, ప్రపంచానికి తెలియజేస్తోంది. ఈ యుద్ధ నేరాలకు రష్యాను జవాబుదారీగా మార్చేందుకు కృషి చేస్తోంది. యుద్ధానికి వ్యతిరేకంగా ఎక్కుపెట్టిన అసలైన ఆయుధం మానవ హక్కుల పోరాటమేనని ‘సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీస్’ చెబుతోంది. అంకితభావం గల ఉద్యమకారుడు అలెస్ బియాల్యాస్కీ నేటి రష్యాలోని వైర్టిసిల్లాలో 1962 సెప్టెంబర్ 25వ తేదీన జన్మించారు. ఆ తర్వాత వారి కుటుంబం బెలారస్కు వలస వెళ్లింది. విద్యాభ్యాసం అనంతరం బియాల్యాస్కీ కొంతకాలంపాటు పాఠశాల ఉపాధ్యాయుడిగా, తర్వాత సైన్యంలో డ్రైవర్గా పనిచేశారు. 1980వ దశకం నుంచి బెలారస్లో ఆయన మానవ హక్కుల ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. 1996లో ‘వియాస్నా హ్యూమన్ రైట్స్ సెంటర్’ అనే ప్రభుత్వేతర సంస్థను స్థాపించారు. అంకితభావం కలిగిన మానవ హక్కుల, పౌరస్వేచ్ఛ, ప్రజాస్వామ్య ఉద్యమకారుడిగా ప్రజల్లో గుర్తింపు పొందారు. ఎన్నో పోరాటాలను ముందుండి నడిపించారు. హవెల్స్ ఫర్ హ్యూమన్ రైట్స్ అవార్డును 2013లో, నోబెల్కు ప్రత్యామ్నాయంగా భావించే రైట్ లైవ్లీçహుడ్ అవార్డును 2020లో గెలుచుకున్నారు. ప్రభుత్వ వ్యతిరేక పోరాటాలకు సారథ్యం వహిస్తున్న బియాల్యాస్కీని పన్నులు ఎగవేశారన్న కారణంతో బెలారస్ పాలకులు 2021 జూలై 14న నిర్బంధించారు. ఆయన ప్రస్తుతం ఎలాంటి విచారణ లేకుండా జైలులో మగ్గుతున్నారు. ఆయనను విడుదల చేయాలంటూ ప్రజలు డిమాండ్ చేస్తున్నా పాలకులు లెక్కచేయడం లేదు. ఎన్నో అవరోధాలు, బెదిరింపులు ఎదురైనా వెనక్కి తగ్గకుండా నమ్మిన సిద్ధాంతానికి బియాల్యాస్కీ కట్టుబడి ఉండడం విశేషం. సైనిక చర్యలకు వ్యతిరేకంగా పోరాటం ‘మెమోరియల్’ సంస్థ 1989 జనవరి 28న అప్పటి సోవియట్ యూనియన్ చివరిదశలో ఉన్న సమయంలో ఏర్పాటైంది. ప్రధానంగా ఇది న్యాయ సేవా సంస్థ. కమ్యూనిస్టు పాలకుల అణచివేత చర్యల వల్ల ఇబ్బందులు పడుతున్నవారికి అండగా నిలిచింది. రష్యాలో మానవ హక్కుల విధ్వంసంపై, రాజకీయ ఖైదీల స్థితిగతులపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తోంది. సైనిక చర్యలకు వ్యతిరేకంగా పోరాడుతోంది. ‘మెమోరియల్’ ప్రధాన కార్యాలయం రష్యా రాజధాని మాస్కోలో ఉంది. సంస్థ బోర్డు చైర్మన్గా యాన్ రచిన్స్కీ వ్యవహరిస్తున్నారు. ఉక్రెయిన్పై యుద్ధం నేపథ్యంలో ఈ సంస్థను ఈ ఏడాది ఏప్రిల్ 5న రష్యా ప్రభుత్వం మూసివేసింది. అయినప్పటికీ ‘మెమోరియల్’ కార్యకలాపాలు అనధికారికంగా కొనసాగుతూనే ఉండటం విశేషం. -
రష్యా, బెలారస్ ప్లేయర్లపై నిషేధం అన్యాయం.. నదాల్, జకో, ముర్రే
ఉక్రెయిన్పై రష్యా దాడులను వ్యతిరేకిస్తూ వింబుల్డన్ నిర్వాహకులు తీసుకున్న నిర్ణయంపై స్టార్ టెన్నిస్ ప్లేయర్లు రఫెల్ నదాల్, నొవాక్ జకోవిచ్, ఆండీ ముర్రే స్పందించారు. రష్యా, బెలారస్ ఆటగాళ్లను వింబుల్డన్లో పాల్గొనకుండా నిషేధించడాన్ని వారు తప్పుబట్టారు. ఈ నిషేధం అన్యాయమని, ఆల్ ఇంగ్లండ్ క్లబ్ తీసుకున్న ఈ కఠినమైన నిర్ణయం వల్ల చాలా మంది ప్రతిభావంతులైన ఆటగాళ్లు నష్టపోతారని అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయాన్ని ఏటీపీ (అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్), డబ్ల్యూటీఏ (వుమెన్స్ టెన్నిస్ అసోసియేషన్) కూడా ఖండించింది. కాగా, రష్యా.. బెలారస్ సరిహద్దుల నుంచి ఉక్రెయిన్పై దాడుల చేస్తున్నందుకు గాను ఆ రెండు దేశాల ప్లేయర్లపై ఆల్ ఇంగ్లండ్ క్లబ్ నిషేధం విధించింది. వింబుల్డన్ నిర్వాహకులు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల వరల్డ్ నంబర్ టూ ర్యాంకర్ డేనిల్ మెద్వెదెవ్, గతేడాది వుమెన్స్ సెమీ ఫైనలిస్ట్ (వింబుల్డన్ ), బెలారస్ క్రీడాకారిణి అరీనా సబలెంకా వంటి చాలామంది ప్రతిభావంతులైన క్రీడాకారులు వింబుల్డన్కు దూరం కానున్నారు. వింబుల్డన్ టోర్నీ ఈ ఏడాది జూన్ 27నుండి జూలై 10 వరకు జరగనుంది. చదవండి: Andre Russell: ఆఖరి ఐదు మ్యాచ్ల్లో మా తడాఖా ఏంటో చూపిస్తాం.. -
ఉక్రెయిన్ తిప్పికొడుతోంది
కీవ్: ఉక్రెయిన్పై నెలకు పైగా సాగిస్తున్న యుద్ధంలో రష్యా సేనలు క్రమంగా వెనకడుగు వేస్తున్న సూచనలు కన్పిస్తున్నాయి. రష్యా సైన్యం ఆక్రమించిన చాలా పట్టణాలు, గ్రామాలను ఉక్రెయిన్ దళాలు తిరిగి స్వాధీనం చేసుకుంటున్నాయి. కీవ్, చెర్నిహివ్ ప్రాంతాల్లో, ఇతర చోట్ల కనీసం 30కి పైగా సెటిల్మెంట్లను ఇప్పటికే విముక్తం చేసినట్టు ఉక్రెయిన్ సైన్యం ప్రకటించింది. కీవ్, పరిసర ప్రాంతాల నుంచి రష్యా దళాలు భారీ స్థాయిలో వెనక్కు వెళ్లడం శనివారం కూడా కొనసాగింది. 700కు పైగా సాయుధ వాహనాలు కీవ్ నుంచి బెలారస్ దిశగా వెనుదిరుగుతూ కన్పించాయి. అయితే అవి వెనక్కు వెళ్లడం లేదని, తూర్పున డోన్బాస్పై భారీ దాడి కోసమే బయల్దేరుతున్నాయని ఉక్రెయిన్, పశ్చిమ దేశాలు అనుమానిస్తున్నాయి. పైగా రష్యా దళాలు వెనక్కు వెళ్తూ వీలైన చోటల్లా మందుపాతరలు అమర్చాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు. ఉక్రెయిన్కు మరో 30 కోట్ల డాలర్ల విలువైన ఆయుధాలను అందజేయనున్నట్టు అమెరికా ప్రకటించింది. వీటిలో లేజర్ గైడెడ్రాకెట్ సిస్టమ్స్, మానవరహిత విమానాలు, నైట్ విజన్ పరికరాలు, సాయుధ వాహనాలు తదితరాలుంటాయని పేర్కొంది. మరోవైపు శుక్రవారం రష్యా, ఉక్రెయిన్ బృందాల మధ్య జరిగిన వీడియో కాన్ఫరెన్స్ చర్చలు ఏ మేరకు పురోగతి సాధించిందీ తెలియరాలేదు. కానీ ఉక్రెయిన్ తమ దేశంపై దాడులు చేస్తోందన్న వార్తలు చర్చలకు ఆటంకం కలిగిస్తాయని పుతిన్ అధికార ప్రతినిధి ద్మత్రీ పెస్కోవ్ అన్నారు. కీవ్ను సందర్శించాలని ఆలోచిస్తున్నట్టు పోప్ ఫ్రాన్సిస్ తెలిపారు. ఇక మారియుపోల్ సహా పలు నగరాల్లో రష్యా విధ్వంసకాండ కొనసాగుతూనే ఉంది. యువకులను ఏడాది పాటు సైనిక విధుల్లోకి తీసుకునే వార్షిక కార్యక్రమానికి రష్యా శుక్రవారం శ్రీకారం చుట్టింది. లక్షన్నర మందిని రిక్రూట్ చేసుకోవాలన్నది లక్ష్యమని చెప్తున్నారు. రష్యాకు ఆయుధాల కొరత రష్యా వద్ద పలు కీలక ఆయుధాలు దాదాపుగా నిండుకున్నాయని ఇంగ్లండ్ రక్షణ వర్గాలు చెబుతున్నాయి. వాటిని ఇప్పుడప్పుడే భర్తీ చేసుకునే అవకాశాలు కూడా లేవంటున్నాయి. హెలికాప్టర్లు, ఫైటర్ జెట్లు, క్రూయిజ్ మిసైళ్ల కొరత రష్యాను తీవ్రంగా వేధిస్తున్నట్టు చెప్పాయి. పలు కీలక విడి భాగాలను ఉక్రెయిన్ నుంచే రష్యా దిగుమతి చేసుకుంటోందని సమాచారం. 2014 క్రిమియా యుద్ధానంతరం రష్యాకు ఆయుధాల ఎగుమతిని ఉక్రెయిన్ బాగా తగ్గించింది. యుద్ధ నేపథ్యంలో నెలకు పైగా అవి పూర్తిగా ఆగిపోయాయి. ఇంగ్లండ్ స్టార్స్ట్రీక్ మిసైల్తో రష్యా హెలికాప్టర్ కూల్చివేత ఇంగ్లండ్లో తయారైన స్టార్స్ట్రీక్ మిసైల్ సాయంతో రష్యా ఎంఐ–28ఎన్ హెలికాప్టర్ను లుహాన్స్క్ ప్రాంతంలో ఉక్రెయిన్ కూల్చేసింది. మిసైల్ ఢీకొట్టడంతో హెలికాప్టర్ రెండు ముక్కలై నేలకూలిన వీడియో వైరల్గా మారింది. ధ్వని కంటే మూడు రెట్ల వేగంతో దూసుకెళ్లే ఈ లేజర్ గైడెడ్ మిసైల్ సిస్టమ్ తక్కువ ఎత్తులో వెళ్లే హెలికాప్టర్లను 100 శాతం కచ్చితత్వంతో నేలకూలుస్తుంది. పైగా ఇది చాలా తేలిగ్గా ఉంటుంది గనుక ఎక్కడికైనా సులువుగా మోసుకెళ్లవచ్చు. భుజం మీది నుంచి కూడా ప్రయోగించవచ్చు. స్టార్స్ట్రీక్ ప్రయోగంపై రష్యా మండిపడింది. ఇకపై ఇంగ్లండ్ ఆయుధ సరఫరాల నౌకలు, వాహనాలను లక్ష్యం చేసుకుని దాడులకు దిగుతామని హెచ్చరించింది. -
యుద్ధంలో ట్విస్ట్.. జోష్లో జెలెన్ స్కీ.. పుతిన్కి బిగ్ షాక్
కీవ్: ఉక్రెయిన్లో రష్యాలు దాడులు కొనసాగుతున్నాయి. గత నెల రోజులుగా బాంబు దాడులతో ఉక్రెయిన్లోని నగరాలన్నీ పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీంతో ఉక్రెయిన్కు భారీ నష్టం జరిగింది. రష్యా దాడుల కారణంగా ఇప్పటికే పలు దేశాలు ఉక్రెయిన్కు ఆయుధాలు, రక్షణ సామాగ్రిని అందిస్తున్నాయి. మరోవైపు యుద్ధం జరుగుతున్న వేళ తమ దేశం తరఫున పోరాడేందుకు వాలంటీర్లు రావాలని అభ్యర్థించారు. దీంతో ఇప్పటికే పలు దేశాల నుంచి యువకులు పెద్ద సంఖ్యలో ఉక్రెయిన్ ఆర్మీతో కలిసి రష్యా బలగాలపై పోరాడుతున్నారు. భారత్ తరఫున తమిళనాడుకు చెందిన సైనికేశ్ రవిచంద్రన్ కూడా ఉక్రెయిన్ ఆర్మీలో చేరిన విషయం తెలిసిందే. తాజాగా రష్యా బలగాల దాడులను తిప్పికొట్టేందుకు బెలారస్కు చెందిన ఔత్సాహిక ఫైటర్లు ఉక్రెయిన్ సైన్యంలో చేరారు. దీనికి సంబంధించిన ఒక వీడియోను కీవ్ ఇండిపెండెంట్ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. బెలారసియన్ 19వ శతాబ్దపు రచయిత, విప్లవకారుడు కస్టస్ కలినౌస్కి పేరుతో ఏర్పడిన బెలారసియన్ వాలంటీర్ బెటాలియన్ సభ్యులు ఉక్రెయిన్ సైన్యంతో భాగమైనట్లుగా ప్రమాణం చేసినట్లు ఈ వీడియోలో ఉన్నది. ఈ సందర్భంగా మారు మాట్లాడుతూ.. స్వతంత్ర ఉక్రెయిన్ కోసం తాము పోరాడతామని.. ఎందుకంటే ఉక్రెయిన్ స్వతంత్రంగా లేకపోతే భవిష్యత్లో బెలారస్ కూడా స్వతంత్రంగా ఉండదని ఈ గ్రూప్కు నాయకత్వం వహించిన పావెల్ కులజంకా స్పష్టం చేశారు. మరోవైపు.. బెలారస్ నుంచే రష్యా బలగాలు దాడులు ప్రారంభించిన విషయం తెలిసిందే. బెలారస్ను 28 ఏండ్లుగా పరిపాలిస్తున్న అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో ఉక్రెయిన్పై యుద్ధంలో రష్యాకు సహకరిస్తున్నారు. దీంతో రష్యన్ బలగాలు ఉత్తర బెలారస్ సరిహద్దు మీదుగా ఉక్రెయిన్లోకి ప్రవేశించి బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బెలారసియన్ వాలంటీర్ బెటాలియన్ సభ్యులు.. బెలారసియన్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో మాదిరిగా కాకుండా ఉక్రెయిన్కు తాము మద్దతుగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. ⚡️Belarusian Volunteer Battalion officially joins Ukraine’s military. The members of the battalion named after Kastus Kalinouski, Belarusian 19th century writer and revolutionary, took oath and became part of Ukraine’s Armed Forces. pic.twitter.com/XyrtX0owPn — The Kyiv Independent (@KyivIndependent) March 26, 2022 -
ఉక్రెయిన్పై యుద్ధం.. ఇక రష్యాను తిట్టేయొచ్చు!
ఉక్రెయిన్పై ఆక్రమణకుగానూ రష్యాపై కోపంతో రగిలిపోతున్నారు కొందరు. అయితే వాళ్ల తమ ఆక్రోశాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకోవడానికి కొన్ని అభ్యంతరాలు అడ్డం పడుతున్నాయి. విద్వేషపూరిత కామెంట్లు, హింసాత్మక సందేశాలు, ఉల్లంఘనల పేరిట.. అలాంటి పోస్టులకు అనుమతి ఇవ్వడం లేదు. ఈ తరుణంలో ఫేస్బుక్ కాస్త ఊరట ఇచ్చింది. ఉక్రెయిన్ ఆక్రమణ విషయంలో రష్యాకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టేందుకు ‘తాత్కాలిక’ అనుమతులు మంజూరు చేసింది ఫేస్బుక్. ఫేస్బుక్తో పాటు ఇన్స్టాగ్రామ్ యూజర్లు కూడా ఈ పరిణామాలకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టొచ్చని గురువారం ప్రకటించింది మెటా సంస్థ. రష్యన్ 'ఆక్రమణదారుల'పై హింసాత్మక ప్రసంగాన్ని అనుమతించే పోస్ట్లను ఫేస్బుక్ తాత్కాలికంగా అనుమతిస్తోంది అంటూ మెటా గురువారం సాయంత్రం ఒక నోట్ రిలీజ్ చేసింది. అయితే ఇదంతా రాజకీయపరంగానే, అదీ పరిధిలోకి లోబడే ఉండాలట!. దురాక్రమణకు మూలకారకులు, ఆయా దేశాల అధ్యక్షులను(రష్యా, బెలారస్ అధ్యక్షులను ఉద్దేశించి పరోక్షంగా..) సంబంధించి కామెంట్లను అనుమతిస్తాం. ఒకవేళ అవి ఫేస్బుక్ సాధారణ ఉల్లంఘనలను దాటినా చర్యలు తీసుకుంటాం. కానీ, సాధారణ పౌరులు, సైనికులను ఉద్దేశించి హింసాత్మక పోస్టులు పెడితే మాత్రం ఎట్టిపరిస్థితుల్లో అనుమతించం అని స్పష్టం చేసింది మెటా. ఈ తాత్కాలిక పాలసీలను అర్మేనియా, అజెర్బైజాన్, ఎస్టోనియా, జార్జియా, హంగేరీ, లాత్వియా, లిథువేనియా, పోల్యాండ్, రొమేనియా, రష్యా, స్లోవేకియా, ఉక్రెయిన్లకు వర్తింపజేస్తున్నట్లు ప్రకటించింది. ఇదిలా ఉండగా.. రష్యా తమ దేశంలో ఫేస్బుక్పై తాత్కాలిక నిషేధం విధించినా, యూజర్లు మాత్రం ప్రత్యామ్నాయ మార్గాల్లో ఆ ప్లాట్ఫామ్ను వినియోగించుకుంటున్నారు. అయితే రష్యా, ఉక్రెయిన్ మరియు పోల్యాండ్తో సహా పలు దేశాల్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ ఆక్రమణలో రష్యాకు అండగా ఉంటున్న బెలారస్ ప్రెసిడెంట్ అలెగ్జాండర్ లుకాషెంకో చావుకు సంబంధించి కొన్ని పోస్ట్లను కూడా ఫేస్బుక్ తాత్కాలికంగా అనుమతులు ఇవ్వడం గమనార్హం. చదవండి: నూతన చట్టంతో ఉక్కుపాదం మోపిన రష్యా -
ఉక్రెయిన్ వార్: విమానాలు నిలిపేసిన ఏరోఫ్లోట్
న్యూయార్క్: రష్యాకు చెందిన దిగ్గజ విమానయాన సంస్థ ఏరోఫ్లోట్ అన్ని రకాల అంతర్జాతీయ విమానాలను ఈ నెల 8నుంచి నిలిపివేస్తున్నట్లు శనివారం ప్రకటించింది. బెలారస్కు మాత్రం తమ విమానాల రాకపోకలు సాగుతాయని తెలిపింది. విదేశీ విమానాలను అద్దెకు తీసుకునే రష్యా వైమానిక సంస్థలు ప్రయాణికుల, సరుకుల రవాణాను కొన్నాళ్లు నిలిపివేయాలని ఇటీవలే రష్యా విమానయాన నియంత్రణా సంస్థ రోసావైట్సియా సూచించింది. రష్యాపై ఆంక్షలు విధించడంతో లీజుకిచ్చిన విదేశీ విమానాలను వెనక్కు స్వాధీనం చేసుకునే అవకాశాలున్నాయని తెలిపింది. ఇందుకనుగుణంగానే ఏరోఫ్లోట్ తాజా నిర్ణయాన్ని ప్రకటించింది. ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్నవారికి నగదు రిఫండ్ చేస్తామని కంపెనీ తెలిపింది. ఇప్పటికే రష్యాకు చెందిన ఎస్7 సంస్థ అంతర్జాతీయ విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. -
యుద్ధం ఎఫెక్ట్.. రష్యా, బెలారస్కు ఊహించని షాక్
వాషింగ్టన్: ఉక్రెయిన్పై రష్యా సైనిక దాడులను కొనసాగిస్తోంది. రష్యా దళాలు ఉక్రెయిన్పై బాంబులు, క్షిపణులతో విరుచుకుపడుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ పరిస్థితులు భయానకంగా మారాయి. దీంతో రష్యా చర్యలపై ప్రపంచ దేశాలు పుతిన్పై ఆంక్షలు విధిస్తున్నాయి. ఇప్పటికే రష్యాపై యూరోపియన్ యూనియన్ సహా పలు దేశాలు ఆర్థిక ఆంక్షలను విధించాయి. యుద్ధంలో రష్యాకు బెలారస్ సాయం అందిస్తున్న కారణంగా ఆ దేశంపై కూడా ఆంక్షలు కొనసాగుతున్నాయి. తాజాగా రష్యా, బెలారస్ దేశాల్లో తాము అమలు చేస్తున్న అన్ని కార్యక్రమాలను తక్షణమే నిలిపివేస్తున్నట్లు ప్రపంచబ్యాంక్ తెలిపింది. 2014 నుంచి రష్యాకు ప్రపంచబ్యాంకు ఎలాంటి కొత్త లోన్లు ఇవ్వలేదు. పెట్టుబడులు పెట్టలేదు. అలాగే, బెలారస్కు 2020 నుంచి కొత్తగా రుణాలివ్వలేదు’ అని ఒక ప్రకటనలో పేర్కొంది. రష్యా ఉక్రెయిన్లోని క్రిమియాను 2014లో ఆక్రమించుకోగా, 2020లో జరిగిన బెలారస్ అధ్యక్ష ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ప్రపంచ దేశాలు ఆరోపిస్తున్నాయి. అమెరికా సైతం రష్యాపై భారీ ఆంక్షలను విధించింది. ఉక్రెయిన్పై సైనిక దాడులకు దిగిన రష్యా భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని జో బైడెన్ వార్నింగ్ ఇచ్చారు. రష్యా, పుతిన్పై రానున్న కాలంలో యుద్ద ప్రభావం తీవ్రంగా ఉంటుందని తెలిపారు. ఉక్రెయిన్పై జరుగుతున్న యుద్ధంలో పుతిన్ గెలిచినా, ఓడినా.. ఆర్థిక పరంగా, ఇతర అంశాల విషయంలో రష్యా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. పుతిన్ ఓ నియంత.. అతడి అంతు చూస్తామంటూ బెడెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్కు చెందిన విలాసవంతమైన అపార్ట్మెంట్లు, ప్రైవేట్ ఎయిర్ క్రాఫ్ట్లను సీజ్ చేస్తున్నామని వెల్లడించారు. -
ఉక్రెయిన్, రష్యా మధ్య రెండో దశ చర్చలు.. ఎజెండాలోని అంశాలు ఇవే!
ఉక్రెయిన్పై రష్యా యుద్ధం మొదలుపెట్టి ఇప్పటికే ఎనిమిది రోజులు గడుస్తోంది. దీని వల్ల ఉక్రెయిన్ భారీగా నష్టపోయింది. అంతేకాకుండా యుద్ధ ప్రభావం రష్యా మీద కూడా ప్రతికూలంగానే ఉంది. సమస్య పరిష్కారం దిశగా వెళ్లాలని ప్రపంచ దేశాలు ఈ ఇరు దేశాలకు చెప్తున్నాయి. అయితే ఎవరివాదన వారిదేనన్నట్లు ఉంది రష్యా ఉక్రెయిన్ తీరు. ఎట్టికేలకు ఉక్రెయిన్, రష్యా మధ్య రెండో దశ చర్చలు బెలారస్- పోలాండ్ మధ్య చర్చలు జరిగాయి. చర్చలోకి వచ్చిన ఎజెండాలోని అంశాలు ఇవే 1. వెంటనే కాల్పుల విరమణ 2.యుద్ధ విరమణ 3. పౌరులు సరిహద్దులు దాటేందుకు వీలుగా చర్యలు చర్చలు చర్చలే.. దాడులు దాడులేనని అంతవరకు పరిస్థితిలో ఏ మార్పు రాదని రష్యా చెప్తోంది. మా డిమాండ్లను ఇంతకు ముందే చెప్పం.. అది ఒప్పుకుంటేనే యుద్ధం ఆగుతుందని రష్యా స్పష్టం చేసింది. దోనాస్క్ ల్యూనిస్క్లను వదిలేయాలని ఉక్రెయిన్ అంటోంది. ప్రస్తుతం ఈ రెండో విడత చర్చల కోసం ఉక్రెయిన్ ప్రతినిధులు బెలారస్కు బయలుదేరారు. కాగా ఫిబ్రవరి 28న బెలారస్లో రష్యా ఉక్రెయిన్ల మధ్య సుమారు 4 గంటల చర్చలు జరిగాయి. అయితే, ఇరు వర్గాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన కారణంగా చర్చలు విఫలమైయ్యాయి. ప్రస్తుతం గురువారం జరగబోయే చర్చలైనా సఫలం అవ్వాలని ఇరదేశాల ప్రజలతో పాటు ప్రపంచ దేశాలు కోరుకుంటున్నాయి. -
రష్యాకు మరో షాక్.. పుతిన్ అహంకారానికి అథ్లెట్లు బలి
Russian and Belarus Athletes Banned From Winter Paralympics: ఉక్రెయిన్పై దాడుల నేపథ్యంలో రష్యాపై యావత్ క్రీడా జగత్తు కన్నెర్ర చేస్తుంది. ఇప్పటికే ఆ దేశంపై ప్రముఖ ఫుట్బాల్ సంస్థలు ఫిఫా, UEFA బ్యాన్ విధించగా.. తాజాగా వింటర్ పారాలింపిక్ కమిటీ కత్తి దూసింది. 2022 వింటర్ పారాలింపిక్స్లో రష్యాతో పాటు బెలారస్ అథ్లెట్లు పాల్గొనకుండా అంతర్జాతీయ పారాలింపిక్ కమిటీ నిషేధం విధించింది. అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిళ్ల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు పారాలింపిక్ కమిటీ అధ్యక్షుడు ఆండ్రూ పార్సన్స్ తెలిపారు. రాజకీయాలతో క్రీడలకు ఎటువంటి సంబంధం లేనప్పటికీ, అనివార్య కారణాల వల్ల రష్యా, బెలారస్ పారా అథ్లెట్లను బహిష్కరించాల్సి వచ్చిందని ఆయన అన్నారు. ఇలా జరిగినందుకు చింతిస్తున్నామని పేర్కొన్నారు. ఆయా దేశ ప్రభుత్వాల చర్యలకు, ముఖ్యంగా పుతిన్ అహంకారానికి పారా అథ్లెట్లు బలైపోయారని వాపోయారు. కాగా, రేపటి (మార్చి 4) నుంచి బీజింగ్లో వింటర్ పారాలింపిక్స్ పోటీలు ప్రారంభంకానున్నాయి. ఈ పోటీల్లో రష్యా నుంచి 71 మంది, బెలారస్ నుంచి 12 మంది పారా అథ్లెట్లు పాల్గొనాల్సి ఉండింది. చదవండి: రష్యా అధ్యక్షుడికి వరుస షాక్లు.. తైక్వాండో బ్లాక్ బెల్ట్ కూడా తొలగింపు -
ఉక్రెయిన్-రష్యా యుద్ధం: ఫ్రాన్స్ అధ్యక్షుడికి పుతిన్ ఫోన్!
Ukraine Crisis Live Updates: ఉక్రెయిన్పై రష్యా బలగాలు పెను విధ్వంసానికి దిగాయి. రెండు రోజులుగా గ్యాప్ లేకుండా విరుచుకుపడుతున్నాయి. ఎనిమిదవ రోజు సైతం విధ్వంసకాండ కొనసాగుతుండగా.. బెలారస్ బ్రెస్ట్ ప్రాంతంలో చర్చలు జరిగే అవకాశాలున్నట్లు సమాచారం. రష్యా తరపున సైనికులు, ఉక్రెయిన్ తరపున సైనికులతో పాటు సాధారణ పౌరులు కూడా భారీ సంఖ్యలో మృత్యువాత పడుతున్నారు. ప్రధాన పట్టణాలపై ఫోకస్ చేసిన రష్యన్ బలగాలు ఖార్కీవ్ను పూర్తిగా స్వాధీనం చేసుకున్నాయి. మరోవైపు యుద్ధంతో ఏడు లక్షల మంది దేశం విడిచి పారిపోతుండగా.. వాళ్లకు ఆశ్రయం ఇచ్చేందుకు చాలా దేశాలు విముఖత వ్యక్తం చేస్తున్నాయి. ►ఫ్రాన్స్ అధ్యక్షుడికి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోన్ ఫ్రాన్స్ అధ్యక్షుడికి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోన్ చేశారు. ఉక్రెయిన్లో పరిస్థితి మరింత దారుణంగా మారిందని పుతిన్తో మాట్లాడిన తర్వాత ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ అర్థమైందని ఆయన అన్నారు. సుమారు వారు 90 నిమిషాలు మాట్లాడారు. ►ఎట్టికేలకు ఉక్రెయిన్, రష్యా మధ్య రెండో దశ చర్చలు బెలారస్- పోలాండ్ మధ్య చర్చలు జరిగాయి. చర్చలోకి వచ్చిన ఎజెండాలోని అంశాలు ఇవే 1. వెంటనే కాల్పుల విరమణ 2.యుద్ధ విరమణ 3. పౌరులు సరిహద్దులు దాటేందుకు వీలుగా చర్యలు ►మరో సారి ఉక్రెయిన్ రష్యా మధ్య చర్చలు.. మరో రెండు గంటల్లో ఉక్రెయిన్, రష్యా మధ్య చర్చలు జరగనున్నట్లు స్థానిక మీడియా తెలిపింది. చర్చలు చర్చలే.. దాడులు దాడులేనని అంతవరకు పరిస్థితిలో ఏ మార్పు రాదని రష్యా చెప్తోంది. మా డిమాండ్లను ఇంతకు ముందే చెప్పం.. అది ఒప్పుకుంటేనే యుద్ధం ఆగుతుందని రష్యా స్పష్టం చేసింది. దోనాస్క్ ల్యూనిస్క్లను వదిలేయాలని ఉక్రెయిన్ అంటోంది. ►యుద్ధం తర్వాత ఉక్రెయిన్ను పునర్నిర్మిస్తామని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ప్రతిజ్ఞ చేశారు. ఉక్రెయిన్కు వ్యతిరేకంగా రష్యా చేసిన ప్రతిదానికీ రష్యా తిరిగి చెల్లించేలా మా చర్యలు ఉండబోతున్నాయని తెలిపారు జెలెన్స్కీ. ►రష్యా యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రష్యన్ మేజర్ జనరల్ హతమైనట్లు వెల్లడించిన నెక్స్టా మీడియా ►రష్యాకు మరో గట్టి షాకిచ్చిన ఉక్రెయిన్ సైనికులు ప్రపంచంలోనే అత్యంత శక్తి సామర్ద్యాలు కలిగిన యుద్ధ విమానం సుఖోయ్ (ఎస్యూ-30 ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్) రష్యా సైనిక పటాలంలో శత్రు దేశాలను ఇట్టే భయపెట్టే ఎయిర్ క్రాఫ్ట్. అయితే చిన్న దేశమైనప్పటికీ ఉక్రెయిన్.. తన గగన తలం మీదకు వచ్చిన రష్యా సుఖోయ్ విమానాన్ని ఒక్క దెబ్బకు కూల్చేసింది. ఈ మేరకు ఉక్రెయిన్ సైనిక బలగాల కమాండర్ ఇన్ ఛీప్ లెఫ్ట్ నెంట్ జనరల్ వాలేరీ జాలుజ్నియి కాసేపటి క్రితం ఓ ప్రకటన విడుదల చేశారు. ► ఉక్రెయిన్కు 2,700 యాంటీ ఎయిర్ మిస్సైల్స్ అందించనున్న జర్మనీ. ► ఖార్కీవ్లో పవర్ కట్. అంధకారంలోనూ ఆగని విధ్వంసం. ► ఉక్రెయిన్ ప్రధాన నగర దాడుల్లో రష్యా దళాలకు, ఉక్రెయిన్ రెబల్స్ చేతులు కలిపారు. ► ఉక్రెయిన్పై రష్యా దాడులను తీవ్రతరం చేసింది. ఉక్రెయిన్ దళాలు రష్యా బలగాలను ఎదుర్కొవడంలో ఇబ్బంది పడుతున్నాయి. ఈ ఉదయం నుంచి రష్యా బలగాలదే స్పష్టమైన పైచేయిగా కనిపిస్తోంది. ► స్కూళ్లు, మెట్రో స్టేషన్లే లక్ష్యంగా.. ప్రభుత్వ ఆస్తులు, కార్యాలయాలనే లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపిన రష్యా.. ఇప్పుడు పూర్తిగా పౌరులనే లక్ష్యంగా చేసుకుని విరుచుకుపడుతోంది. రష్యా దాడులు తీవ్రతరం చేసి ఆసుపత్రులు, పాఠశాలలు, భవనాలపై కూడా దాడులు జరుపుతుండడం కలకలం రేపుతోంది. మరోవైపు మెట్రో స్టేషన్లు అక్కడ అండర్ గ్రౌండ్ బంకర్లుగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆశ్రయం పొందుతున్న వాళ్లను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుపుతోంది రష్యా. ► గురువారం ఉదయం.. కీవ్లోని మెట్రో స్టేషన్ సమీపంలో భారీ పేలుళ్లు సంభవించాయి. డ్రుబీ నరోదివ్ మెట్రో స్టేషన్ పేలుళ్లు సంభవించడంతో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించింది. కీవ్ నగరంలోని ఇతర ప్రాంతాల్లోనూ రష్యా బాంబుల వర్షం కురిపిస్తోంది. ఉక్రెయిన్లోని ప్రధాన నగరాలకు స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా రష్యా దాడులు కొనసాగిస్తోంది. ఇప్పటికే ఖేర్సన్ నగరాన్ని తమ అధీనంలోకి తెచ్చుకుంది. ► ఒబ్లాస్ట్, లవీవ్, మైకొలివ్, చెర్నిహివ్, తదితర ప్రాంతాల్లో రష్యా వైమానిక దాడులకు సిద్ధమైంది. తమపై విధించిన ఆంక్షలను ఎదుర్కొనేందుకు కూడా సిద్ధమని రష్యా ఇప్పటికే ప్రకటించింది. (మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ► రష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్లో వలసలు పెరిగాయని ఐక్యరాజ్య సమితి శరణార్థుల విభాగం తెలిపింది. నిన్నటి వరకు 7 లక్షలుగా భావించిన వలసదారుల సంఖ్యను.. ఇప్పుడు 10 లక్షలుగా ఒక నివేదికలో పేర్కొంది. మరోవైపు యూఏఈ సహా పలు దేశాలు ఉక్రెయిన్ వలసదారులకు ఆశ్రయాన్ని నిరాకరిస్తున్నాయి. ► ఇతర దేశాల జోక్యం పెరిగితే ఉక్రెయిన్తో యుద్ధంలో అణ్వస్త్రాలను వాడడానికి కూడా రష్యా వెనకాడబోదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే అణుయుద్ధం విషయంలో దేశ బలగాలను రష్యా అప్రమత్తం చేసిన విషయం తెలిసిందే. రష్యా వద్ద 5,997 అణు వార్హెడ్లు ఉన్నాయని ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్స్ తెలిపింది. ► రష్యా దాడులు తీవ్రతరం చేసిన నేపథ్యంలో ఉక్రెయిన్ నుంచి బయటపడడానికి విదేశీయులు నానా కష్టాలు పడుతున్నారు. పొరుగు దేశాలకు చేరుకునే క్రమంలో చాలా మందికి ఆహారం అందట్లేదు. జనావాసాలపై కూడా రష్యా దాడులు జరుపుతుండడంతో ఉక్రెయిన్ ప్రజలు తీవ్ర భయాందోళనల్లో ఉన్నారు. ► రష్యా ఆరోపణలు.. ఖండించిన భారత్ భారత విద్యార్థులను అడ్డుగా పెట్టుకుని ఉక్రెయిన్ తమతో పోరాడుతోందని రష్యా ఆరోపణలకు దిగింది. ఖార్కివ్ నుంచి భారతీయ విద్యార్థులను తరలించడానికి రష్యా ప్రయత్నిస్తుండగా.. ఉక్రెయిన్ బలగాలు భారతీయులను బందీలుగా పట్టుకున్నాయని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఉక్రెయిన్ నుంచి బెల్గ్రేడ్కు వెళ్లాలనుకునే భారతీయ విద్యార్థులను ఖార్కివ్లో ఉక్రెనియన్ అధికారులు బలవంతంగా నిర్బంధిస్తున్నారంటూ మేజర్ జనరల్ ఇగోర్ కోనాషెంకోవ్ ప్రకటించారు. భారత పౌరులను సురక్షితంగా తరలించడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకోవడానికి సాయుధ దళాలు సిద్ధంగా ఉన్నాయంటూ స్పష్టంచేశారు. కాగా.. ఈ ఆరోపణలపై ఉక్రెయిన్ స్పందించింది. భారత్, పాకిస్థాన్, చైనా విద్యార్థులను రష్యా బందీలుగా మార్చిందని ఉక్రెయిన్ పేర్కొంది. రష్యా ఆరోపణల అనంతరం ఉక్రెయిన్ విదేశాంగశాఖ ఈ ప్రకటన చేసింది. భారతదేశం, పాకిస్తాన్, చైనా ఇతర దేశాల విద్యార్థులు రష్యన్ సాయుధ దురాక్రమణకు బందీలుగా మారారంటూ ఆరోపించింది. ఈ పరస్పర ఆరోపణల నేపథ్యంలో భారత ప్రభుత్వం స్పందించింది. భారత విద్యార్థులను బందీలుగా తీసుకున్న విషయమేదీ తమ దృష్టికి రాలేదని ప్రకటించింది. రష్యా ఉక్రెయిన్లు పరస్పరం భారతీయుల విద్యార్థులను బందీలుగా చేసుకున్నారనే ఆరోపణలు చేసుకుంటున్నాయి. కానీ, అలాంటి సమచారం ఏదీ మా దాకా రాలేదు. ఇప్పటివరకైతే అంతా క్షేమంగా ఉన్నారు. వాళ్లను భారత్కు తరలించే ఆపరేషన్ గంగ కొనసాగుతోంది అని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఉక్రెయిన్పై స్పెషల్ ఆపరేషన్లో 498 మంది సైనికులు మృతి: రష్యా రక్షణ శాఖ ► ఉక్రెయిన్పై రష్యా సైనిక దాడులు కొనసాగుతున్నాయి. ఉక్రెయిన్ ప్రధాన నగరాలైన కీవ్, ఖర్వివ్పై రష్యా సైన్యం బాంబుల వర్షం కురిపిస్తోంది. ఉక్రెయిన్పై గత 8 రోజులుగా రష్యా దాడులు చేస్తోంది. జనావాసాలపై రాకెట్లు, క్షిపణులతో విధ్వంసం సృష్టిస్తోంది. మరోవైపు రష్యా అణు జలాంతర్గాములను సిద్ధం చేస్తోంది. బారెంట్స్ జలాల్లోకి అణు జలాంతర్గాములను తరలిస్తోంది. ► ఖెర్సాన్, బెర్డ్యాన్స్ ఓడరేవులను రష్యా స్వాధీనం చేసుకుంది. ఒడెస్సా, మరియూపూల్ స్వాధీనం చేసుకోవడానికి రష్యా సైన్యం యత్నిస్తోంది. ఉక్రెయిన్పై స్పెషల్ ఆపరేషన్లో 498 మంది సైనికులు మృతి చెందినట్లు రష్యా రక్షణ శాఖ వెల్లడించింది. ► ఉక్రెయిన్ కీలక ప్రకటన.. ఉక్రెయిన్ దక్షిణ నగరం ఖేర్సన్ రష్యా బలగాల చేతుల్లోకి వెళ్లిందని ఉక్రెయిన్ అధికారులు ప్రకటించారు. ► ఆపరేషన్ గంగ.. సీ-17 ఎయిర్క్రాఫ్ట్ మూడోది 208 మంది భారతీయులతో పోలాండ్ నుంచి ఢిల్లీ హిందాన్ ఎయిర్బేస్లో ఈ ఉదయం దిగింది. సురక్షితంగా వచ్చిన ప్రయాణికులతో ఎంవోఎస్ డిఫెన్స్ అజయ్ భట్ కాసేపు మాట్లాడారు. I have brought my friend's dog with me from Ukraine. Many people who had dogs left them behind in Ukraine, but I brought back this dog along with me: Zahid, a student rescued from Ukraine, at Hindan airbase pic.twitter.com/bEslfEBI6L — ANI (@ANI) March 3, 2022 ► ఉక్రెయిన్పై రష్యా యుద్ధాన్ని ఐక్యరాజ్యసమితి తీవ్రంగా ఖండించింది. ఉక్రెయిన్ స్వాతంత్య్రాన్ని, సార్వభౌమత్వాన్ని, ఐక్యతను, ప్రాదేశిక సమగ్రతను కాపాడేందుకు కట్టుబడి ఉంటామని పునరుద్ఘాటించింది. భారత కాలమానం ప్రకారం.. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన ఐరాస జనరల్ అసెంబ్లీ 76వ ‘అసాధారణ’ సర్వసభ్య సమావేశం ఈ మేరకు తీర్మానం చేసింది. ► ‘ఉక్రెయిన్పై దాడి’ పేరుతో రూపొందిన తీర్మానానికి మొత్తం 193 సభ్య దేశాల్లో 141 దేశాలు అనుకూలంగా ఓటేశాయి. ఐదు దేశాలు వ్యతిరేకించాయి. ఓటింగ్కు భారత్ దూరంగా ఉంది. దౌత్యం, చర్చలు తప్ప వివాద పరిష్కారానికి మరో మార్గం లేదని ఈ సందర్భంగా అభిప్రాయపడింది. భారత్తో పాటు మొత్తం 35 దేశాలు ఓటింగ్కు దూరంగా ఉన్నాయి. తీర్మానం ఆమోదం పొందిన సందర్భంగా కరతాళ ధ్వనులతో సమావేశ ప్రాంగణం మారుమోగిపోయింది. #UN member states demanded today #Russia to stop its use of force and withdraw immediately from #Ukraine 🇺🇦. Result 141 to 5 demonstrates Putin's unprecedented isolation on the global stage. #StandWithUkraine pic.twitter.com/65ZuVyHrCq — Kaja Kallas (@kajakallas) March 2, 2022 ► అణ్వాయుధ విభాగాన్ని యుద్ధసన్నద్ధం చేయాలన్న రష్యా నిర్ణయాన్ని సమావేశం ఖండించింది. ఆ దేశానికి బెలారస్ మద్దతును కూడా తీవ్రంగా తప్పుబట్టింది. రష్యా తక్షణం యుద్ధాన్ని ఆపాలని, ఉక్రెయిన్ నుంచి తన బలగాలన్నింటినీ బేషరతుగా, సంపూర్ణంగా, తక్షణం ఉపసంహరించాలని డిమాండ్ చేసింది. ► ఉక్రెయిన్లోని వేర్పాటువాద ప్రాంతాలను స్వతంత్ర హోదా ఇస్తూ రష్యా తీసుకున్న నిర్ణయాన్ని కూడా నిరసించింది. చర్చలు, మధ్యవర్తిత్వం ద్వారా వివాదాన్ని తక్షణం శాంతియుతంగా పరిష్కరించుకోవాలని కోరింది. 15 మంది సభ్యుల ఐరాస భద్రతా మండలిలోనూ ఆదివారం ఇలాంటి తీర్మానాన్నే ప్రవేశపెట్టగా రష్యా వీటో చేయడం తెలిసిందే. ► ఈ నేపథ్యంలో జనరల్ అసెంబ్లీ అత్యవసర ప్రత్యేక సమావేశం నిర్వహించింది. కాల్పుల విరమణ తక్షణావసరమని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి టి.ఎస్.తిరుమూర్తి పేర్కొన్నారు. భారతీయులు, ముఖ్యంగా విద్యార్థులు భారీగా ఉక్రెయిన్లో చిక్కుబడ్డారని, ఒకరు కాల్పులకు బలయ్యారని ఆవేదన వెలిబుచ్చారు. Diplomats from #European countries left the hall of the #UN Human Rights Council before Lavrov's speech. Diplomacy in #Russia is dead pic.twitter.com/6UOsICDjU4 — NEXTA (@nexta_tv) March 1, 2022 -
Russia-Ukraine War.. బెలారస్కు బిగ్ షాక్
EU Sanctions On Belarus: ఉక్రెయిన్లో రష్యా బలగాలు రెచ్చిపోతున్నాయి. బాంబులు, క్షిపణులను ప్రయోగిస్తూ బీభత్సం సృష్టిస్తున్నాయి. కాగా, రష్యా దాడులకు ప్రత్యక్షంగా బెలారస్ సపోర్టు అందించిన విషయం తెలిసిందే. బెలారస్ నుంచే రష్యా బలగాలు ఉక్రెయిన్లోకి చోరబడ్డాయి. ఈ నేపథ్యంలో బెలారస్ ఊహించని షాక్ తలిగింది. (ఇది చదవండి: భారత్ అభ్యర్థనకు గ్రీన్సిగ్నల్ ఇచ్చిన రష్యా..) ఉక్రెయిన్పై రష్యా దాడిలో సహాయక పాత్ర పోషించిన కారణంగా బెలారస్పై యూరోపియన్ యూనియన్ ఆంక్షలు విధేంచేందుకు సిద్ధమైంది. ఆంక్షల ఆమోదానికి ఈయూ దౌత్యవేత్తలు అంగీకరించినట్టు ఫ్రెంచ్ ప్రెసెడెన్సీ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా, బెలారస్పై కొన్ని ఆర్థికపరమైన ఆంక్షలతో పాటుగా కలప, ఉక్కు, పోటాషియంపై కూడా ఆంక్షలు విధించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే అమెరికా సైతం బెలారస్లో తమ రాయబార కార్యాలయం కార్యకలాపాలను సస్పెండ్ చేసింది. (ఇది చదవండి: ఆగని మారణహోమం: ‘రష్యాను చావుదెబ్బకొట్టాం.. ఏకంగా 6వేల మందిని..’) మరోవైపు ఉక్రెయిన్-రష్యా ప్రతినిధుల మధ్య సోమవారం మొదటిసారిగా బెలరాస్ వేదికగా శాంతి చర్చలు జరిగిన విషయం తెలిసిందే. ఈ చర్చల్లో రెండు దేశాలు వారి డిమాండ్స్పైనే దృష్టి సారించడంతో చర్చలు ఫలితం లేకుండానే ముగిశాయి. ఈ క్రమంలో రెండు దేశాలు ప్రతినిధులు బుధవారం మరోసారి చర్చలు జరుపనున్నారు. ఈ చర్చలైనా ఫలిస్తాయో లేదోనని ప్రపంచ దేశాలు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నాయి. -
పుతిన్కు సపోర్టా? ఏం తమాషాగా ఉందా?
అంతర్జాతీయ సమాజం నుంచి రష్యాను ఒంటరి చేయడం ద్వారా గట్టిగా బుద్ధి చెప్పాలని పాశ్చాత్య దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఆంక్షల మీద ఆంక్షలు, నిషేధాల మీద నిషేధాలతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఈ తరుణంలో రష్యాకు నేరుగా వార్నింగ్ ఇస్తున్న అమెరికా.. ఇప్పుడు ఏజెంట్గా వ్యవహరిస్తున్న బెలారస్ను కాస్త గట్టిగానే హెచ్చరించింది. ఉక్రెయిన్పై రష్యా చేస్తున్న యుద్ధానికి పరోక్ష సాయం అందిస్తున్న బెలారస్ దేశానికి అమెరికా గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఇది ఇలాగే కొనసాగితే గనుక తీవ్ర పరిణామాలు చవిచూడాల్సి వస్తుందని తెలిపింది.‘‘ఇదేం తమాషా కాదు.. పుతిన్కు మద్ధతు ఇవ్వడం ఏంటి? ఉక్రెయిన్ పై పుతిన్ దురాక్రమణకు అలెగ్జాండర్ లుకషెంకో(బెలారస్ అధ్యక్షుడు) తన మద్దతు ఇలాగే కొనసాగిస్తే బాగోదు. లేదు ఇలాగే ఉంటే గనుక మునుముందు బెలారస్ తీవ్ర పరిణామాలను చవిచూడాల్సి వస్తుంది’’ అంటూ అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైజ్ హెచ్చరికలు జారీ చేశారు. ఉక్రెయిన్ సరిహద్దు దేశమైన బెలారస్.. అణు రహిత హోదా కలిగిన దేశం కూడా. కానీ, తాజా పరిణామాలతో ఈ హోదాను వదిలేసుకుంది. అంతేకాదు ఒకవైపు ఉక్రెయిన్ రష్యా అణ్వాయుధాలను తన భూభాగం నుంచి ఎక్కు పెట్టేందుకు అనుమతిస్తూ.. మరోవైపు చర్చలకు వేదికగా కూడా నిలిచింది. ఒకానొక టైంలో రష్యాకు మద్దతుగా ఉక్రెయిన్ పై బెలారస్ కూడా సైనిక చర్యకు దిగొచ్చని అంచనాలు కూడా ఉన్నాయి. అందుకే బెలారస్ తీరుపై అమెరికా తీవ్ర ఆగ్రహంతో ఉంది. మరోవైపు బెలారస్ అధినేత అలెగ్జాండర్ లుకాషెంకో కూడా తన కార్యనిర్వాహక అధికారాలను గణనీయంగా పెంచుకోగా.. జపాన్ సహా పలు దేశాలు రష్యాకు మద్దతు ఇస్తోందన్న కారణంతోనే యూరోపియన్ దేశం బెలారస్ పైనా ఆంక్షలు మొదలుపెట్టాయి. చదవండి: ఇది చూసైనా పుతిన్ రాతిగుండె కరిగేనా? -
రష్యా, బెలారస్లను వెలివేయండి: ఐఓసీ
లూసానే: అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) రష్యా యుద్ధోన్మాదాన్ని తీవ్రంగా ఖండిస్తోంది. రష్యాతో పాటు ఆ దేశ మిలిటరీ చర్యకు సాయం చేస్తున్న బెలారస్పై అంతర్జాతీయ క్రీడా సమాజం నిషేధం విధించాలని గట్టిగా కోరింది. ‘ఇరు దేశాల్లో ఏ టోర్నీ నిర్వహించకుండా రద్దు చేయాలి. అథ్లెట్లు, అధికారులు ఇతర దేశాల్లో జరిగే ఈవెంట్లలో పాల్గొనకుండా నిషేధించాలి’ అని ఐఓసీ తెలిపింది. పోలాండ్ ఫుట్బాల్ జట్టు ఇదివరకే ప్రపంచకప్ క్వాలిఫయర్స్లో రష్యాతో ఆడేది లేదని తేల్చి చెప్పింది. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య రష్యా, బెలారస్లకు కేటాయించిన బ్యాడ్మింటన్ టోర్నీలన్నీ రద్దు చేసింది. అంతర్జాతీయ అక్వాటిక్స్ సమాఖ్య ఈ ఆగస్టులో రష్యాలో నిర్వహించాల్సిన ప్రపంచ జూనియర్ స్విమ్మింగ్ చాంపియన్షిప్ను రద్దు చేసింది. -
పుతిన్ మూడు డిమాండ్లు.. ఉక్రెయిన్ నో!
కీవ్: ప్రపంచ దేశాలు ఆసక్తిగా, ఆశగా ఎదురు చూస్తున్న రష్యా, ఉక్రెయిన్ చర్చలు సోమవారం అసంపూర్ణంగా ముగిశాయి. ఇరు దేశాల అధికారులు బెలారస్ సరిహద్దులోని గోమెల్లో సమావేశమయ్యారు. చర్చల్లో కీలక నిర్ణయాలేమీ జరగలేదు. మరోమారు సమావేశం కావాలని ఇరుపక్షాలు అంగీకరించాయని రష్యాకు చెందిన స్పుత్నిక్ మీడియా తెలిపింది. తమ దేశంతో పాటు క్రిమియా, డాన్బాస్ ప్రాంతాల నుంచి బలగాలను వెంటనే ఉపసంహరించుకోవాలని రష్యాను ఉక్రెయిన్ డిమాండ్ చేసిందని తెలిపింది. చర్చలు జరుగుతుండగానే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్తో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోన్ చర్చలు జరిపారు. ‘‘క్రిమియాపై రష్యా సార్వభౌమత్వాన్ని గుర్తించాలి. ఉక్రెయిన్ తటస్థ దేశంగా కొనసాగాలి. నాటో సభ్యత్వ డిమాండ్ను శాశ్వతంగా వదులుకోవాలి. అప్పుడే యుద్ధం ఆగుతుంది’’ అని స్పష్టం చేసినట్టు సమాచారం. చర్చలు రెండో దఫా చర్చలు పోలాండ్– బెలారస్ సరిహద్దుల్లో త్వరలో జరిగే అవకాశం ఉందని ఉక్రెయిన్ అధ్యక్ష సలహాదారు మైకోలియో పోడోలక్ చెప్పారు. పుతిన్కు ఆసక్తి లేదా? చర్చల్లో ఉక్రెయిన్ తరఫున రక్షణ మంత్రితో పాటు ఉన్నతాధికారులు పాల్గొనగా రష్యా నుంచి మాత్రం పుతిన్ సాంస్కృతిక సలహాదారుతో పాటు ఇతర అధికారులు వచ్చారు. దీంతో పుతిన్కు ఈ చర్చలపై ఆసక్తి పెద్దగా లేదని నిపుణులు భావిస్తున్నారు. చర్చించుకుందామంటూ తొలుత రష్యా చేసిన ప్రతిపాదించగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తిరస్కరించడం తెలిసిందే. చర్చలకు బయలుదేరడం మొదలు, అవి జరిగి, ఇరుపక్షాలూ వెనుదిరిగే దాకా బెలారస్లో విమానాలు, హెలికాప్టర్లు, క్షిపణలు ఏవీ ఎగరకుండా చూస్తామని అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో హామీ ఇవ్వడంతో గోమెల్లో చర్చలకు జెలెన్స్కీ అంగీకరించారు. తక్షణ పరిష్కారం లభించకున్నా ఉద్రిక్తతలు తగ్గించేందుకు ఈ చర్చలు ఉపయోగపడతాయని దేశాలన్నీ ఆశిస్తున్నాయి. తగ్గిన రష్యా దూకుడు ఉక్రెయిన్ రాజధాని, ఇతర నగరాల్లోకి చొచ్చుకొస్తున్న రష్యా సేనల దూకుడు ఆదివారం కాస్త తగ్గింది. సంఖ్యలో తక్కువగా ఉన్నా, ఉక్రెయిన్ బలగాలు పలు చోట్ల సాధ్యమైనంతమేర రష్యా చొరబాటును అడ్డుకుంటున్నారు. ఉక్రెయిన్ ప్రతిఘటన, అంతర్జాతీయ కఠిన ఆంక్షల నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ‘అణు’ ఘంటికలు మోగించారు. దేశమంతా యుద్ధవాతావరణం నెలకొనడంతో వేలాది ఉక్రెయిన్ కుటుంబాలు పారిపోతున్నాయి. చాలామంది బంకర్లు, బేస్మెంట్లలో తలదాచుకుంటున్నారు. ఇప్పటివరకు యుద్ధంలో ఎంతమంది చనిపోయింది అధికారికంగా తెలియరాలేదు. 102 మంది పౌరులు మరణించారని, వందలాది మంది గాయపడ్డారని ఐరాస తెలిపింది. 352 మంది పౌరులు చనిపోయారని, వీరిలో 16మంది పిల్లలున్నారని జెలెన్స్కీ చెప్పారు. ఉక్రెయిన్కు ఆయుధాల సరఫరాను పాశ్చాత్య దేశాలు కొనసాగించాయి. కర్ఫ్యూ సడలించడంతో సోమవారం కీవ్లో సూపర్మార్కెట్ల వద్ద భారీ క్యూలు కనిపించాయి. సోమవారం నుంచి రష్యాకు తోడుగా బెలారస్ సైతం యుద్ధంలోకి బలగాలను పంపనుందని అమెరికా ఇంటిలిజెన్స్ వర్గాలు తెలిపాయి. రష్యా అనుకున్నదాని కన్నా ఆక్రమణ కష్టంగా, నెమ్మదిగా సాగుతోందని తెలిపాయి. ఉక్రెయిన్కు వెల్లువలా సాయం ఉక్రెయిన్కు సాయంగా స్టింగర్ మిస్సైళ్లను పంపుతామని జర్మనీ, అమెరికా ప్రకటించాయి. ఈయూ సైతం తొలిసారి ఒక దేశానికి ఆయుధాలు, మందుగుండు సరఫరా చేయనుంది. సోమవారం చర్చల కోసం ఈయూ రక్షణ మంత్రులు సమావేశం అవుతున్నారు. ఉక్రెయిన్కు అందే సాయాన్ని అడ్డుకోవడానికి రష్యా మార్గాలు వెతుకుతోంది. నాటో వర్గాలు రెచ్చగొడుతున్నాయంటూ ఆదివారం పుతిన్ చేసిన అణు హెచ్చరికలపై పాశ్చాత్య దేశాలు మండిపడ్డాయి. అవి కేవలం బెదిరింపులేనని భావిస్తున్నాయి. రష్యా ఏం చేస్తుందో.. కీవ్లోని పౌరులు సురక్షిత మార్గంలో నగరం వీడేందుకు అవకాశమిస్తామని రష్యా మిలటరీ ప్రకటించింది. దీంతో ఒక్కసారి నగరం వశమయ్యాక మిగిలిన పౌరులపై రష్యా విరుచుకుపడవచ్చన్న భయాలు పెరిగాయి. ప్రస్తుతం నగర రక్షణకు ముందుకు వస్తున్న ప్రతిఒక్కరికీ ఉక్రెయిన్ అధికారులు ఆయుధాలిస్తున్నారు. ఖార్కివ్తో పాటు చాలా నగరాల్లో రష్యా బలగాలను ఉక్రెయిన్ సేనలు ప్రతిఘటిస్తున్నాయి. దేశంలోని వైమానిక స్థావరాలన్నీ తమ అధీనంలోకి వచ్చాయని సోమవారం రష్యా సైనికులు ప్రకటించారు. దీనిలో నిజానిజాలపై యూఎస్ అనుమానం వ్యక్తం చేసింది. ఎవరేమన్నారు! చర్చలు ఐదు గంటలపాటు సాగాయి. ఉమ్మడి ప్రయోజనాలు కలిగించే కొన్ని విషయాలను ఇరు పక్షాలు గుర్తించాయి. మరో దఫా సమావేశమయ్యేందుకు అంగీకారం కుదిరింది. – రష్యా ప్రతినిధి వ్లాదిమిర్ మెడిన్ స్కీ కాల్పుల విరమణ అవకాశాలపై దృష్టి సారించాం. సమీప భవిష్యత్లో రెండో దఫా చర్చలు జరుగుతాయి. వీటిని పోలాండ్– బెలారస్ సరిహద్దుల్లో జరిపేందుకు అంగీకరించడం జరిగింది. – ఉక్రెయిన్ ప్రతినిధి మైఖైలో పొడోలైక్ -
ఉక్రెయిన్-రష్యా ఉద్రిక్తతలు... ‘ఫలితం’ ఇవ్వని చర్చలు
మిన్స్క్: ప్రపంచ దేశాలు ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న వేళ ఉక్రెయిన్-రష్యా దేశాల మధ్య జరిగిన శాంతి చర్చలు విఫలమయ్యాయి. బెలారస్లోని ఫ్యాఫిట్ వేదికగా రెండు దేశాల ప్రతినిధుల మధ్య జరిగిన కీలక చర్చలు సమస్య పరిష్కారం కాకుండానే ముగిసినట్టు సమాచారం. అయితే, శాంతి చర్చల కోసం ఉక్రెయిన్ తరఫున ఆ దేశ రక్షణశాఖ మంత్రితో కూడిన ఆరుగురు సభ్యులు బృందంతో రష్యాకు చెందిన ఐదుగురు ప్రతినిధుల బృందం చర్చలు జరిపింది. సుమారు 4 గంటల పాటు రెండు దేశాల ప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ భేటీపై ఎంతో ఉత్కంఠ నెలకొనగా చివరకు చర్చలు సఫలం కాకపోవడం ఆందోళనకు గురి చేస్తోంది. కాగా, శాంతి చర్చల్లో యుద్ధాన్ని వెంటనే నిలిపివేయాలని, క్రిమియా నుంచి కూడా బలగాలను తొలగించాలని ఉక్రెయిన్ డిమాండ్ చేస్తుండగా.. నాటోలో చేరబోమని లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని రష్యా పట్టుబట్టినట్టు తెలుస్తోంది. ఇరు పక్షాలు తమ పంతం నెగ్గించుకోవడానికే ప్రయత్నించడంతో చర్చలు విఫలమైనట్టుగా వార్తలు వెలువడుతున్నాయి. దీంతో ఎలాంటి తీర్మానాలు లేకుండానే చర్చలు అర్ధాంతరంగా ముగిశాయి. రష్యా కౌంటర్ అటాక్.. ఇదిలా ఉండగా.. ఈయూ దేశాల ఆంక్షలపై రష్యా కౌంటర్ ఇచ్చింది. బ్రిటన్, జర్మనీ, కెనడా, స్పెయిన్ తదితర 36 దేశాలకు చెందిన విమానాలను రష్యా నిషేధిస్తున్నట్టు సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే, ఉక్రెయిన్పై రష్యా దాడుల నేపథ్యంలో యూరోపియన్ యూనియన్లోని దేశాలు రష్యా గగనతలంపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. దీంతో రష్యా ఈ నిర్ణయం తీసుకుంది. -
అక్కడ చర్చలు ప్రారంభం.. ఇక్కడ రష్యా సైన్యానికి జెలెన్ స్కీ వార్నింగ్
మిన్స్క్: బెలారస్లోని ఫ్యాఫిట్ వేదికగా ఉక్రెయిన్-రష్యా బృందాల మధ్య శాంతి చర్చలు ప్రారంభమయ్యాయి. సోమవారం మధ్యాహ్నం నుంచి ఇరు దేశాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. చర్చల కోసం ఉక్రెయిన్ తరఫున ఆ దేశ రక్షణశాఖ మంత్రి హాజరయ్యారు. ఈ క్రమంలో ఉక్రెయిన్.. రష్యా తక్షణమే యుద్ధం విరమించుకోవాలని డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు నాటోలో ఉక్రెయిన్ చేరబోమని లిఖితపూర్వక హామీ ఇవ్వాలని రష్యా కోరుతున్నట్టు సమాచారం. అంతకు ముందు రష్యా బలగాలను ఉద్దేశించి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మాట్లాడుతూ.. మీ ప్రాణాలు కాపాడుకోండి లేదంటే ఉక్రెయిన్కు వదిలి వెళ్లిపోండి అంటూ వారిని హెచ్చరించారు. తమ దేశ రక్షణ కోసం ప్రతీ పౌరుడు ఓ యోధుడిలో పోరాడుతున్నారని ప్రశంసించారు. ఈ యుద్ధంలో 4,500 మంది రష్యా సైనికులు మృతి చెందినట్టు జెలెన్ స్కీ వెల్లడించారు. మరోవైపు కీవ్లో పరిస్థితులు కంట్రోల్లోనే ఉన్నట్టు ఉక్రెయిన్ ఆర్మీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్లో రష్యా దాడులతో మృత్యుల సంఖ్య పెరుగుతోంది. ఈ దాడుల్లో మొత్తం 102 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని ఐక్యరాజ్యసమితి (UN) సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. వీరిలో ఏడుగురు పిల్లలు కూడా ఉన్నట్టు వెల్లడించింది. -
పుతిన్ చేతిలో పావుగా ఆ దేశం!
బెలారస్ అధ్యక్షుడు, ఆ దేశాన్ని 28 ఏళ్లుగా ఏకఛత్రాధిపత్యంగా ఏలుతున్న అలగ్జాండర్ లుకషెంకో రష్యాకు దాసోహమనడం ఉక్రెయిన్లో రక్తచరిత్రను రాస్తోంది. ఒకప్పుడు బెలారస్ రాజధాని మిన్స్క్ వేదికగా రష్యా, ఉక్రెయిన్ మధ్య పలుమార్లు చర్చలు జరిగాయి. 2014, 2015లో రష్యా. ఉక్రెయిన్ మధ్య మిన్స్క్ 1, 2 ఒప్పందాలు కూడా కుదిరాయి. అలాంటి గడ్డపై శాంతి చర్చల కోసం కాలు మోపేదే లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెగేసి చెప్పడం వెనక చాలా కారణాలే ఉన్నాయి. బెలారస్ అధ్యక్షుడు లుకషెంకో వ్యవహార శైలిపై ఉక్రెయిన్లో అసంతృప్తి భగభగమంటోంది. రష్యా సేనలు ఉక్రెయిన్ చేరుకోవడానికి లుకషెంకో ఎంతో సహకారం అందించారు. తమ దేశ సార్వభౌమత్వాన్ని పణంగా పెట్టి మరీ రష్యా సేనలకు ఆశ్రయం కల్పించడం, సరిహద్దులు దాటించడం వంటి పనులు చేశారు. కొద్ది నెలలుగా దాదాపుగా 30 వేల రష్యా బలగాలు విన్యాసాల పేరుతో బెలారస్లోనే మకాం వేసి పుతిన్ ఆదేశాల కోసం ఎదురు చూశాయి. అందుకే అమెరికా, యూరప్ దేశాలు రష్యాతో పాటు బెలారస్పైనా ఆర్థిక ఆంక్షలు విధించాయి. పుతిన్ చెప్పినట్టు ఆడుతూ.. లుకషెంకో ఎన్నికల్లో ఇప్పటిదాకా ఓటమే ఎరుగలేదు. 2020లో జరిగిన ఎన్నికల్లో వరసగా ఆరోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అయితే రిగ్గింగ్ చేసి నెగ్గారన్న ఆరోపణలతో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. 24 శాతం మంది మాత్రమే ఆయనకు మద్దతుగా ఉన్నారని సర్వేలు తేల్చినా అధ్యక్షుడు కావడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. ఎన్నికల ప్రక్రియకు వ్యతిరేకంగా రోడ్లెక్కి నిరసనలు చేశారు. అధ్యక్షుడిపై నిరసనలు మరింత ఎక్కువైతే భద్రతాపరంగా సాయం చేస్తానంటూ పుతిన్ హామీ కూడా ఇచ్చారు. లుకషెంకో అధ్యక్షుడిగా కొనసాగుతున్నారంటే పుతిన్ మద్దతే కారణం. పుతిన్ సహకారం లేకుండా ఆయన అధ్యక్ష పదవిలో కొనసాగే పరిస్థితి లేదు. అందుకే పుతిన్ ఆడమన్నట్టుగా ఆడుతున్నారంటారు. సొంత దేశంలో ప్రజాస్వామిక నిరసనల్ని పుతిన్ సహకారంతో అణిచివేసిన లుకషెంకో ఇప్పుడు రష్యాకు మద్దతునివ్వడం ద్వారా తమ దేశ సార్వభౌమాధికారాన్నే తాకట్టు పెడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘‘మా దేశానికి సార్వభౌమత్యం ఉందని మేము భావించడం లేదు. మా అధ్యక్షుడు రష్యా చేతిలో కీలుబొమ్మ. బెలారస్ సైనికులు కూడా పుతిన్ చెప్పుచేతల్లోనే ఉన్నారు. ఇది అత్యంత ప్రమాదకరమైన విషయం’’ అని బెలారస్లోని బ్రెమెన్ రీసెర్చ్ సెంటర్ ఎడిటర్ ఓల్గా డ్రిండోవా ఆందోళన వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ స్వాధీనానికి రష్యాకు సహకరిస్తే భారీగా నిధులొస్తాయని, వాటితో సైన్యాన్ని శక్తిమంతం చేయొచ్చని లుకషెంకో ఇలా చేస్తున్నారని బెలారస్ వ్యవహారాలపై పట్టున్న కివీవ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఇహర్ టిష్కెవిచ్ అభిప్రాయపడ్డారు. రష్యా, బెలారస్ది విడదీయలేని బంధం రష్యా, బెలారస్ ఒకప్పుడు సోవియట్ యూనియన్లో భాగమే. ప్రస్తుతం రెండు దేశాల మధ్య దృఢమైన వాణిజ్య బంధముంది. 2020లో వాటి మధ్య 2950 కోట్ల డాలర్ల వాణిజ్యం జరిగిందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. రెండు దేశాలు తరచూ సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహిస్తూ ఉంటాయి. –సాక్షి, నేషనల్ డెస్క్ ఉక్రెయిన్తో తెగిన వాణిజ్య బంధం ఒకప్పుడు ఉక్రెయిన్తో బెలారస్కున్న బలమైన వాణిజ్య సంబంధాలు యుద్ధంతో తెగిపోయాయి. 2019లో బెలారస్ 414 కోట్ల డాలర్ల పెట్రోలియం ఉత్పత్తులు ఎగుమతి చేస్తే అందులో సగానికిపైగా ఉక్రెయిన్కే వెళ్లాయి. ఉక్రెయిన్కు బెలారస్ విద్యుత్ కూడా సరఫరా చేస్తుంది. ఇప్పడవన్నీ నిలిపేస్తున్నట్టు ప్రకటించింది. -
నగరాల్లో హోరాహోరీ..ఎదురొడ్డి పోరాడుతున్న ఉక్రెయిన్ బలగాలు
కీవ్: ఉక్రెయిన్పై దాడిలో రష్యా సేనలు కీలక పట్టణాల్లోకి చొచ్చుకువస్తున్నాయి. దీంతో చాలా నగరాల్లో రష్యా బలగాలకు, ఉక్రెయిన్ మిలటరీకి మధ్య హోరాహోరీ పోరాటం కొనసాగుతోంది. ఇప్పటివరకు ఎయిర్ఫీల్డ్స్, ఇంధన నిల్వాగారాలపై దాడులు చేసిన రష్యా బలగాలు ఆదివారం నాటికి ఉక్రెయిన్లోని కీలక నౌకాశ్రయాలను స్వాధీనం చేసుకున్నాయి. మరోవైపు చర్చలకోసం బెలారస్కు బృందాన్ని పంపినట్లు రష్యా ప్రకటించింది. కానీ తమ దేశం నుంచి దాడులకు కేంద్రమైన బెలారస్లో చర్చలకు వెళ్లమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు. మరే దేశంలోనైనా చర్చలకు సిద్ధమని తొలుత చెప్పారు, కానీ బెలారస్ సరిహద్దుల్లో చర్చలకు సిద్ధమని తాజాగా ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయం ప్రకటించింది. ఆదివారం రష్యాలోని ఖార్కివ్ నగరం సమీపంలోకి రష్యా సేనలు చొచ్చుకువచ్చాయి. వీరిని ఉక్రెయిన్ బలగాలు ఎదుర్కొంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. నగరం తూర్పున ఉన్న గ్యాస్ లైన్ను రష్యా సేనలు పేల్చివేశాయి. రష్యా నుంచి కాపాడేందుకు అందరూ ఆయుధాలు ధరించాలన్న అధ్యక్షుడి పిలుపుతో పలువురు ఉక్రేనియన్లు కదనరంగంలో పోరాడుతున్నారు. దీంతో రష్యన్ బలగాలకు చాలాచోట్ల ప్రతిఘటన ఎదురవుతోంది. పోరాడుతాం...: ‘‘మేం మా దేశం కోసం పోరాడుతున్నాం, మా స్వతంత్రం కోసం పోరాడుతున్నాం, ఎందుకంటే దేశం కోసం, స్వతంత్రం కోసం పోరాడే హక్కు మాకుంది.’’ అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆదివారం ప్రకటించారు. దేశమంతా బాంబులతో దద్దరిల్లుతోందని, పౌర నివాసాలను కూడా విడిచిపెట్టడం లేదని ఆయన వాపోయారు. కీవ్ సమీపంలో భారీ పేలుళ్లతో పాటు మంటలు కనిపించాయి. దీంతో ప్రజలంతా భయంతో బంకర్లలో, సబ్వేల్లో దాక్కుంటున్నారు. నగరంలో 39 గంటల కర్ఫ్యూ విధించారు. కీవ్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద కూడా పేలుళ్లు వినిపించాయని అధ్యక్ష కార్యాలయం తెలిపింది. రష్యాది ఉగ్రవాదమని జెలెన్స్కీ దుయ్యబట్టారు. తమ నగరాలపై రష్యా దాడులకు సంబంధించి అంతర్జాతీయ యుద్ధనేరాల ట్రిబ్యునల్ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. రష్యాను ఐరాస భద్రతా మండలి నుంచి తొలగించాలన్నారు. తీరప్రాంత స్వాధీనం ఉక్రెయిన్ దక్షిణాన ఉన్న కీలక నౌకాశ్రయ నగరాలను రష్యా స్వాధీనం చేసుకుంది. దీంతో ఉక్రెయిన్ తీరప్రాంతం రష్యా అదుపులోకి వచ్చినట్లయింది. నల్ల సముద్రంలోని ఖెర్సన్, అజోవ్ సముద్రంలోని బెర్డిన్స్క్ పోర్టులను స్వాధీనం చేసుకున్నామని రష్యా రక్షణ శాఖ ప్రతినిధి ప్రకటించారు. పలు నగరాల్లో విమానాశ్రయాలు కూడా తమ అదుపులోకి వచ్చాయన్నారు. అయితే ఒడెసా, మైకోలైవ్ తదితర ప్రాంతాల్లో పోరు కొనసాగిస్తున్నామని ఉక్రెయిన్ వర్గాలు తెలిపాయి. పోర్టులు చేజారడం ఉక్రెయిన్కు ఎదురుదెబ్బని విశ్లేషకులు భావిస్తున్నారు. పొంతన లేని గణాంకాలు యుద్ధంలో ఇరుపక్షాల్లో ఎంతమంది మరణించారు, గాయపడ్డారు అన్న విషయమై సరైన గణాంకాలు తెలియడంలేదు. రష్యాదాడిలో 198 మంది పౌరులు చనిపోయారని, వెయ్యికిపైగా గాయాలపాలయ్యారని ఉక్రెయిన్ ఆరోగ్యమంత్రి చెప్పారు. రష్యాసేనల్లో 3,500మంది చనిపోయారని ఉక్రెయిన్ వర్గాలు తెలిపాయి. దాడులు ఆరంభమైన తర్వాత సుమారు 3.68 లక్షలమంది ఉక్రేనియన్లు పొరుగుదేశాలకు వలసపోయారని ఐరాస తెలిపింది. ఒకపక్క రష్యా సేనలు ఉక్రెయిన్లోకి చొచ్చుకుపోతున్న నేపథ్యంలో పాశ్చాత్య దేశాలు ఉక్రెయిన్కు పలురకాల ఆయుధాలు, మందుగుండు సమాగ్రిని సమకూరుస్తున్నాయి. అదే సమయంలో రష్యాపై భారీ ఆంక్షలను విధిస్తున్నాయి. ఉక్రెయిన్కు 35 కోట్ల డాలర్ల మిలటరీ సాయాన్ని అమెరికా ప్రకటించింది. 500 మిస్సైళ్లు, 1000 యాంటీ టాంక్ ఆయుధాలను పంపుతామని జర్మనీ తెలిపింది. బెల్జియం, చెక్, డచ్ ప్రభుత్వాలు కూడా ఆయుధాలు పంపుతున్నాయి. ఎంపిక చేసిన రష్యా బ్యాంకులను స్విఫ్ట్ (అంతర్జాతీయ బ్యాంకు అనుసంధానిత వ్యవస్థ) నెట్వర్క్లో బ్లాక్ చేసేందుకు యూఎస్, యూకే, ఈయూ అంగీకరించాయి. ఉక్రెయిన్లో తమ స్టార్లింగ్ ఇంటర్నెట్ వ్యవస్థను యాక్టివేట్ చేస్తున్నట్లు బిలియనీర్ ఎలన్ మస్క్ ప్రకటించారు. ఐరాస అత్యవసర భేటీ! ఉక్రెయిన్పై రష్యా దురాక్రమణపై చర్చకు 193 మంది సభ్యులతో కూడిన ఐరాస సాధారణ అసెంబ్లీ ‘అరుదైన అత్యవసర ప్రత్యేక సమావేశం’ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. భేటీ కోసం భద్రతా మండలిలో ఓటింగ్ జరగనుంది. భద్రతామండలి పూర్తి సమావేశంలో శాశ్వత దేశాలు వీటో అధికారం ఉపయోగించే వీలు లేదు. దాడిపై భద్రతా మండలి తీర్మానాన్ని శుక్రవారం రష్యా వీటో చేయడం తెలిసిందే. రష్యా విమానాలపై ఈయూ నిషేధం రష్యా విమానాలను తమ గగనతలంపై నిషేధించాలని 27 దేశాల యూరోపియన్ యూనియన్ నిర్ణయించింది. ఉక్రెయిన్కు ఆయుధాల కొనుగోలుకు నిధులు సమకూర్చాలని నిర్ణయించామని ఈయూ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా చెప్పారు. ఈయూ చరిత్రలో దాడికి గురవుతున్న దేశానికి ఆయుధ సాయం కోసం నిధులందించడం ఇదే తొలిసారన్నారు. -
బెలారస్ బార్డర్లో చర్చలు
కీవ్: సంక్షోభ నివారణకు రష్యా బృందంతో చర్చలకు సిద్ధమని ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయం తెలిపింది. కీవ్ సమీపంలోకి రష్యా సేనలు వస్తున్న నేపథ్యంలో ఈ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఇరు పక్షాలు బెలారస్ సరిహద్దులో ఏదో ఒక ప్రాంతంలో చర్చలు జరుపుతాయని జెలెన్స్కీ కార్యాలయం తెలిపింది. ఏ సమయంలో చర్చలు జరిగేది వెల్లడించలేదు. అంతకుముందు చర్చలకు బెలారస్లోని గోమెల్ నగరానికి తమ బృందం వెళ్లిందని రష్యా ఆదివారం తెలిపింది. నాటోలో చేరకపోవడం సహా కీలక డిమాండ్లపై చర్చలకు సిద్ధమని జెలెన్స్కీ శుక్రవారం ప్రకటించిన నేపథ్యంలో రష్యా ఈ బృందాన్ని పంపింది. అయితే బెలారస్లో చర్చలకు తాము సిద్ధం కాదని జెలెన్స్కీ చెప్పారు. తమపై మిస్సైల్ దాడులు చేస్తున్న భూభాగంపై చర్చలు అంగీకరించమని, వార్సా, బ్రటిస్లవా, బుడాపెస్ట్, ఇస్తాంబుల్, బకు తదితర నగరాల్లో ఎక్కడైనా చర్చలకు రెడీ అని తెలిపారు. చర్చలు నిజాయతీగా, యుద్ధాన్ని ముగించేలా ఉండాలన్నారు. అయితే గోమెల్ నగరం పేరును ఉక్రెయిన్ వర్గాలే ప్రతిపాదించాయని రష్యా చెప్పగా, అబద్ధమని జెలెన్స్కీ కొట్టిపారేశారు. చర్చలు ఆరంభమయ్యేవరకు మిలటరీ చర్య కొనసాగుతూనే ఉంటుందని రష్యా పేర్కొంది. అణుభయాలే కారణమా నాటో నేతల వ్యాఖ్యల నేపథ్యంలో దేనికైనా సిద్ధంగా ఉండాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ తమ అణు విభాగానికి ఆదేశాలిచ్చారు. దీంతో పరిస్థితి మరింత విషమిస్తుందన్న భయంతో చర్చలకు ఉక్రెయిన్ అంగీకరించినట్లు నిపుణులు భావిస్తున్నారు. చర్చలు ముగిసి, ఉక్రెయిన్ బృందం క్షేమంగా వెనుతిరిగేంతవరకు బెలారస్ గగనతలంలో విమానాలు, హెలికాప్టర్లు, మిస్సైళ్లు ప్రయాణించవని బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ హామీ ఇచ్చారని ఉక్రెయిన్ తెలిపింది. అందుకే చర్చలకు అంగీకరించామని చెప్పింది. -
చర్చలకు సిద్ధమే అంటూ.. ట్విస్ట్ ఇచ్చిన ఉక్రెయిన్
కీవ్: ఉక్రెయిన్, రష్యా మధ్య భీకర పోరు నడుస్తోంది. ఇరు దేశాల సైనికులు తగ్గేదేలే అన్నట్టుగా తమ పోరాట పటిమను చూపిస్తున్నారు. కాగా, రష్యా తాము చర్చలకు సిద్దమంటూనే మరోవైపు దాడులను కొనసాగిస్తోంది. ఇదిలా ఉండగా ఉక్రెయిన్తో చర్చల కోసం బెలారస్లోని గోమెల్కు తాము ఓ బృందాన్ని పంపిస్తామంటూ రష్యా ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ రష్యాతో చర్చలకు తాము కూడా సిద్ధంగా ఉన్నామన్నారు. కానీ, చర్చలకు బెలారస్ ఆమోదయోగ్యం కాదని.. అక్కడి నుంచే రష్యా దాడులను పాల్పడిందంటూ ఆరోపించారు. ఈ నేపథ్యంలో యుద్ద వాతావరణం లేని ప్రాంతంలో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. వార్సా, ఇస్తాంబుల్, బాకు ప్రాంతాల్లో ఏ చోట చర్చలు జరిపినా తాను అక్కడికి వచ్చేందుకు సిద్దంగా ఉన్నానని ప్రకటించారు. అంతకు ముందకు జెలెన్ స్కీ.. యుద్దం విషయంలో రష్యా మాట తప్పిందని ఆరోపించారు. ఉక్రెయిన్ ప్రజల ఇళ్లపై రష్యా సైన్యం దాడులకు పాల్పడిందని విమర్శించారు. ఈ దాడుల్లో సామాన్య ప్రజలు మృతి చెందారని, గాయపడిన వారిని ఆసుపత్రులకు తీసుకువెళ్తున్న అంబులెన్స్లపైన కూడా సైనిక దాడులు జరిగినట్టు వెల్లడించారు. ఈ దాడుల్లో తీవ్రంగా ఆస్తి నష్టం జరిగిందన్నారు. -
రష్యా–ఉక్రెయిన్; ఎవరిదెంత బలం.. ఎవరిదెంత వ్యయం?
Military Strengths Of Russia And Ukraine: ట్యాంకుల నుంచి శతఘ్నుల వరకు పదాతి దళం నుంచి మారణాయుధాల వరకు యుద్ధ విమానాల నుంచి నౌకల వరకు ఉక్రెయిన్పై మూడువైపులా రష్యా పకడ్బందీగా బలగాలను మోహరించింది. రష్యా, బెలారస్లు సంయుక్తంగా పది రోజులుగా చేస్తున్న సైనిక విన్యాసాలతో ఒక్కసారిగా ఉద్రిక్తతలు పెరిగాయి. ఉక్రెయిన్ రాజధాని కీవ్ను లక్ష్యంగా చేసుకొని దాడులకు దిగుతుందన్న ఆందోళన నెలకొంది. ప్రచ్ఛన్న యుద్ధం తర్వాత రష్యా పకడ్బందీగా ఒక దేశంపై యుద్ధ సన్నాహాలు చేయడం ఇదే మొదటి సారి. రష్యాకి చెందిన సకల రక్షణ వ్యవస్థలు గత కొద్ది రోజులుగా ఉక్రెయిన్ చుట్టూ మోహరించి ఉన్నాయి. రష్యాకు చెందిన 100 బెటాలియన్ టాక్టికల్ గ్రూప్స్ (బిటిజి) సరిహద్దుల్లో మాటువేశాయి. ఒక్కో గ్రూప్లోని వెయ్యిమందికి పైగా సైనికులు ఉన్నారు. వివిధ ప్రాంతాలలో దాదాపు 2 లక్షల మంది సైనికులు మోహరించి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆదేశాల కోసం వేచి చూస్తున్నారు. 2014లో జరిగిన రష్యా ఉక్రెయిన్ యుద్ధం సమయంలో డజను కంటే తక్కువ బిటిజిలను మోహరించిన రష్యా ఇప్పుడు వాటి సంఖ్య ఏకంగా 100కి పెంచింది. యుద్ధం ప్రమాదకర స్థాయికి చేరుకుంటుందని చెప్పడానికి రష్యా దగ్గర కంబైన్డ్ ఆర్మీస్ 11 ఉంటే వాటిలో 10 ఉక్రెయిన్ సరిహద్దుల్లోనే ఉన్నాయి. ఏ క్షణంలో ఏ అవసరం వస్తుందేమోనని వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేశారు. యుద్ధ సన్నాహాల్లో భాగంగా ఫిబ్రవరి 10 నుంచి రష్యా–బెలారస్ సంయుక్తంగా సైనిక విన్యాసాలు, క్షిపణి పరీక్షల్ని నిర్వహిస్తోంది. వీటిని చూస్తుంటే రష్యా సమరశంఖాన్ని పూరించినట్టేనని అమెరికా జాతీయ భద్రతా సలహాదారుడు జేక్ సలివాన్ హెచ్చరించారు. రష్యా ఉత్తరం, మధ్య, దక్షిణం దిశల్లో ఎటు వైపు నుంచైనా దాడులకి దిగే అవకాశముంది. ఉత్తరం వైపు నుంచి వస్తే ఉక్రెయిన్ రాజధాని కీవ్ని లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉంది. సెంట్రల్ రూట్ అయిన డోంటెస్క్ నుంచి, లేదంటే దక్షిణవైపు నుంచి అంటే సముద్ర మార్గం ద్వారా దాడులు చేయడానికి స్కెచ్ వేస్తున్నట్టుగా తెలుస్తోంది. రష్యా మిలటరీ సత్తాపై అధ్యయనం చేసిన రాండ్ కార్పొరేషన్కు చెందిన విశ్లేషకుడు స్కాట్ బాస్టన్ ఇరు దేశాల ఉద్రిక్తతల గురించి మాట్లాడుతూ ‘‘అధినేత నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే దాడులు చేయడానికి సైనిక బలగాలు సిద్ధంగా ఉన్నాయి. ఉద్రిక్తతలు చల్లారతాయనడానికి క్షేత్రస్థాయిలో ఎలాంటి ఆధారాలు లేవు. అయితే మిలటరీని సన్నద్ధం చేసిన స్థాయిలో రష్యా వాస్తవంగా యుద్ధానికి దిగుతుందని భావించడం లేదు’’ అని వ్యాఖ్యానించారు. ఎవరిదెంత వ్యయం ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన మిలటరీ ఉన్న దేశాల్లో రష్యా అయిదో స్థానంలో ఉంది. రక్షణ రంగానికి ఆ దేశం మొత్తం బడ్జెట్లో 11.4 శాతం ఖర్చు చేస్తోంది. మరోవైపు ఉక్రెయిన్ తమ బడ్జెట్లో 8.8శాతం ఖర్చు చేస్తోంది. 2020లో రష్యా రక్షణపై 6170 కోట్ల డాలర్లు ఖర్చు చేస్తే, అదే ఏడాది ఉక్రెయిన్ 590 డాలర్లు ఖర్చు చేసినట్టుగా స్టాక్హోమ్ ఇంటర్నేనషనల్ పీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ వెల్లడించింది. రష్యా–ఉక్రెయిన్ బలాబలాలు రష్యా, ఉక్రెయిన్ మిలటరీ బలాబలాలను చూస్తే ఎక్కడా పొంతన కుదరదు. రష్యా మిలటరీని ఉక్రెయిన్ నామమాత్రంగా కూడా ఢీ కొనలేదు. అయినప్పటికీ అమెరికా, బ్రిటన్ అండదండలతో ఆ దేశం ధీమాగా ఉంది. అగ్రరాజ్యాలు తమ రక్షణ కోసం నాటో బలగాల్ని తరలిస్తారని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ ఆశతో ఉన్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత 12 దేశాలు సభ్యులుగా మొదలైన నాటోలో ప్రస్తుతం 30 దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా, ఇటలీ, డెన్మార్క్ వంటి దేశాలతో కూడిన నాటో బలగాలు ఉక్రెయిన్కి అండగా నిలిస్తే ఇరు పక్షాల మధ్య భీకర పోరు జరుగుతుంది. రష్యా, ఉక్రెయిన్ సైనిక శక్తిలో ఎంత అసమతుల్యత ఉందో ఇది చూస్తే అర్థమవుతుంది. – నేషనల్ డెస్క్, సాక్షి. -
రష్యా దళాల... భారీ మోహరింపు
మాస్కో/బెర్లిన్: ఉక్రెయిన్ సమీపంలో సరిహద్దుల వెంబడి రష్యా సైనిక మోహరింపులు భారీగా పెరిగినట్టు ఉపగ్రహ చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి. బెలారస్, క్రిమియా, పశ్చిమ రష్యాల్లో సైనిక దళాలు కదం తొక్కుతుండటం ఆ ఫొటోల్లో కన్పిస్తోంది. క్రిమియాలోని ఆక్టియాబ్రిస్కోయ్ ఎయిర్ ఫీల్డ్, లేక్ డొనుజ్లావ్ తదితర చోట్ల వేలాది సైనిక శిబిరాలు, భారీగా మిలిటరీ వాహనాలు కన్పించాయి. బెలారస్లో ఉక్రెయిన్ సరిహద్దులకు కేవలం 25 కిలోమీటర్ల దూరంలో భారీగా రష్యా దళాలు మోహరించాయి. వీటికి తోడు సరిహద్దులకు కేవలం 45 కిలోమీటర్ల దూరంలోని రెచిస్టాకు కూడా సేనలు భారీగా చేరుకుంటున్నాయి. పశ్చిమ రష్యాలో కూడా ఉక్రెయిన్ సరిహద్దులకు 110 కిలోమీటర్ల సమీపంలో సైనిక సందడి నానాటికీ పెరుగుతున్నట్టు ఫొటోలు వెల్లడించాయి. యుద్ధ మేఘాలు నానాటికీ దట్టమవుతుండటంతో పలు ఎయిర్లైన్స్ ఉక్రెయిన్కు విమాన సర్వీసులను నిలిపేస్తున్నాయి. కొన్నింటిని దారి మళ్లిస్తున్నాయి. 2014లో మలేషియా ఎయిర్లైన్స్ విమానాన్ని ఉత్తర ఉక్రెయిన్ భూభాగంపై రెబెల్స్ కూల్చివేసిన నేపథ్యంలో ఎయిర్లైన్స్ రిస్కు తీసుకోవడం లేదు. రష్యాకు జర్మనీ చాన్స్లర్ ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నంలో భాగంగా జర్మనీ చాన్స్లర్ ఒలాఫ్ స్కోల్జ్ సోమవారం ఉక్రెయిన్లో, మంగళవారం రష్యాలో పర్యటించనున్నారు. ఇరు దేశాల అధ్యక్షులతో ఆయన భేటీ అవుతారు. యూరప్లో యుద్ధాన్ని నివారించడం జర్మనీ బాధ్యత అని పార్లమెంటులో ఆయన చెప్పారు. యుద్ధానికి దిగితే రష్యా మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. -
‘అవును.. తప్పు చేశా.. నేరం అంగీకరిస్తున్నా’
మింక్: ‘‘అవును.. నేను తప్పు చేశాను. నేరాన్ని అంగీకరిస్తున్న. ప్రస్తుతం నేను మింక్లోని నంబర్ 1 డిటెన్షన్ సెంటర్లో సురక్షితంగా ఉన్నాను. నాకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు. గుండెతో పాటు ఇతర అవయవాలు కూడా బాగా పనిచేస్తున్నాయి’’... బెలారస్ జర్నలిస్టు రోమన్ ప్రొటాసెవిక్ నేరం అంగీకరిస్తున్నట్లుగా ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. గ్రీస్ నుంచి లిథువేనియాకు విమానంలో వెళ్తున్న అతడిని బెలారస్ ప్రభుత్వం ఆదివారం అరెస్టు చేయించిన విషయం తెలిసిందే. రోమన్ ప్రయాణిస్తున్న రియాన్ ఎయిర్ విమానానికి బాంబు బెదిరింపు వచ్చిందన్న సందేశంతో, యుద్ధ విమానం ఎస్కార్టుగా రాగా, దానిని తమ రాజధాని మింక్లో అత్యవసరంగా ల్యాండ్ కాగా.. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్దేశపూర్వకంగానే నిరసనలకు కేంద్ర బిందువు అయ్యాడన్న ఆరోపణల నేపథ్యంలో.. రోమన్ను బంధించేందుకే సుమారుగా 170 మందితో ప్రయాణిస్తున్న విమానాన్ని ‘హైజాక్’ చేయించారంటూ అంతర్జాతీయ సమాజం నుంచి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో తీరుపై విమర్శల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో... పోలీసుల అదుపులో ఉన్న రోమన్ ఆరోగ్యం చెడిపోయిందనే వార్తలు మరోసారి ఆగ్రహ జ్వాలలకు కారణమయ్యాయి. ఈ విషయంపై స్పందించిన బెలారస్ హోం మంత్రి.. రోమన్ బాగానే ఉన్నాడని, ఆరోగ్యానికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా రోమన్తో స్వయంగా వీడియో విడుదల చేయించడం గమనార్హం. ఇందులో.. ‘‘నన్ను బాగా చూసుకుంటున్నారు. చట్టప్రకారం వాళ్లు చేస్తున్నది సరైనదే. విచారణాధికారులకు నేను పూర్తిగా సహకరిస్తాను. మింక్ సిటీలో మూకుమ్మడి నిరసన కార్యక్రమాలకు నేనే కారణం అన్న విషయాన్ని అంగీకరిస్తున్నా’’ అని పేర్కొన్నాడు. అయితే, రోమన్ సహచర జర్నలిస్టు స్టెఫాన్ పుటిలో మాత్రం ఈ విషయాన్ని ఖండించారు. ‘‘తన చేత బలవంతంగా ఈ మాటలు చెప్పించారనడానికి, అతడి నుదురు మీద ఉన్న నల్లటి మచ్చలే ఉదాహరణ’’ అంటూ రోమన్ పట్ల అధికారుల వ్యవహారశైలిని విమర్శించారు. అతడిని కొట్టినట్లుగా ఆనవాలు కనబడుతుంటే, ఈ వీడియోను ఎలా నమ్మాలంటూ ప్రశ్నించారు. కాగా స్థానిక చట్టాల ప్రకారం.. బహిరంగ మూకుమ్మడి నిరసనకు కారణమైన వారికి 15 ఏళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది. ఇక అధ్యక్ష ఎన్నికల సమయంలో రోమన్ చట్టవ్యతిరేకంగా వ్యవహరించాడని అతడిపై అభియోగాలు నమోదయ్యాయి. ఇక గత రెండు దశాబ్దాలుగా బెలారస్ను పాలిస్తున్న అలెగ్జాండర్ లుకాషెంకో మరోసారి అధ్యక్ష పీఠం అధిరోహించిన నేపథ్యంలో.. ఉద్దేశపూర్వంగానే ప్రశ్నించే గొంతుకలను అణచివేస్తున్నారంటూ ప్రతిపక్ష నాయకులు ఆయనను విమర్శిస్తున్నారు. చదవండి: Ryanair: ‘అతడి కళ్లల్లో భయం.. చావు తప్పదని చెప్పాడు’ "I confess and cooperate with the investigation" says Roman #Protasevich in a video released by the #Belarusian authorities. This obviously looks like a forced confession; + the marks on his forehead.. pic.twitter.com/a7L3gtQkP2 — inna shevchenko (@femeninna) May 24, 2021 -
Ryanair: ‘అతడి కళ్లల్లో భయం.. చావు తప్పదని చెప్పాడు’
‘‘అతడు భయంతో వణికిపోవడం నేను చూశాను. అతడి కళ్లు విషాదంతో నిండిపోవడం గమనించాను. ఇంతలో తను మా వైపు తిరిగి.. తాను మరణశిక్ష ఎదుర్కోబోతున్నట్లు చెప్పాడు’’ వెబ్డెస్క్: గ్రీస్ నుంచి లిథువేనియా వెళ్లాల్సిన రియాన్ఎయిర్ విమానం 4978 అది. దాదాపు పన్నెండు దేశాలకు చెందిన 170 మంది అందులో ప్రయాణిస్తున్నారు. అయితే, అకస్మాత్తుగా ఆ విమానం బెలారస్ వైపు మళ్లింది. యుద్ధ విమానం వెంబడి రాగా ఆ దేశ రాజధాని మింక్ ఎయిర్పోర్టులో ల్యాండ్ అయ్యింది. లోపల ఉన్న ప్రయాణికులకు అసలేమీ అర్థం కాలేదు. లిథువేనియా వెళ్లాల్సిన విమానం ఇలా మధ్యలో ఎందుకు ఆపేశారు.. ఇందుకు గల కారణాలేమీటో వారికి అంతుపట్టలేదు.. అయితే, ఓ వ్యక్తి మాత్రం వెంటనే జరిగే పరిణామాలను ఊహించి, లగేజ్బ్యాగ్ నుంచి వడివడిగా తన లాప్టాప్, మొబైల్ తీసుకుని పక్కనే ఉన్న అమ్మాయికి అందించాడు. అంతలోనే అక్కడికి చేరుకున్న బెలారస్ పోలీసులు 26 ఏళ్ల ఆయువకుడిని అరెస్టు చేశారు. ఎట్టకేలకు 7 గంటల ఆలస్యం తర్వాత ఫ్లైట్ లిథువేనియాకు చేరుకోవడంతో ప్రయాణికులైతే ఊపిరి పీల్చుకున్నారు గానీ ఆ యువకుడి పరిస్థితి ఏమౌతుందో అనే ఆలోచన వాళ్ల మెదళ్లను తొలచివేస్తోంది. ఈ ఘటనపై అంతర్జాతీయంగా తీవ్ర దుమారం రేగుతోంది. యూరోపియన్ దేశాలు సహా అమెరికా బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో తీరుపై తీవ్ర ఆగ్రహం చేస్తోంది. అసలు ఆ విమానాన్ని ఎందుకు ఆపారు? ఇందుకు బెలారస్ చెప్పిన కారణం ఏమిటి? ఇంతకీ ఆ యువకుడు ఎవరు? అతడిని ఎందుకు తీసుకువెళ్లారు? ఫొటో కర్టెసీ: రాయిటర్స్ ఎవరా యువకుడు? రోమన్ ప్రొటాసెవిక్.. జర్నలిస్టు. నెక్స్టా గ్రూపు మాజీ ఎడిటర్. గతేడాది బెలారస్లో జరిగిన ఆందోళనకు సంబంధించి వరుస కథనాలు ప్రచురించాడు. అందుకుగానూ అతడిపై ప్రభుత్వం గుర్రుగా ఉంది. ఇప్పటికే రోమన్పై అనేక అభియోగాలు నమోదుకాగా.. ఎప్పుడెప్పుడు అతడిని అరెస్టు చేయాలా అన్న అలోచనలో ఉంది. దీంతో అతడు పొలాండ్లో తలదాచుకుంటున్నాడు. అయితే, ఆదివారం లిథువేనియాకు వెళ్లే క్రమంలో బెలారస్లో రోమన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరణం తప్పదన్నాడు ఈ విషయం గురించి విమానంలో ఉన్న ప్రయాణికులు అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ అతడు భయంతో వణికిపోవడం నేను చూశాను. అతడి కళ్లు విషాదంతో నిండిపోవడం గమనించాను. ఇంతలో తను మా వైపు తిరిగి.. తాను మరణశిక్ష ఎదుర్కోబోతున్నట్లు చెప్పాడు. నిజానికి అతడు అరవడం లేదు, కానీ తను చాలా భయపడిపోతున్నట్లు అర్థమైంది. ఒకవేళ కిటికీ గనుక తెరిచే అవకాశం ఉంటే, కచ్చితంగా దూకేవాడేనేమో. తనను కిందకి తీసుకువెళ్లి ఏవేవో ప్రశ్నలు అడిగి తీసుకువెళ్లారు’’ అని పేర్కొన్నారు. హైడ్రామా.. ఏం చెప్పి విమానాన్ని ఆపారు? విమానంలో బాంబు ఉందన్న బెదిరింపులు రావడంతో అత్యవసరంగా మింక్ ఎయిర్పోర్టులో ల్యాండ్ చేయాలంటూ బెలారస్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి సందేశం వచ్చింది. అంతలోనే ఓ యుద్ధ విమానం ఎస్కార్టుగా వస్తున్న విషయాన్ని ప్రయాణికులు గమనించారు. ఎయిర్పోర్టుకు చేరుకున్న తర్వాత సాధారణ తనిఖీ చేశారు. కానీ అందులో బాంబు ఉన్న ఆనవాలు కనిపించలేదు. కానీ, రోమన్ను బయటకు పిలిచారు. అతడితో పాటు ఓ మహిళను పోలీసులు తమతో పాటు తీసుకువెళ్లారు. ఈ విషయాన్ని బెలారస్ అధికార మీడియా ధ్రువీకరించింది. ‘‘బాంబు బెదిరింపు రావడంతో మిస్టర్ లుకాషెంకో వ్యక్తిగత ఆదేశాలు జారీ చేశారు. విమానాన్ని మింక్లో ల్యాండ్ చేయాలని ఆదేశించారు. ఇందుకు మిగ్-29 ఫైటర్ ఎస్కార్టుగా ఉండేందుకు అనుమతించారు’’ అని పేర్కొంది. అయితే, అప్పటికే విమానం మింక్ కంటే కూడా, లిథువవేనియా విల్నూయిస్కే దగ్గరగా ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో బెలారస్ ఉద్దేశపూర్వకంగానే రోమన్ కోసం ఫ్లైట్ను మళ్లించి, బాంబు నాటకం ఆడిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాగా రియాన్ ఎయిర్.. ప్రయాణికులను క్షమాపణ కోరుతూ ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే రోమన్ మద్దతుదారులు మాత్రం. ‘‘రియాన్ఎయిర్ ... రోమన్ ఎక్కడ’’ అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఫొటో కర్టెసీ: రాయిటర్స్ భగ్గుమంటున్న అంతర్జాతీయ సమాజం ఒక జర్నలిస్టును అరెస్టు చేసేందుకు బెలారస్ ఇంతటి సాహసానికి పూనుకోవడం సరికాదంటూ అంతర్జాతీయ సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బెలారస్పై ఆంక్షలు విధించాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంపై స్పందించిన ఐక్యరాజ్య సమితి విమానయాన విభాగం ఐసీఏఓ.. బలవంతంగా విమానాన్ని ల్యాండ్ చేయించారు. ఇది చికాగో కన్వెన్షన్ నిబంధనలు ఉల్లంఘించడమే’’ అని పేర్కొంది. కాగా చికాగో కన్వెన్షన్లో గగనతలం, విమానాల సురక్షిత ప్రయాణాలకై పలు నిబంధనలు ఉన్నాయి. ‘‘సాధారణ పౌరులతో వెళ్తున్న విమానాన్ని ఇలా ఆపడం అంటే హైజాక్ చేసినట్లే. ఇంతటి దుస్సాహసానికి పూనుకున్న బెలారస్ కచ్చితంగా శిక్షను ఎదుర్కోవాల్సిందే’’ అని పోలండ్ ప్రధాని మండిపడ్డారు. ఇక బెలారస్లోని అమెరికా రాయబారి జూలీ ఫిషర్.. ‘‘అంతర్జాతీయ సమాజం, పౌరులకు వ్యతిరేకంగా లుకాషెంకో ప్రభుత్వం వ్యవహరించింది. బాంబు ఉందన్న అబద్ధపు సందేశంతో మిగ్-29ను పంపించి రేనార్ను మళ్లించింది. నెక్స్టా జర్నలిస్టుపై రాజకీయ కక్షతో నమోదైన అభియోగాల నేపథ్యంలో అతడిని అరెస్టు చేసేందుకు చేపట్టిన ఈ చర్య చాలా ప్రమాదకరం’’ అని ట్విటర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ఇక లాటివియా, లిథువేనియా ఏకంగా బెలారస్ గగనతలాన్ని అసురక్షిత గగనతలంగా గుర్తించాలని విజ్ఞప్తి చేయడం విశేషం. రాజకీయ ప్యత్యర్థిని కిడ్నాప్ చేయడం కోసం వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలు ప్రమాదంలోకి నెట్టిన బెలారస్ గగనతలంలో అంతర్జాతీయ విమానాలు ప్రయాణించకుండా ఆంక్షలు విధించాలని సూచిస్తున్నాయి. కాగా ఈ ఘటనపై విచారణ జరిపే విధంగా అమెరికా యూరోపియన్ దేశాలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. Lukashenka and his regime today showed again its contempt for international community and its citizens. Faking a bomb threat and sending MiG-29s to force @RyanAir to Minsk in order to arrest a @Nexta journalist on politically motivated charges is dangerous and abhorrent. — Julie Fisher (@USAmbBelarus) May 23, 2021 Today’s hijacking of #Ryanair flight by Lukashenko regime shows that Belarusian airspace is not safe, people’s lives were put at risk and kidnaping of a political opponent took place. Belarusian airspace must be closed for all international flights. — Edgars Rinkēvičs (@edgarsrinkevics) May 23, 2021 -
Aryna Sabalenka: సూపర్ సబలెంకా
మాడ్రిడ్: గాయం కారణంగా ఒకదశలో మాడ్రిడ్ ఓపెన్ టోర్నమెంట్ నుంచి వైదొలగాలని ఆలోచించిన బెలారస్ టెన్నిస్ స్టార్ అరీనా సబలెంకా బరిలోకి దిగాక ఏకంగా చాంపియన్గా అవతరించింది. హోరాహోరీగా సాగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ ఏడో ర్యాంకర్ సబలెంకా 6–0, 3–6, 6–4తో టాప్ సీడ్, ప్రపంచ నంబర్వన్ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా)పై విజయం సాధించింది. ఈ ఏడాది ఓ టోర్నీ ఫైనల్లో బార్టీ ఓడిపోవడం ఇదే తొలిసారి. యారా క్లాసిక్ వ్యాలీ ఓపెన్, మయామి ఓపెన్, స్టుట్గార్ట్ ఓపెన్ టోర్నీలలో ఫైనల్ చేరిన బార్టీ టైటిల్స్ సొంతం చేసుకుంది. మరోవైపు సబలెంకా కెరీర్లో ఇది 10వ సింగిల్స్ టైటిల్. ‘రెండు వారాల క్రితం స్టుట్గార్ట్ ఓపెన్ ఫైనల్లో గాయపడ్డాను. కదలడానికి కూడా ఇబ్బంది పడ్డాను. దాంతో మాడ్రిడ్ ఓపెన్ నుంచి వైదొలగాలని భావించాను. కానీ నా వైద్య బృందం నాలుగు రోజుల్లో నన్ను కోలుకునేలా చేసింది. ఇప్పుడు మీ ముందర ట్రోఫీతో నిల్చున్నాను’ అని క్లే కోర్టులపై తొలిసారి టైటిల్ నెగ్గిన 23 ఏళ్ల సబలెంకా వ్యాఖ్యానించింది. విజేతగా నిలిచన సబలెంకాకు 3,15,160 యూరోల ప్రైజ్మనీ (రూ. 2 కోట్ల 81 లక్షలు)తోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు, షాంపేన్ బాటిల్ లభించాయి. -
హ్యాపీ బర్త్ డే.. యూ ర్యాట్
మిన్స్క్: ‘యూ ర్యాట్’ అని తిడితే ముద్దుగానో, అల్లారు ముద్దుగానో తిట్టినట్లుగా ఉండొచ్చు. విద్యావంతుల తిట్టు ఇది. పైకి సాఫ్ట్ గా ఉన్నా, అర్ధం విపరీతమైనది. అందుకే కుక్క అన్నా, నక్క అన్నా రాని కోపం.. బయటి దేశాల వారికి ఎలుక అంటే వస్తుంది. ‘ర్యాట్’ అంటే.. దూరంగా పెట్టవలసిన (హేట్ఫుల్) మనిషి అని. ఇంతవరకు నయం. అబద్ధాలకోరు అని, ద్రోహి అని, దొంగ అని, డబుల్–క్రాసర్ (మోసగాడు) అని.. ఇన్ని మీనింగులున్నాయి పాపం ఎలుక పేరు మీద! అశుభ్రంగా ఉండి, వ్యాధుల్ని వ్యాపింపజేస్తుందని కావచ్చు. ఏమైనా.. ‘నీదసలు మానవ జన్మేనా’ అని తిట్టినప్పుడు కూడా రాని కోపం, ‘నువ్వో ఎలుక’ అంటే వచ్చేస్తుంది పాశ్చాత్యులకు! మొన్న ఆదివారం బేలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ ల్యుకాషేంకో బర్త్ డే. 66 లో కి వచ్చారు. అయితే ఆయన తన పుట్టినరోజును జరుపుకునే విధంగా ఏమీ అక్కడి పరిస్థితులు లేవు. (కూతురి కష్టాన్ని నవ్వులపాలు చేసిన తల్లి) కొన్నాళ్లుగా ఆ దేశ పౌరులు కరోనాను కూడా లెక్క చేయకుండా వేలాదిగా వీధుల్లోకి వచ్చి అధ్యక్షుడికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరుపుతున్నారు. నిన్న ఆ నిరసన వ్యకిగత దూషణ వరకు వెళ్లింది. ‘హ్యాపీ బర్త్ డే.. యూ ర్యాట్’ అని నినాద స్వరంతో అలెగ్జాండర్కి శుభాకాంక్షలు తెలిపారు. బేలారస్ మన బెనారస్లా అనిపిస్తుంది. ఐరోపాలోనే ఒక దేశం అది. ఆగస్టు 9న అక్కడ అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. మళ్లీ అలెగ్జాండరే గెలిచారు. రిగ్గింగ్ చేసి గెలిచాడని ఆందోళనకారుల ఆరోపణ. ఆయన్ని ర్యాట్ అన్నవాళ్లలో 125 మందిని పోలీసులు వెంటబెట్టుకెళ్లారు. ఇరవై ఆరేళ్లుగా అలెగ్జాండరే ఆ దేశానికి అధ్యక్షుడు. -
రూపాయి ఖర్చు లేకుండా ఆడిలో షికారు!
మినెస్క్: ఆడి కారులో తిరగాలన్న కోరికను ఓ పశువుల కాపరి వినూత్న ఆలోచనతో తీర్చుకున్నారు. జీవితంలో ఏనాటికైనా ఆడి కారు కొనాలని, అందులో తిరగాలనుకున్నది యూరప్లోని బెలారస్కు చెందిన అలెక్సీ చిరకాల వాంఛ. అయితే, ఆడి కారు కొనే స్థోమత లేకపోవడం, ఒకవేళ అప్పోసప్పో చేసి దానిని కొనుగోలు చేసినా గొర్రెలు, ఆవులకు కాపరిగా దాన్ని తీసుకుని వెళ్ళలేడు. దాంతో ఆయనకు ఓ వినూత్న ఆలోచన వచ్చింది. పనిచేయని ఓ ఆడి కారును కొనుగోలు చేసి, దాని ఇంజిన్ భాగాన్ని తొలగించి గుర్రపు బండిగా మార్చేశాడు అలెక్సీ. గుర్రం కారును లాగుతుంటే ఆయన ఎంచక్కా అందులో గొర్రెలు, ఆవులు కాసేందుకు వెళ్తున్నాడు. పెట్రోల్ ఖర్చు భారం కూడా లేదు. పశువుల కాపరిగా పనులు చేసుకోవడంతోపాటు, ఆడి కారు కమ్ గుర్రపు బక్కీలో ఆయన షికార్లకు సైతం వెళుతూ మురిసిపోతున్నాడు. అలెక్సీ ఆడికారుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. -
లాక్డౌన్ : అన్ని దేశాలకు భిన్నంగా బెలారస్..
మానవాళిని భయాందోళనకు గురిచేస్తున్న కరోనా వైరస్ విస్తరిస్తుండటంతో ప్రపంచ దేశాలన్నీ అప్రమత్తమవుతున్నాయి. కరోనా కట్టడికి నడుంబిగించి.. పటిష్ట చర్యలు అమలుచేస్తున్నాయి. ప్రజలంతా ఇళ్లలోనే ఉండేలా లాక్డౌన్ను విధించి కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేస్తున్నాయి. బహిరంగ సమావేశాలు, పాఠశాలలు, సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్ అని మూసివేశారు. అయితే ఒక్క దేశం మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. అదే బెలారస్. ఈ దేశంలో కనీసం లాక్డౌన్ను కూడా పూర్తి అమలు చేయడం లేదు. అంతేగాక ఇక్కడ విచ్చలవిడిగా అన్నీ ఆటలు కొనసాగుతూనే ఉన్నాయి. వీటిని వీక్షించేందుకు అభిమానులు కూడా వెళుతున్నారు. ఇప్పటి వరకు బెలారస్లో 2919 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 29 మంది ప్రాణాలు కోల్పోయారు. (‘వారికి మాత్రమే కరోనా టెస్టులు ఉచితం’ ) కరోనావైరస్ మహమ్మారి కారణంగా బెలారస్లో ఆటలను బహిష్కరించాలనే వారి సంఖ్య పెరుగుతన్నప్పటికీ ఆదివారం బెలారసియన్ టాప్-ఫ్లైట్ లీగ్ మ్యాచ్కు దాదాపు వెయ్యి మంది అభిమానులు హాజరయ్యారు. ఒకరినొకరు ఉత్సాహపరచుకుంటూ.. నినాదాలు చేశారు. కాగా ప్రస్తుతం జాతీయ సాకర్ లీగ్ ఆడుతున్న దేశం యూరప్లో బెలారస్ మాత్రమే. అంతేగాకుండా ఫుట్బాల్ను బహిరంగంగా స్టేడియంలో నిర్వహించడానికి ఆ దేశ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో నుంచి అనుమతి కూడా తీసుకుంది. (హైదరాబాద్పై ప్రత్యేక దృష్టి పెట్టాలి: సీఎం కేసీఆర్) అయితే ఈ ఆటకు చాలా మంది దూరంగా ఉన్నప్పటికీ దాదాపు 1000 మందికిపైగా హాజరయ్యారు. వీరిలో అతి కొద్దిమంది మాత్రమే ముఖానికి మాస్కులు ధరించి కనిపించారు. కాగా కరోనాను అదుపు చేయడానికి కఠిన చర్యలను తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ బెలారస్ అధికారులను కోరింది. ఈ మాటలను పెడ చెవిన పెట్టిన బెలారస్ అధ్యక్షుడు దేశంలో లాక్డౌన్ అమలును వ్యతిరేకిస్తున్నాడు. దీనికి తోడు వైరస్పై ప్రజలు పెంచుకుంటున్న భయాలను ‘సైకోసిస్’గా కొట్టిపారేశారు. ఆర్థిక వ్యవస్థను కొనసాగించడం ముఖ్యమని చెప్పిన అలెగ్జాండర్.. మద్యంపై కూడా నిషేధం విధించలేదు. (అక్కడ నెమ్మదించిన మహమ్మారి.. ) -
నాలుగో స్వర్ణంపై రెజ్లర్ వినేశ్ గురి
న్యూఢిల్లీ : భారత మహిళా స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ ఈ సీజన్లో నాలుగో స్వర్ణానికి గెలుపు దూరంలో నిలిచింది. బెలారస్లో జరుగుతున్న మెద్వేద్ ఓపెన్ టోర్నమెంట్లో వినేశ్ 53 కేజీల విభాగంలో ఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో వినేశ్ 11–0తో యాఫ్రెమెన్కా (బెలారస్)పై గెలిచింది. నేడు జరిగే ఫైనల్లో రష్యా రెజ్లర్ మలిషెవాతో ఆడుతుంది. ఈ సీజన్లో వినేశ్ స్పెయిన్ గ్రాండ్ప్రి, యాసర్ డొగో టోర్నీ, పోలాం డ్ ఓపెన్ టోర్నీల్లో పసిడి పతకాలు సాధించింది. -
బుడ్డోడి బిత్తిరి చర్య...!
ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఐదేళ్ల పిల్లాడు చేసిన బిత్తిరి చర్య ప్రాణాల మీదకు తెచ్చింది. అయితే స్థానికులు అప్రమత్తం కావటంతో చిన్నచిన్న గాయాలతో బయటపడగలిగాడు. వివరాల్లోకి వెళ్తే... బెలారస్: రాజధాని మిన్స్క్ నగరంలోని ఓ అపార్ట్మెంట్లో సదరు బాలుడి కుటుంబం నివసిస్తోంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆడుకుంటూ బెడ్రూమ్ కిటికీ ఎక్కిన ఆ పిల్లాడు పట్టుతప్పి.. బయటకు వేలాడాడు. దూరంగా ఉన్న ఓ సెక్యూరిటీగార్డ్ అది గమనించి.. స్థానికులను అప్రమత్తం చేశాడు. పట్టుతప్పి కిందకు పడిపోవటం.. స్థానికులు కింద ఓ బ్లాంకెట్తో సిద్ధంగా ఉండటంతో ఆ బుడ్డోడు అందులో పడిపోయాడు. దుప్పటి చినిగి కింద పడ్డప్పటికీ.. స్వల్ఫ గాయాలతో బయటపడ్డాడు. అక్కడే ఉన్న ఓ వైద్యుడు అతనికి ప్రథమ చికిత్స చేసి.. అనంతరం ఆస్పత్రికి తరలించారు. అతని తల్లి స్థానికంగా ఓ ఆస్పత్రిలో నర్సు పని చేస్తోందని.. బాగా అల్లరి చేయటంతోనే పనిష్మెంట్ కింద అతన్ని ఇంట్లో ఒంటరిగా వదిలేసి బయటకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఎలాంటి చర్యలు తీసుకున్నారన్న దానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
ఏడో అంతస్థు నుంచి వేలాడుతూ.. పట్టుతప్పి...
-
మిస్ వీల్చైర్గా బెలారస్ సుందరి
వార్సా: అందం అనేది శరీరానికి సంబంధించినదనే అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది. చిన్న లోపమున్నా తాము అందంగా లేమని బాధపడేవారు ఎందరో. ఇక వికలాంగుల్లో చాలామంది తమ లోపాన్ని గురించి ఆలోచిస్తూ కుంగిపోతారు. కానీ.. అందం అనేది అవయవాలకు సంబంధించినది కాదని, మనసు సంబంధించినదనే విషయాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది అలెగ్జాండ్రా చిచికోవా. వీల్చైర్కు పరిమితమైన 23 ఏళ్ల చిచికోవా.. అందాలపోటీల్లో పాల్గొని విజేతగా నిలిచింది. మిస్ వీల్చైర్ కిరీటాన్ని దక్కించుకుంది. వార్సాలో జరిగిన ఈ పోటీల్లో విజేతగా తన పేరును ప్రకటించిన వెంటనే తీవ్ర ఉధ్వేగానికి లోనైన చిచికోవా.. కాసేపటి తేరుకొని మీడియాతో మాట్లాడింది. ‘మీలోని అపోహలు, భయాలతో పోరాడండి’ అంటూ ఒకే ఒక్కమాట చెప్పి అందరి మనసులు గెలుచుకుంది. దక్షిణాఫ్రికాకు చెందిన లెబొహాంగ్ మొన్యాట్సీ, పొలాండ్కు చెందిన ఆండ్రియన్నా జవాడ్జిన్స్కా.. రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. -
భారత్–బెలారస్ బంధం విస్తృతం
► బెలారస్ అధ్యక్షుడితో మోదీ చర్చలు ► 10 ఒప్పందాలపై సంతకాలు న్యూఢిల్లీ: ద్వైపాక్షిక సహకారాన్ని విస్తృతం చేసుకోవడంతో పాటు ‘మేకిన్ ఇండియా’ కింద ఉమ్మడిగా రక్షణ ఉత్పత్తుల తయారీని ప్రోత్సహించాలని భారత్, బెలారస్లు నిర్ణయించాయి. ఈ మేరకు చమురు, వ్యవసాయం, సైన్స్ అండ్ టెక్నాలజీ, విద్య, క్రీడల రంగాల్లో ఇరు దేశాల మధ్య 10 ఒప్పందాలు కుదిరాయి. భారత్ పర్యటనకు వచ్చిన బెలారస్ అధ్యక్షుడు ఏజీ ల్యూకాశెంకో మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. రెండు దేశాల ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయాలని, వాణిజ్యం, పెట్టుబడులకు ఇరు దేశాల్లో అవకా శాలు పుష్కలంగా ఉన్నాయని ఇద్దరు నేతలు పేర్కొన్నారు. భేటీ అనంతరం సంయుక్త మీడియా సమావేశంలో మోదీ మాట్లాడుతూ ల్యూకాశెంకోతో జరిపిన చర్చలు ముందుచూపుతో కూడుకున్నవని, రెండు దేశాల మధ్య సంబంధాలు ప్రారంభమై పాతికేళ్లు పూర్తయ్యాయని అన్నారు. ‘ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై అభిప్రాయాలు పంచుకున్నాం. రెండు దేశాల సంబంధాల నిర్మాణాన్ని సమీక్షించాం. వాటిని మరింత విస్తరించడానికి ఉన్న మార్గాలపై చర్చించాం. ‘మేకిన్ ఇండియా’ కింద రక్షణ రంగంలో ఉమ్మడిగా తయారీని చేపట్టడానికి బెలారస్ ఆసక్తి వ్యక్తం చేసింది’ అని మోదీ వెల్లడించారు. సహకారాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు రెండు దేశాలు ముందడుగు వేశాయని ల్యూకాశెంకో అన్నారు. -
మహిళల హాకీ వరల్డ్ లీగ్ ఫైనల్లో భారత్
వెస్ట్ వాంకోవర్ (కెనడా): హాకీ వరల్డ్ లీగ్ (హెచ్డబ్ల్యూఎల్) రౌండ్–2లో భారత మహిళల జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. సెమీఫైనల్లో భారత్ 4–0 గోల్స్తో బెలారస్పై ఘనవిజయం సాధించింది. భారత్ తరఫున గుర్జిత్ కౌర్ (13వ, ని. 58వ ని.), కెప్టెన్ రాణి రాంపాల్ (20వ ని. 40వ ని.) రెండేసి గోల్స్ చేశారు. మరో సెమీస్లో ఉరుగ్వేపై 2–1తో గెలిచిన చిలీతో భారత్ అమీతుమీ తేల్చుకుంటుంది. తాజా సెమీస్ విజయంతో భారత జట్టు హెచ్డబ్ల్యూఎల్ సెమీఫైనల్ ఈవెంట్కు అర్హత సంపాదించింది. ఎఫ్ఐహెచ్ మహిళల ప్రపంచకప్ (2018)కు క్వాలిఫయింగ్ టోర్నీ అయిన ఆ ఈవెంట్ ఈ ఏడాది జూన్ 21 నుంచి బెల్జియంలో జరుగనుంది. -
సెమీస్లో భారత అమ్మాయిలు
వెస్ట్ వాంకోవర్ (కెనడా): మహిళల హాకీ వరల్డ్ లీగ్ రౌండ్–2 టోర్నమెంట్లో భారత జట్టు సెమీఫైనల్కు అర్హత సాధించింది. బెలారస్తో జరిగిన గ్రూప్ ‘ఎ’ రెండో లీగ్ మ్యాచ్లో భారత్ 1–0 గోల్ తేడాతో గెలిచి వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. మ్యాచ్ 26వ నిమిషంలో వందన కటారియా బ్యాక్హ్యాండ్ షాట్తో కళ్లు చెదిరేరీతిలో భారత్కు ఏకైక గోల్ను అందించింది. మూడు జట్లున్న గ్రూప్ ‘ఎ’లో భారత్ ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ గెలిచి ఐదు పాయింట్లతో సెమీఫైనల్ బెర్త్ను దక్కించుకుంది. -
భారత్ క్లీన్స్వీప్
భోపాల్: బెలారస్తో జరిగిన ఐదు మ్యాచ్ల హాకీ సిరీస్ను భారత మహిళల హాకీ జట్టు క్లీన్స్వీప్ చేసింది. బుధవారం జరిగిన చివరిదైన ఐదో మ్యాచ్లో భారత్ 3–1 గోల్స్ తేడాతో విజయాన్ని అందుకుంది. ఆట ఆరో నిమిషంలో వందన కటారియా చేసిన గోల్ తో భారత్ ఖాతా తెరిచింది. 15వ నిమిషం లో గుర్జిత్ కౌర్ భారత్కు రెండో గోల్ను అందించింది. బెలారస్ ప్లేయర్ యూలియా 52వ నిమిషంలో పెనాల్టీ కార్నర్ను గోల్గా మలిచింది. అయితే 55వ నిమిషంలో భారత కెప్టెన్ రాణి రాంపాల్ గోల్తో భారత్ 3–1తో విజయాన్ని ఖాయం చేసుకుంది. -
భారత మహిళలదే హాకీ సిరీస్
భోపాల్: వరుసగా మూడో విజయం సాధించిన భారత మహిళల హాకీ జట్టు బెలారస్తో జరుగుతోన్న ఐదు మ్యాచ్ల సిరీస్లో 3–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే సిరీస్ను సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన మూడో మ్యాచ్లో టీమిండియా 3–1తో గెలిచింది. రైటా బటురా 24వ నిమిషంలో పెనాల్టీ కార్నర్ను గోల్గా మలిచి బెలారస్కు 1–0తో ఆధిక్యాన్ని అందించింది. అయితే భారత కెప్టెన్ రాణి రాంపాల్ 35వ, 39వ నిమిషాల్లో ఫీల్డ్ గోల్స్ చేసింది. దీంతో భారత్ 2–1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 42వ నిమిషంలో దీపిక మరో గోల్ చేసి భారత విజయాన్ని ఖాయం చేసింది. -
భారత్కు రెండో విజయం
భోపాల్: బెలారస్తో ఐదు మ్యాచ్ల హాకీ సిరీస్లో భారత మహిళల జట్టు రెండో విజయాన్ని నమోదు చేసింది. శుక్రవారం జరిగిన రెండో మ్యాచ్లో టీమిండియా 2–1తో గెలిచింది. భారత్ తరఫున రాణి రాంపాల్ (9వ నిమిషంలో), లాల్రెమ్సియామి (60వ నిమిషంలో) ఒక్కో గోల్ చేయగా... బెలారస్ జట్టుకు స్వియాత్లానా బహుషివిచ్ ఏకైక గోల్ అందించింది. -
బెలారస్పై భారత్ ఘనవిజయం
భోపాల్: ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో భారత మహిళా హాకీ జట్టు బెలారస్పై 5–1తో ఘనవిజ యం సాధించింది. మ్యాచ్లో నవజోత్ కౌర్ చేసిన రెండు గోల్స్తో భారత్ ఖాతా తెరిచింది. 11వ నిమిషంలో పెనాల్టీ కార్నర్ని గోల్గా మలిచిన నవజోత్ ఆ వెంటనే 15వ నిమిషంలో చక్కని ఫీల్డ్ గోల్తో భారత్ను 2–0 ఆధిక్యంలోకి తీసుకువెళ్లింది. ఈ సమయంలో బెలారస్ ఆటగాళ్ల డిఫెన్స్ను ఛేదిస్తూ పూన మ్ బర్ల (29వ నిమిషం) మరో చక్కనిగోల్తో భారత స్కోర్ను మూడుకి పెంచింది. బెలారస్ క్రీడాకారిణి స్వెత్లానా బహుషివిచ్ (37వ నిమిషం) గోల్ చేసి ఆధిక్యాన్ని 3–1కి తగ్గించినా... చివర్లో ఎక్కా (57వ ని.), గుర్జిత్కౌర్ (60వ ని.)లు పెనాల్టీకార్నర్లతో భారత్కు ఘనమైన ముగింపునిచ్చారు. -
బట్టలిప్పుకొని పనిచేయాలంటే ఇలా అర్థమైందా...!
మినిస్క్: తూర్పు యూరప్ దేశమైన బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో దేశంలోని ఉద్యోగులనుద్దేశించి ఇచ్చిన పిలుపు ఇప్పుడు అంతర్జాతీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. తానొకటి తలిస్తే దైవం ఒకటి తలచినట్లు ఆయన భావగర్భితంగా ఇచ్చిన పిలుపును కాస్త ఉద్యోగులు మరో రకంగా తీసుకున్నారు. ఆయన భావాన్ని అర్థం చేసుకుండా ఆయన చెప్పిన మాటలను అక్షరాల అమలుచేస్తూ ప్రపంచాన్నే దిగ్భ్రాంతికి గురిచేస్తున్నారు. దేశ ఆర్థికాభివృద్ధికి అంకితభావంతో కష్టపడి పనిచేయడం ఎంత అవసరమో స్ఫూర్తిదాయకంగా చెప్పేందుకు లుకషెంకో ప్రయత్నించి బోల్తాపడ్డారు. ‘గెట్ అన్డ్రెస్డ్ అండ్ వర్క్ టిల్ యు గెట్ స్వెట్ (బట్టలిప్పుకొని పనిచేయండి చెమటలు కక్కేదాక)’ అంటూ ఆయనిచ్చిన సందేశంలోని సారాంశాన్ని పట్టించుకోకుండా బెలారస్ ఉద్యోగులు ఆయన మాటలను అక్షరాల అమలు చేయడానికి ఆఫీసుల్లో బట్టలిప్పుకొని పనిచేస్తున్నారు. అలా పనిచేస్తున్న దృశ్యాలను ఫొటోలుతీసి మరి ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియాలో ఎడతెరపి లేకుండా పోస్ట్ చేస్తున్నారు. కామెంట్లు కూడా పెడుతున్నారు.. అయితే ఈ ఫొటోల్లో మగవాళ్లతోపాటు ఆడ ఉద్యోగులు కూడా బట్టలు లేకుండా ఫొటోలు దిగడం యూరప్లాంటి దేశంలో కూడా కొంత ఆశ్చర్యమే. కాకపోతే వారంతా తమ మానాన్ని రక్షించుకునేందుకు లాప్టాప్లు, కంప్యూటర్లు అడ్డుగా పెట్టుకోవడం ఉన్నంతలో కాస్త మెరుగైన అంశం. ఇది ఒక్క ఉద్యోగస్థులకే పరిమితం కాలేదు. సంగీత కళాకారులు కూడా బట్టలిప్పేసి వాయిద్యాలతో మానాన్ని దుచుకుంటూ ఫొటోలు పోస్ట్ చేస్తున్నారు. వారిని భవన నిర్మాణ కార్మికులు కూడా అనుసరిస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. ‘బట్టలిప్పుకొని పనిచేయాలని మన దేశాధ్యక్షుడే చెబుతున్నారు’ లాంటి వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. తమతో పాటు దేశాధ్యక్షుడు లుకషెంకో కూడా బట్టలిప్పుకొని పనిచేస్తున్నట్టు ఫొటోషాప్లో మార్పిడి చేసిన ఫొటోను కూడా పోస్ట్ చేశారు. దీనిపై స్పందించేందుకు లుకషెంకో ప్రస్తుతానికి అందుబాటులో లేరు. -
డైనోసా....ర్!
-
నేటి నుంచి ప్రణబ్ విదేశీ పర్యటన
న్యూఢిల్లీ: భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ విదేశీ పర్యటనలో భాగంగా ఆదివారం స్వీడన్, బెలారస్ దేశాలలో పర్యటనకు బయలుదేరనున్నారు. ఆయన తొలుత స్వీడన్ చేరుకుంటారు. జూన్ 2 వ తేదీ వరకు ఆయన స్వీడన్లో పర్యటిస్తారు. అందులోభాగంగా స్వీడన్ రాజు, రాణీతో ప్రణబ్ ముఖర్జీ భేటీ కానున్నారు. అలాగే స్వీడన్ ప్రధాని పార్లమెంట్ స్పీకర్, ప్రతిపక్ష నాయకుడిని కూడా ప్రణబ్ కలవనున్నారు. స్వీడన్లోని స్మార్ట్ సిటీలతోపాటు యూరోప్లో అత్యంత ప్రాచీన విశ్వవిద్యాలయాల్లో ఒక్కటైన ఉప్పశాలను ప్రణబ్ ముఖర్జీ సందర్శించనున్నారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలలో భాగంగా విద్యా, వ్యాపారం, అరోగ్యం తదితర అంశాలపై ఒప్పందాలు చేసుకోనున్నారు. అనంతరం ప్రణబ్ ముఖర్జీ బెలారస్ చేరుకుంటారు. ఆ దేశాధ్యక్షుడితో సమావేశం కానున్నారు. ప్రణబ్,ఆ దేశాధ్యక్షుడితో కలిసి సంయుక్త వ్యాపారవేత్తల సమావేశంలో పాల్గొని ప్రసంగించనున్నారు. జూన్ 4వ తేదీన ప్రణబ్ భారత్కు తిరిగి వస్తారు. ప్రణబ్ వెంట వెళ్లిన బృందంలో కేంద్ర ఎరువులు మరియు రసాయనాల శాఖ సహాయ మంత్రి హన్స్రాజ్ గంగారామ్ అహీర్, పార్లమెంట్ సభ్యులు గులాం నబి ఆజాద్, అశ్వీని కుమార్, దేశంలోని ప్రముఖ యూనివర్శిటీలకు చెందిన ఏడుగురు వైస్ చాన్సలర్లతోపాటు 60 మంది భారతీయ వ్యాపారవేత్తలు ఉన్నారు. -
నెలాఖరులో విదేశాలకు ప్రణబ్
హైదరాబాద్: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ విదేశాలకు నెలాఖరులో విదేశాలకు వెళ్లనున్నట్టు విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి నవతేజ్ సర్నా తెలిపారు. ఈనెల (మే) 31న ఇండియా నుంచి బయలుదేరి తొలుత స్వీడన్కు వెళ్తారు. జూన్ 2 వరకు ప్రణబ్ స్వీడన్లోనే ఉంటారు. తర్వాత అక్కడి నుంచి నేరుగా భారత్కు వచ్చి.. అదే రోజున అంటే జూన్ 2న బెలారస్ బయలుదేరుతారు. బెలారస్లో జూన్ 4 వరకు ఉంటారని నవతేజ్ సర్నా పేర్కొన్నారు.